breaking news
Tirupati
-
తప్పించుకోలేరు.. సతీష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
Tirupati : అంబటి రాంబాబుపై కేసు నమోదు
-
కూటమి అపచారం.. YSRCP పరిహార హోమం
-
వివాదాస్పద ఫ్లెక్సీలపై YSRCP ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: వివాదాస్పద ఫ్లెక్సీలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ అంటూ పలుచోట్ల టీడీపీ.. ఫ్లెక్సీలు పెట్టించింది. సుప్రీంకోర్టు హెచ్చరికలను కూడా కూటమి నేతలు బేఖాతరు చేశారు. చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. రాష్ట్రవాప్తంగా పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శిలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నిజం.. మహా పాపం నిజం.. అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలను వైఎస్సార్సీపీ శ్రేణులు తొలగించగా.. ఆ పార్టీ కార్యకర్తలపై ఎస్ఐ మురళి దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ శ్రేణులను అరెస్ట్ చేశారు.తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యిందంటూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలపై మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను వేశారు. వైఎస్సార్సీపీ హయాంలో (2019-24) మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజనిజర్ధాణలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయి. ఈ క్రమంలో.. దర్యాప్తు జరిపిన సీబీఐ నెయ్యి శాంపిల్స్లో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్లో ఇలాంటి చేష్టలకు దిగడం గమనార్హం. -
Arava Sreedhar: వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం
సాక్షి,తిరుపతి: రాష్ట్రంలో జనసేన నేతల కీచక పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మహిళల్ని వేధింపులు గురి చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్నర కాలంగా వేధిస్తున్నారని మీడియా ఎదుట కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ దారుణాల్ని బయటపెట్టింది. ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేత అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందినందుకు అరవ శ్రీధర్కు ప్రభుత్వ శాఖలో చిరుద్యోగిగా విధులు నిర్వహిస్తున్న బాధిత మహిళ ఫేస్బుక్లో శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్కు అరవ శ్రీధర్ రిప్లయి ఇచ్చారు. అంతే నాటి నుంచి శ్రీధర్ తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. మాట్లాడాలి. కలవాలి అంటూ పలు మార్లు ఆమెకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు. దీంతో బాధితురాలు భయాందోళనకు గురైంది. ఎమ్మెల్యే ఏంటి ఇలా అంటున్నారంటూ సమాధానం ధాటవేసింది. అసలే ఎమ్మెల్యే. తనకున్న అధికారంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎవరు? .ఎక్కడ ఉద్యోగం చేస్తుంది?. పెళ్లైయ్యిందా?. భర్త ఏం చేస్తుంటాడు. పిల్లలు ఎంతమంది ఉన్నారు. వారి వయస్సు ఎంత. ఆమె ఇంటి అడ్రస్ ఎక్కడ. ఇలా అన్నీ వివరాలు సేకరించాడు. బాధితురాలికి తల్లిదండ్రులు లేరని, భర్త ఐటీ ఉద్యోగిగా హైదరాబాద్లో పనిచేస్తుంటారని తెలుసుకున్నాడు. అంతే ఓ రోజు నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు. పలానా ప్రాంతానికి వెళ్లాలంటూ కారులో ఎక్కించుకున్నాడు. భర్త ఉద్యోగం పేరుతో హైదరాబాద్లో ఉంటున్నాడు. మూడేళ్ల కుమారుడు చేసేది లేక ఎమ్మెల్యే కారు ఎక్కింది. ఓ ప్రాంతానికి వెళ్లాలంటూ కారు ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలో ఓ గ్రామ సమీపంలో కారులోనే ఆమెపై బలవంతం చేయబోయాడు. చేస్తుంది తప్పని, వద్దని వారించింది. కారు దిగిపారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో బాధితురాల్ని అరవ శ్రీధర్ ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు. కారులోనే దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు మీడియా ఎదుట వాపోయింది. జనసేన ఎమ్మెల్యే శశ్రీధర్ ఆగడాలు అంతటితో ఆగలేదు. ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. పెళ్లి చేసుకుంటానని బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో బాధితురాలికి ఆమె భర్తకు విభేదాలు తలెత్తాయి. భర్తకు విడాకులు ఇవ్వాలని.. తాను ఎమ్మెల్యేనని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబడట్టాడు. లేదంటే బాధిత మహిళ మూడేళ్ల కుమారుణ్ని ప్రాణం తీస్తానని హెచ్చరించారు. ఇలా ఏడాదిన్నర కాలంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాలు తట్టుకోలేని మహిళ తాజాగా, వీడియోలు, వాట్సాప్ చాట్లతో సహా పలు ఆధారాల్ని బయట పెట్టడం కలకలం రేపుతోంది. -
ఒంటరితనం తట్టుకోలేక..
తిరుపతి క్రైమ్ : స్థానిక తిమ్మినాయుడుపాళెంలో నివసిస్తున్న ప్రియాంక (30) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.వివరాల ప్రకారం.. ప్రియాంక ఇరిగేషన్ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులు గతంలో మృతి చెందడంతో కొంతకాలంగా ఆమె ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. అయితే ఆ ప్రేమ వ్యవహారం విఫలమైన నేపథ్యంలోనే ఈ ఘోర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.శనివారం రాత్రి ఆమె తన నివాసంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దళిత యువతిపై లైంగికదాడి
తిరుపతి క్రైమ్: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి మాయ మాటలు చెప్పి దళిత యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ మండలంలో నివాసముంటున్న 19 ఏళ్ల దళిత యువతికి కడపకు చెందిన యశ్వంత్రాజ అనే వ్యక్తి కొద్దికాలం కిందట ఇన్స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 21న ఆ యువకుడు తిరుపతికి వస్తున్నానని యువతికి తెలిపాడు.ఇదే క్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రనగర్లోని ఓ హోటల్ రూమ్కి తీసుకువెళ్లి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన యువతి డీలాగా ఉండడంతో తల్లి గమనించి ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 24వ తేదీ రాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
హోటల్ రూమ్ 114.. యువతిని రప్పించి రేప్
-
అర్థరాత్రి దొంగల బీభత్సం.. CCTV ఫ్యూటేజ్ లో భయంకర దృశ్యాలు
-
పావలా నాణేలతో జాతీయ జెండా!
మనిషన్నాక కాసుంత కళాపోషణ ఉండాల అన్నట్టు ఈ హెడ్ కానిస్టేబుల్ వినూత్న ఆలోచనలతో నాణేలతో కళాకృతులను తీర్చిదిద్దుతున్నారు. అందరిచేత ఔరా అనిపించుకుంటున్నారు.తిరుపతి వెస్ట్ పోలీస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సురేష్రెడ్డి తన భార్య సుమతి సహకారంతో 2001 నుంచి 1.60 లక్షల 25 పైసల (పావలా) నాణేలను సేకరించి 12 అడుగుల పొడవు, 42 అడుగుల వెడల్పుతో భారీ జాతీయ జెండాను (National Flag) రూపొందించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు కోసం తాను ఉండే పోలీస్ క్వార్టర్స్ మిద్దెపైన ఈ జెండాను ప్రదర్శించారు. పోలీసు అధికారులతోపాటు ఔత్సాహికులు ఈ నాణేల పతాకాన్ని వీక్షించి అబ్బురపడుతున్నారు.సురేష్రెడ్డి గతంలో 25 పైసల నాణేలతో చార్మినార్, తంజావూరు బృహదీశ్వరాలయం, గేట్ వే ఆఫ్ ఇండియా, కేరళలోని ఆనంద నిలయం (Ananda Nilayam) వంటి పుణ్యక్షేత్రాలతోపాటు చారిత్రాత్మక ఘట్టాల ఆకృతులనూ రూపొందించారు. రిటైరయ్యేలోపు ఐదు లక్షల నాణేలతో భారీ జాతీయ పతాకాన్ని రూపొందించాలనే ఆలోచనతో ఉన్నట్టు సురేష్రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే సురేష్రెడ్డి తాతముత్తాతల నుంచి అందరూ పోలీసు శాఖలోనే పనిచేయడం మరో విశేషం. చదవండి: తెల్లవారుజాము నుంచే క్యూ కడతారు.. ఒకటి మాత్రమే అమ్ముతారు! -
కాలుదువ్వుతూ..రంకెలేస్తూ రంగంపేట జల్లికట్టు (ఫొటోలు)
-
CPM Leaders: అయ్యా బాబు .. ఎడ్జోలము కాదు .. ఎదురుతిరుగుతాము
-
విమాన ప్రయాణం హామీని నెరవేర్చిన హ్యాట్రిక్ సర్పంచ్
జోగులాంబ గద్వాల జిల్లా: ముచ్చట గా మూడోసారి సర్పంచ్గా గెలిచిన వ్యక్తి గ్రామంలోని 200 మందిని విమానంలో తిరుపతి తీసుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నా యి.. వికారాబాద్ జిల్లా రాకంచర్ల గ్రామ సర్పంచ్ కమ్లీబాయి, పెంటయ్య దంపతులు తాము ఎన్నికల్లో గెలిస్తే విమానంలో తిరుపతి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సోమవారం సర్పంచ్ భర్త పెంటయ్య పుట్టినరోజు కావడంతో నాలుగు బస్సుల్లో హైదరాబాద్ బయలుదేరారు. అక్కడి నుంచి విమానంలో తిరుపతి చేరుకోనున్నార -
చెవిరెడ్డి హర్షిత్రెడ్డికి పోలీసుల నోటీసులు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎస్వీయూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న ఆర్డీవో ఆఫీస్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి.విద్యార్థి సంఘాలపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు ఎత్తేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ధర్నాకు మద్దతు తెలిపిన హర్షిత్ రెడ్డితో పాటు 14 మంది విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. -
మద్యం మత్తుకు ఇద్దరు యువకులు బలి
-
చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఇంటి వద్ద ఓ వృద్ధుడి ఆత్మహత్య యత్నం తీవ్ర కలకలం రేపింది. న్యాయం చేస్తామని చెప్పి ఏడాది గడిచినా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని.. పైగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వాపోతూ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆ పెద్దాయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నాగి రాజయ్య గారిపల్లికి చెందిన గోవిందరెడ్డి(65) తనకున్న భూసమస్యపై సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం ఉదయం నారావారిపల్లికి వచ్చాడు. అయితే.. సీఎం పండుగ వేడుకల్లో బిజీగా ఉన్నారని చెబుతూ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రుయాకు తరలించారు. ఏడాది గడిచినా.. గోవిందరెడ్డికి తన అన్నదమ్ములతో భూ పంచాయితీ నడుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే లక్షలు ఖర్చు చేశాడు. అయితే.. గత ఏడాది జనవరిలో మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబును నారావారిపల్లెలోనే కలిసి న్యాయం చేయమని బతిమాలాడాడు. ఆ సమయంలో.. తాము చూసుకుంటామంటూ తండ్రీకొడుకులు మాట ఇచ్చారు. అయితే ఏడాది అవుతున్నా ఇంతవరకు న్యాయం జరగలేదు. గోవిందరెడ్డితో వచ్చిన రెడ్డప్ప అనే వ్యక్తి మాట్లాడుతూ.. నేను బైక్ పార్కింగ్ చేస్తుండగా ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోవిందరెడ్డి వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. కలెక్టర్, ఎమ్మార్వోలను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు పంచాయితీల పేరుతో లక్షలు నష్టపోయాడు. డబ్బులు ఖర్చు చేసినా న్యాయం జరగలేదు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. న్యాయం కోసం గత ఏడాది నారావారిపల్లెలో మంత్రి లోకేష్ను కలిశాం. న్యాయం కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గోవిందరెడ్డికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
పండుగ వేళ విషాదం
మహబూబ్ నగర్ జిల్లా: సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకొందామని గ్రామానికి వెళ్తుండగా.. ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. కళ్లముందే భార్య దుర్మరణం చెందగా.. మూడేళ్ల కూతురు చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రితోపాటు మరో కూతురు గాయాలతో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం భూత్పూర్ వద్ద బ్రిడ్జిపై కారు ప్రమాదంలో సంక్రాంతి పండగకని కూతురు వద్దకు తిరుపతి వెళ్తుండగా భార్యాభర్తలు మృతిచెందిన ఘటన మరువక ముందే మరో ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన వాహనదారులను కలిచివేసింది. వివరాలిలా.. ఏపీలోని నంద్యాల జిల్లా పగిడియాల మండలం మచ్చుమర్రికి చెందిన సూర్య తిరుపతయ్య, భార్య భాగమణి (25) చిన్న కూతరు యస్న(3), మరో కూతరు ప్రియాంచితో కలిసి హైదారాబాద్లోని అల్వాల్లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండగకని స్వగ్రామానికి బైక్పై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని గాజులపేట స్టేజీ జాతీయ రహదారిపై మోటర్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న రేలింగ్ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భార్య నాగమణి (25) అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. చిన్నకూతురు యస్న (3) జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. తిరుపతయ్యతోపాటు మరో కూతురు ప్రియాంచి గాయాలతో చికిత్స పొందుతున్నారు. నాగమణి తల్లి ఉస్సేనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. రెండ్రోజుల్లో రెండో ప్రమాదం భూత్పూర్ వద్ద జాతీయ రహదారిపై బ్రిడి వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఏపీ వాసులు భార్యాభర్తలు మృతిచెందారు. పండగవేళ తిరుపతిలోని కూతురు వద్దకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. -
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా
సాక్షి, తిరుపతి: టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. బాలాజీనగర్ ఫ్లాట్ నంబర్ 2 రద్దు విషయంలో కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆయన రాజీనామా చేశారు.ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనాలు.. మనస్తాపానికి గురిచేశాయన్న కృష్ణమూర్తి.. కనీసం తనను సంప్రదించకుండా కథనాలు రాయడం బాధాకరమన్నారు. స్వామి వారికి సేవ చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నందుకు ఆ భగవంతుని క్షమించమని కోరుకుంటున్నానంటూ జంగా కృష్ణమూర్తి లేఖలో పేర్కొన్నారు. -
మొత్తం ఆ సీసీ ఫుటేజ్ బయటపెట్టాలి: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పాలనలో నిత్యం అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో మద్యం బాటిళ్ల వెనుక వైఎస్సార్సీపీ పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు‘‘తప్పుడు కేసు బనాయించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యమే కొండపై తిష్ట వేసింది. ఖాళీ మద్యం బాటిళ్లను కవర్ చేసినవారిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ సీసీ ఫుటేజ్ బయటపెట్టమని సవాల్ చేస్తున్నా. 25 గోనె సంచులు నిండా ఖాళీ మద్యం బాటిల్స్ బయట పడింది నిజం కాదా?. చంద్రబాబు, బీఆర్ నాయుడు ఒత్తిళ్లతో కోటిని బలవంతంగా కొట్టారు. తిరుమల టు టౌన్ సీఐ శ్రీరాములు..వైఎస్సార్సీపీ కార్యకర్త మణిని కొట్టారు.బీఎన్.ఎస్ సెక్షన్ 152 పెట్టడం అత్యంత దారుణం. న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి మేము బతికి బట్టకడుతున్నాం. లేదంటే మాకు జైళ్లే అవాసకేంద్రాలుగా మారేవి. మా సవాల్ ను స్వీకరించాలి.. మొత్తం ఆ సీసీ పుటేజ్ బయట పెట్టాలి. అలిపిరి వద్ద నిఘా వ్యవస్థ, భద్రత వ్యవస్థ ఏం చేస్తోంది?. బీఆర్ నాయుడి ప్రైవేట్ సైన్యం తాగి పడేసి బాటిల్స్ అవి. నీకు లక్షలు, వేల కోట్లు ఎలా వచ్చాయి? కోటి అనే వ్యక్తి మద్యం బాటిల్స్ పెట్టినట్లు సాక్ష్యం చూపించమని సవాల్ విసురుతున్నా.. మేము హైందవ ధర్మ పరిరక్షణ కు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము మీరు చర్చకు సిద్ధం’’ అని భూమన తేల్చి చెప్పారు.‘‘మీరు అరెస్ట్ చేసినా నా గొంతు ఆగదు.. తిరుమలపై ఏది జరిగినా ప్రశ్నిస్తాము. మీరు చేస్తున్నా ఘోరాలు, నేరాలు ప్రజలకు తెలియజేస్తాం. పోలీసులు బలి పశువులయ్యారు. సీఐ శ్రీరాములు చేసినది తప్పు.. తీవ్రవాది పట్ల ప్రవర్తించేలా ఉంది. సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ ఇంటికి 40 మంది పోలీసులను పంపించి భయభ్రాంతులు చేశారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కోడిని కోశారని కేసు.. పోలీసులకు కోర్టు చీవాట్లు
-
తిరుమలలో చిరుత కలకలం
సాక్షి,తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం రేపింది. శ్రీవారి 450వ మెట్టు మార్గంలో శుక్రవారం ఉదయం చిరుత ప్రత్యక్షమవడంతో భక్తుల్లో కలకలం రేగింది. భక్తులకు చిరుత కనిపించడంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.భక్తులు మెట్లు ఎక్కుతున్న సమయంలో అకస్మాత్తుగా చిరుత ప్రత్యక్షమైంది. వెంటనే భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు తక్షణమే స్పందించి, భక్తులను ఆ మార్గంలో అనుమతించడం నిలిపివేశారు. అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని శబ్దాలు చేసి చిరుతను దారి మళ్లించారు. అనంతరం ఆ ప్రాంతంలో గస్తీ పెంచి, చిరుతను అడవిలోకి తరలించే ప్రయత్నం చేశారు. టీటీడీ అధికారులు భక్తుల భద్రత దృష్ట్యా మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసి, క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే భక్తులను గుంపులుగా అనుమతిస్తామని ప్రకటించారు.చిరుత ప్రత్యక్షమవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే, అధికారులు వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భక్తులు అధికారులు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. తిరుపతి శ్రీవారి మెట్లు మార్గంలో చిరుత సంచారం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న మార్గాల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. అధికారులు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. -
సాక్షి ఫోటోగ్రాఫర్ పై తప్పుడు కేసు.. బుద్ధి చెప్పిన కోర్ట్
-
డెలివరీ బాయ్తో లక్ష్మి వివాహేతర బంధం.. చివరికి!
