Woman
-
రూ. 10 కోట్లు చూసి ఆమె షాక్ : నెటిజన్లు మాత్రం ఫిదా
‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు ’ఈ ఫ్యామస్ డైలాగ్ గుర్తుందా? కానీ ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో జరిగిన ఘటన గురించి తెలుస్తే అవాక్కవ్వాల్సిందే. ఒక సామాన్య రైతు భార్య బ్యాంకు ఖాతాలోకి ఉన్నట్టుండి కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. అయితే డబ్బెవరికి చేదు అని ఆమె అనుకోలా. ఆమె చేసిన పని ఇపుడు నెట్టింట విశేషంగా నిలుస్తోంది. స్టోరీ ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని మైనపురి జిల్లాకు చెందిన ఒక రైతు భార్య రీటా. రాష్ట్రంలోని దేవగంజ్ గ్రామంలో తన భర్త పరాస్భన్ బహేలియాతో కలిసి నివసిస్తోంది. ఇటీవల జరిగిన నవరాత్రి ఉత్సవాల సమయంలో, ఆమె కొంత నగదు విత్డ్రా చేయడానికి స్థానిక బ్యాంకుకు వెళ్లింది. అయితే, 'మహా అష్టమి' పర్వదినం కారణంగా బ్యాంకు మూసివేసి ఉండటంతో ఆమె నగదు తీసుకోలేకపోయింది. ఆ తర్వాత, నగదు విత్డ్రా చేయడానికి ఆమె సమీపంలోని ఏటీఎం (ATM) కేంద్రానికి వెళ్లింది. తన బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.10 కోట్లు(రూ. 9,99,49,588) జమ అయినట్లు గుర్తించి, రీటా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆ విషయాన్ని నమ్మలేక, ఖాతాలో ఉన్న మొత్తాన్ని సరిచూసుకోవడానికి, నిర్ధారించుకోవడానికి ఆమె మరో ఏటీఎంకు వెళ్లింది. అక్కడ కూడా అదే మొత్తం కనిపించింది. ఆమె ఈ విషయాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయగా, అది కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ప్రశంసలందుకుంటున్న ఆమె నిర్ణయంపొరపాటున తన 'బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఖాతాలో జమ చేసిన రూ. 10 కోట్లను చూసి అత్యాశకు పోలేదు. రీటా ఆ డబ్బును విత్డ్రా చేయడానికి నిరాకరించింది. అంతేకాకుండా, ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆ డబ్బును ముట్టుకోవద్దని తన కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పొరుగువారితో పాటు ఇతరులు కూడా ఆమె నిజాయితీని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది. రీటా నిజాయితీని చాలామంది సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.బ్యాంక్ అధికారుల ప్రశంసలు ఆమె నిజాయితీపై బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రిషికాంత్ పాండే స్పందించారు. టెక్నికల్ ఎర్రర్, లేదా పొరబాటున ఇలా జరిగి ఉంటుందని, విచారణ జరిపి ఆ డబ్బును వెనక్కి తీసుకుంటామని హామీ పాండే తెలిపారు.సోషల్ మీడియా ఫిదా'ఈ డబ్బు నాది కాదు, దీన్ని వెనక్కి తీసుకోండి' అని ఆమె బ్యాంకు అధికారులతో స్పష్టం చేసింది. దీంతో తన బ్యాంక్ అకౌంట్లో పొరపాటున పది కోట్ల రూపాయలు పడినా, ఆశపడకుండా నిజాయితీని చాటుకుని అందరి ప్రశంసలందుకుంటోంది. సాధారణ ప్రజలలో అత్యధికులు నిజాయితీపరులేనని, అందుకే మానవజాతి మనుగడ సాగిస్తోంది అంటూ ఎక్స్ యూజర్ శేఖర్ వెంబు వ్యాఖ్యానించారు. -
యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు
ఘజియాబాద్కు హరీష్ రాణా దేశంలోనే తొలి కారుణ్య మరణం పొందిన వ్యక్తిగా నిలిచారు. 13 ఏళ్ల పాటు మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా బతికిన ఆయనకు సుప్రీంకోర్టు అనుమతితో ఎయిమ్స్ వైద్యులు చికిత్స నిలిపివేయగా, ఇటీవల తుదిశ్వాస విడిచారు. దాదాపు ఇలాగే చట్ట అనుమతితో కారుణ్య మరణం పొందిన స్పానిష్ యువతి గురించి తెలుసా? వేదన భరించలేక కారుణ్య మరణం ఎంచుకున్న అత్యాచార బాధితురాలి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.స్పానిష్ యువతి నోలియా కాస్టిల్లో (Noelia Castillo) ఉదంతం చాలా హృదయవిదారకమైన గాథ. మృత్యువు అంచుల వద్ద కూడా ఎలాగైనా బతకాలనే కోరుకుంటారు ఎవరైనా. కానీ కోరి కోరి మృత్యువును ఎంచుకోవడం అంటే ఆ నరకయాతన, మానసిక క్షోభను, కుటుంబం భావోద్వేగ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నోలియా కాస్టిల్లో కారుణ్య మరణంస్పానిష్ ప్రభుత్వ ప్రసార సంస్థ TVE , ఇతర స్థానిక మీడియా నివేదికల ప్రకారం, బార్సిలోనాకు చెందిన 25 ఏళ్ల నోలియా కాస్టిల్లో, కాటలోనియాలోని శాంట్ పెరె డి రిబ్స్లోని ఒక ఆసుపత్రిలో గురువారం సాయంత్రం ఈ ప్రక్రియ పూర్తి అయింది. దీన్ని ఎలాగైనా ఆపాలని ఆమె తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి స్పెయిన్, యూరప్లోని న్యాయస్థానాల అనుమతితో మూడు రకాల మందుల మిశ్రమంతో చేసే ఇంజెక్షన్ ద్వారా 15 నిమిషాల చికిత్సా ప్రక్రియలో ఆమె ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది. నోలియా మరణం స్పెయిన్లో కారుణ్య మరణంపై మళ్ళీ చర్చను లేవనెత్తింది. మతసంస్థలు, సంప్రదాయ వాదులు ఇది వైద్య వ్యవస్థ వైఫల్యమని విమర్శించారు. అయితే స్వచ్ఛంద మరణం కోసం పోరాడే సంఘాలు, గౌరవప్రదమైన మరణాన్ని ఎంచుకునే హక్కు అంటూ ఈ ప్రక్రియను సమర్థించాయి.భరించలేని హింస , బాధ2022లో ఒక ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ముగ్గురు వ్యక్తులు నోలియాపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె తీవ్రమైన డిప్రెషన్లోకి జారిపోయింది. ఆపై తాను ఉంటున్న భవనంలోని ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తృటిలో ప్రాణాలతో బయటపడింది కానీ పక్షవాతానికి గురైంది. ఇక అప్పటినుంచి మంచానికే పరిమితమై నరకయాతన అనుభవించిన నోలియా, సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత తానుకున్నట్టుగానే మనశ్శాంతిగా కన్నుమూసింది. ఆ గాయం నుండి కోలుకోలేక ఆమె ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యా యత్నం చేశారు. ప్రాణాలతో బయటపడినప్పటికీ, నడుము కింది భాగం పక్షవాతానికి గురైంది. అప్పటి నుండి, ఆమె వీల్చైర్కే పరిమితమై, శారీరక , మానసిక వేదనతో కుమిలిపోయింది.శారీరక వేదనతోపాటు,అత్యాచారం తాలూకూ చేదు జ్ఞాపకాలు ఆమెను నిరంతరం వెంటాడేవి. "నేను ఏమీ చేయలేకపోతున్నాను, కనీసం నిద్రపోవడం కూడా కష్టంగా ఉంది. తన బాధ కేవలం శారీరకమైనది మాత్రమే కాదని, తీవ్రమైన భావోద్వేగపరమైంది అందుకే ఈ నరకం నుంచి విముక్తి కావాలి. ఇక ఈ బాధ భరించలేను, నేను అనుభవించిన ప్రతీ బాధను మననం చేసుకుంటూ జీవించడం నావల్లకాదు ఇక వెళ్లిపోవాలను కుంటున్నాను, నాకు విముక్తి కావాలి శాంతి కావాలి” అని ఆమె మరణానికి ముందు రోజు ప్రసారమైన మరో ఇంటర్వ్యూలో చెప్పింది.తండ్రి అభ్యంతరంఏప్రిల్ 2024లో నోలియా దీని కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె పరిస్థితిని గమనించిన ఆరోగ్య బోర్డు అందుకు అనుమతించింది. కానీ నోలియా తండ్రి దీనిని ఎప్పటికప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఇది సరైన నిర్ణయం కాదని, చనిపోవడం సమస్యకు పరిష్కారం కాదంటూ కోర్టులను ఆశ్రయించారు. ఈ పోరాటంలో సుప్రీంకోర్టు నుండి ఐరోపా మానవ హక్కుల కోర్టు వరకు వెళ్లినా, ఆయన విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది.తల్లి యోలాండా రామోస్ నిస్సహాయత: "నేను ఆమె నిర్ణయంతో ఏకీభవించడం లేదు, కానీ నా బిడ్డ పడుతున్న బాధను చూడలేను. చివరి వరకు ఆమె పక్కనే ఉంటాను" అని భావోద్వేగంగా చెప్పారు.చివరి కోరిక"నేను అందంగా కనిపిస్తూ మరణించాలని అనుకుంటున్నాను. నాకిష్టమైన డ్రెస్ వేసుకుని, మేకప్ వేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోతాను" అని ఆమె తన చివరి కోరికను వెల్లడించారు. ఆమె కోరుకున్నట్టుగా, చట్ట నియమాల మేరకు ఆమె తనువు చాలించారు.స్పెయిన్ 2021లో కారుణ్య మరణాన్ని (Euthanasia) చట్టబద్ధం చేసింది. దీని ప్రకారం నయం చేయలేని వ్యాధులు లేదా దీర్ఘకాలిక అశక్తత ఉన్నవారు మరణాన్ని కోరుకోవచ్చు. -
షాకింగ్ వీడియో : బుల్లెట్ బండిని ధ్వంసం చేసిన మహిళ
జైపూర్ : జైపూర్లో జరిగి ఒక విభ్రాంతికర ఘటన నెట్టింట వైరల్గా మారింది. జైపూర్లోని ఒక కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒక మహిళ బహిరంగంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను ధ్వంసం చేసే వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన మార్చి 22న జరిగింది.సౌరభ్ శర్మ అనే వ్యక్తి తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్పై ఆఫీసుకి వెళ్తుండగా, ముందున్న స్కూటర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న క్యాబ్ కూడా ఆగింది. అయితే నియంత్రణ కోల్పోయిన సౌరభ్ తన ముందున్న క్యాబ్ను బుల్లెట్తో స్వల్పంగా ఢీకొట్టాడు.అయితే మర్యాదగా సౌరభ్ వెళ్లి వెంటనే క్యాబ్ డ్రైవర్కు క్షమాపణలు చెప్పాడు. కానీ క్యాబ్లో ఉన్న మహిళ మాత్రం హైడ్రామా క్రియేట్ చేసింది. ఆగ్రహం ఊగిపోతూ ఆమె బుల్లెట్ రైడర్తో గొడవకు దిగడమే కాకుండా, ఊహించని విధంగా సౌరభ్ హెల్మెట్ తీసుకుని అతని బైక్ అద్దాలను పగలగొట్టింది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని బైక్ బాడీని, వెనుక లైట్లను పదే పదే బాదుతూ విధ్వంసం సృష్టించింది. ఈ తంతంగా అంతా సీసీటీవీలో రికార్డైయింది.Jaipur Woman Badly Damages Man's Bullet After It Grazes Her Scooterhttps://t.co/VNGAn5Q54t pic.twitter.com/Gt52R463vS— NDTV (@ndtv) March 26, 2026 ఇప్పటికే రూ. 1,700 నష్టం జరిగింది, చాలు ఇక వదిలేయండి. బైక్ పాడైపోతోంది అంటూ సౌరభ్ వేడుకున్నా ఆమె వదల్లేదు సరిగదా, ఎందుకు వదలాలి?" అంటూ మరింత కసిగా బైక్ను రాయితో కొట్టింది. బైక్ పాడైపోతోంది, వదిలేయండి, కేసుపెడతాను బెదిరించాడు అతగాడు. దీంతో నువ్వు నన్నేమీ చేయలేవు అంటూ విరుచుకుపడింది.పోలీసుల తీరుపై విమర్శలుసౌరభ్ ఆరోపణల ప్రకారం, ఈ గొడవ జరుగుతున్నప్పుడు కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నప్పటికీ, అతను పట్టించుకోలేదు. మహిళను ఆపమని పదే పదే కోరినప్పటికీ ఆ అధికారి పట్టించుకోలేదని బుల్లెట్ రైడర్ సౌరభ్ శర్మ ఆరోపించారు.ఈ విషయం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లగా ఇరు పక్షాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితి సామరస్యంగా పరిష్కారమైందని, ఆ మహిళపై ఎలాంటి అధికారిక కేసు గానీ, చట్టపరమైన చర్యలు గానీ నమోదు చేయలేదని అధికారులు ధృవీకరించారు. అయితే, బహిరంగంగా ఒక వ్యక్తి వాహనాన్ని ధ్వంసం చేయడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, పోలీసుల నిర్లిప్తతపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: దేశవ్యాప్త లాక్డౌన్ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!ఇదిలా ఉండగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజస్థాన్ పోలీస్ హెల్ప్డెస్క్ బహిరంగంగా స్పందిస్తూ, ఈ కేసును సమీక్షించి, ప్రస్తుత పరిస్థితిపై అప్డేట్ అందించాలని జైపూర్ పోలీసులను కోరింది.ఇదీ చదవండి : బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..! -
108 కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు.. ఎమ్మెల్యే ముందు యువతి కన్నీళ్లు
-
Ameerpet: యువతి స్నానం చేస్తుండగా ఫొటోలు
హైదరాబాద్: హాస్టల్లో నివాసముంటున్న ఓ యువకుడు హాస్టల్ యజమాని కుమార్తె స్నానం చేస్తుండగా ఫొటోలు తీయడంతో అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ బాపూనగర్లోని ప్రైవేటు హాస్టల్లో వరంగల్ జిల్లా, గీసుకొండకు చెందిన రంజిత్ (28) ఉంటున్నాడు. సేల్స్ మెన్గా పనిచేసే రంజిత్ హాస్టల్ యజమాని కుమార్తె స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి రహస్యంగా ఫొటోలు తీశాడు. దీనిని గుర్తించిన సదరు యువతి కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు రంజిత్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘దీన్ని తన్ని స్టేషన్లో వేయండి’
పామర్రు: తన తండ్రిని పోలీసులు ఎందుకు స్టేషన్కు పిలిపించారో తెలుసుకుందామని వెళ్లిన ఓ దళిత యువతి పట్ల అకారణంగా దుర్భాషలాడటమే కాక.. బూటుకాళ్లతో తన్నుతూ.. జుట్టు పట్టుకుని లాగుతూ చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్పృహ కోల్పోయిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కృష్ణాజిల్లా పామర్రు మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జుఝవరపు చిన్ని అదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి కుమారుడు తేజ, కుమార్తె సుప్రియ ఉన్నారు. తేజ తండ్రితో పాటు పనులు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో చెట్లు నరికే పనులకు వెళ్తుంటాడు.కుమార్తె సుప్రియ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. మూణ్ణెళ్ల క్రితం గ్రామంలో ఓ చోట చెట్ల పొదల్లో కలి్టవేటర్ ఎంతోకాలంగా ఉందని గమనించిన తేజ, దాన్ని ఓ పాత ఇనుప సామాన్ల వ్యాపారికి రూ.3 వేలకు విక్రయించాడు. కొద్దిరోజుల తర్వాత ఓ వ్యక్తి వచ్చి కలి్టవేటర్ తనదని చెప్పడంతో తేజను తండ్రి మందలించి ఆ వ్యాపారికి రూ.3 వేలు చెల్లించి దానిని సంబంధిత వ్యక్తికి అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో.. శనివారం ఉదయం పామర్రు పోలీస్స్టేషన్ నుంచి జుఝవరపు చిన్నికి పోలీసులు ఫోన్ చేసి స్టేషన్కు రావాలని చెప్పారు. పనులు ముగించుకుని చిన్ని సాయంత్రం స్టేషన్లో సీఐ సుభాకర్ వద్దకు వెళ్లాడు. సీఐ దుర్భాషలాడుతూ.. పసుమర్రులో ఓ రైతు గడ్డర్ పోయిందని.. దానిని తీశారా అంటూ ప్రశి్నంచారు. తమకు తెలీదని చిన్ని బదులిచ్చాడు. ఎవర్రా ఇది.. ఎక్కువ మాట్లాడుతోంది.. అదే సమయంలో విజయవాడ నుంచి వచ్చిన సుప్రియ.. తన తండ్రిని పోలీసులు పిలిపించారని తెలుసుకుని భయంతో సీఐ వద్దకు వెళ్లింది. పోలీసులు ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్కడే ఉన్న తేజను ‘ఏరా నువ్వు దొంగతనాలేనా.. మానభంగాలు కూడా చేస్తున్నావా?’ అంటూ పామర్రు ఎస్ఐ ప్రశి్నంచారు. ‘సార్ కాస్త మర్యాదగా మాట్లాడండి. మేం చదువుకున్నాం.మాకూ రూల్స్ తెలుసు’ అని సుప్రియ అనడంతో ఎస్ఐ కోపంతో.. ‘ఎవ్వర్రా ఇది? ఎక్కువగా మాట్లాడుతోంది. దీన్ని తన్ని స్టేషన్లో వేయండి’ అంటూ పోలీసులను ఆదేశించారు. వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మహిళా హోంగార్డు సుప్రియను డాబాపై నుంచి బూటుకాళ్లతో తన్నుకుంటూ, జుట్టు పట్టుకుని లాక్కుంటూ కిందకు తీసుకొచ్చారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇది చూసి బాలిక తండ్రి చిన్ని 108కు ఫోన్చేయగా వారు వచ్చి రక్తపు గాయాలు లేనందున తాము ఆస్పత్రికి తీసుకెళ్లబోమని చెప్పి వెళ్లిపోయారు. ఇక చేసేదిలేక చిన్ని తన కుమార్తెను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. దీనిపై సీఐ సుభాకర్ను వివరణ కోరగా.. పోలీస్స్టేషన్లోని హోంగార్డునే ఆ యువతి కొట్టి గాయపర్చిందని, అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయని బదులిచ్చారు. ఆమెపైన కేసు నమోదు చేశామన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
హైదరాబాద్: ప్రేమ విషయంలో మానసిక ఒత్తిడికి గురై ఓ యువతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించానని వెంటపడ్డ యువకుడు దాడిచేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బుధవారం ధర్నా, రాస్తారాకో నిర్వహించారు. చిలకలగూడ ఠాణా పరిధిలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా రేబల్లె గ్రామానికి చెందిన గుడిసె కోటేశ్వరరావు, రమాదేవి దంపతులు సికింద్రాబాద్ శ్రీనివాసనగర్లో ఉంటూ పద్మారావునగర్లో కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, ఇంటర్ చదువుతున్న కుమార్తె జెనిమా (19) ఉన్నారు. జగదీష్ అనే యువకుడు, జెనిమా కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో జెనిమా కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతోంది. మంగళవారం ఉదయం జెనిమా మాత్రమే ఇంట్లో ఉంది. ఆసమయంలో జగదీష్ ఇంటికి వచ్చాడు. కొంత సమయం తర్వాత యువతి తల్లి రమాదేవికి ఫోన్ చేసి .. మీ కుమార్తె లోపల నుంచి తలుపు గడియపెట్టుకుంది. మీరు త్వరగా రావాలని చెప్పాడు. జెనిమా తల్లి రావడంతో స్థానికులతో కలిసి జగదీష్ తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. ద్విచక్ర వాహనంపై గాం«దీఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.. తమ కుమార్తెను జగదీష్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా జెనిమాపై దాడికి పాల్పడి ఆపై హత్య చేశాడని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం చిలకలగూడ గాంధీ చౌక్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలు మహబూబ్నగర్ జిల్లా నర్వ మండలం పెద్దపుడుమూరుకు చెందిన నిందితుడు జగదీష్ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చిలకలగూడ ఎస్హెచ్ఓ రామకృష్ణ తెలిపారు. మృతురాలి ఇంట్లో సూసైడ్నోట్ స్వాదీనం చేసుకున్నామని, అందులో ప్రేమ విషయమై మానసిక ఒత్తిడికి గురైనట్లు ఉందని స్పష్టం చేశారు. మృతురాలి కాళ్లకు గాయాలైనట్లు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. -
బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!
ప్రపంచంలో అందమైన మహిళ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ బాహ్య సౌందర్యానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రపంచంలో, బిడ్డలకోసం ఎంతో అవమానాన్ని నెత్తిన వేసుకున్న మహిళ గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించక మానదు. కుటుంబ పోషణ కోసం 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ' అన్న బిరుదును స్వీకరించిన సాహసి పేరు మేరీ ఆన్ బెవాన్. తన పిల్లల ఆకలి తీర్చడం కోసం తన ఆత్మగౌరవాన్ని సైతం పణంగా పెట్టి ఈ తల్లి గొప్ప పోరాటమే చేసింది. ఇంతకీ ఎవరా మాతృమూర్తి? ఎందుకు వికారమైన మహిళగా మారింది తెలుసుకుందాం పదండి..!1874లో లండన్లోని న్యూహామ్లో పేద కుటుంబంలో జన్మించింది మేరీ ఆన్ బెవాన్, నర్సింగ్ కోర్స్ చదివి 1894లో నర్సుగా మారింది. ఆ తరువాత థామస్ బెవాన్ అనే వ్యక్తిని ప్రేమిం వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు కలిగారు. జీవితం ఎంతో సాఫీగా సాగిపోతున్న తరుణంలో 32 ఏళ్ల మేరీ జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వైద్యులకు పెద్దగా తెలియని అక్రోమెగాలీ(Acromegaly) అనే అరుదైన వ్యాధి మేరీకి సోకింది. దీంతో కుటుంబమంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైంది. అంతుచిక్కని వ్యాధి - వికృత రూపంమేరీకి అక్రోమెగాలీ సోకడంతో, శరీరంలో వింత మార్పులు మొదలయ్యాయి. ముఖంలోని ఎముకలు, కండరాలు ఉబ్బి, సాధారణం కంటే మూడు రెట్లు పెద్దవిగా మారాయి. చేతులు, కాళ్లు పెద్దవిగా పెరగడం ప్రారంభించాయి. దవడ కిందికి సాగిపోయి ముఖం ఆకారం మారిపోయింది ముక్కు వెడల్పుగా మారింది. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే, ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన మునుపటి 'అందమైన' రూపానికి ఏమాత్రం పోలిక లేకుండా పోయింది.శరీరంలో గ్రోత్ హార్మోన్ అధికంగా విడుదలవ్వడం వల్ల వచ్చే సమస్య. ఇది ఇలా కొనసాగుతుండగానే దురదృష్టం మరోసారి వెంటాడింది. 1914లొ ఆమె భర్త థామస్ మరణించాడు. ఫలితంగా నలుగురు పిల్లలతో మేరీ ఒంటరిదైపోయింది.ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరుపిల్లల కోసం తల్లి మనసు ఆరాటంరూపం మారిపోవడంతో ఆమెకు ఎక్కడా పని దొరకలేదు. ప్రజలు ఆమెను చూసి నవ్వుతుంటే, మరికొందరు భయపడేవారు. పిల్లలకు తిండి పెట్టడమే కష్టమైన తరుణంలో, 1920వ దశకంలో "ప్రపంచంలోనే అత్యంత వికృతమైన మహిళ కావాలి - భారీ వేతనం ఇవ్వబడును." అనే ఒక ప్రకటన చూసింది: కుటుంబానికి సహాయపడే బహుమతి డబ్బును గెలుచుకోవాలనే ఆశతో పోటీకి దిగింది. ఆమె ప్రయత్నాలు ఫలించాయి, ఆమె ఆ పోటీలో గెలిచి 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ'గా పేరు పొందింది. ఎన్నో ఫ్రీక్ షో లలో చేరింది. వేదికపై నిలబడితే జనం ఎగతాళి చేసేవారు. కానీ ఆ తర్వాత ప్రసిద్ధ షోమాన్ పి.టి. బర్నమ్ పిలుపు మేరకు ఆమె అమెరికాకు వెళ్లి కోనీ ఐలాండ్లో ప్రదర్శనలు ఇచ్చింది.అలా త్వరలోనే సర్కస్లో స్పెషల్ ఎట్రాక్షన్గా మారిపోయింది. 1933లో చనిపోయే వరకు కోనీ ఐలాండ్లోని డ్రీమ్ల్యాండ్ సైడ్షోలో 'ఫ్రీక్ షో' ప్రదర్శకురాలిగా పనిచేసింది.మేరీ ఆన్ బెవాన్ 1933, డిసెంబరు 26న లో తన 59వ ఏట కన్నుమూసింది. తన రూపంతో జీవితాంతం ఎన్నో అవమానాల్ని మోసింది. కానీ ఆ అవమానాల నుండి వచ్చిన డబ్బుతోనే తన బిడ్డల కడుపు నింపింది. వారిని గౌరవప్రదంగా పెంచి పెద్ద చేసిన విద్యావంతుల్ని చేసింది.తన పిల్లల భవిష్యత్తు కోసం, బిడ్డలుఆకలితో అలమటించకూడదని మేరీ పోటీలో పాల్గొంది. ఆ పోటీలో ఆమె గెలిచి అవమానకరమైన కిరీటాన్ని జీవితాంతం మోసింది. కానీ అది ఒక తల్లిగా ఆమె మనసును ఎంతగా గాయపరిచిందో ఊహించగలమా? కానీ వాటన్నింటినీ అధిగమించి పిల్లల్నిప్రయోజకుల్ని చేయడమే కాదు, అక్రోమెగలీతో బాధపడే చాలా మందికి మేరీ స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచింది. లోకం దృష్టిలో ఆమె కేవలం ఒక "వికృత మనిషి" కానీ పిల్లల దృష్టిలో తమను ప్రాణప్రదంగా కాపాడుకున్న "అమ్మ". చరిత్రలో "అత్యంత అందమైన మనసున్న తల్లి"గా నిలిచిపోతుంది. ఏమంటారు? -
ఫోటో దిగుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయి..
ఖమ్మం: ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా స్టేజ్లపైనే కుప్పకూలిపోయి మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లి గుండె పోటుతో మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరానికి చెందిన ఓ మహిళ.. బంధువుల గృహ ప్రవేశ వేడుకకు వెళ్లింది. అయితే అక్కడ ఫోటో దిగుతున్న సందర్భంలో పక్కనున్న మరొక మహిళతో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయింది. ఆ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఖమ్మం టూటౌన్కు చెందిన బొమ్మ సుస్మిత అనే మహిళ.. ఖమ్మంలోని ఓ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లారు. అయితే అప్పటివరకూ అందరితో కలివిడిగా మాట్లాడుతూ తిరిగిన మహిళ.. ఫోటో దిగుతున్న సమయంలో గుండెపోటుకు లోనైంది. ఒక్కసారిగా పక్కనున్న మహిళపై చేయి వేస్తూనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
మంచిర్యాల: వృద్ధురాలి చేతిని పీక్కుతిన్న పిల్లులు!
సాక్షి, మంచిర్యాల జిల్లా: హృదయ విదారక స్థితిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చనిపోయిన ఆమె చేతిని పెంపుడు పిల్లులు పీక్కుతిన్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని భగత్సింగ్ నగర్కు చెందిన జక్కనబోయిన లక్ష్మి (80) తన రెండో కుమారుడు సమేందర్ దగ్గర ఉంటున్నారు. అతను పని నిమిత్తం బెల్లంపల్లికి వెళ్లగా లక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉండిపోయారు.ఈ క్రమంలో ఆమె గడప తగిలి కింద పడిపోగా తలకు గాయమై అచేతన స్థితికి చేరుకున్నారు. ఇంట్లో లైట్లు వెలగకపోవడం.. అలికిడి లేకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లిచూడగా కదల్లేని స్థితిలో ఆమె ఉండడం చూసి కుమారులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సరికి ఆమె చనిపోయి ఉన్నారు.అయితే, ఇంట్లో ఉన్న రెండు పెంపుడు పిల్లలు ఆమె చేతిని చాలా వరకు పీక్కుతినడం స్థానికులను కలచివేసింది. సీఐ పర్స రమేష్, ఎస్సై నరేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇక ‘టోల్’ తీసే బాధ్యత మహిళలకే..
న్యూఢిల్లీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతకు బాటలు వేస్తూ, టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులను నియమించనున్నట్లు ప్రకటించింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 1,140కి పైగా టోల్ ప్లాజాల వద్ద సుమారు 5,100 మంది మహిళలను పగటిపూట షిఫ్టుల్లో నియమించనున్నారు.నేషనల్ హైవేస్ అథారిటీ నిర్ణయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళలకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హైవే మౌలిక సదుపాయాల రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. టోల్ బూత్ల వద్ద మహిళా సిబ్బంది ఉండటం వల్ల వాహనదారులకు మరింత మర్యాదపూర్వకమైన సేవలు అందుతాయని నేషనల్ హైవేస్ అథారిటీ భావిస్తోంది.సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య జరిగే వాగ్వాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం దోహదపడనుంది. ప్రశాంతమైన, వృత్తిపరమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు నేషనల్ హైవేస్ అథారిటీ పలు కీలక భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపింది. ఎన్హెచ్బీఎఫ్, హెచ్ఓఏఐ, ఏఐటీయూసీ తదితర సంఘాలతో పాటు టోల్ ఆపరేటర్లు కూడా ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు ప్రకటించారు.ఈ వినూత్న కార్యక్రమం అమలునునేషనల్ హైవేస్ అథారిటీ నిరంతరం పర్యవేక్షించనుంది. విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా వారికి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, టోల్ ఆపరేషన్లలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించడం, భద్రతా నియమాలపై అవగాహన తదితర అంశాల్లో శిక్షణ అందించనున్నారు.ఇది కూడా చదవండి: సోనమ్ వాంగ్చుక్ విడుదల -
హైదరాబాద్లో ‘రాంబాయి’ సినిమా తరహాలో ఘటన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పోచారంలో ‘రాంబాయి’ సినిమా తరహాలో ఘటన జరిగింది. పెళ్లికి నిరాకరించిన యువతికి యువకుడు ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించాడు. యువకుడితో పాటు తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ సోకింది. యువకుడు మనోహర్తో యువతికి వివాహం నిశ్చయమైంది. ఎయిడ్స్ ఉందని తేలడంతో యువతి.. పెళ్లికి నిరాకరించింది.ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి, తనను పెళ్లి చేసుకోవాలంటూ మనోహర్ ఒత్తిడి తెచ్చాడు. పెళ్లికి నిరాకరించడంతో మనోహర్ ఎయిడ్స్ ఇంజెక్షన్ చేశాడు. నిందితుడిని పోచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్
ఆగ్రాలో ఒక మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. నాలుగేళ్లు సహజీవనంచేసి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఒక పోలీస్ కానిస్టేబుల్పై ఆరోపణలు గుప్పిస్తూ చనిపోయే ముందు ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు కూడా విజ్ఞప్తి చేయడంతో ఇది వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సంచలనంగా మారడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అసలు స్టోరీ ఏంటంటే..ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధిత మహిళది స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లా. ఆమె అంతకుముందే విడాకులు తీసుకుని, ఆగ్రాలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో తాజ్గంజ్ పోలీస్ స్టేషన్లోపనిచేస్తున్న జేవీ గౌతమ్ అనే కానిస్టేబుల్తో పరిచయమైంది. దీంతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కుటుంబం ఒప్పుకోదు అంటూ పెళ్లికి నిరాకరించాడు. చివరికి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో వివాదం రేగింది. తీవ్ర ఆవేదనతో వీడియో సందేశం రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వీడియోలో ఇలా పేర్కొంది..తాను కలిసి జీవించిన గౌతమ్ చేతిలో ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఆ తర్వాత మాట తప్పాడని పేర్కొంది. గౌతమ్తో జీవించిన కాలంలో తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆమె పేర్కొంది. ఫిర్యాదు చేయడానికి తాను పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు, తమ చేతుల్లో ఏమీ లేదని, ఆ కానిస్టేబుల్పై ఎటువంటి చర్యలూ తీసుకోలేమని అక్కడివారు చెప్పినట్లు ఆమె తెలిపింది. తాను బతికి ఉన్నప్పుడు తనకు న్యాయం జరగలేదని, కనీసం తన మరణం తర్వాత అయినా తనకు న్యాయం జరగాలని ఆశించింది. అంతేకాదు గౌతమ్, అతని కుటుంబ సభ్యులు తనను ఎంతో మోసం చేశారని, మానసికంగా వేధించారని, చివరికి ఈ దారుణ నిర్ణయం తీసుకునేలా తనను నెట్టారని ఆమె ఆరోపించింది. ఏళ్ల తరబడి అతనితో కలిసి జీవించిన తర్వాత, ఇప్పుడు అతను వేరొక మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని ఆమె వాపోయింది."నా మరణానికి జేవీ గౌతమ్, అతని కుటుంబం మొత్తం కారణం. వారు నన్ను ఎంతగానో మోసం చేశారు. మానసికంగా ఎంతగా వేధించారంటే, చివరికి నేను చనిపోయేలా నన్ను బలవంతం చేశారు." అని చెప్పింది. అలాగే ‘‘అతని అన్నయ్య ఒకవైపు నన్ను పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు. మరోవైపు, నా కుటుంబం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదని జేవీ గౌతమ్ నాతో చెబుతున్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం ఏ అమ్మాయినీ మోసం చేయకు," అని పేర్కొంది."Don't get married to anyone, but don't keep any girl in deception either"The young woman who made a video before suicide in Agra leveled serious allegations of deception against police constable Jitendra Gautam!!Constable is arrested and send to Jail.99 percent of Live in… pic.twitter.com/OCDlXiEbLb— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 13, 2026 ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో కానిస్టేబుల్ జె.వి. గౌతమ్ను సస్పెండ్ చేశారు. మరోవైపు ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుమార్తెకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. -
Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ సందర్భంగా స్ఫూర్తిదాయక మహిళలను గుర్తుచేసుకోవడం మన కర్తవ్యం. కేరళకు చెందిన రేవతి విజయన్ ఓ వైపు ఉన్నత చదువుల కోసం ‘పరిశోధన’ సాగిస్తూ, మరోవైపు కుటుంబాన్ని ఆదుకునేందుకు అర్ధరాత్రి వరకు ఇడ్లీల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఒట్టపాలం మయన్నూర్ వంతెన సమీపంలో రాత్రిపూట రోడ్డు పక్కన ఆమె నడుపుతున్న చిన్నపాటి ఇడ్లీ స్టాల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది.త్రిస్సూర్ జిల్లా పజయన్నూర్ నివాసి అయిన 30 ఏళ్ల రేవతికి చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో మక్కువ. తండ్రి విజయన్ టైలర్ కాగా, తల్లి ప్రియ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తున్నారు. త్రిస్సూర్లోని విమల కళాశాలలో మలయాళంలో డిగ్రీ, అనంతరం ఒట్టపాలం ఎన్ఎస్ఎస్ కళాశాలలో రేవతి బీఈడీ పూర్తి చేశారు. తన చదువు ఖర్చుల కోసం కుటుంబంపై భారం పడకూడదనే ఉద్దేశంతో రేవతి ట్యూషన్లు చెబుతూ, ఆర్థిక స్వాలంబన సాధించారు.వివాహం, ఇద్దరు పిల్లల బాధ్యతల మధ్య తన విద్యాభ్యాసం ఆగిపోతుందేమోనని రేవతి ఆందోళన చెందారు. అయితే తిరిగి పుస్తకం చేత పట్టి, పీజీ పూర్తి చేయడమే కాకుండా, గోల్డ్ మెడలిస్ట్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదటి ప్రయత్నంలోనే ‘నెట్’ (NET) అర్హత సాధించారు. అనంతరం రేవతికి పీహెచ్డీ చేసే అవకాశం లభించింది. అయితే ఇందుకోసం ప్రతిరోజూ పజయన్నూర్ నుంచి త్రిస్సూర్ వరకు ప్రయాణించడం ఆర్థికంగా భారమైంది. దీంతో రాత్రిపూట ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న రేవతి మయన్నూర్ వంతెన వద్ద ‘ఫ్రెష్ మూన్’ పేరుతో ఇడ్లీ స్టాల్ ప్రారంభించారు.కేవలం సాధారణ ఇడ్లీలే కాకుండా.. తట్టు ఇడ్లీ, మసాలా ఇడ్లీ, ఎగ్ ఇడ్లీ, మటన్ ఇడ్లీ, చికెన్ ఇడ్లీ, పొడి ఇడ్లీ వంటి దాదాపు 10 రకాల వైవిధ్యమైన రుచులతో వినియోగదారుల మనసు గెలుచుకుంటున్నారు. రేవతి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కళాశాలలో పరిశోధన పనుల్లో నిమగ్నమై, సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 గంటల వరకు స్టాల్ దగ్గర కష్టపడుతుంటారు. ఈ ప్రయాణంలో ఆమె భర్త అనూప్, సోదరి గౌరీ నంద ఆమెకు సాయంగా నిలుస్తున్నారు. ఇది కూడా చదవండి: రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం -
మానవ మృగాల పాశవికం.. మతిస్థిమితం లేని యువతి గర్భిణి
కొందరు మనుషులు మృగాల కన్నా హీనంగా మారారు. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాలు చేసిన గాయాలతో శరీరం పుండుగా మారింది. అయినా వదల్లేదు. తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో గర్భం దాల్చి రోడ్డున అనాథగా సంచరిస్తున్న ఆమెను మానవతావాది అయిన ఓ ఉపాధ్యాయురాలు గుర్తించి పోలీసుల సాయంతో అనాథాశ్రమానికి చేర్చింది. ప్రస్తుతం ఆ యువతి నిండు గర్భిణి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఓ అభాగ్యురాలి దీనగాథ పలువురిని కలిచి వేస్తోంది.అనంతపురం కల్చరల్: మతిస్థిమితం లేని యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటన కళ్యాణదుర్గం ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. అయినా నేటికీ దోషులెవరో బయటపడలేదు. వారు చేసిన పాపం యువతి గర్భంలో పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. అనాథగా రోడ్డుపై సంచరిస్తూ... కొన్ని నెలల క్రితం కళ్యాణదుర్గంలోని రహదారులపై మతిస్థిమితం లేకుండా ఒంటరిగా తిరుగుతున్న యువతిని ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శశికళ గమనించింది. పలకరించే ప్రయత్నం చేయడంతో సమాధానం ఇవ్వలేదు. ఆకలిగా ఉందా? అని ప్రశ్నించినా మౌనమే సమాధానమైంది. దీంతో అప్పటికప్పుడు ఆహారాన్ని కొనుగోలు చేసి యువతి చేతికి ఇవ్వడంతో ఎన్నాళ్లుగా ఆకలితో ఉందో తెలియదు కానీ గబగబా మొత్తం తినేసింది. ఆ సమయంలో యువతి బెదురు చూపులు గమనించిన శశికళ... ఆమె ఏదో ప్రమాదంలో ఉందని గ్రహించి, విషయాన్ని వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సాయంతో యువతిని అనంతపురం రూరల్ పరిధిలోని కాట్నేకాలువలో ఉన్న ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చారు. శరీరమంతా పుండుగా మారి.. మతి స్థిమితం కోల్పోయి బెదురు చూపులతో ఆశ్రమానికి చేరుకున్న యువతిని నిర్వాహకులు కృష్ణారెడ్డి, దేవి దంపతులు అప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. 25 ఏళ్ల వయస్సులోనూ ఆరేళ్ల చిన్నారిలా ప్రవర్తిస్తున్న ఆ యువతిని ఎంత ప్రశ్నించినా తన తల్లిదండ్రులెవరో చెప్పలేని స్థితిలో ఉంది. శరీరంపై గాయాలు ఉండడంతో ఆస్పత్రికి పిలుచుకెళ్లి చూపించారు. ఆ సమయంలో గాయాలను పరిశీలించిన వైద్యులు అవి మానవ మృగాలు చేసినవిగా నిర్ధారించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె గర్భంతో ఉన్నట్లుగా ధ్రువీకరించారు. ఆ సమయంలో అత్యాచారం జరిగిన విషయం గాని తెలియని స్థితిలో యువతి అమాయకంగా చూస్తుండడం గమనించిన వైద్యులు, సిబ్బంది హృదయాలు ద్రవించి పోయాయి. చికిత్స అనంతరం ఆమెను ఆశ్రమానికి చేర్చిన కృష్ణారెడ్డి దంపతులు అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. పుండుగా మారిన శరీరాన్ని రోజూ శుభ్రం చేస్తూ ఆమెకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ వచ్చారు. ప్రస్తుతం యువతి నిండు గర్భిణి. రేపో.. మాపో ప్రసవమయ్యే సూచనలు ఉన్నాయి. తలుచుకుంటేనే భయమేస్తోంది మానవత్వమున్న ఉపాధ్యాయురాలు గుర్తించి ఈ యువతిని మా ఆశ్రమానికి చేర్చారు. ఆమె ఆశ్రమానికి వచ్చేనాటికి శరీరం మొత్తం పుండుగా మారి ఉంది. మానవ మృగాలు ఎంత పైశాచికంగా పాడు చేశారో తలుచుకుంటేనే భయమేస్తోంది. కనీసం తన తల్లిదండ్రులెవరు అనే విషయం కానీ, తనపై అత్యాచారం జరిగిందనే విషయం గాని ఆమెకు తెలియదు. ఎంతో అమాయకంగా ఉంది. ఆమె భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తోంది. ఆశ్రమంలో ఎందరో అనాథలు ఉన్నారు. వీరెవ్వరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవు. వీరి దైన్య స్థితిపై అధికారులు స్పందించి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు చేస్తే ఆదుకునే అనాథాశ్రమాలకు ఎంతో మేలు చేసిన వారవుతారు. – దేవి, ఆశ్రయ అనాథాశ్రమ నిర్వాహకురాలుఆమె పరిస్థితి చూసి చలించిపోయాను నేను ప్రస్తుతం ఆత్మకూరు మండలం పంపనూరులోని ఎంపీపీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నిరాశ్రయులైన మహిళలెవరైనా కనిపిస్తే అనాథశ్రమాలకు చేరుస్తుంటాను. అలా ఒకసారి కళ్యాణదుర్గంలోని పోలీసుస్టేషన్ సమీపంలో డివైడర్ వద్ద రెండేళ్లుగా దిక్కు లేకుండా కూర్చొని ఉన్న ఓ యువతి కనిపించింది. ఆ సమయంలో ఆమె పరిస్థితి చూసి చలించిపోయాను. వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి, వారి సహకారంతోనే ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చాను. రోజులు గడుస్తుండగా ఆమె శరీరంలో మార్పులు గమనించి వైద్యులకు చూపిస్తే గర్భిణి అని తెలిసింది. ఈ అమానుషంపై ఎవరూ స్పందించకపోవడం బాధాకరం. – శశికళ, ఉపాధ్యాయురాలు -
కుటుంబ బాధ్యత.. ఆర్థిక భరోసా!
