తిరుమలలో ఏడు అడుగుల పొడవైన మహిళ సందడి చేశారు. సోమవారం ఉదయం వానమామలై పీఠాధిపతి జీయర్ స్వామి, ఆయన శిష్య బృందంతోపాటు ఏడు అడుగుల పొడవున్న శ్రీలంకకు చెందిన నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆమె ఎత్తును చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.