తిరుపతి క్రైమ్: నగరంలోని కొర్లగుంటలో వివాహేతర సంబంధం వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకుం.. జీవకోనలో∙కారి్మకుడు పులి నరసింహరావు, అతడి భార్య సాంబలక్ష్మి (40) జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు హెచ్పీ గ్యాస్ డెలివరీ బాయ్ కె.సోమశేఖర్(37) అలియాస్ సోముతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర బంధం ఏర్పడింది. ఈ క్రమంలో సాంబలక్ష్మి సోమశేఖర్ డబ్బుల కోసం వేధించడం, దాడులు చేయడం జరిగిందని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సంఘం డబ్బులు చెల్లించేందుకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన సాంబలక్ష్మి రాత్రి వరకు తిరిగి రాక పోవడంతో కుటుంబంలో ఆందోళన నెలకొంది. అర్ధరాత్రి సమయంలో పోలీసుల సమాచారం మేరకు కొర్లగుంటకు చేరుకున్న కుటుంబసభ్యులు, ఓ ఇంట్లో సాంబలక్ష్మి కత్తితో గొంతుకోసి హత్యకు గురై ఉండగా, సోమశేఖర్ చీరతో ఇనుప పైపునకు ఉరివేసుకుని మృతి చెందినట్టు గుర్తించారు. ఈ మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి, కాల్ డేటా, గత ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
Tirupati: సాక్షి దినపత్రిక ఫొటోగ్రాఫర్ మోహనకృష్ణపై కేసు
-
తిరుపతిలో హైటెన్షన్ పోలీసుల లాఠీ ఛార్జ్
-
గోవిందరాజస్వామి ఆలయ ఘటన కేసులో కీలక పరిణామం
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు కుత్తడి తిరుపతిని గత రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఆలయ గోపురం ఎక్కి.. తాను కోరినంత మద్యం ఇవ్వకుంటే కలశాలను ధ్వంసం చేస్తానంటూ హల్చల్ చేశాడు కుత్తడి తిరుపతి. జనవరి 2 రాత్రి ఏకాంత సేవ ముగిశాక ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో భక్తులతోపాటే లోనికి చొరబడిన తిరుపతి.. ఆలయం మూసేశాక కర్ర ఏర్పాట్ల మీదుగా ఆలయ గొపురం ఎక్కాడు. విజిలెన్స్ సిబ్బంది నిద్రమత్తులో ఈ విషయం గమనించలేదని తెలుస్తోంది. అయితే.. ఆ తర్వాత గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది తిరుపతిని దిగమని ఎంత బతిమాలినా వినలేదు. చివరకు.. 3 గంటలపాటు శ్రమించి నిచ్చెన సాయంతో బలవంతంగా అతన్ని కిందకు తీసుకొచ్చారు. అయితే కిందకు దిగిన తిరుపతి తొలుత తనను చంపేస్తారని బెదిరించారని.. అందుకే పైకి ఎక్కానంటూ పొంతన లేని మాటలు మాట్లాడాడు. అయితే.. మద్యం మత్తులోనే అతను ఈ అపచారానికి పాల్పడ్డాడని.. ఆధార్ కార్డ్ను బట్టి నిజామాబాద్కు చెందిన వ్యక్తిగా తిరుపతి ఈస్ట్ పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని పీఎస్కు తరలించిన పోలీసులు.. నిన్న రాత్రి సమయంలో జడ్జి ముందు ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ నెల 12వ తేదీ దాకా రిమాండ్ విధించడంతో తిరుపతి సబ్ జైలు కు తరలించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ ప్రతిష్ట పూర్తిగా మంటగలుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ సేవల్లో తరలిస్తూ సామాన్యులను పట్టించుకోవడం లేదని.. పైగా వరుస అపచారాలు జరుగుతున్నా దిద్దుబాటు చర్యలు ఉండడం లేదని.. ఒక తాగుబోతు ఆలయ గోపురం మీదకు ఎక్కి కలశాలు ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందంటే విజిలెన్స్ నిఘా ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని.. మరి ముఖ్యంగా సనాతనం గురించి మాట్లాడే పవన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకపోవడం దారుణమంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. -
తిరుమలలో మద్యం బాటిళ్లు.. నిద్రలో టీటీడీ నిఘా వ్యవస్థ
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యంతో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలలో మద్యం బాటిళ్లు దర్శమివ్వడం భద్రతా లోపాలను బహిర్గతం చేస్తోంది. పోలీసు అతిథి గృహం ముందు పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు కనిపించాయి. టీటీడీ నిఘా వ్యవస్థ నిద్రపోతుందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం తిరుమలలో మద్యం పట్టుబడుతోంది.. అయినా భద్రత వ్యవస్థ మేల్కోవడం లేదు. అలిపిరి తనిఖీ కేంద్ర దాటుకొని నిత్యం మద్యం తిరుమలకు చేరుతోంది.కాగా, గత ఏడాది డిసెంబర్లో భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం బాటిళ్లు, మాంసపు ప్యాకెట్లు కనిపించడం భక్తులను తీవ్రంగా కలచివేసింది. మద్యం, మాంసం నిషేధం ఉన్న ప్రదేశంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతకు విరుద్ధంగా పదే పదే అపచారాలు జరుగుతున్నాయి. టీటీడీ విజిలెన్స్ నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమల పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
కోటా వినుత కేసు.. సుధీర్ రెడ్డిపై చంద్రబాబు సంచలన ఆరోపణలు
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి నియోజకవర్గం వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా కోటా వినుత భర్త కోట చంద్రబాబు.. టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోటా చంద్రబాబు తాజాగా వీడియోను విడుదల చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. చెన్నై పోలీసులకంటే ముందే సుధీర్ రెడ్డి.. మా రిమాండ్ రిపోర్టును ఎలా బయటపెట్టారు?. మా అరెస్టుకు ముందు శ్రీకాళహస్తి సీఐ గోపి ఎందుకు తమిళనాడు పోలీసులను కలిశారు?. మమ్మల్ని అనవసరంగా డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఇరికించారు. శ్రీకాళహస్తి నుంచి వన్ టౌన్ సీఐ గోపి చెన్నై సెవెన్ వెల్స్ పీఎస్లో మంతనాలు చేశారు. చెన్నై పోలీస్ కమిషనర్తో మాట్లాడించారు. మాపై ఎఫ్ఐఆర్ నమోదు కాక ముందే శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టారు. మా ఇష్యూపై మీడియాతో మాట్లాడారు. మీరు అర్దం చేసుకోండి మా పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చక ముందే చెన్నై పోలీసు కమిషనర్ రాత్రి పది గంటలకు ప్రెస్మీట్ పెడితే.. హత్య, ఆత్మహత్య అని తేల్చక ముందే మాపై నిందారోపణలు చేశారు. శ్రీకాళహస్తిలో హత్య జరిగి ఉంటే చెన్నై వరకు మృతదేహం తీసుకెళ్లడం సాధ్యమా?. ఈ హత్య కేసులో నిర్దోషులుగా బయటపడిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్ని వ్యాపారాలు చెన్నై కేంద్రంగా చేస్తూ మాపై కక్షసాధింపు చర్యలు చేశారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. కీలకంగా ఎదుగుతున్న తరుణంలో జనసేన పార్టీ నుంచి బహిష్కరించేలా చేశారు.ఒక మహిళపై కుట్రలా?తన రాజకీయ ప్రత్యర్ది ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇదంతా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డే చేశారు. బలమైన రాజకీయ నాయకురాలిగా ఎదుగుతున్న వినుత కోటను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారు. రాజకీయ జీవితాన్ని సమాధి చేయడంలో భాగంగా ఈ హత్య కేసులో ఇరికించారు. 19 రోజుల్లో కోర్టులో ఈ కేసును నిరూపించలేకపోయారు. మేము ధైర్యంగా ఈ కేసులో నిర్దోషులం అని బయటపడతాం. హత్యకేసులో మాపై ఆరోపణలు నిరూపితం కాలేదు. డ్రైవర్ రాయుడు సెల్పీ వీడియోలో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు, కోర్టుకు అన్ని విషయాలు అందించాం. ఒక మహిళపై కుట్రలు చేసి ఇరికించారు. డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియోలో కొన్ని విషయాలే బయటకు వచ్చాయి. పోలీసుల విచారణలో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి.సుధీర్ రెడ్డి పాత్రే కీలకం..ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ జరిపించాలి. మేము రిమాండ్కు వెళ్లక ముందే మాపై మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్యే బొజ్జల మాట్లాడటం గుమ్మడికాయలు దొంగ అన్నట్లుగా ఉంది. అన్ని విషయాలు మేము బయటపెడతాం. ఈ కేసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉందని ప్రజలు అందరికీ తెలుసు. మమ్మల్ని చంపాలని నువ్వు కుట్రలు చేశావు. శ్రీకాళహస్తి సీఐ గోపీని చెన్నై పంపించి మాపై కుట్ర చేయించావు. మహిళలు రాజకీయాలు ముందుకు రాకుండా ఇబ్బందులు పెట్టినా ఈరోజు నిలబడి ఉన్నాం. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది, సత్యమేవ జయతే’ అంటూ కామెంట్స్ చేశారు. -
టీటీడీ విజిలెన్స్.. మరీ ఇంత అధ్వాన్నమా? (ఫొటోలు)
-
90 ML ఇస్తేనే దిగుతా! గోవిందరాజ స్వామి గోపురం ఎక్కి తాగుబోతు హల్ చల్
-
అనుచరుడితో స్కెచ్! బయటపడ్డ బొజ్జల బాగోతం
-
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. సర్వదర్శనాలు బంద్
సాక్షి, తిరుపతి: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో మూడు రోజుల పాటు సామాన్య భక్తులు వెళ్లే సర్వదర్శనం నిలిపివేస్తున్నట్టు తాజాగా టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. గోవింద మాల ధరించిన భక్తులకు సైతం సర్వదర్శనం అనుమతి లేదని చెప్పుకొచ్చింది. దీంతో, టీటీడీ ఒంటెద్దు పోకడలపై భక్తులు మండిపడుతున్నారు. ఎన్నడూలేని విధంగా ఇలాంటి నిర్ణయాలు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.వివరాల ప్రకారం.. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, ద్వాదశి డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో సామాన్య భక్తులు వెళ్ళే సర్వ దర్శనం నిలిపి వేస్తున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్లైన్లో లక్కీడిప్ ద్వారా టికెట్లు ఎంపికైన వారిని మాత్రమే సర్వదర్శనానికి దర్శనం అనుమతి ఉన్నట్టు తెలిపింది. లక్కీ డిప్ టికెట్ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని ప్రచారం చేస్తోంది. టికెట్ ఉన్న భక్తులు మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ విస్తృత ప్రచారం మొదలుపెట్టింది. జనవరి 2 నుంచి 8 వరకు ఆఫ్ లైన్లో సర్వదర్శనం కోసం అనుమతిస్తామని ప్రకటనలో వెల్లడించింది.శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను, నడిచి వచ్చే భక్తులను ఉద్దేశించి సోషల్ మీడియా, దిన పత్రికల్లో టీటీడీ ప్రకటనలు సైతం ఇచ్చింది. అలాగే, గోవింద మాల ధరించిన భక్తులకు కూడా సర్వదర్శనం అనుమతిలేదని తెలిపింది. ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భక్తులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు. కాగా, గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆఫ్ లైన్లో టికెట్లు కేటాయింపు ద్వారా తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే, వైకుంఠ ఏకాదశి రోజున తమకు స్వామి వారి దర్శనాన్ని దూరం చేస్తున్నారని ఆన్లైన్పై అవగాహన లేని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ఇలా ఆంక్షలు, టికెట్లు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీటీడీ చర్యలపై భక్తులు మండిపడుతున్నారు. -
తిరుమలలో సైకో హల్చల్
సాక్షి, తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఓ సైకో కలకలం సృష్టించాడు. చిన్న పిల్లలను వెంటాడుతూ చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. పిల్లలపై దాడి చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకున్న భక్తులు.. పోలీసులకు అప్పగించారు. సైకోను పశ్చిమబెంగాల్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.కాగా, గత మార్చి నెలలో ఓ యువకుడు మద్యం తాగి మాడ వీధుల్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఓ మహిళతో గొడవకు దిగాడు. పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి.. ‘‘నేను లోకల్’’ అంటూ.. తిరుమల మాడ వీధుల్లో తిరుగుతూ ఓ మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో తాను మద్యం తాగుతాను.. కావాలంటే అక్కడ మద్యం కూడా అమ్ముతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక, విజిలెన్స్ అధికారుల ముందే ఇదంతా జరగడం గమనార్హం. అనంతరం, అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల తాకిడి పెరగడంతో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లను టీటీడీ రద్దు చేసింది. ఆన్లైన్ శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా దర్శనం కొనసాగుతోంది. రద్దీ కారణంగా నిన్న అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద తోపులాట జరిగిన విషయం తెలిసిందే.ఇక, తిరుమల శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు అన్నీ నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 8 గంటలు సమయం పడుతోంది. నిన్న(గురువారం) శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే 37,154 మంది భక్తులు తల నీలాలు అర్పించారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 4.12 కోట్లుగా ఉంది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భక్తులపై లాఠీ ఛార్జ్.. కవరేజ్ చేస్తున్న సాక్షి ఫోటోగ్రాఫర్ పై దాడి
-
అలిపిరి క్యూలైన్లో తోపులాట.. టీటీడీపై భక్తుల ఆగ్రహం
సాక్షి, తిరుపతి: టీటీడీ నిర్లక్ష్యంతో.. ఈ ఏడాది ప్రారంభంలో తిరుమలలో జరిగిన తొక్కిసలాట భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అలిపిరి వద్ద గురువారం దాదాపు తొక్కిసలాట మాదిరి పరిస్థితులే కనిపించాయి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్ల జారీ నేపథ్యంలో భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో.. క్యూలైన్లో తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. భక్తుల్ని అదుపు చేసే పేరుతో లాఠీఛార్జ్కి దిగారు. అయితే.. పోలీసుల దురుసు ప్రవర్తనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపటికి భక్తులే నియంత్రించుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూసుకున్నారు. టీటీడీ నిర్లక్ష్య ధోరణితోనే తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని భక్తులు ఈ సందర్భంగా వాపోయారు.టీటీడీపై భక్తుల ఆగ్రహం.. తోపులాట ఘటనతో భక్తులు టీటీడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టీటీడీ మేనేజ్మెంట్ సరిగా లేదు. వీఐపీల సేవల్లో అధికారులు మునిగిపోతున్నారు. సామాన్య భక్తుల్ని పట్టించుకోవడం లేదు. స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం మాకు ఉండకూడదా?.. భక్తులు రద్దీ దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకు ఇచ్చే సర్వదర్శనం టికెట్లు పెంచాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు.సాక్షి సిబ్బందిపై దౌర్జన్యం.. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద పరిస్థితులను కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి సిబ్బందితో పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. సాక్షి ఫోటో గ్రాఫర్ కృష్ణను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అడ్డుకోగా.. అక్కడికి వచ్చిన అలిపిరి ఎవీఎస్వో రమేష్ ఫొటోగ్రాఫర్ కృష్ణ ఫోన్ లాక్కుని దురుసుగా ప్రవర్తించారు. అంత విషాదం జరిగినా.. నిర్లక్ష్యమా?ఈ ఏడాది ప్రారంభంలో.. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట తిరుమల చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర విషాదానికి దారి తీసింది. బైరాగిపట్టెడ వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్యూలైన్లో ఉన్నవాళ్లను ఒక్కసారిగా ఏదో పశువుల మాదిరి విడిచిపెట్టారని.. అందుకే తోపులాట జరిగిందని ఆ సమయంలో భక్తులు టీటీడీ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. -
తిరుమలకు పొటెత్తిన భక్తులు.. అలిపిరి వద్ద ట్రాఫిక్ జామ్
సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తులు పొటెత్తారు. వీకెండ్, వరుస సెలవులు ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో, అలిపిరి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తుల రాకతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో, శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు నిలిచిపోయారు. మరోవైపు.. అలిపిరి టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో, శ్రీవారి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. బుధవారం అర్ధరాత్రి వరకు 73,524 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,989 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 10 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
కూటమి పాలనలో పెన్షన్ల కోసం దివ్యాంగుల కష్టాలు (ఫొటోలు)
-
‘పురుగుల అన్నం తినలేం’.. రోడ్డెక్కి విద్యార్థుల నిరసన
సాక్షి,తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో విద్యార్థినులు నిరసన బాట పట్టారు. హాస్టల్లో అందిస్తున్న ఆహారం నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. చపాతీలతో హాస్టల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.తాము తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని, ఈ సమస్యను పలుమార్లు హాస్టల్ చీఫ్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాస్టల్ సమస్యలను పరిష్కరించేందుకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. నిరసన సమయంలో మీడియాపై దురుసుగా ప్రవర్తించిన ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్పై కూడా విద్యార్థి సంఘాలు,విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్వీ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ఆహార నాణ్యత సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థి సంఘాలు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. విద్యార్థినుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత విశ్వవిద్యాలయ పరిపాలనదని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
శ్రీవారి సన్నిధిలో ఘోర అపచారం
-
శ్రీవారి దర్శనానికి ‘మార్చి’ కోటా షెడ్యూల్ విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం డిసెంబర్ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందినవారు డిసెంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, శ్రీవారి వసంతోత్సవాల టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది.ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల (ఎస్ఈడీ) కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 14 వరకు దేశ వ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. -
ఎస్వీ పాలిటెక్నిక్లో అన్యమత ప్రచారం
తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత ప్రచారం కలకలంరేగింది. ఇంగ్లిష్ అధ్యాపకురాలు మాధవి బోర్డుపై రాస్తున్న అన్యమత వ్యాఖ్యలను కొందరు విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఘటనపై ప్రిన్సిపల్ స్పందిస్తూ.. అధ్యాపకురాలిని విచారించి, నివేదికను ఉన్నతాధికారులకు పంపించామన్నారు. దీంతో మాధవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
తిరుపతి NRI కాలేజీలో విద్యార్థి జస్విన్ ఆత్మహత్యాయత్నం
-
తిరుపతి జిల్లా వాకాడులో YSRCP కార్యకర్త SK నజీర్ బాషా కిడ్నాప్
-
‘చచ్చిపో.. కాలేజీకి ఒకరోజైనా సెలవు ఇస్తారు’
సాక్షి,తిరుపతి: ‘నువ్వ చచ్చిపో.. చచ్చిపోతే కాలేజీకి ఒక్కరోజైనా సెలవు ఇస్తారంటూ’ అవమానించడంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.కుప్పంకు చెందిన విద్యార్థి జస్విన్ తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 10వ తేదీన ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు.అయితే,జస్విన్ ఆత్మహత్యాయత్నానికి కాలేజీ అధ్యాపకులే కారణమని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘నీకు చదువు ఎందుకు? నువ్వు చనిపోతే కాలేజీకి ఒక రోజు సెలవు వస్తుంది’ అంటూ ఓ అద్యాపకురాలు తోటి విద్యార్థుల ముందు అమానుషంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ అవమానాలు, మానసిక ఒత్తిడి తట్టుకోలేక జస్విన్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఆవేదనజస్విన్ తల్లి రాధ కన్నీటి పర్యంతమై మాట్లాడుతూ.. ‘నా కొడుకు పట్ల కాలేజీ లెక్చరర్లు దారుణంగా మాట్లాడారు. సరైన సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేసింది’ అని ఆరోపించారు. తన కుమారుడి పరిస్థితికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.యాజమాన్యం వైఖరిపై విమర్శలుఈ ఘటనపై ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పటికీ, కాలేజీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు, సంఘాలు మండిపడుతున్నాయి. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, దళిత సంఘాలు ఎన్ఆర్ఐ కళాశాల ముందు బైటాయించి నిరసనలు చేపట్టాయి. విద్యార్థులపై వేదింపులు ఆపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
‘కూటమి నేతలు తప్పు చేసి.. వైఎస్సార్సీపీపై బురదజల్లుతారా?’
సాక్షి, తిరుపతి: కూటమి వచ్చాక తిరుమలలో అనేక ఘోరాలు జరిగాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక ప్రణాళిక ప్రకారం వైఎస్ జగన్పై కూటమి దాడి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు వైఖరితోనే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని.. కూటమి నేతలు తప్పు చేసి వైఎస్సార్సీపీపై బురదజల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ను దెబ్బతీయడానికి తిరుమలను చంద్రబాబు వాడుకుంటున్నారు. ఎన్నికల ముందు, తరువాత తిరుమల చూట్టు రాజకీయాలు చేస్తున్నారు. లడ్డూ, పరకామణి, పట్టు వస్త్రాలు అవినీతి అంటూ జగన్ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయంగా దెబ్బ తీయడానికి స్వామివారి కూటమి నేతలు వాడుకుంటున్నారు...పదిరోజుల వైకుంఠ ఏకాదశి వద్దని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ అదే కొనసాగిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు దీనికి కారణం వైఎస్సార్సీపీనే.. పదిరోజుల దర్శనం తప్పు అంటూ ప్రచారం చేశారు. లడ్డూ కేసులో ఇప్పటి వరకు రాజకీయపరమైన అరెస్టు ఒక్కటి జరగలేదు. కాని సుబ్బారెడ్డి చేశాడని అసత్య ప్రచారం చేశారు...సింహాచలం ఆలయంలో దొంగతనం చేస్తే స్టేషను బెయిల్ ఇచ్చి వదిలేశారు. 2015 నుంచి 2025 వరకు పట్టు వస్త్రాల స్కాం జరిగితే.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నాడు. రోజుకో మాట మాట్లాడటంలో పవన్ దిట్టా. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడూ జరగని అపచారాలు తిరుమలలో జరిగాయి’’ అని భూమన ధ్వజమెత్తారు. -
నారాయణ కాలేజీలో.. వేధింపులు భరించలేక విద్యార్ధి ఆత్మహత్యాయత్నం
-
AP: నారాయణ కాలేజీలో దారుణం
తిరుపతి: జిల్లాలోని అగరాల నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకంది. చదువు పేరుతో కాలేజ్ యాజమాన్యం పెడుతున్న వేధింపులు భరించలేక మహీధర్రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు.కాలేజ్ మూడో అంతస్తు నంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో మహీదర్రెడ్డికి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది ఆరంభంలో ఏపీలోని అనంతపురం సోమలదొడ్డి దగ్గరున్న నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 23 వ తేదీన కాలేజీ మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ీసీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. -
లెంగిక వేధింపుల కేసులో ఇద్దరు అధ్యాపకుల అరెస్ట్
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో ఇటీవల సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో మరో ముందడుగు పడింది. బాధితురాలు స్వరాష్ట్రం ఒడిశాకు తిరుపతి పోలీసుల బృందం మంగళవారం చేరుకుంది. ఒడిశా జార్హ్పూర్లో బాధితురాలిని మహిళా ఎస్ఐ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి వివరాలను సేకరించారు. యువతి స్టేట్మెంట్ను వీడియో రికార్డ్ చేసి భద్రపరిచారు. ఇప్పటికే ఈ కేసు విషయంపై తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంట్ వేదికగా ప్రస్తావించడంతో ఇటు పోలీసులు, అటు వర్సిటీ అధికారులలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. అధ్యాపకుడు లక్ష్మణ్ కుమార్ తనను పలు మార్లు లైంగికంగా వేధించారని, మరో అధ్యాపకుడు శేఖర్రెడ్డితో ఏకాంతంగా గడిపిన వీడియోలు ఉన్నాయంటూ లక్ష్మణ్ కుమార్ పలుమార్లు బెదిరింపులకు దిగారని బాధితురాలు తెలిపినట్లు సమాచారం. దీంతో ఈ స్టేట్మెంట్లను ఆధారం చేసుకొని, పోలీసులు ఆ ఇద్దరి అధ్యాపకులను అరెస్ట్ చేశారు. అనంతరం ఈస్ట్ పోలీసులు స్థానిక డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం అధ్యాపకులకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. -
తిరుపతి సంస్కృత వర్సిటీ కేసులో కీలక పరిణామం
సాక్షి, తిరుపతి: జాతీయ సంస్కృత యూనివర్శిటిలో(Tirupati Sanskrit Versity) లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధిత యువతి వీడియో స్టేట్మెంట్ రికార్డు చేసిన తిరుపతి మహిళా పోలీసులు.. కీలకమైన వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా నిందితులిద్దరినీ పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ‘‘ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ నన్ను లైంగికంగా వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక పైఅధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యా. అయితే ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి వద్ద నా వ్యక్తిగత వీడియో ఉందని చెబుతూ లక్ష్మణ్ బెదిరింపులకు దిగాడు. ఆపై పలుమార్లు లైంగికంగా వేధించాడు. లక్ష్మణ్లాంటివాళ్లకు కఠినమైన శిక్ష పడాలి’’ అని పోలీసుల వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలస్తోంది. తిరుపతి వెస్ట్ స్టేషన్ నుంచి మహిళా పోలీసుల బృందం ఒడిశా జార్హ్ పూర్లో బాధితురాలిని విచారించి.. ఈ మేరకు వీడియో స్టేట్ మెంట్ రికార్డు చేశారు. బాధితురాల స్టేట్మెంట్ ఆధారంగా ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు. నిందితుల ఆరెస్టును తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం మీడియా సమావేశంలో ధృవీకరించారు. ‘‘సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో విద్యార్థిపై అనుచిత ప్రవర్తన ఘటన చోటు చేసుకుంది. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఫిర్యాదుతో వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఒడిషాకు చెందిన యువతి ఈ ఏడాది జూన్లో బీఈడీ కోర్సులో జాయిన్ అయింది. అయితే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న లక్ష్మణ్ కుమార్ తన హోదాను వినియోగించుకుని ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినితో చనువుగా ఉంటున్న దృశ్యాలను శేఖర రెడ్డి అనే వ్యక్తి చిత్రీకరించాడు. ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఒడిషాకు పంపి బాధితురాలి నుంచి ఆధారాలను సేకరించాం. లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’’ అని వెల్లడించారు. పార్లమెంట్లో ఆందోళన.. తిరుపతి సంస్కృత వర్సిటీ ఘటన పార్లమెంట్లోనూ చర్చ జరిగింది. లోక్సభలో సోమవారం అడ్జర్న్మెంట్ మోషన్ నోటీసు ద్వారా వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థినిని అదే వర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించారని సభలో తెలిపారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరించారన్నారు. అది అత్యంత హేయమ చర్యగా అభివర్ణించారు. దళిత విద్యార్థినిపై ఇటువంటి దురాగతం జరగడం పట్ల పార్లమెంట్ వేదికగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం తిరుపతి ప్రతిష్టకు దెబ్బతీస్తోందని ఎంపీ పేర్కొన్నారు. -
యూరియా కోసం బారులు
బిక్కవోలు/తిరుపతి రూరల్: రైతన్నను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని సొసైటీ వద్ద సోమవారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. బిక్కవోలు సొసైటీ పరిధిలో 378 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. తొలి విడతగా 50 మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకువచ్చారు. యూరియా లేకపోతే ఇబ్బంది పడక తప్పుదు అని రైతులు సొసైటీ వద్ద బారులు తీరారు. అయితే ఒక రైతుకు రెండు బస్తాలకు మించి ఇవ్వకపోవడంతో క్యూలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసుల సమక్షంలో యూరియాను అందించారు. తిరుపతిలో... తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో మండలంలోని కె.వడ్డేపల్లి రైతు భరోసా కేంద్రంలో యూరియా బస్తాల కోసం సోమవారం రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో అధికారులు కొంత సమయం సరఫరా నిలిపివేయడంతో అన్నదాతలు క్యూ కట్టారు. పాకాల మండలంలోని గాదంకి, ఆదెనపల్లి, కావలివారి పల్లి, కె.వడ్డేపల్లి పంచాయతీలకు చెందిన 300మంది రైతులకు అధికారులు టోకెన్లను మంజూరు చేశారు. ఈ విషయం తెలుసుకుని మరికొంత మంది రైతులు అక్కడకు చేరుకున్నారు. టోకెన్లు ఉన్న వారు మాత్రమే రావాలని, మిగతా వారికి మరికొన్ని రోజుల్లో యూరియా ఇస్తామని అధికారులు చెప్పడంతో ఒకింత గందరగోళం చోటు చేసుకుంది. అనంతరం టోకెన్లున్న రైతులు యూరియా తీసుకెళ్లారు. అయితే టీడీపీ నేతలు తమకు కావాల్సిన వారికి ముందుగానే టోకెన్లు ఇచ్చి యూరియాను దారి మళ్లించారని, అందుకే తమకు ఈ కష్టాలని పలువురు రైతులు వ్యాఖ్యానించారు. -