మూసాపేట: మహిళలు ఆర్థికంగా ఎదిగనప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత తరంలో ఎందరో మహిళలు చిన్న ఉద్యోగాల నుంచి రైలు, విమానాలు నడిపిస్తున్నారు. ఉద్యోగాలే కాకుండా వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. ప్రభుత్వాలు పేద, మద్య తరగతి మహిళలను, చదువురాని మహిళలు కూడా తమ కాళ్లపై నిలబడేవిధంగా ప్రోత్సహిస్తున్నాయి. మూసాపేట పరిసర ప్రాంతాల్లో సమైఖ్య మహిళ గ్రూపులో ఉండి బ్యాంకు లోన్లు తీసుకుని చిన్న, చిన్న వ్యాపారాలు ఎదుగుతూ తోటి వారికి ఆదర్శంగా ఉన్న పలువురి మహిళల గురించి అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. లోన్తో మేకప్ టీచర్గా... మూసాపేటలో నివాసం ఉండే భాగ్యవతి వైష్ణవి దేవి మహిళ గ్రూపులో 10 మంది మహిళల్లో ఆమె ఒక్కరు. మూడు సంవత్సరాల క్రితం గ్రూపునకు బ్యాంక్ లోన్ మంజూరైంది. తన భాగానికి వచ్చిన రూ. 60 వేలతో మేకప్గా శిక్షణ తీసుకుంది. అనంతరం వాటికి మరికొంత డబ్బు జమ చేసి మేకప్ కిట్ కొనుగోలు చేసింది. అనంతరం మూసాపేట భవానీనగర్లో ఉన్న మేకప్ స్టూడియోలో 12 మందికి టీచింగ్ చేస్తుంది. బ్యాచ్కు 12 మందికి టీచింగ్ ఇస్తూ వారిని మేకప్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక ఈవెంట్లు, పెళ్లిలకు మేకప్లు వేస్తూ నెలకు రూ.50 నుంచి 70వేల వరకు సంపాదిస్తుంది. బ్యాంక్ లోన్ తానేకడుతూ మేకప్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లేందేకు కృషి చేస్తుంది. ప్రముఖ సింగర్ గీత మాధురికి కూడా మేకప్ వేసి ఔరా అనిపించింది. గోలీసోడా వ్యాపారంలో.. గోలిసోడా కొడుతూ వ్యాపారంలో రాణిస్తుంది భరత్నగర్కాలనీకి చెందిన ఎస్. సంధ్య. కాలనీలోని కల్వరి మహిళ పొదుపు సంఘంలో పది మందిలో తాను ఒక్కరు. నెలన్నర క్రితం గ్రూపునకు భ్యాంక్ లోన్ రావడంతో తన భాగం రూ.1.80 లక్షలు వచ్చాయి. వాటితో కొన్ని అప్పులు తీర్చుకుని సుమారు రూ.50వేలతో ఆరెంజ్ గోలి సోడా షాపును ఏర్పాటు చేసుకుంది. వేసవికాలంలో గోలిసోడకు ఆదరణ ఉండటంతో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. పిల్లలను స్కూల్కు పంపి, భర్తను ఉద్యోగానికి పంపి గోలి సోడా కొడుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు షాపు నడిపిస్తుంది. ఒక్కరి వద్ద ఉద్యోగం చేసే బదులు వ్యాపారం ఎంతో మేలు అని అంటుంది. రాజకీయాల్లో రాణిస్తూ బోటిక్ నడిపిస్తూ.. గృహిణిగా పిల్లలు, భర్త బాధ్యతలు చూసుకుంటూనే రాజకీయాలపై మక్కువతో బీఆర్ఎస్ మహిళ కార్యకర్తగా, సోషల్ మీడియా వారియర్గా రాణిస్తుంది మూసాపేట జనతానగర్కు చెందిన శిరీష. కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుని శ్రీహర్ష పేరుతో బోటిక్ నడిపిస్తుంది. భర్త ఇచ్చిన డబ్బులతో పాటు మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్ రూ. 35వేలతో కుట్టు మిషన్ ఇప్పించడంతో షాపును ఏర్పాటు చేసింది. షాపులో ప్రస్తుతం ముగ్గురు పనివారు, నాలుగు కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుంది. చీరలు అమ్మడంతో పాటు సంక్రాంతికి గాలి పటాలు, దీపావళికి టపాసులు, రాఖీ పౌర్ణమికి రాఖీలు విక్రయిస్తుంది. -
హోలీలో విషాదం: మనవడిపై నాన్నమ్మ పైశాచికం
నాగ్పూర్: రంగుల పండుగ హోలీ వేళ మహారాష్ట్రలోని నాగ్పూర్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అల్లరి చేస్తూ, తనపై రంగు చల్లాడన్న కోపంతో, మనవడిపై ఒక నాన్నమ్మ తన పైశాచికాన్ని చూపింది. నాగ్పూర్ జిల్లా కోరాడి ప్రాంతంలోని ఆరామ్షీన్ వార్డు-2లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓమ్ అనే నాలుగేళ్ల బాలుడు తన ఇంటి బయట రంగుల నీళ్ల బాటిల్తో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అతడి నాన్నమ్మ సింధు థాకరే కట్టెల పొయ్యిపై నీళ్లు కాచుకుని బకెట్తో వెళుతోంది. ఇంతలో ఆ బాలుడు పొరపాటున ఆమెపై రంగు నీళ్లు జల్లాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సింధు.. తన చేతిలో ఉన్న మరుగుతున్న నీళ్లను ఆ బాలునిపై పోసింది. ఈ ఊహించని దాడితో ఆ పసివాడు విలవిలలాడిపోయాడు.ఆ సమయంలో అక్కడే ఉన్న మరో మహిళ వెంటనే స్పందించి, ఆ చిన్నారిపై చన్నీళ్లు పోసి, ఉపశమనం కలిగించే ప్రయత్నించింది. ఆ తర్వాత నిందితురాలు కూడా పశ్చాత్తాపంతో బాలునిపై చన్నీళ్లు పోయడం వీడియోలో కనిపించింది. ఈ ఘటనలో బాలుడికి నడుము కింది భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సుమారు 45 శాతం మేర శరీరం కాలిపోవడంతో బాలుడిని నాగ్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితురాలు సింధు థాకరేపై పోలీసులు కేసు నమోదు చేశారు.బారాబంకిలో ఘర్షణఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో హోలీ వేడుకలు హింసాత్మకంగా మారాయి. రంగులు చల్లుకునే విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం చివరికి ముష్టిఘాతాలకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేసుకోవడంతో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 10 నిమిషాల పాటు కొనసాగిన ఈ ఘర్షణ స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ప్రత్యర్థి వర్గం తన ఇంట్లోకి చొరబడి ఆడవారిపై కూడా దాడులు చేశారని స్థానికుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.ఇది కూడా చదవండి: ‘నీలి విషం’ బారిన 61 శాతం భారతీయులు -
ఒక భార్య... ఇద్దరు భర్తలు
బ్యాంకాక్: థాయ్లాండ్కు చెందిన 37 ఏళ్ల మహిళ దువాంగ్దువాన్ కెట్సారో వివాహం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కనుల పండువగా జరిగినందుకో లేక అట్టహాసంగా జరిగినందుకో కాదు..పెళ్లి జరిగిన తీరు విచిత్రంగా ఉండటమే అందుకు కారణం. కెట్సారో ఇటీవల జరిగిన వేడుకలో ఆస్ట్రియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మనువాడింది. వీరిద్దరితో ఏళ్లుగా కొనసాగిస్తున్న బంధం నిజాయతీ, పరస్పర అంగీకారమే మూలమని ఆమె అంటోంది. గాయని, పాటల రచయిత అయిన కెట్సారో మొదటగా ఆస్ట్రియా వాసి రోమన్తో స్నేహం చేసింది. రిటైర్డు పోలీసు అధికారి అయిన రోమన్తో కలిసి పట్టాయా నగరంలో ఐదేళ్లపాటు కలిసి సహజీనం సాగించింది. ఆ సమయంలో వారి బంధం బలపడింది. తర్వాత, ఆస్ట్రియాకే చెందిన పోలీసు అధికారి మ్యాకీతో పరిచయమేర్పడింది. ఇతడికి దగ్గరైంది. వీరి ముగ్గురి మధ్య బంధం క్రమంగా ఒక అసాధారణ భాగస్వామ్యంగా రూపాంతరం చెందింది. ముగ్గురూ కలిసి కూర్చుని భవిష్యత్తులో కలిసి ఎలా ఉండాలనే విషయం చర్చించుకుని, ఒక నిర్ణయం తీసుకున్నారు. కాగా, కెట్సారోకు మొదటి వివాహం ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు మనవలు ఉన్నారు. తల్లిదండ్రులు, కుమార్తెలతోపాటు ఇతర కుటుంబసభ్యులకు సైతం ఆస్ట్రియా వాసులతో కొనసాగుతున్న బంధాన్ని గురించి తెలిపింది. పాటలు రాయడం, పాటడం ద్వారా ఆర్థిక కష్టాలు తీరక ఇబ్బందులు పడుతున్న సమయంలో రోమన్, మ్యాకీలు తనకెంతో బాసటగా నిలిచారని కెట్సారో అంటోంది. తన కుటుంబానికి కూడా సాయపడ్డారని తెలిపింది. ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని చెప్పగా కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలిపారని, వారు తన పట్ల చూపే శ్రద్ధ, అంకితభావమే ఇందుకు కారణమని పేర్కొంది. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి దగ్గరి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ పెళ్లికి ఆస్ట్రియా వరులు చెరో లక్ష బహాట్లు, మన కరెన్సీలో సుమారు రూ.29 లక్షలను కెట్సారోకు సమర్పించుకున్నట్లు సమాచారం. సమాజంలో మారుతున్న వివాహ సంబంధాలకు వీరి పెళ్లి తాజా ఉదాహరణగా భావిస్తున్నారు. -
నగల కోసం వృద్ధురాలి హత్య
తిరుపతి క్రైం: తిరుపతిలో ఆదివారం రాత్రి నగల కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నగరంలోని అరవపల్లె వీధిలో నివాసం ఉంటున్న కె.లక్ష్మమ్మ (67) టీటీడీలో పనిచేసి రిటైరయ్యారు. సోమవారం ఉదయం ఆమె మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం రాత్రి లక్ష్మమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఆమె గొంతు నులిమి, అనంతరం దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.అనంతరం ఆమె వద్ద ఉన్న 100 గ్రాములకుపైగా బంగారు నగలను దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. వెస్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. మృతురాలి చిన్న కుమారుడు వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో మృతురాలి సొంత మనవడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?
2016 డిసెంబరులో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సంచలనమైంది. రూ.500 , రూ.1,000 నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేయడంతో దేశ ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కేంద్ర సర్కారు కొంత సయమాన్ని కూడా ఇచ్చింది. అయితే ఆ సమయంలో పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో అష్టకష్టాలు పడ్డారు. ఈ సందర్భంగా అనేక విషాద ఘటనలు కూడా నమోదైనాయి. అంతేకాదు ఇంట్లో అల్మారాలు, లాకర్లు లేదా పెట్టెల్లో దాచిపెట్టి మర్చిపోయిన పాత కరెన్సీ నోట్ల కట్టలకు సంబంధించి అనేక హృదయ విదారక కథనాలను కూడా చదివాం. కానీ ఇన్నేళ్ల తరువాత కూడా అలాంటి కథ ఒకటి నెట్టింటవైరల్గా మారింది.పెద్ద నోట్లు రద్దైన దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఒక మహిళ తన భర్త నుండి దాచిన రూ.500, రూ.1,000 నోట్లను తాజాగా గుర్తించింది. దీనికి సంబంధించి ఆమె కుమార్తె రికార్డ్ చేసిన వీడియో ఇన్స్టాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను (@ayushidixit) అనే వినియోగదారు షేర్ చేశారు. దీని ప్రకారం.. పాతనోట్లను గుర్తించిన తరువాత అమ్మ తీవ్ర ఆందోళనకు లోనైంది. కంటతడి పెడుతోంది. నాన్నకు తెలియకుండా వీటిని దాచింది. ఇపుడు వీటిని బ్యాంకులు అంగీకరిస్తాయా, లేదా? అంటూ తన ఫాలోయర్స్ను ఉద్దేశించి అడగడాన్ని ఈ వీడియో క్లిప్లో చూడవచ్చు. View this post on Instagram A post shared by AD🧿 (@ayushidixit___)ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్తనెటిజన్లు ఏమన్నారంటేవైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. అయ్యో.. ఆంటీ తొమ్మిదేళ్ల తరువాత గుర్తొచ్చిందా అని కొందరు అంటే, దీనిపై మీ డాడీ రియాక్షన్ కూడా రికార్డ్ చేయండి, ఆయన ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని కొందరు చమత్కరించారు. ఆర్బీఐతో మాట్లాడండి.. ఏమైనా ప్రమోజనం ఉంటుందేమో అని మరికొందరు సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: లాస్ట్ మినిట్లో సెలవు రద్దు, జెన్ జెడ్ స్పందన వైరల్ -
చెత్త కుప్పే ఆ అమ్మకు ఆవాసం
ఆమె ఎవరో ... ఏ ఊరో తెలీదు.. ఆమెకు తెలుగు భాష కూడా రాదు.. ఇక్కడికే ఎందుకొచ్చిందో.. నా అన్నవాళ్లెవరైనా ఉన్నారో సమాచారం లేదు... చెత్తకుప్పే ఆవాసంగా మార్చుకుని.... మురికి కాలువ గట్టే పట్టు పాన్పుగా మలుచుకుని బతుకుతోంది. పగలు మండే ఎండలోనూ.. రాత్రయితే ఎముకలు కొరికే చలిలోనూ బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా కాలం వెల్లదీస్తోంది. సుమారు ఐదు పదుల వయస్సు.. ముడతలు పడిన దేహంతో.. ముసురుకున్న ఈగలతో ‘రోజు’ను భారంగా వెల్లదీస్తోంది. ఈమె ఉండేది ఏ మారుమూల పల్లెలో కాదు.. పట్టణ శివారు అస్సలు కాదు.. మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం పక్కనే దీనంగా బతుకీడుస్తోంది. ఈ దారిలో నిత్యం వేలాదిమంది పోతుంటారు... సాక్షాత్తు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, గెజిటెడ్ ఉద్యోగులు, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ దారిలోనే విధులకు వెళ్తుంటారు. ఆమెను చూశారో లేదో తెలీదు.. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. మానవతాహృదయంతో స్పందించి కాస్త ఆశ్రయం కల్పిస్తే .. కాసింత నీడ కలిపిస్తే చాలు.. ఆ తల్లికి అదే పదివేలు.. మదనపల్లె టౌన్ -
9 నెలల గర్భవతి అని కూడా చూడకుండా..!
తొమ్మిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా భర్త అత్తమామలు వేధింపులకు పాల్పడి, ఇంట్లోంచి గెంటేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సహనం నశించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరింది.ఫిర్యాదు ప్రకారం, జ్యోతి పాండే (34)కు 2017లో ఉత్తరప్రదేశ్లోని బనారస్లో అనురాగ పాండేతో వివాహం జరిగింది. వివాహం తర్వాత భర్తతో కలిసి బెంగళూరుకు వెళ్లింది. తొలి నాలుగేళ్లు వీరి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. అయితే తొలిసారి గర్భం దాల్చింది మొదలు వివాదాలు ప్రారంభమైనాయి. అనుమానంతో భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. తమిళనాడులో ఉన్నప్పుడు, తన భర్త, అత్త మామలు తనతో గొడవపడి శారీరకంగా దాడి చేశారని కూడా జ్యోతి ఆరోపించింది. ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకిఇంతలో జ్యోతి రెండోసారి గర్భం దాల్చింది. తనపై వేధింపుల్లో భాగంగా మళ్లీ,తనపై దాడి చేశాడని, ఇంటి నుండి వెళ్ళగొట్టాడని ఆరోపించింది. తొమ్మిది నెలల గర్భవతిని అయినా, తన ఆరోగ్యం గురించి పట్టించు కోకుండా మానసిక, శారీరక హింసకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కొంతకాలం తన తల్లి ఇంట్లో ఉండి బెంగళూరుకు తిరిగి వచ్చింది. అయినా తనను అవమానించి, వేధిస్తున్నారంటూ దక్షిణ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళల హెల్ప్లైన్లో కుటుంబ కౌన్సెలింగ్ తరువాత, కేసు నమోదు చేసిన పోలీపులు దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ -
తిరుమల క్యూలైన్లో భక్తురాలికి పాము కాటు
-
ఢిల్లీలో ఘోరం.. తల్లీకూతుళ్ల దారుణ హత్య
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. సరితా విహార్ ప్రాంతంలోని ఓ మహిళ(35), ఆమె ఆరేళ్ల కుమార్తె తమ ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో పొరుగు వ్యక్తే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆలీ విహార్లోని ఓ ఇంట్లో రెండు మృతదేహాలు ఉన్నట్లు శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, ఇంటిలోని మంచం స్టోరేజ్ బాక్స్లో మహిళ, బాలికను గుర్తించారు. వెంటనే వారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతులను జ్యోతి, ఆమె ఆరేళ్ల కుమార్తెగా గుర్తించారు.ప్రాథమిక పరీక్షల్లో బయటకి ఎటువంటి గాయాలు కనిపించలేదు. అయితే శనివారం నిర్వహించిన పోస్ట్మార్టం రిపోర్టులో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే వారు మరణించినట్లు తేలింది. అదే భవనంలో నివసించే అకౌంటెంట్ దీన్ దయాళ్ (35) ఈ కేసులో ప్రధాన నిందితుడి ప్రాథమిక విచారణలో తేలిసింది. ఇతడు బాధితుల కుటుంబానికి బంధువు (మేనల్లుడు) అని స్థానికులు చెబుతున్నారు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆ ఇంట్లో దంపతులు తమ ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నారు. రాత్రి భర్త ఇంటికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు బయటే కూర్చుని ఉన్నారు. తలుపు లోపల నుండి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లోని సామాన్లన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి, కానీ ఏ వస్తువు పోలేదని తెలిపారు. నిందితుడు దీన్ దయాళ్ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించారు. -
మహిళ కడుపులో కత్తెర.. ఐదేళ్ల తర్వాత గుర్తించడంతో..
అలప్పుజ: కేరళ వైద్య విభాగంలో ఘోర నిర్లక్ష్యం వెలుగు చూసింది. అలప్పుజ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చోటుచేసుకున్న రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పున్నప్ర ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల ఉష జోసెఫ్కుట్టి, ఐదేళ్ల క్రితం గర్భాశయ తొలగింపు (హిస్టెరెక్టమీ) శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే అప్పటి నుండి ఆమె నిరంతరం కడుపునొప్పి, మూత్రంలో రక్తం పడటం లాంటి సమస్యలతో అవస్థలు పడుతూ వస్తున్నారు. పలు ఆస్పత్రులలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. అయితే ఇటీవల ఓ యూరాలజిస్ట్ సలహా మేరకు తీయించిన ఎక్స్-రేలో అసలు విషయం బయటపడింది.గతంలో శస్త్రచికిత్స జరిగిన సమయంలో వైద్యులు పొరపాటున ఆమె కడుపులోనే పొడవైన ‘మెట్జెన్బామ్’ సర్జికల్ కత్తెరను వదిలేసినట్లు నిర్ధారణ అయింది. 2021 మే 10న జరిగిన ఆ సర్జరీ తర్వాత బాధితురాలు ఉష అనుభవించిన నొప్పి వర్ణనాతీతం. ఎక్స్-రేలో కత్తెర కనిపించిన విషయం తెలిశాక ఆమె గురువారం ఉదయం తిరిగి అదే మెడికల్ కాలేజీకి వెళ్లారు. అయితే, అక్కడ ఉన్న కొంతమంది వైద్యులు ఈ విషయాన్ని బయటపెట్టవద్దంటూ తమపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న ఉష కుటుంబం, ఈ ఉదంతంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. తనకు ప్రాణహాని తలపెట్టిన ఆ ఆసుపత్రికి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని, అక్కడ సర్జరీ చేయించుకోవడానికి తనకు భయంగా ఉందని ఉష కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, బాధితురాలికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను తామే భరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మెరుగైన చికిత్స కోసం ఆమెను కొచ్చిలోని అమృత ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పున్నప్ర సౌత్ గ్రామ పంచాయితీ వైస్ ప్రెసిడెంట్ కేఎఫ్ టోబియాస్ మీడియాతో మాట్లాడుతూ బాధిత నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక సామాన్య మహిళ ఐదేళ్ల పాటు ప్రాణాపాయ స్థితిలో గడపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ. హరికుమార్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ ఘటనపై తమకు అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని, అయితే అంతర్గత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇది కూడా చదవండి: జెమిని 3.1 ప్రో.. రెట్టింపు మేధస్సు.. అద్భుత ఫలితాలు! -
సూర్యాపేటలో దారుణం.. తనను దూరం పెడుతుందని..
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని స్నేహనగర్లో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిని ఉన్మాది సుత్తితో కొట్టి హత్యయత్నం చేశాడు. గత కొంతకాలంగా తనను దూరం పెడుతుందని అక్కసుతో దాడికి ఒడిగట్టాడు. ఇంట్లో దూరి సుత్తెతో పదేపదే కొట్టడంతో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ యువతి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పట్టుకున్న స్థానికులు.. స్తంభానికి కట్టేసిన దేహశుద్ధి చేశారు.బాలికపై లైంగిక దాడిహైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మేజర్, మరొకరు మైనర్గా గుర్తించారు. మైనర్ నిందితుడిని జువైనల్ కోర్టుకు తరలించిన పోలీసులు.. ఒక నిందితుడిని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
65 ఏళ్ల వయసులో ఆటో నడుపుతున్న బామ్మ.. కారణం తెలిస్తే!
వృద్ధాప్యంలోకి అడుగుపెట్టడం అంటే..రెస్ట్ తీసుకునే వయసు అనే భావిస్తారు చాలామంది. ఆ వయసుకి అన్ని బాధ్యతలు తీరిపోతాయి కాబట్టి..ఏదో ఒక కాలక్షేపంతో కాలన్ని గడిపేయడం అనుకుంటుంటారు చాలామంది పెద్దలు. కానీ ఈ మహిళ అందుకు విభిన్నం. పైగా స్వార్జితంలో ఉన్న ఆనందం, సంతృప్తి వేరు అని చెబుతోంది. ఖాళీగా ఇంట్లో కూర్చోవడం వల్ల ఒరిగేది ఏముండదని కొట్టిపారేస్తోంది. గ్రామీణ భారతదేశంలో వృద్ధ మహిళల ఆలోచనలకు, భావాలకు విరుద్ధంగా బతికి చూపించటమే కాదు..'సాధికారత'కు అసలైన అర్థం చెప్పింది ఈ బామ్మ. ఎవరామె అంటే..ఆ బామ్మే..మహారాష్ట్రకు చెందిన 65 ఏళ్ల మంగళ ఆజీ. రెస్ట్ తీసుకునే వయసులో చీరకట్టులో డ్రైవింగ్ చేస్తోంది. చక్కగా ఆటో వేసుకుని రైడ్లకు వెళ్తోంది ఈ బామ్మ. ప్రయాణికులను గమ్యస్థానాల్లో దింపుతూ..ఆదాయం గడిస్తోంది. అది కూడా చక్కగా గ్రామీణ నేపథ్యానికి చెందిన మహిళ కట్టుతీరుతో ఏ మాత్రం భయపడకుండా మహారాష్ట్రలోని రద్దీగా ఉండే రోడ్లపై రెయ్..రెయ్..మని ఆటో నడిపిస్తుండటం విశేషం. నిజానికి ఆమె నిశబ్ద ధైర్యానికి చిహ్నంగా మారింది. ఈ వయసులో అంత అవసరం ఏంటీ అంటే..ఆమె చిన్నతనంలోనే వితంతువుగా మారి నలుగురి పిల్లలను ఒంటిరిగా పెంచి పెద్ద చేసింది. వారికి మంచి చదువులు చెప్పించి, తమ కాళ్లపై నిలబడే వరకు కూలి పనులు చేస్తుండేది. ప్రస్తుతం కొడుకు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) డ్రైవర్గా పనిచేస్తుండగా, కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేసింది. ఏళ్ల తరబడి కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడింది. కానీ ఇప్పుడైనా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటే..ఈ బామ్మ మంగళ ఏమంటుందో తెలిస్తే..విస్తుపోతారు. బామ్మకు షుగర్ కూడా ఉంది. అయినా సరే తన పిల్లలపై ఆర్థిక భారం పడటం ఇష్టం లేదని, తన సొంత వైద్య ఖర్చుల కోసం కష్టపడుతున్నట్లు తెలిపింది. ఇలా ఆటో డ్రైవర్గా ఎంతో కొంత ఆర్జించి.. తన ఖర్చులకు అలాగే తన కొడుకు కుటుంబానికి ఎంతో కొంత చేదోడువాదోడుగా ఉంటుందని చెబుతుంది.అయినా ఇంట్లో ఖాళీగా కూర్చొంటే ఏం వస్తుందని ఎదురు ప్రశ్నిస్తోంది . ఎలా ఆటో నడపడం నేర్చుకుందంటే..కొడుకు మార్గదర్శకంలో కేవలం 15 రోజుల్లో ఆటోనడపడం నేర్చేసుకుందట ఆమె. తొమ్మిదేళ్లుగా ఆటో నడుపుతు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారామె. మహారాష్ట్రలోని కరాడ్-ఉండేల్ మార్గం గుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో నడుపుతానని చెబుతోంది ఈ బామ్మ. తనకు డ్రైవింగ్ అస్సలు భయం కలిగించదని, పైగా ఇతర డ్రైవర్లు తనను చాలా అర్థం చేసుకుంటారని ధీమాగా చెబుతోందామె. అంతేగాదు వాళ్లు ముందు ఆజీని వెళ్లనివ్వండి అని పక్కకు తొలిగి మరి దారిచ్చేస్తారని సంతోషంగా చెబుతోంది. అలాగే తన ఆటోడ్రైవర్ జర్నీలో సవాళ్లు కూడా ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. ఈ వయసులో డ్రైవింగ్ చేయడం చూసి..రవాణ అధికారులు పూర్తిగా లైసెన్సింగ్ నిబంధనలను పాటిస్తేనే లైసెన్స్ మంజూరు చేస్తామని కరాఖండీగా చెప్పినట్లు తెలిపింది. తాను ఆ అధికారిక ప్రక్రియని పూర్తిచేసి మరి లైసెన్స్ పొందానంటోంది బామ్మ. సాధికారతే గౌరవం, ఆత్మగౌరవం అని మంగళ బామ్మ కథ చెబుతోంది. తరతరాల అంతరాన్ని చేధించి..వయసుతో సంబంధం లేకుండా వృద్ధాప్యంలో సైతం సామాజిక ప్రజా జీవితంలో చురుకుగా ఉండొచ్చని చెప్పింది. అనారోగ్యం అంటూ మూలన కూర్చోవడం కంటే..ఇలా ప్రజల్లో తిరిగితేనే ఇంకా ఉషారుగా ఆయురారోగ్యాలతో ఉండొచ్చని మంగళ బామ్మ కథ చెప్పకనే చెబుతోంది కదూ..! అంతేగాదు ఈ బామ్మ ధైర్యం..తన రైడ్ని బుక్చేసుకున్న ప్రయాణికులను ప్రేరేపించడమే గాక వారిలో స్థైర్యాన్ని నింపుతోంది కూడా. View this post on Instagram A post shared by Sonali H N (@shesays2324) (చదవండి: ప్రెండ్స్..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!) -
చేపల కోసం వల వేస్తే శవం పడింది!
అన్నానగర్: చేపలు పట్టేందుకు వల వస్తే..ఊహించని విధంగా ఓ శవం అందులో వచ్చింది. ఓ యువతి దారుణ హత్య గురైన ఘటనను ఇది వెలుగులోకి తెచ్చింది. వివరాలు..నాగర్కోయిల్ సుంగాన్ కడైలోని అంబేడ్కర్ కాలనీ ప్రాంతంలో పణంగుళం అనే కొలను ఉంది. శుక్రవారం సాయంత్రం ఆ ప్రాంతానికి చెందిన యువకులు కొలనులో చేపలు పడుతుండగా, వారి వలలో ఒక పెద్ద సంచి చిక్కుకుంది. దానిని యువకులు శ్రమలకోర్చి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆ సంచి నుంచి దుర్గంధం వస్తూండడంతో అనుమానించారు. సమాచారం ఇవ్వడంతో ఇరానియల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంచిని తెరిస్తే...దారుణ హత్యకు గురై, కుళ్లిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువతి మృతదేహం ఉన్నట్టు బయటపడింది. ఆ యువతి మృతదేహాన్ని తీగలతో కట్టివేసి, పెద్ద రాయి కట్టి కొలనులో పడేసినట్లు తేలింది. హత్య చేశాక నిప్పంటించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దాదాపు 20 ఏళ్ల వయసున్న ఆమె మృతదేహం ఉన్న స్థితి బట్టి వారం క్రితం ఆమె హత్యకు గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలు ఎవరనేది తెలియరాలేదు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్న ప్రాంతంలో చాలా కాలేజీలు ఉన్నాయి. హత్యకు గురైన యువతి కాలేజీ విద్యార్థునా? ఎవరైనా విద్యార్థుని అదృశ్యమయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు.. అనిత నీకే చెప్తున్నా..
-
‘నీవు నాకు తెలుసు.. నీతో వీడియో కాల్లో మాట్లాడాలి’
శివమొగ్గ(కర్ణాటక ): గుర్తు తెలియని వ్యక్తి తనకు వీడియో కాల్ చేసి ప్రైవేట్ భాగాలు చూపించాడని ఓ మహిళ శివమొగ్గలోని ఈఎన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. శివమొగ్గకు చెందిన ఒక మహిళ మొబైల్ చూస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్లో çవీడియో కాల్ చేశాడు. ‘నీవు నాకు తెలుసు.. నీతో వీడియో కాల్లో మాట్లాడాలి’ అని చెప్పాడు. మహిళ కాల్ లిఫ్ట్ చేయగా.. ఆ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రైవేట్ భాగాలు చూపిస్తూ వేధించాడు. మహిళ వెంటనే స్క్రీన్ రికార్డింగ్ ద్వారా వీడియోను రికార్డు చేసుకుంది. అనంతరం శివమొగ్గలోని ఈఎన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వీడియోలను చూపించి ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటలెక్కించారు..కానీ..!