యూనివర్సిటీ గేట్ వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్
-
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరక కేంద్ర విద్యాశాఖ, నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు లేఖ రాశారు. విద్యార్థినిలపై లెక్చరర్ల లైంగిక వేధింపుల అంశంలో జోక్యం చేసుకోవాలని విన్నవించారు. ‘సంస్కృత విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయంలో బీఈడీ మొదటి సంవత్సరం విద్యార్థినిపై లెక్చరర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ విద్యార్థినిపై తీవ్ర వేధింపులకు గురి చేయడంతో ఆమె చదువు మధ్యలోనే వదిలి వెళ్ళిపోయింది. ఈ అంశం నేపథ్యంలో బాధితురాలి ప్రాణాలకు హాని ఏర్పడింది. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి , కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితురాలు చదువు కొనసాగించేందుకు తగిన సురక్షిత వాతావరణం కల్పించాలి’ అని పేర్కొన్నారు.కాగా, విద్యార్థినిని అధ్యాపకుడు లైంగికంగా వేధించిన ఘటన తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగింది. ఒడిశాకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిని వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ కుమార్ లైంగిక వేధింపులకు గురిచేసి మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థినితో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉంటుండగా ఆ దృశ్యాలను ఆ విద్యార్థినిపై కన్నువేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ తన మొబైల్లో రికార్డు చేశాడు.అనంతరం ఆ వీడియోను విద్యార్థినికి పంపించి తన కోరిక తీర్చమని బెదిరించాడు. దీంతో తనను వేధించి గర్భవతిని చేసిన డాక్టర్ లక్ష్మణ్ కుమార్, వీడియో అడ్డుపెట్టుకుని తనను బెదిరిస్తోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్పై వీసీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వీసీ, రిజిస్ట్రార్ ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. తమ కుమార్తెకు టీసీ ఇస్తే వెళ్లిపోతామని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కమిటీకి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. -
‘ఇండిగో’ సర్వీసులతో ఇక్కట్లు
రేణిగుంట/గన్నవరం/గోపాలపట్నం/కోరుకొండ: విమాన సర్వీసుల్లో అత్యధిక విమానాలు కలిగిన ఇండిగో సంస్థపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రçßæం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతి(రేణిగుంట) అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ప్రతిరోజు 12 ఇండిగో విమానాలు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. ముందస్తు ప్రణాళికతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో విమానాలు రద్దయ్యాయని ఇండిగో సిబ్బంది తాపీగా చెబుతుండడంతో ప్రయాణికులు వారితో తీవ్ర వాగ్వాదానికి దిగుతున్నారు. ఇక శనివారం రాత్రి 7.50కు హైదరాబాద్కు వెళ్లాల్సిన ఇండిగో సర్వీస్ రద్దయింది. ఇదే అదునుగా ఇతర విమాన సర్వీసులు తమ టికెట్ ధరలను అమాంతం పెంచడంతో ప్రయాణికులు అవస్థలు అన్నీఇన్నీ కావు.శ్రీవారి భక్తుల అగచాట్లు..తిరుపతికి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు శ్రీవారి దర్శనానికి నిత్యం వస్తుంటారు. రావడానికి, తిరిగి వెళ్లడానికి వీరు ముందుగానే విమాన టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, శ్రీవారి దర్శనానంతరం ఎయిర్పోర్టుకు చేరుకున్న వీరికి విమానం రద్దయిందని చెప్పడంతో ప్రత్యామ్నాయంలేక వారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, అత్యవసరంగా వేరే నగరాలకు వెళ్లాల్సిన వారి అవస్థలూ చెప్పనలవి కావు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాశ్రయానికి చేరుకున్నాక సర్వీసు రద్దని చెప్పడంపై వారు మండిపడుతున్నారు. పైగా.. వేరే విమాన సర్వీసుల ధరలను ఇదే అదనుగా పెంచేస్తుండడంతో ప్రయాణికుల పరిస్థితి అగ్గిమీద గుగ్గిలంలా తయారైంది.వీసాలు రద్దవుతాయని గగ్గోలు..మూడు రోజులుగా ఇండిగో విమానాలను రద్దవుతుండడంతో ప్రయాణికులు విశాఖ విమానాశ్రయానికి వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. పలు దేశాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడిన వారు స్వదేశానికి వచ్చి తిరిగి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. విమానాలు రద్దుకావడంతో ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల్లో తమ వీసా గడువు ముగుస్తుందని.. భవిష్యత్తు ఏమవుతుందో అంటూ వారు కంగారుపడుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికి పరిష్కారమవుతుందో తెలియడంలేదని వాపోతున్నారు. ఇదిలా ఉంటే.. శనివారం విశాఖలో తొమ్మిది ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా మధురపూడిలోని రాజమహేంద్రవరం ఎయిర్పోర్టులో కూడా ఇదే పరిస్థితి. ముంబై నుంచి రావాల్సిన విమానం శనివారం రద్దయింది. ఢిల్లీ నుంచి శుక్రవారం రావల్సిన సర్వీసు శనివారం చేరింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమాన సర్వీసులన్నీ ఆలస్యంగానే నడుస్తున్నాయి.ఇండిగో సర్వీసులు ఆలస్యం..పైలెట్ల కొరత, సాంకేతిక సమస్యల కారణంగా ఇండిగో విమాన సర్వీసులు శనివారం కూడా గన్నవరం విమానాశ్రయానికి అలస్యంగా నడిచాయి. ఢిల్లీ–విజయవాడ మధ్య నడిచే సర్వీసును వరుసగా రెండోరోజూ రద్దుచేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కడప, విశాఖపట్నం సర్వీసులు గంట నుంచి రెండు గంటల వరకు అలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. విమాన టికెట్ ధరలు భారీగా పెరగడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గన్నవరం నుంచి హైదరాబాద్, బెంగళూరుకు సుమారు రూ.18 వేలు, న్యూఢిల్లీకి రూ.35 వేలు నుంచి రూ.42 వేలు వరకు టికెట్ ధర పెరిగిందని చెబుతున్నారు.కనీస సమాచారం ఇవ్వలేదు..ముంబై వెళ్లేందుకు 15 రోజులు ముందుగా ఇండిగో సర్వీసులో టికెట్ బుక్చేసుకున్నా. ఇవాళ ముంబై వెళ్లేందుకు రేణుగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నాక విమానం రద్దయిందని ఇండిగో సిబ్బంది చెప్పారు. ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే వేరే ఏర్పాట్లు చేసుకునే వాళ్లం. ఇప్పుడు మీ డబ్బులు తిరిగిస్తామంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. – వెంకటేష్, తిరుపతి -
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం
సాక్షి, తిరుపతి: నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినిని బెదిరించి గర్భవతిని చేశాడు. బాధిత విద్యార్థిని.. వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేసింది. కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ వీసీ ఆదేశాలు జారీ చేశారు.యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కన్నేశారు. ఆ విద్యార్థినిని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.లక్ష్మణ్ కుమార్పై యూనివర్శిటీ సిబ్బంది.. తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. కానీ ఆ విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్ళిపోయింది. -
అవి ఏమైనా.. అడ్డా కూలీ కేంద్రాలా?
-
ఏపీకి హెచ్చరిక.. నాలుగు జిల్లాల్లో ఆకస్మిక వరదలు!
సాక్షి, అమరావతి: దిత్వా తుపాను ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాపై దిత్వా ప్రభావం ఎక్కువగా ఉంది. కాగా, తాజాగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రానున్న 24 గంటల్లో ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.దిత్వా తుపాను ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు.. నైరుతి-పశ్చిమ బంగాళాఖాతం ఆనుకొని వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద వాయుగుండం కదలుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదిలినట్లు వెల్లడించారు. తీరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యింది. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు నెమ్మదిగా వాయుగుండం కదులుతోంది. మరో 12 గంటల్లో బలమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉంది. గంటకు 45-55 కి.మీ. మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుపాను ప్రభావంతో గాలుల ప్రభావానికి కోతకు సిద్ధంగా ఉన్న వందల ఎకరాల వరి పంట నేల వాలింది. గాలుల ప్రభావం పెరిగితే చేతికి వచ్చిన పంట పూర్తిగా నేలమట్టం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షాల ప్రభావంతో నిజాంపట్నం హార్బర్ వద్ద మూడో నంబర్ ప్రమాద సూచిక కొనసాగుతోంది. సముద్రంలో వేటకు వెళ్లే బోట్లు అన్ని జెట్టికే పరిమితం అయ్యాయి.తమిళనాడులో కొనసాగుతున్న వర్షాలుబలహీనపడ్డ దిత్వా తుపాను దిశను మార్చుకున్నప్పటికీ తమిళనాడులో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం చెన్నై, శివారులలో 30 చోట్ల భారీగా వర్షం పడింది. ఉత్తర చెన్నై పరిధిలోని ఎన్నూరులో 26 సెం.మీ., బ్రాడ్వేలో 25 సెం.మీ. వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై వరదలు పోటెత్తాయి. నీటి తొలగింపు పనులను వేగవంతం చేశారు. 40కి పైగా ప్రాంతాలలో ఈదురు గాలుల ధాటికి చెట్లు నేల కొరగడంతో వాటిని తొలగించారు. ఆంధ్రప్రదేశ్ వైపుగా వాయుగుండం కదలుతుందని భావిస్తే.. అది వచ్చిన దారిలో మళ్లీ పుదుచ్చేరి వైపుగా కదలడం గమనార్హం. బుధవారం పుదుచ్చేరి–మహాబలిపురానికి మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో చెన్నై, శివారులలో చిరు జల్లులతో వర్షం పడుతోంది. ఇక అలాగే, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుపత్తూరు, వేలూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. -
తిరుపతిలో ఆగని బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్
తిరుపతి: తిరుపతి నగరంలోని హోటల్ రాజ్ పార్క్కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్డిఎక్స్తో పేల్చేస్తాం అని వచ్చిన మెయిల్ నగరంలో తీవ్ర కలకలం రేపాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్ను కూడా రంగంలోకి దించారు. ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలను భద్రతగా ఉంచే ప్రయత్నం చేశారు. ఈ ఘటన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై అజిత ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. హోటల్ సిబ్బంది, అక్కడి అతిథులు భయాందోళనకు గురయ్యారు. -
వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మధుసూదన్ తల్లిదండ్రులపై దాడి
తిరుపతి: జిల్లాలోని శ్రీకాళహస్తిలో దారుణం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మధుసూదన్రెడ్డి త్లి జయమ్మ మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన తండ్రి మహాదేవరెడ్డికి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు అనేది తెలియరాలేదు. -
తిరుపతి జిల్లా వేలంపాడు టైల్స్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం
-
తిరుపతి SV యూనివర్సిటీ వద్ద మరోసారి చిరుత కలకలం
-
తిరుచానూరు : పంచమి తీర్థం..పులకించిన జనం (ఫొటోలు)
-
తిరుమలలో చిరుత సంచారం కలకలం
సాక్షి,తిరుమల: తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగుల నివాసాల వద్ద చిరుత సంచరించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలో ఎంప్లాయిస్ క్వార్టర్స్ దగ్గర చిరుత నాటు కోళ్ల షెడ్డుపై దాడికి ప్రయత్నించింది. అనంతరం, అక్కడి నుంచి వేగంగా వెళ్లినట్లు కనిపిస్తోంది.అంతేకాదు, నివాసాల వద్దకు చేరుకున్న చిరుత కొద్ది నిమిషాలు అక్కడే తిరుగాడి సమీప అటవీ ప్రాంతం వైపు వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. చిరుత సంచారం విషయం తెలిసిన వెంటనే అటవీశాఖ సిబ్బంది, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ బృందాలు అక్కడికి చేరుకుని చిరుత జాడను గుర్తించేందుకు చర్యలకు ఉపక్రమించారు. అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ..‘తిరుమల అటవీ ప్రాంతం విస్తారంగా ఉండటం, ఆహార వనరులు అందుబాటులో ఉండటం వల్ల చిరుతలు అప్పుడప్పుడు మానవ నివాస ప్రాంతాలకు చేరుతుంటాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రత్యేక బృందాలు మోహరించాం’అని తెలిపారు.ఉద్యోగులు మాత్రం భయాందోళనలో ఉన్నారు. పిల్లలను బయటకు పంపడానికి భయపడుతున్నామని, రాత్రివేళల్లో బయటకు రావడం మానేశామని వారు తెలిపారు. చిరుతను పట్టుకునే వరకు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు. తిరుమలలో గత కొంతకాలంగా చిరుతల సంచారం పెరుగుతుండటంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
‘పరకామణి కేసులో డీజీ నన్ను ఈ ప్రశ్నలే అడిగారు’
సాక్షి, తిరుపతి: పరకామణి చోరీ కేసులో వైఎస్సార్సీపీ కీలక నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి సిట్ విచారణ ముగిసింది. మంగళవారం సాయంత్రం అధికారుల ఎదుట హాజరైన ఆయన్ని 25 నిమిషాలపాటు విచారించి పంపించేశారు. అయితే.. విచారణకు హాజరయ్యే ముందు, ఆ తరవాత ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విచారణకు ముందు.. నాకు ఈ కేసుకు భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కూటమి ప్రభుత్వాన్ని మోసే పిచ్చి శునకాలు అక్షరాల విరోచనాలతో తమ పత్రికను నింపేశాయి. నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, వర్ల రామయ్య, పట్టాభిలు నన్ను కచ్చితంగా విచారణ చెయ్యాలని అధికారులపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి భరించలేకనే అధికారులు నన్ను పిలిచారు. అయినను పోయి రావలె హస్తినకు.. ’’ అని భూమన అన్నారు. విచారణ అనంతరం.. నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని ...? 15 ఏళ్లలో శ్రీ వారికి తలనీలాలు ఎంత మంది సమర్పించారూ.. అనేవిధంగా ప్రశ్నలు వేస్తే నాకు తెలియదు. పరకామణి కేసు విషయంలో నాకు అంతే తెలుసు. పరకామణి కేసులో డీజీ నన్ను ఈ ప్రశ్నలే అడిగారు. నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను అని చెప్పి వెళ్లిపోయారాయన. -
ప్రైవేటీకరణ మత్తులో చంద్రబాబు: సీపీఎం మధు
సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రైవేటీకరణ మత్తులో జోగుతున్నారని సీపీఎం మాజీ పార్లమెంట్ సభ్యులు పెనుమల్లి మధు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి యశోదానగర్లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 66,350 కోట్ల ఖర్చుతో అమరావతి నగరాన్ని ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు. పట్టణ ప్రాంతాలలో రోడ్లు, మంచినీరు, పారిశుధ్యం, విద్యుత్తు తదితర ప్రజా సౌకర్యాలు అన్నింటిని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పుతూ రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.రూ.6400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ను ఆపేసి 60 డిగ్రీ కాలేజీలు మూతపడ్డానికి చంద్రబాబు ప్రభుత్వం కారణమైంది. మరిన్ని కాలేజీలు మూసివేతకు సిద్ధమైన పరిస్థితి నెలకొంది.. ఈ కారణంగా 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో 100 రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని ప్రకటన చేసిన లోకేష్ హామీ ఏమైందని ప్రశ్నించారు. బకాయిలు చెల్లించమని విద్యాసంస్థల యాజమాన్యాలు అడిగినందుకు వారిని బెదిరించడం ఎంతవరకు సమంజసం? అంటూ మధు నిలదీశారు.ఆరోగ్యశ్రీ పథకానికి రూ.3 వేల కోట్లు బకాయిలు పెట్టారని ఈ కారణంగా ఆసుపత్రులు 1300 రకాల జబ్బులకు వైద్యం చేయలేమని తీర్మానించిన విషయాన్ని మధు గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేతను చంద్రబాబు సమర్థించటం ఎవరి ప్రయోజనాలకంటూ ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ కార్మికులను సోమరిపోతులు, అవినీతిపరులంటూ అవమానించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ రంగంలోని స్టీల్ప్లాంట్ పరిరక్షణకు నడుం కట్టాల్సిన ముఖ్యమంత్రి.. పక్కనే మరో స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నించడమే కాకుండా తన మంత్రులను ఎంపీలను ప్రారంభం కానీ పరిశ్రమకు గనులు కేటాయించమని వినతి పత్రాలు ఇస్తూ కేంద్ర మంత్రుల వెంట తిరుగుతున్న వైనాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బీజేపీతో అంట కాగుతూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ప్రజలు తిప్పికొట్టకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని మధు అన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ వామపక్షాలు మాత్రమే ప్రత్యామ్నాయమని మిగిలిన బూర్జువా పార్టీలు బీజేపీకి ప్రత్యామ్నాయం కాదని వారి తోకలుగా మారిపోయాయని ఓ ప్రశ్నకు సమాధానంగా వివరించారు.తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తులకు రక్షణ కల్పించాలితిరుపతి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి సాగుతున్నాయని ఉదయం పూట ఒక్కసారిగా రైళ్లు వస్తున్న సందర్భాల్లో వేలాదిమంది భక్తులు బయటికి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు తొక్కిసలాట జరుగుతుందన్నారు. ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయకుండా కాంట్రాక్టర్ వేడుక చూస్తున్నారన దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయం పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాను లేఖలు రాస్తానని.. తక్షణం తొక్కిసలాట నివారణకు తగిన జాగ్రత్తలను రైల్వే యాజమాన్యాలు తీసుకోవాలని మధు సూచించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నేతలు కందారపు మురళి, వందవాసి నాగరాజు కందారపు మురళి టి సుబ్రహ్మణ్యం ఎస్ జయచంద్రలు పాల్గొన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము
సాక్షి, తిరుపతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద అర్చకులు ఇస్తీకఫల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున రాష్ట్రపతికి చిత్రపటాన్ని అందించారు.భక్తులకు చాక్లెట్లు పంచిన ముర్ముతిరుమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనూహ్య చర్యకు దిగారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుగు పయనంలో ఆమె రాంభకిచా వద్ద తన కాన్వాయ్ను ఆపారు. వాహనం దిగిన ఆమె కరచలనం చేస్తూ స్వయంగా భక్తులకు చాక్లెట్లు పంచారు. ఈ క్రమంలో.. ఆమె కాన్వాయ్ దిగడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే.. రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురవారమే తిరుమల చేరుకున్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బస చేసిన ఆమె.. అంతకు ముందు తిరుచానూరు వెళ్లి శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి కాసేపట్లో హైదరాబాద్కు చేరుకోనున్నారు. -
తిరుపతిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సాక్షి, తిరుపతి: జిల్లాలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన ఒస్సు ఒకటి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 25 మంది ప్రయాణికులతో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. పెళ్లకూరు మండకం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రి వద్దకు చేరుకుని పోలీసులు వివరాలు సేకరించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. -
అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
సాక్షి,తిరుమల: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన జరిపారు. అనంతరం ఉదయం 6.30 గంటలకు నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9.15 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు.టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి. మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో హరింద్రనాథ్, కంకణ భట్టార్ పి. శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబు స్వామి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈవో శ్రీ శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ, సోమవారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూల మూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ, పంచమీ తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు.శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన బాగా ఉందని, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు. ఇదిలా ఉండగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. -
రైల్వే ట్రాక్పై టీటీడీ మాజీ ఏవీఎస్వో మృతదేహం
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవీఎస్వో సతీష్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై విగతజీవిగా పడి కనిపించారు. పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును గతంలో విచారించిన సతీష్ను.. ఆపై నిందితుడిగా సిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం గుంతకల్ రైల్వే ఆర్ఐగా పని చేస్తున్న ఆయన్ని ఈ నెల 6వ తేదీన సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం విచారణ జరిపింది. అయితే.. మరోసారి విచారణకు రావాలంటూ అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీంతో వేధింపులు భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సతీష్ను వేధించారు: వైఎస్సార్సీపీసతీష్ కుమార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని అంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ‘‘పరకామణి కేసులో రవికుమార్ ని పట్టుకున్నదే సతీష్ కుమార్. అలాంటి వ్యక్తి చనిపోవడం అనుమానాస్పదంగా ఉంది. సతీష్ మృతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపించాలి. వాస్తవాలు ఏంటో బయటి ప్రపంచానికి తెలియచేయాలి. సతీష్ను వేధించారు. భూమన కరుణాకరరెడ్డిని ఆ కేసులో లాగాలని సతీష్ పై ఒత్తిడి చేశారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయాలలో కి లాగటం బాధాకరం. ఈ కేసులో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే సతీష్ ఆత్మహత్య చేసుకున్మాడో అర్థం చేసుకోవచ్చు. తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని సతీష్ కుమార్ తన ఫ్రెండ్స్ దగ్గర చాలా సార్లు చెప్పారు. నాలుగు రోజుల సతీష్ విచారణ లో ఏం జరిగిందో బయట పెట్టాలి. వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుపతి: సిట్ విచారణకు సహకరించానని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పానన్నారు. గతంలొ టీటీడీలో పనిచేసిన అధికారులను ప్రశ్నించినట్టే తానను కూడా విచారించారన్నారు. కొత్త ప్రసార మాధ్యమాల్లో అవాస్తవాలు వేస్తున్నారని.. విచారణకు సంబంధించిన అవాస్తవాల ప్రసారంతో ప్రజలను పక్కదారి పట్టించవద్దన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని ధర్మారెడ్డి అన్నారు.టీటీడీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ నేతృత్వంలోని సిట్ టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డిని నిన్న (మంగళవారం, నవంబర్ 11) కూడా విచారణ చేశారు. తిరుపతి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లోలోని సీబీఐ కార్యాలయంలో జరిగిన విచారణకు ధర్మారెడ్డి హాజరయ్యారు. తిరుపతి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లోని సీబీఐ కార్యాలయంలో జరిగిన విచారణకు మంగళవారం ఉదయం 10:58 గంటలకు ధర్మారెడ్డి హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు భోజన విరామం ఇచ్చారు.భోజన విరామ సమయంలో మీడియా సిబ్బంది మాట్లాడండి.. అని కోరగా ధర్మారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఫొటోలు వీడియోలు తీసుకోమని చెప్పారు. ఇదే సమయంలో జనసేన పార్టీ బహిష్కృత నేత కిరణ్ రాయల్ సిట్ కార్యాలయం వద్ద ఓవర్ యాక్షన్ చేశారు. ఎవరో తెచ్చిన లడ్డూలను తానే తిరుమల నుంచి తెచ్చా.. ధర్మారెడ్డికి ఇస్తా అంటూ హల్చల్ చేశారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే కిరణ్ రాయల్ అక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ధర్మారెడ్డి భోజనానికి వెళ్లి.. 3.10 గంటలకు తిరిగి విచారణకు హాజరయ్యారు. రాత్రి 9.15 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇవాళ కూడా ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. -
కపిలతీర్థంలో అయ్యప్ప స్వాములకు అవమానం
-
RK రోజా ఆధ్వర్యంలో భారీగా ప్రజా ఉద్యమం ర్యాలీ
-
మూడేళ్ళుగా మైనర్ బాలికపై అత్యాచారం.. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
-
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి మోసపోయిన రైతు
తిరుపతి: అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలంలోని ఎగువ రెడ్డిపల్లికి చెందిన రైతు తన పిల్లల చదువుల కోసం తిరుపతి రూరల్ ఓటేరు పంచాయితీలోని శ్రీవాణి నగర్లో నివాసం ఉంటున్నాడు. అయితే రైతు ఫోన్ నెంబర్ వాట్సప్కు PMJY కిసాన్ యోజన పథకం పేరుతో ఉన్న లింక్ వచ్చింది. లింక్ ఓపెన్ చేయడంతో వ్యక్తిగత వివరాలను అడిగిన సైబర్ నేరగాళ్లకు తన వివరాలు తెలిపాడు రైతు. దాంతో రైతు అకౌంట్లో ఉన్న 10 లక్షల 81 వేల రూపాయలలో 7.50 లక్షల నగదు విత్ డ్రా అయినట్టు రైతు ఫోన్కు మెసేజ్ వచ్చింది. తన అకౌంట్ నుండి 7.50 లక్షల నగదు సైబర్ నేరగాళ్లు కొట్టేశారని గ్రహించిన బాధితుడు.వెంటనే 1930కు కాల్ చేసి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాడు. తను మోసపోయినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు. సైబర్ నేరగాళ్లను చేధించే పనిలో పడ్డారు. -
Vellampalli Srinivas: కూటమి ప్రభుత్వం హింధువుల పట్ల కపట ప్రేమ చూపిస్తోంది
-
పవన్ తిరుపతి పర్యటనపై భూమన సెటైర్లే సెటైర్లు
-
తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం
సాక్షి,తిరుపతి: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ యూనివర్సిటీ)లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సైకాలజీ విభాగంలో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ఈ ఘటనపై నలుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేసిన విద్యార్థులపై కక్ష్య సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. వారిని ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడికి గురిచేశారు. అంతేకాక, వారిపై బెదిరింపులకు కూడా దిగినట్లు సమాచారం.ఈ ఒత్తిడిని భరించలేక, నలుగురు విద్యార్థులు తమ టీసీలు తీసుకుని యూనివర్సిటీని విడిచిపెట్టారు. ర్యాగింగ్ ఘటనలో ప్రమేయం ఉన్న ఆరుగురు సీనియర్ విద్యార్థులతో పాటు, సైకాలజీ విభాగ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (హెచ్ఓడీ) ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిని యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. విద్యార్థుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.మరోవైపు యూనివర్సిటీ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ర్యాగింగ్ను ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై కూడా బెదిరింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. -
కుక్కను వేటాడిన చిరుత.. CCTV కి చిక్కిన దృశ్యాలు
-
తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం
సాక్షి, తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం సృష్టించింది. పాపులేషన్ స్టడీస్, ఐ బ్లాక్ మధ్యలో కొత్త బిల్డింగు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలో చిరుత కదలికలను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. సీసీ కెమెరాలో చిరుతపులి సంచార దృశ్యాలు రికార్డు అయ్యాయి. చిరుత పులి.. కుక్కను వేటాడింది. వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు బయట ఒంటరిగా తిరగొద్దని సిబ్బంది హెచ్చరిస్తున్నారు.కాగా, వారం రోజుల క్రితం కూడా తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు.. భయంతో కేకలు వేశారు. టీటీడీ, ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. భక్తులను గుంపులు గుంపులుగా పంపించారు. -
Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు
-
అయ్య బాబోయ్.. ఎంత పొడవో!