భారత కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే అది ప్రస్తుత కాలంలో చాలా అగమ్యగోచరంగా తయారైంది. ఎంతో ప్రాణప్రదంగా పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నవాళ్లే..కడదాక కలిసి ఉండలేకపోవడం బాధకరం. అది కూడా చిన్నచిన్న వాటికి, మనస్పర్థలతోటి విడాకులు తీసుకుంటున్నారు. తనకోసం అన్ని వదులుకుని వచ్చిందన్న భావం మగవాళ్లలో కొరవడం ఒక కారణమైతే..తన మాటే నెగ్గాలన్న అహంకారం మరొక కారణం అంటున్నారు మానసిక నిపుణుల. అచ్చం అలాంటి కారణాలతో ఈ టెక్ జంట విడిపోయింది. అందుకు గల కారణం చూస్తే..కన్నీళ్లు వస్తాయి. విమెన్ సాధికారత అన్న మాటలు వెగటుపుడుతాయి. దయచేసి మహిళల్ని మహారాణులు చేయకండి అర్థచేసుకోండి స్వామి..చాలు అని గొంతెత్తి అనాలనిపిస్తోంది. అసలేం జరిగిందంటే..ఈ టెక్ జంట ప్రేమ కథ విడాకులతో ముగియడంతో నెట్టింట వైరల్గా మారింది. సర్వత్రా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ ప్రకారం. ఆ టెక్ జంట పాఠశాల రోజుల నుంచి ప్రేమించుకున్నారు. విజయవంతంగా జీవితాన్ని నిర్మించుకున్నారు. గుర్తింపును వెల్లడించిన ఆ ఇంజనీర్ జంటకు ఇద్దరు పిల్లుల, చక్కటి ఆర్థిక భద్రతా ఉంది. ఆమె మంచి కష్టపడి పనిచేసే ఉద్యోగి. గర్భధారణ తర్వాత ఆరునెలలు మినహా ఎన్నడు విరామం తీసుకోలేదు. తొమ్మిదో నెల వరకు ఆఫీసుకు వెళ్లింది. పిల్లలు, భర్త కోసం పనిచేయడం ఆమెకు చాలా సంతోషాన్నిస్తుంది కూడా. రెండో గర్భధారణ తర్వాత ఆ మహిళ కంపెనీ మార్చింది. కొత్త టెక్నాలజీ నేర్చుకుంది. ఇప్పుడు తన భర్త కంటే అధిక వేతనం సంపాదిస్తోంది కూడా. అయితే అత్తగారు అనారోగ్యానికి గురి కావడంతో భర్త తన భార్యను ఉద్యోగం మానేసి ఆమె బాగోగులు చూసుకునే సంరక్షకురాలిగా మారాలని ఆదేశించాడు. అందుకు ప్రెగ్నెన్సీ వల్ల చాలాసార్లు తాను ఉద్యోగానికి విరామం ఇచ్చాను..ఇప్పుడు నీ టైం వచ్చింది కాబట్టి మీరే జాబ్ మానేయండి, ఫైనాన్షియల్గా మొత్తం చూసుకుంటాను, అలాగే ఇంటి బాగోగుల్లో కూడా హెల్ప్ చేస్తానని చెప్పింది. అవసరమైతే పిల్లల్ని చూసుకునేందు వాళ్ల అమ్మను కూడా పిలిపిస్తానని అంది. అందుకు భర్త తల్లి ససేమిరా అంది. కోడలు తల్లి ఇక్కడకు రావడం సరైన కాదని..పైగా ఉద్యోగం కోడలే మానేయాలని పట్టుబట్టింది. పైగా అత్తగారిని చూసుకోవడం అనేది కోడలు బాధ్యతని ఆమె గట్టిగా విశ్వసిస్తోంది. చివరికీ కోడలు ఉద్యోగం మానేయడం లేదనే అక్కసుతో ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. దాంతో విసుగుపోయిన ఆమె పిల్లలుతో సహా పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అలాగే భర్తకు ఓ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆమెకు ఇష్టమైతే తన ఇంటికి వచ్చి ఉండొచ్చని, తన అమ్మనాన్నలు చూసుకుంటారని అంది. అంతే భర్త ఉద్యోగం మానేయడం లేదనే కోపంతో..విడాకులు ఇస్తానని బెదిరిస్తూ లీగల్ నోటీసు పంపాడు. చివరికీ ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఎంతో విజయవంతంగా నిర్మించుకున్న ఆజంట సంసారం విచ్చన్నమైంది, విడాకులు తీసుకున్నారు. ఇక్కడ ఒక మహిళ ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత సంపాదించినా..ఎంత ప్రేమించినా..త్యాగం చేసినా విలువ ఉండదు. జస్ట్ తన స్వాతంత్య్రాన్ని వదులుకోను అనగానే ఆ భార్య ఒక్కసారిగా పనికిరానిదిగా అయిపోయింది. నెటిజన్లు సైతం ఆమె తల్లికి అనారోగ్యంగా ఉంటే..ఆ భర్త ఉద్యోగం మానేస్తాడా? అని ప్రశ్నించారు, మరికొందరు ఇక్కడ ఆమె బాధ్యత నిరాకరించిందని కాదని, కేవలం తనకంటే ఎక్కువ సంపాదిస్తుందన్న విద్వేషం విడాకులకు దారితీసిందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.చదవండి: భార్య కోసం ఏడాదికి 3 కిలోల బంగారం కొంటున్నాడు..! -
పాప అని ఒక్కసారి పిలువు అన్న ప్లీజ్.. గుండెల్ని పిండేస్తున్న పద్మ లెటర్
-
‘లోకల్’లో బురఖా వ్యక్తి కలకలం
ముంబై: ముంబైలోని సెంట్రల్ రైల్వే పరిధిలో గల ఘాట్కోపర్ స్టేషన్ సమీపంలో కలకలం చోటుచేసుకుంది. బురఖా ధరించిన ఒక పురుషుడు ముంబై లోకల్ ట్రైన్లోని మహిళల బోగీలోకి ప్రవేశించాడు. రద్దీగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని, ఎవరికీ అనుమానం రాకుండా మహిళల కంపార్ట్మెంట్లోకి చొరబడటంతో అక్కడి మహిళా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. Shocking incident on Mumbai local train: A man disguised in a burqa allegedly entered the ladies-only compartment near Ghatkopar station, attempted to molest women passengers. Alert commuters confronted him; he fled by jumping to another train. Complaint filed at Ghatkopar PS;… pic.twitter.com/Czl4eNlwdh— Megh Updates 🚨™ (@MeghUpdates) February 7, 2026తొలుత మహిళా ప్రయాణికులు అతనిని గమనించలేదు. తరువాత అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అప్రమత్తమై, అతనిని నిలదీశారు. దీనిని అక్కడున్న వారు తమ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా రైలులోని మహిళా ప్రయాణికులు ఆ వ్యక్తిపై రైల్వే సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే రైలు ఆగగానే ఆ వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై ఘాట్కోపర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. నిందితుడిని గుర్తించేందుకు రైలులోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. -
పతకాల వేటలో ఆర్టీసీ కండక్టర్ స్వరాజ్యలక్ష్మి
లక్ష్యాలు ఎన్ని నిర్దేశించుకున్నా.. వాటిని సాధించడంలో చాలా మంది విఫలమవుతుంటారు. కృషి, పట్టుదల లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇంకొందరు లక్ష్యాలను ఎంచుకున్నా.. సమయం లేదని సాకులు చెబుతుంటారు.. వీటన్నింటినీ ఐదు పదుల వయసులో అధిగమించారు ఆర్టీసీ కండక్టర్ స్వరాజ్యలక్ష్మి. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ అనేక పతకాలు గెలుచుకుని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అల్వాల్ మచ్చ»ొల్లారంలో నివసించే బైరి స్వరాజ్యలక్ష్మికి చిన్న తనం నుంచి పరుగు పందెం అంటే అమితమైన ఇష్టం. అయితే మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆ మక్కువకు ప్రాథమిక స్థాయిలోనే ముగింపు పడింది. చదువు, వివాహం, అనంతరం సంతానం.. ఇలా అందరిలానే బాధ్యతల మధ్య చిక్కుకుపోయారు. అయితే భర్త ధనరాజ్తో తన ఆసక్తిని పంచుకున్నారు. దీంతో ఆమె అభిరుచిని గుర్తించి ప్రోత్సహించారు. ఇంతలోనే ఆరీ్టసీలో కండక్టర్గా ఉద్యోగం వచి్చంది. ఓవైపు ఇంటిపని, వంటపనితో పాటు మరోవైపు ఉద్యోగం చేస్తూ తన ఆసక్తిని నెరవేర్చుకోవడం కోసం పరుగు మొదలుపెట్టారు. ఆసరా అందిస్తే మరిన్ని పతకాలు.. క్రీడాకారులకు ప్రభుత్వరంగ సంస్థల్లో అధికంగా ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగ నియామకాల్లో సైతం స్పోర్ట్స్ కోటా ఉండటమే ఇందుకు నిదర్శనం. రోజూ ఉద్యోగం చేసి ఇంటికి వచి్చన అనంతరం తరీ్ఫదు పొందడం పరిపాటి. ఇతర పోటీల్లో పాల్గొనాలంటే సెలవు పెట్టుకోవాల్సిన పరిస్థితి. దీంతో సరైన శిక్షణ లేకుండానే పాల్గొనాల్సి వస్తుందని స్వరాజ్యలక్ష్మి చెబుతున్నారు. అధికారులు, సిబ్బంది ప్రోత్సాహం అందిస్తున్నప్పటికీ ఉన్నత స్థాయి లక్ష్యాలను చేరుకోడానికి ఇది సరిపోవడం లేదంటున్నారు.12 ఏళ్లలో 70కి పైగా పతకాలు.. 12 సంవత్సరాల నుండి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ పతకాల వేట సాగించారు. 70కి పైగా జాతీయ పతకాలు, నాలుగు అంతర్జాతీయ పతకాలు సాధించారు. ఇటీవల రాజస్థాన్లోని అజ్మీర్ లో జరిగిన ఏడో జాతీయ మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్íÙప్ పోటీల్లో పాల్గొని 400 మీటర్ల విభాగంలో రజత పతకం, 800 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించారు. -
ఇజ్రాయెల్లో సంచలనం: ముస్లిం మహిళ కెప్టెన్ ఎలాకు పట్టం
జెరూసలేం: ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్)లో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఇజ్రాయెల్కు చెందిన ముస్లిం అరబ్ మహిళ కెప్టెన్ ఎలా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు అరబిక్ భాషా ప్రతినిధిగా ఉన్న కల్నల్ అవిచై అద్రయీ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఐడీఎఫ్ చరిత్రలోనే ఈ స్థాయికి చేరుకున్న తొలి ముస్లిం మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కెప్టెన్ ఎలా ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మొదట ఒక ఆసుపత్రిలో వాలంటీర్గా తన సేవలను ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత సైన్యంలో చేరారు. ప్రారంభంలో ఆమె తన సైనిక సేవ గురించి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా రహస్యంగా ఉంచారు. అంకితభావంతో పనిచేస్తూ, అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఈ ఉన్నత స్థానానికి చేరుకున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. వాస్తవాలను ప్రపంచానికి చాటిచెప్పే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు.ఇజ్రాయెల్ సైన్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న ముస్లిం మహిళగా కెప్టెన్ ఎలా నిలిచారు. కేవలం ఒక సైనికురాలిగానే కాకుండా, తన కమ్యూనికేషన్ నైపుణ్యాలతో తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడంలో ఆమె అగ్రభాగాన ఉన్నారని చెబుతారు. ఆమె నియామకం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా నిలిచింది. -
తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అన్న మరణవార్త విని గుండెపోటుతో చెల్లెలు మృతి
వరంగల్ జిల్లా: తోడబుట్టిన అన్న మరణించాడనే వార్త విన్న చెల్లెలు గుండెపోటుతో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం (గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్)లో శనివారం జరిగింది. ధర్మారం గ్రామానికి చెందిన గట్టికొప్పుల లక్ష్మి (35)–వీరేశం దంపతులకు కుమారుడు సిద్ధార్థ, కూతురు సిరి ఉన్నారు. వారు మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లి వనదేవతలకు మొక్కులు చెల్లించి ఉదయం ఇంటికి తిరిగొచ్చారు. లక్ష్మి అన్న ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన వడ్డేపల్లి వెంకటేశ్వర్లు (52) ఉదయం 9 గంటలకు అనారోగ్యంతో మృతి చెందాడని అతడి కుమారుడు ఉదయం 11 గంటలకు ఫోన్ చేశాడు. లక్ష్మి భర్త వీరేశం ఫోన్ తీసుకుని మాట్లాడుతుండగా పక్కనే ఉన్న ఆమె అది విని అక్కడే గుండెపోటు వచ్చి కింద కూలిపోయింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే లక్ష్మి మృతి చెందిందని వైద్యులు తెలిపారు.కాపీ కొడుతూ చిక్కిన బీటెక్ విద్యార్థి జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి గ్రీన్ ఇండ్రస్టియల్ పార్కులోని ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలోని సల్యేంద్రనాగ సైమా కాలనీకి చెందిన రౌనాక్రాజ్ (20) ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలలో జరిగిన సెమిస్టర్ పరీక్షలో కాపీ కొడుతూ ఇని్వజిలేటర్కు పట్టుబడ్డాడు. దీంతో ఆయన జవాబుపత్రాన్ని స్వా«దీనం చేసుకొని రౌనాక్రాజ్ను పరీక్ష కేంద్రం నుంచి బయటికి పంపించాడు. దీన్ని అవమానంగా భావించిన విద్యార్థి క్యాంపస్లోని çహాస్టల్ గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సీఐ కమలాకర్ సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళ
నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం కేతేపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి భార్యను ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్య చేసింది. నగేష్తో సుజాత అనే మహిళకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం నగేష్ ఇంట్లో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. భార్య మమతను పక్కకు తప్పించేందుకు హత్య చేయాలని సుజాత, నగేష్ ప్లాన్ వేశారు. మమతపై పెట్రోల్ పోసి సుజాత నిప్పంటించింది. తీవ్ర గాయాలతో మమత మరణించింది. మంటలు అంటుకుని ఐదు నెలల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని ఆసుపత్రికి తరలించారు. -
బుల్లెట్ బైక్ నడపడం రాదని భర్తను వదిలేసిన భార్య
(కర్ణాటక) దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపుర తాలూకాలో ఖతర్నాక్ కిలేడీ లీలలు వెలుగు చూశాయి. వివాహమై పిల్లలు ఉన్నా మరో ఇద్దరు వ్యక్తులను మోసం చేసి వివాహం చేసుకుని రూ.లక్షల్లో డబ్బు దోచుకున్నారు. ఈ కిలేడీ బాగోతాన్ని మోసపోయిన భర్తలు బయటపెట్టారు. దొడ్డ తాలూకాలోని హణబె గ్రామానికి చెందిన సుధారాణిపై ఈమేరకు ఆరోపణలు వచ్చాయి. బాధితుల కథనం మేరకు వివరాలు.. వీరేగౌడ అనే వ్యక్తిని సుధారాణి మొదటి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మొదటి భర్తతో సంతృప్తి చెందని సుధారాణి అతడికి బుల్లెట్, కారు లేదని అసలు నడపడమే రాదనే సాకులు చెప్పి గొడవపడి పిల్లలను, భర్తను వదిలి చేతికందినంత డబ్బు, నగలు తీసుకుని వెళ్లిపోయింది. తరువాత డెలివరీ బాయ్గా పని చేస్తున్న అనంతమూర్తి అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. తనకు భర్త లేడని, చనిపోయాడని, ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పుకుంది. తరువాత మాయ మాటలు చెప్పి అనంతమూర్తిని ఒక గుడిలో వివాహం చేసుకుని 18 నెలలు సంసారం చేసింది. ఈ ఏడాదిన్నర కాలంలో పలు కారణాలు చెప్పి అనంతమూర్తి వద్ద రూ.20 లక్షల వరకూ నగదు తీసుకుంది. డబ్బులు తీసుకున్నాక సుధారాణి అనంతమూర్తిని వదిలి కనకపురకు చెందిన మరో డబ్బున్న వ్యక్తిని ట్రాప్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మొదటి భర్త వీరేగౌడ, రెండవ భర్త అనంతమూర్తి ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమాయకులను మోసం చేసి వివాహం చేసుకున్నట్టు నాటకమాడి తరువాత వారి నుంచి డబ్బులు గుంజి వదిలేస్తున్న సుధారాణిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
20 ఏళ్లకే పెళ్లి, 15 రోజులకే వైధవ్యం, 30 ఏళ్లు మగాడిలా
జీవితాలు అందరివీ ఒక్కతీరుగా ఉండవు. ఈ అనంత కాల గమనంలో, ఈ రవ్వంత జీవన పయనంలో ఎవరి యుద్ధం వారిదే. పైకి కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కనిపించని బడబాగ్నులుండవచ్చు మరెన్నో అంతులేని కష్టాలూ ఉండవచ్చు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ముత్తు మాస్టర్ స్టోరీ ఇలాంటిదే. కన్న కూతురి కోసం మూడు దశాబ్దాలు పాటు మగాడిలా బతికింది.పెచియమ్మాళ్ అలియస్ ముత్తు ఎంతోమంది సగటు అమ్మాయిల్లాగానే జీవితాన్నిప్రారంభించింది. కోటి ఆశలతో 20 ఏళ్ల వయసులో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. దురదృష్టం ఏమిటంటే.. కాళ్ల పారాణి ఆరకముందే పెళ్లైన 15 రోజులకే భర్త అనూహ్యంగా కన్నుమూశాడు. ఆ తరువాత కొన్ని రోజులకే తాను గర్బవతినని తెలుసుకుంది. ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఇక్కడే పెచియమ్మాళ్ చాలా విభిన్నంగా ఆలోచించింది. ఏపనిచేసినా ఆమెకు లైంగిక వేధింపులుతప్పలేదు. సమాజం సూటి పోటి మాటలూ భరించాల్సి వచ్చేది. అందుకే సంచలన నిర్ణయం తీసుకుంది. తన గుర్తింపును మార్చుకుంది. మగాడిలా మారి పోయింది. జుట్టును చిన్నగా కత్తిరించుకోవడం, ప్యాంట్ చొక్కా వేసుకుంది. ముత్తు కుమార్ అనే పేరుతో అనేక సవాళ్ల మధ్య కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది.ఇదీ చదవండి: స్టార్ సింగర్ రిటైర్మెంట్ వెనుక రహస్యం ఇదేనట!చెన్నై,తూత్తుకుడిలోని హోటళ్ళు, రోడ్డు పక్కన షాపులల్లో అవిశ్రాంతంగా పనిచేసింది. పెయింటర్గా, కూలీగా, టీ మేకర్గా పని చేస్తూ ఎంతో కష్టపడింది ఇవన్నీ స్త్రీగా తన ఉనికి రహస్యాన్నిజాగ్రత్తగా కాపాడుకుంటూ, పురుషుల్లో పురుషుడిలా కలిసి పోయి బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా మగాళ్ల బాత్రూంనే వాడుతూ, బస్సులలో సైతం వారి పక్కనే కూర్చుంటూ కాలం నెట్టుకొచ్చింది.ఆమె మహిళ అని ఆమెకు ఒక పాప ఉందని కొంతమంది సమీప బంధువులకు మాత్రమే నిజం తెలుసు. బయట పడిపోతాననే భయం నిరంతరం ఉండేది, కానీ ఆమె కూతురు షణ్ముగసుందరి భవిష్యత్తు కోసం దాన్ని భరించే శక్తిని కూడగట్టుకుంది. పరోటా షాపుల్లో పనిచేస్తూ ‘‘ముత్తు మాస్టర్’’గా పాపులర్ అయింది. ఆధార్, ఓటర్ కార్డు, బ్యాంక్ ఖాతాలో కూడా అదే పేరు పెట్టుకుంది. ఒంటరిగా మహిళగా, దయా దాక్షిణ్యంలేని సమాజంలో ప్రతి పైసా బిడ్డ కోసం ఆదా చేశానని చెప్పుకొచ్చిందామె. చివరికి ఆమె కలలు, ఆమె త్యాగాలు ఫలించాయి. ఆమె కుమార్తె పెరిగి పెద్దదై, విద్యను అభ్యసించి,వివాహం చేసుకుంది. అలా ముత్తు లక్ష్యం నెరవేరింది. పెచ్చియమ్మాళ్గా మళ్లీ మహిళగా జీవిస్తారా అని అడిగినప్పుడు, ఆమె సమాధానం విన్నవారు ఆశ్చర్య పోయారు ముత్తు మాస్టర్గానే ఉండాలని నిర్ణయించుకుంది. అవసరం నుండి పుట్టిన ఈ గుర్తింపు, ఆమె పట్టుదలకు , విజయానికి ప్రతీకగా మారింది. ఇది తన కుమార్తె భద్రతను, తనకు గౌరవాన్నిచ్చిన గుర్తంపుతోనే తన చివరి శ్వాస వరకు ఉంటానని చెప్పింది. -
మరో వీడియో విడుదల చేసిన 'రైల్వేకోడూరు' మహిళ
-
దళిత యువతిపై లైంగికదాడి
తిరుపతి క్రైమ్: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి మాయ మాటలు చెప్పి దళిత యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ మండలంలో నివాసముంటున్న 19 ఏళ్ల దళిత యువతికి కడపకు చెందిన యశ్వంత్రాజ అనే వ్యక్తి కొద్దికాలం కిందట ఇన్స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 21న ఆ యువకుడు తిరుపతికి వస్తున్నానని యువతికి తెలిపాడు.ఇదే క్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రనగర్లోని ఓ హోటల్ రూమ్కి తీసుకువెళ్లి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన యువతి డీలాగా ఉండడంతో తల్లి గమనించి ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 24వ తేదీ రాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఎక్కించిన యువతి
-
ప్రియుడి ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు
-
గమ్యం చేరిన లక్ష్యం
కర్నూలు(అర్బన్): మహిళలు అన్ని రంగా ల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. కష్టమైన రంగాల్లో కూడా వెనకడగు వేయడం లేదు. పురుషులకే పరిమితమైన డ్రైవింగ్లో కూడా మహిళలు తమ ప్రతిభ చాటుతున్నారు. అయితే కేవలం లైట్ వెహికల్స్కే పరిమితమైన మహిళలు నేడు హెవీ వెహికల్స్ నడిపేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వాహనాలను నడుపుతున్న మహిళల జాబితాలోకి కర్నూలు నగరానికి చెందిన యువతి విశ్వవాణి చేరనుంది. కర్నూలు పాతబస్డాండ్ సమీపంలోని సెంట్రల్ లైబ్రరీ ప్రాంతానికి చెందిన విజయేశ్వరరావు, మణి దంపతుల కూతురు విశ్వవాణి బీఎస్సీ చదివారు. ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలవాలనే తపనతో ఆమె ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ శిక్షణా సంస్థలో హెవీ డ్రైవింగ్లో శిక్షణను పూర్తి చేసుకొని ఆర్టీసీ బస్సును సునాయసంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే తొలి ఎస్సీ మహిళా డ్రైవర్గా కూడా గుర్తింపు పొందనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 3 నుంచి ఈనెల 12వ తేదీ వర కు అర్హులైన వారికి ఆర్టీసీ శిక్షణా సంస్థలో హెవీ డ్రై వింగ్లో శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణకు ఉమ్మడి కర్నూ లు జిల్లాలో 20 మంది ఎంపిక కాగా, ఇందులో 19 మంది పురుషులు కాగా, విశ్వవాణి ఒక్కరే మహిళ .ఇష్టంతోనే స్టీరింగ్ పట్టా .. ‘ఉద్యోగ రంగాల్లో తీవ్ర పోటీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వయం ఉపాధి అవకాశాల వైపు చూశాను. నేర్చుకోవాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ తీసుకునేందుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే తులసీదేవి, ఆర్టీసీ కర్నూలు డిపో మేనేజర్ సుధారాణి, ట్రైనింగ్ కళాశాల ఇన్స్ట్రక్టర్ వలితో పాటు నాతో శిక్షణ తీసుకుంటున్న వారు ఎంతో సహకారాన్ని అందించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీన స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో ఆర్టీసీ బస్సును నడిపేందుకు నన్ను ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉంది’. -
క్యాన్సర్ 4వ స్టేజ్.. ఏకంగా 20 కిలోల కణితి!
ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు అరుదైన ఆపరేషన్ను విజవంతంగా ముగించారు. 43 ఏళ్ల పెద్దప్రేగు క్యాన్సర్ రోగి కడుపునుంచి ఏకంగా 19.9 కిలోల కణితిని తొలగించారు. మల్టీ ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చినట్లు విజయవంతమైన శస్త్రచికిత్సను ఎయిమ్స్ ప్రకటించింది.పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్కు చెందిన మున్మున్ను జూలై 2024లో ఉదర ఉబ్బరం (సాధారణం కంటే పెద్ద బొడ్డు)తో ఆసుపత్రికి తరలించారు. పాతికేళ్ల క్రితం, యూనిలేటర్ సాల్పింగో-ఊఫొరెక్టమీ (ఒక ఓవరీ, ఒక ఫెలోపియన్ ట్యూబ్ను) తొలగించారు.అలాగే స్టేజ్-4 పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పెల్విక్ ప్రాబల్యం ఉంది. అనేక ఆసుపత్రులను తిరిగి, పలు రౌండ్ల కీమోథెరపీ చేయించుకుంది. అయినా ఎలాంటి ఫలితం లేదు పైగా వ్యాధి పెరుగుతూనే ఉంది. కణితి అనేక ఉదర అవయవాలకు వ్యాపిస్తుండటంతో. 3-4 నెలలు ఎక్కువ బతకదని వైద్యులు అంచనా వేశారు. అయితు ఎయిమ్స్ ఢిల్లీలోని సర్జికల్ ఆంకాలజిస్ట్ ప్రొఫెసర్ ఎం.డి. రే నేతృత్వంలోని వైద్యుల బృందం జనవరి 12న విజయవంతంగా సైటోరేడక్టివ్ సర్జరీని నిర్వహించి, 19.9 కిలోల కణితిని తొలగించారు. జనవరి 15న శస్త్రచికిత్సతో పాటు HIPECని పూర్తి చేసి, ఆంకోసర్జికల్ నిర్వహణను పూర్తి చేసింది. ప్రస్తుతం ఆస్పత్తి డిశ్చార్జ్ అయ్యింది కోలుకుంటోంది. CT మరియు PET-CT స్కాన్ల ఆధారంగా, అంత పెద్ద కణితి ఆపరేషన్ ఒకేసారి చేస్తే రోగి తట్టుకోవడం కష్టమని భావించిన వైద్యులు రెండు దఫాలుగా దీన్ని పూర్తిచేశారు. పొట్టలోని కొన్ని భాగాలను అంటే. ట్రాన్స్వర్స్ పెద్దప్రేగులో మూడింట రెండు వంతులు, సిగ్మోయిడ్ పెద్దప్రేగు, ఓమెంటం, గర్భాశయం , రెండు ఫెలోపియన్ ట్యూబ్స్, కాలేయం కాప్యూల్, పెరిటోనియంను తొలగించామని డాక్టర్ రే చెప్పారు.ఇదీ చదవండి: ఫైబర్ ఎక్కువ తీసుకుంటే, ఏమవుతుందో తెలుసాసాధారణంగా కీమోథెరపీలా కాకుండా, హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీలో -- కణితిని పూర్తిగా తొలగించిన తర్వాత, హీటెడ్ కీమోథెరపీ (41–43 డిగ్రీల సెల్సియస్)ని నేరుగా ఉదర కుహరంలోకి పంపించండం ద్వారా చికిత్స అందించారు. కణితులన్నీ తొలగించబడ్డాయని నిర్ధారించుకున్నాక, కంటికి కనిపించని సూక్ష్మ వ్యాధిని నిర్మూలించడానికి గంటన్నర పాటు HIPEC చికిత్స అందించారు.మొదటి శస్త్రచికిత్స జనవరి 12న, రెండోదిజనవరి 15న జరిగింది, ఐదు రోజులకు జనవరి 20న డిశ్చార్జ్ చేశామని డాక్టర్ చెప్పారు.శస్త్రచికిత్స తర్వాత, కణితులు లేకుండా కాలేయం,ప్రేగులు స్పష్టంగా కనిపించాయన్నారు.కొన్ని కోలన్ క్యాన్సర్ కేసులను నయం చేయవచ్చుపెద్దప్రేగు క్యాన్సర్ ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా భావించినప్పనటికీ కొన్ని కేసుల్లో నయం చేయ వచ్చ న్నారు. ఇప్పటికీ నయం చేయగలదని రే వివరించారు. నిపుణులైన సర్జన్ల సలహా లేకుండా మెటాస్టాటిక్ పెద్దప్రేగు క్యాన్సర్కు చికిత్స లేదని ప్రకటించకూడదని కూడా ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్ అంటున్న మస్క్ -
భర్త వేధింపులు.. నువ్వు కన్యవేనా?
కడప అర్బన్ : కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్లో తన భర్త మద్దూరి దినేష్ నివసిస్తున్న ఇంటి ఎదుట భార్య శ్రీలక్ష్మి బుధవారం న్యాయం కోసం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా బాధిత మహిళ శ్రీలక్ష్మి మీడియాతో మాట్లాడారు. తనకు, మద్దూరి దినేష్కు 2022 జూన్ 18న కర్నూల్లో వివాహమైందని, తమకు కుమారుడు ఉన్నాడని తెలిపారు.తన భర్త, కుటుంబ సభ్యులు వివాహ సమయంలో ఇచ్చిన 25 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, 5 లక్షల రూపాయలు నగదు, తాను ఉద్యోగం చేసి సంపాదించిన రూ.లక్ష ఇరవై వేలు, తనకు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు సంబంధించిన వస్తువులను తీసుకునేందుకు వస్తే వారు పలకడం లేదన్నారు. న్యాయం కోసం ఇంటిముందు బైఠాయించాల్సి వచ్చిందని తెలిపారు. తాను మూడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కర్నూలులోని తమ పుట్టింటిలో వదిలేసి వెళ్లిపోయాడని, తర్వాత కుమారుడు జన్మించాడు, అప్పటినుంచి పట్టించుకోలేదని తెలిపారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళ ఆరోపించారు. వివాహమైనప్పటి నుంచి తనను శారీరకంగా మానసికంగా బాధపెట్టారని తెలియజేశారు. ఆమె తల్లి, రెండున్నర సంవత్సరాల కుమారుడు, టీడీపీకి చెందిన నాయకురాలు, బంధువులు వచ్చి అండగా నిలబడ్డారు. ఈ సంఘటనపై చిన్న చౌక్ పోలీసులు మాట్లాడుతూ ఇప్పటికే అనంతపురం జిల్లా తాడిపత్రిలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని, కోర్టులో కేసు నడుస్తుందని తెలియజేశారు. ఆందోళన విషయమై మహిళను పిలిపించి మాట్లాడామని తెలిపారు. -
మొన్ననే పెళ్లి, తగాదా..నాలుక కొరికేసింది, తీవ్ర ఘర్షణ!
సంతోషంగా ‘‘నాకు నువ్వు, నీకు నేను’’ అన్నట్టుగా చాలా సరదాగా గడిపే జంటను చూస్తే నవ దంపతుల్లా ఎంత హాయిగా ఉన్నారు అనుకుంటాం. కదా. కానీ పెళ్లయ్యి ఏడాది కూడా అవ్వకుండా దంపతుల మధ్య వంట విషయంలో వచ్చిన స్వల్ప వివాదం, మాటల యుద్ధంగా, ఆ తరువాత తీవ్ర ఘర్షణగా మారిన ఘటన భర్త ఆస్పత్రి పాలైన ఘటన దిగ్భ్రాంతి రేపింది. విషయం ఏమిటంటే..గత ఏడాది మే 6న విపిన్, ఇషా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సోమవారం సాయంత్రం వంట విషయంలో చిన్న తగాదా మొదలయ్యింది. మాటా మాటా పెరిగి చినికి చినికి గాలివానలా మంగళవారం తెల్లవారిందాకా సాగింది. అది కాస్తా భౌతికరూపం దాల్చింది. తీవ్ర ఆగ్రహంతో భర్త నాలుకను కొరికిపారేసింది. దీని తాలూకు పరిణామాలు మరో ఘర్షణకు దారితీశాయి. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఇషా కుటుంబ సభ్యులు ఆమె అత్తమామల ఇంటికి వెళ్లారు. దీంతో రెండు కుటుంబాల మధ్య మరో పోరుకు తెరలేపింది. ఆడా, మగా ఇరు వర్గాలూ గొడవకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జోక్యంచేసుకుని, సంబంధిత వ్యక్తులందరినీ విచారణ నిమిత్తం స్టేషన్కు తీసుకెళ్లారు.ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని మోదినగర్లోని, సంజయ్ పూరిలో జరిగింది.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మోదినగర్) అమిత్ సక్సేనా అందించిన సమాచారం ప్రకారం ఈ గొడవ, హింసకు మూలం భార్యభర్తల కలహమే అని తేలింది. భార్య ఆగ్రహం భర్తవిపిన్ను ఆస్పత్రి పాలు చేసింది. అతనికి తీవ్ర గాయాలయ్యాయని, తొలుత ఘజియాబాద్లోని ఒ ఆసుపత్రిలో చేర్పించి, తదుపరి చికిత్స కోసం మీరట్లోని ఒక ప్రత్యేక హాస్పిటల్కు తరలించారు. వీరి వైవాహిక జీవితంలో కలహాలకు దారితీసిన అంతర్లీన కారణాల గురించి ఆరా తీస్తున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీ గాజుల చేయి కదలాడకపోతే..
శ్రీకాకుళం కల్చరల్: పండగ ముగిసిపోయింది. షాపింగ్లు అయిపోయాయి. ఎవరికి నచ్చిన దుస్తులు వారు తీసుకున్నారు. ఆ హడావుడి.. ఆ రద్దీ.. ఆ తోపులాటల మధ్య చాకచక్యంగా వ్యవహరించిన అతివలు కొందరున్నారు. ఎంతమంది వచ్చినా ఓపికతో దుస్తులు చూపించి నచ్చింది చేతికిచ్చి పంపించారు. ఓర్పుతో నేర్పుగా పండగ వ్యాపారాన్ని ఒంటి చేత్తో గట్టెక్కించారు. నిజానికి వీరిని ‘సేల్స్ గర్ల్స్’ అని పిలవడం చాలా చిన్న మాట. ఇలా ఓర్పు, నేర్పు ఉన్న మహిళలు పెద్దపెద్ద మాల్స్లో ఉద్యోగినులుగా వ్యవహరిస్తూ కొనుగోలుదారులను మెప్పించి అక్కడే దుస్తులు కొనేలా ఒప్పిస్తున్నారు. చీర సెలెక్టు చేయడానికి వచ్చే వారు కూడా మహిళలే కావడంతో ఎన్నో రకాలు ఎంచుతుంటారు. వాళ్లకి ఎంతో ఓపికగా అన్ని రకాలు చూపిస్తూ వారి మనసును గెలుచుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు అక్కడ పనిచేస్తున్న సేల్స్ గర్ల్స్. కొత్తగా వచ్చిన చీరల కోసం పరిచయం చేయడం, ఏ రంగు కట్టుకుంటే బాగుంటుంది వంటి అంశాలను వారికి తెలియచేస్తూ అమ్మకాలను సాగించారు.జిల్లా కేంద్రంలో 10 షాపింగ్ మాల్స్, వందకుపైగా పెద్ద చీరల షాపులు ఉన్నాయి. వాటిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వందల్లో దుకాణాలు ఉన్నారు. వీటిలో మగవారు ఉన్నా వారు అకౌంటింగ్ సెక్షన్లకే పరిమితం అవుతున్నారు. కొనేవారు వచ్చిన దగ్గర నుంచి వారికి స్వాగతం పలుకుతూ, వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుని నచ్చిన వస్తువులు ఇచ్చి పంపించే బాధ్యతను ‘సేల్స్ గర్ల్స్’కు అప్పగిస్తున్నారు. దీంతో కొనుగోలుదారుల ఇష్టాఇష్టాలు తెలుసుకుని వారికి నప్పే దుస్తులు తెప్పించి ఒప్పించి మెప్పించే బాధ్యతను ఈ మహిళలు అలవోకగా చేశారు.నేను టీచర్ ట్రైనింగ్ అయ్యానుగత ఏడాదిగా సేల్స్గర్ల్గా పనిచేస్తున్నాను. టీచర్ ట్రైనింగ్ (డీఈడీ) పూర్తిచేశాను. కోచింగ్ తీసుకొని డీఎస్సీ రాశాను. ఖాళీగా ఉండకుండా ఈ ఉద్యోగం చేస్తున్నాను. ఎంతో ఓపికతో కస్టమర్లకు బట్టలు చూపిస్తాం.– సంతోషలక్ష్మీ, పొందూరుఏడేళ్లుగా పనిచేస్తున్నానుఈ సేల్స్ విభాగంలో ఏడేళ్లుగా పనిచేస్తున్నాను. కస్టమర్లకు కావాల్సిన చీరలను చూపించే స్టాల్ వద్దకు మర్యాదపూర్వకంగా తీసుకెళ్లడం నా బాధ్యత. వారు కొనుగోలు చేసే విధంగా అన్ని రకాలు చూపిస్తాం. నా ఇద్దరు పిల్లలను ఈ సంపాదనతో చదివిస్తున్నా.– హేమలత, హడ్కో కాలనీకువైట్లో పనిచేసేదాన్నినేను ముందులో కువైట్లో పనిచేసేదాన్ని. మా నాన్నగారు చనిపోయాక మా అమ్మకి చెల్లికి తోడుగా ఉండాలని వచ్చేశాను. ఈ ఉద్యోగంతో మా చెల్లిని చదివిస్తున్నా. ఆమె ప్రస్తుతం పీజీ చదువుతోంది. నేను పదేళ్లుగా ఈ సేల్స్ రంగంలో పనిచేస్తున్నాను. అమ్మకి తోడుగా ఉంటున్నాను.– లీలారాణి, ఇలిసిపురం -
‘పాక్లో నన్ను వేధిస్తున్నారు’.. మహిళ ఆడియో వైరల్
ఇస్లామాబాద్: సర్భ్జిత్ కౌర్ అనే మహిళ సిక్కుల తీర్థయాత్ర కోసం పాకిస్థాన్కు వెళ్లి అక్కడే ఒక పాకిస్థానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆ మహిళ పేరుతో వచ్చిన ఓ ఆడియో టేపుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పంజాబ్ రాష్ట్రం కపుర్తలా జిల్లా ఆమ్నీపూర్ గ్రామానికి చెందిన సర్బ్జిత్ కౌర్.. సిక్కుల మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి గతేడాది నవంబర్లో వాఘబార్డర్ మీదుగా పాకిస్థాన్లోకి ప్రవేశించింది. ఆ తీర్థయాత్రకోసం దాదాపు 2 వేల మంది భక్తులు పాకిస్థాన్ వెళ్లగా అందరూ తిరిగి వచ్చారు. అయితే సర్బ్జిత్ రాకపోవడంతో వారి కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించగా వారు విచారించారు. అప్పుడు ఆమె అక్కడే నశీర్ హుస్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని తెలిసింది. దీంతో అందరూ షాక్కు గురయ్యారు. తాజాగా ఇప్పుడు ఆమె పేరుతో ఒక ఆడియో టేప్ వైరల్ అవుతోంది.అందులో అక్కడ తాను అస్సలు బాగాలేనని తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు అతని కుటుంబం తనను చిత్రహింసలకు గురిచేస్తోందని అన్నట్లు ఉంది. దయచేసి తనను తిరిగి ఇండియా తీసుకెళ్లాలని తన భారత్లో ఎటువంటి హాని చేయనని ఆమె అందులో అన్నారు. తన పిల్లలను చూడాలని ఉందని ఎంతోమందికి లక్షల రుపాయలు దానంగా ఇచ్చిన తను ఇప్పుడు డబ్బుల కోసం వేడుకోవాల్సి వస్తోందని ఆడియోలో పేర్కొన్నారు. అయితే ఈ ఆడియో క్లిప్ సర్బ్జిత్ కౌర్కు చెందిందా కాదా అనే విషయం పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.అయితే సర్బ్జిత్ కౌర్ వివాహం అనంతరం అక్కడి పోలీసులు వారిపై దాడి చేసి పెళ్లిని రద్దు చేసుకోవాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించిన లాహెర్ కోర్టు సర్భ్జిత్ని అక్కడి ప్రభుత్వ వసతి గృహానికి తరలించినట్లు అక్కడి తెలిపారు. అయితే కౌర్ను ఇది వరకే పాకిస్థాన్ నుంచి పంపించాలని ప్రయత్నించగా వాఘా బార్డర్ మూసివేయడంతో అది సాధ్యపడలేదని అక్కడి అధికారులు అన్నారు. -
గుండెలపై పడుకున్న పాము.. తర్వాత ఏమైందంటే?
పాము ఈ పేరు వింటే చాలు చాలామందికి గుండె గుబేల్ మంటుంది. అవి ఇంట్లోకి వచ్చినా.. వాటిని చుసినా భయంతో పరుగెత్తుతారు. ఇక పామే మనపై పడుకుంటే.. అప్పుడు పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించుకొండి.. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని ఓ మహిళకు జరిగింది. దీంతో ఆమె గుండె ఆగినంత పనైందని ఆ సమయంలోనే తన అనుభవాల్ని మీడియాతో పంచుకుంది.బ్రిస్సెన్స్కు చెందిన ఓ దంపతులు యథావిధిగా రాత్రి పడుకున్నారు. ఉదయం అవడంతో భర్త నిద్రలేచి లైటు వేశారు. దీంతో నిద్రలేచిన మహిళ కళ్లు తెరిచేసరికి గుండె ఆగినంత పనైంది. తన ఛాతిపై 2.5 మీటర్ల పొడుగైన పాము పడుకొని ఉంది. దీంతో అప్పుడు తనకు కలిగిన భావనను ఆ మహిళ మాటల్లో "నాకళ్లు తెరిచేసరికి నాపైన పెద్ద పాము పడుకొని ఉంది. భయంతో నాకు ఏం చేయాలో తోచలేదు. వెనక నుంచి నాభర్త కదవలవద్దు అన్నారు. దీంతో భయంభయంగా అలానే ఉన్నాను" అని చెప్పారు.దీంతో వెంటనే అక్కడి నుండి వెళ్లిన ఆమె భర్త పాములను పట్టే వ్యక్తిని తీసుకవచ్చారు. అతను ఆ మహిళకు ఏం ప్రమాదం కాకుండా ఆ సర్ఫాన్ని తీసి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనను తలుచుకుంటే తనకు ఎంతో భయంగా ఉంటుందని ఆ మహిళ తెలిపింది. అయితే ఆ పాము విషపూరితమైనది కాదని వన్యప్రాణి అధికారులు తెలిపారు. కాగా చలికాలం కావడంతో వెచ్చదనం కోసం పాములు ఇండ్లలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. ఇంటికి ఎటువంటి రంద్రాలు లేకుండా ఉంచడంతో పాటు తలుపులు వేసి ఉంచడం ద్వారా పాములు రావడాన్ని కొంతమేర నియంత్రించవచ్చని పేర్కొన్నారు. సరైన శిక్షణ లేకుండా పాములను పట్టుకోవడం చేయవద్దని అలా చేయడం ద్వారా అవి కరిచే ప్రమాదముందని అధికారులు తెలిపారు. -
జంతువులా ఈడ్చుకెళ్లారు
వాషింగ్టన్: అమెరికాలో ఒక మహిళను ఇమిగ్రేషన్ అధికారులు కారులోనుంచి బలవంతంగా బయటకు లాగి అరెస్టు చేసి, చేతులు పట్టుకొని బరబరా ఈడ్చుకెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. అలియా రెహ్మాన్(42) అమెరికా పౌరురాలు. ఇక్కడే జన్మించారు. మిన్నెపొలిస్ నగరంలో నివసిస్తున్నారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజూరీ సెంటర్లో చికిత్స కోసం ముందే అపాయింట్మెంట్ తీసుకున్నారు. మంగళవారం కారులో అక్కడికి బయలుదేరారు. మధ్యలో ముఖాలకు మాస్క్లు ధరించిన ఇమిగ్రేషన్ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఆమె కూర్చున్నవైపు కారు అద్దం పగులగొట్టారు. సీటు బెల్ట్ను కట్ చేశారు. డ్రైవర్ సీటు గుండా ఆమెను బయటకు లాగారు. కాళ్లు చేతులు పట్టుకొని ఈడ్చుకెళుతూ తమ వాహనంలోకి ఎక్కించారు. డిటెన్షన్ సెంటర్కు తరలించారు. ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందని, వదిలిపెట్టాలని రోదిస్తూ వేడుకున్నా కనికరించలేదు. కనీసం చికిత్స అందించే ఏర్పాటు కూడా చేయలేదు. దాంతో బాధితురాలు చాలాసేపు స్పృహ కోల్పోయారు. చివరకు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తాను ఇప్పటికీ బతికి ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని అలియా రెహ్మానచెప్పారు. ఒక జంతువును ఈడ్చుకెళ్లినట్లుగా తనను ఈడ్చుకెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారు. మిన్నెపొలిస్లో అక్రమ వలసదారులపై ఇమిగ్రేషన్ అధికా రులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. వారిని గుర్తించడానికి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను డిటెన్షన్ కేంద్రాలకు తరలించి ప్రశి్నస్తున్నారు. మరోవైపు వలసదారులకు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయి. -
మానసిక వికలాంగురాలిపై 55 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
సాక్షి, హనుమకొండ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో మానవత్వాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. ఓ మానసిక వికలాంగురాలిపై 55 ఏళ్ల వృద్ధుడు పోలేపాక ప్రభాకర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రిమాండ్కు తరలించారు. జరిగిన సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మానసిక వికలాంగురాలిపై ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. -
అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా..
స్త్రీశక్తి అపారం.. సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి.. సూర్యాస్తమయం తర్వాత కూడా పనిచేస్తూ దేశాభివృద్ధి.. కుటుంబ సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. పారిశుధ్య కార్మికురాలిగా.. ఉపాధికూలీగా.. ఉద్యోగిగా.. డాక్టర్గా.. అధికారిణిగా నిరంతరం శ్రమిస్తున్నారు. అమ్మగా.. భార్యగా.. బిడ్డగా ఇంటిని తీర్చిదిద్ది.. విధుల్లో అలుపన్నదే లేకుండా కష్టపడుతున్నారు. కాలంతో పోటీ పడుతూ అన్ని పాత్రలకు వన్నె తెస్తున్నారు. వేకువజాము మొదలు రాత్రి పడుకునే వరకు ఆమె కష్టపడుతున్న తీరుపై ఈ వారం సండే స్పెషల్..!! పెద్దపల్లిలో కొడుకును పాఠశాలకు తీసుకెళ్తున్న తల్లి ప్రిన్సీతాముపడుతున్న కష్టం పిల్లలకు రావొద్దనుకుంటారు తల్లులు. ఉదయం 8 గంటలకు చిన్నపిల్లలైతే ఉగ్గుతినిపించి కడుపునింపుతున్నారు. స్కూల్కు వెళ్లే పిల్లలను తీసుకుని బడి‘బాట’పడుతున్నారు. అన్ని జాగ్రత్తలు చెప్పి వస్తున్నా రు. భర్తను ఆఫీసుకు పంపడం, అత్తమామలు, తల్లిదండ్రులకు సపర్యలు, ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు.పెద్దపల్లిలో పారిశుధ్య పనులు చేస్తున్న చింతల రాజేశ్వరిఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో నాలుగువేలకు పైగా మహిళా పారిశుధ్య కార్మికులున్నారు. నిత్యం ఉదయం 4 గంటల నుంచే విధుల్లో నిమగ్నమవుతున్నారు. విడతలవారీగా రహదారులు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. మురికి కాలువలు శుభ్రం చేస్తున్నారు. చలికి, ఎండకు, వానకు తట్టుకుంటూ.. నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగాఉంచుతున్నారు.పెద్దపల్లి శాంతినగర్లో పాలు పితికిన కనకలక్ష్మిగ్రామాల్లో పాడిపరిశ్రమ, వ్యవ‘సాయం’లో మహిళలు ఎక్కువ భాగస్వాములవుతున్నారు. ఉదయం 5 గంటలకే పాడిపశువుల నుంచి పాలుపితకడం.. వ్యవసాయం చేసే మహిళలు తమ చేలలో పండిన కూరగాయలను మార్కెట్కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. చిరువ్యాపారం చేసే వారు ఉదయాన్నే మార్కెట్కు వచ్చి విక్రయాలు ప్రారంభిస్తున్నారు. ఇంటి ఖర్చులు పోను.. ఆర్థికంగా బలపడుతున్నారు.సిరిసిల్లలో ఉదయం 6గంటలకు విధుల్లో కండక్టర్ పిల్లి రోజారాణిప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలు ఎక్కువే ఉన్నారు. ఉదయం ఆరు గంటలకే ఫస్ట్ బస్ డ్యూటీ కోసం మహిళా కండక్టర్లు బయలుదేరుతారు. పొద్దంతా డ్యూటీ చేసి.. వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి అప్పగించి ఇంటికి చేరుతారు. ఉద్యోగ బాధ్యత పూర్తిచేసి కుటుంబానికి ఆసరాగా నిలుస్తారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిబ్బంది ఉదయం ఆరు గంటలకే విధుల్లో ఉంటూ అత్యవసర సేవలు అందిస్తుంటారు.పెద్దపల్లి: గురాంపల్లిలో కొడుక్కి స్నానం చేయిస్తున్న లావణ్యవేకువజామునే పిల్లలను నిద్ర నుంచి లేపి పిల్లలకు స్నానం చేయిస్తా రు. 7 గంటల వరకే పాఠశాలకు సిద్ధం చేయిస్తారు. పిల్లలను స్నా నం మొదలు.. డ్రెస్.. జెడ ఇతర సపర్యలు చేస్తున్నంత సేపు బాగా చదువుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఉన్నతంగా ఎదగాలని పిల్లలకు హితబోధ చేస్తా రు. అల్పాహారం సిద్ధం చేస్తారు.పెద్దపల్లిలో విధులకు వెళ్తున్న ప్రైవేటు టీచర్లు సుమలత, లతకుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు పలువురు మహిళలు ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్నారు. ఉద యం 9 గంటలకు ప్రైవేటు, ప్రభు త్వ టీచర్లు, ఇతర ప్రైవేటు రంగా ల్లో పనిచేసే మహిళలు లంచ్ బాక్స్ పట్టుకొని చలో..చలో అంటూ కదులుతున్నారు. సాయంత్రం వరకు విధులు నిర్వహించి తిరిగి ఇంటి ముఖం పడుతున్నారు.సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేస్తున్న డాక్టర్ లహరిప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించేందుకు 10 గంటలకే విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాల్లో విధుల్లో ప్రజాసేవలో తరిస్తున్నారు. అధికా రులు.. అర్జీదారులకు వారధిగా ఉంటూ.. ప్రభుత్వపాలనలో మహిళా ఉద్యోగులు భాగస్వాములు అవుతున్నారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటున్నారు.పెద్దపల్లిలో పిల్లలకు లంచ్ రెడీ చేస్తున్న గాదాసు శైలజపిల్లలను స్కూళ్లకు పంపి, భర్తలను ఉద్యోగానికి పంపిస్తూ కాసేపైనా విశ్రాంతి తీసుకోకుండా మధ్యాహ్నం భోజన తయారీకి సన్నద్ధం అవుతుంటారు. కుటుంబ ఆరోగ్యమే లక్ష్యంగా పౌష్టికాహారాన్ని వండుతుంటారు. రుచికరమైన వంటలు చేసి.. పిల్లలకు, భర్తకు భోజనం తయారు చేస్తుంటారు. లంచ్ బాక్స్ల్లో వడ్డించుకుని.. పాఠశాలల్లో ఉన్న పిల్లలకు తీసుకెళ్తుంటారు.పెద్దపల్లిలో పాఠశాలలో చిన్నారికి అన్నం తినిపిస్తున్న తల్లిఇంటి పని మొత్తం పూర్తి చేసుకుని.. పిల్లలకు లంచ్బాక్సులు రెడీ చేసుకుని పాఠశాలలకు వెళ్తుంటారు. అక్కడ చిన్నారులకు గోరుముద్దలు తినిపించుకుంటూ.. తరగతి గదుల్లో చెప్పిన పాఠాలను తెలుసుకుంటారు. గ్రామాల్లో వ్యవసాయకూలీలు పొలం పనుల్లో నిమగ్నమవుతూ.. పాటలు పాడుతూ సరదాగా సాగుతుంటారు.పెద్దపల్లి మహిళా పోలీస్స్టేషన్లో విధుల్లో ఎస్సై అక్కల రాజమణిపొద్దంతా కష్టపడి.. అలిసిపోయి.. కుటుంబసభ్యులతో కాసేపు సరదాగా గడుపుతుంటారు. రాత్రి తినేందుకు వంట సిద్ధం చేస్తుంటారు. ఆరోజు మిగిలిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. రోజూవారి కార్యక్రమాలు, కుటుంబ పరిస్థితి, అవసరాలు, ఆచరణలపై భర్త, ఇంటి పెద్దలతో చర్చిస్తుంటారు.పెద్దపల్లిలో రాత్రివేళ చలి మంట కాగుతూ..గృహిణులు తమ పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకొస్తుంటారు. హోంవర్క్ చేయిస్తూ.. అనుమానాలు నివృత్తి చేస్తూ టీచర్గా మారుతుంటూరు. పొ లం పనులకు వెళ్లినవారు చేలలో బిజీబిజీగా ఉంటారు. కొందరు అత్యవసర సేవల్లో పనిచేసే మహిళలు సమయంతో పనిలేకుండా ముందుకు సాగుతుంటారు.కొడుకు కూతురు శాన్వి, ఫర్నీత్లను నిద్రపుచ్చుతున్న తల్లి భైరి సుధచిన్నారులు.. కుటుంబసభ్యులకు భోజనాలు వడ్డించి మిగిలిపోయిన పనులు పూర్తిచేసుకుంటారు. రేపటి కోసం అవసరమైన పనులు సిద్ధం చేసుకుంటారు. చిన్నారులను లాలించి, నిద్రబుచ్చుతారు. కుటుంబ క్షేమమే తమ బాధ్యతగా ముందుకు సాగుతూ.. రోజంతా కష్టపడే మహిళలు.. ఆ ఇంట్లోని వారు అందరూ నిద్రపోయిన తరువాత విశ్రాంతి తీసుకుంటారు. ఫొటోలు: సాక్షి, ఫొటోగ్రాఫర్లు పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల -
అప్పుడు భర్త హత్య .. ఇప్పుడు భార్యను కాల్చి చంపేశారు!