తిరుమలలో ఏడు అడుగుల పొడవైన మహిళ సందడి చేశారు. సోమవారం ఉదయం వానమామలై పీఠాధిపతి జీయర్ స్వామి, ఆయన శిష్య బృందంతోపాటు ఏడు అడుగుల పొడవున్న శ్రీలంకకు చెందిన నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆమె ఎత్తును చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. -
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం
సాక్షి, తిరుపతి: తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు.. భయంతో కేకలు వేశారు. సులభ్ కార్మికులు సమాచారంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టీటీడీ, ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. -
తిరుపతిలో హైటెన్షన్ YSRCP కార్పొరేటర్పై దాడి
-
నేను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదు: భూమన
సాక్షి, తిరుపతి: తాను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదని.. తనపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ‘‘11.04.25న మీడియా సమావేశంలో గోశాలలో గోవులు అధికంగా మరణిస్తున్నాయని నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా’’ అని భూమన స్పష్టం చేశారు.‘‘గోవుల పట్ల నిర్లక్ష్యంగా తగదని నేను మాట్లాడాను. పోలీస్ విచారణకు పిలిచారు. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండ అసభ్య పదజాలంతో కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నేను వాస్తవాలు చెబితే సమాధానాలు ఇవ్వడం లేదు. వాళ్ల మీడియాలో నాపై విష ప్రచారం చేస్తున్నారు. మీ చేతిలో అధికారం ఉంది. విచారణ చేయించాలి కదా?’’ అంటూ భూమన ప్రశ్నించారు. -
తీవ్ర అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వానలు పడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా తడిసి ముద్దయింది. బుధవారం కూడా తిరుపతి జిల్లాలో వర్షం తెరిపినివ్వలేదు. శేషాచలం కొండల నుంచి వరదలు పోటెత్తడంతో స్వర్ణముఖి నది, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మాల్వాడిగుండం, కపిలతీర్థం సమీపంలోకి ప్రజలను అనుమతించడం లేదు. తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్లలో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. చెన్నై– విజయవాడ జాతీయరహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.చిల్లకూరు సమీపంలో వరగలి క్రాస్ రోడ్డు నుంచి 2 కి.మీ మేర వాహనాలు బారులు తీరాయి. వాకాడు వద్ద 10 మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచి్చంది. తిరుమలలోనూ మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీనికితోడు పొగమంచు తిరుమలను కమ్మేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఘాట్రోడ్డులోని జలపాతాలు పొంగిప్రవహిస్తున్నాయి.తిరుమలలోని గోగర్భం ఆకాశగంగ, పాపవినాశం, కుమారధార–పసుపుధార డ్యాముల్లో నీటి ప్రవాహం పెరిగింది. తిరుపతి, శ్రీకాళహస్తితో పాటు తొట్టంబేడు, కోడూరు, బుచి్చనాయుడి కండ్రిగ, వడమాలపేట, ఏర్పేడు, వెంకటగిరి, బాలాయపల్లె, పెళ్లకూరు, సూళ్లూరుపేట తదితరచోట్ల భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాలతో అన్నమయ్య జిల్లాలోని చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పింఛ డ్యామ్ వద్ద ప్రవాహం ప్రమాదకరంగా మారింది. రైల్వేకోడూరు రోడ్లు జలమయం అయ్యాయి. ⇒ కడప నగరం జలమయమైంది. రోడ్లపైకి నీరు భారీగా చేరింది. అనేకచోట్ల మోకాళ్ల లోతులో నిలిచి... జనజీవనం స్తంభించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో మిడతవాగు, ఉలవపాడు మండలంలో ఉప్పుటేరు, అనంతరసాగరం మండలంలోని కొమ్మలేరు, మనుబోలు–గూడూరు మధ్య ఉండే పంబలేరు, చేజర్ల మండలంలోని నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,500 ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు నీటమునిగి నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మతో పాటు, ముసి, మన్నేరు, పాలేరుతో పాటు ఇతర వాగుల్లో నీరు చేరి పారుతున్నాయి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో 33.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంతటా మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా ఎరతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో 2,296 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పది సెంటీమీటర్లకు పైనే... ⇒ మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పాపమాంబపురంలో 13.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏర్పేడులో 13.4, బాలాయపల్లి మండలం చిలమన్నూరులో 13.1, వెంకటగిరి మండలం లాలాపేటలో 12.8, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం గంగరాజుపురంలో 12.4, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 12, అనుమసముద్రంపేట మండలం దూబగుంటలో 11.1, తిరుపతి జిల్లా బాలాయపల్లె మండలం హస్తకావేరిలో 11.9, గొల్లగుంటలో 11.6, వెంకటగిరిలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులో 8.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. లింగసముద్రం మండలం ముగిచర్లలో 7.8, కృష్ణా జిల్లా నాగాయలంక భావదేవరపల్లెలో 7.5, గుంటూరు జిల్లా దుగ్గిరాల, ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం ఉమరెడ్డిపల్లెలో 6.1, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జంగందొరువు రోడ్డులో 5.9 సెంటీమీటర్ల వర్షం పడింది. వాయుగుండంగా బలపడొచ్చు! ⇒ తీవ్ర అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరం నుంచి వాయువ్య దిశగా కదులుతున్నట్లు బుధవారం వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీ తీరాలకు ఆనుకుని ఉన్న పశి్చమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. తర్వాత ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్ర తీరాల మీదుగా కదిలే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 4 రోజులు పలుచోట్ల అతి భారీ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ⇒ తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది.అప్రమత్తంగా ఉండండి: సీఎస్ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కె.విజయానంద్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతోపాటు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలుచేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.పిడుగు పడి ఇద్దరు మహిళా కూలీల మృతిపొన్నూరు: పిడుగు పడి పొలంలో కలుపు తీస్తున్న ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పొన్నూరు 23వ వార్డులోని క్రిస్టియన్పేటకు చెందిన వలపర్ల మరియమ్మ (45), నీలం మాణిక్యమ్మ, 27వ వార్డు షరాఫ్ బజార్కు చెందిన షేక్ ముజాహిద (45), మరికొందరు మహిళా కూలీలు కలిసి బుధవారం పెద ఇటికంపాడు రోడ్డులోని ఓ పొలంలో కలుపు తీసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షం మొదలై వారు పని చేస్తున్న ప్రాంతంలో పిడుగు పడింది. దాని తీవ్రత వల్ల వలపర్ల మరియమ్మ, షేక్ ముజాహిదా అక్కడికక్కడే మృతిచెందారు. నీలం మాణిక్యమ్మ కాలికి తీవ్ర గాయమైంది. ఆమెను 108 సహాయంతో నిడుబ్రోలు సీహెచ్సీకి తరలించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. -
చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు.. భూమనకు నోటీసులు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి ఎస్వీ వర్శిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎస్వీ గోశాలలో గోవుల మరణాలపై అసత్య ప్రచారం చేశారంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలంటూ భూమనకు నోటీసులు జారీ చేశారు. -
విహంగాల విహారం
దొరవారిసత్రం: ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాలకు అతి పెద్ద సంతానోత్పత్తి కేంద్రంగా బాసిల్లుతున్న తిరుపతి జిల్లాలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విహంగాల ఆగమనం మొదలైంది. దీంతో పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నీటితో నిండి ఉంటే ఈ పాటికే అన్ని రకాల పక్షుల విచ్చేసి వాటి పనుల్లో నిమగ్నమై ఉండాలి. కాని ఈ దఫా విహంగాల సీజన్(అక్టోబర్లో మొదలై ఏప్రిల్లో ముగుస్తుంది) మొదలైనప్పటికీ విదేశీ వలస విహంగాలు సందడి ఆలస్యంగా మొదలైంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో పదుల సంఖ్యలో పక్షుల్లో రారాజుగా పిలిచే గూడబాతుల(పెనికాన్స్)తోపాటు తెల్లకంకణాయిలు(వైట్ ఐబీస్) వందల సంఖ్యలో నత్తగుళ్లకొంగలు విచ్చేసినట్లు స్థానిక వన్యప్రాణి విభాగం సిబ్బంది తెలియజేశారు. పక్షుల కేంద్రంలో ఈపాటికే... వర్షాలు సకాలంలో కురిసి ఉంటే పక్షుల కేంద్రం పరిధిలోని అత్తిగుంట చెరువు, నేరేడుగుంట చెరువు, మారేడుగుంట చెరువుల్లో నీరు చేరి ఉంటే వలస విహంగాల్లో ప్రధాన పక్షులు అన్ని ఈ పాటికే చేరి, చెరువుల్లో ఉన్న కడప చెట్లపై చేరి ఆడ, మగ పక్షులు ఒకదాని ఒక్కటి స్నేహం కుదుర్చుకుని పుల్లలతో గూళ్లు కట్టుకుంటూ ఉండాలి. కాని వానలు సక్రమంగా కురవకపోవడంతో వలస విహంగాల సీజన్ ఆలస్యం కాకతప్పలేదు. ఇప్పుడైన పుష్కలంగా వానలు కురవందే వలస విహంగా పూర్తి స్థాయిలో కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉండదు.ఇప్పటి వరకు కురిసిన వానలకు చెరువుల్లోకి అరకొరగానే సాగు నీరు చేరాయి. కేంద్రంలో విదేశీ వలస విహంగాలకు పూర్తి స్థాయిలో వాతవరణం అనుకూలిస్తేనే వేల సంఖ్యలో గూడబాతులు, నత్తగుళ్లకొంగలు, తెల్లకంకణాయిలు, స్వాతికొంగలు, వందల సంఖ్యలో తెడ్డుముక్కుకొంగలు, నీటికాకులు, బాతుజాతికి చెందిన పలు రకాల పక్షుల విచ్చేసి వాటి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోలేవు. స్వదేశీ విహంగాలైన నత్తగుళ్లకొంగలు పక్షుల కేంద్రంలోకి గత నెలలోనే వందల సంఖ్యలో విచ్చేశాయి. ఈపక్షుల్లో కొన్ని జత కట్టె పనుల్లో ఉండగా మరి కొన్ని కడప చెట్లపై గూళ్లు కట్టుకునే పనిలో ఉన్నాయి. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 82,136 మంది స్వామివారిని దర్శించుకోగా 29,023 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుపతి చేరుకున్న కల్వకుంట్ల కవిత...తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(mlc-kalvakuntla-kavitha) తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర నేపథ్యంలో తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కవిత తిరుపతి చేరుకున్నారు. తన భర్త అనిల్, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారితో కలిసి శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతి(tirupati) కి ప్రయాణమయ్యారు. కవితకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.. శనివారం హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు కవిత. -
మద్యం మత్తులో యువకుల హల్చల్
-
Tirupati: విద్యార్థి ప్రాణం తీసిన నకిలీ మద్యం
-
బొజ్జల సుధీర్ను ప్రశ్నిస్తూ పోస్టు.. జనసేన నేత అరెస్ట్
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తిరుపతిలోని(Tirupati) వెంకటగిరిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై(Bojjala Sudhir Reddy) పోస్ట్ పెట్టినందుకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, టీడీపీ, జనసేన మధ్య రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు అరెస్ట్ను అతడి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.తిరుపతిలో కూటమి రాజకీయం మరో మలుపు తిరిగింది. కొద్దిరోజుల క్రితం శ్రీకాళహస్తి మాజీ జనసేన(janasena) ఇన్చార్జ్ కోటా వినుతకు(Kota Vinutha) న్యాయం చేయాలి అని సోషల్ మీడియా వేదికగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పోస్ట్ పెట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. దీంతో, ఆ పోస్టు వైరల్గా మారింది. సుధీర్ రెడ్డి వ్యతిరేకంగా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. అనంతరం, కూటమి ఎమ్మెల్యేపైనే పోస్టు చేశారన్న కారణంగా జనసేన నేత వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇలా పోస్టు పెట్టినందుకే అరెస్ట్ చేస్తారా?.. ఏంటి ఈ అన్యాయం అని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా.. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా(Vinutha Kotaa) అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి(bojjala sudheer reddy) తన ద్వారా వినుత.. ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలన చర్చకు దారి తీసింది.ఈ క్రమంలో.. వినుత కోట తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారు. మనసునిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేక పోయినా.. మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది. రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది. కాబట్టే 19 రోజుల్లో బెయిల్ ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. .. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను. ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు శివయ్యకు తెలుసు. ధైర్యంగా పోరాడుతాం. ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్తో బయటకు వస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టే.. మీడియా ముందుకు రాలేక పోతున్నాను. కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యమేవ జయతే. జై హింద్ అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలుగానీ, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ రాయుడు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పడం చర్చనీయాంశమైంది. -
నకిలీ మద్యంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా?: భూమన అభినయ్
సాక్షి, తిరుపతి: సోషల్ మీడియాలో చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారంటూ వైఎస్సార్సీపీ నార్త్ క్లస్టర్ విభాగం అధ్యక్షుడు నవీన్ను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్రెడ్డి, ఆ పార్టీ నేతలు అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. భూమన అభినయ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యంపై తప్పులు ఎత్తి చూపిస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులతో పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే నవీన్పై కేసు పెట్టారన్నారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుపై అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఒక తీవ్రవాదిని బంధించినట్టు పది మంది పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది?. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ నాయకులు భయపడే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని అభినయ్రెడ్డి పేర్కొన్నారు. -
ఏపీ పోలీసులపై మరోసారి హైకోర్టు సీరియస్
సాక్షి,విజయవాడ: పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి రికార్డులు సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసు శాఖను మూసేయాలి. డీజీపీ నిద్రపోతున్నారా?. కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం తెలీదా అంటూ ధ్వజమెత్తింది. పరకామణి వ్యవహారంలో నిందితులకు సహకరిస్తున్నారని మండిపడింది.ఇప్పటికే నిందితులు సాక్షాలను తారుమారు చేసే ఉంటారు. అయినా మీరు చోద్యం చేస్తున్నారంటూ హైకోర్టు విమర్శలు గుప్పించింది. ఈ కేసులో మీ నిర్లక్ష్యం చాలా విషయాలు చెబుతోంది. మీకు నిజాయితీ ఉండి ఉంటే వెంటనే కోర్టుకు వచ్చేవాళ్లు.సీఐడీలో ఐజీ ర్యాంకు అధికారి లేకుంటే.. మరో అధికారితో పనిచేయించుకోవచ్చుగా? మేము కేవలం రికార్డులను సీజ్ మాత్రమే కదా ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేసే వారెవరు సీఐడీలో లేరా?.ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే మేం నిందించాలి. పోలీసుల తీరుపై అసంతృప్తిగా ఉన్నామంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎస్వీ యూనివర్సిటీలో మళ్లీ చిరుత కలకలం
సాక్షి, తిరుపతి: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత పులి సంచారం కలకలం రేపింది(Leopard Spotted SV University). శుక్రవారం రాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచరించడంతో విద్యార్థులు, సిబ్బంది హడలిపోయారు. సీసీ కెమెరాలో దాని సంచారం రికార్డైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు దానిని బంధించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ఏడాది ఆగస్టులోనూ క్యాంపస్ పరిధిలో చిరుత సంచరించడంతో అంతా వణికిపోయారు. అయితే ఏడీ బిల్డింగ్ వెనుక ఏర్పాటు చేసిన బోనులో అది చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మరోసారి చిరుత కలకలం రేగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యార్థులు బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేశారు. ఇదీ చదవండి: మందుపాతరలతో సహజీవనం! -
ఛీ.. తు.. సిగ్గు, శరం లేని సీఎం..! ఇంకెంత మంది తాళి తెంచుతావ్..!
-
మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా
-
శ్రాద్ధకర్మల రోజు వేద ఆశీర్వచనమా?: టీటీడీ చైర్మన్పై భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: శ్రీవేంకటేశ్వర స్వామికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) తీరని ద్రోహం చేస్తున్నారని.. ఎప్పుడు ఎలా ఉండాలో తెలియక ఆలయ మర్యాదలను మంటలో కలుపుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి(Bhumana Karunakar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ అదనపు జేఈవో వెంకయ్య చౌదరి తండ్రి చలమయ్య పెద్దకర్మకు వెళ్లి బీఆర్ నాయుడు పరామర్శించిన తీరు.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామంపై సోమవారం తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీఆర్ నాయుడి మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. కానీ, ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకంగా ఉంటోంది. పవిత్ర భాగవత వస్త్రాన్ని కర్మ రోజు వెంకయ్య చౌదరికి కప్పారు. పరివట్టం కట్టి, లడ్డూ శ్రాద్ధకర్మల రోజు వెంకయ్య చౌదరికి అందించారు. శ్రార్దకర్మల రోజు వేద ఆశీర్వచనం ఇవ్వడమేంటీ?. ఎప్పుడు ఎలా ఉండాలో.. ఏ వస్త్రం కప్పాలో కూడా బీఆర్ నాయుడికి తెలియదు. వధువు, విదవకు తేడా తెలియని వ్యక్తి బీఆర్ నాయుడు’’ అని భూమన అభ్యంతరాలు వ్యక్తం చేశారు... ప్రసాదాల దిట్టం పెంచడం లేదని ఎల్లో మీడియాలోనే వార్త వచ్చింది. రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి స్వామివారిని వాడుకుంటున్నారు. జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రభస చేశారు. మరి ఆ సంస్థలో బీఆర్ నాయుడు భాగస్వామిగా ఉన్నారా? శ్రీ వెంకటేశ్వర స్వామికి బీఆర్ నాయుడు ద్రోహం చేస్తున్నాడు. ఆలయ పవిత్రతతను ధ్వంసం చేస్తున్నారు. అర్హత లేనివారికి అధికారమిస్తే అర్థరాత్రి గొడుగు పట్టకోమన్నాడట.. అలా ఉంది బీఆర్ నాయుడి తీరు అని భూమన ఎద్దేవా చేశారు.వైసీపీ పోరాటం వల్లే..ఏపీలో అన్ని వైన్ షాపుల్లో దొరికేది కల్తీ మద్యమే(AP Liquor Mafia). కూటమి పాలనలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. టీడీపీ, జనసేన నేతలు ఈ దందాను నడిపిస్తున్నారు. నకిలీ మద్యాన్ని టీడీపీ నేతలు పల్లెపల్లెకూ పంపించారు. ప్రతిచోటా ఏదో కుటీర పరిశ్రమలా.. నకిలీ మద్యం కోసం కేంద్రాలు ఏర్పాటు చేశారు. పైగా లిక్కర్ కేసు అంటూ మాపై అసత్య ప్రచారం చేశారు. మా నేతలను జైల్లో పెట్టారు. చివరకు మా పోరాటం వల్లే ములకలచెరువు మద్యం ఇష్యూ బయటపడింది అని భూమన అన్నారు. -
తిరుపతికి ఉగ్రవాదుల బాంబు బెదిరింపులు
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. ‘హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్’ పేరిట మెయిల్స్ వచ్చాయి. ఉగ్రవాదుల బాంబు బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేపట్టాయి. భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్, విష్ణు నివాసం ప్రాంతాల వద్ద ప్రత్యేక బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు.వివిధ రాష్ట్రాలలో బాంబులు పెట్టినట్లు కొన్ని ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు అందుతున్నాయి. తిరుపతి జిల్లాకి కూడా ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో, జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి భయభ్రాంతులకు గురికావొద్దని ఎస్పీ తెలిపారు.తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం, గవర్నర్ ఆర్ఎన్ రవి భవనం, సినీనటి త్రిష నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబు స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. తమిళనాడులోని పలు రాజకీయ, సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపు కాల్స్ నేపథ్యంలో.. తిరుపతిలోని పోలీసు ప్రత్యేక విభాగం అలర్ట్ అయ్యింది. -
అల్ట్రావయోలెట్ ఎక్స్పీరియన్స్ సెంటర్: ఇప్పుడు తిరుపతిలో..
బెంగళూరుకు చెందిన అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ దేశీయ మార్కెట్లో.. కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడమే కాకుండా, తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఒక లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది. దీంతో సంస్థ 26 నగరాల్లో తన పాదముద్రను బలోపేతం చేసింది.తిరుపతిలో ప్రారంభమైన అల్ట్రావయోలెట్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో.. సేల్స్, సర్వీస్ వంటి వాటితో పాటు విడిభాగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎక్స్-47 క్రాస్ఓవర్, ఎఫ్77, ఎఫ్77 సూపర్ స్ట్రీట్ బైకులు ఉన్నాయి. ఈ కొత్త సెంటర్ ప్రారంభోత్సవం సమయంలో సీఈఓ నారాయణ్ మాట్లాడుతూ.. ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా కొత్త బైకులను కొనుగోలు చేయవచ్చు. టెస్ట్ రైడ్లు, సర్వీస్ వంటివి కూడా పొందవచ్చని అన్నారు. -
రూ.1,243 కోట్లతో తిరుపతి ఐఐటీ అభివృద్ధి
ఏర్పేడు: తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్లో రూ.1,243 కోట్లతో చేపట్టిన ఫేజ్–బి అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్గా ప్రారంభించారు. మొత్తం రూ.60 వేల కోట్లతో ఎనిమిది ఐఐటీలతోపాటు, వివిధ రాష్ట్రాల అభివృద్ధి పనులకు ఒడిశా రాష్ట్రం ఝార్సుగూడ నుంచి ఆయన వర్చువల్గా శ్రీకారం చుట్టారు. తిరుపతిలో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి హాజరై ఐఐటీ యాజమాన్యం, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఐఐటీల్లో తిరుపతి ఐఐటీ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సెమీకండక్టర్లు, శక్తి నిల్వ వంటి రంగాలలో జరుగుతున్న ముఖ్యమైన పరిశోధన కార్యకలాపాల గురించి వివరించారు. ఇక్కడ భవన నిర్మాణాలు మాత్రమే జరగటంలేదని, యువత ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం జరుగుతోందన్నారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఐఐటీ కేంద్ర బిందువుగా మారుతుందన్నారు. రెండో దశలో 2,500 మందికి పైగా విద్యార్థులకు ఇక్కడ ఉన్నతస్థాయి వసతులు సమకూరుతాయన్నారు.ఈ ప్రాంత రైతుల పంట ఉత్పత్తులకు ప్రోత్సాహకంగా తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పడం సంతోషకరమన్నారు. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ దార్శనికతతో తిరుపతి ఐఐటీ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ఫేజ్–బిలో కలి్పంచే సదుపాయాలివే..తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. రూ.1,243 కోట్ల ఫేజ్–బి నిధులతో ఈ ఐఐటీలో మూడు అకడమిక్ బ్లాక్స్, ఒక మెగా ఇండోర్ ఆడిటోరియం, ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ సదుపాయాలు రాబోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ క్యాంపస్లో 1,800 మందికి వసతి సదుపాయం ఉందని, ఈ ఫేజ్–బి పనులు 2029కల్లా పూర్తిచేయగలిగితే మరో 2,650 మంది విద్యార్థులకు వసతి కలగనుందని తెలిపారు. ఐఐటీ ఇన్చార్జి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీన్ ఎ. మురళీకృష్ణ పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నిర్మాణ ప్లానింగ్ను వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీడబ్ల్యూసీ ఈడీ, ప్రాజెక్టు ఇన్చార్జి బీఎస్ రెడ్డి, బ్రిగేడియర్ డాక్టర్ కృష్ణకుమార్, ఐఐటీ రిజి్రస్టార్లు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర హోంమంత్రి అమిత్షా, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయికి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. తిరుమల పరకామణి వివాదంపై సీబీఐతో దర్యాప్తు జరపాలని అమిత్ షాను గురుమూర్తి కోరారు. పరకామణి వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయికి విజ్ఞప్తి చేశారు.‘‘పరకామణి వివాదానికి ఏపీ సర్కార్ రాజకీయ రంగు పులుముతోంది. వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో ఆటలాడుతోంది. 100 కోట్ల హిందువుల విశ్వాసాలతో చెలగాటమాడటం దారుణం. వివాదంపై పారదర్శక, నిష్పక్షపాత దర్యాప్తు అవసరం. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. జ్యూడిషియల్ విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి’’ అని సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో గురుమూర్తి పేర్కొన్నారు.‘‘రాజకీయ ప్రతీకారం కోసం తిరుమల పరకామణి వివాదాన్ని టీడీపీ ప్రభుత్వం వాడుకుంటుంది. ఏపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దేవాలయ ప్రతిష్టను మంటగలిపేందుకు విమర్శలు చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలతో ఆటలాడుతున్నారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి. నిష్పక్షపాత పారదర్శక విచారణతోనే సత్యం బయటపడుతుంది. రాజకీయ దురుద్దేశాలకు చెక్ పడుతుంది. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు జరిపి భక్తుల విశ్వాసాలను కాపాడాలి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. -
తిరుమలలో మరోసారి తొక్కిసలాట
-
రుచి.. శుచి... వెంకన్న నైవేద్యం
తిరుమలేశుడు భక్త సులభుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా! అందుకే ఆయన ప్రసాదాలు ప్రత్యేకం. తిరుమలేశుని ప్రసాదం అంటే కేవలం లడ్డు, వడలే కాదు.. దోసెలు, పోలి (పూర్ణం భక్ష్యాలు), జిలేబి, తేనెతొల, సుఖియం, అప్పం, కేసరిబాత్, పాయసం, సీరా వంటివెన్నో స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాల రుచి, నాణ్యత మరెక్కడా లభించవు.మూలమూర్తికి మూడు సార్లు నైవేద్యం గర్భాలయ మూలమూర్తికి రోజుకు మూడుసార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 5 తర్వాత మొదటిగంటలో ఒకసారి, ఉదయం 10 గంటల్లోపే (మధ్యాహ్న నైవేద్యం అంటారు) మరోసారి, రాత్రి 7 గంటలకు ఒకసారి ప్రసాద సమర్పణ ఉంటుంది.మాతృ దధ్యోదనమంటే స్వామికి మహా ఇష్టం. కులశేఖరపడి దాటుకుని గర్భాలయంలోకి వెళ్లేది చిక్కటి మీగడతో కూడిన ‘మాతృదధ్యోదనం’ మాత్రమే. అది కూడా సగం పగిలిన కొత్త మట్టి ఓడులోనే పెడతారు. చివరగా ఏకాంత సేవ సమయంలో వివిధ ఫలాలు, చక్కెర, తేనెతో తయారు చేసిన ‘మేవా’, చక్కెర, జీడిపప్పు, బాదంపలుకులు, ఎండుద్రాక్ష, ఏలకులు, గసగసాలు, ఎండుకొబ్బరి ముక్కలతో తయారు చేసిన ‘పంచకజ్జాయం’, చక్కెరతో కలిపిన వేడిపాలను నివేదిస్తారు. వకుళ మాత సమక్షంలోనే..! గర్భాలయానికి ఆగ్నేయ మూలలోగల వంటశాల (పోటు)లో కొలువైన శ్రీనివాసుని తల్లి వకుళమాలిక విగ్రహం వద్ద కొంత సమయం ఉంచిన తర్వాతే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ‘గమేకార్లు’(వంట పరిచారకులు) భక్తిశ్రద్ధ్దలతో, శుచిగా పోటులో అన్నప్రసాదాలు వండుతారు.లడ్డు, వడ, అప్పం, దోసె, పోళి, సుఖియం, మురుకు, జిలేబి వంటి పిండి ప్రసాదాలు (పనియారాలు) వెండివాకిలికి బయట సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన ‘పోటుతాయారు’ అమ్మవారి విగ్రహం సమక్షంలో తయారు చేస్తారు. వారపు సేవల్లో భాగంగా సోమవారం విశేష పూజలో పెద్ద వడలు, లడ్డూలు, అన్నప్రసాదాలు, బుధవారం సహస్ర కలశాభిషేకంలో ప్రత్యేకంగా క్షీరాన్నంతోపాటు మిగిలిన అన్నప్రసాదాలు, గురువారం తిరుప్పావడ సేవలో మొత్తం 450 కిలోల బియ్యంతో తయారు చేసిన పులిహోర, జిలేబీలు, పెద్దమురుకులు (తేనెతొల) నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక శుక్రవారం నాడు పోళీలు(పూర్ణం భక్ష్యాలు), సుఖియం (ఉండ్రాళ్లు), ఆదివారం మాత్రం ‘ఆదివారం ప్రసాదం’ అనే చలిమిడి ప్రసాదాన్ని నివేదిస్తారు. దీనినే అమృత కలశం అంటారు. స్వామి తర్వాత గరుడాళ్వారుకు సమర్పిస్తారు. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామికి దోసెలు, శెనగపప్పుతో తయారు చేసిన శుండలి(గుగ్గిళ్ళు) సమర్పిస్తారు. వీటితోపాటు పెసరపప్పు పణ్ణారం, పానకం కూడా నివేదిస్తారు. ధనుర్మాస వ్రత సమయంలో అన్నప్రసాదాలతోపాటు ప్రత్యేకంగా ‘బెల్లపు దోసె’ను ప్రియంగా ఆరగిస్తాడు స్వామి.అందువల్లే ఆ నాణ్యత, రుచి..!1951వ సంవత్సరంలో ఈ ప్రసాదాల తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ‘దిట్టం’ (కొలత) కొలమానంగా నిర్ణయించింది. తర్వాత పలుమార్లు దిట్టాన్ని సవరించారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టం ప్రకారం ప్రసాదాలు తయారు చేస్తున్నారు. మూడు రుచుల్లో శ్రీవారి లడ్డూలు తిరుపతి లడ్డూలు మూడు రకాలుగా తయారు చేస్తున్నారు. వీటిలో ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డూ.ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు, పర్వదినాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలా.. అతిముఖ్యమైన వ్యక్తులు ఆలయాన్ని సందర్శించిన సందర్భాల్లో ఆస్థానం లడ్డూ తయారు చేస్తారు. దీని బరువు 750 గ్రాములు. దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమపువ్వు వేసి ఈ లడ్డూను ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. వీటిని గౌరవ అతిథులకు అందజేస్తారు. సామాన్యులకు అంతసులువుగా లభించదు. ఇక స్వామివారి నిత్య కల్యాణోత్సవ సేవలో పాల్గొనే గృహస్తులకు ప్రత్యేకమైన కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా ఇస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే చాలా రుచిగా ఉంటుంది. మూడవది 175 గ్రాముల ప్రోక్తం లడ్డూ. ఇది భక్తులందరికీ లభించే లడ్డూ.దర్శనం తర్వాత వెండివాకిలి దాటుకుని వెలుపలకు వచ్చే భక్తులకు ఉదయం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు వివిధ రకాల ప్రసాదాలు వితరణ చేస్తారు. -
ప్రభుత్వం, టీటీడీ వైఫల్యం వల్లే తొక్కిసలాట: వరుదు కళ్యాణి
-
ఆడబిడ్డకు మరణశాసనం!
శ్రీకాళహస్తికి చెందిన ఓ జంటకు గతేడాది వివాహం జరిగింది. గర్భం దాల్చడంతో కుటుంబ పెద్దల లింగ నిర్ధారణ పరీక్షల కోసం స్థాకంగా ఉన్న ఓ డాక్టర్ను సంప్రదించారు. తమకు తొలి సంతానం పురుషుడు కావాలని చెప్పారు. వెంటనే ఆ వైద్యుడు ఆమెకు పరీక్షలు నిర్వహించి కడుపులో పెరుగుతోంది బాలిక ఆనవాళ్లు అని నిర్ధారించి కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో లింగ నిర్ధారణకు రూ. 45 వేలు, గర్భస్రావానికి సుమారు రూ. 35 వేలు దండుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారులు ఆ డాక్టర్పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నాయుడుపేటకు చెందిన ఓ జంటకు ఇప్పటికే ఇద్దరు బాలికలు పుట్టారు. తమకు వంశోద్ధారకుడు కావలంటూ మూడవసారి ప్రెగ్నెన్సీ కావడంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. దీంతో మూడవ సారి సైతం బాలిక పుట్టే ఆనవాళ్లు ఉన్నాయంటూ సంబంధిత పరీక్షా కేంద్రాలకు చెందిన డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆమెకు గర్భస్రావం చేయాలని బంధువులు కోరారు. దీంతో పరీక్షించి డాక్టర్లు ఆ మాతృమూర్తి బంధువుల నుంచి వేలకు వేలు దండుకుని పని పూర్తి చేశారు.అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..అర్ధాంగిగా.. చెయ్యిపట్టి నడిపించే ఆడబిడ్డకు కడుపులోనే మరణ శాసనం లిఖిస్తున్నారు. ఆడపిల్ల భారమనుకునే రోజుల నుంచి ఆడబిడ్డ కోసం ఎదురుచూసే రోజులు వచ్చినా తిరుపతి జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆడపిల్లల లింగ నిష్పత్తి గణనీయంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భ్రూణ హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లింగ నిర్ధారణ మాఫియా రెచ్చిపోతున్నా వైద్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులోనే జోగుతుండడం విస్మయానికి గురిచేస్తోంది.సాక్షి ప్రతినిధి తిరుపతి : అయ్యో.. మాతృమూర్తుల కడుపులు చిదిమేస్తున్నారే... ప్రెగ్నెస్సీ అయిన నవ వధువులను సైతం వదలకుండా తొలి ప్రసవంలోనే మగబిడ్డ పుట్టాలంటూ స్కానింగ్ చేయించి రక్త ముద్దలపై దాడిచేసి హత్య చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో రోజు రోజుకు విచ్చలవిడిగా బ్రూణ హత్యలకు పాల్పడుతున్నా మామూళ్లకు అలవాటు పడ్డ ప్రభుత్వాధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతితో పాటు, దేశంలోనే పేరొందిన శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో సైతం బాలికల సంఖ్య రోజురోజుకు పడిపోతోంది. లింగనిర్ధారణ పరీక్షా కేంద్రాలు ధనార్జనే ధ్యేయంగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో విచ్చల విడిగా ఏర్పాటు చేసుకుని కోట్ల వ్యాపారం చేసుకుంటున్నారు. అధికారులకు ముడుపులు ముట్టచెప్పి లింగనిర్ధారణ పరీక్షల మాఫియా రెచ్చిపోతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోవడంతో బ్రూణ హత్యలు రోజుకు పదుల సంఖ్యలో జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయంపై వైద్య శాఖలోని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సైతం చర్చించుకుంటున్నారు. పడిపోతున్న బాలికల జనన రేటు జనగణన 2018 ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెయ్యి మంది బాలురకు 922 మంది బాలికలు ఉన్నారు. అదే 2021 లెక్కలకొచ్చేసరికి ఈ సంఖ్య 901కి పడిపోయింది. జిల్లాల విభజన అనంతరం 2024లో జరిగిన జనగణన లెక్కల ప్రకారం తిరుపతి జిల్లాలో బాలికల సంఖ్య స్వల్పంగా పెరిగి 916కు చేరింది. అయితే శ్రీకాళహస్తిలో మాత్రం జిల్లా నిష్పత్తికి వ్యతిరేకంగా నానాటికీ బాలికల నిష్పత్తి తగ్గుతూ వస్తోంది. బాలురు – బాలికల నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసం నమోదైన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తేనే బాలికల నిష్పత్తి పడిపోకుండా ఆపగలమని మేధావులు సూచిస్తున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో తొలి సంతానం మగబిడ్డ పుట్టగానే కుటుంబ నియంత్రణ పాటిస్తున్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మొద్దునిద్రలో వైద్యాధికారులు తిరుపతి జిల్లాలో బాలురు– బాలికల నిష్ఫత్తి దారుణంగా ఉందన్న విషయాన్ని కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో సాక్షాత్తు జిల్లా కలెక్టరే ఈ అంశాన్ని బహిర్గతం చేయడం గమనార్హం. ఆరేళ్లలోపు బాలల్లో బాలికలు అతి తక్కువగా ఉన్న మండలాల్లో తొట్టంబేడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు ఉన్నట్లు సమాచారం. మూడు నెలల కిందట స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో సైతం ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి ఇదే అంశాన్ని లేవనెత్తారు. అయినా వైద్యాధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో పెద్ద ఎత్తున బ్రూణ హత్యలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగ ఎంపిక నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న నిబంధనను అధికార యంత్రాంగం ఆచరణలో పెట్టకపోవడంతో ఆడ నలుసు అమ్మ గర్భంలోనే అంతమైపోయే పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆడ–మగ నిష్పత్తి వెయ్యికి తొమ్మిది వందలు ఉండగా శ్రీకాళహస్తిలో మాత్రం వెయ్యికి 629 మందే ఆడ బిడ్డలే ఉండటం ఇందుకు నిలువెత్తు సాక్ష్యం.వంశోద్ధారకుడు కావాలనే మూఢనమ్మకం.. ముందు మగబిడ్డ పుడితే చాలు.. ఆ తర్వాత ఎవరూ పుట్టినా పర్వాలేదు. మళ్లీ మగ బిడ్డ పుడితే ఇంకా మేలే.. ఒకవేళ ఆడ బిడ్డ పుట్టినా.. కొడుకూ, కూతురు పుట్టిందని సంబర పడిపోతాం.. ఇదీ ప్రస్తుత సమాజంలో పిల్లలు కావాలంకుంటున్న తల్లిదండ్రుల పరిస్థితి. ముందు కొడుకు పుట్టి మరో సంతానంగా కూతురు పుడితే అక్కడితో ఆపేస్తున్నారు. అలా కాకుండా ముందు ఎంత మంది కూతుళ్లు పుట్టినా కొడుకు కోసం కొందరు ఆరాటపడుతున్నారు. ఇంకొందరు కొడుకుల కోసం ఆడ నలుసులను గర్భంలోనే నులిమేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాళహస్తి ప్రాంతంలో వీధికో గాథ బయటపడుతోంది. ఇలా ఆడ నలుసు పురిటిలో కళ్లు కూడా తెరవకముందే బ్రూణ హత్యలకు గురవుతుంటే మరో పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత అంటూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇకనైనా వైద్య శాఖ నిద్ర మేల్కొని లింగ నిర్ధారణ, గర్భ స్రావాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.విచ్ఛలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు పేదల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరుల్లో.. లింగ నిర్ధారణ పరీక్షల నిర్వాహకులు బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో బాలికల నిష్పత్తి లింగ నిర్ధారణ పరీక్షల కారణంగానే గణనీయంగా తగ్గిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని కొన్ని స్కానింగ్ కేంద్రాలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో లింగ నిర్ధారణ పరీక్షకు రూ. 15 నుంచి రూ. 20 వేలు ఫీజులు తీసుకుంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నాయుడుపేట, గూడూరు కేంద్రంగా లింగ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. గూడూరు పట్టణంలోని పేరుగాంచిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైద్యులు, స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్న నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షల పేరుతో కోట్లు గడిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ ఫలితమే బ్రూణ హత్యలకు కారణమవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమై ప్రైవేటు నర్సింగు హోముల్లో, స్కానింగ్ సెంటర్లలో విరివిగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.రూ.కోట్లలో వ్యాపారం లింగ నిర్ధారణ పరీక్షలు అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. దళారులు గర్భిణులను, సంబం«దీకులను గుట్టుగా తిరుపతి, గూడూరు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్లాక ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రికి సమాచారం అందిస్తారు. గర్భిణితో ఎక్కువ మంది రాకుండా, ఆమెతోపాటు మరొకరిని వెంటబెట్టుకుని ప్రత్యేక వాహనంలో తరలిస్తారు. ఆస్పత్రి పేరుగానీ, చిరునామాగానీ ఎలాంటివి చెప్పకుండానే తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించి పుట్టబోయేది ఆడ.. మగ చెప్పి రిపోర్టులు చేతికి ఇవ్వకుండా పంపేస్తున్నారు. గర్భస్రావాలకు ప్రత్యేక ధర లింగ నిర్ధారణ స్కానింగ్ కోసం సుమారు రూ.25 నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తుండగా గర్భస్రావం చేయించేందుకు మరో రేటు తీసుకుంటున్నారు. తిరుపతిలో అయితే రూ.25 వేలు, గూడూరు, శ్రీకాళహస్తి, నాయుడుపేట ఇతర ఆసుపత్రుల్లో రూ.20 వేలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కొన్ని ఆసుపత్రులు ఈ దందాను గుట్టుగా సాగిస్తున్నాయి. గర్భం దాల్చిన 20 వారాల తర్వాత గర్భ విచ్ఛిత్తి చేయడం అత్యంత ప్రమాదకరం.అందుకే ప్రభుత్వాలు కఠిన నిబంధనలు, చట్టాలు తీసుకొచ్చాయి. కొందరు ధనార్జన కోసం ఇష్టారీతిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలతో గర్భస్రావాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ ప్రభావం లింగ నిష్పత్తిపై పడుతోంది. ముఖ్యంగా గూడూరు, తిరుపతి నగరాల్లో ప్రసూతి ప్రైవేటు ఆసుపత్రుల కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కేసులు నమోదు చేస్తాం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దీనిపైన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీలో స్పెషలిస్ట్ డాక్టర్లు జిల్లా అధికారులు నియోజకవర్గ స్థాయి వైద్యాధికారి ఈ కమిటీలో ఉంటారు. సమగ్రంగా దీనిపైన విచారించి ఒక నెల రోజుల్లో కలెక్టర్ కు నివేదిక సమర్పిస్తాం. గతంలో ఈ విధంగా స్కానింగ్ చేస్తూ దొరికిన ఓ ప్రైవేటు ఆసుపత్రిని సీజ్ చేసి మిషన్లు కూడా స్వా«దీనం చేసుకున్నాం. వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. తప్పు చేసినట్టు తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లింగనిర్ధార ణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తాం. – డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీఎంహెచ్ఓ, తిరుపతి -