ఢిల్లీ ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో ఉన్న షాలిమార్ బాగ్లో దారుణం చోటు చేసుకుంది. భర్త హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న భార్యను కూడా హత్య చేశారు దుండగులు. శనివారం రాత్రి సమయంలో పాయింట్ బ్లాంక్లో రేంజ్లో గన్ గురిపెట్టి కాల్చి చంపేశారు. రచనా యాదవ్.. ఆమెకు 44 ఏళ్లు. సుమారు మూడేళ్ల క్రితం ఆమె భర్త విజేంద్ర యాదవ్ను కోల్పోయింది. 2023లో విజేంద్ర యాదవ్ను కొంతమంది హత్య చేశారు. ప్రస్తుతం ఆ కేసు అండర్ ట్రయల్లో ఉంది. ఆ కేసులో భార్య రచనా యాదవ్నే కీలక సాక్షిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమెను కూడా గుర్తుతెలియని పలువురు గన్తో కాల్చి హత్య చేశారు. అయితే భర్తను హత్య చేసిన నిందితులే.. ఆమెను హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె షాలిమార్ బాగ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్(ఆర్డబ్యూఏ)కు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆమెను తలపై కాల్చడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. విజేంద్ర యాదవ్ కేసులో ఐదుగురు నిందితులురచనా యాదవ్ భర్త విజేంద్ర యాదవ్ హత్య కేసులో ఐదుగురు నిందితులుగా ఉన్నారు. భరత్ యాదవ్ అనే వ్యక్తితో పాటు మరో నలుగురు నిందితులుగా చేర్చారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తు దశలో ఉన్న క్రమంలో భార్య రచనా యాదవ్ను కూడా హత్య చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తను అప్పుడు హత్య చేసిన వారే ఇప్పుడు భార్యను కూడా అడ్డులేకుండా తొలగించుకోవాలని చూశారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే భర్త హత్య కేసులో నిందితుడిగా ఉన్న భరత్ యాదవ్.. ఇంకా పరారీలో ఉన్నాడు. భరత్ యాదవ్ అనే వ్యక్తి ప్రకటిత నేరస్థుడిగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. -
498 ఏ, పొరుగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?
గృహహింస, వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళలకు చట్టం కల్పించిన రక్షణ సెక్షన్ 498A. వివాహిత స్త్రీ పట్ల భర్త లేదా అతని బంధువుల హింస, వేధింపులను ఈ చట్టం ద్వారా ఎదుర్కోవచ్చు. వివాహంబంధంలో అత్తింటి వారినుంచి తనకెదురైన ఇబ్బందులు, బాధలనుంచి విముక్తి పొందేందుకు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. అయితే ఈ కేసులో పొరుగింటివారి మీద కూడా కేసు నమోదు చేయవచ్చా? వారిని కూడా నిందితులుగా పేర్కొనవచ్చా? చట్టం ఏ చెబుతోంది? దీనిపై కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది?సెక్షన్ భారత శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 498A ప్రత్యేకంగా భర్త లేదా అతని బంధువులపై కేసు నమోదు చేయవచ్చు. ఎవరైనా, ఒక స్త్రీ భర్త లేదా భర్త బంధువు అయి ఉండి, ఆ వివాహితను క్రూరంగా హించినట్టు రుజువైతే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాకు కూడా విధించే అవకాశం ఉంది.అయితే ఒక కేసులో తన పొరిగింటి మహిళను విచారించాలని ఒక ఫిర్యాదు దారు కోరింది. ఈ కేసులో ఫిర్యాదు దారైన మహిళకు 2006లో జరిగిన వివాహం అయింది. వైవాహిక కలహాలు తలెత్తడంతో భర్తపై కేసు నమోదు చేసింది. హింసకు పాల్పడుతున్నాడంటూ భర్తపై ఫిర్యాదు చేసిన బాధితురాలు, పొరుగింటి మహళ తన భర్తను రెచ్చగొట్టిందని ఆరోపించింది. దీంతో పోలీసులు భర్తపైనే కాకుండా, పొరుగువారిపై కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జ్షీట్లో ఐపీసీలోని సెక్షన్లు 498A, 504, 506 మరియు 323 కింద కేసులు నమోదు చేయడంతో, ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది చందన్ కె వాదిస్తూ, ఆమెకు ఇతర నిందితుల కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా ఈ వివాదంలోకి లాగారన్నారు. భర్తను రెచ్చగొట్టిందనేది మాత్రమే ఆమెపై మోపిన ఏకైక ఆరోపణ అని, వ్యక్తిగత కక్షతో, ఆమెను నిందితురాలిగా చేర్చారని, ఈ కేసునుంచి ఆమెను తొలగించాలని వాదించారు.ప్రాసిక్యూషన్ ఈ పిటిషన్ను వ్యతిరేకించింది. న్యాయవాది కె నాగేశ్వరప్ప వాదిస్తూ, పొరుగున ఉన్న మహిళ భర్త ప్రవర్తనను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించిందని , "భర్త అన్ని ప్రవర్తనలకు ఆమెనే కారణం" అని పేర్కొన్నారు. కాబట్టి ఆమె విచారణను ఎదుర్కొని, చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆయన వాదించారు.ఇదీ చదవండి: వీధి కుక్కల బెడద: నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్అయితే రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత, సెక్షన్ 498A కింద ఆమెను నిందితురాలిగా చేర్చడానికి తగిన కారణాలేవీ లేవని కోర్టు గుర్తించింది. దీనిపై జస్టిస్ నాగప్రసన్న తీర్పునిస్తూ పిటిషనర్ పేరు కేవలం ప్రేరేపణ ఆరోపణల సందర్భంలో మాత్రమే వెలుగులోకి వచ్చిందని, కానీ ఆమె చట్టంలోని నిబంధన ప్రకారం కుటుంబం అనే నిర్వచనంలోకి రారని పేర్కొన్నారు. ఈ కేవలం ఆరోపణ తప్ప, చట్టం ప్రకారం క్రూరత్వానికి పాల్పడిన చర్యలలో ఆమె ప్రమేయం రాదని చెప్పారు. భర్త ,భార్య లేదా కుటుంబ సభ్యుల మధ్య ఐపిసి సెక్షన్ 498A కింద నేరాలకు సంబంధించిన విచారణలో ఒక అపరిచితురాలిని చేర్చలేరని ఆ ఉత్తర్వు నొక్కి చెప్పింది. అంతేకాదు ఈ కేసులో పొరుగింటి మహిళపై కేసును అనుమతించడం, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. భర్త కుటుంబంలో భాగం కాని వ్యక్తి ఈ నిబంధన పరిధిలోకి రాదని, అందువల్ల, ఆమె విచారణను ఎదుర్కోవలసిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!అలాగే రమేష్ కన్నోజియా మరియు మరొకరు వర్సెస్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ,మరొకరి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి -
పెళ్లికి పిలిస్తే రాలేదు.. కట్ చేస్తే అస్థిపంజరం దొరికింది
అర్థరాత్రి వేళ, కాన్పూర్ పోలీసులు స్థానిక టవర్ సమీపంలో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో బయటపడిన దాన్ని చూసిన పోలీసు అధికారులతోపాటు, చలిని కూడా లెక్క చేకుండా పనిలో నిమగ్నమైన కూలీలకూ చెమటలు పట్టాయి. నేలమాళిగలో ఏడు అడుగుల లోతులో దారుణమైన స్థితిలో అస్థిపంజరం దొరికింది. ప్రేమో, వ్యామోహమో, నమ్మిన వ్యక్తికి జరిగిన తీరని ద్రోహం తాలూకు విషాద గాథ ఇదీ..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన తల్లి కనిపించడం లేదని కొడుకు ఫిర్యాదు చేయడం ఈ విషయం వెలుగు చూసింది. దొరికిన అస్థిపంజరం ఏడుగురు పిల్లల తల్లి అయిన 45 ఏళ్ల రేష్మాదిగా పోలీసులు భావిస్తున్నారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా నిర్ధారించేందుకు సిద్ధమవుతున్నారు. రేష్మా భర్త రాంబాబు సంఖ్వార్ మూడేళ్ల క్రితం మరణించాడు. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త మరణం తర్వాత, రేష్మా తన పొరుగువాడైన గోరాలాల్తో అనుబంధం పెంచుకుంది. ఆ తరువాత కొద్దికాలానికే, తన పిల్లలను వదిలి గోరాలాల్తో కలిసి జీవించడం ప్రారంభించింది. దీంతో మనస్తాపం చెందిన రేష్మా పిల్లలు ఆమెతో సంబంధాలు తెంచుకుని విడిగా జీవిస్తున్నారు.ఎలా బయటపడింది?తల్లితో సంబంధాలు తెంచుకున్న రేష్మా కుమారుడు గత ఏడాది నవంబర్ 29న కుటుంబంలో జరగబోయే ఒక పెళ్లికి ఆహ్వానం పంపాడు. రేష్మా పెళ్లికి రాలేదు. దీంతో బబ్లూకు అనుమానం వచ్చింది. గోరాలాల్ ఇంటికి వెళ్లి రేష్మా గురించి ఆరా తీశాడు."నీ అమ్మ ఇక తిరిగి రాదు" అని గోరాలాల్ బదులిచ్చాడు. జోక్ చేస్తున్నాడనుకుని మొదట్లో పెద్దగా అనుమానం రాలేదు. కానీ పదే పదే అడిగినా, కచ్చితమైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ వచ్చాడు. ఇక లాభం లేదనుకుని బబ్లూ పోలీసులను ఆశ్రయించాడు.డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దిగ్భ్రాంతికరమైన నిజంబబ్లూ ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, పోలీసులు గోరాలాల్ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. చివరికి, అతను నిజం చెప్పాడు. గత సంవత్సరం ఏప్రిల్లో తనకు, రేష్మాకు మధ్య గొడవ జరిగిందని, దీంతో ఆమెను రేష్మాను వదిలించు కోవాలనుకున్నాడు. ఇంట్లోంచి వెళ్లిపొమ్మని బెదిరించాడు. రేష్మా నిరాకరించింది. దీనివల్ల తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే అతడు రేష్మాను గొంతు నులిమి చంపేశాడు. రెండు రోజుల పాటు అతను మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, దానిని ఎలా వదిలించుకోవాలో ఆలోచించాడు. ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!దానిని కాలువలో పడేయాలని ప్లాన్ చేశాడు, కానీ కొన్ని రోజుల్లో మృతదేహం నీటిపై తేలుతుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఆ తర్వాత గ్రామంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టాలనుకున్నాడు. విచారణ సమయంలో ఆ ప్రదేశం గురించి పొరపాటున చెప్పడంతో, ఈ భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆభరణాలు , బట్టల ద్వారా ఆమెను గుర్తించారు. అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, రేష్మా ఎముకలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు.ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె? -
మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్
అమెరికాలో వలసదారులపై జరుగుతున్న దాడుల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ దారుణానికి ఒడిగట్టాడు. ఒక మహిళను కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. మిన్నియాపాలిస్లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో వందలాది మంది ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారంమిన్నెసోటాలోని మిన్నియాపాలిస్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్కు వ్యతిరేకంగా నిరసనకారులు ఉద్యమానికి దిగారు. నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, కారులో కూర్చున్న మహిళ తలపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో రెనీ గుడ్ (37) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.Ice agent shoots woman who tried to flee 😳 pic.twitter.com/fJ1X2XDMhC— RTN (@RTNToronto) January 7, 2026 ఇమ్మిగ్రేషన్ అమలు సమయంలో అధికారులను అడ్డుకోడంతో కాల్పులు జరిపినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఘర్షణ సమయంలో మహిళపై కాల్పులు జరిగాయని DHS ప్రతినిధి ట్రిసియా మెక్లాఫ్లిన్ తెలిపారు. అల్లర్లకు, రెనీ గుడ్కు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలి తల్లి డోనా గాంగర్ విచారం వ్యక్తం చేసింది. తన కుమార్తె ఎంతో దయగల, గొప్ప మనిషి, ప్రజలంటే ప్రేమగల ఆమెను అన్యాయంగా కాల్చి చంపారని తల్లి వాపోయింది. అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్, హింస సర్వసాధారణంగా మారింది అని చెప్పడానికి మరో స్పష్టమైన ఉదాహరణ అని విశ్వవిద్యాలయ అధ్యక్షుడు బ్రియాన్ హెంఫిల్ వ్యాఖ్యానించారు. వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనం అంటూ ఆగ్రహం పెల్లుబుకింది. వందలాది మంది నిరసనలకు దిగారు. మిన్నియాపాలిస్ నగర కౌన్సిల్లోని మెజారిటీ సభ్యులు రెనీ మరణానికి కారణమైన ఏజెంట్ను అరెస్టు చేసి, విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ICE తమ నగరాన్ని విడిచి పెట్టాలంటున్నారు. అధికారుల భిన్నవాదనలుఈ సంఘటనల గురించి ఫెడరల్ , స్థానిక అధికారులు చాలా భిన్నవాదనలు వినిపిస్తున్నారు. కారును ఆపి బయటికి రావాలని ఆదేశాలను బేఖాతరు చేయడంతో పాటు, ఉద్దేశపూర్వకంగా ఏజెంట్పై ఎదురుదాడికి దిగి, ICE అధికారిని ఢీకొట్టడానికి ప్రయత్నించినందున మహిళను కాల్చి చంపామని అంటున్నారు. ఈ ఘటనపై FBI దర్యాప్తు జరుగుతోంది2020లో ఓల్డ్ డొమినియన్ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషులో పట్టభద్రురాలైంది గుడ్. ఆమె కవయిత్రి కూడా. ప్రస్తుతం రెనీ నికోల్ గుడ్ తన భాగస్వామితో మిన్నియాపాలిస్లో నివసిస్తోంది.కాగా ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత వలసదారుల ఆంక్షలు, దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య ఐదుకి చేరింది.ఇదీ చదవండి: బాలికపై సామూహిక అత్యాచారం : యూట్యూబర్ అరెస్ట్, పరారీలో ఎస్ఐ -
క్రికెటర్.. నాకంటే 12 ఏళ్లు పెద్దది కావడంతో..
చిత్తూరు అర్బన్/ గంగాధరనెల్లూరు: ఇద్దరు విభిన్న ప్రతిభావంతుల మధ్య చిగురించిన ప్రేమ చివరకు విషాదాంతంగా ముగిసింది. ప్రియురాలు తనకన్నా పెద్దది కావడం.. ఆమెను వదిలించుకునే క్రమంలో ప్రియుడు కిరాతకంగా మారిపోయాడు. ఆమెను నిర్ధాక్షిణ్యంగా హత్య చేసి నీవానదిలో పడేశాడు. చిత్తూరులో నమోదైన అదృశ్యం కేసు హత్యగా పలుపు తిరిగింది. బుధవారం ప్రియురాలి మృతదేహాన్ని గంగాధర నెల్లూరులోని నీవానదిలో గుర్తించారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి.. గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని గిరింపేట బాలజీ కాలనీకి చెందిన కవిత విభిన్న ప్రతిభావంతురాలు. కాణిపాకం ఆలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిస్తున్నారు. గత నెల 31వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లిన కవిత సాయంత్రం వరకు రాకపోవడంతో ఆమె తమ్ముడు చిట్టిబాబు అన్ని చోట్లా వెదికాడు. జనవరి 1వ తేదీన చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. 2వ తేదీన కేసు నమోదు చేశారు.ప్రియుడే హంతకుడు?చిత్తూరులోని మిట్టూరు ఎస్బీఐలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజరుగా విభిన్న ప్రతిభావంతుడు గణేష్(26) పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కవిత, గణేష్ మధ్య పరిచయం పెరిగింది. ఈ పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారితీసినట్లు తెలుస్తోంది. తనకన్నా కవిత వయస్సులో 12 ఏళ్లు పెద్దది కావడంతో.. ఆమెను వదిలించుకోవడానికి గణేష్ ఈ దారుణానికి ఒడిగట్టిట్లు సమాచారం.పెళ్లి చేసుకుంటానని నమ్మించి చంపేశాడు!కవితను పెళ్లి చేసుకుంటామని చెప్పిన గణేష్.. ఆమెను గత నెల 31న ఆటోలో గంగాధరనెల్లూరులోని ఠాణా వద్దకు రప్పించాడు. కొద్దిసేపు తరువాత గణేష్, కవిత మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. తీరా పెళ్లి చేసుకుంటామని నమ్మించి, తన మూడు చక్రాల స్కూటర్లో కవితను ముందర కూర్చోబెట్టుకుని ఆమె తలను వాహనంపై ఉన్న ఓ ఇనుపరాడ్కు బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో కవిత చనిపోవడంతో.. గంగాధరనెల్లూరు బ్రిడ్జిపై నుంచి ఆమెను నీవానదిలోకి తోసేసి వెళ్లిపోయాడు. పోలీసులు గణేష్ను పలుమార్లు స్టేషన్కు పిలిపించి విచారించినా, తాను కూడా ఆమెను వెతుకుతున్నట్లు తప్పుదారి పట్టించాడు. బుధవారం సాయంత్రం నీవానదిలో పడి ఉన్న కవిత మృతదేహాన్ని గుర్తించిన ఆమె సోదరుడు చిట్టిబాబు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగి అయిన గణేష్.. కవితను వాడుకుని వదిలించుకోవడానికే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.క్రికెటర్..బ్యాంక్ ఉద్యోగివిభిన్న ప్రతిభావంతుడైన గణేష్ జాతీయ స్థాయిలో క్రికెటర్గా రాణించి క్రీడా కోటాలో బ్యాంకు ఉద్యోగం వచ్చింది. బలిష్టంగా ఉన్న ఇతను కవిత మృతదేహాన్ని అవలీలగా నదిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.పోలీసుల వైఫల్యమే కారణంపోలీసుల వైఫల్యం వల్లే కవిత హత్య జరిగిందని.. దీనికి చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య నిర్లక్ష్యమే కారణమని వైఎస్సార్సీపీ చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆయన దుయ్యబట్టారు.మా నిర్లక్ష్యం లేదుసీఐ స్పందిస్తూ.. ‘సెల్ టవర్ల లొకేషన్లతో అడవుల్లో, బావులు, చెరువుల వద్ద కవితను వెదికాము. మూడు రాత్రులు మావాళ్లు, నేను నిద్రకూడా పోలేదు. ఆమె కుటుంబ సభ్యులు వాయిస్ మెసేజ్ మాకు ముందుగా ఇచ్చి ఉంటే కేసు త్వరగా ఛేదించేవాళ్లం. ఇందులో మా నిర్లక్ష్యం ఎక్కడాలేదు..’ అని నెట్టికంటయ్య పేర్కొన్నారు. -
గదిలో బంధించి.. యువతిపై 12 మంది అత్యాచారం!
బెంగుళూరు: మంగళూరులో అమానుష ఘటన జరిగింది. యువతి తండ్రి అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న కామాంధులు బాధితురాలిని లోబర్చుకొని కామవంఛతీర్చుకున్నారు. రెండు రోజులు నరకం అనుభవించిన యువతి కామాంధుల బారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. చిక్కమగళూరు జిల్లా బీరూరు గ్రామానికి చెందిన తల్లిలేని బిడ్డ తన బంధువుల ఇంటిలో ఉంటూ పీయూసీ వరకు చదివింది. అనంతరం తండ్రి వద్దకు వచ్చింది. గతనెలలో తన అవ్వ ఇంటికి వెళ్లి రెండు రోజులు అక్కడే ఉంది. మంగళూరుకు చెందిన భరత్శెట్టి అనే వ్యక్తి యువతి తండ్రి వద్దకు వెళ్లి స్నేహంగా ఉండేవాడు. మంగళూరులో తమకు ఇల్లు ఉందని, మీరిద్దరూ వస్తే ఆశ్రయం కల్పిస్తామని చెప్పడంతో యువతి, ఆమెతండ్రి, యువతి అవ్వ కలిసి భరత్శెట్టి వెంట వెళ్లారు. అక్కడ భరత్శెట్టి ఆ యువతి తండ్రిని మభ్య పెట్టి డబ్బు ఇచ్చాడు. అనంతరం యువతిని ఒక ఇంటిలో ఉంచి కొంతమంది విటులను పంపించాడు. రెండు రోజులపాటు కామాంధులు ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తనను వదిలేయాలని యువతి వేడుకున్నా కనికరించలేదు. భరత్శెట్టికి డబ్బులు ఇచ్చామని చెప్పి లైంగికదాడికి పాల్పడ్డారు. ఎట్టకేలకు యువతి తప్పించుకొని వచ్చి దక్షిణకన్నడ జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళూరుకు వెళ్లి భరత్శెట్టితోపాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. యువతి తండ్రి, అవ్వపై కూడా కేసు నమోదు చేశారు. -
హీరో కాబోయి జీరో
అమ్మాయి ప్రేమ కోసం ‘యాక్సిడెంట్’ డ్రామా..ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలి.. తన దృష్టిలో హీరోగా నిలిచిపోవాలి.. ఇదీ ఒక యువకుడి పిచ్చి ఆలోచన. దీనికోసం అతను వేసిన ప్లాన్ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. రోడ్డుపై ఘోర ప్రమాదండిసెంబర్ 23వ తేదీ సాయంత్రం 5.30 గంటలు. కోచింగ్ క్లాస్ ముగించుకుని ఓ యువతి తన స్కూటర్పై ఇంటికి వెళ్తోంది. పతనంతిట్ట సమీపంలోని వళ ముట్టం ఈస్ట్ వద్దకు రాగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ఆమె స్కూటర్ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి ఆమె గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. కారు ఆగకుండా మెరుపు వేగంతో వెళ్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి స్థానికులు భయబ్రాంతులయ్యారు.‘రక్షకుడు’ ఎంట్రీఏం చేయాలో తెలియక జనం తత్తరపడుతున్న సమయంలో.. అక్కడికి ఒక ఇన్నోవా కారు వచ్చి ఆగింది. అందులో నుంచి రంజిత్ రాజన్ అనే యువకుడు కంగారుగా దిగాడు. ‘నేను ఆమె భర్తను’.. అంటూ అందరినీ నమ్మించాడు. ఎంతో ఆవేదన నటిస్తూ ఆమెను హుటాహుటిన కొన్నీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అందరూ అతన్ని ‘దేవుడు పంపిన రక్షకుడు’ అని మెచ్చుకున్నారు.విస్తుపోయే నిజం!ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య తనిఖీల్లో.. ఆ యువతికి తీవ్ర గాయాలైనట్లు తేలింది. కుడి చేయి ఎముక పక్కకు జరగడం, వేలు విరగడంతో పాటు ఒళ్లంతా గాయాలయ్యాయి. మొదట ఇది సాధారణ హిట్ అండ్ రన్ కేసు అని పోలీసులు భావించారు. కానీ, విచారణ ముదిరే కొద్దీ పోలీసులకు అనుమానం కలిగింది. రంజిత్ మాటల్లో పొంతన లేకపోవడంతో లోతుగా ఆరా తీశారు. అప్పుడు బయటపడింది అసలు గుట్టు.పక్కా ప్రణాళికతో..ఆ ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదు.. రంజిత్ పక్కాగా ప్లాన్ చేసి చేయించాడు.. అదెలా అంటే.. ‘యువతిని తన స్నేహితుడు అజాస్ కారుతో గుద్దిస్తాడు. వెంటనే తనే అక్కడికి చేరుకుని కాపాడినట్టు నటించాలి. యువతికి, ఆమె కుటుంబానికి తనపై విపరీతమైన ప్రేమ, కృతజ్ఞత కలిగేలా చేయాలి. మళ్లీ ఆమెను తన దారిలోకి తెచ్చుకోవాలి..’పారని సైకో ప్రేమికుడి పాచికప్రేమ పేరుతో ప్రాణాల మీదకు తెచ్చిన ఈ ‘సైకో’ ప్రేమికుడి పాచిక పారలేదు. పోలీసులు రంజిత్తో పాటు అతడికి సహకరించిన అజాస్ ను అరెస్ట్ చేశారు. సాధారణ యాక్సిడెంట్ కేసు కాస్తా ఇప్పుడు ‘హత్యాయత్నం’ కేసుగా మారింది. నకిలీ ‘ప్రేమల’ వెనుక దాగున్న ఇలాంటి క్రూరత్వాలపై అప్రమత్తంగా ఉండాల్సిందే..– సాక్షి, నేషనల్ డెస్క్ -
AP: సీటు కోసం బస్సులో కొట్టుకున్న మహిళలు
అనంతపురం జిల్లా: ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి రాయదుర్గానికి వెళ్లే బస్సులో చోటు చేసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉరవకొండ నుంచి కణేకల్లు మీదుగా రాయదుర్గం వెళుతున్న రాయదుర్గం డిపోకు చెందిన బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళ ప్రయాణికులు మధ్య గొడవ ప్రారంభమైంది. నింబగల్లు సమీపంలో గొడవ తీవ్ర రూపం దాల్చి ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ పరస్పరం కొట్టుకున్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్, తోటి ప్రయాణికులు ఎంతగా వారించినా వినిపించుకోలేదు. డ్రైవర్ బస్సును ఉరవకొండ పీఎస్కు తీసుకెళ్లి గొడవ పడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులకు అప్పగించారు. మహిళలకు ఉరవకొండ సీఐ మహనంది కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
తల్లీ కూతుళ్ల మధ్య చిచ్చు పెట్టి దాడి చేసిన టీడీపీ నేత
-
డ్రగ్స్ సరఫరా చేస్తున్న విదేశీ మహిళ డిపోర్టేషన్
సాక్షి, హైదరాబాద్: స్థానికంగా మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న నైజీరియాకు చెందిన ఓ మహిళను తెలంగాణ ఈగల్ ఫోర్స్ మన దేశం నుంచి బహిష్కరించింది. మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈమెను నైజీరియాకు తరలించారు. ఈ మేరకు ఈగల్ ఫోర్స్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నైజీరియాకు చెందిన ముగ్గురు మహిళలు నకిలీ పాస్పోర్ట్, నకిలీ వీసాలతో భారత్కు వచ్చారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నం చేరుకున్న వారు స్థానికంగా షెల్టర్ తీసుకున్నారు. ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకుని డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారు.నవంబర్ మొదటి వారంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో నిర్వహించిన భారీ ఆపరేషన్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్లో 50 మందికి పైగా నైజీరియన్లను అరెస్ట్ చేయగా.. విశాఖపట్నంలో డ్రగ్స్ దందా చేస్తున్న ముగ్గురు మహిళల సమాచారం తెలిసింది. ఈ మేరకు డిసెంబర్లో విక్టరీ ఇటోహాన్ ఇయాసేలే సహా ముగ్గురు విదేశీ మహిళలను ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. ముగ్గురికీ హైదరాబాద్లోని ఫారినర్స్ రీజినల్ రిజి్రస్టేషన్ ఆఫీస్లో (ఎఫ్ఆర్ఆర్వో) బయోమెట్రిక్ నిర్వహించారు.ఆమెకు జింబాబ్వేకు చెందిన దంబుజా తఫాడ్జ్వా పేరున నకిలీ పాస్పోర్ట్, వీసా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఎఫ్ఆర్ఆర్వో పాస్పోర్ట్ను పరిశీలించారు. ఇయాసేలే విక్టరీ ఇటోహాన్ నైజీరియాకు చెందిన మహిళను గుర్తించారు. ఎఫ్ఆర్ఆర్వో నుంచి అనుమతి తీసుకుని ముగ్గురిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లోని డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. విక్టరీ ఇటోహాన్ ఇయాసేలేకు ఎఫ్ఆర్ఆర్వో నుంచి ఎగ్జిట్ పరి్మట్ పొందిన తర్వాత నైజీరియాకు టికెట్ కొనుగోలు చేశారు. దాదాపు 37 రోజుల పాటు డిటెన్షన్ సెంటర్లో ఉంచిన తర్వాత మంగళవారం నైజీరియాలోని లాగోస్కు పంపించారు. -
మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !
-
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య!
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. న్యూ ఇయర్ వేడుకల రోజున అదృశ్యమైన నికితా గోడిశాల అనే యువతి తన మాజీ ప్రియుడు ఫ్లాట్లో శవమై కనిపించింది. మేరీల్యాండ్లోన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఫ్లాట్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దాంతో అర్జున్ శర్మనే ఆమెన హత్య చేసినట్లు పోలీసుల భావిస్తున్నారు. ప్రస్తుతం అర్జున్ శర్మ పరారీలో ఉన్నాడు. అతని కోసం యూఎస్ పోలీసులు గాలిస్తున్నారు.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నిఖిత.. ప్రస్తుతం ఆమె హోవర్డ్ కౌంటీలో ఉన్న ఎల్లికాట్ సిటీలో డేటా మరియు స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేస్తుంది.మాజీ ప్రియుడిపై ఫస్ట్- సెకండ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపుతూ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. జనవరి 2వ తేదీన ఆమె అవృశ్యమైన ఫిర్యాదు తమకు వచ్చిందని, ఈ మేరకు విచారణ చేపడితే ఆమె హత్య గావించబడ్డ విషయం తాజాగా వెలుగుచూసిందన్నారు. మేరీల్యాండ్ సిటీలోని అర్జున్శర్మ ఫ్లాట్లో ఆమె డిసెంబర్ 31వ తేదీన చివరిసారి కనిపించినట్లు పోలీసులకు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. అదే అపార్ట్మెంట్లో సెర్చ్ వారెంట్ అమలు చేసి దర్యాప్తు ప్రారంభించగా, కత్తిపోట్లతో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమెది తెలంగాణ రాష్ట్రంగా అనుమానిస్తున్నారు. ఆమె స్వస్థలంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అర్జున్ శర్మది కూడా ఇండియానే. హత్య చేసిన తర్వాత అర్జున్ శర్మ భారత్కు వచ్చేశాడు.హత్యోదంతం తర్వాత భారత్కు వచ్చేసిన అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్టు చేశారు. అర్జున్ శర్మది తమిళనాడు రాష్ట్రంగా తెలుస్తోంది. -
ఆకాశ ఎయిర్పై మహిళ సంచలన ఆరోపణలు
ప్రముఖ పెట్టుబడిదారుడు, దివంగత రాకేష్ ఝన్ఝన్ వాలా తీసుకొచ్చిన విమానయాన సంస్థ ఆకాశా ఎయిర్పై ఒక మహిళ ఆరోపణలు సంచలనం రేపాయి. ఆకాసా ఎయిర్ విమానంలో పరిశుభ్రత లేక తనకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఒక మహిళ ఆరోపించింది. దీనిపై సంస్థ ఆకాశ ఎయిర్ స్పందించింది.జాహ్నవి త్రిపాఠి అనే మహిళ లింక్డిన్ ద్వారా తన అనుభవాన్ని పంచుకుంది. విమానంలోని అపరిశుభ్ర వాతావరణం తనను తీవ్ర అనారోగ్యం పాలుచేసిందినీ, తనతోపాటు ప్రయాణిస్తున్న తన స్నేహితులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారని ఆమె ఆరోపించించింది. తన స్నేహితులతో కలిసి జాహ్నవి బెంగళూరు-అహ్మదాబాద్కు డిసెంబర్ 26న రాత్రి 10:25 గంటలకు ఆకాశఎయిర్ విమానంలో బయలుదేరారు. విమానంలోని క్యాబిన్, సీట్ల పరిస్థితి చూసి షాక్ అయ్యామని, ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేపటికే కాళ్లపై తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని, అది కాలక్రమేణా మరింత తీవ్రమైందని త్రిపాఠి ఆరోపించింది. దీంతో నడవలేక, నిద్రపట్టక, రోజువారీ పనులు చేసుకోలేక ఇబ్బందు లుపడ్డానని చెప్పుకొచ్చింది. మొత్తం ప్రయాణమంతా దుర్బరమని పేర్కొంది. తనతోపాటు తన స్నేహితులు కూడా బాధలు పడ్డారని తన పోస్ట్లో పేర్కొంది.ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, ఈ ప్రయాణం తనను శారీరకంగా, మానసికంగా కృంగదీసిందని తెలిపింది. ప్రయాణీకుల ఆరోగ్యం, భద్రత అత్యంత ప్రాధాన్యతగా ఉండాలని వ్యాఖ్యానించింది.ఆకాశ ఎయిర్ స్పందనఈ ఆరోపణలపై స్పందించిన ఆకాశ ఎయిర్ ఆమె ఇబ్బందులపై విచారం ప్రకటించింది. అత్యున్నత పరిశుభ్రత, కస్టమర్ శ్రేయస్సే తమ లక్ష్యమని, ఫిర్యాదును పరిశీలించి, వీలైనంత త్వరగా సంప్రదిస్తామని ఎయిర్లైన్స్ ప్రకటించింది. -
ఎయిర్వేస్లో జాత్యహంకారం? .. ప్రయాణికురాలి మండిపాటు
నైరోబీ: కెన్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాష్మీర్ సయ్యద్కు విమాన ప్రయాణంలో ఘోర అవమానం ఎదురైంది. ‘కెన్యా ఎయిర్వేస్’లో తాను ముందుగా బుక్ చేసుకున్న బిజినెస్ క్లాస్ సీటును తనకు కేటాయించకుండా, ఎకానమీ క్లాస్కు మార్చడంపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ అంశం అంతర్జాతీయంగా మారింది.కాష్మీర్ సయ్యద్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె గత వారంలో తన ప్రయాణం కోసం బిజినెస్ క్లాస్ టికెట్ను బుక్ చేసుకుని, నిర్ణీత సమయంలోనే చెక్-ఇన్ కూడా పూర్తి చేశారు. అయితే విమానం ఎక్కే సమయంలో సిబ్బంది ఆమెను ఎకానమీ క్లాస్కు వెళ్లాలని సూచించారు. వెంటనే ఆమె ప్రశ్నించగా, విమాన సిబ్బంది సరైన సమాధానం చెప్పకుండా, ముప్పై నిమిషాల పాటు వేచి ఉండేలా చేశారని ఆమె ఆరోపించారు. స్థానిక కెన్యా పౌరురాలైన తనను కాదని, తన సీటునుఘెందుకు తెల్లజాతీయులకు కేటాయించారని ఆమె విమాన సిబ్బందిని నిలదీశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో కాష్మీర్ సయ్యద్ సిబ్బందితో విమాన వాదించడం కనిపిస్తుంది. ‘ఈ సీటు కోసం నేను డబ్బు చెల్లించాను. చెక్-ఇన్ చేశాను.. మరి నా సీటులో ఎవరు కూర్చుంటారు?’ అని ఆమె విమాన సిబ్బందిని నిలదీశారు. దీంతో విమాన సంస్థ ప్రతినిధులు ఆమెకు రీఫండ్ ఇస్తామని లేదా తదుపరి విమానంలో పంపిస్తామని ఆఫర్ చేసినప్పటికీ, ఆమె వాటిని తిరస్కరించారు. ఇది కేవలం సాంకేతిక లోపం కాదని, స్పష్టమైన జాత్యహంకార వివక్ష అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎయిర్లైన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదం ముదిరిన నేపధ్యంలో కెన్యా ఎయిర్వేస్ స్పందించింది. తమపై వస్తున్న జాత్యహంకార ఆరోపణలను సంస్థ ఖండించింది. విమాన ప్రయాణ సమయంలో చివరి నిమిషంలో విమానం మారడం వల్ల బిజినెస్ క్లాస్ సీట్ల సంఖ్య తగ్గిందని, అందుకే కొందరు ప్రయాణికులను ఎకానమీకి మార్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఈ విధమైన ఎంపిక ప్రక్రియ సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్గా జరుగుతుందని, ఇందులో జాతి వివక్షకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బాధిత ప్రయాణికురాలికి జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ సంస్థ ఆమెను క్షమాపణలు కోరింది.ఇది కూడా చదవండి: Denmark: ఉత్తరాలపై డెన్మార్క్ కీలక నిర్ణయం.. కాల గర్భంలోకి 400 ఏళ్ల చరిత్ర! -
భర్తను జట్టుపట్టిలాగి, చితక్కొట్టిన భార్య : వైరల్ వీడియో
కర్నాటకలోని ఓ ఫ్యామిలీ కోర్టు ఆవరణలో వింత సంఘటన చోటు చేసుకుంది. చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగానే ఒక మహిళ మాజీ భర్తను కొడుతున్న వీడియో వైరల్గా మారింది. అయితే ఆమె పదే పదే కొడుతున్నా జుట్టు పట్టిలాగినా, దుర్భాషలాడినా ఎగిరి తన్నినా, నవ్వుతూనే ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. అసలేం జరిగిందంటే.ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆమె భర్తకు ఉద్యోగం లేదు. ఏమైందో ఏమో తెలియదు కానీ విడాకుల కోసం ఇద్దరూ కోర్టుకెక్కారు. విడాకులు మంజూరయ్యాయి. భరణం కోసం కూడా కేసు వేసింది. ఇక్కడే భర్త కపట తెలివితేటల్ని ప్రదర్శించాడు. అయితే విడాకులు మంజూరు అయితే భరణం చెల్లించాల్సి వస్తుందన్న కుట్రతో తన పేరిట ఉన్న ఆస్తులన్నింటిని తన తల్లి పేరు మీదు ముందుగానే బదలాయించేశాడు. ముందు అనుకున్న ప్లాన్ప్రకారమే తనకు ఎలాంటి ఆస్తులు, ఆదాయం లేదు కాబట్టి, భరణం ఇవ్వలేనని వాదించాడు. అతడి వాదనలను విశ్వసించిన కోర్టు భార్యకు షాకిచ్చింది. తనకు భరణం రాకుండా చేశాడనే ఆగ్రహంతో భార్య చేశాడని, కోర్టు బయటే భర్తను కొట్టింది. చెంపలు వాయించేసింది. జుట్టు పట్టుకొని కొట్టింది. దుర్భాషలాండింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అయితే తాను అనుకున్నది సాధించిన అతగాడు మాత్రం ఏదో గొప్ప విజయం సాధించిన వాడిలాగా నవ్వుతూ ఉండటం ఈ వీడియోలో రికార్డైంది.ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యంఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. భర్తనుంచి విడి పోయిన మహిళల దీన పరిస్థితికి ఇది నిదర్శమని నెటిజన్లు కొందరు వ్యాఖ్యానించారు. ఇది అన్యాయం అని మరికొందరు భర్తపై మండిపడ్డారు. మరోవైపు మహిళలకు భరణంపై ఉండే ప్రేమకు ఇది నిదర్శమన కొందరు, దాడి చేసిన దోషిని శిక్షించాలని ఒకరు, ప్లాన్ ఏ ఎదురు దెబ్బ తగిలితే, ప్లాన్ బీ ఏమీ లేనప్పుడు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణంShe took a divorce chasing alimony.The husband had already transferred all his property to his mother’s name — the wife got nothing. 😁After the divorce, the guy is smiling even while getting beaten.On behalf of all men — salute to you! 😂😜pic.twitter.com/YEGociB8Hr— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 29, 2025 -
పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం
-
పిడుగురాళ్ల పీఎస్లో మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల పీఎస్లో ఓ మహిళ చెయ్యి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిడుగురాళ్ల టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ వెంకట్రావుతో పాటు తెలుగుదేశం నాయకులు సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ బాధితురాలు జ్యోతి ఆరోపిస్తున్నారు. సీఐతో పాటు టీడీపీ నాయకులు తన భర్తను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి బలవంతంగా రూ. 10 కోట్లు విలువచేసే ఆస్తులను రాయించుకున్నారని ఆమె తెలిపింది.ఆ ఆస్తులు సరిపోవని మరికొన్ని ఆస్తులు రాయించుకోవడానికి మమ్మల్ని వేధిస్తున్నారంటూ బాధితురాలు జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. పిడుగురాళ్ల టౌన్ సీఐ వెంకట్రావు 20 రోజుల క్రితం రాత్రి వేళ నన్ను, నా కుమార్తెని అర్ధరాత్రి 12 గంటల వరకు స్టేషన్లో నిర్భందించారు. సీఐ ఒక మహిళ అని చూడకుండా నన్ను చెప్పలేని భాషతో దూషించారు.నిన్న రాత్రి 9:00 సమయంలో మా ఇంటి నుంచి బలవంతంగా పోలీసులు నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. మరోసారి సీఐ వెంకటరావు చెప్పలేని భాషతో దుర్భాషలాడారు. నాకు భయం వేసి చెయ్యి కోసుకునే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాను. సీఐ వెంకట్రావు మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. మాకు ప్రాణహాని ఉంది.. దయచేసి మాకు న్యాయం చేయండి’’ అంటూ బాధితురాలు జ్యోతి వేడుకుంటోంది. -
ఈ కుబేరుడు పెద్ద ఫ్రాడు!
నిజామాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ మహిళ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. రైల్వేహెడ్కానిస్టేబుల్ సహకారంతో వారికి కుచ్చుటోపి పెట్టింది. లక్షలాది డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిందితురాలు స్వరూప, ఆమెకు సహకరించిన రైల్వే హెడ్కానిస్టేబుల్ కుబేర్ పై నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్, 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటనల్లో మహిళపై కేసులు నమోదైనట్లు తెలిసింది. శానిటేషన్ సిబ్బంది..నిజామాబాద్ రైల్వేస్టేషన్లోని శానిటేషన్ సిబ్బంది 18 మంది నుంచి స్వరూప రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వసూలు చేసింది. ఆర్అండ్బీ శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నట్లు చెప్పుకున్న మహిళ పోలీస్శాఖ క్లూస్టీమ్లో పనిచేస్తున్న ఇద్దరు, సీసీఎస్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుళ్ల నుంచి రూ.8 లక్షల వరకు వసూలు చేసింది. ఆర్అండ్బీ శాఖ ద్వారా చేపడుతున్న పనుల్లో పర్సంటేజీలు ఇప్పిస్తానంటూ ముందుగా పెట్టుబడి పెట్టాలని చెబుతూ కానిస్టేబుల్ నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈ వ్యవహారంలో రైల్వేహెడ్కానిస్టేబుల్ సహకారం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రైల్వేస్టేషన్లోని శానిటేషన్ సిబ్బంది నుంచి డబ్బుల వసూళ్లలో రైల్వే హెడ్కానిస్టేబుల్ ముఖ్యపాత్ర పోషించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. స్వరూప హెడ్కానిస్టేబుల్ను వెంట తీసుకుని వెళ్లేదని, దీంతో తేలికగా డబ్బులు వసూ లు చేసేదని బాధితులు చెబుతున్నారు. శాఖల వా రీగా ఉద్యోగాలు కలి్పస్తామంటూ మహిళ మోసాని కి గురి చేసింది. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, జిల్లా పరిషత్లో అటెండర్ పోస్టుల పేరిట రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది నుంచి రూ.2.50 లక్ష లు వసూలు చేసింది. జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ పోస్టులకు, ఇతర శాఖలలో జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. నిందితుల అరెస్టు స్వరూపతోపాటు కుబేర్ను అరెస్టు చేసినట్లు మూ డవ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. వీరిపై 3వ టౌన్ స్టేషన్లో మూడు కేసులు, 4వ టౌన్లో మూడు కేసులు, నిజామాబాద్ రూరల్లో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు.నకిలీ గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు నిందితురాలు స్వరూప నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ గుర్తింపు కార్డులు, నకిలీ నియామక పత్రాలను అందజేసింది. ఇందులో జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ సంతకాలు ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. తన కారుకు ఆర్అండ్బీ శాఖకు సంబంధించిన నెమ్ప్లేట్ వేసుకోవడం గమనార్హం. -
నన్ను లక్షకు అమ్మేశాడు.. కాపాడండి సార్
-
‘నువ్వు కావాలి.. మాట్లాడుకుందాం రా’
సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అకృత్యాలు పెచ్చుమీరాయి. ఈ క్రమంలోనే ఆ పారీ్టకి చెందిన వెంకటరాముడు వ్యవసాయ కూలీలకు మేస్త్రీగా వ్యవహరిస్తున్న ఎస్టీ మహిళను కులం పేరుతో దూషించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీసుల కథనం ప్రకారం.. బత్తలపల్లి మండలం సంగాల గ్రామానికి చెందిన దేవరకొండ గాయత్రి వ్యవసాయ పనులకు వెళుతుంటుంది. భర్త ధర్మవరం వెళ్లి దర్జీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.గాయత్రి వ్యవసాయ కూలీలకు మేస్త్రీగా వ్యవహరిస్తుండటంతో సమీప గ్రామాల రైతులు కూలీలు కావాలంటే ఆమెకు ఫోన్చేసి పిలుస్తుంటారు. ఈ క్రమంలోనే మూడు వారాల క్రితం బత్తలపల్లి మండలం వరదాపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత నాగోతి వెంకటరాముడు ఫోన్చేసి పంట పొలంలో కలుపు తీయడానికి 20 మంది కూలీలను తీసుకుని రావాలని చెప్పాడు. దీంతో ఆమె 20 మంది కూలీలతో వేరుశనగ పంటలో కలుపు తీయడానికి వరదాపురం వెళ్లింది. అదే సమయంలో వెంకటరాముడు గాయత్రికి ఫోన్ చేసి.. ‘నువ్వంటే ఇష్టం.. నువ్వు నాకు కావాలి.మాట్లాడుకుందాం.. పక్కకు రా’ అని పిలిచాడు. ఆమె వెళ్లకపోవడంతో అదేరోజు సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లి ‘నేను పిలిచినా రావా. నీ అంతు చూస్తా.. ఒంటరిగా దొరకవా’ అని బెదిరించాడు. దీంతో భార్యాభర్త కలసి వెంకటరాముడును మందలించారు. దీనిని మనసులో పెట్టుకున్న వెంకటరాముడు బాధితురాలికి జ్వాలాపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందంటూ కరపత్రాలు రాయించి సంగాల నుంచి జ్వాలాపురం వరకు వీధుల్లో విసిరాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంకటరాముడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. -
ప్రేమించలేదని యువతిపై దాడి
బెంగళూరు: ఆన్లైన్లో పరిచయమైన యువకుడు ప్రేమించాలని వేధిస్తూ యువతిపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవీన్కుమార్ అనే నిందితున్ని బుధవారం అరెస్ట్ చేశామని జ్ఞానభారతి పోలీసులు తెలిపారు. వివరాలు.. టెలికాలర్గా పనిచేస్తున్న యువతికి 2024లో ఇన్స్టా ద్వారా నవీన్కుమార్ పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు కాల్స్, మెసేజ్ చేస్తున్న నవీన్కుమార్ ప్రేమించాలని ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అతన్ని తిరస్కరించింది. యువతి గత సోమవారం మధ్యాహ్నం పీజీ హాస్టల్ వద్ద నిలబడి ఉండగా కారులో వచ్చిన నవీన్కుమార్ గొడవపడి దాడి చేసి, యువతి బ్యాగ్ను లాక్కుని ఉడాయించాడు. దాడి దృశ్యాలు పీజీ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. pic.twitter.com/glv1rMtE1P Bengaluru's Jnanabharathi area on December 22, 2025, where 21-year-old Naveen Kumar groped, slapped, and attempted to tear the clothes of a woman who rejected his repeated romantic proposals after connecting on Instagram, as captured in attached CCTV…— MdShakeel(PingTV) (@PingtvIndia) December 24, 2025 -
కెనడాలో భారత యువతి హత్య.. కీలక వివరాలు వెల్లడి
టొరంటో: కెనడాలోని టొరంటోలో 30 ఏళ్ల భారత యువతి హిమాన్షి ఖురానా దారుణ హత్యకు గురయ్యారు. గత శుక్రవారం రాత్రి ఆమె అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా, మరుసటి రోజు ఉదయం ఒక నివాసంలో ఆమె మృతదేహం లభ్యమైంది. దర్యాప్తు చేపట్టిన అధికారులు మృతురాలి భాగస్వామే ఇందుకు కారకుడని ప్రాథమికంగా నిర్ధారించారు.పరారీలో ఉన్న నిందితుడు అబ్దుల్ గఫూరీ(32)ని పట్టుకునేందుకు కెనడియన్ చట్ట అమలు సంస్థలు దేశవ్యాప్త వారెంట్ జారీ చేశాయి. గఫూరీ ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరుతూ నిందితుడి ఫోటోను విడుదల చేశారు. ఈ ఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హిమాన్షి ఖురానా మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కేసును నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. టొరంటో పోలీసుల హోమిసైడ్ యూనిట్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరుపుతోంది. కాగా ఈ ఘటన విదేశాల్లోని భారతీయులకు సంబంధించిన భద్రతా పరమైన ఆందోళనలను మరోసారి లేవనెత్తింది.ఇది కూడా చదవండి: నింగిలోకి ఎల్వీఎం3- ఎం6 -
నా తల్లి చావుకి కారణం వాడే.. ఇదిగో వీడియో ప్రూఫ్.. TDP నేతపై సంచలన కామెంట్స్
-
కాలువలో మొండెం.. వెలుగులోకి భార్య కిరాతకం
సంభల్: ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాలో వెలుగు చూసిన ఒక దారుణ హత్యోదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఒక ఇల్లాలు తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్యచేసింది. అంతటితో ఆగకుండా మృతదేహం ఆనవాళ్లు దొరకకూడదని దానిని ముక్కలు ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రాంతాల్లో పారేసిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది.నవంబర్ 18న తన భర్త రాహుల్ అదృశ్యమయ్యాడంటూ భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హైడ్రామా మొదలైంది. డిసెంబర్ 15న ఇక్కడి ఒక కాలువలో తల, కాళ్లు, చేతులు లేని మొండెం పోలీసులకు లభించింది. ఆ మొండెంపై ఉన్న ‘రాహుల్’ అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులకు రూబీపై అనుమానం కలగడంతో అసలు నిజం బయటపడింది.పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రూబీ, ఆమె ప్రియుడు గౌరవ్ కలిసి రాహుల్ను ఇనుప రాడ్డు, రోకలితో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ఒక చెక్కలు కోసే గ్రైండర్ను తీసుకువచ్చి, మృతదేహాన్ని ముక్కలుగా కోశారు. ఒక భాగాన్ని కాలువలో పడేయగా, మిగిలిన శరీర భాగాలను రాజ్ఘాట్కు తీసుకెళ్లి పవిత్ర గంగా నదిలో కలిపేసి ఏమీ తెలియనట్టు నాటకమాడారు.నిందితులు హత్యకు ఉపయోగించిన గ్రైండర్, ఇనుప సుత్తి మరియు ఇతర పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రూబీ, గౌరవ్లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మృతదేహం రాహుల్దేనని నిరూపించేందుకు అతని పిల్లల డీఎన్ఏ నమూనాలను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: రాహుల్ ఆరోపణ -
శెభాష్ అనాల్సింది పోయి… ఇంటికి పంపేశారు!
సమయానికి ఆఫీసుకు రాకుంటే శాలరీలో కోతో.. ఉద్యోగం నుంచి తీసేయడమో చూస్తుంటాం. కానీ సమయానికంటే ముందుగానే ఆపీసుకు వస్తే.. శెభాష్ అనాలిగా.. కాస్త ఇంక్రిమెంట్ ఎక్కువేయాలిగా.. కానీ ఆ కంపెనీ అలా చేయలేదు. ఆఫీసు టైముకంటే ముందుగానే వస్తున్న యువతిని ఇంటికి సాగనంపింది. స్పెయిన్లోని ఆలకాంటేలో ఓ డెలివరీ కంపెనీలో పనిచేసే యువతి ప్రతిరోజూ ఉదయం 6.45 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఆఫీసుకు వచ్చేది. వాస్తవానికి ఆమె షిఫ్ట్ ఉదయం 7.30 గంటలకు మొదలవుతుంది. కానీ ఆమె అరగంట ముందే రావడం కంపెనీ యజమానికి నచ్చలేదు. 2023లోనే దీనిపై అతడు ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె తన అలావాటు మార్చుకోలేదు. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిని ఆమె కోర్టులో సవాల్ చేసింది. ఆశ్చర్యకరంగా కోర్టు కూడా యాజమాని పక్షానే నిలిచింది. యజమాని వద్దంటున్నా ముందు రావడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టంచేసింది. ఇక్కడ ఉద్యోగి ప్రవర్తన నమ్మకం, విధేయతపై ప్రభావం చూపిందని పేర్కొంది. సో.. ఆఫీసుకు ముందుగా వెళ్లినా ముప్పే.. సమయానికి వెళ్తే చాలు.. ఏమంటారు? -
క్యాబ్లో మహిళ నిద్రలోకి : భారత సంతతి డ్రైవర్ ఘాతుకం
అమెరికాలో భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన క్యాబ్లో గాఢంగా నిద్రపోయి, స్పృహ కోల్పోయిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. నిందితుడిని కాలిఫోర్నియాలోని బేకర్స్ఫీల్డ్ నివాసి భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్ సిమ్రంజిత్ సింగ్ సెఖోన్ (35)గా గుర్తించారు. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు.వెంచురా కౌంటీ షెరీఫ్ కార్యాలయం సమాచారం ప్రకారం నవంబర్ 27 తెల్లవారు జామున 1:00 గంటలకు క్యాబ్ బుక్ చేసుకుంది యువతి. క్యాబ్ రైడ్ సమయంలో దిగాల్సిన చోటు వచ్చినా కూడా గమనించలేనంతగా ఆమె నిద్రలోకి జారిపోయింది. దీనికి తోడు మద్యం సేవించి ఉండటంతో అదే అదునుగా భావించిన సెఖోన్ ఆమెను థౌజండ్ ఓక్స్ బార్ నుండి కామరిల్లోలోని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన ఈ ఏడాది నవంబరులో మొదలైంది. ఈ సందర్బంగా సెఖోన్ బాధితుల సంఖ్య ఇంకా ఉండి ఉండవచ్చని డిటెక్టివ్లు అనుమానిస్తున్నారు.బెయిల్ కోసం రూ. 4.52 కోట్లుసెఖోన్ను డిసెంబర్ 15న అరెస్టు చేసి, అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిపై అత్యాచారం చేసినందుకు ప్రీ-ట్రయల్ డిటెన్షన్ ఫెసిలిటీలో కేసు నమోదు చేశారు. బెయిల్ రుసుము రూ. 4.52 కోట్లు (5లక్షల డాలర్లు) గా నిర్ణయించారు. తదుపరి విచారణ డిసెంబర్ 29న జరగాల్సి ఉంది. అయితే ఈ ఆరోపణలను సెఖోన్ ఖండించారు. అయితే నిందితుడు ఏ రైడ్ షేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, డ్రైవర్ స్థితి తదితర వివరాలను పోలీసులు వెల్లడించలేదు.ఇదీ చదవండి: రూ. 2400 కోట్ల వివాదం, 87 ఏళ్ల వయసులో నాలుగో భార్యతో బిడ్డకాగా భారతీయ సంతతికి చెందిన డ్రైవర్లు అమెరికా, కెనడాలో ట్రాఫిక్ ఉల్లంఘనలు, మాదకద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేయడంలాంటి అనేక ఆరోపణల మధ్య తాజా వార్త మరింత కలకలం రేపుతోంది. -
పెళ్లైన లెక్చరర్ మాయలో 19 ఏళ్ల కూతురు..!
మా అమ్మాయికి నాలుగేళ్ల వయసున్నప్పుడు నా భార్య చనిపోయింది. అప్పటినుంచి అన్నీ నేనే అయి మా అమ్మాయిని గారాబంగా పెంచుకున్నాను. ఇప్పుడు మా అమ్మాయికి 19 ఏళ్లు. హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ చేస్తోంది. అక్కడ తను చదువుకునే కాలేజీ లెక్చరర్తో రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉందని, ఆ లెక్చరర్కి ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారని, అతను తన భార్యకు విడాకులు ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడని తెలిసింది. అంతేకాదు, నేను కనక తన మాట కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని చెబుతోందని కూడా తెలిసింది. నాకు నా కూతురు తప్ప వేరే లోకం లేదు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా చెప్పగలరు.– రామరాజు, భీమవరంమీ సమస్య చదువుతుంటే మనసు కలచి వేస్తోంది. మీరు వయసులో ఉన్నప్పుడే భార్య చనిపోయినా మళ్లీ పెళ్లి చేసుకోకుండా మీ కూతురే ప్రపంచంగా బతికారు. అలాంటి అమ్మాయి ఈ రోజు ఇలా ప్రవర్తిస్తుంటే జీర్ణించుకోవడం కష్టమే. అయితే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇటువంటి సందర్భాలలో మీరు భావోద్వేగానికి లోనై అమ్మాయి మీద అరవడం, కోప్పడి మీవైపు లాక్కోవాలనుకోవడం సరైన పద్ధతి కాదు. మీరు ఎంత బలంగా తనని మీవైపు లాక్కోవాలనుకంటే తను అంతకన్నా బలంగా మీకు దూరంగా జరిగే ప్రమాదం ఉంది. ఆ వయసులో ఆకర్షణలు, ప్రేమ భావాలు సహజం. కానీ ఇప్పటికే వివాహమై, కుటుంబ బాధ్యతలతో ఉన్న వ్యక్తితో జీవితం ప్రారంభించాలనుకోవడం ఆమె అపరిపక్వతను సూచిస్తుంది. మందుగా మీ కుమార్తెను నిందించకుండా ఒత్తిడి లేకుండా ఫ్రశాంతంగా మాట్లాడండి. ఆమెను మీరు అర్థం చేసుకున్నారు అన్న భావన కలిగేలా నెమ్మదిగా విషయాలను వివరించండి. సాధ్యమైనంత వరకు మూడోవ్యక్తి ద్వారా ప్రాఫెషనల్ కౌన్సెలింగ్ చేయించడం మంచిది. క్లినికల్ సైకాలజిస్టులు ఎలాంటి పక్షపాతం లేకుండా వాస్తవాలు చూపించి ఆమెకు స్వతంత్రంగా ఆలోచించడానికి దారి చూపగలరు. అదే సమయంలో మీరు మీ అమ్మాయి ప్రేమించిన వ్యక్తి చెడ్డవాడని ఆమెతో పదే పదే అనడం వల్ల ఆమె మిమ్మల్ని అ΄ార్థం చేసుకుని మీకు మరింత దూరం అవుతుంది. వీలయితే ఆ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడండి. ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. తను ఆత్మహత్య ఆలోచనలు చేస్తోంది కాబట్టి అసలు ఒంటరిగా వదలకండి. జీవితంలో ఒకోసారి అన్ని సమస్యలకు పరిష్కారాలు మన చేతిలో ఉండచకపోవచ్చు. కాలాన్ని మించిన వైద్యుడు, అనుభవాన్ని మించిన గురువు లేడనే సత్యాన్ని గ్రహించండి. మనసు కవి ఆత్రేయ గారన్నట్టు ‘‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలే దని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని’’ అన్న తాత్త్విక ధోరణి ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి అనిపిస్తుంది. మీరు మనసు గట్టి చేసుకుని ధైర్యంగా ఉండండి. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఇదోరకం ప్రేమ!
అది అక్టోబర్ 30, 2024. బెంగళూరులోని రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్లో 45 ఏళ్ల ఇన్స్పెక్టర్, తన దైనందిన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. హఠాత్తుగా.. ఆయన అధికారిక ఫోన్కి ఒక అపరిచిత నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత.. వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్లు వెల్లువెత్తాయి. అవతలి నుంచి మాట్లాడుతున్న మహిళ మాటలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయి. మొదట్లో ఇన్స్పెక్టర్ దాన్ని ఏదో సాధారణ ఫిర్యాదు అనుకున్నారు. కానీ, అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది!ప్రేమించకపోతే ఉద్యోగం తీయిస్తా.. ఆ మహిళ పదేపదే ఫోన్ చేసింది. తనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి వంటి అత్యున్నత రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పడం మొదలుపెట్టింది. వాట్సాప్లో ఆ ప్రముఖులతో తాను ఉన్న ఫొటోలను పంపింది. ఆమెది ఫిర్యాదు కాదని, ప్రేమ ప్రతిపాదన అని ఇన్స్పెక్టర్కు అర్థమైంది. ‘నా ప్రేమను అంగీకరించండి. లేదంటే, నా పలుకుబడిని ఉపయోగించి మీ ఉద్యోగాన్ని, కెరీర్ను నాశనం చేస్తాను’.. అంటూ బెదిరింపులకు దిగింది. నిందితురాలి అధికారం, పలుకుబడి ఇన్స్పెక్టర్ను మానసిక ఆందోళనకు గురిచేసింది.రక్తంతో లేఖ అధికారిక విధులకు ఆటంకం కలుగుతుండడంతో, ఇన్స్పెక్టర్ ఆమెను పోలీస్ స్టేషన్కు వచ్చి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వమని పదేపదే సూచించారు. కానీ, ఆమె స్టేషన్కు రాలేదు.. వేధింపులు కూడా ఆపలేదు. నవంబర్ 7వ తేదీన ఆమె వేధింపులు పతాక స్థాయికి చేరాయి. ఆ మహిళ ఏకంగా ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వచ్చింది. అతనికి ఒక కవరును అందజేసింది. ఆ కవరులో కొన్ని మాత్రలు, చేతితో రాసిన లేఖలు ఉన్నాయి. అత్యంత భావోద్వేగపూరితంగా ఉన్న ఆ లేఖలు తన రక్తంతో రాసినవని ఆమె స్పష్టం చేసింది. ఇది ఆమె తీవ్రమైన మానసిక సమస్యకు నిదర్శనం. ఇన్స్పెక్టర్ అధికారిక డ్యూటీ నంబర్కు అనవసర కాల్స్, మెసేజ్లు పంపిస్తూ.. ఆయన రోజువారీ పనులకు తీవ్ర ఆటంకం కలిగిస్తూనే ఉంది. పోలీసుల విచారణలో, ఈ మహిళ గతంలో కూడా ఇతర పోలీసులు, ప్రభుత్వ అధికారుల్ని ఇలాగే వేధించినట్లు వెల్లడైంది.ఆత్మహత్య చేసుకుంటా.. డిసెంబర్ 12న, ఇన్స్పెక్టర్పై వేధింపుల పర్వం తారస్థాయికి చేరింది. ఆ మహిళ నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి, అందరూ చూస్తుండగానే అరిచింది. ‘నా ప్రేమ ప్రతిపాదనను అంగీకరించకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. నీ ఉద్యోగాన్ని, కెరీర్ను నాశనం చేస్తాను’.. అని బెదిరించింది. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో, రామమూర్తి నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదు ఆధారంగా, ఆ మహిళపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 132 (ప్రభుత్వ ఉద్యోగిని విధులకు ఆటంకం కలిగించడం), 351(2) (క్రిమినల్ బెదిరింపు), 221 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విచిత్ర కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఒక పోలీసు అధికారికి తన విధి నిర్వహణలో ఎదురైన ఈ ‘ప్రేమ ఉచ్చు’రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంట్లోకి చొరబడి మహిళపై హత్యాయత్నం
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): బెజవాడలో గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే రాళ్లు, క్రికెట్ బ్యాట్లు, కారం చేత పట్టుకొని ఏకంగా ఇళ్లల్లోకి చొరబడి ఓ మహిళను హతమార్చేందుకు యత్నించారు. గంజాయి మత్తులో వీరు చేసిన వీరంగంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విజయవాడ అజిత్సింగ్నగర్ లూనాసెంటర్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుమ్మళ్ల కుసుమ అనే మహిళ సింగ్నగర్లోని నార్త్జోన్ తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో 20 ఏళ్లుగా ఉంటోంది. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో టీవీ చూస్తుండగా గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు లోనికి ప్రవేశించాడు. చీరను లాగి ఆమెపై హత్యాయత్నానికి యత్నించాడు. దీంతో ఆమె అతడిని బయటకు తోసేసి తలుపులు వేసింది. విషయాన్ని సమీపంలో ఉన్న తన అన్నయ్య శేఖర్కు ఫోను చేసి చెప్పింది. ఇంతలో ఆ వ్యక్తితోపాటు మరో ఇద్దరు గంజాయి బ్యాచ్ సభ్యులు, ఓ మహిళ కూడా వారితోపాటు వచ్చి రాళ్లు, బ్యాట్, కారంతో వీరంగం సృష్టించారు. మహిళను, ఆమె కుమారుడిని చంపేస్తామంటూ ఇంటిపైకి రాళ్లు రువ్వారు. అద్దాలు, తలుపులు, కిటికీలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. వీరి చేష్టలకు భయపడి స్థానికులు ఇళ్లల్లోకి పరుగులు తీశారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులపైనా రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ పోలీసులపైనా గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. తమకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అండదండలు ఉన్నాయని హూంకరించింది. వారు చెప్పినట్లుగానే స్థానిక టీడీపీ నాయకులు కొందరు గొడవ జరిగిన కాసేపటికే అక్కడకు చేరుకొని నిందితులను రక్షించేందుకు యత్నించారు. వారిపై కేసులు పెట్టవద్దంటూ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. వీడియోల రూపంలో సాక్ష్యాధారాలు ఉన్నా కేసులు కట్టేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు. రాజీ పడాల్సిందిగా బాధితులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. విషయం మీడియాకు, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హత్యాయత్నం కాకుండా చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు కట్టి చేతులు దులుపుకునేందుకు యత్నిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. -
నైట్క్లబ్లో దారుణం.. భార్యపై లైంగిక దాడి.. భర్తకు చావు దెబ్బలు
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో దారుణం చోటుచేసుకంది. ఇక్కడి ఒక నైట్క్లబ్ యజమాని తన కోరిక తీర్చలేదని ఒక మహిళను లైంగికంగా వేధించి, ఆమె భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన జైపూర్లోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘క్లబ్ ఆల్ఫా’లో చోటుచేసుకుంది. బాధితురాలు ఇరామ్ షేక్ తన భర్త నవేద్ ఉస్మానీతో కలిసి క్లబ్కు వెళ్లింది. ఇంతలో అక్కడున్న ఒక వెయిటర్.. క్లబ్ యజమాని భరత్ ఆమెను ఒక ప్రైవేట్ గదిలో కలవాలనుకుంటున్నట్లు తెలియజేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. కాగా క్లబ్ యజమాని అభ్యర్థనను ఆమె తిరస్కరించారు.ఆ దంపతులు క్లబ్లో సేదతీరిన కొద్దిసేపటి తర్వాత ఇరామ్ షేక్ వాష్రూమ్ వైపు వెళ్లారు. అదే సమయంలో క్లబ్ యజమాని భరత్, మేనేజర్ దీపక్, పలువురు బౌన్సర్లు ఆమెను చుట్టుముట్టి, అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నవేద్ ఉస్మానీ అక్కడకు పరుగుపరుగున వచ్చాడు. అతను క్లబ్ యజమాని, సిబ్బందిని అడ్డుకున్నాడు. దీంతో భరత్, మేనేజర్ దీపక్, బౌన్సర్లు కలిసి నవేద్ ఉస్మానీపై దాడి చేసి, ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ దాడిలో నవేద్ ఉస్మానీ కాలు విరిగింది. అంతటితో ఆగని బౌన్సర్లు బాధిత దంపతుల కారును కూడా ధ్వంసం చేశారు.కొద్దిసేపటి తరువాత బాధితులు ఈ దాడి గురించి పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన నవేద్ను ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత దంపతులు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఏసీపీ బలరామ్ చౌదరి తెలిపారు. ఘటన జరిగినప్పటి సీసీటీవీ ఫుటేజీని, నిందితుల కాల్ డీటెయిల్ రికార్డులను సేకరిస్తున్నామన్నారు. సేకరించిన ఆధారాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా నైట్క్లబ్ యజమాని, సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు -
'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్మస్క్పై నెటిజన్లు ఫైర్
స్త్రీత్వంపై ప్రపంచ కుభేరుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపాయి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోనీ సైంటిఫిక్గా చెప్పని అందరికి సమంజసంగా ఉండేలా మాట్లాడాలి గానీ మరి ఇలానా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..టెస్లా, స్సేస్ ఎక్స్ దిగ్గజం ఎలోన్ మస్స్ స్త్రీత్వంపై తన అభిప్రాయలను పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శులు వెల్లువెత్తాయి. మస్క్ స్త్రీకి నిర్వచనం గర్భం అంటూ గర్భాశయం ఉన్నవాళ్లను స్త్రీలుగా వ్యవహరిస్తారని, గర్భం ఉనికి ద్వారా స్త్రీని నిర్వచించాలి అని నొక్కి చెప్పాడంతో ఒక్కసారివ ఆయనపై తారాస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన వైఖరిని చాలామంది ఖండించారు. అంతేగాదు అస్సలు మనం ఇంకా ఏ కాలంలో జీవిస్తున్నాం అని విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. గర్భం ఉంటే స్త్రీ అంటే.. మరి ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌసర్ సిండ్రోమ్) అరుదైన పరిస్థితితో బాధపడుతున్న ఆడవాళ్లు..స్త్రీలు కాకుండా పోతారా అని నిలదీశారు. ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ అంటే గర్భాశయం లేకుండా లేదా అభివృద్ధి చెందని స్త్రీలని అర్థం. లింగ మార్పిడిని బహిరంగంగా వ్యతిరేకిస్తూ తన ట్రాన్స్జెండర్ కుమార్తె పరిస్థితిని "విషాదకరమైన మానసిక అనారోగ్యం"గా అభివర్ణించారు. ఆయన తనను లక్ష్యంగా చేసుకుని డెమొక్రాట్ అభ్యర్థి కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ ఇలా ప్రతిస్పందించారు. కాగా, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పాడ్కాస్టర్తో తాను ఎక్కువ మంది ట్రాన్స్ పిల్లలను చూడాలనుకుంటున్నానని, తనను తాను ట్రాన్స్-ప్రో చట్టం LGBTQ హక్కుల బలమైన మద్దతుదారుగా భావిస్తానని చెప్పారు. అంతేగాదు సారీ మస్క్ మిమ్మల్ని మీ కూతురు ద్వేషిస్తున్నందుకు అని నేరుగా సెటైర్ వేశారు. దాంతో మస్క్ ఇలా విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. Correct. We’re sorry your daughter hates you, Elon. https://t.co/HeJIm5fJMS— Governor Newsom Press Office (@GovPressOffice) December 11, 2025 (చదవండి: ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా! సర్వేలో షాకింగ్ విషయాలు) -
బాల్కనీకి వేలాడింది..
అది చైనాలోని ఒక నగరం. అందులో ఓ హై–రైజ్ అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు.. అకస్మాత్తుగా ఓ మహిళ బాల్కనీ నుంచి వేలాడటం కనిపించింది. అది చూసినవారంతా హడలిపోయారు. చెమటలు పట్టించిన ఈ దృశ్యం వెనుక కథ తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఒక వ్యక్తి భార్య లేని సమయంలో.. అతని ఇంటికి ప్రియురాలు వెళ్లింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో.. భార్య హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చేసింది. దీంతో భయపడిన ఆ వ్యక్తి.. తన ప్రియురాలిని దాచిపెట్టే ప్రయత్నంలో ఆమెను బాల్కనీలోకి నెట్టేశాడు. పది అంతస్తుల ఎత్తులో ఆ మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేలాడటం మొదలుపెట్టింది. అది చుట్టుపక్కల వారు గమనించారు, పట్టు కోల్పోకుండా నిలబడటానికి ఆమె విఫలయత్నం చేసింది. ఇది గమనించిన వారు అరుపులతో, ఆందోళనతో గంటల తరబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంట్లో ప్రియుడు.. బయట ప్రియురాలు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, ఫ్లాట్ లోపల ఉన్న ప్రియుడు.. కిటికీలోంచి ప్రియురాలితో ఏదో మాట్లాడటం కనిపించింది. ఇంతకీ ఆమె వేలాడటానికి కారణం ఏంటంటే... ఆ మహిళ ప్రియుడి భార్యకు దొరక్కుండా దాక్కోవడానికి ప్రయతి్నంచడమే.. తన భార్య రాగానే ప్రియుడు ఆ మహిళను హడావిడిగా బాల్కనీ వైపు నెట్టేశాడని, దాక్కోవాలని సూచించాడని స్థానిక మీడియా పేర్కొంది. పరువు పోతుందనే భయం.. ఆమెను చావు అంచుల్లోకి నెట్టింది. ప్రాణభయంతో వణికిపోతున్న ఆ మహిళ చేతిలో ఫోన్ పట్టుకునే ఉంది. ఏం చేయాలో తోచక, చివరికి బలం తెచ్చుకుని.. డ్రైన్పైప్లను, కిటికీ అంచులను పట్టుకుని ధైర్యంగా కిందకు దిగడం ప్రారంభించింది. పక్కింట్లో ఆపద్బంధువు!భవనం పక్క గోడకు వేలాడుతూ, అతి కష్టం మీద ఓ వాటర్ పైప్ పట్టుకుని పక్క ఫ్లాట్ కిటికీ వైపు ఆమె జారింది. పక్క ఫ్లాట్ యజమాని కిటికీ తట్టగా.. చివరకు ఆ ఆపద్బాంధవుడు ఆమెను లోపలికి సురక్షితంగా లాగాడు. ఎట్టకేలకు ప్రాణాలను దక్కించుకున్నా.. ఈ సంఘటన మాత్రం ఆమె పరువును, ప్రియుడి పరువును నిలువునా బజారున పడేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు
వింటర్ చైల్డ్, పర్వత మనిషి తనకు తాను గర్వంగా అభివర్ణించుకున్న ఒక పర్వాతారోహకురాలు అనూహ్య పరిస్థితుల్లో కన్ను మూసింది. ఈ ఘటన పర్వతారోహకుల ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ విషాదానికి ఆమె ప్రియుడే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఏం జరిగిందంటే..కెరిస్టీన్ గుర్ట్నర్ అనే33 ఏళ్ల ఆస్ట్రియన్ మహిళ 39 ఏళ్ల ప్రియుడు థామస్ ప్లాంబర్గర్తో ఎత్తైన శిఖరం గ్రాస్గ్లాక్నర్ను అధిరోహించారు. థామస్ అనుభవజ్ఞుడైన గైడ్ కూడా. ఈ జంట అనుకున్న దానికంటే రెండు గంటలు ఆలస్యంగా ఆ అవరోహణను ప్రారంభించారు. -20°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు హరికేన్-పవర్ విండ్స్ లాంటి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. గుర్ట్నర్ అలసిపోయిన గుర్ట్నర్ 150 అడుగుల దిగువన దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే ఆమెను గైడ్ చేసి సాయం చేయాల్సిన ప్లాంబర్గర్ నిర్లక్ష్యంగా వదిలేశాడు. అత్యవసర దుప్పట్లు లేదా బివౌక్ సంచిని ఉపయోగించలేదని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కొన్ని గంటల తరువాత గానీ రెస్క్యూ సర్వీసులను సంప్రదించలేదు. పైగా మొదటి కాల్ తర్వాత తన ఫోన్ను సైలెంట్లో పెట్టుకున్నాడు. దూర నుంచి ఒక హెడ్టార్చ్తప్ప ఇంకేమీ వెబ్ క్యామ్లో కనిపించలేదు.మరోవైపు తీవ్రమైన గాలుల కారణంగా మరుసటి రోజు ఉదయం దాకా రెస్క్యూ బృందాలు గుర్ట్నర్ను చేరుకోలేకపోయాయి. అప్పటికే ఆమె చనిపోయిందని గుర్తించారు. దీంతో ప్లాంబర్గర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.స్నేహితురాలిలా కాకుండా, ఆల్పైన్ హై-ఎలిట్యూడ్ టూర్లతో ఇప్పటికే చాలా అనుభవమున్న వ్యక్తిగా, టూర్ను ప్లాన్ చేశాడు కాబట్టి,బాధ్యతాయుతమైన గైడ్గా వ్యవహరించాలని ఇన్స్బ్రక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. తీవ్ర నిర్లక్ష్యంతో నరహత్యకు పాల్పడ్డాడని, దోషిగా తేలితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దురదృష్టవశాత్తూ జరిగినవిషాదకరమైన ప్రమాదమని ప్లాంబర్గర్ న్యాయవాది వాదిస్తున్నాడు. ఈ కేసును 2026, ఫిబ్రవరి 19న, ఇన్స్బ్రక్ ప్రాంతీయ కోర్టులో విచారించ నున్నారు. గుర్ట్నర్ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆన్లైన్ స్మారక పేజీని ఏర్పాటు చేశారు. అద్భుతమైన మహిళ అంటూ కెర్స్టిన్ గుర్ట్నర్కు అనేకమంది నివాళులర్పించారు. పలు సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. -
ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!
హైదరాబాద్: గోవాకు వెళ్లిన ఓ జంట కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలను రహస్యంగా తీసి రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్న గోవాకు చెందిన ఓ వ్యక్తిపై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డకు చెందిన ఓ మహిళ (35) తన వివాహం కాకముందు 2023లో శ్రీనాథరావు అనే వ్యక్తితో కలిసి గోవాకు వెళ్లింది. వీరికి గోవాలోని యశ్వంత్ (40) అనే వ్యక్తి వసతితో పాటు ఇతర ఏర్పాట్లను చేశాడు. అదే సమయంలో ఆ జంట కలిసి ఉన్నప్పటి వీడియోలను రహస్యంగా తీశాడు. ఈ వీడియోలను భద్రపరిచిన యశ్వంత్ తాజాగా శ్రీనాథరావుకు ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇదిలా ఉండగా సదరు మహిళకు గత ఏడాది వేరొకరితో పెళ్లి జరిగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన బెదిరింపుల విషయాన్ని శ్రీనాథరావు ఆ మహిళ దృష్టికి తీసుకువచ్చాడు. భయాందోళనకు గురైన బాధితురాలు సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు యశ్వంత్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపినట్లు పోలీసులు తెలిపారు. -
న్యూయార్క్ మహిళపై ఆరోపణలు
న్యూయార్క్: కెనడా సరిహద్దుల మీదుగా అమెరికాలోకి భారత్ నుంచి దొంగచాటుగా తరలించేందుకు ప్రయతి్నస్తున్నదంటూ న్యూయార్క్కు చెందిన మహిళపై అధికారులు కేసు నమోదు చేశారు. పిట్స్బర్గ్కు చెందిన స్టేసీ టేలర్(42)కు అంతర్జాతీయ దొంగరవాణా ముఠాతో సంబంధాలున్నట్లు అక్టోబర్లో అధికారులు ఆరోపణలు చేశారు. ఈ వారంలో అల్బనీలోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఎదుట ఆమె హాజరు కావాల్సి ఉంది. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కెనడాలోని క్విబెక్, అమెరికాలోని చురుబుస్కో సమీపంలో ఈ ఏడాది జనవరిలో అమెరికా బోర్డర్ పెట్రోల్ అధికారులు స్టేసీ టేలర్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆ వాహనంలో నలుగురు విదేశీయులు ఉన్నట్లు గుర్తించామని బోర్డర్ పెట్రోల్ విభాగం ఆరోపించింది. నలుగురిలో ముగ్గురు భారత జాతీయులుగా కాగా, ఒకరు కెనడా వాసి అని వీరిని కెనడా నుంచి అమెరికాలోకి దొంగచాటుగా తీసుకువచ్చారని పేర్కొంది. స్టేసీ టేలర్ సెల్ఫోన్ను క్షుణ్నంగా పరిశీలించగా అందులో..అంతకుముందు కూడా ఆమె ఇలా పలుమార్లు అక్రమ రవాణాకు పాల్పడినట్లు తెలిపే టెక్ట్స్ మెసేజీలున్నాయని వివరించింది. ఇతరులతో కలిపి ఆమె స్మగ్లింగ్ రాకెట్ నడుపుతున్నారని అధికారులు ఆరోపించారు. ఈ ఆరోపణలు రుజువైతే స్టేసీకి కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. -
కేసు వాయిదా కోసం వచ్చి.. రేప్..! ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ?
-
ఎయిర్ పోర్ట్ సిబ్బందితో నైజీరియన్ మహిళ ఫైట్
-
అక్కడ మహిళల జనాభానే ఎక్కువ..! ఎందుకంటే..