తిరుపతిలో కుండపోత వర్షం
-
మూడోసారి ఆడపిల్ల.. కడుపులోనే మరణశాసనం రాసిన కుటుంబం
శ్రీకాళహస్తికి చెందిన ఓ జంటకు గతేడాది వివాహం జరిగింది. గర్భం దాల్చడంతో కుటుంబ పెద్దల లింగ నిర్ధారణ పరీక్షల కోసం స్థాకంగా ఉన్న ఓ డాక్టర్ను సంప్రదించారు. తమకు తొలి సంతానం పురుషుడు కావాలని చెప్పారు. వెంటనే ఆ వైద్యుడు ఆమెకు పరీక్షలు నిర్వహించి కడుపులో పెరుగుతోంది బాలిక ఆనవాళ్లు అని నిర్ధారించి కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో లింగ నిర్ధారణకు రూ. 45 వేలు, గర్భస్రావానికి సుమారు రూ. 35 వేలు దండుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారులు ఆ డాక్టర్పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నాయుడు పేటకు చెందిన ఓ జంటకు ఇప్పటికే ఇద్దరు బాలికలు పుట్టారు. తమకు వంశోద్ధారకుడు కావలంటూ మూడవసారి ప్రెగ్నెన్సీ కావడంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. దీంతో మూడవ సారి సైతం బాలిక పుట్టే ఆనవాళ్లు ఉన్నాయంటూ సంబంధిత పరీక్షా కేంద్రాలకు చెందిన డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆమెకు గర్భస్రావం చేయాలని బంధువులు కోరారు. దీంతో పరీక్షించి డాక్టర్లు ఆ మాతృమూర్తి బంధువుల నుంచి వేలకు వేలు దండుకుని పని పూర్తి చేశారు.అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..అర్ధాంగిగా.. చెయ్యిపట్టి నడిపించే ఆడబిడ్డకు కడుపులోనే మరణ శాసనం లిఖిస్తున్నారు. ఆడపిల్ల భారమనుకునే రోజుల నుంచి ఆడబిడ్డ కోసం ఎదురుచూసే రోజులు వచ్చినా జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆడపిల్లల లింగ నిష్పత్తి గణనీయంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భ్రూణ హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లింగ నిర్ధారణ మాఫియా రెచ్చిపోతున్నా వైద్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులోనే జోగుతుండడం విస్మయానికి గురిచేస్తోంది.సాక్షి ప్రతినిధి తిరుపతి : అయ్యో.. మాతృమూర్తుల కడుపులు చిదిమేస్తున్నారే... ప్రెగ్నెస్సీ అయిన నవ వధువులను సైతం వదలకుండా తొలి ప్రసవంలోనే మగబిడ్డ పుట్టాలంటూ స్కానింగ్ చేయించి రక్త ముద్దలపై దాడిచేసి హత్య చేస్తున్నారు. జిల్లాలో రోజు రోజుకు విచ్చలవిడిగా బ్రూణ హత్యలకు పాల్పడుతున్నా మామూళ్లకు అలవాటు పడ్డ ప్రభుత్వాధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతితో పాటు, దేశంలోనే పేరొందిన శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో సైతం బాలికల సంఖ్య రోజురోజుకు పడిపోతోంది. లింగనిర్ధారణ పరీక్షా కేంద్రాలు ధనార్జనే ధ్యేయంగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో విచ్చల విడిగా ఏర్పాటు చేసుకుని కోట్ల వ్యాపారం చేసుకుంటున్నారు. అధికారులకు ముడుపులు ముట్టచెప్పి లింగనిర్ధారణ పరీక్షల మాఫియా రెచ్చిపోతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోవడంతో బ్రూణ హత్యలు రోజుకు పదుల సంఖ్యలో జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయంపై వైద్య శాఖలోని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సైతం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు, జిల్లాలో పడిపోతున్న బాలికల జనన రేటు జనగణన 2018 ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెయ్యి మంది బాలురకు 922 మంది బాలికలు ఉన్నారు. అదే 2021 లెక్కలకొచ్చేసరికి ఈ సంఖ్య 901కి పడిపోయింది. జిల్లాల విభజన అనంతరం 2024లో జరిగిన జనగణన లెక్కల ప్రకారం తిరుపతి జిల్లాలో బాలికల సంఖ్య స్వల్పంగా పెరిగి 916కు చేరింది. అయితే శ్రీకాళహస్తిలో మాత్రం జిల్లా నిష్పత్తికి వ్యతిరేకంగా నానాటికీ బాలికల నిష్పత్తి తగ్గుతూ వస్తోంది. బాలురు – బాలికల నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసం నమోదైన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తేనే బాలికల నిష్పత్తి పడిపోకుండా ఆపగలమని మేధావులు సూచిస్తున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో తొలి సంతానం మగబిడ్డ పుట్టగానే కుటుంబ నియంత్రణ పాటిస్తున్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. లేకుంటే పిండ దశలోనే చిదిమేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మొద్దునిద్రలో వైద్యాధికారులు జిల్లాలో బాలురు– బాలికల నిష్ఫత్తి దారుణంగా ఉందన్న విషయాన్ని కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో సాక్షాత్తు జిల్లా కలెక్టరే ఈ అంశాన్ని బహిర్గతం చేయడం గమనార్హం. ఆరేళ్లలోపు బాలల్లో బాలికలు అతి తక్కువగా ఉన్న మండలాల్లో తొట్టంబేడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు ఉన్నట్లు సమాచారం. మూడు నెలల కిందట స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో సైతం ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి ఇదే అంశాన్ని లేవనెత్తారు. అయినా వైద్యాధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో పెద్ద ఎత్తున బ్రూణ హత్యలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగ ఎంపిక నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న నిబంధనను అధికార యంత్రాంగం ఆచరణలో పెట్టకపోవడంతో ఆడ నలుసు అమ్మ గర్భంలోనే అంతమైపోయే పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆడ–మగ నిష్పత్తి వెయ్యికి తొమ్మిది వందలు ఉండగా శ్రీకాళహస్తిలో మాత్రం వెయ్యికి 629 మందే ఆడ బిడ్డలే ఉండటం ఇందుకు నిలువెత్తు సాక్ష్యం.వంశోద్ధారకుడు కావాలనే మూఢ నమ్మకం.. ముందు మగబిడ్డ పుడితే చాలు.. ఆ తర్వాత ఎవరూ పుట్టినా పర్వాలేదు. మళ్లీ మగ బిడ్డ పుడితే ఇంకా మేలే.. ఒకవేళ ఆడ బిడ్డ పుట్టినా.. కొడుకూ, కూతురు పుట్టిందని సంబర పడిపోతాం.. ఇదీ ప్రస్తుత సమాజంలో పిల్లలు కావాలంకుంటున్న తల్లిదండ్రుల పరిస్థితి. ముందు కొడుకు పుట్టి మరో సంతానంగా కూతురు పుడితే అక్కడితో ఆపేస్తున్నారు. అలా కాకుండా ముందు ఎంత మంది కూతుళ్లు పుట్టినా కొడుకు కోసం కొందరు ఆరాటపడుతున్నారు. ఇంకొందరు కొడుకుల కోసం ఆడ నలుసులను గర్భంలోనే నులిమేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాళహస్తి ప్రాంతంలో వీధికో గాథ బయటపడుతోంది. ఇలా ఆడ నలుసు పురిటిలో కళ్లు కూడా తెరవకముందే బ్రూణ హత్యలకు గురవుతుంటే మరో పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత అంటూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇకనైనా వైద్య శాఖ నిద్ర మేల్కొని లింగ నిర్ధారణ, గర్భ స్రావాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గర్భస్రావాలకు ప్రత్యేక ధర లింగ నిర్ధారణ స్కానింగ్ కోసం సుమారు రూ.25 నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తుండగా గర్భస్రావం చేయించేందుకు మరో రేటు తీసుకుంటున్నారు. తిరుపతిలో అయితే రూ.25 వేలు, గూడూరు, శ్రీకాళహస్తి, నాయుడుపేట ఇతర ఆసుపత్రుల్లో రూ.20 వేలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కొన్ని ఆసుపత్రులు ఈ దందాను గుట్టుగా సాగిస్తున్నాయి. గర్భం దాలి్చన 20 వారాల తర్వాత గర్భ విచ్ఛిత్తి చేయడం అత్యంత ప్రమాదకరం. అందుకే ప్రభుత్వాలు కఠిన నిబంధనలు, చట్టాలు తీసుకొచ్చాయి. కొందరు ధనార్జన కోసం ఇష్టారీతిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలతో గర్భస్రావాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ ప్రభావం లింగ నిష్పత్తిపై పడుతోంది. ముఖ్యంగా గూడూరు, తిరుపతి నగరాల్లో ప్రసూతి ప్రైవేటు ఆసుపత్రుల కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కేసులు నమోదు చేస్తాం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దీనిపైన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీలో స్పెషలిస్ట్ డాక్టర్లు జిల్లా అధికారులు నియోజకవర్గ స్థాయి వైద్యాధికారి ఈ కమిటీలో ఉంటారు. సమగ్రంగా దీనిపైన విచారించి ఒక నెల రోజుల్లో కలెక్టర్ కు నివేదిక సమరి్పస్తాం. గతంలో ఈ విధంగా స్కానింగ్ చేస్తూ దొరికిన ఓ ప్రైవేటు ఆసుపత్రిని సీజ్ చేసి మిషన్లు కూడా స్వా«దీనం చేసుకున్నాం. వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. తప్పు చేసినట్టు తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లింగనిర్ధార ణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తాం. – డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీఎంహెచ్ఓ, తిరుపతిరూ.కోట్లలో వ్యాపారం లింగ నిర్ధారణ పరీక్షలు అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. దళారులు గర్భిణులను, సంబం«దీకులను గుట్టుగా తిరుపతి, గూడూరు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్లాక ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రికి సమాచారం అందిస్తారు. గర్భిణితో ఎక్కువ మంది రాకుండా, ఆమెతో పాటు మరొకరిని వెంటబెట్టుకుని ప్రత్యేక వాహనంలో తరలిస్తారు. ఆస్పత్రి పేరుగానీ, చిరునామాగానీ ఎలాంటివి చెప్పకుండానే తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించి పుట్టబోయేది ఆడ.. మగ చెప్పి రిపోర్టులు చేతికి ఇవ్వకుండా పంపేస్తున్నారు. విచ్ఛలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు పేదల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరుల్లో.. లింగ నిర్ధారణ పరీక్షల నిర్వాహకులు బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో బాలికల నిష్పత్తి లింగ నిర్ధారణ పరీక్షల కారణంగానే గణనీయంగా తగ్గిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని కొన్ని స్కానింగ్ కేంద్రాలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో లింగ నిర్ధారణ పరీక్షకు రూ. 15 నుంచి రూ. 20 వేలు ఫీజులు తీసుకుంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నాయుడుపేట, గూడూరు కేంద్రంగా లింగ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. గూడూరు పట్టణంలోని పేరుగాంచిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైద్యులు, స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్న నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షల పేరుతో కోట్లు గడిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ ఫలితమే బ్రూణ హత్యలకు కారణమవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమై ప్రైవేటు నర్సింగు హోముల్లో, స్కానింగ్ సెంటర్లలో విరివిగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
టీసీ కోసం పీజీ విద్యార్థి అర్ధనగ్న ప్రదర్శన
తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. రూ.6,400 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా పెండింగ్లో ఉంచింది. దీంతో వేలాది మంది విద్యార్థులు కాలేజీల నుంచి ధ్రువపత్రాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. 2024–25 సంవత్సరంలో పీజీ పూర్తి చేసి, బీఈడీ చదవాలనుకున్న విద్యార్థి వినోద్ కుమార్ తన టీసీ కోసం కళాశాలకు వచ్చాడు. ఫీజు బకాయి ఉందని చెప్పి కాలేజీ అధికారులు అతనికి టీసీ ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి నిరసనగా ఆ విద్యార్థి అర్ధనగ్నంగా ప్రిన్సిపాల్ కార్యాలయంలో కూర్చొని ఆందోళన చేశాడు. తన తల్లిదండ్రులు కూలీలని, ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తుందనే నమ్మకంతో కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ చదివానని, కళాశాలలో చేరేటప్పుడు కూడా అలాట్మెంట్æ కాపీలో ఫీజు ప్రభుత్వం ఇస్తుందని అప్పటి అధికారులు తెలిపారని వాపోయాడు. తీరా చూస్తే ప్రభుత్వం ఇవ్వలేదని కారణం చూపి విద్యార్థుల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల కో–ఆర్డినేటర్ అశోక్ కుమార్ ఇతర విద్యార్థులు వినోద్కు మద్దతుగా నిలిచారు. -
తిరుపతిలో వీడని మరణాల మిస్టరీ
-
పోయింది భక్తుల ప్రాణాలే కదా..! సుబ్బారాయుడి విధేయతకు సత్కారం
సాక్షి, అమరావతి: చనిపోయింది ఆరుగురు సామాన్య భక్తులే కదా..! తీవ్రంగా గాయపడింది 40 మంది భక్తులే కదా..! అయినా సరే అందుకు బాధ్యుడైన వీర విధేయ అధికారికి మళ్లీ అక్కడే పోస్టింగ్ ఇద్దాం..! ఇదీ ప్రజలకు భద్రత, రక్షణపై చంద్రబాబు సర్కారు తీరు!! అందుకే ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును తాజాగా మరోసారి తిరుపతి ఎస్పీగా నియమించింది. తిరుమల తిరుపతి పవిత్రత, భక్తుల మనోభావాలు అంటే తమకు ఏమాత్రం లెక్కలేదని మరోసారి నిరూపించింది. రెడ్ బుక్ కుట్ర కేసుల్లో కీలక పాత్రధారి ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ కుటుంబానికి చెందిన ఎల్.సుబ్బారాయుడు ఆ పార్టీకి వీర విధేయుడు! తెలంగాణ కేడర్కు చెందిన ఆయన్ను టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు ఏరికోరి డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. తిరుపతి ఎస్పీగా నియమించారు. రాయలసీమలో రెడ్బుక్ కుట్రను అమలు చేసేందుకే ఆయనకు కీలక పోస్టింగు ఇప్పించినట్టు పోలీసువర్గాలే వ్యాఖ్యానించాయి. అయితే ఎస్పీగా విధి నిర్వహణలో సుబ్బారాయుడు విఫలమయ్యారు. ఈ ఏడాది జనవరి 9న వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియలో ప్రభుత్వ వైఫల్యం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.తిరుమల–తిరుపతి దేవస్థానం చరిత్రలో తొలిసారి తొక్కిసలాట జరిగి ఆరు మంది భక్తులు దుర్మరణం చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్యూలైన్ల నిర్వహణలో వైఫల్యం... గేట్లు మూసివేసి లక్షలాదిమంది భక్తులను రోడ్లపై గంటలతరబడి వేచి ఉండేలా చేయడం... ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి భక్తులు మృత్యువాత పడ్డారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహావేశాలను బేఖాతరు చేస్తూ తమ అస్మదీయ అధికారి సుబ్బారాయుడుకు చంద్రబాబు అండగా నిలిచారు. ఆయన్ను సస్పెండ్ చేయకుండా బదిలీతోనే సరిపెట్టారు. అది కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టాస్్కఫోర్స్ ఎస్పీగా నియమించారు. సిట్ సభ్యుడిగా నియామకం..అంచనాలను అందుకోవడంతో క్లీన్చిట్ అనంతరం వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధించేందుకు నమోదు చేసిన అక్రమ కేసులో సుబ్బారాయుడును అస్త్రంగా చేసుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తుపై నియమించిన సిట్లో సభ్యుడిగా ఆయన్ను నియమించారు. ఈ అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో సిట్ సాగిస్తున్న అరాచకాలు, వేధింపులు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతోపాటు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజం వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను అక్రమంగా అరెస్టు చేసి వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.రెడ్బుక్ కుట్రలను పక్కాగా అమలు చేయడంలో చంద్రబాబు అంచనాలను సుబ్బారాయుడు అందుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తిరుపతి తొక్కిసలాటపై నియమించిన విచారణ కమిటీ సుబ్బారాయుడుకు క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. దీంతో ఆయన్ను మరోసారి జిల్లా ఎస్పీగా నియమించేందుకు మార్గం సుగమమైంది. తొలుత ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీగా నియమించాలని భావించగా తనకు తిరుపతి జిల్లానే కేటాయించాలని సుబ్బారాయుడు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దాంతో టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును ప్రభుత్వం తిరిగి తిరుపతి ఎస్పీగానే నియమించింది.నిక్కచి్చగా పని చేస్తారని పేరున్న హర్షవర్థన్ రాజును అక్కడి నుంచి బదిలీ చేసి ప్రకాశం జిల్లా ఎస్పీగా నియమించింది. గతంలో వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు హర్షవర్థన్ రాజు రెడ్బుక్ కుట్రలకు సహకరించలేదని ఆకస్మికంగా బదిలీ చేసింది. తాజాగా ఏడు నెలల్లోనే ఆయన్ను తిరుపతి నుంచి తప్పించి ఆయన స్థానంలో సుబ్బారాయుడును నియమించింది. -
అడవి మధ్యలో నాలుగు మృతదేహాలు.?
వీళ్లేవరు?..నట్టడివిలోకి ఎలా వచ్చారు..?. ప్రధాన రహదారి నుంచి అరణ్యంలోకి ఎలా చేరుకున్నారు..? పురుషుడికి చెట్టుకు ఉరివేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది...? ఆ పక్కనే ఉన్న మహిళ మృతదేహం ఎవరిది..?. వారికి సమీపంలోనే రెండు మృతదేహాలను పూడ్చిపెట్టిన స్థితిలో ఉన్న గుంతలేంటి..? వీళ్లంతా ఒకే కుటుంబం వారా..?. ఎవరైనా వీళ్లను ఇక్కడకు తీసుకొచ్చి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..?. లేక ఏదైనా కష్టమొచ్చి బలవన్మరణానికి పాల్పడ్డారా..? పాకాల మండల శివారు.. జాతీయ ప్రధాన రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలోని చిట్టడవిలో బయటపడిన మృతదేహాలు ఆదివారం కలకలం రేపాయి..తిరుపతి జిల్లా: ఘటనా స్థలంలో మృతదేహాలు ఉన్న తీరు, పక్కనే రెండు గుంతల్లో మరో రెండు మృతదేహాలను పూడ్చి పెట్టినట్టు ఉన్న గుంతలు.. వాటిపై గుర్తుగా పెట్టిన రాళ్లు.. వీళ్లు ఒకే కుటుంబమా..? అనే అనుమానం కలుగుతోంది. వీరు నట్టడివిలోకి ఎలా వచ్చారు.. ఎలా మృతిచెందారు అనేదానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా.. లేక ఏదైనా కష్టమొచ్చి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిందో తెలియడం లేదు. పాకాల మండలంలో బయటపడిన ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కథనం.. పాకాల మండల పరిధిలోని పవిత్ర హోటల్ వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన రెండు మృతదేహాలను అటవీశాఖ సిబ్బంది గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పవిత్ర హోటల్ నుంచి సుమారు 3కిలో మీటర్ల దూరంలో ఉన్న ఘటనా స్థలానికి సీఐ సుదర్శన్ప్రసాద్ తన సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. అక్కడ ఒక పురుషుడి మృతదేహం చెట్టుకు వేలాడుతోంది. సమీపంలోనే మహిళ మృతదేహం కింద పడి ఉంది. అక్కడే మరో ఇద్దరిని పూడ్చి పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ గుంతలపై గుర్తుగా బండరాళ్లు పెట్టి ఉన్నారు. గుంతలను తవ్వేందుకు ఉపయోగించిన పారను చెట్ల పొదల్లో పడేసి ఉన్నారు. అడవిలో ఏం జరిగింది? పాకాల మండలం శివారు ప్రాంతం అడవిలోని నామాల బండ సమీపం, మూలకుంట వద్ద ఇద్దరి మృతదేహాలతోపాటు చిన్న పిల్లలను గుంతలో పూడ్చి పెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. ఘటనా స్థలంలో పిల్లల దుస్తులు కనిపించాయి.తమిళనాడు వాసులేనా? మృతదేహాల వద్ద ఓ నోకియో ఫోన్ లభించింది. అలాగే కళై సెల్వన్ పేరు మీదున్న తంజావూరు క్రిస్ ఆస్పత్రి ప్రి్రస్కిప్షన్ లభ్యమైంది. మృతులు తమిళనాడు వాసులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నయం కాని జబ్బు ఏదైనా బయటపడిందా..? పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇదిలావుండగా మృతదేహాలు దొరికిన ప్రాంతం పాకాల మండల పరిధిలో లేకపోవడంతో కేసును చంద్రగిరి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. -
పార్టీలో చేరిన తిరుపతిలోని 36వ డివిజన్ కు చెందిన మైనారిటీలు
-
తిరుమల తొక్కిసలాట బాధ్యుడు! రీ పోస్టింగ్ వెనుకాల మతలబ్ ఏంటి?