మహిళల సంఖ్య తగ్గిపోతోంది, బ్రూణ హత్యలు పెరిగిపోతున్నాయి అంటూ గగ్గోలు పెడుతున్న గణాంకాలు గురించి విన్నాం. కానీ వీటన్నింటికి విరుద్ధంగా మహిళలు సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం గురించి విన్నారా..?. ఔను ఇది నిజం. అక్కడ మహిళల సంఖ్య ఎంతలా ఉందంటే..మొత్తం కార్యాలయాల్లో అంతా మహిళలే కనిపిస్తారు. కనీసం ప్లంబింగ్, వడ్రంగి పనులు వంటి వాటిల్లో కూడా మహిళలే ఉంటారు. అందుకు గల కారణం..?, ఫలితంగా మహిళలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే..లాట్వియాలో గణనీయమైన లింగ అసమతుల్యత ఎదుర్కొంటోంది. అక్కడ పురుషుల కంటే 15.5% ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఇది యూరోపియన్ యూనియన్లో సగటు అంతరం కంటే మూడు రెట్లు ఎక్కువ. 65 ఏళ్లు అంత కంటే ఎక్కువ వయసున్న పురుషులకు రెండింతలు మహిళలు ఉన్నారు. రోజువారి జీవితంలో పురుషుల కొరత చాలా ఘోరంగా ఉంటుందని వరల్డ్ అట్లాస్ పేర్కొంది. దాంతో అక్కడ మహిళ ఇంటి పనుల్లో సహాయం కోసం భర్తలను నియమించుకుంటున్నారట. అంటే అద్దెకు భర్తలను తెచ్చకుంటున్నారు. ఆ మహిళలంతా ఆన్లైన్లో ఒక గంటకు భర్తలను బుక్ చేసుకుంటారట అక్కడ మహిళలు. వారు ప్లంబింగ్, వడ్రండి,టెలివిజన్ ఇన్స్టాలేషన్ వంటి పనుల్లో సాయం అందిస్తారు. అంతేగాదు పెయింటింగ్, కర్టెన్లు ఫిక్సింగ్ వంటి ఇతర పనులు కూడా చేస్తారట. చాలామంది ఈ సేవలను వినియోగించుకోవడానికే మొగ్గు చూపిస్తారట. పురుషుల కొరతకు రీజన్దీనికి పురుషుల తక్కువ ఆయుర్దాయమే కారణమని చెబుతున్నారు. అధిక ధూమపాన రేటు, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరుగుతుందని పేర్కొన్నారు లాట్వియా నిపుణులు. వరల్డ్ అట్లాస్ ప్రకారం లాట్వియన్ పురుషులలో 31% మంది ధూమపానం చేస్తున్నారట. అదీగాక వారిలో చాలామంది అధిక బరువు సమస్యలను ఎదుర్కొంటున్నారట కూడా.ఫలితంగా అద్దెకు భర్తల ట్రెండ్ఇంతలా మగవాళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో భర్తలను అద్దెకు తీసుకునే ట్రెండ్వై పుకే మొగ్గు చూపుతున్నారట అక్కడ మహిళలు. ఇదేమీ కొత్తదికాదు ఎందుకంటే గతంలో యూకేలో లారా యంగ్ అనే మహిళ 2022లో "రెంట్ మై హ్యాండీ హస్బెండ్" అనే వ్యాపారం కింద తన భర్త జేమ్స్ను చిన్న చిన్న ఉద్యోగాలకు అద్దెకు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. (చదవండి: అమెరికా-భారత్కి మధ్య ఇంత వ్యత్యాసమా..!) -
ఫుల్లుగా తాగి.. యువతిని లాక్కెళ్లి మానభంగం
-
అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడా
బహుశా కథల్లో కూడా ఇలాంటి రాక్షసుల గురించి విని ఉండవేమో. ముద్దులొలికే చిన్నారులను దారుణంగా హత్య చేసిందో మహిళ. ఈ హత్యలకు కారణం తెలుసుకొని పోలీసులే నిర్ఘాంత పోయారు.హర్యానాలోని పానిపట్లోని ఒక గ్రామంలో బాజా భజంత్రీలు మోగుతున్న తరుణంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పెళ్లివేడుకకోసం అందంగా ముస్తామైన ఆరేళ్ల బాలికను దారుణంగా హత్య చేసింది. దీంతో బంధువులంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. జర్మన్ అద్భుత కథ స్నో వైట్లోని దుష్ట రాణిని మరపించిన పోలీసులు ఈ భయంకరమైన హత్యాకాండను ఛేదించారు.తన కంటే అందంగా ఉందనిపానిపట్లో తన మేనకోడలిని హత్య చేసింది పూనమ్ అనేమహిళ. తనకంటే ఎవరూ అందంగా కనిపించ కూడదనే కారణంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. బాధితురాలు విధిని నీటితొట్టిలో ముంచి ఆ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. అంతేకాదు పూనమ్ 2023లో తన కొడుకు దారుణంగా హతమార్చిందంటే ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు. హత్య ఎలా జరిగిందిసోనిపట్కు చెందిన విధి తన కుటుంబంతో కలిసి పానిపట్లోని ఇస్రానా ప్రాంతంలోని నౌల్తా గ్రామానికి బంధువుల వివాహానికి హాజరైంది. ఆమెతో పాటు ఆమె తాత పాల్ సింగ్, అమ్మమ్మ ఓంవతి, తండ్రి సందీప్, తల్లి, 10 నెలల తమ్ముడు వచ్చారు. పెళ్లిలో సీతాకోక చిలుకలా ముస్తామై, ఆనందంగా తిరుగుతున్న విధిపై పూనమ్ కన్నుపడింది. రాక్షసిలా మారిపోయింది.అకస్మాత్తుగా విధి అదృశ్యమైంది. విధి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి, కుటుంబం ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. దాదాపు గంట తర్వాత, విధి అమ్మమ్మ ఓంవతి వారి బంధువుల ఇంటి మొదటి అంతస్తులోని స్టోర్రూమ్కి వెళ్లింది. బైట గడియ వేసి వున్న ఆ గదిని తెరిచినప్పుడు, విధి తల నీటి తొట్టిలో మునిగిపోయి, కాళ్ళు పైకి తేలి ఉన్నాయి. హుఠాహుఠిన చిన్నారిని NC మెడికల్ కాలేజీకి తరలించారు. కానీ వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించారు. దీంతో విధి తండ్రి తరువాత కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితురాలు పూనమ్ విధికి అత్త అని తేలింది. ఆమెను అరెస్ట్ చేశారు.పిల్లలను చంపే విధానంపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూనమ్ తనకంటే అందంగా ఎవరూ కనిపించకూడదని కోరుకోవడంతో అసూయ ,ఆగ్రహంతో పిల్లలను నీటిలో ముంచి చంపే అలవాటు ఉంది. ప్రత్యేకంగా చిన్న, అందమైన అమ్మాయిలే ఆమెటార్గెట్ అని పోలీసులు తెలిపారు. ఇలా మొత్తంగా పూనమ్ నలుగురు పిల్లల్ని ముగ్గురు అమ్మాయిలతోపాటు తన కొడుకుని కూడా ఇలాగే చంపినట్లు అంగీకరించింది.2023లో, పూనమ్ తన వదిన కుమార్తెను చంపింది. అదే సంవత్సరం, అనుమానం రాకుండా ఉండటానికి ఆమె తన కొడుకును కూడా నీటిలో ముంచి చంపింది. ఈ సంవత్సరం ఆగస్టులో, పూనమ్ సివా గ్రామంలో మరో అమ్మాయిని హత్య చేసింది ఎందుకంటే వీరంతా తనకంటే 'అందంగా' కనిపించారట ఆమెకు. విధి హత్య కేసులో విచారణ సమయంలో పూనమ్ నిజం స్వరూపం బైటపడింది. ఆమె స్వయంగా ఈ హత్యలు చేసినట్టు ఒప్పుకుంది. అప్పటివరకు ఈ పిల్లల మరణాలు ప్రమాదవశాత్తు జరిగినట్లు భావించారు. ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతో -
ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతో
ధైర్యం, దృడ సంకల్పం, కృషి అన్నీ ఉన్నాయి. సాధించాలన్న పట్టుదలా మెండుగా ఉంది. కానీ ఫలితం కోసం ఎనిమిదేళ్లు నిరీక్షించింది. చివరికి ఆమె సంకల్పం, కల ఫలించింది. తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇంతకు ఏమిటా కల, ఆమె సాధించిన విజయం ఏమిటి? ఈ వివరాలు తెలియాలంటే ఈ స్ఫూర్తిదాయక కథనాన్ని తప్పకుండా చదవాల్సిందే.ప్రియాంక దల్వి పేదింటి బిడ్డ. ఆమె తండ్రి ఒక సాధారణ రైతు. ఆయన గుండె ఉప్పొంగేలా చేసిన ఆడబిడ్డ ప్రియాంక. నాన్నకిచ్చిన మాటను నెరవేర్చేందుకు ఎనిమిదేళ్లు కష్టపడింది. ఆ కల నిజమైన రోజు భావోద్వేగంతో కన్నీటి ప్రవాహమైంది. మహారాష్ట్రలో మహిళా & శిశు అభివృద్ధి శాఖలో అధికారిణి అయ్యింది. మారుమూల గ్రామంలో ఒక రైతుబిడ్డగా ఆమె సాధించిన ఈ విజయం నిజంగా స్ఫూర్తిదాయకం! View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) నవేఖేడ్ గ్రామంలో గుడ్డిదీపాల మధ్య మసక వెలుగులో చదువుకున్న ప్రియాంక మహారాష్ట్రను అగ్రస్థానంలో నిలిచింది. మహిళా & శిశు అభివృద్ధి శాఖలో అధికారి పదవిని సంపాదించింది. ఫలితాల రోజున, ప్రియాంక తల్లిదండ్రులు తమ కుమార్తె విజయానికి చూడటానికి వారి ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఫలితాలు రాగానే తండ్రిని గట్టిగా కౌగిలించుకుంది. ఇన్నేళ్ల పోరాటం నిశ్శబ్ద ప్రార్థనలు ఆమె కంట కన్నీరుగా ప్రవహించాయి. ఇదీ చదవండి: మాస్క్తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్ని ఎందుకు కలిశాడు? -
‘సుప్రీం’ ఆదేశం.. బంగ్లాదేశ్ గర్భిణికి ఉపశమనం
న్యూఢిల్లీ: భారత్ నుంచి బహిష్కృతురాలై బంగ్లాదేశ్కు చేరిన గర్భిణీ సోనాలి ఖాటూన్, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడికి సుప్రీంకోర్టు ఉత్తర్వుతో ఊరట లభించింది. న్యాయస్థానం ‘మానవతా దృక్పథం'తో తీసుకున్న ఈ నిర్ణయం.. చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న ఒక నిస్సహాయ కుటుంబానికి స్వాంతన కల్పించింది. సోనాలి ఖాటూన్ బంగ్లాదేశీయురాలైనప్పటికీ, ఆమె పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్లో నివసిస్తున్నారనే అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది.మానవతా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, వారిద్దరినీ తిరిగి తీసుకువస్తామని, వారిని నిఘాలో ఉంచి, ఉచిత వైద్య సహాయం అందిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును ప్రత్యేక దృష్టితో విచారించింది. ఒక గర్భిణీ పరిస్థితిని, ఆమె కుమారుడిని దృష్టిలో ఉంచుకుని, తల్లిదండ్రులు/తల్లి బిడ్డలను వేరు చేయకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కోర్టు నొక్కి చెప్పింది. ఈ ఉత్తర్వుతో సోనాలికి అవసరమైన వైద్య సంరక్షణతో పాటు ఆమె కుమారుడికి రోజువారీ సంరక్షణ అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.ఈ న్యాయపోరాటం సోనాలి తండ్రి భోడు సేఖ్తో ప్రారంభమైంది. తన కుమార్తె, అల్లుడు, మనవడిని మే 2025లో గుర్తింపు ధృవీకరణ డ్రైవ్ పేరుతో అక్రమంగా నిర్బంధించి, జూన్లో బంగ్లాదేశ్కు పంపించారని ఆయన ఆరోపించారు. తాను, తన కుటుంబ సభ్యులు పుట్టుకతో భారత పౌరులమని ఆయన వాదించారు. సెప్టెంబర్లో కలకత్తా హైకోర్టు వీరిని తిరిగి తీసుకురావాలని ఆదేశించినా, పౌరసత్వ ధ్రువపత్రాలు లేవనే కారణంతో ఆ తీర్పును సవాలు చేస్తూ, కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పౌరసత్వ రుజువులు చూపడంలో విఫలమైనప్పటికీ, తల్లి, బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న సానుకూల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్వాగతించింది. చట్టపరమైన నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, అత్యవసర సందర్భాల్లో మానవతా దృక్పథంపైచేయి సాధిస్తుందని ఈ కేసు నిరూపించింది.ఇది కూడా చదవండి: ‘20 ఏళ్లుగా చావులే లేవు’..‘సర్’ డేటాలో భారీ గోల్మాల్! -
తప్పు తెలిసీ మౌనం... నేరంగా మారిన ఇద్దరు మహిళలు
సాక్షి,హైదరాబాద్: నేరుగా తప్పు చేయడమే కాదు... తప్పు జరుగుతోందని, జరిగిందని తెలిసీ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. ఈ కారణంగానే జూబ్లీహిల్స్ ఠాణాలో నమోదైన పోక్సో, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఇరువురు మహిళలు నిందితులుగా మారారు. గత ఏడాది చోటు చేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు అధికారులు ఇటీవల కోర్టులో చార్జ్షిట్ దాఖలు చేశారు. ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) లైంగికదాడి చేసిన వ్యక్తి మాత్రమే నిందితుడిగా ఉండగా... అభియోగపత్రాల్లో మాత్రం ఆ విషయం తెలిసీ మిన్నకుండిపోయిన మహిళలూ నిందితులుగా మారారు.ఐదు రోజులు నిర్భంధించి ఘాతుకం..జూబ్లీహిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మహిళ వద్ద ఆర్. రాజిరెడ్డి అనే వ్యక్తి డ్రైవర్గా పని చేసేవాడు. అదే అపార్ట్మెంట్లో మరో మహిళ సెక్యూరిటీ గార్డుగా పని చేసేది. అదే ప్రాంతానికి చెందిన బాలికతో రాజిరెడ్డికి పరిచయం ఉండేది. అతను గత ఏడాది అక్టోబర్ 31న ఓ శుభకార్యానికి తీసుకువెళ్తానంటూ బాలికను కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో అతడి యజమాని సైతం వారితో ఉంది. వీరు సదరు బాలికను షాపింగ్కు తీసుకెళ్లి వ్రస్తాలు కొనిపెట్టారు. ఆపై అపార్ట్మెంట్కు తీసుకువచి్చన రాజిరెడ్డి రెండో అంతస్తులోని తన గదిలో నిర్భంధించి నవంబర్ 5 వరకు సదరు బాలికపై పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. విచారణలో చెప్పని ఆ ఇరువురూ..ఇదిలా ఉండగా... బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి గత ఏడాది అక్టోబర్ 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి పలువురిని విచారించగా ఎవరి నుంచి సరైన సమాచారం లభించలేదు. సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మహిళతో పాటు రాజిరెడ్డి యజమాని సైతం తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. ఐదు రోజుల నిర్భంధం తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక తన తల్లితో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు.అక్కడ అన్నీ చెప్పిన బాలిక..భరోసా కేంద్రంలో ఉన్న కౌన్సిలర్లు, అధికారులు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ ఐదు రోజుల్లో ఏం జరిగిందో చెప్పాల్సిందిగా కోరారు. దీంతో రాజిరెడ్డి తనను నిర్భంధించడంతో పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. తాను నిర్భంధంలో ఉండగా రాజిరెడ్డి యజమాని ఆహారం అందించిందని, ఆ అపార్ట్మెంట్కు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న మహిళకూ తన విషయం తెలుసని వెల్లడించింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నేరం జరిగినట్లు నిర్థారించారు. బాలిక మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా వీరు ఇరువురినీ ప్రశి్నంచినా నోరు విప్పకపోకపోవడాన్నీ సీరియస్గా తీసుకున్నారు. ఆ ఇద్దరినీ నిందితులుగా చేరుస్తూ..దీంతో బాలిక అదృశ్యం కావడంపై నమోదైన మిస్సింగ్ కేసులో పోక్సో యాక్ట్తో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్లనూ చేర్చారు. ఈ కేసులో రాజిరెడ్డి ఒక్కడే కాకుండా ఇద్దరు మహిళల్నీ నిందితులుగా చేర్చారు. బాలికపై దారుణం జరుగుతున్నా అడ్డుకోకపోవడం, జరిగిందని తెలిసీ బయటకు చెప్పకపోవడం నేరాలేనని దర్యాప్తు అధికారులు తేల్చారు. భారతీయ న్యాయ సంహితలోని (బీఎన్ఎస్) సెక్షన్ 211 (ఓ నేరానికి సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టడం), భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 33 (నేరం జరిగినట్లు తెలిసినా వెంటనే పోలీసు లేదా మేజిస్ట్రేట్కు చెప్పకపోవడం) కింద అభియోగాలు మోపారు.దర్యాప్తునకు సహకరించకున్నా దండనేఏదైనా నేరం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు లేదా మేజి్రస్టేట్కు సమాచారం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. నేరాల నిరోధంతో పాటు చట్టాల అమలుకు పాటుపడాలి. ఏదైనా నేరం జరిగిందని తెలిసీ మిన్నకుండిపోవడం నేరమే అవుతుంది. తమ కళ్ల ముందు నేరం జరిగితే నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించే అధికారమూ పౌరులకు ఉంటుంది. వివిధ నేరాలకు సంబంధించి కేసులు నమోదైనప్పుడు పోలీసులు కోరితే దర్యాప్తునకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. బీఎన్ఎస్ఎస్లోని 31, 33, 40 సెక్షన్లు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. అలా చేయకపోవడం కూడా నేరమే అవుతుంది. బీఎన్ఎస్లోని 211, 239లతో పాటు పోక్సో యాక్ట్లోని 19 సెక్షన్ ప్రకారం అభియోగాలు ఎదుర్కోవాల్సిందే.– పి.వెంకటగిరి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ -
ఒంటరిగా ఉంటున్న వదినపై కన్నేసి..!
తమిళనాడు: కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని కట్టుకుడలూర్ ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణన్ భార్య తమిళరసి (35). వీరికి ఇద్దరు కుమారులు హరికృష్ణన్ (13), హరిశక్తి (10) ఉన్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా గత 10 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారు. గోపాలకృష్ణన్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తమిళరసి తన ఇద్దరు కుమారులతో కలిసి తన భర్త తమ్ముళ్లయిన బాలకృష్ణన్, మురుగనాథం ఇంట్లో నివసిస్తోంది. ఈ స్థితిలో కొన్ని రోజుల క్రితం, బాలకృష్ణన్, మురుగానందం తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ తమిళరసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళపై అత్యాచారాల నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు మురుగానందాన్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బాలకృష్ణన్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బాలకృష్ణన్ తాగి ఇంటికి వచ్చాడు. తర్వాత తమిళరసితో గొడవ పడ్డాడు. తర్వాత తన వద్ద దాచిన కత్తితో తమిళరసి తలను నరికి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడే ఉన్న బాలకృష్ణన్ను అరెస్టు చేశారు. -
సూట్కేస్లో ఇన్ఫ్లుయెన్సర్ మృతదేహం
వియన్నా / స్లోవేనియా: వారం రోజులుగా అదృశ్యమైన ఆస్ట్రియన్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ స్టెఫానీ పైపర్ (31) విగతజీవిగా కనిపించింది. స్లోవేనియన్ అడవిలో ఒక సూట్కేస్లో ఆమె మృతదేహం లభ్యమైంది. దీనికి ముందు స్టెఫానీ పైపర్ మాజీ ప్రియుడు తన నేరాన్ని అంగీకరించి, పోలీసులను స్టెఫానీ మృతదేహాన్ని దాచిన ప్రదేశానికి తీసుకెళ్లినట్లు ఆస్ట్రియన్ అధికారులు తెలిపారు.పైపర్ కనిపించకుండా పోవడంతో కలకలం చెలరేగింది. క్రిస్మస్ పార్టీ తర్వాత స్నేహితులు ఆమెను చివరిసారిగా చూశారు. స్థానిక నివేదికల ప్రకారం పార్టీ ముగిశాక పైపర్ తన ఇంటికి చేరుకున్నట్లు స్నేహితులకు వాట్సాప్ సందేశం పంపింది. ఆ తర్వాత తన ఇంటి మెట్ల మార్గంలో ఎవరో తనను అనుసరిస్తున్నట్లు మరో సందేశాన్ని పంపింది. ఆస్ట్రియన్ వార్తాపత్రిక క్రోనెన్ జైటంగ్ నివేదిక ప్రకారం ఆమె మాజీ ప్రియుడు ఆమెను గొంతు కోసి చంపి, ఆపై మృతదేహాన్ని సూట్కేస్లో కుక్కి అడవిలో పడేశాడని పోలీసుల ముందు వెల్లడించాడు. పీపుల్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం ఆమె అదృశ్యమైన రోజున ఆమె మాజీ ప్రియుడిని భవనంలో చూసినట్లు స్థానికులు తెలిపారు.పైపర్ తప్పిపోయినట్లు ఫిర్యాదు అందిన వారం తర్వాత, ఆమె మాజీ ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రియన్ సరిహద్దు సమీపంలోని ఒక క్యాసినోలో అతని కారు మంటల్లో చిక్కుకున్న తరుణంలో పోలీసులు అతనిని పట్టుకున్నారు. అరెస్టు తర్వాత అతను నేరాన్ని అంగీకరిస్తూ, స్లోవేనియన్ అడవిలో మృతదేహాన్ని పడవేసిన ప్రదేశానికి పోలీసులను తీసుకెళ్లాడు. హత్యకు గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ప్రియుడితో పాటు, ఈ కేసులో అతని ఇద్దరు బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరంలో వారి ప్రమేయంపై సమాచారం ఇంకా తెలియరాలేదు.ఇది కూడా చదవండి: అణుశక్తి బిల్లు.. గేమ్ చేంజర్ అయ్యేనా? -
ఒంటరి మహిళపై ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం
-
ఒంటరిగా ఉంటున్నానని.. లక్షల్లో సంపాదిస్తున్నానని..
సాక్షి, హైదరాబాద్: కల్లబొల్లి మాటలతో వల వేసి.. కలిసి పెట్టుబడి పెడితే మంచి లాభాలంటూ ఊదరగొట్టిన సైబర్ నేరగాళ్లు ఓ డాక్టర్ నుంచి 60 రోజుల వ్యవధిలో రూ.14.61 కోట్లు కొల్లగొట్టారు. సీఎంసీ మార్కెట్స్ ట్రేడింగ్ పేరుతో ఈ మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు. బ్యాంక్ లావాదేవీలు, ట్రేడింగ్ లింకుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్కు చెందిన ప్రైవేట్ డాక్టర్ కె.మహేశ్వర్ రెడ్డికి ఆగస్టు 27న ఫేస్బుక్ మెసెంజర్లో మోనికా మాధవ్ పేరుతో ఫేస్బుక్ రిక్వెస్ట్ వచ్చింది. తను భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని తెలిపింది. విడాకుల కేసు కోర్టులో పెండింగ్ ఉందని నమ్మించింది. తనను తాను సీఎంసీ మార్కెట్స్ ట్రేడింగ్ ప్రతినిధిగా పరిచయం చేసుకుంది. చాటింగులు, షేరింగులతో వల వాట్సాప్, టెలిగ్రామ్లో చాటింగులు, షేరింగ్లు చేసింది. ఈ క్రమంలోనే సీఎంసీ ట్రేడ్ మార్కెట్లో రోజుకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పింది. తనతో కలిసి ఇన్వెస్ట్ చేయాలని సూచించింది. ఇదంతా సైబర్ నేరగాళ్లు చేస్తున్న పని అని డాక్టర్ గుర్తించలేకపోయారు. విడతల వారీగా పెట్టిన పెట్టుబడికి పదింతలు లాభాలని ఫేక్ యాప్లో చూపుతూ ఈ నెల 26వ తేదీ వరకు 60 రోజుల వ్యవధిలో మొత్తం రూ.14.61కోట్లు డాక్టర్ నుంచి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా విఫలమవడంతో తాను మోసపోయానని గుర్తించిన డాక్టర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు. టీజీ సీఎస్బీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ మంత్రి PA కీచకపర్వం.. పక్కలో పడుకోవాలంటూ హుకుం
-
‘పాదరసం’తో భార్య ప్రాణం తీశాడు
దొడ్డబళ్లాపురం: ఓ భర్త అత్యంత క్రూరంగా భార్యను హత్య చేశాడు. పాదరసం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా.. ఒక్కో అవయవం పాడయ్యేలా చేసి.. 9 నెలల పాటు నరకం చూపించి హతమార్చాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది. విద్య(37), బసవరాజు దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరు బెంగళూరులోని అత్తిబెలెలో నివసిస్తున్నారు. కొన్నాళ్లుగా భార్య, భర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో భార్యను ఎవరికీ అనుమానం రాకుండా అంతమొందించాలనుకున్న బసవరాజు.. ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో పని చేసే శ్వేత, ఆమె భర్త సాయంతో క్లోరోఫాం, పాదరసం, సిరంజిలు తీసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాత్రి బసవరాజు విద్యతో ప్రేమ గా మాట్లాడుతూ.. క్లోరోఫాం ఇచ్చాడు. కొంచెం మత్తులోకి జారుకున్నాక పాదరసం ఇంజెక్షన్ చేశాడు.మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన విద్యకు కుడి తొడ భాగంపై వాపు, విపరీతమైన నొప్పి వచ్చింది. అప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో మార్చి 7న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వారు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆమె శరీరాన్ని పాదరసం విషమయం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కొక్క అవయవం పాడవుతుండగా.. 9 నెలల పాటు నరకం చూసిన విద్య సోమవారం మరణించింది. తన భర్త, మామ కలిసి తనను హత్య చేసేందుకు పాదరసం ఇంజెక్షన్ ఇచ్చారని ముందుగా ఇచ్చిన వీడియో వాంగ్మూలంలో తెలిపింది. -
శవపేటికలో శబ్దాలు.. అసలేం జరిగిందంటే..
బ్యాంకాక్: అది బ్యాంకాక్ శివార్లలో నిశ్శబ్దం తాండవించే వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయం. అంత్యక్రియల కోసం వచ్చేవారితో రద్దీగా ఉండే ప్రదేశం. ఆ రోజు, ఆలయ జనరల్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే ఫిత్సనులోక్ ప్రావిన్స్ నుండి 500 కిలోమీటర్లు ప్రయాణించి ఒక వ్యక్తి 65 ఏళ్ల తన సోదరి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకొచ్చాడు.ఇంతలో శవపేటికలో శబ్దాలు వినిపించడంతో.. ఆలయ సిబ్బంది నిశ్చేషు్టలయ్యారు. లోపల కదులుతున్న వృద్ధురాలిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. బ్యాంకాక్ శివార్లలోని నాన్థాబురి ప్రావిన్స్లోని వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. అసలేం జరిగిందంటే.. ఆలయ జనరల్, ఫైనాన్షియల్ అఫైర్స్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్ మాట్లాడుతూ.. ‘రెండు రోజుల క్రితం ఒక వృద్ధురాలు ఊపిరి ఆగిపోయి, చనిపోయినట్లు కనిపించడంతో ఆమె సోదరుడు శవపేటికలో భద్రపరిచి తీసుకొచ్చాడు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరుగుతుండగా, శవపేటిక నుండి సన్నని శబ్దం వినిపించింది. నాకు కాస్త ఆశ్చర్యం వేసింది, అందుకే శవపేటిక తెరవమని కోరాను. ఆమె మెల్లగా కళ్లు తెరుస్తూ, శవపేటిక పక్కకు తడుతూ కనిపించింది. ఆమె చాలా సేపటి నుండి తడుతూ ఉందేమో’.. అని ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు.మరణ ధ్రువపత్రం లేక.. వాస్తవానికి, ఆ మహిళ గతంలోనే తన అవయవదానానికి సమ్మతించడంతో.. ఆమె సోదరుడు మొదట బ్యాంకాక్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ, అధికారిక మరణ ధ్రువపత్రం లేకపోవడంతో ఆసుపత్రి తిరస్కరించింది. అనంతరం వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయంలో ఉచిత దహన సంస్కారాలు చేస్తారని తెలిసి ఆదివారం శవపేటికను తీసుకురాగా, అక్కడ కూడా అదే ధ్రువపత్రం అడిగారు. ఆలయ జనరల్, ఫైనాన్షియల్ అఫైర్స్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్.. ఆ పత్రం గురించి వృద్ధురాలి సోదరునికి వివరిస్తున్నప్పుడే.. శవపేటికలో శబ్దం వినిపించింది.వెంటనే ఆలయ సిబ్బంది ఆమెను పరీక్షించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఖర్చులను తామే భరిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు ప్రకటించారు. చనిపోయిందనుకున్న మహిళ తిరిగి ప్రాణాలతో రావడం, ఆలయ సిబ్బందికి, ఆమె సోదరుడికి జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని మిగిల్చింది. -
షాంఘై ఎయిర్పోర్ట్లో మహిళకు వేధింపులు : చైనా రియాక్షన్ ఇదే
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా అధికారులు షాంఘై విమానాశ్రయంలో 18 గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన ఘటనలో చైనా స్పందించింది. షాంఘై విమానాశ్రయంలో భారతీయ మహిళను వేధించారనే ఆరోపణలను చైనా ఖండించింది. థాంగ్డోక్కు ఎదురైన అనుభవంపై స్పందన కోరగా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆ మహిళ ఆరోపించినట్లుగా ఎటువంటి తప్పనిసరి చర్యలు, నిర్బంధం లేదా వేధింపులకు లేవని పేర్కొన్నారు.లండన్ నుంచి జపాన్కు ప్రయాణిస్తున్నకి షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో భారతీయ మహిళలను అడ్డుకున్న దుమారం రేగిన ఒక రోజు తరువాత డ్రాగన్ కంట్రీ దీనిపై వివరణ ఇచ్చింది. నవంబర్ 21న లండన్ నుండి జపాన్కు ప్రయాణిస్తున్న యూకేకి చెందిన భారతీయ పౌరురాలు పెమా వాంగ్జోమ్ థాంగ్డాక్, పాస్పోర్ట్లో జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని పేర్కొనడంపై ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది తనను ఆపారని తెలిపింది. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీసుకున్న చర్యలు చట్టాలు , నిబంధనల ప్రకారం ఉన్నాయని పేర్కొంటూ ఈ సందర్భంగా వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. కాగా అరుణాచల్ చైనా భూభాగం అంటూ షాంఘైలో విమానంలో దిగిన థాంగ్లో పాస్పోర్ట్ను చూసిన చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం, కనుక ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదని వాదించి అవమానించి వేధింపులకు గురిచేశారు. తదుపరి విమానం ఎక్కకుండా, కనీసం ఆహారం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె థాంగ్డోక్ తన స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారతీయ కాన్సులేట్కు సమాచారం అందించింది. భారతీయ అధికారుల జోక్యం తర్వాత ఆమెను రాత్రి ఆలస్యంగా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. -
అరుణాచల్ ప్రదేశ్ మాది..!
అరుణాచల్ ప్రదేశ్.. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి. అయితే చైనా మాత్రం అరుణాచల్ ప్రదేశ్పై ఎప్పటికప్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. మనతో స్నేహం అంటూనే భారతదేశంలో సూర్యుడు ఉదయించే తొలి ప్రాంతం అరుణాచల్ను తరచు తమది అంటోంది. తాజాగా వారి అరాచకం మరోసారి బయటపడింది. యూకేలో ఉంటున్నభారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆమె పాస్పోర్ట్పై అరుణాచల్ప్రదేశ్-భారతదేశం అని ఉండటంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాలో బాగమని ఆమెతో వాదించారు. ఆ పాస్పోర్ట్ చెల్లదు అంటూ తీవ్ర అసహనానికి గురిచేశారామెను. పెమా వాంఘజామ్ థోంగ్డాక్ అనే లండన్ నుంచి జపాన్కు వెళ్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. మధ్యంతర విరామంలో భాగంగా చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్లో మూడు గంటలు పాటు వేచి ఉన్న ఆమెకు.. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. పాస్పోర్ట్ కౌంటర్లో అరుణాచల్ ప్రదేశ్-భారత్ అని ఉందేంటని ప్రశ్నించారు. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ భాగమని ఆమె వాదించగా, కాదంటూ వారు వాగ్వాదానికి దిగారు. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమంటూ వితండ వాదం చేశారు. మూడు రోజుల క్రితం అంటే నవంబర్ 21వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె.. జాతీయ వార్త సంస్థ ఇండియా టుడేకి స్పష్టం చేసింది. తనను చైనా అధికారుల ఎంతటి వేధింపులకు గురి చేశారో వెల్లబుచ్చింది. గత ఏడాది తాను చైనా మీదుగా ప్రయాణించినా ఎటువంటి ఇబ్బంది రాలేదని, అలాగే లండన్లో ఉన్న చైనా ఎంబాసీ కూడా ఎప్పుడూ తనను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. తాజాగా ఎదురైన అనుభవంతో తాను షాక్కు గురైనట్లు ఆమె వాపోయింది. ఈ కారణంగా తాను కేవలం కొంత పరిధి వరకే పరిమితమయ్యానని, టికెట్లను రీబుక్ చేసుకోలేకపోయానని, భోజనం కూడా కొనలేకపోయానని, ఆఖరకు టెర్మినల్స్ మధ్య కదలడానికి కూడా వీల్లేకుండా పోయిందని తెలిపింది. చైనా ఈస్టర్న్లో ప్రత్యేకంగా కొత్త టికెట్ కొనాలని అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని, అలా చేసిన తర్వాతే తన పాస్పోర్ట్ తిరిగి ఇస్తామన్నారని పేర్కొంది. దీనివల్ల పలు ఆటంకాలు ఏర్పడి ఆర్థిక నష్టం చవిచూడాల్సి వచ్చిందన్నారు. చివరకు లండన్లో ఉన్న తన ఫ్రెండ్ సాయంతో షాంఘైలో ఉన్న బారత ఎంబాసీని కలిశానని, ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో తాను చైనాను వీడి వెళ్లే అవకాశం దక్కిందన్నారు. ఇదొక భయానక ఘటనగా ఆమె అభివర్ణించారు.ఇదీ చదవండి: మీరు మాకు చెప్పాల్సింది: ప్రధాని మోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడుసరిహద్దులు మారొచ్చు.. రాజ్నాథ్ సింగ్ -
యూనిఫామ్ వేసి బందోబస్తు డ్యూటీ చేసిన యువతి
హైదరాబాద్: పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన ఓ యువతి.. తానే పోలీస్ అని తప్పుదోవ పట్టించింది. విషయం తెలియడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. షాపూర్నగర్కు చెందిన ఓ యువతి (22) పోలీస్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగం రాకపోవడంతో తాను పోలీస్ అని అందరిని నమ్మించాలని అనుకుంది. అందుకు తగ్గట్టుగానే యూనిఫామ్ ధరించి పలుచోట్ల ఎవరికీ అనుమానం రాకుండా బందోబస్తు డ్యూటీ సైతం చేసింది. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి వద్ద కూడా 10 రోజుల బందోబస్తు డ్యూటీ చేసిందట. ఈ విషయం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు తెలియడంతో వారు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ దీనిపై విచారించి..ఆ యువతిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రైలు ఏసీ కోచ్లో మ్యాగీ : వీడియో వైరల్, నెటిజన్లు ఫైర్
కుటుంబాలతో కలిసి రైల్లో ప్రయాణించేటపుడు ఎక్కువ ఫుడ్ను ఆస్వాదిస్తాం. పులిహోర, దద్జోజనం, పూరీలు చికెన్, స్వీట్ పూరీలు, చపాతీలు, బిర్యానీ , టీ-కాఫీ వరకు రకరకాలుగా ముందే ప్రిపేర్ చేసుకుని వెళ్లి, రైలు బోగీలో తింటూ ఉండే అదో ఆనందం. ముఖ్యంగా పిల్లలు ఇలాంటి జర్నీలను బాగా ఎంజాయ్ చేస్తారు. మారు మాట్లాడకుండా, మారం చేయకుండా చక్కగా తింటారు. మరో విధంగా చెప్పాలంటే ఇదొక మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. అయితే మరికొంతమంది వేడి వేడిగా తినడానికి ఇష్టపడతారు. అయితే రైల్వే క్యాంటీన్లో ఆర్డర్ చేసకుంటాం. లేదంటే రైలు ఆగినపుడు ఆయా స్టేషన్లలో కొనుక్కుంటాం. కానీ మహారాష్ట్ర మహిళ చేసిన పని గురించి తెలుసుకుంటే అవాక్కవుతారు. పదండి ఆ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఇదీ చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ ఏకంగా ఏసీ రైలు బోగీలోనే మ్యాగీ తయారు చేసింది. రైలు ఏసీ కంపార్ట్మెంట్లోని చార్జింగ్ సాకెట్లో ఎలక్ట్రిక్ కెటిల్ పెట్టి కెటిల్లో ఇన్స్టంట్ నూడుల్స్ ప్రిపేర్ చేసింది పైగా కెమెరాకు చక్కగాఫోటోలకు పోజులిచ్చింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రైలులో మ్యాగీ వేడిగా వడ్డిస్తే తినడం బాగానే ఉంటుంది, కానీ సేఫ్టీ పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు మినిమం సెన్స్ లేదు, ఇలా చేస్తే చాలా ప్రమాదకరం కదా అని కమెంట్ చేశారు. రైలులోని ఎలక్ట్రికల్ సర్క్యూట్పై అదనపు భారం పడి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని మరికొందరు హెచ్చరించారు. This is a major safety hazard and can cause fire endangering lives of all onboard. That's why we cannot have good things. Many will misuse the facilities and then be proud of it. Most lack civil sense. pic.twitter.com/JSRCpIXPW9— Backpacking Daku (@outofofficedaku) November 20, 2025"చాలా ఏళ్ల క్రితం, చెన్నై నుండి టాటానగర్కు రైలులో వెళుతుండగా, ఒక కుటుంబం పూజ చేసి అగర్ బత్తి, కర్పూరం వెలిగించింది. నేను వెంటనే టీసీకి ఫిర్యాదు చేశాను ఈ రోజుల్లో జనానికి బుద్ధి లేదు. ఇలాంటి పిచ్చి పనులు మానడం లేదు.’’ అంటూ గతంలో తనకు ఎదురైన అనభవాన్ని షేర్ చేశారొకరు. డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నంత మాత్రాని, మొత్తం ప్రయాణికుల ప్రాణాల్ని ఫణంగా పెట్టే పనులు చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. -
జస్ట్ నాలుగు నెలల్లో..24 కిలోల బరువు..! ఈ సింపుల్ డైట్ ప్లాన్తో..
వెయిట్లాస్ జర్నీలో కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఎంతలా అంటే.. ఎలాంటి క్రాష్ డైట్లు పాటించకుండా ఆరోగ్యకరమైన రీతీలో ఏదో మాయ చేసినట్లుగా అమాంతం స్లిమ్గా మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఇక్కడ అలానే జాహ్నవి అనే మహిళ ఎంత అద్భుతంగా బరువు తగ్గిందంటే..చాలా తక్కువ సమయంలోనే అధిక బరువుని కోల్పోయింది. అదికూడా ఆరోగ్యకరమైన పద్ధతిలోనే తగ్గడం విశేషం. అదెలాగో ఆమె మాటల్లోనూ సవివరంగా తెలుసుకుందామా..!.జాహ్నవి అనే మహిళ వెయిట్ లాస్ జర్నీలో అందరికీ స్ఫూర్తి అంటూ ఫిట్నెస్ నిపుణుడు మాక్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. అంతేగాదు త్వరిగతిన ఫలితాలు పొందాలనుకునేవారికి ఆమె ప్రేరణ అని పోస్ట్లో పేర్కొన్నారు. బరువు తగ్గడం అనేది కాస్త కఠినమైన టాస్క్ అయినా..క్రమశిక్షణ, డెడికేషన్ ఉంటే..ఈజీగా బరువు తగ్గిపోవచ్చట. ముందుగా ఈ వెయిట్లాస్ జర్నీలో ప్రతిఒక్కరికి స్థిరత్వంతో కూడిన అంకితభావం ప్రధానమని..నొక్కి చెబుతోంది జాహ్నవి. తాను 94 కిలోల మేర అధిక బరువు ఉండేదాన్ని..జస్ట్ నాలుగు నెలల్లోనే 24 కిలోలు వరకు తగ్గిపోయానని పేర్కొంది. పైగా తన డైట్ ఎలా ప్లాన్ ఎలా ఉండేదో కూడా వివరించింది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉసిరి కాయ రసం, ఐదు బాదం పప్పులు, అజ్వైన్(క్యారమ్ గింజలు), దాల్చిన చెక్క నీరు, నానబెట్టిన వాల్నెట్స్, మెంతినీరు తప్పనిసరిగా తీసుకుంటానని అంటోంది. బ్రేక్ఫాస్ట్ రొటీన్ (ఉదయం 8)అల్పాహారం కోసం, జాహ్నవి మిల్లెట్ దోస, చియా సీడ్ స్మూతీ, పెసరపప్పుతో చేసే ఇడ్లీ తింటానంటోంది.మిడ్-మార్నింగ్ రొటీన్ (ఉదయం 11)ఈ సమయంలో, ఫిట్నెస్ ప్రియురాలు సీజనల్ పండ్లు, ఫ్రూట్ స్మూతీ, రాగి (ఫింగర్ మిల్లెట్) మాల్ట్ను ఆశ్రయించింది.లంచ్ రొటీన్ (మధ్యాహ్నం 2)ఆమె లంచ్ మెనూలో బియ్యం, కూరగాయల కూర, పెరుగు, లేదా మిల్లెట్ పులావ్, మిశ్రమ కూరగాయలు, రైతా వంటి సరళమైన వంటకాలు ఉన్నాయి.స్నాక్ రొటీన్ (సాయంత్రం 4)స్నాక్స్ కోసం, జాహ్నవి తనకు తానుగా ఉడికించిన గుడ్డు, భెల్(మరమరాలు), నల్ల చన్నా (సెనగలు) చాట్ తీసుకున్నట్లు తెలిపింది.డిన్నర్ రొటీన్ (రాత్రి 7)ఆమె తన విందును ముందుగానే ముగించేదాన్ని అంటోంది. ఆమె ఆహారంలో కూరగాయలతో ఉడికించిన చికెన్, గుడ్డు ఆమ్లెట్, కూరగాయల కూరతో మిల్లెట్ రోటీ ఉన్నాయి.పడుకునే ముందు (రాత్రి 9)పడుకునే ముందు, జాహ్నవి హెర్బల్ టీ లేదా పుదీనా, కొత్తిమీర నీరు వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకున్నట్లు తెలిపింది. ఇలా కేర్ఫుల్గా తీసుకునే డైట్పై ఫోకస్ పెడితే.. హెల్దీగా బరువు తగ్గడం ఏమంత కష్టం కాదని అంటోంది జాహ్నవి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: అత్యుత్తమ చికెన్ రెసిపీ జాబితాలో బటర్ చికెన్కి చోటు..! ఎన్నో స్థానంలో ఉందంటే..) View this post on Instagram A post shared by Fitelo | Customised Diet Plans (@fitelo_tamil) -
చిత్తూరు కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం
చిత్తూరు కలెక్టరేట్: తమ పొలానికి దారి ఇవ్వడంలేదని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ఒక మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు ఆమె చేతిలోని పురుగుమందు డబ్బా లాగేయడంతో ప్రాణాపాయం తప్పింది. వి.కోట మండలం మిట్టూరు గ్రామానికి చెందిన నందిని తమ పొలానికి దారి సమస్యను పరిష్కరించాలని పీజీఆర్ఎస్లో వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్కు వచి్చంది. ఈ సందర్భంగా వి.కోట రెవెన్యూ అధికారులు తమ సమస్యను తీర్చడం లేదంటూ పురుగుమందు తాగింది.పోలీసులు పురుగుమందు డబ్బాను లాగేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ‘కలెక్టర్ సార్ని రమ్మని చెప్పండి మాట్లాడాలి. వి.కోట తహసీల్దార్, వీఆర్వోల వద్ద న్యాయం లేదు సర్. నాకు న్యాయం కావాలి. మా దగ్గర న్యాయం ఉంది ఎవరూ పట్టించుకోవడం లేదు. మేం పక్కా టీడీపీ కార్యకర్తలం’ అంటూ బిగ్గరగా అరిచి మరీ చెప్పింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గం పక్కనే ఉన్న పలమనేరు నియోజకవర్గంలోని మిట్టూరులో నందిని నివసిస్తున్నారు. గ్రామంలోని సర్వే నంబరు 223లో ఉండే పొలానికి చుట్టుపక్కలవారు దారి సమస్య సృష్టిస్తుండడంతో న్యాయం చేయాలని 17 నెలలుగా మండల రెవెన్యూ కార్యాలయంలోను, కలెక్టరేట్లోను వినతిపత్రాలు ఇచ్చారు.సమస్య పరిష్కరించాలంటూ వీఆర్వోని, వి.కోట తహసీల్దారును అనేకసార్లు కోరినా ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో తమ సమస్యను ఎవరూ పట్టించుకోరంటూ మనస్తాపం చెంది ఆమె సోమవారం కుటుంబీకులతో కలెక్టరేట్కు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. నందినిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ విషయమై మిట్టూరు వీఆర్వో నవీన్ను సంప్రదించగా.. తనకు రెండువారాల కిందటే అదనపు బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. రీసర్వే పనుల ఒత్తిడిలో దానిపై ఫోకస్ పెట్టలేదని, క్షేత్రస్థాయిలో పరిశీలించలేదని తెలిపారు. వాస్తవంగా బాధితురాలి భూమికి చుట్టూ సెటిల్మెంట్ భూమి ఉందని, దారి ఇచ్చేందుకు వారు ఒప్పుకోవడం లేదని చెప్పారు. -
ఆర్బీఐ, సీబీఐ అంటూ.. 6 నెలల్లో రూ. 32 కోట్లు!