-
తిరుపతి ఎస్పీగా మళ్లీ సుబ్బారాయుడు
సాక్షి, విజయవాడ: తాజా బదిలీల్లో తిరుపతి ఎస్పీగా మళ్ళీ సుబ్బారాయుడిని చంద్రబాబు సర్కార్ నియమించింది. సుబ్బారాయుడు హయాంలోనే తిరుపతిలో భక్తుల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. సుబ్బారాయుడు నిర్లక్ష్యం, అసమర్థతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. తొక్కిసలాటకి బాధ్యుడిని చేసిన ప్రభుత్వం.. గతంలో బదిలీ చేసింది.జనవరి 9న వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల క్యూలో తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో భక్తుల తొక్కిసలాట సమయంలో ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడికి మళ్లీ అదే పోస్టింగ్ను సీఎం చంద్రబాబు ఇచ్చారు. సీఎం చంద్రబాబు మాజీ సెక్యూరిటీ అధికారిగా సుబ్బారాయుడి పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, తిరుపతి కోసం సుబ్బారాయుడిని మళ్లీ ఏపీకి తెచ్చిన చంద్రబాబు.. హిందు భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా రీపోస్టింగ్ ఇచ్చారు.కాగా, తిరుపతిలో చోటు చేసుకున్న విషాదానికి బాధ్యుడైన తన అస్మదీయ అధికారిని కాపాడేందుకు సీఎం చంద్రబాబు శతవిధాల ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఓ డీఎస్పీ, గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జేఈవో గౌతమిని బదిలీ చేశారు.భక్తుల భద్రతకు ఎస్పీ ప్రధాన బాధ్యత వహించాలి. కానీ ఎస్పీ సుబ్బారాయుడు చంద్రబాబుకు వీర విధేయుడు. తెలంగాణ క్యాడర్కు చెందిన ఆయన్ని వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించేందుకే గతంలో డిప్యుటేషన్పై రాష్ట్రానికి తెచ్చి తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే కొద్ది నెలలుగా ఆయన అక్రమ కేసులతో అరాచకానికి తెర తీశారనే విమర్శలూ ఉన్నాయి. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు అయినప్పటికీ సుబ్బారాయుడిని సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టారు. మళ్లీ ఆయనకు తిరుపతి ఎస్పీగా రీ పోస్టింగ్ ఇచ్చారు. -
గరుడ ఫ్లైఓవర్పై ప్రమాదం.. మోహన్ బాబు వర్సిటీ విద్యార్థి మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ క్రమంలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్ సమీపంలోని గరుడ వారధి ఫ్లైఓవర్పై శనివారం ఉదయం రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న చక్రధర్, వేదాంత్ ఇద్దరూ బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి.. డివైడర్ను ఢీకొట్టింది. దీంతో, విద్యార్థి చక్రధర్(19) అక్కడికక్కడే మృతి చెందగా.. వేదాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమాచారం అందుకున్న తిరుమల ఈస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిద్దరినీ రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు. -
తిరుపతిలో ఇద్దరు మహిళలని కిడ్నాప్ చేసిన కూటమి నేత
-
వైభవంగా పోలేరమ్మ నగరోత్సవం.. కిక్కిరిసిన వెంకటగిరి (ఫొటోలు)
-
గూడూరు రషీద్ హత్య వెనుక లేడీ డాన్ వందన
-
కొత్త దళపతి.. తిరుపతి
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కోరుట్ల: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీని ఆ పార్టీ ఎన్నుకున్నట్టు తెలిసింది. పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతాదళాలతో జరిగిన కాల్పుల్లో మే 21వ తేదీన మరణించారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. మే 21 తర్వాత పొలిట్బ్యూరో, కేంద్ర మిలటరీ కమిషన్ సంయుక్త సమావేశం జరగకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎవరినీ ఎన్నుకోలేదు. తీవ్ర నిర్బంధం ఉన్నా, ఇటీవల జరిగిన సమావేశంలో తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తిరుపతి కేంద్ర మిలటరీ కమిషన్ చీఫ్గా, పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు. తిరుపతి ఎన్నికతో రెండోసారి కరీంనగర్ జిల్లాకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు లభించినట్టు అయ్యింది. పీపుల్స్వార్ నుంచి కొండపల్లి సీతారామయ్యను తప్పించిన తర్వాత కరీంనగర్ జిల్లా బీర్పూర్కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.వృద్ధాప్యం పైబడడంతో ఆయన ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళికి చెందిన నంబాళ్ల కేశవరావు మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్గా వ్యవహరించారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తిప్పరి తిరుపతికి ముప్పాళ్ల లక్ష్మణ్రావుకు ప్రియశిష్యునిగా పార్టీలో పేరుంది. మిలటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరున్న ముఖ్య నేతల్లో ఒకరైన దేవుజీకి ఈ బాధ్యతలు అప్పగించడమే సముచితంగా ఉంటుందని పార్టీ భావించినట్టుగా సమాచారం. దండకారణ్యంలో పార్టీ కార్యకలాపాల నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, రెడ్ కారిడార్ ఏరియాలో చాలా భూభాగాన్ని బలగాలు కైవసం చేసుకున్నాయి.పార్టీ ప్రధాన నాయకులే లక్ష్యంగా బలగాలు ఆపరేషన్లు చేపడుతున్న క్రమంలో ఎదురు దాడులు చేయాల్సిన ఆవశ్యకతను కూడా కేంద్ర కమిటీ నాయకులు గమనించినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే అటు మిలటరీ ఆపరేషన్లు, ఇటు రాజకీయ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉన్న దేవుజీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. కాగా, మడావి హిడ్మాకు మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జ్తోపాటు ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ బాధ్యతలు అప్పగించారు. కమలేశ్ విచారణలో విజయవాడలోని పోరంకికి చెందిన నాగరాజు అలియాస్ కమలేశ్ ఆలియాస్ రామకృష్ణ మావోయిస్టు పార్టీలో 34 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ ఏడాది జూలై 26న ఏపీ పోలీసుల ముందు లొంగిపోయాడు. వారి విచారణలో మావోయిస్టు కొత్త సారథిగా తిరుపతిని ఎన్నుకున్నట్టు కమలేశ్ వెల్లడించాడని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంజినీర్ కావాలనుకొని.. కోరుట్లలోని అంబేడ్కర్నగర్కు చెందిన తిప్పరి వెంకటనర్సయ్య–గంగుబాయి దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్ద కుమారుడైన తిరుపతి చిన్నప్పటి నుంచి చదువులో రాణించేవాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆయన.. 1980లో పదో తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ఇంజినీర్ కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో చేరాడు. అప్పటికే కాలేజీలో ఏబీవీపీ, ఆర్ఎస్యూ విద్యార్థి సంఘాల మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి. ఈ ప్రభావానికి గురైన తిరుపతితోపాటు పలువురు విద్యార్థులపై పోలీసుల నిర్బంధం సాగింది. అయినా, ఇంటర్ పూర్తి చేసి 1982లో కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. అక్కడా విద్యార్థి సంఘాల మధ్య జరిగిన గొడవల్లో తిరుపతిపై కేసులు నమోదయ్యాయి. దీంతో డిగ్రీ పూర్తి కాకముందే మల్లోజుల కోటేశ్వర్రావు ముఖ్య అనుచరుడు మెట్పల్లి మండలంలోని కొండ్రికర్లకు చెందిన సాయిని ప్రభాకర్ ఆధ్వర్యంలో తిరుపతితోపాటు మరికొందరు అడవి బాట పట్టినట్టు సమాచారం.1984లో బస్తర్కు వెళ్లి అక్కడే అంచెలంచెలుగా ఎదిగారు. బస్తర్ బాధ్యతలు హిడ్మాకు కేంద్ర కమిటీలో స్థానం సంపాదించిన తొలి ఛత్తీస్గఢ్ మావోయిస్టుగా పేరున్న మడ్వి హిడ్మాకు మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జ్తోపాటు ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ బాధ్యతలు అప్పగించారు. గెరిల్లా దాడులు చేయడంలో దిట్టగా పేరున్న హిడ్మాకు బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాల దూకుడుకు బ్రేకులు వేసేపని అప్పగించినట్టు తెలుస్తోంది. తెలంగాణతో సరిహద్దులు పంచుకునే సుక్మా, బీజాపూర్ జిల్లాలతో కూడిన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైంది. ఒకప్పుడు ఐదువేల మందికి పైగా సాయుధ మావోయిస్టులు ఈ కమిటీలో ఉండేవారు. ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో అత్యధిక సాయుధులు ఈ కమిటీలోనే ఉన్నారు. దీంతో రాబోయే రోజుల్లో దండకారణ్యం దద్దరిల్లే అవకాశం కనిపిస్తోంది. దండకారణ్యం బాధ్యతలు ఇప్పటివరకు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ చూస్తుండగా, ఇక్కడే ఉన్న జనతన సర్కార్ బాధ్యతలు మరో కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్ మైనా నిర్వర్తిస్తున్నారు. కొత్తగా హిడ్మా ఈ పోస్టులోకి రావడంతో ఆ ఇద్దరికి ఏ విధులు అప్పగిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. మిలిటరీ బాధ్యతల్లో మిసిర్ బెహ్రా: కేంద్ర కమిటీలో ముగ్గురు పొలిట్బ్యూరో సభ్యులు ఉన్నారు. వీరిలో తిప్పిరి తిరుపతి జనరల్ సెక్రటరీగా ఎన్నికవడంతో సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు జార్ఖండ్కు చెందిన మిసిర్ బెహ్రాకు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనుదాదా అలియాస్ అభయ్ ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాలు చూస్తున్నారు. -
ప్రశ్నిస్తే.. నాలుక మందం అంట: భూమన అభినయ్
సాక్షి తిరుపతి: అధికారంలోకి రావడానికి అలవికాని హామీలు ఇచ్చే చంద్రబాబు.. ఇప్పుడు కనీసం రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ తిరుపతి ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు.‘‘హమీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిని గాలికొదిలేశారు. సూపర్ సిక్స్ హామీలు గురించి అడిగితే అన్ని అమలు చేసేశామని అంటున్నారు. రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో మార్చారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సాయం రూ. 7 వేలు మాత్రమే అందించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్న రైతులు.. ఇప్పుడు యూరియా కొరతతోనూ అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో యూరియాను విచ్చలవిడిగా అమ్మేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే నాలుక మందం అంటారు. చంద్రబాబు దీనంతటికి సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి యురియా అందుబాటులో తెవాలి. లేకుంటే తగిన బుద్ధి చెప్తాం.. రైతుల కోసం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ డివిజన్ అర్డీఓ కార్యాలయంలో వినతి సమర్పిస్తాం. తిరుపతి పరిధిలో అన్నమయ్య సర్కిల్ నుండి ర్యాలీ చేపడతాం అని భూమన తెలిపారు. కిరణ్ రాయల్ తాజాగా ప్రెస్మీట్లో భూమన కరుణాకర్రెడ్డి చేసిన ఆరోపణలపైనా అభియన్ తీవ్రంగా స్పందించారు. అసలు కిరణ్ రాయల్ ఏ పార్టీనో ముందుగా చెప్పాలని ప్రశ్నించారు. ‘‘కిరణ్ రాయల్ ను గతంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ చెప్పింది. రాజకీయాలలో దిగజారి మాట్లాడటం సబబు కాదు’’ అభినయ్ అన్నారు. -
తిరుపతిలో ఘనంగా గణేష్ నిమజ్జనం (ఫొటోలు)
-
5 వేల చీరలతో గణనాథుడు
-
నిజాలు అలా చెబుతారా?.. మంత్రి రాసలీలలపై టీడీపీ నేతకు హెచ్చరిక
సాక్షి, అమరావతి: మంత్రి రాసలీలల గురించి బహిరంగంగా చెప్పిన టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి.సుధాకర్రెడ్డిపై పార్టీ క్రమశిక్షణ సంఘం విరుచుకుపడినట్లు తెలిసింది. మంగళవారం సుధాకర్రెడ్డిని మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి పిలిపించిన క్రమశిక్షణ సంఘం నాయకులు వర్ల రామయ్య, కొనకళ్ల నారాయణ, పంచుమర్తి అనూరాధ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ సందర్భంగా.. ‘మీరు మాట్లాడిన నిజాలు తీసుకొచ్చే నష్టం ఎంతో తెలుసా? ఏవైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ప్రత్యర్థులకు రాజకీయ అస్రాలు ఇచ్చేలా మాట్లాడటం కరెక్ట్ కాదు’ అంటూ హెచ్చరించినట్లు తెలిసింది. ఇటీవల టీడీపీ అనుకూల చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సుధాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్ర మంత్రి ఒకరు తిరుపతికి వచ్చిన సమయంలో స్టార్ హోటళ్లలో రాసలీలల్లో మునిగితేలతారని ఆయన చెప్పారు. మంత్రికి తమ లాంటి పార్టీ కార్యకర్తలను కలవడానికి సమయం లేదని, రాసలీలలకే సమయం సరిపోతోందంటూ.. తిరుపతిలో మంత్రి చేసే అసాంఘిక కార్యకలాపాలను వివరించారు.మండల అధ్యక్ష, ఇతర పార్టీ పదవుల్ని సైతం టీడీపీ ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇది సోషల్ మీడియా, మీడియాలో విస్తృతంగా ప్రచారమవడంతో ఉలిక్కిపడిన టీడీపీ అధిష్టానం రాసలీలల మంత్రిని ప్రశ్నించకుండా ఆ విషయాన్ని బయటపెట్టిన నేత సుధాకర్రెడ్డిని టార్గెట్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రికి చంద్రబాబు వత్తాసు పలుకుతుండటంతో.. ఆ మంత్రి కూడా సుధాకర్రెడ్డిని సస్పెండ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే క్రమశిక్షణ సంఘం నేతలు సుధాకర్రెడ్డిని పిలిపించుకుని వివరణ కోరారు. తాను చెప్పినవన్నీ వాస్తవాలేనని, మంత్రి పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవకుండా వేరే వ్యవహారాలు నడుపుతున్నారని సుధాకర్రెడ్డి చెప్పినట్లు తెలిసింది.‘మీరు మాట్లాడినవి నిజమే అయి ఉండవచ్చు. నిజాలన్నీ బయట మాట్లాడకూడదు. ప్రతిపక్ష పార్టీ వారికి అ్రస్తాలను అందిస్తారా?. అంతర్గతంగా ముఖ్య నాయకుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు’ అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న పనులపై అసహ్యం కలిగి, పారీ్టకి నష్టం జరుగుతోందనే ఆవేశంలో కొన్ని విషయాలు బయటపెట్టానని సుధాకర్రెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఇకపై జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన్ని క్రమశిక్షణ సంఘం నేతలు హెచ్చరించి పంపినట్లు తెలిసింది. అయితే సుధాకర్రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందేనని సదరు మంత్రి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. -
తిరుపతిలో బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారు
-
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల హింసపై ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు
తిరుపతి మంగళం: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళం, హింసాత్మక ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చేసిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది. ఆరు వారాల లోపల ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు నివేదికను తమకు సమర్పించాలని డీజీపీని మానవ హక్కుల కమిషన్ శనివారం ఆదేశించింది. 2025 ఫిబ్రవరి 3న జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేలా ఉండటమే కాకుండా మానవ హక్కుల ఉల్లంఘనలకు, ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతినడానికి కారణమయ్యాయని ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల రోజున తమ పార్టీ కార్పొరేటర్లతో కలిసి తాను ప్రయాణిస్తున్న బస్సుపై దుండగులు దాడి చేసి, అద్దాలు పగలగొట్టి, డ్రైవర్పై దాడిచేసి, టైర్ల గాలి తీసేసిన ఘటన రికార్డుల్లోనూ ఉందని ఎంపీ వివరించారు. ఈ ఘటన పోలీసుల సమక్షంలోనే జరిగినప్పటికీ, కేసు నమోదు సమయంలో పలువురు నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్లో లేకపోవడం అనుమానాస్పదమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల అనంతరం ఎంపీ గురుమూర్తి సమర్పించిన ఆధారాలు, మీడియా రిపోర్టులు, హైకోర్టు ఆదేశాలను కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ పరిశీలనలోకి తీసుకుంది. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నం.18/2025 నమోదైనప్పటికీ, దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని ఎంపీ వాదించారు. ఈ నేపథ్యంలో కమిషన్ వరుసగా డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి నివేదికలు కోరింది. -
‘నాకు లేని ల్యాప్టాప్ను సిట్ ఎలా స్వాధీనం చేసుకుంటుంది?’
సాక్షి, తిరుపతి: చంద్రబాబు తన పాలనా వైఫల్యాల నుంచి, తన దుర్మార్గాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి లేని లిక్కర్ వ్యవహారాన్ని సృష్టించారని మాజీ డిప్యూటీ సీఎం కే.నారాయణస్వామి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్క్లబ్లో జీడీనెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కె.కృపాలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు. కేవలం కక్షసాధింపుల కోసం లిక్కర్ స్కాం అంటూ ఒక బేతాళ కథను తయారు చేసి, దాని ద్వారా తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు కుట్రను అమలు చేస్తున్నాడని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇందులో భాగంగానే మా పార్టీకి చెందిన నాయకుల్ని, మచ్చలేని రిటైర్డ్ అయిన అధికారులను కూడా అరెస్టు చేసి చంద్రబాబు మానసిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. దీనికి కొనసాగింపుగానే 76 ఏళ్ల వయస్సున్న నాపై కూడా చంద్రబాబు కుట్ర పన్ని, విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వృద్ధాప్యం కారణంగా నాకు ఆరోగ్యం బాగోలేదు. అందుకనే నేను గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని, నా కుమార్తెకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వైఎస్ జగన్ నా కుమార్తెకు టిక్కెట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్న సిట్ వాళ్లు వచ్చి దర్యాప్తు పేరిట నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఎక్సైజ్ మంత్రిగా అయిదేళ్ళ పాటు పనిచేశాను.'నాకేమీ తెలియదు, నాపైన ఉన్న వారు అన్ని నిర్ణయాలు చేశారు' అని ఎలా చెబుతాను? అలా చెప్పాను అని అంత బాధ్యతారహితంగా ఎల్లో మీడియాలో ఎలా కథనాలు రాశారో అర్థం కావడం లేదు. నా ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి నన్ను అరెస్ట్ చేస్తున్నారని, మా ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారని, ఏదో స్వాధీనం చేసుకుంటున్నారంటూ ఇలా కసీ, ద్వేషం, పగతోనే నాపైన తప్పుడు బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు వేశారు. తప్పుడు కథనాలు రాశారు.నా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూనే పదవులను అందుకున్నాను. నాపైన ఎప్పుడూ ఎటువంటి ఆరోపణలు లేవు. సిట్ వాళ్లు దర్యాప్తులో తాము చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటిదీ తేల్చలేకపోయినా, వాళ్లేదో కనిపెట్టినట్టుగా కట్టు కథలు అల్లుతున్నారు. వాటినే ఈ ఎల్లో మీడియా రాస్తుంది. వాటినే ఛార్జిషీట్లలో పెట్టడం కూడా మనం చూస్తున్నాం. అంతకుమించి సిట్ వాళ్లు చూపించిన ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు. ఈ లిక్కర్ వ్యవహారం అక్రమ కేసని తేల్చిచెప్పడానికి ఇంతకన్నా రుజువులు అవసరం లేదు.ఎల్లోమీడియా రాతలకు అడ్డూ అదుపు లేదునాకు ల్యాప్టాప్ లేకపోయినప్పటికీ నిన్న సిట్ వాళ్లు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్టు తప్పుడు రాతలు రాశారు. నేను ఎప్పుడూ ల్యాప్ టాప్ వాడలేదు, ఉపయోగించడం కూడా నాకు తెలియదు. సిట్ వాళ్లు కూడా మా ఇంటి దగ్గర నుంచి ఎలాంటి ట్యాప్ టాప్ను తీసుకెళ్లలేదు. మరి ఈ తప్పుడు ఎలా రాయగలుగుతున్నారు? చివరకు సిట్ వాళ్లు నా ఫోన్ను తీసుకున్నారు. నా ఫోన్ తీసుకుని వాళ్లేం చేస్తారు? నా లాంటి వాడు ఈ ఫోన్లను ఎంతవరకూ వాడతాడు?అయినా ఏదో ఉందని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. మద్యపానం వల్ల కుటుంబాల్లో వస్తున్న సంక్షోభాలు, ఆరోగ్య సమస్యలు, విచ్చలవిడి విక్రయాల కారణంగా వస్తున్న సామాజిక సమస్యలు, మహిళల భద్రత, వారికి రక్షణ తదితర అంశాలపై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు కాగానే లిక్కర్ వినియోగాన్ని నియంత్రించడంపై దృష్టిపెట్టాం. లాభాపేక్ష ఉన్న ప్రైవేటు వ్యాపారుల వల్ల విక్రయాలు, వేళల్లో నియంత్రణ లేకపోవడం, మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడ్డం, వీధికో బెల్టుషాపులు పెట్టి మద్యాన్ని డోర్ డెలివరీ పద్ధతిలో అందుబాటులోకి తీసుకురావడం… ఇవన్నీ చూసిన తర్వాత వీటికి కళ్లెం వేస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు పెట్టాం. వేళల్ని నియంత్రిస్తూ, లిక్కర్ వినియోగాన్ని తగ్గించాం. మాఫియాకు అడ్డుకట్ట వేశాం.పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశాంటీడీపీ ప్రభుత్వ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే, మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, మద్యం అమ్మకాలు తగ్గాయి. ఆదాయం ఎందుకు పెరిగిందంటే, పన్నులువేశాం. ఆవిధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడు పోతే, మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి. అత్యంత పారదర్శరకంగా మద్యం పాలసీని అమలు చేయడం వల్ల, లిక్కర్ వినియోగం తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, 2014-19తో పోలిస్తే పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ లెక్కలన్నీ ప్రభుత్వ వద్దే ఉన్నాయి.ఇంత పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేస్తే, మాపై తప్పుడు కేసులు పెట్టి, రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. మద్యం దుకాణాలనే ప్రభుత్వమే నిర్వహిస్తున్నప్పుడు, లాభాపేక్ష లేకుండా వాటిని నడుపుతున్నప్పుడు, ప్రైవేటు విక్రయాలకు పులిస్టాఫ్ పెట్టినప్పుడు చంద్రబాబు ఆరోపిస్తున్నట్టుగా స్కాంకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? మాపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు? మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మా హయాంలో అమ్మకాలు తగ్గితే, చంద్రబాబు హయాంలో పెరిగాయి.మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మేం ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మితే, చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాడు. వాళ్లంతా మాఫియాలా ఏర్పడి దోచుకున్నారు. విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? మా హయంలో అమ్మకం వేళలు తగ్గించాం. చంద్రబాబుగారు రాత్రీ పగలూ లేకుండా అమ్మించారు.చంద్రబాబు హయాంలోనే మద్యం అవినీతిమద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మేం దుకాణాలు తగ్గించాం. కాని చంద్రబాబు విచ్చలవిడిగాద మద్యం దుకాణాలు, బార్లు, పర్మిట్ రూమ్స్ పెట్టాడు. దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు, బెల్టుషాప్లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? మేం 43 వేల బెల్టుషాపులు రద్దుచేశాం. వీధి వీధికీ చంద్రబాబు బెల్టుషాపులు పెట్టాడు. ఆలయాల వద్దా, స్కూళ్ల వద్దా ఇలా ప్రతి చోటా బెల్టు షాపులు పెట్టాడు. ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? చంద్రబాబు హయాంలో పూర్తి వివక్ష పాటించాడు.అస్మదీయులైన తనవాళ్లకే ఆర్డర్లు ఇచ్చాడు. మరి ఎవరిది అవినీతి?. ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలువస్తాయా? రాష్ట్రంలో ఉన్న డిస్టరీలకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబే. మేం ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మరి ఎవరిది అవినీతి.అన్నిటికీ మించి 2014-19 మధ్య చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజులను రద్దుచేసి, అధికార దుర్వినియోగం చేసి, సుమారు రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు. దీనిమీద మా ప్రభుత్వం హయాంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులో చంద్రబాబు ఇప్పుడు బెయిల్పై ఉన్నారు. దాన్ని మరుగున పరచడానికి, తాను అవలంబించిన తప్పుడు విధానాలు సరైనవే అని చెప్పుకోవడానికి, మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. మేం వివక్షకు పాల్పడుతున్నామని ఆరోపిస్తూ అప్పట్లోనే కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాకు కంపెనీలు వెళ్లాయి. ఆ కేసును కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. మా పారదర్శకతకు ఇది నిదర్శనం. అయినా మాపై బురదజల్లుతూనే ఉన్నారు.కూటమి ప్రభుత్వంలోనూ అదే దోపిడీఇవాళ మంచి ప్రభుత్వం అంటూ డబ్బాలు కొట్టుకుంటున్న ఈ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ పూర్తిగా అవినీతి మయం. ఇష్టానుసారం దోచుకుంటున్నారు. విలచ్చవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు. తెల్లవారు జాము మొదలుకుని మళ్లీ తెల్లవారుజాము వరకూ మందు అమ్ముతున్నారు. ఎమ్మార్పీ రేట్లకు మించి లిక్కర్ అమ్ముతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్లు పెట్టి అమ్ముతున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలం పాటలు పెడుతున్నారు. ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారు. మొత్తం మాఫియా మయమే. వేల కోట్ల రూపాయాలు దోచుకుంటున్నారు. కింద నుంచి పై స్థాయివరకూ ఈ లంచం సొమ్ము చేరుతుంది. నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇంతటి అవినీతి చూడలేదు. పైగా ఈ అవినీతి బాగోతానికి మంచి పాలసీ అని ముద్రవేసి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ..ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పనులు చేసిపెట్టినట్లు నిరూపిస్తే విషం తాగి చనిపోతాను. లిక్కర్ పాలసీలో ఏం తప్పు జరిగిందని అప్రూవర్గా మారాలి? దళిత, బలహీనవర్గానికి చెందిన నాయకుడిననే నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు కథనాలు రాశారు. నా ఇంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు సిట్ అధికారులు లెక్కించి తీసుకుపోయారంటూ ఎలా ఎల్లో మీడియాలో స్క్రోలింగ్లు వేశారు. రికార్డులు స్వాధీనం చేసుకున్నారని రాశారు. ఇది సమంజసమా?. అన్ని అర్హతలు ఉన్న దివ్యాంగుల పెన్షన్లలోనూ కోతలు పెడుతున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. దీనిలో కేవలం అయిదు కేటగిరిలకే ఎందుకు పరిమితం చేశారు? వీటిపై మాట్లాడితే పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వేధిస్తున్నారు. చివరికి జిల్లా కలెక్టర్ వద్ద సమస్యలపై వెళ్ళినా ఏ పార్టీ అని రాస్తున్నారు -
ఏపీ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల హింసపై ఏపీ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఎస్వీయూ క్యాంపస్లో జరిగిన హింసపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల హింసపై ఎంపీ గురుమూర్తి చేసిన ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సి ఆదేశాలు ఇచ్చింది. వైఎస్సార్సీపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని గతంలో నివేదిక ఇచ్చి ఏపీ డీజీపీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దాంతో మరోసారి తాజా దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. -
భూమన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.. BR నాయుడుపై మహిళా ఉగ్రరూపం
-
తిరుపతి ప్రజల డిమాండ్.. BR నాయుడుని వెంటనే TTD చైర్మన్గా తొలగించాలి
-
వికలాంగుల పెన్షన్ కూడా వదలరా మీకు మనసెలా వచ్చింది..
-
తిరుపతిలో దివ్యాంగుల ఆందోళన
-
తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, తిరుపతి: తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వం తమ పెన్షన్లను తొలగించడంతో దివ్యాంగులు కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో దివ్యాంగుల ఆందోళనలకు వైఎస్సార్సీపీ తిరుపతి ఇన్చార్జ్ భూమన అభినయ రెడ్డి మద్దతు పలికారు. దివ్యాంగులకు న్యాయం చేయాలని అభినయ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. -
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో పోలీసుల ఓవరాక్షన్
-
Tirupati: హాస్టల్లో విద్యార్థులతో పనులు
-
తిరుపతిలో చిక్కిన మరో చిరుత.. మూడు నెలలకు ప్లాన్ సక్సెస్
సాక్షి, తిరుపతి: తిరుపతిలో మరో చిరుత బోనులో చిక్కింది. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. ఈరోజు ఉదయం చిరుతను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అనంతరం, చిరుతను సమీపంలోని ఎస్వీ జూ పార్కుకు తరలించినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే, చిరుతలు సంచారం ఎక్కువగా ఉండటంతో ఫారెస్ట్ అధికారులు ఎస్వీ యూనివర్సీటీ వద్ద మూడు బోన్లు ఏర్పాటు చేశారు. ఇక, మూడు నెలలుగా చిరత.. అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. బోనలో చిక్కకుండా తరచుగా అక్కడ కనిపించడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. మరోవైపు.. అక్కడ మరిన్ని చిరుతలు ఉన్నాయన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి.. సీసీ టీవీలను పరిశీలిస్తున్నారు. -
తిరుమల వెళ్లే భక్తుడి బ్యాగులో తాబేలు..ఆరా తీస్తే..!
తిరుమల: తరుమల కొండపైకి వెళ్లే భక్తులను తనిఖీలు చేయడమనేది సర్వసాధారణం. ఇలా ఒక భక్తుడ్ని తనిఖీ చేస్తే అతని బ్యాగులో తాబేలు కనిపించింది. ఇది అక్కడ తనిఖీ చేసే సిబ్బందికి కూడా కొత్తగానే అనిపించింది. తాబేలు ఏంటి.. బ్యాగులో ఎందుకు తీసుకెళుతున్నావ్ అని సదరు భక్తుడిని అడిగితే దిమ్మ తిరిగే సమాధానం వచ్చింది. తనకు దారిలో దొరికిందని, బ్యాగులో వేసుకున్నానని బదులిచ్చాడు. ఏమైనా విలువైన వస్తువులు దొరికితే దాన్ని దాచుకుంటారు.మరి మనోడు తాబేలను బ్యాగులో వేసుకున్నానంటూ చెప్పిన సమాధానంతో అక్కడ సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు. సర్లే అనుకుని దాన్ని స్వాధీనం చేసుకున్నారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. ఆ తాబేలును ఫారెస్ట్ అధికారులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. అసలు తాబేలు కనిపిస్తే బ్యాగులో వేసుకున్నానంటూ అతను చెప్పిన సమాధానం చూస్తే నవ్వొస్తుంది కదూ.. ఇది అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద చోటు చేసుకున్న ఘటన. తనిఖీలు చేస్తున్న క్రమంలో తాబేలు వ్యవహారం వెలుగుచూసింది. తాబేళును స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు -
జూ.ఎన్టీఆర్పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. ఆర్కే రోజా రియాక్షన్
సాక్షి, తిరుపతి: జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమా, రాజకీయాలు మిక్స్ చేయెద్దంటూ ఆమె హితవు పలికారు. అరచేతితో సూర్యుడ్ని ఆపలేరన్నారు. ఎమ్మెల్యేలు టికెట్లు కొన్నా.. అభిమానులు పవన్ సినిమాకు రాలేదంటూ రోజా వ్యాఖ్యానించారు.ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్త్రీశక్తి పేరుతో మహిళలను దగా చేశారని ఆమె మండిపడ్డారు. 16 రకాలు బస్సులు ఉన్నాయి.. ఇప్పుడు 5 బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారంటూ రోజా దుయ్యబట్టారు. 14 నెలలు తర్వాత స్తీశక్తి బస్సు ప్రారంభించారు. లోకల్గా తిరిగే బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సులకు అమలు చేశారు’’ అంటూ ఆర్కే రోజా నిలదీశారు.‘‘రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అని చెప్పి.. ఇవాళ ఆంక్షలు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కోతలు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది. తిరుమల, అన్నవరం, విజయవాడ, శ్రీశైలం పుణ్య క్షేత్రాలకు ఉచిత దర్శనం లేదు. భగవంతుడు పేరు చెప్పి ఓట్లు దండుకున్నారు. మహిళల్ని మోసం చేశారు. పల్లె వెలుగు బస్సుల్లోనే పంపిస్తామని ఎన్నికలు ముందు మీరు చెప్పారు. మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు...కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. సూపర్ సిక్స్.. హిట్ కాదు.. సూపర్ ప్లాప్. తిరుపతి నుంచి తిరుమలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు. శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ గుడి, సింహాచలానికి ఉచిత ప్రయాణం లేదు. ఆడబిడ్డ నిధి.. 18 ఏళ్లు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆడబిడ్డ లేరు కాబట్టి.. చంద్రబాబుకు ఆడవాళ్లను గౌరవించడం తెలీదు. కానీ, పవన్ కళ్యాణ్కు ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి ఆయన ప్రశ్నించాలి.జగనన్న ఆడబిడ్డలకు చెప్పింది చెప్పినట్లుగా అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసమే.. అబద్ధాలు చెప్పారు. మహిళల్ని మోసం చేసినవాళ్లు ఏ రాష్ట్రంలో బాగుపడింది లేదు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటూ చెప్పి చంద్రబాబు మోసం చేశాడు’’ అంటూ ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ గొడవ నా వ్యక్తిగతం: తిరుపతిలో దాడికి గురైన బాధితుడు పవన్ సెల్ఫీ వీడియో
-
ద్రౌపది అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన RK రోజా
-
తిరుపతి : అట్టహాసంగా (ఐఐఎస్ఈఆర్) స్నాతకోత్సవ వేడుక (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ (ఫొటోలు)
-
తహసీల్దార్.. మహిళా వీఆర్వో పరస్పర ఫిర్యాదులు
సాక్షి టాస్క్పోర్స్: మహిళా వీఆర్వో హనీట్రాప్లో తాను చిక్కుకున్నానని తహసీల్దార్.. కోరిక తీర్చమని తహసీల్దార్ తనను వేధిస్తున్నారని వీఆర్వో ఇద్దరూ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. మహిళా వీఆర్వో ఇంటికి వెళ్లి నగ్నంగా దొరికిపోయిన తహసీల్దార్.. వీఆర్వో తల్లితో పాటు పలువురి చేతిలో చావుదెబ్బలు తిని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గురువారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వాకాడు తహసీల్దార్ రామయ్య గతంలో పెళ్లకూరు తహసీల్దార్గా పనిచేశారు. గత నెల 24న నాయుడుపేటలో ఉంటున్న మహిళా వీఆర్వో ఇంట్లోకి వెళ్లిన తహసీల్దార్ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు కలెక్టర్, ఎస్పీలకు గురువారం ఫిర్యాదు చేశారు.కాగా.. తాను పెళ్లకూరులో తహసీల్దార్గా పనిచేసినప్పుడు తనతో చనువుగా ఉన్న మహిళా వీఆర్వో పథకం ప్రకారం తనపై వలపు వల విసిరి (హనీట్రాప్ చేసి) ఇంటికి పిలిపించుకుందని.. తనపై దాడి చేయడమే కాకుండా నగ్నంగా వీడియోలు తీసి నగదు కోసం బెదిరిస్తున్నట్టు తహసీల్దార్ కలెక్టర్కు, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ మహిళా వీఆర్వోపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని తహసీల్దార్ చెప్పినట్టు తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై గురువారం రాత్రి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని సీఐ బాబీ చెప్పారు. -
కోరిక తీర్చాలంటూ VRO ఇంటికి వెళ్లిన MROకు దేహశుద్ధి!
సాక్షి,తిరుపతి: జిల్లాలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ నాయుడుపేట ఎంఆర్వోకు (MRO) దేహశుద్ధి జరిగింది. గత కొద్ది రోజులుగా మహిళా వీఆర్వ్వోను (VRO).. ఎంఆర్వో లైగింకంగా వేధిస్తున్నాడు. ‘మీ ఇంటికి వస్తా.. కోడి కూర వండిపెడతావా? అడిగింది ఇస్తావా?’ అని మెసేజ్లు పెట్టాడు. ఆపై ఆమె ఇంటికే వెళ్లాడు. బరితెగించిన ఎంఆర్వో..దుస్తులు విప్పి తన కోరిక తీర్చాలంటూ మహిళా వీఆర్వోను వేధించాడు. అయితే అప్రమత్తమైన బాధితురాలి కుటుంబసభ్యులు.. తహసీల్దార్ పట్టుకుని మరీ దేశశుద్ధి చేశారు. -
GSLV-F16 ప్రయోగం సక్సెస్
సాక్షి,నెల్లూరు: ఇస్రో, నాసాల ఉమ్మడి ఉపగ్రహమైన నిసార్ శాటిలైట్ GSLV-F16 నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. నింగిలోకి వెళ్లిన నిస్సార్ ఉపగ్రహం భూమిని స్కాన్ చేయడం ప్రారంభించింది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నిసార్) అనే ఉపగ్రహం నిసార్ శాటిలైట్ GSLV-F16 నింగిలోకి దూసుకెళ్లింది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ఈ ప్రయోగం ప్రారంభమైంది జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్16) రాకెట్ ద్వారా 2,392 కేజీల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు ఇస్రో సైంటిస్టులు . 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి నిసార్ను ప్రవేశపెట్టారు. భూగోళాన్ని పరిశోధించేందుకు ఎంతో దోహదపడే ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్లు పాటు సేవలు అందిస్తుంది. భూ కదలికలను నిశితంగా పరిశీలించేందుకు... దాదాపు 11 వేల 200 కోట్ల రూపాయలతో వ్యయంతో నాసా, ఇస్రో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.భవిష్యత్తులో ఇస్రో–నాసా కలిసి మరిన్ని ప్రయోగాలు.. ఈప్రయోగం సందర్భంగా ఇస్రో, నాసా బంధం బలపడి రాబోయే కాలంలో మరో మూడు ప్రయోగాలను సంయుక్తంగా నిర్వహించేందుకు ఒప్పందం చేసుకున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.నారాయణన్ పేర్కొన్నారు. అలాగే, చంద్రయాన్–4 ప్రయోగ పనులకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి గగన్యాన్–1 పేరుతో ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పీఎస్ఎల్వీ సిరీస్లో కూడా మరో నాలుగు ప్రయోగాలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. -
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
వాహనాల రద్దీ అత్యధికంగా ఉండే తిరుపతిలోని రామాపురానికి వెళ్లే రోడ్డులో ఓ ఊసరవెల్లి ఒక్కసారిగా ఇలా దూసుకొచ్చింది. బిడ్డా.. ఇది నా అడ్డా, నువ్వే కాస్త చూసుకుని వెళ్లు అన్నట్లు రోడ్డు మధ్యలో కాసేపు ఆగి నిదానంగా పక్కకి వెళ్లింది. వాహనదారులు తమ వాహనాలను నెమ్మదిగా నడిపి ఊసరవెల్లి రోడ్డు దాటేవరకూ ఆగడం కనిపించింది. సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి -
చిరుద్యోగులను బలిచ్చారు తిరుపతి తొక్కిసలాట కేసుపై భూమన
-
ప్రయాణికులకు అలర్ట్.. అక్టోబరు 15 వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు
తిరుపతి: తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్న 54 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ప్రధాన మార్గాల్లో కొనసాగుతున్న రద్దీకి అనుగుణంగా పొడిగింపు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ రైళ్లు తిరుపతి, మదురై, నాగర్ సోల్కు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటాయని వెల్లడించారు. కాచిగూడ-మదురై మార్గంలో 07191/07192 నంబర్లు కలిగిన ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్–కొల్లాం మార్గంలో 07193/07194, హైదరాబాద్–కన్యాకుమారి మార్గంలో 07230/07239 రెళ్లను పొడిగించారు.అదే విధంగా సికింద్రాబాద్–తిరుపతి మధ్య 10, కాచిగూడ–నాగర్సోల్ మధ్య 8, నాందేడ్–తిరుపతి మధ్య 10, నాందేడ్–ధర్మవరం మధ్య 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మీదుగా ఆరు ప్రధాన మార్గాల్లో నడుస్తున్న 54 ప్రత్యేక రైళ్లను అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించారు.మదురై-కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు మదురై–కాచిగూడ స్పెషల్ ట్రైన్ ఆగస్టు 20వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు ప్రతి బుధవారమూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 07193/07194 నంబర్ కలిగిన రెండు స్పెషల్ రైళ్లు హైదరాబాద్– కొల్లం మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కొల్లం వెళ్లే ఈ స్పెషల్ రైళ్లు ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు ప్రతి శనివారమూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. 07230/07229 నంబర్ గల రెండు రైళ్లు హైదరాబాద్–కన్యాకుమారి మధ్య రాకపోకలు సాగిస్తాయి. 07229 నంబర్ కలిగిన హైదరాబాద్–కన్యాకుమారి స్పెషల్ రైలు ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతి బుధవారమూ నడుస్తుంది. -
‘కూటమి’ అరాచకాలు సహించం: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి.రాజయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. పుత్తూరు మున్సిపాలిటీ 20వ వార్డు, వినాయకపురం ఎస్టీ కాలనీలో రాజయ్య ఆటోకు ఇటీవల దుండగులు నిప్పటించారు. ఈ ఘటన వెనుక ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను రోజా కోరారు. జీవనోపాధి కోసం నడుపుకుంటున్న ఆటోను రాత్రికి రాత్రే దుండగులు నిప్పుపెట్టడం అమానుషమన్నారు.ఇటువంటి అరాచక చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదు. ఇటువంటి దాడులకు పాల్పడుతున్న వారికి ప్రజలు బుద్ధి చెబుతారు’’ అని ఆర్కే రోజా హెచ్చరించారు. రెడ్బుక్ రాజ్యాంగ్యాన్ని కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులను సహించేది లేదు’’ అంటూ ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన టి.రాజయ్య కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి’’ అని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. -
‘శుద్ధ’ అబద్ధం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నేను కష్టపడి ప్రజలను సుఖపెడతాను’ అని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తిరుపతి జిల్లా రేణిగుంట, తిరుపతిలలో పర్యటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాళహస్తి నియోజక వర్గం రేణిగుంట మండలం తూకివాకం వద్ద పూర్తి చేసిన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను సందర్శించి ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ సహా పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్థాలను సద్వినియోగం చేసేలా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం తిరుపతి నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర సభలో ప్రసంగించారు. తోతాపురి విషయంలో ఇబ్బందులున్నాయి తోతాపురి మామిడి కాయల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పట్టించుకోకపోయినా ఏపీలో గిట్టుబాటు ధర కలి్పంచామన్నారు. మామిడికి టన్నుకు రూ.12వేలు ఇచ్చేలా చేశామన్నారు. ప్రభుత్వం తరఫున రూ.4వేలు, కోనుగోలు దారులు రూ.8వేలు చెల్లించే ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. సూపర్సిక్స్ హామీలు అమలు చేసేశామని చెప్పుకొచ్చారు. ఇంట్లో చెత్తను ఊడ్చినట్లు నేరస్తులను ఊడ్చేయాలని పేర్కొన్నారు. గతంలో శ్రీవారే దిగొచ్చి తనకు ప్రాణభిక్ష పెట్టారని చెప్పారు. హంద్రీ–నీవా నీటిని కళ్యాణీ డ్యాంకు అక్కడి నుంచి తిరుమలకు తీసుకొస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వచ్ఛాంధ్ర సాధనే లక్ష్యం స్వచ్ఛసర్వేక్షన్లో ఐదు అవార్డులు సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచామని సీఎం చెప్పుకొచ్చారు. ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబరు 2 నాటికి 17 కార్పోరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించనున్నట్లు వెళ్లడించారు. గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. సోలార్ కరెంట్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు తిరుపతిలోని కపిలేశ్వరస్వామిని సీఎం దర్శించుకున్నారు. పారిశుధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అలిపిరి వద్ద ఉన్న శ్రీ కంచిపీఠంను సందర్శించారు. సీఎంను కలిసేందుకు వీల్లేదంటూ పూజారికి నోటీసులు చంద్రగిరి: సీఎం చంద్రబాబు పర్యటనలో కూటమి నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దర్పాన్ని ప్రదర్శించారని వారాహి ఆలయ ప్రధాన పూజారి శ్రీమహారుద్ర ఆది వారాహి స్వామి మండిపడ్డారు. శనివారం తిరుపతి వచి్చన సీఎంను కలిసి తిరుచానూరు సమీపంలో వారాహి ఆలయాన్ని టీడీపీ నేత అనుచరులు కూలి్చవేసిన ఘటనను వివరించేందుకు పూజారి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పూజారి ఇంటికి వెళ్లి సీఎంను కలవడానికి వీల్లేదంటూ నోటీసు జారీ చేసి హౌస్ అరెస్టు చేశారు. చెత్త రీసైక్లింగ్పై సంతృప్తి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉత్పత్తి అయ్యే చెత్తను రెడ్యూస్ రీయూస్ రీసైక్లింగ్ చేస్తున్న విధానం పట్ల సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు కట్టారు? ఎంత ఖర్చు చేశారు? అని ఆయన ఆరా తీశారు. ఇదిలా ఉంటే ఇదంతా తన పాలనలోనే జరిగినట్టు చంద్రబాబు భావిస్తున్నారని, ఈ ప్రాజెక్టులు వైఎస్సార్సీపీ హయాంలో నిరి్మంచినవని అధికారులు చర్చించుకోవడం కనిపించింది. సీఎం క్లీనింగ్ అంతా సెట్టింగే..! సాక్షి టాస్్కఫోర్స్: తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో సీఎం పారిశుద్ధ్య కార్యక్రమం అంతా సెట్టింగేనని తేలిపోయింది. సీఎం ఆలయానికి రాకముందే అక్కడక్కడ పూలుచల్లినట్టు కనిపించడం, వాటికి సమీపంలో భక్తులు ప్రసాదం తినిపడేసిన కప్పులు దర్శనమివ్వడం వంటి దృశ్యాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. వీటన్నింటినీ టీడీపీ నేతలే సెట్ చేసినట్లు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. వాస్తవానికి భక్తులు ప్రసాదం తినేశాక కప్పులను ఆలయంలోని దారిలోనే పడేసే అవకాశమే లేదని, అక్కడ ఏర్పాటుచేసిన డస్టుబిన్లలో వేస్తాని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఆలయంలో పడేసిన కప్పులు కొత్తవిగా ఉన్నాయని, దీనిని బట్టి ఇదంతా సీఎం పబ్లిసిటీ కోసం టీడీపీ నేతలు చేసిన సెట్టింగేనని స్పష్టమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే సీఎం పర్యటన ఆద్యంతం పారిశుద్ధ్య కారి్మకులను టీడీపీ కార్యకర్తలుగా మార్చేశారు. వారికి కండువాలు కప్పారు. ఇదిలా ఉంటే కొందరు పంచాయతీ కార్మికుల చేత రేణిగుంట వద్ద టీడీపీ జెండాలు కట్టించారు. దీంతో కారి్మకులు ఆవేదన వ్యక్తం చేశారు. -
శ్రీవారి సన్నిధిలో రోజా, పెద్దిరెడ్డి