డిజిటల్ అరెస్ట్ స్కామ్లో బెంగళూరుకు చెందిన ఒక మహిళ దారుణంగా మోసపోయింది. సైబర్ క్రైమ్ విభాగం, ఆర్బీఐ, సీబీఐ అంటూ నెల రోజులు పాటు వేధించి కోట్ల రూపాయలను దోచుకున్నారు.బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ ‘‘డిజిటల్ అరెస్ట్" స్కామ్లో చిక్కుకుంది. నెల రోజులపాటు ఆమెను వర్చువల్ కస్టడీకి పరిమితం చేశారు సైబర్ నేరగాళ్లు. కొరియర్ DHL సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సీనియర్ అధికారులం అంటూ నమ్మించి భయ భ్రాంతురాల్ని చేశారు.నవంబర్ 14న దాఖలు చేసిన FIR ప్రకారం 2024 సెప్టెంబర్ 15న ఆమెకు ఒక కొరియర్ వచ్చినట్టు వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ముంబైలోని అంధేరి నుండి ఆమె పేరు మీద బుక్ చేసుకున్న ప్యాకేజీలో నాలుగు పాస్పోర్ట్లు, మూడు క్రెడిట్ కార్డులు , MDMA వంటి నిషేధిత వస్తువులు ఉన్నాయని చెప్పాడు. అయితే తాను ముంబైకి ప్రయాణించలేదని మొత్తుకుంది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఇది సైబర్ క్రైమ్ కేసు కిందికి వస్తుందని భయపెట్టారు. ఏంజరిగిందో ఆలోచించుకునే లోపే సీబీఐ అధికారులు అంటూ మరో కాల్ వచ్చింది. మీరు పెద్ద నేరమే చేశారు, మిమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించారు. దీనికి సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు . అంతేకాదు దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకూడదని కూడా హెచ్చరించారు. రెండు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. దుర్భాషలాడారు. ఆమె ఫోన్ యాక్టివిటీ , లొకేషన్ గురించి తెలుసని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే తాము చెప్పినట్టు చెయ్యాలని పట్టుబట్టారు. నకిలీ సీబీఐ ఆఫీసర్లు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నకిలీ లేఖలను కూడా సమర్పించారు. స్కైప్ ద్వారా రోజువారీ నిఘాలో ఉంచారు. దీంతో కుటుంబ భద్రతకు భయపడి, బాధితురాలు ఆమె అడిగిన డబ్బును చెల్లించేందుకు ఒప్పుకుంది.దీన్నుంచి బయట పడాలంటే RBI కింద ఉన్న ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) ద్వారా ధృవీకరణ కోసం ఆమె ఆస్తులు, బ్యాంకు ఖాతాలను వివరాలను సమర్పించడం ఒక్కటే ఏకైక మార్గమని చెప్పారు. చెప్పబడింది. సెప్టెంబర్ 24-అక్టోబర్ 22, 2024 మధ్య అన్ని బ్యాంకు వివరాలను అందజేసింది. ఈ ఆస్తులకు 90 శాతం క్లియరెన్స్ కావాలంటే కొంత సొమ్మును డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత దీనికి అదనంగా రూ. 2 కోట్లు పూచీకత్తుగా డిపాజిట్ చేయాలని, పన్నులు ఇంకొంత సొమ్మును లాక్కున్నారు. ఇలా మొత్తంగా, 187 లావాదేవీల్లో ఆ మో రూ. 31.83 కోట్ల విలువైన డబ్బును బదిలీ చేసింది. ఈ స్కామ్ ప్రధానంగా ఆమె మొబైల్ నంబర్కు కాల్స్, నిరంతర పర్యవేక్షణ ద్వారా జరిగింది.డిసెంబర్ 1 ఆమెకు నకిలీ క్లియరెన్స్ లెటర్ వచ్చింది. దీంతో డిసెంబర్ 6న ఆమె కొడుకు నిశ్చితార్థాన్ని కార్యక్రమాన్ని ముగించింది. కానీ విపరీతమైన మానసిక, శారీరక ఒత్తిడికి లోనైంది. ఫలితంగా నెలరోజుల పాటు అనారోగ్యానికి గురైంది. 2025 ప్రారంభం దాకా స్కామర్ల దందా కొనసాగింది. అడిగిన ప్రతీసారి డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి వచ్చేస్తామని హామీ ఇస్తూనే వచ్చారు. చివరికి 2025 మార్చిలో అకస్మాత్తుగా వారి మొత్తం కమ్యూనికేషన్ బంద్ అయింది. ఒక వైపు తన అనారోగ్యం, మరోవైపు కొడుకు పెళ్లి, కారణంగా ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పాక్లో పంజాబ్ మహిళ అదృశ్యం
న్యూఢిల్లీ: గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా ‘ప్రకాశ్ పుర్బ్’ వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్కు వెళ్లిన భారత్లోని పంజాబ్కు చెందిన ఒక మహిళా యాత్రికురాలు తిరిగి రాలేదు. సర్బ్జిత్ కౌర్గా గుర్తించిన ఈ మహిళ పంజాబ్లోని కపుర్తలా జిల్లాలోని అమానిపూర్ గ్రామానికి చెందినది. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పంజాబ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.సర్బ్జిత్ కౌర్ 2025, నవంబర్ 4న అట్టారి-వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్కు చేరుకున్నారు. ఆమె 1,900 మందికి పైగా సిక్కు సభ్యులతో కూడిన ‘జాతా’ (తీర్థయాత్ర సమూహం)లో భాగంగా వెళ్లారు. ఈ బృందం గురుద్వారా నంకనా సాహిబ్లో ప్రార్థనలు నిర్వహించేందుకు, ఇతర చారిత్రక సిక్కు మందిరాలను సందర్శించేందుకు 10 రోజుల యాత్రకు వెళ్లింది. అయితే గురువారం రాత్రి ఈ బృందం భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, సర్బ్జిత్ కౌర్ వారిలో లేరు. ఆమె తిరిగి రాకపోవడాన్ని గుర్తించిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. #WATCH | Kapurthala, Punjab | Station House Officer (SHO) of Talwandi Chaudhrian, Nirmal Singh says, "Sarbjit Kaur, a resident of Amanipur village in Kapurthala, was part of the jatha which went to Nankana Sahib, Pakistan. She did not return. The police are conducting an… pic.twitter.com/fPpMWzjcuK— ANI (@ANI) November 14, 2025ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. తల్వాండి చౌదరియన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)నిర్మల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కపుర్తలాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే దీనిపై కేసు నమోదయ్యిదన్నారు. భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు కౌర్ కుటుంబ సభ్యుల నుంచి, ఆమె గ్రామం నుంచి మరింత సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె అదృశ్యం వెనుక కారణాలు, ఆమె పాకిస్తాన్లో ఉండిపోయారా? లేదా మరేదైనా జరిగిందా? అనే కోణాల్లో పోలీసు దర్యాప్తు జరుగుతోంది.గురువారం తిరిగి వచ్చిన ఈ యాత్రికుల బృందం ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్కు వెళ్లిన మొదటి ‘జాతా’ కావడం గమనార్హం. గతంలో పలు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాకిస్తాన్కు ప్రయాణ ఆంక్షలు విధించింది. గత జూన్లో మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతికి సిక్కులు పాకిస్తాన్ను సందర్శించకుండా నిషేధించారు. సుమారు రెండు వారాల నిరాకరణ తర్వాత, అక్టోబర్ రెండున కేంద్ర ప్రభుత్వం ఈ తీర్థయాత్రకు అనుమతి ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేయడంతో, ప్రస్తుతం భారత పౌరులు మాత్రమే అట్టారి సరిహద్దు ద్వారా ప్రయాణించగలుగుతున్నారు. ఈ కఠిన నిబంధనల మధ్య యాత్రికురాలు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’ -
మంత్రిగారూ.. న్యాయం చేయండి
శ్రీకాకుళం జిల్లా: ‘అచ్చెన్నాయుడు గారూ... మాకు న్యాయం చేయండి. నా భర్త కట్టిన ఇంటిని ఆడపడుచు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. దీనికి అధికారులు, మీ నేతలే సహకరిస్తున్నారు’ అంటూ బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద రోడ్డుపై ఓ మహిళ తన కుమార్తె, తల్లితో నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళితే... టెక్కలి ఎన్టీఆర్ కాలనీకి చెందిన దేబారికి సంధ్య కొద్దిరోజుల క్రితం భర్తతో పాటు అత్తమామలను కోల్పోయింది. తమ సొంత డబ్బుతో నిర్మించుకున్న ఇంటిని ఆడపడుచు ఆక్రమించుకుని దౌర్జన్యానికి పాల్పడుతోందని బాధితురాలు సంధ్య వాపోయారు. ఇదే విషయమై పోలీసులను ఆశ్రయించినా న్యాయం చేయడం లేదని, కొంతమంది టీడీపీ నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కలగజేసుకుని తక్షణమే న్యాయం చేయాలని, లేకపోతే కుమార్తె సహా ఆత్మహత్యే శరణ్యమంటూ బోరున విలపించారు. -
మహిళపై టీచర్ అత్యాచార యత్నం
-
చంద్రకళ జీవితంలో చీకట్లు నింపిన టీడీపీ నాయకుడు
ఆమె పేరులో ఉన్న ‘కళ’ను జీవితంలో లేకుండా చేశారు. వేధించి, దాడి చేసి, అవమానపరచి జీవచ్ఛవంలా మార్చేశారు. ఇంత జరిగినా వారి ఆక్రోశం మాత్రం చల్లారలేదు. ఇంకా వేధిస్తూనే ఉన్నారు. కాస్త దయ చూపమంటూ ‘పెద్ద’లను ఆశ్రయిస్తే పట్టించుకోలేదు.. సరికదా వెక్కిరిస్తున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన ఖాకీలు దాడి చేసిన వారికే వత్తాసు పలుకుతుండడంతో బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అనంతపురం: కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డే కాలనీకి చెందిన చంద్రకళ, చిన్నా దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం కాగా, కుటుంబం సంతోషంగా జీవనం సాగించేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రకళపై స్థానిక టీడీపీ నాయకుడు రామాంజినేయులు కన్నుపడింది. కోరిక తీర్చాలంటూ వెంటపడడం ప్రారంభించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పద్ధతి మార్చుకోవాలంటూ రామాంజినేయులును చంద్రకళ హెచ్చరించింది. విషయం తెలుసుకున్న రామాంజినేయులు కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. రామాంజినేయులు భార్య లక్ష్మీ , బంధువులు గాయత్రి, రామకృష్ణ, శిరీష, రమేష్ కలిసి చంద్రకళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపైనా దాడి చేశారు. విషయంపై బాధితులు కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. జరిగిన అవమానంతో మనస్తాపానికి గురైన చంద్రకళ ఎనిమిది నెలల క్రితం ఇంట్లో యాసిడ్ తాగింది. జీవచ్ఛవంలా.. కుటుంబ సభ్యులు వెంటనే చంద్రకళను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళ్లారు. దాదాపు 8 నెలలు వెంటిలేటర్పై కొట్టుమిట్టాడిన చంద్రకళ ప్రాణం ఎలాగోలా నిలిచింది. అయితే, అప్పటికే ఆస్పత్రిలో చికిత్సల కోసం బాధిత కుటుంబం రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేసింది. దొరికిన చోటల్లా అప్పు చేసి, ఉన్నవన్నీ కుదువ పెట్టి డబ్బు సమకూర్చారు. అయితే, ఇంకో రూ. 8 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పడంతో దిక్కుతోచలేదు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో చేసేది లేక ఇంటికి తిరిగి వచ్చారు. దాతల కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రకళ ప్రస్తుతం నేరుగా ఆహారం తీసుకోలేకపోతోంది. బాగా చిక్కిపోయి జీవచ్ఛవంలా బతుకీడుస్తోంది. పొట్ట భాగంలో రంధ్రం చేసి పైపు ద్వారా ద్రవ పదార్థాలు అందిస్తున్నారు. అలా చేస్తేనే సాయమట! ఇటీవల బాధితురాలి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఆశ్రయించారు. అయితే, బాధితులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులని తెలుసుకున్న ఆయన.. టీడీపీలోకి వస్తే వైద్య ఖర్చులకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు బాధిత కుటుంబసభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యత్నించగా ‘మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టుకోండి’ అంటూ టీడీపీ నేతలు కించపరిచేలా మాట్లాడారని చంద్రకళ కుటుంబ సభ్యులు వాపోయారు. పట్టించుకోని పోలీసులు.. చంద్రకళ ఫిర్యాదు చేసిన సమయంలో పట్టించుకోని పోలీసులు.. ఆమె యాసిడ్ తాగాక అప్రమత్తమై టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి, గంటలోపే స్టేషన్ బెయిల్ ఇచ్చి నిందితులను పంపించేయడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ప్రశి్నస్తే.. తమకు ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని, విసిగించకుండా వెళ్లిపోవాలంటూ హెచ్చరించారని వారు వాపోతున్నారు. ఆగని వేధింపులు... తమ పార్టీ నాయకులపై పెట్టిన కేసుకు సంబంధించి చంద్రకళ కుటుంబీకులపై ఇటీవల టీడీపీ నాయకులు వేధింపులకు దిగుతున్నట్లు తెలిసింది. కేసు రాజీ కావాలంటూ టీడీపీ నేతలు తిమ్మరాజు, వైపీ రమేష్ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. చెప్పినట్లు వినకుంటే మీరే దాడి చేశారంటూ ఫిర్యాదు చేయించి మీపైనే కేసు నమోదు చేయిస్తామని వేధిస్తుండడంతో బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.కాపాడండి.. నా కుమార్తెపై టీడీపీ నాయకులు కక్ష సాధిస్తున్నారు. వారు ఎలా చెబితే అలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నా కుమార్తె జీవితం చిన్నాభిన్నమైంది. అయినా టీడీపీ నేతలు, పోలీసులు వేధింపులు ఆపడం లేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు. దయ ఉన్న మారాజులు స్పందించి నా కుమార్తె ఆస్పత్రి ఖర్చులకు సాయం చేయాలని చేతులు జోడించి కోరుతున్నా. – బయన్న, చంద్రకళ తండ్రి -
డాడీ ఇది నా చివరి కోరిక..
జనగామ జిల్లా: హాస్టల్ భవనంపై నుంచి దూకి యువతి (ప్రైవేట్ ఉద్యోగి) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. ఎస్సై చెన్నకేశవులు, స్థానికుల వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామానికి చెందిన వి.మౌనిక జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ షోరూంలో పని చేస్తోంది. రాత్రి హాస్టల్కు వచ్చిన ఆమె తెల్లవారుజామున హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. రెండు కాళ్లు విరిగి, తీవ్రగాయాల పాలైన మౌనికను సహచరులు, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాడీ ఇది నా చివరి కోరిక..ఘటనా స్థలంలో మౌనిక వద్ద ఉన్న సూసైడ్ నోట్ను ఎస్సై చెన్నకేశవులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మౌనిక.. ‘డాడీ నా గురించి తప్పుగా అనుకోకు. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. ఎవరినీ ఏమనొద్దు. నా మరణం వల్ల ఎవరూ ఇబ్బంది పడవద్దు.. ఇదే నా చివరి కోరిక’అంటూ అందులో పేర్కొంది. అమ్మ, డాడీ, గణేశ్ గుడ్ బాయ్, టేక్ కేర్ ఆల్, ఐ లవ్ యూ నాన్న అని రాసి హాస్టల్ భవనంపై నుంచి దూకగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఘటనపై ప్రాథమిక వివరాలు తీసుకున్నామని, కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు వచి్చన వెంటనే దర్యాప్తు చేస్తామని ఎస్సై చెన్నకేశవులు తెలిపారు. -
మహిళ కాళ్లపైకి ఎక్కిన పవన్ కళ్యాణ్ కారు
-
పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశ్రుతి
సాక్షి, చిత్తూరు జిల్లా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముసలిమడుగు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మహిళ కాలిపై నుంచి పవన్ కల్యాణ్ కారు దూసుకెళ్లింది. కనీస మానవత్వం మరిచిన.. పవన్ కల్యాణ్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. బాధితురాలు హేమలతను స్థానికులు పలమనేరు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తీరుపై పలమనేరు వాసులు మండిపడుతున్నారు.ఆదివారం.. పలమనేరులో పర్యటించిన పవన్ కళ్యాణ్ కుంకీ క్యాంపును పరిశీలించారు. అయితే, కుంకీల ఆపరేషన్ సర్కస్ ఫీట్లకే పరిమితమైంది. ఇంకా శిక్షణ, ట్రయల్ రన్తోనే సాగుతోంది. ఒకపక్క ఏనుగులు భీకర దాడులు చేస్తున్నా కట్టడి చేయలేని పరిస్థితి ఏర్పడింది. చేతికొచ్చిన పంటలు సర్వనాశనమవుతున్నా.. మనుషులను తొక్కి ప్రాణాలు తీస్తున్నా చూస్తూ మిన్నకుండిపోవాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన కుంకీల క్యాప్చరింగ్ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. -
‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’: ఇంటి హింస ఇంతింతై..
బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ అనేది మహిళలు తమ గృహహింస కారణంగా ఎదుర్కొనే మనోవేదన. ఒకరకంగా చూస్తే తీవ్రమైన వేదన కారణంగా అంటే రేప్కు గురైనవాళ్లూ, యుద్ధాల్లో సర్వం పోగొట్టుకున్నవాళ్లూ అనుభవించే అత్యంత వేదనాభరితమైన కండిషన్తో వచ్చే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ)లో ఇదో రకం అని చెప్పవచ్చు. మహిళలు తమ పార్ట్నర్ చేతుల్లో అనుభవించిన గృహహింస కారణంగా ఇది తమ ఖర్మ అంటూ సమాధానపడుతూ నిత్యం అనుభవించే రంపపుకోత కారణంగా వాళ్లు అనుభవించే మానసిక సమస్యే ఈ ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’. ఈ మానసిక సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...పెళ్లి తర్వాత భర్త లేదా జీవిత భాగస్వామి పెట్టే వేదనలను అనుభవించే భార్యల్లో కొందరికి ఇది తమ ఖర్మ అనే ఫీలింగ్ తప్ప... దీన్ని ఎదుర్కోవాలనిపించడం, పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించడం కూడా ఉండదు. అలా మొదలయ్యే ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’లో ఆ మహిళ... తన భర్త అలా హింసిస్తుండటాన్ని కూడా తన తప్పుగానే అనుకుంటూ ‘అపరాధభావన’తో బాధపడుతుంటుంది.సిండ్రోమ్ తాలూకు నాలుగు దశలివి... బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్కు దారితీసే వాళ్ల వాళ్ల ఇంటి పరిస్థితులు ప్రతి మహిళకూ వేర్వేరుగా ఉన్నప్పటికీ... వారు అనుభవించే కొన్ని కామన్ దశలను బట్టి చూసినప్పుడు వారి మానసిక స్థితి ఈ కింద పేర్కొన్న నాలుగు దశల్లో కొనసాగుతుంది. మొదటి రెండు దశల్లో మహిళలు నిశ్శబ్దంగా తమ వేదనలు అనుభవించినప్పటికీ... ఈ వేదనల నుంచి బయటకు వచ్చేందుకు తాము చేసే ప్రయత్నాలు ఈ చివరి రెండు దశల్లో కొంతమేర జరుగుతాయి. 1. డీనియల్ : తాము వేదన అనుభవిస్తున్న సంగతి తెలియని పరిస్థితి ఇది. భర్త తమను వేధిస్తున్నారని కూడా వాళ్లు అంగీకరించరు. అదేదో ఈసారికి అలా జరిగింది తప్ప భర్త తమను హింసిస్తున్నట్టు గుర్తించడానికి నిరాకరించే దశే ఈ ‘డీనియల్’. 2. గిల్టీ (అపరాధభావన) : భర్త తనను హింసించడానికి లేదా కొట్టడానికి ఒక రకంగా తాను చేసిన తప్పే అని సర్దిచెప్పుకునే ధోరణే ఈ అపరాధభావనకు కారణం. 3. ఎన్లైట్మెంట్ : భర్త చేతుల్లో ఇలా తరచూ హింసకు గురికావడం తమకు తగదనీ, దాన్నుంచి బయటకు రావాలనే భావన కలగడం ఈ ఎన్లైట్మెంట్ దశలో జరుగుతుంది. 4. రెస్పాన్సిబిలిటీ : ఈ దశలో వారు తామీ హింస నుంచి బయటపడటం అన్నది తమ చేతుల్లోనే ఉందనీ, అది తమ బాధ్యత అని గ్రహిస్తారు. అవసరమైతే బంధం నుంచి బయటపడైనా ఈ హింసనుంచి విముక్తి పొందవచ్చని అనుకునే దశ ఇది. బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ మొదలయ్యేదిలా... మొదట్లో ఏదో మనస్పర్థల కారణంగా భర్త ఆగ్రహానికి గురైనప్పుడు మహిళ అంతగా ప్రతిఘటించక΄ోవచ్చు. ఇది పెళ్లయిన కొత్తలో ఇలా జరగడానికి అవకాశముంది. భర్త తొలుత శారీరకంగానో లేదా మానసికంగానో బాధపెట్టాక ఎందుకో అలా జరిగి΄ోయిందనీ, ఇకపై అలా జరగదంటూ ఎమోషనల్గా మాట్లాడతాడు. ఆమె ఆమోదం పొందడం కోసం అవసరమైనదానికంటే ఎక్కువ రొమాంటిక్గా వ్యవహరిస్తూ ఆమెను నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ హింస అక్కడితో ఆగకుండా అదేపనిగా మాటిమాటికీ కొనసాగుతూ ఉంటుంది. దాంతో తొలుత అతడు చెప్పే (కన్వీన్స్ చేసే) అంశాలకు లొంగి΄ోయిన మహిళ ఆ తర్వాత అదో రొటీన్ తంతు అని గ్రహించి, పెద్దగా స్పందించడమూ మానేస్తుంది. అలా గృహహింస వేదనలకు గురవుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి ఆర్థిక సమస్యలూ, విడి΄ోతామేమోనన్న భయం, తనను తాను సముదాయించుకునే సర్దుబాటు ధోరణీ... ఇలాంటి కారణాలు చాలానే ఉండవచ్చు.నిర్వహణ: యాసీన్ప్రభావాలు... స్వల్పకాలిక ప్రభావాలివి... జీవితం వృథా అనుకోవడం, తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్) ఆత్మవిశ్వాసం లోపించడం (లో సెల్ఫ్ ఎస్టీమ్) తీవ్రమైన ఉద్విగ్నత (సివియర్ యాంగ్జైటీ).దీర్ఘకాలిక ప్రభావాలివి... తరచూ గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లడం, తానేమిటో మరచి΄ోయి వేరేగా ప్రవర్తించడం (డిసోసియేటివ్ స్టేట్), తీవ్రంగా ప్రతిస్పందించడం (వయొలెంట్ ఔట్బరస్ట్... ఇది సుదీర్ఘకాలం తర్వాత వచ్చే పరిణామం) హైబీపీ, గుండెజబ్బుల వంటివి కనిపించడం, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ దీర్ఘకాలికం (క్రానిక్)గా వచ్చే వెన్నునొప్పి, తలనొప్పి.బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్కు ఇవే గుర్తులు... హింసించే తన భర్తకు అన్నీ తెలుసు... తనకేమీ తెలియనందువల్ల తనవల్లనే తప్పు జరిగిందేమోననే అపరాధభావన ∙జరిగిందానికి తామే బాధ్యురాలినేమో అనే భావనతో కలిగే వేదన ∙జరిగిందీ, తాను అనుభవించిన వేదనను తమ ఇంటివాళ్లకూ, ఫ్రెండ్స్కూ చెప్పక΄ోవడం ∙పిల్లల జీవితం ఏమై΄ోతుందోనన్న తీవ్రమైన ఆందోళన. -
ఇంటి హింస ఇంతింతై!
పెళ్లి తర్వాత భర్త లేదా జీవిత భాగస్వామి పెట్టే వేదనలను అనుభవించే భార్యల్లో కొందరికి ఇది తమ ఖర్మ అనే ఫీలింగ్ తప్ప... దీన్ని ఎదుర్కోవాలనిపించడం, పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించడం కూడా ఉండదు. అలా మొదలయ్యే ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’లో ఆ మహిళ... తన భర్త అలా హింసిస్తుండటాన్ని కూడా తన తప్పుగానే అనుకుంటూ ‘అపరాధభావన’తో బాధపడుతుంటుంది.సిండ్రోమ్ తాలూకు నాలుగు దశలివి...బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్కు దారితీసే వాళ్ల వాళ్ల ఇంటి పరిస్థితులు ప్రతి మహిళకూ వేర్వేరుగా ఉన్నప్పటికీ... వారు అనుభవించే కొన్ని కామన్ దశలను బట్టి చూసినప్పుడు వారి మానసిక స్థితి ఈ కింద పేర్కొన్న నాలుగు దశల్లో కొనసాగుతుంది. మొదటి రెండు దశల్లో మహిళలు నిశ్శబ్దంగా తమ వేదనలు అనుభవించినప్పటికీ... ఈ వేదనల నుంచి బయటకు వచ్చేందుకు తాము చేసే ప్రయత్నాలు ఈ చివరి రెండు దశల్లో కొంతమేర జరుగుతాయి.1. డీనియల్ : తాము వేదన అనుభవిస్తున్న సంగతి తెలియని పరిస్థితి ఇది. భర్త తమను వేధిస్తున్నారని కూడా వాళ్లు అంగీకరించరు. అదేదో ఈసారికి అలా జరిగింది తప్ప భర్త తమను హింసిస్తున్నట్టు గుర్తించడానికి నిరాకరించే దశే ఈ ‘డీనియల్’.2. గిల్టీ (అపరాధభావన) : భర్త తనను హింసించడానికి లేదా కొట్టడానికి ఒక రకంగా తాను చేసిన తప్పే అని సర్దిచెప్పుకునే ధోరణే ఈ అపరాధభావనకు కారణం.3. ఎన్లైట్మెంట్ : భర్త చేతుల్లో ఇలా తరచూ హింసకు గురికావడం తమకు తగదనీ, దాన్నుంచి బయటకు రావాలనే భావన కలగడం ఈ ఎన్లైట్మెంట్ దశలో జరుగుతుంది.4. రెస్పాన్సిబిలిటీ : ఈ దశలో వారు తామీ హింస నుంచి బయటపడటం అన్నది తమ చేతుల్లోనే ఉందనీ, అది తమ బాధ్యత అని గ్రహిస్తారు. అవసరమైతే బంధం నుంచి బయటపడైనా ఈ హింసనుంచి విముక్తి పొందవచ్చని అనుకునే దశ ఇది.బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ మొదలయ్యేదిలా...మొదట్లో ఏదో మనస్పర్థల కారణంగా భర్త ఆగ్రహానికి గురైనప్పుడు మహిళ అంతగా ప్రతిఘటించకపోవచ్చు. ఇది పెళ్లయిన కొత్తలో ఇలా జరగడానికి అవకాశముంది. భర్త తొలుత శారీరకంగానో లేదా మానసికంగానో బాధపెట్టాక ఎందుకో అలా జరిగిపోయిందనీ, ఇకపై అలా జరగదంటూ ఎమోషనల్గా మాట్లాడతాడు. ఆమె ఆమోదం పొందడం కోసం అవసరమైనదానికంటే ఎక్కువ రొమాంటిక్గా వ్యవహరిస్తూ ఆమెను నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తాడు.కానీ ఈ హింస అక్కడితో ఆగకుండా అదేపనిగా మాటిమాటికీ కొనసాగుతూ ఉంటుంది. దాంతో తొలుత అతడు చెప్పే (కన్వీన్స్ చేసే) అంశాలకు లొంగిపోయిన మహిళ ఆ తర్వాత అదో రొటీన్ తంతు అని గ్రహించి, పెద్దగా స్పందించడమూ మానేస్తుంది. అలా గృహహింస వేదనలకు గురవుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి ఆర్థిక సమస్యలూ, విడిపోతామేమోనన్న భయం, తనను తాను సముదాయించుకునే సర్దుబాటు ధోరణీ... ఇలాంటి కారణాలు చాలానే ఉండవచ్చు. -నిర్వహణ: యాసీన్చికిత్స... ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. వారు అనుభవించిన, అనుభవిస్తున్న బాధలూ లేదా వారిలో వ్యాధి తీవ్రతను బట్టి కౌన్సెలింగ్, ఇంటర్పర్సనల్ థెరపీ, అవసరాన్ని బట్టి కొన్ని యాంటీ డిప్రెసెంట్ మందులు వాడాల్సి ఉంటుంది. ఇక సామాజికంగా ఈ వేదననుంచి విముక్తి కావడం కోసం వారి కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల సంప్రదింపుల తర్వాత పోలీసులను సంప్రదించడం వంటి ప్రత్యామ్నాయాలూ అనుసరించవచ్చు.గుర్తించడం ఎలా...కొన్ని గుర్తుల (లక్షణాల) ఆధారంగా ఓ మహిళ బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ బారిన పడిందని గుర్తించవచ్చు. అవి... ∙తాను నలుగురిలో కలవకపోవడం... ఎందుకని అడిగినప్పుడు ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉండటం ∙భర్త వచ్చే టైమ్కు చాలా తీవ్రమైన ఉద్నిగ్నానికీ, ఆందోళనకు లోనవుతుండటం⇒ దేహంపై కనిపించే గాయాల గురించి అడిగితే ఏవేవో పొంతనలేని కారణాలు చెప్పి దాటవేయడానికి చూడటం. దుస్తులను గాయాలను దాచేలా సర్దుతుండటం. (ఉదాహరణకు మంచి వేసవిలోనూ దేహమంతా కప్పివేసే దుస్తులు ధరించడం) ∙తన ఉద్యోగం కారణంగా వచ్చే జీతం వంటివన్నీ తన భర్త అధీనంలోనే ఉంచడం⇒ భర్తనుంచి ఏదైనా కాల్ రాగానే తీవ్రమైన కలవరపాటుకు గురవుతుండటం.ప్రభావాలు...స్వల్పకాలిక ప్రభావాలివి...⇒ జీవితం వృథా అనుకోవడం, తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్) ∙ఆత్మవిశ్వాసం లోపించడం (లో సెల్ఫ్ ఎస్టీమ్) ∙తీవ్రమైన ఉద్విగ్నత (సివియర్ యాంగై్జటీ).దీర్ఘకాలిక ప్రభావాలివి...⇒ తరచూ గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లడం, తానేమిటో మరచిపోయి వేరేగా ప్రవర్తించడం (డిసోసియేటివ్ స్టేట్), తీవ్రంగా ప్రతిస్పందించడం (వయొలెంట్ ఔట్బరస్ట్... ఇది సుదీర్ఘకాలం తర్వాత వచ్చే పరిణామం) హైబీపీ, గుండెజబ్బుల వంటివి కనిపించడం, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ దీర్ఘకాలికం (క్రానిక్)గా వచ్చే వెన్నునొప్పి, తలనొప్పి.డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై హెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ – సీనియర్ సైకియాట్రిస్ట్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్ -
అన్నా.. ప్లీజ్ అన్నా.. వద్దన్నా..!
బైక్పై వెళ్తున్న టైంలో హఠాత్తుగా అతను నా కాళ్లపై చేతులు వేశాడు. వద్దని చెప్పినా మళ్లీ మళ్లీ అదే పని చేశాడు. నా గుండె ఆగినంత పనైంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉండిపోయా. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు ఎదురు కాకూడదని కోరుకుంటున్నా.. ఇన్స్టాగ్రామ్లో ఓ బైక్ డ్రైవర్తో తనకు ఎదురైన పరిస్థితిని ఓ యువతి పంచుకోగా అది నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించాల్సిన పరిస్థితి ఎదురైంది. మెట్రో నగరం బెంగళూరులో ఓ యువతితో బైక్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. బైక్పై వెళ్తున్న సమయంలో ఆమెను తాకుతూ ఇబ్బంది పెట్టాడు. ఈ వేధింపులను ఆ యువతి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గురువారం సాయంత్రం విల్సన్ గార్డెన్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో నేపథ్యం, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి చర్చ్ చర్చ్ స్ట్రీట్ నుంచి తాను ఉండే హాస్టల్కు ర్యాపిడో ద్వారా బైక్ రైడ్ను బుక్ చేసుకుంది. ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి కెప్టెన్ తన చేతులతో ఆమె తొడలను తాకడం ప్రారంభించాడు. దీంతో ఆమె అతన్ని వారించింది. అయినా కూడా పట్టించుకోకుండా అతను అదే పని చేస్తూ ఉండిపోయాడు. దీంతో ఆమె ‘‘అన్నా.. ఏం చేస్తున్నావ్?.. వద్దన్నా..’’ అంటూ బతిమాలుకుంది. అయినా ఆ కామాంధుడు వినలేదు. ఈలోపు.. తన గమ్యస్థానం రావడంతో ఆమె దిగేసింది. ఆ సమయంలోనూ ఆమె ఇబ్బందిని గమనించిన ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశాడు. జరిగిందంతా చెప్పడంతో ఆ వ్యక్తి ఆ కెప్టెన్ను నిలదీశాడు. దీంతో తప్పైపోయిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోసాగాడు. కాస్త దూరం వెళ్లాక యువతిని చూస్తూ చేతులతో అసభ్య సంజ్ఞలు చేశాడు. దీంతో ఆమె భరించలేకపోయింది. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.తాను సిటీకి కొత్త అని, అందుకే ఆ రైడ్ను మధ్యలో ఆపలేకపోయానని, ఇలాంటి ఘటనలు కొత్త కాకపోయినా తనకు ఎదురైన అనుభవం మరేయితర మహిళకు ఎదురుకాకూడదని, ఇలాంటి ప్రయాణాల్లో ఒంటరి మహిళలు భద్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ పోస్ట్ చేసింది. నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నట్లు విల్సన్ గార్డెన్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ర్యాడిడో సంస్థ స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: తుపాకులు కావాలా? ల్యాప్ట్యాప్లు కావాలా? -
నగల దుకాణంలో ‘అమ్మగారికి’ దేహశుద్ధి
నగలు, బట్టల దుకాణాల్లో చేతివాటం చూపించే మహిళా దొంగల గురించి చాలా వీడియోలు చూశాం. కానీ నగల దుకాణంలో చోరీకి ప్రయత్నించి చావు దెబ్బల తిన్న వైనం నెట్టింట వైరల్గా మారింది. గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఒక ఆభరణాల దుకాణంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. నవంబర్ 3న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన CCTVలో రికార్డయింది. దీని ప్రకారం అహ్మదాబాద్లోని రాణిప్ కూరగాయల మార్కెట్ సమీపంలోని బంగారం మరియు వెండి దుకాణంలోకి కస్టమర్గా ఒక మహిళ జ్యుయల్లరీ దుకాణంలోకి ప్రవేశించింది. దుపట్టా అడ్డం పెట్టుకుని, అదును చూసి దుకాణ యజమానిపై కారంపొడి చల్లి అందినంతా దోచుకోవాలని ప్రయత్నించింది. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. ఊహించని పరిస్థితి ఎదురైంది. మహిళ చోరకళను గుర్తించిన దుకాణదారుడు తక్షణమే అలర్ట్ అయిపోయాడు. వెంటనే లేచి చెంపలు పగలగొట్టేశాడు. 25 సెకన్లలో దాదాపు దాదాపు 20 సార్లు కొట్టాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించి దుకాణదారుడు ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. విచారణ జరుగుతోంని రాణిప్ పోలీస్ స్టేషన్ పిఐ కేతన్ వ్యాస్ తెలిపారు. అమ్మగారికి తగిన శాస్తి జరిగింది, సీన్ సితార్ అయ్యింది అంటు నెటిజన్లు పలు రకాలుగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తండ్రి త్యాగం, కొడుకు సర్ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగం In Ahmedabad, a woman tried to rob a jewelry store owner by throwing red chili powder into his eyes.Even after the chili got into his eyes, the owner stood strong.#IPL2026 #Kumbha #Fourthnattawat pic.twitter.com/rAqmVDlVpo— 🦋 KOMAL SINGH🦋 💯 Follow Back (@Singh_Komall) November 7, 2025 -
విశాఖ: వృద్ధురాలి మృతి కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పెందుర్తిలో అత్త జయంతి కనక మహాలక్ష్మి (66) అనుమానాస్పద మృతి కేసులో హత్య కోణం బయటపడింది. కోడలు సినీ పక్కిలో పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.కోడలు, మనవరాలు ‘దొంగ-పోలీస్’ ఆట పేరుతో అత్తను కుర్చీకి కాళ్లను తాళ్లతో బంధించారు. కళ్లకు గంతలు కట్టి కదలకుండా బంధించిన కోడలు.. అనంతరం కుర్చీలో కదలలేని పరిస్థితుల్లో ఉన్న అత్తపై పెట్రోల్ పోసి.. దేవుడి గదిలో ఉన్న దీపం విసిరి నిప్పంటించింది.అనంతరం కోడలు.. అగ్ని ప్రమాదం జరిగిందంటూ అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. మొదట అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తనపై అనవసరంగా చిరాకు పెడుతుందనే కారణంతోనే అత్తను హతమార్చినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. భార్యాభర్తలు సుబ్రహ్మణ్య శర్మ, లలిత, మనవడు, మనవరాలు, అత్త జయంతి కనకమాలక్ష్మి పెందుర్తి అప్పన్నపాలెంలో నివాసముంటున్నారు. -
తిరుమల కొండపై ఏడు అడుగుల మహిళ (ఫోటోలు)
-
అయ్య బాబోయ్.. ఎంత పొడవో!
తిరుమలలో ఏడు అడుగుల పొడవైన మహిళ సందడి చేశారు. సోమవారం ఉదయం వానమామలై పీఠాధిపతి జీయర్ స్వామి, ఆయన శిష్య బృందంతోపాటు ఏడు అడుగుల పొడవున్న శ్రీలంకకు చెందిన నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆమె ఎత్తును చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. -
‘నాడు ఎనిమిదింటికే రమ్మన్నారు?’.. మమతపై బీజేపీ విసుర్లు
న్యూఢిల్లీ: తొలిసారి వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకూ అంతా భారత మహిళా క్రికెట్ జట్టును అభినందిస్తున్నారు. అయితే ఇదేవిధంగా వ్యవహరించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి.పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేసిన దరిమిలా, అది రాజకీయ చర్చకు దారి తీసింది. మహిళలు అర్థరాత్రి బయటకు వెళ్లడంపై మమతా గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోమారు తెరపైకి వచ్చాయి. బీజేపీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ మమతను ఎద్దేవా చేసింది. వివరాల్లోకి వెళితే సీఎం మమత భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ ‘ఎక్స్’ పోస్టులో ‘ఈ రోజు, ప్రపంచ కప్ ఫైనల్లో ఘన విజయం సాధించిన మా ‘ఉమెన్ ఇన్ బ్లూ’ను చూశాక దేశమంతా గర్విస్తోంది. వారు చూపిన ప్రతిభ, టోర్నమెంట్లోవారి అద్భుత ప్రదర్శన తరతరాలుగా యువతులకు ప్రేరణగా నిలుస్తుంది. మీరు అత్యున్నత స్థాయిలో ఆడి, ప్రపంచ స్థాయి జట్టు అని నిరూపించారు. మీరు మాకు కొన్ని అద్భుత క్షణాలను అందించారు. మీరే మా హీరోలు. భవిష్యత్తులో భారీ విజయాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. మేము మీకు తోడుగా నిలుస్తాం’అని రాశారు.భారత మహిళా క్రికెట్ జట్టును ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించిన తీరును పలువురు మెచ్చుకున్నారు. అయితే ఇంతలోనే ఇది రాజకీయ మలుపు తీసుకుంది. గతంలో దుర్గాపూర్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జరిగిన సామూహిక అత్యాచారం కేసు విషయంలో మమతా బెనర్జీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తాజాగా బీజేపీ గుర్తు చేసింది. వెస్ట్ బెంగాల్ బీజేపీ ఒక ట్వీట్ చేస్తూ.. ‘దేవుడా.. వాళ్లు 12 గంటల వరకు ఆడారు. మీరేమో వాళ్లని 8 గంటలలోపు ఇంట్లో ఉండమని చెప్పారు’ అని రాసింది. గత అక్టోబర్లో మమతా బెనర్జీ వైద్య విద్యార్థినిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, బాధితురాలు రాత్రి 12.30 గంటలకు బయటకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ముఖ్యంగా రాత్రిపూట ఆడపిల్లను బయటకు రానివ్వకూడదు. వారు స్వీయ రక్షణలో ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. నాడు బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాలలో ఆగ్రహాన్ని తెప్పించాయి. మమత.. రాష్ట్ర శాంతిభద్రతలను కాపాడేందుకు బదులు బాధితురాలిని నిందించారని పలువురు ఆరోపించారు.ఇది కూడా చదవండి: ఉద్యోగం కోసం ఎమ్మెల్యేపై దాడి?.. యువకుడు అరెస్ట్ -
కలల్ని అమ్ముకున్నారు.. ఇప్పుడు స్థానం లేదంటారా?
అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్కు ఊహించని పరిణామం ఎదురైంది. వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని భారతీయ మూలాలున్న ఓ యువతి వాన్స్ ముఖం మీదే ఎండగట్టింది. అంతేకాదు.. ఆయన వ్యక్తిగత జీవితంపైనా ఆమె వేసిన ఓ ప్రశ్నతో ఆయన ఇబ్బందిపడినట్లు కనిపించారు. అమెరికాలోని మిసిసిప్పీ విశ్వవిద్యాలయంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ Turning Point USA అనే ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వాన్స్ ప్రసంగిస్తూ.. అమెరికాలో కఠినమైన వీసా పరిశీలన విధానానికి (strict vetting process) మద్దతు ప్రకటించారు. అమెరికాలోకి చట్టబద్ధంగా వచ్చే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో.. భారతీయ సంతతికి చెందిన ఓ యువతి మైక్ అందుకుంది. ఆయన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ‘‘మీరు ఇంతకాలం అమెరికా కలల్ని మాకు అమ్మారు, మా యవ్వనాన్ని, సంపదను ఖర్చు పెట్టించారు. అలాంటిది ఇప్పుడేమో ఎక్కువ మంది వస్తున్నారు.. వాళ్లను వెనక్కి పంపాలి అంటారా?.. మాకు ఇక్కడ స్థానం లేదంటారా?. మేము చట్టబద్ధంగా వచ్చాం, మీ నిబంధనలు పాటించాం. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి చెందనివాళ్లమంటారా?’’ అని వాన్స్ను నిలదీశారు. ఆ సమయంలో.. A brave young woman asks JD Vance: “When you talk about too many immigrants here, when did you guys decide that number? Why did you sell us a dream? You gave us the path and now tell us we don't belong here? Why do you have to be Christian to be American?” pic.twitter.com/mQ3CTAnN58— The Tennessee Holler (@TheTNHoller) October 30, 2025కొందరు చప్పట్లు చరుస్తూ ఆమెను అభినందించడం గమనార్హం. అయితే వాళ్లను వారిస్తూ ఆమె ఈ ప్రశ్నతో గొడవ చేయాలన్నది తన ఉద్దేశం కాదంటూ స్పష్టం చేశారు. దానికి వాన్స్ సమాధానం ఇవ్వలేదు. బదులుగా.. అత్యధిక ఇమ్మిగ్రేషన్ అమెరికా సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని.. కొంతమంది అక్రమ వలసదారులు దేశానికి మేలు చేశారని.. అంతమాత్రాన అందువల్ల లక్షల మందిని అనుమతించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు. ఆ వెంటనే.. ఆ యువతి.. అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్ కావాల్సిందేనా? అని అడిగింది. దానికి వాన్స్ స్పందిస్తూ తాను మత బోధనను విశ్వసిస్తానని.. తన భార్య కూడా భవిష్యత్తులో అదే విశ్వాసాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే, ఆమెకు స్వేచ్ఛ ఉందని, అది తనకు సమస్య కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. వాన్స్ వైఖరిపై ఇండో అమెరికన్లు మండిపడుతున్నారు. హిందూ భార్యను కలిగి ఉండి, మతపరమైన మార్పును ఆశించడం ద్వంద్వ వైఖరేనంటూ పలువురు వ్యాఖ్యానించారు. వాన్స్ వివాహం వేద హిందూ సంప్రదాయంలో జరిగినదని కూడా కొందరు గుర్తు చేశారు. వాన్స్ను ప్రశ్నించిన ఆమె ఎవరన్నదానిపై ఇంకా స్పష్ట త రావాల్సి ఉంది.When JD Vance had hit his lowest, it was his “Hindu” wife and her Hindu upbringing that had helped him navigate through the tough times. Today in a position of power, her religion has become a liability. What a fall. What an epic fall for the man. pic.twitter.com/Zvz7bFQ0hZ— Monica Verma (@TrulyMonica) October 30, 2025 -
ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..
గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్లో పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించనుంది పుణేకి చెందిన రేసర్ డయానా పండోలె. ఈ ఛాంపియన్షిప్ నవంబర్లో మొదలవుతుంది. ఫెరారీ 296 చాలెంజ్ కారుతో దూసుకుపోనుంది. డయాన. ఫెరారీ 296 అనేది ఇటాలియన్ బ్రాండ్కు సంబంధించిన అత్యాధునిక, ట్రాక్–ఫోకస్ట్ మెషీన్.‘రేసింగ్’ అనేది డయానా ఎవరి నోటి నుంచో విన్న మాట కాదు. చిన్నప్పటి నుంచే రేసింగ్కు సంబంధించిన కబుర్లు ఇంట్లో వినేది. అమ్మా,నాన్నలకు రేసింగ్ అంటే ఇష్టం. కాలక్రమంలో వారి ఇష్టమే తన ఇష్టంగా మారింది.మొదట బైక్ నేర్చుకుంది. ఆ తరువాత కారు నడపడం నేర్చుకుంది. ఆ తరువాత రేస్ కార్లతో దూసుకుపోయేది. డయానాలో ఉత్సాహమే కాదు దానికి తగిన శక్తి,సామర్థ్యాలు ఉన్నాయి. అందుకే ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ను గెల్చుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది డయానా.పోటీలకు సంబంధించి పెళ్లికి ముందు ఉన్న ఉత్సాహం పెళ్లయిన తరువాత కొద్దిమందిలో కనిపించదు. ఇద్దరు పిల్లల తల్లి అయిన 32 ఏళ్ల డయానాలో మునపటి ఉత్సాహం ఎంతమాత్రం తగ్గలేదు. తరగని ఆ ఉత్సాహమే గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్ పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా మరోసారి చరిత్ర సృష్టించేలా చేస్తోంది.(చదవండి: ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..) -
కారులో మహిళ.. కళ్లు తెరిచేంతలో మృతి
పూణె: ప్రతిమనిషికి ఏదో ఒకరోజు మృత్యువు సంభవిస్తుందనేది అందరికీ తెలిసిందే. అయితే అది ఎలా వస్తుందనేది ఎవరూ చెప్పలేరు. కొందరికి ఎవరూ ఊహించని విధంగా మృత్యువు వాటిల్లుతుంది. ఇటువంటి ఘటనే అత్యంత ఖరీదైన కారులో విలాసవంతగా వెళుతున్న మహిళకు ఎదురయ్యింది. పూణే నుండి మాంగావ్కు వోక్స్వ్యాగన్ వర్టస్ కారులో వెళుతున్న ఒక మహిళ అకస్మాత్తుగా మృత్యువాత పడింది.కొండపై నుంచి ఒక పెద్ద బండరాయి ఆమె వెళుతున్న కారుపై పడి, అది కారు సన్రూఫ్ను చీల్చుకొని, అమాంతం కారులోని ఆమెపై పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలిని గుజరాత్కు చెందిన స్నేహల్(43)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని తమ్హిని ఘాట్లో చోటుచేసుకుంది.మరో ఘటనలో ముంబై నుండి జల్నాకు వెళుతున్న ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటన హైవేలోని నాగ్పూర్ లేన్లో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, అతని సహాయకునితో పాటు 12 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తమైన బస్సులోని ప్రయాణికులకు కిందకు దింపి, వారి ప్రాణాలను కాపాడాడు. ఇదేవిధంగా అక్టోబర్ 18న మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో వేగంగా వస్తున్న మినీ ట్రక్కు లోయలో పడటంతో ఎనిమిది మంది మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: Sudan: ఉపగ్రహ చిత్రాల్లో సామూహిక రక్తపాత దృశ్యాలు -
కిడ్నీ మార్పిడి కోసం కేన్సర్ రోగిని పెళ్లాడింది..కట్చేస్తే..!
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ..అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ ...అన్న పాట గుర్తుకొస్తుంది ఈ ఘటన. ఏదో వ్యాధుల కారణంగా.. అవసరార్థం పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఎలాంటి ప్రేమ, ఇష్టం వంటివి లేదు. రోగాల కారణంగా ఒక్కటయ్యారు..కానీ వారి మధ్య విడదీయరానంత ప్రేమ చిగురించేలా చేసి..అద్భుతమే చేసింది ఆ దంపతుల మధ్య. ఎవరా ఆ జంట..? ఏమా కథ చూసేద్దామా..!2014లో చైనాలోని షాంగ్జీకి చెందిన 24 ళ్ల వాంగ్ జియావో అనే మహిళ యురేమియా అనే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి ఎంతలా ఉందంటే..ఆమెకు మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స జరగకపోతే.. ఒక్క ఏడాదికి మించి బతకదని తేల్చి చెప్పేశారు వైద్యులు. అయితే ఆమెకు కిడ్నీ దానం చేసేందుకు సన్నిహితులు, బంధువులు ముందుకొచ్చినా..వాళ్లెవ్వరిది ఆమెకు సరిపోలేదు. ఓ పక్క సమయం మించిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో ఆమెకు కేన్సర్ పేషెంట్ అయిన జాంగ్ లియాంగ్ అనే వ్యక్తి ఓ విచిత్రమైనా ఆఫర్ ఇచ్చాడామెకు. "తాను కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని, చనిపోయేంతవరకు చికిత్స సమయంలో తనను ప్రేమగా చూసుకునే తోడు కోసం ఆశిస్తున్నానని, అందుకు ప్రతిగా తను మరణించాక కిడ్నీని ఇస్తానని చెబుతాడు". ఇక్కడ వాంగ్కి మరో ఛాన్స్లేదు. పైగా తక్కువ వ్యవధి ఉంది. మరోవైపు జాంగ్కి సంరక్షణ, ఒక తోడు కావాలి. దాంతో బాగా ఆలోచించి వాంగ్ ఓ ఒప్పందం ప్రకారం..జాంగ్ని పెళ్లి చేసుకుంది. ఒకరు మనుగడ కోసం, మరొకరు సంరక్షణ ఆశిస్తూ చేసుకున్న ఈ వివాహం వారి జీవితాను ఊహించిన మలుపు తిప్పింది.అద్భుతం చేసిన ప్రేమ..మొదట్లో ఒప్పందాల పెళ్లి కాస్త. .బలమైన బంధంగా మారిపోయింది. అతడి కోసం వంట చేసి, కీమోథెరపీ చికిత్సలలో జాంగ్ కోరిన సంరక్షణను అందించింది. వైద్య సమస్యల కారణంగా పరిచయమైన ఈ అపరిచిత జంట వారాలు గడుస్తున్న కొద్ది.. ఇద్దరి మధ్య అనురాగం ఏర్పడి..విడిచి ఉండలేనంతగా ప్రేమ చిగురించింది. అచ్చం ప్రేమికులు మాదిరిగా అయిపోయారు ఆ దంపతులు. దూకుడుగా ఉన్న జాంగ్ కేన్సర్ వాంగ్ సహచర్యం ప్రేమ కారణంగా మెరుగవ్వుతూ..వైద్యులే విస్తుపోయేలా తగ్గిపోయింది. మొత్తానికి ఆ మహమ్మారి కేన్సర్ని జయించాడు జాంగ్. అతడు బాగుండటమే చాలు అన్నంత స్థితికి వాంగ్ వచ్చేసింది కూడా. మొదట్లో తాను బతకాలని ఆశించినా .. రాను రాను అతడు ఉంటేనే తన ప్రాణం ఉంటుంది అన్నంతగా ప్రేమను పెంచేసుకుంది. ఇక్కడ వాంగ్కి జాంగ్ కిడ్నీ రాలేదు, అయినా అలా వ్యాధితో పోరాడతూనే ఉండాలనే ఫిక్స్ అయ్యింది. విచిత్రం ఏంటంటే..ఆ వ్యాధులు ఇద్దరిని దంపతులుగా చేసి, వాటిని క్యూర్ అయ్యేలా చేశాయి. ఇక్కడ వాంగ్కి కూడా మూత్రపిండాల వ్యాధి సివియర్గా లేదని మెరుగవ్వుతుందని, మందులతో నిర్వహించొచ్చని వైద్యులు చెప్పడం విశేషం. ఇలా జరుగుతుందని ఊహించను కూడా లేదని ఉబ్బితబ్బిబవ్వుతోంది ఆ జంట. ఈ స్టోరీ ప్రేమ గొప్పతనం ఏంటో చెప్పకనే చెబుతోంది. పైగా జీవిత పరమార్థమే తానని చెప్పకనే చెప్పేసింది ఈ రెండక్షరాల ప్రేమ ..! మనం కోసం ఓ వ్యక్తి ఉన్నారు అంటే ఎంతటి అగాథాన్ని అయినా..సవాలునైనా అధిగమించి సునాయసంగా బటయపడగలం అనేందుకు ఈ దంపతులే ఉదాహరణ. ఇక్కడ ఆ జంట విషయంలో ప్రేమ అద్భుతమే చేసింది కదూ..!. (చదవండి: Delhi Police constable Sonika Yadav: వెయిట్లిప్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!) -
తెలుగుదేశం పార్టీ నాయకుల కాల్ మనీ ఆగడాలకు బలి మహిళా
-
ఢిల్లీలో యువతిపై వేధింపులు.. యాసిడ్ దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ముకుంద్పూర్కు చెందిన ఓ యువతి ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుకుంటోంది. ఆదివారం అదనపు క్లాసులని కాలేజీ వైపు నడిచి వెళ్తున్న ఆమెను అదే ప్రాంతానికి చెందిన జితేందర్ బైక్పై ఇషాన్, అర్మాన్ అనే మరో ఇద్దరితో కలిసి వచ్చి అడ్డగించాడు. ఇషాన్ ఇచ్చిన బాటిల్ను ఓపెన్ చేసిన అర్మాన్ అందులోని యాసిడ్ను యువతి ముఖంపై చల్లాడు. రక్షణగా అడ్డు పెట్టుకున్న రెండు చేతులపై యాసిడ్ పడి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి బైక్పై పరార య్యారు. అనంతరం కుటుంబీలకు సాయంతో బాధితురాలు ఆస్పత్రికి చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా బాధితురాలిని జితే ందర్ వేధింపులకు గురి చేస్తున్నాడు. నెల రోజు ల క్రితం ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగింది. అప్పటి నుంచి వేధింపులు తీవ్రతర మయ్యాయి. ఈ మేరకు బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు యాసిడ్ చల్లినందుకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ సాయంతో వారిని పట్టుకు నేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
ప్రభుత్వ తీరుకు నిరసనగా ఫ్రీ బస్సులో టికెట్ తీసుకున్న మహిళ
కర్నూలు (అగ్రికల్చర్): ‘ఉచిత బస్సు కావాలని ఎవరడిగారు. ఉల్లి సాగుచేసి నాశనమయ్యాం. క్వింటాలు ఉల్లిని రూ.200కు అడుగుతున్నారు. రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. రైతులను పట్టించుకునే వారు లేరు. 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్నారు. ఇంతవరకు కొత్త పింఛన్లే లేవు. ఉచిత బస్సు ప్రయాణం వద్దు. టికెట్ ఇవ్వండి’ అంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ టికెట్ తీసుకున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న కొట్టాల గ్రామానికి చెందిన సుంకులమ్మ వెల్దుర్తి మండలంలోని బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వెల్దుర్తిలో బస్సు ఎక్కి చిన్నటేకూరుకు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకునే సమయంలో ఉచిత బస్సు వద్దని, రైతుల్ని ఆదుకోవాలని ఆమె నినాదాలు చేశారు. -
అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి..
ఫరీదాబాద్: హర్యానాలోని గ్రేటర్ ఫరీదాబాద్లో దారుణం చోటుచేసుకుంది. తల్లి తమతో పాటు ఉండకూడదని భార్య, అత్తామామలు, బావమరుదులు వేధిస్తుండటంతో తీవ్రంగా కలత చెందిన ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన కుమార్ గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రేడియోథెరపిస్ట్గా పనిచేస్తున్నాడు. అతనికి తొమ్మిదేళ్ల క్రితం నేహా రావత్తో వివాహం జరిగింది. వారికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఈ దంపతులు గతంలో నోయిడాలో ఉండేవారు. అక్కడ నేహా ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేది.. మృతుడి మామ ప్రకాష్ సింగ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో వారు కుమార్తెను చూసుకోలేకపోయారు. ఈ నేపధ్యంలో యోగేష్ తన తల్లిని తమతో పాటు ఉండేలా చూసుకోవాలని అనుకున్నాడు. అయితే నేహా ఇందుకు అంగీకరించలేదు.ఆరు నెలల క్రితం యోగేష్ తన కుమార్తెతో సహా గ్రేటర్ ఫరీదాబాద్లోని సెక్టార్ 87లోని పెర్ల్ సొసైటీకి మారాడు. అయితే నేహా.. నోయిడా నుండి యోగేష్తో పాటు ఇక్కడికి రాలేదు. దీంతో యోగేష్ తమ కుమార్తెను చూసుకునేందుకు తన తల్లిని తీసుకువచ్చాడు. ఇంతలో నేహా తన యోగేష్తో పాటు ఉండేందుకు పెర్ల్ సొసైటీ అపార్ట్మెంట్కు వచ్చింది. తరువాత యోగేష్ తల్లి తమతో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నేహా తల్లిదండ్రులు, సోదరులు ఆశిష్ రావత్, అమిత్ రావత్ కూడా ఈ విషయమై యోగేష్తో గొడవ పడ్డారు. దీంతో యోగేష్ తీవ్రంగా కలత చెందాడు.గురువారం, యోగేష్ తన భార్య నేహాను గ్వాలియర్లోని తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తూ, నేహాను నోయిడాలో దింపి, ఒంటరిగా తమ అపార్ట్మెంట్కు తిరిగి వచ్చాడు. శుక్రవారం రాత్రి పెర్ల్ సొసైటీలోని 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతని మామ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మృతుని భార్య నేహా రావత్, అత్త శాంతి రావత్, మామ వీర్ సింగ్ రావత్, నేహా సోదరులు ఆశిష్, అమిత్ రావత్ లపై కేసు నమోదు చేశామని భూపాని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంగ్రామ్ దహియా మీడియాకు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: కెనడాపై ఉరిమిన ట్రంప్.. సుంకాలు 10 శాతం పెంపు -
‘మహిళ వేషంలో బిన్ లాడెన్’.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సంచలంగా మారింది. 2001, సెప్టెంబర్ 11 ఉగ్ర దాడులతో అమెరికాకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా మారిన అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్.. మహిళ వేషంలో టోరా బోరా కొండల నుండి తప్పించుకున్నాడని కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) మాజీ అధికారి జాన్ కిరియాకౌ తాజాగా వెల్లడించారు. 2001లో టోరా బోరా కొండలలో అమెరికా దళాలు ఒసామా బిన్ లాడెన్ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు, అతడు మహిళా వేషం ధరించి అక్కడి నుంచి తప్పించుకున్నాడని తెలిపారు.జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా సైన్యంలో రహస్యంగా చొరబడిన అల్ ఖైదా కార్యకర్త సహాయంతో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. మహిళ వేషం వేసుకుని, టోరా బోరా నుంచి తప్పించుకున్నాడని తెలిపారు. సీఐఏలో 15 ఏళ్లు పనిచేసి, పాకిస్తాన్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు నాయకత్వం వహించిన కిరియాకౌ, అమెరికాలో సైనిక శ్రేణుల్లో అల్ ఖైదా కార్యకర్తల చొరబాట్లను తెలియజేశారు. 9/11 దాడుల అనంతరం అమెరికా సంయమనంగా వ్యవహరించింది, ఆఫ్ఘనిస్తాన్లో బాంబు దాడులను చేపట్టేందుకు నెల్లాళ్లు వేచివుందన్నారు. ఈ తరుణంలోనే అల్ ఖైదా చొరబాటుదారునిగా తేలిన అనువాదకుడు ఉగ్రవాది బిన్ లాడెన్ తప్పించుకునేందుకు అవకాశం కల్పించాడని తెలిపారు. EP-10 with Former CIA Agent & Whistleblower John Kiriakou premieres today at 6 PM IST“Osama bin Laden escaped disguised as a woman...” John Kiriakou“The U.S. essentially purchased Musharraf. We paid tens of millions in cash to Pakistan’s ISI...” John Kiriakou“At the White… pic.twitter.com/pM9uUC3NIC— ANI (@ANI) October 24, 2025లాడెన్ తప్పించుకున్న ఘటన దరిమిలా యూఎస్ ఉగ్రవాద నిరోధక దృష్టి పాకిస్తాన్ వైపు మళ్లిందని జాన్ కిరియాకౌ తెలిపారు. ఈ నేపధ్యంలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్తో చర్చలు జరిగాయని, అతను అమెరికా నుంచి ఆర్థిక, సైనిక సహాయానికి బదులుగా దేశంలోకి యూఎస్ కార్యకలాపాలను అనుమతించాడని పేర్కొన్నారు. అదే సమయంలో సీఐఏ పాకిస్తాన్ గ్రూప్ లష్కరే తోయిబా, అల్-ఖైదా మధ్య గల సంబంధాలను గుర్తించిందన్నాను. ఇది అమెరికా నిఘా వ్యవహారాల్లో మైలురాయిగా నిలిచిందన్నారు.భారత్-పాక్ల గురించి మాట్లాడిన జాన్ కిరియాకౌ 2002లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందని అమెరికా నిఘా సంస్థలు భయపడ్డాయని, పార్లమెంట్ దాడి, ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో పెరిగిన ఉద్రిక్తతలే దీనికి కారణమన్నారు. నాడు అమెరికా ఈ ముప్పును తీవ్రంగా పరిగణించిందని, అందుకే ఇస్లామాబాద్ నుండి అమెరికన్ కుటుంబాలను ఖాళీ చేయించామని అన్నారు. ఆ సమయంలో వాషింగ్టన్ దృష్టి అల్ ఖైదా, ఆఫ్ఘనిస్తాన్పైననే ఉందని, అందుకే భారతదేశ ఆందోళనలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన వివరించారు.2008 ముంబై దాడుల గురించి కిరియాకౌ మాట్లాడుతూ ఈ దాడుల వెనుక పాకిస్తాన్ మద్దతు కలిగిన కశ్మీరీ ఉగ్రవాద గ్రూపుల హస్తం ఉందని అమెరికా నిఘా సంస్థలు భావించాయన్నారు. పాకిస్తాన్.. భారతదేశంలో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని ఆయన అన్నారు. పార్లమెంట్, ముంబై దాడుల తర్వాత భారత్ సంయమనం పాటించిందని, అయితే ఇప్పుడు భారత్ వ్యూహాత్మక సహనాన్ని కలిగి ఉండలేని స్థితిలో ఉందని ఆయన అన్నారు. ఎప్పుడు యుద్ధం వచ్చినా, భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోతుందని ఆయన కిరియాకౌ హెచ్చరించారు. నిరంతరం భారతీయులను రెచ్చగొట్టడంలో అర్థం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, 2011 మే 2న అమెరికా నేవీ సీల్ టీమ్ 6 పాకిస్తాన్లోని అబోటాబాద్లో బిన్ లాడెన్ను హతమార్చినట్లు అధికారికంగా ప్రకటించబడింది. కేవలం 2001లో అమెరికా పట్టుకునేందుకు యత్నించిన సమయంలో లాడెన్ తప్పించుకున్నాడనేది మాజీ సీఐఏ అధికారి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. -
మంత్లీ మ్యారేజ్ రివ్యూ!
పుస్తక సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంకా చెప్పుకోవాలంటే నిర్ణీత కాలవ్యవధిలో చేసే ‘వ్యాపార సమీక్ష’ల గురించి మనకు తెలుసు. అయితే ‘మ్యారేజ్ రివ్యూ’ అనేది మనం ఎప్పుడూ విని ఉండలేదు. బెంగళూరుకు చెందిన టెక్ ప్రొఫెషనల్ ప్రతీమ్ భోస్లే, ఫ్రెంచ్ యువకుడు సచా ఎర్బోనెల్ను వివాహం చేసుకొని ఆమ్స్టర్డామ్లో స్థిరపడింది. ఇటీవల ఆమె ‘మంత్లీ మ్యారేజ్ పెర్ఫార్మెన్స్ రివ్యూ’ పేరుతో ‘ఎక్స్’లో షేర్ చేసిన పోస్ట్ నెటిజనులను నవ్వుల్లో ముంచెత్తడమే కాదు ఆలోచింపజేస్తోంది. ఈ పనులు సజావుగా జరుగుతున్నాయి, ఈ పనుల్లో ఇబ్బంది ఏర్పడుతుంది, మెరుగు పరుచుకోవాల్సిన విషయాలు... ఇలా రకరకాల కోణాలలో మ్యారేజ్ మంత్లీ రివ్యూ రాసింది ప్రతీమ్. రివ్యూలో భాగంగా కొన్ని తీర్మానాలు కూడా రాసింది.అనవసర సలహాలు ఇవ్వకూడదు.ఒకరి పనుల్లో ఒకరు సహాయం చేసుకోవాలి.'నీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను కదా’ ఇలాంటి మాటలతో తగాదాలకు ఆస్కారం ఇవ్వకూడదు.అనుకోకుండా తగాదా జరిగితే దాని గురించి సోషల్ మీడియాలో రాయకూడదు.‘నవ దంపతులు ప్రతీమ్–సచా ఎర్బోనెల్ మ్యారేజ్ రివ్యూను అనుసరించి తప్పొప్పులను బేరీజు వేసుకుంటే వారి సంసారంలో ఎలాంటి సమస్యలూ ఉండవు’ అని రాశాడు ఒక నెటిజనుడు. నిజమే కదా! (చదవండి: Prabhas Diet: హీరో ప్రభాస్ అన్ని గుడ్లు తినేవాడా? బాహుబలి డైట్ అలా ఉండేదా..?) -
ఆపరేషన్ మధ్యలో క్లారినెట్ వాయించిన మహిళ..! ఆశ్చర్యపోయిన వైద్యులు
ఇటీవల బ్రెయిన్కి సర్జరీ మెలుకువగా ఉండగా చేసిన ఘటనలు చూశాం. కొందరూ పాటలు, సినిమాలు చూస్తూ చేయించుకున్నారు. అదంతా ఒక ఎత్తైతే. బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా..మధ్యలో ఓ సంగీత వాయిద్యాన్ని వాయించింది ఒక మహిళ . వైద్యులు సైతం విస్తుపోయారు. దీని కారణంగా తమ సర్జరీ సక్సెస్ అనేది తక్షణమే నిర్థారించుకోగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. మరి ఆ ఆసక్తికర కథేంటో చకచక చదివేద్దామా..!.లండన్లో చోటుచేసుకుంది ఈ అద్భుత ఘటన. లండన్లో క్రౌబేర్కు చెందిన 65 ఏళ్ల డెనిస్ బెకన్(Denise Bacon) గత కొన్నేళ్లుగా పార్కిన్సన్స్తో(Parkinsons disease) బాధపడుతోంది. రిటైర్డ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ అయినా ఆమె పార్కిన్సన్స్ నుంచి ఉపశమనం పొందేందుకు కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. ఆమెకు ఈ వ్యాధి 2014లో నిర్థారణ అయ్యింది. ఫలితంగా నడవడం, ఈత కొట్టడం, డ్యాన్స్ చేయడం వంటివి ఏమి చేయలేకపోయింది. ఐదేళ్ల నుంచి తను ఎంతో ఇష్టపడే గ్రిన్స్టెడ్ కచేరీ బ్యాండ్ ప్రదర్శనలో సైతం పాల్గొనడం మానేసిందామె. ఆ నేపథ్యంలో ఇలా బ్రెయిన్కి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది బేకన్. ఇది సుమారు నాలుగు గంటల ఆపరేషన్. అందులో భాగంగా ఆమె పుర్రెకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్నారు వైద్యులు. అంతలో మధ్యలో ఆమె చేతి వేళ్లను సునాయాసంగా కదిలించగలగడేమ కాదు, ఆపరేషన్ చేస్తుండగా మధ్యలోనే క్లారినెట్ను అద్భుతంగా వాయించింది. దాన్ని చూసి వైద్యుల సైతం విస్తుపోయారు. బ్రెయిన్ సర్జరీలో భాగంగా ఎలక్ట్రోడ్లు సక్రియం చేస్తుండగా చేతులు కదులుతున్నట్లు గమనించి.. ఇలా వాయిద్యాని వాయించాలని భావించానంటోంది. దీని కారణంగా తమ సర్జరీ విజయవంతమని, ఆమె సమస్య నుంచి బయటపడి మెరుగ్గా ఉందని తక్షణమే నిర్థారించగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. అంతేగాదు ఆమె ఆ సాహసం చేయాలనుకోవడం చాలా ప్రశంసించదగ్గ విషయమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశారు వైద్యులు. నెటిజన్లు సైతం శస్త్రచికిత్స మధ్యలో క్లారినెట్ వాయించడం అంటే.. అది మాములు ధైర్యం కాదంటూ బెకాన్ని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. Patient with Parkinson's disease plays clarinet during brain procedure at London hospital pic.twitter.com/en2vpRRfaA— The Associated Press (@AP) October 23, 2025 (చదవండి: కూతురి డ్రీమ్, తండ్రి సంకల్పం..! ఆ నాణేల సంచి వెనుక ఇంత భావోద్వేగ కథనా..) -
Bihar Election: మహిళలకు శాశ్వత ఉద్యోగం: తేజస్వీ భారీ హమీ
పట్నా: బిహార్లో వచ్చేనెల(నవంబర్)లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో నేతల ప్రచార పర్వం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ రాష్ట్రంలోని మహిళలకు భారీ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘జీవికా దీదీ’లకు ఉద్యోగం పర్మినెంట్ చేయడంతోపాటు, నెలకు రూ.30 వేల జీతం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న ‘జీవికా దీదీ’ పథకంలోని లోపాలను చక్కదిద్ది, మహిళలకు అండగా ఉంటామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఆర్జేడీ నేత నేత తేజస్వీ యాదవ్ తన ఎన్నికల ప్రచారంలో ‘జీవికా దీదీ’లపై హామీల వర్షం కురిపించారు. బిహార్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ‘జీవికా దీదీ’లకు రూ. 30 వేల జీతంతోపాటు వారు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని, బీమా కవరేజీని అందిస్తామని హామీనిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వ చేపట్టిన ‘జీవికా దీదీ’ పథకం తీరుతెన్నులపై తేజస్వీ పలు విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ‘జీవికా దీదీ’లకు అన్యాయం జరుగుతున్నదనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ పథకంలోని మహిళలను పర్మినెంట్ చేయాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని తాము నిర్ణయించామని తేజస్వీ పేర్కొన్నారు. వారి జీతం కూడా నెలకు రూ. 30 వేలకు పెంచుతామని, ఇది సాధారణ ప్రకటన కాదని అన్నారు. జీవికా దీదీల దీర్ఘకాల డిమాండ్ సాకారం చేయనున్నామని తేజస్వి యాదవ్ పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. జీవికా దీదీల ప్రస్తుత రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని, రాబోయే రెండేళ్లకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. దీనికితోడు ప్రతి జీవికా దీదీకి నెలకు రూ. రెండువేల అదనపు భత్యం, రూ. ఐదు లక్షల బీమా కవరేజ్ అందిస్తామన్నారు. కాగా ‘జీవికా దీదీ’ పథకం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. -
కారుతో ఢీకొట్టి.. కత్తులతో గొంతు కోసి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : పట్టపగలు ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీకొట్టి.. కత్తులతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మ కూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో మంగళవా రం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి మల్ల య్య–భిక్షమమ్మ(40) దంపతులకు ఇద్దరు కుమారు లు. మల్లయ్య లారీ డ్రైవర్గా, పెద్ద కుమారుడు భరత్ హైదరాబాద్లో మెకానిక్గా, చిన్నకుమారుడు ప్రవీణ్ సూర్యాపేటలో ఓ చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. మల్లయ్య–భిక్షమమ్మ దంపతులకు ఇటీవల తగాదాలు జరగ్గా.. మంగళవారం పెద్దల సమక్షంలో మా ట్లాడి భిక్షమమ్మ ఇంటికి తిరిగి వస్తోంది. గ్రామ నడిబొడ్డుకు రాగానే గుర్తుతెలియని వ్యక్తులు భిక్షమమ్మను వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. కిందపడిన ఆమె వద్దకు దుండగులు కారు దిగి వచ్చి తమ వెంట తెచ్చుకున్న కత్తులతో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో భిక్షమమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో.. మృతురాలు భిక్షమమ్మకు ఆమె భర్త మల్లయ్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భిక్షమమ్మకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. ఈ విషయమై పెద్దలు సైతం పంచాయితీలు చేసి సర్ది చెప్పినట్టు తెలిసింది. ఇటీవల సూర్యాపేటకు చెందిన ఓ దేశ గురువు భిక్షమమ్మతో చనువుగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. ఇదే విషయమై మల్లయ్య పెద్దల సమక్షంలో భార్యను మందలించేందుకు స్థానికంగా ఓ పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. పెద్దలు ఇరువురిని సముదాయించి పంపించగా.. కొద్దిసేపటికే ఆ పార్టీ కార్యాలయ సమీపంలోనే భిక్షమమ్మ దారుణ హత్యకు గురైంది. మృతురాలి భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులతోపాటు దేశ గురువు, వారి కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలే హత్య జరిగిన సమాచారం తెలుసుకున్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్గౌడ్లు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఒకప్పుడు మిలిటరీ డాక్టర్.. ఇప్పుడేమో క్యాబ్ డ్రైవర్!
బెంగళూరుకు చెందిన ఓ మహిళకు కెనడాలో కారులో మిస్సిస్సాగా నుంచి టొరంటోకు ప్రయాణిస్తున్నప్పుడు వింత అనుభవం ఎదురైంది. తాను ఎక్కిన క్యాబ్ డ్రైవర్తో మాటామంతి సాగిస్తుండగా తన ప్రొఫైల్ విని ఆశ్చర్యపోయింది. ఆ డ్రైవర్ తనతో ఏ విషయాలు పంచుకున్నారో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయింది.క్యాబ్ డ్రైవర్ బెంగళూరు మహిళ మేఘనా శ్రీనివాస్తో చెప్పిన వివరాల ప్రకారం..‘నేను ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వ్యక్తిని. గతంలో యూఎస్, కెనడా కోసం మిలిటరీలో వైద్యుడిగా పనిచేశాను. ప్రస్తుతం కెనడాలో పర్మనెంట్ రెసిడెంట్(PR) కోసం ప్రయత్నిస్తున్నాను. నా వైద్య వృత్తిని కొనసాగించడానికి అవసరమైన లైసెన్స్ పొందడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం కెనడాలో ఒక డిగ్రీ కోసం చదువుతున్నాను. రోజువారీ ఖర్చుల కోసం ఇలా క్యాబ్ నడుపుతున్నాను. క్యాబ్ నడపడం ద్వారా సుమారు నెలకు 4,000 డాలర్లు సంపాదిస్తున్నాను. కానీ టొరంటోలో ఒక పడకగదికి సుమారు 3,000(రూ.2.63 లక్షలు) డాలర్లు చెల్లించవలసి వస్తుంది. టొరంటోలో అద్దెగదులు చాలా ఖరీదైనవి’మేఘనా తన పోస్ట్లో విదేశాలకు మకాం మార్చే ముందు ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి సరైన ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. కెనడాకు వెళ్లే ముందు విద్యార్థులు, ఇతర వ్యక్తులు క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పారు. అక్కడి విద్యా వ్యవస్థ లేదా నగరాల గురించి మాత్రమే కాకుండా జీవన ఖర్చులు, విధానాలు, ఉద్యోగ మార్కెట్.. వంటి చాలా అంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలని తెలిపారు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
నా ఫోటో చూపిస్తే పోలీసులకే దడ పుడుతుంది..
ఎన్టీఆర్ జిల్లా: ఆర్డీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తమపై దురుసుగా ప్రవర్తించిందని డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎనీ్టఆర్ జిల్లా కంచికచర్లలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళ జగ్గయ్యపేట డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సును విజయవాడలో ఎక్కింది. ఆమె పరిటాలలో దిగాల్సి ఉంది. ఆమె బస్సు ఎక్కి ఫుట్పాత్పై నిల్చుంది. గమనించిన డ్రైవర్ ఆమెను లోపలికి వెళ్లమని సూచించాడు. దీనిపై ఆమె డ్రైవర్పై గొడవకు దిగింది. ఎందుకమ్మా డ్రైవర్పై గొడవ పడతున్నావన్న కండక్టర్పైనా ఆమె మండిపడింది. ఇద్దరు కలసి తనను మందలిస్తారా.. ఇది ఫ్రీ బస్సు.. నా ఫొటో తీసుకో.. ఈ ఫొటోను విజయవాడ సిటీలో లేదా చిల్లకల్లు, కంచికచర్ల పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చూపించుకో.. నా ఫొటో చూడగానే పోలీసులకే దడ పుడుతుందంటూ కండక్టర్పై దురుసుగా ప్రవర్తించింది. ‘అమ్మా కండక్టర్ అయ్యప్ప మాల ధరించాడు అతనిపై దుర్భాషలాడకూడదు’ అని హితవు పలికిన తోటి మహిళలను కూడా దుర్భాషలాడింది. బస్సు డ్రైవర్ పరిటాల గ్రామంలో బస్సును ఆపకుండా నేరుగా కంచికచర్ల పోలీస్స్టేషన్ వద్ద బస్సు ఆపి మహిళపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విశ్వనాథ్ మహిళను మందలించి కండక్టర్, డ్రైవర్లకు సర్ది చెప్పి పంపించి వేశారు. -
సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ బాలికపై లైంగికదాడి
కొత్తపల్లి (కరీంనగర్): బాలికపై అత్యాచారం చేస్తూ.. సెల్ఫోన్లో చిత్రీకరించి ఆపై వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ఇద్దరు యువకులు ప్రేమపేరుతో నమ్మించారు. ఓ రోజు గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తేరుకున్న బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్కుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ యువకులు విశ్వతేజ (19), సన్నీ (21)లను అరెస్టు చేసి పోక్సో కింద కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది..దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!
చదువు అయిన తరువాత ఉద్యోగం రావడం అంత సులువుకాదు. అదీ మన మనసుకు నచ్చిన జాబ్ రావడమంటే జాక్ పాట్ కొట్టినంత ఆనందమే. దీనికి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు , తెగువ, స్మార్ట్నెస్ కూడా ఉండాలని నిరూపించిందో యువతి. కేవలం అయిదే అయిదు నిమిషాల్లో ఉద్యోగాన్ని సాధించిన యువతి స్టోరీని టెక్ కంపెనీ సీఈవో సోషల్మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈస్టోరీ నెట్టింట హల్చల్ చేస్తోంది.కోడ్ ఆఫ్ అజ్ CEO సాండి స్లోంజ్సాక్ అందించిన వివరాల ప్రకారం కేవలం ఐదు నిమిషాలు మాట్లాడిన తరువాత ఒక కళాశాల విద్యార్థినిని తాను నియమించు కున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మనోధైర్యం, తెలివి, నిజాయితీపై ప్రశంసలు కురిపించారు. "తమ కంపెనీలో ఎలాంటి ఉద్యోగ ఖాళీలు లేకపోయినా ... ఓపెన్ లెటర్ దరఖాస్తు పంపే ధైర్యం ఉంది, తనకు ఏమీ తెలియదని ఒప్పుకోవడమేకాదు, కష్టపడి పని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది" అని చెప్పుకొచ్చారు. ఆమె సూపర్ కమ్యూనికేటివ్, స్ట్రెయిట్ షూటర్. చాలా స్మార్ట్, చాలా వినయంతో ఉంది. జీతం గురించి పట్టించుకోనని తెలిపిందంటూ ట్వీట్ చేశారు. ఖాళీ సమయంలో తన సొంత ప్రాజెక్టులలో పనిచేసిందని చెప్తూ, కృషి అంకితభావాన్ని గురించి చెప్పుకొచ్చారు. ఆమె నిజాయితీ, అభిరుచి, పట్టుదల తనను చాలా ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. మూడు నెలల కనీస వేతనంతో జాబ్ ఆఫర్ చేసి, రేపటినుంచే ఉద్యోగంలో చేరిపోవచ్చని ఆమెకు గుడ్ న్యూస్ చెప్పారు. (హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!)today i hired a college student after just 5 minutes of talking to her1. had the guts to send an open letter application although we had no job openings 2. straight up admitted she knows nothing3. told she’s willing to work as an animal to learn as much as she can4. open…— Sandi Slonjšak (@sandislonjsak) October 8, 2025సోషల్ మీడియా రియాక్షన్సోషల్ మీడియాలో సీఈవో, విద్యార్థిని ఇద్దరిపైనా ప్రశంసలు వెల్లువెత్తాయి.‘నిజమైన రత్నాన్ని గుర్తించారు.. మీ కంపెనీలో నేర్చుకోవాలనే ఆమె ఆసక్తిని ఎలా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందా? అనే అసక్తిని ప్రదర్శించారు. రిక్రూటర్లు అందరూ మీలా వుండరు సార్ , ఆమెకు ఎంచుకున్నందుకు సంతోషం, ఆమెను మీ ఆధ్వర్యంలో బాగ నైపుణ్యాన్ని సాధిస్తుందని మరొకరు కమెంట్ చేశారు.చదవండి: జస్ట్ 10 లక్షల లోన్తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి! -
చిన్న ప్రయత్నమే..కానీ ఎఫెక్ట్ ఎవరెస్టు రేంజ్..!
ప్రజలకు అవగాహన కల్పించేలా చేయడం అంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. కార్యరంగంలోకి దిగాక తెలుస్తుంది అసలైన సమస్య. కానీ ఈ మహిళ అవేమి పట్టించుకోకుండా స్వచ్ఛందంగా పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న తీరు ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది. పైగా రెండు భాషల్లో వారికర్థమయ్యేలా చెబుతున్న తీరుకి హ్యాట్సాఫ్ అనాల్సిందే. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ స్వచ్ఛందంగా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. అందుకోసం సిటీ బస్సు ఎక్కి మరీ వీధుల్లో చెత్త వేయొద్దంటూ ప్రయాణికులను కోరడమే గాక..ఇలా అందరూ సమిష్టిగా చేస్తే..దాని ప్రభావం దేనికి దారితీస్తుందో నొక్కి చెప్పింది. ఈ ఘటన బెంగళూరు సిటీ బస్సులో చోటుచేసుకుంది. ఆమె కన్నడ, హిందీ భాషలలో ప్రజలకు తన సందేశాన్ని వినిపించడం విశేషం. అంతేగాదు ప్రయాణికులు టిక్కెట్ల, గుట్కా ప్యాకెట్లు రోడ్లపై వేయొద్దని అభ్యర్థిస్తూ అవగాహన కల్పించింది. "మార్పు మన నుంచి మొదలవ్వాలి.. మీ చెత్తను ఇంటికి తీసుకువెళ్లండి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం." అని పిలుపునిస్తున్న తీరు అక్కడున్నవారందర్నీ బాగా ఆకర్షించింది. ఎవరేం అనుకున్నా పర్లేదు..మార్పు ఒక్కటే ముఖ్యం అంటూ వాలంటీర్గా ముందుకువచ్చి ఇలా బహిరంగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. కచ్చితంగా ఇది ఎవరెస్టు రేంజ్కి మార్పుకి నాంది పలికి తీరుతుంది అంటూ పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తూ పోస్టులు కూడా పెట్టారు. అంతేగాదు ప్రయత్నం చూడటానికి సాదాసీదాగా కనిపించొచ్చు..మార్పు సంతరించుకున్నప్పడూ కచ్చితంగా దాని విలువ తప్పక తెలుస్తుంది కదూ..!. View this post on Instagram A post shared by Pune News Age (@punenewsage) (చదవండి: హిమాలయన్ ఆంటీ'..ఆమె శిఖరాగ్ర శక్తికి సాటిలేదు!) -
ఆంటీ నువ్వంటే నాకు ఇష్టం..!
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): వివాహిత మహిళ స్నానం చేస్తుండగా చూడడమే కాకుండా.. ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన బాలుడు (16)పై అజిత్సింగ్నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. న్యూరాజరాజేశ్వరీపేట కేర్ అండ్ షేర్ స్కూల్ సమీపంలో నివసిస్తున్న 35 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం ఉదయం ఇంట్లో స్నానం చేసి దుస్తులు మార్చుకొంటుండగా అదే ప్రాంతానికి చెందిన బాలుడు ఆమెను గమనిస్తూ నువ్వంటే ఇష్టం అంటూ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు పెట్టడంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జగన్ పై అంతులేని ప్రేమ.. నడి రోడ్డుపై దిష్టి తీసిన మహిళ
-
Delhi: నిద్రిస్తున్న భర్తపై మరిగే నూనె, ఎర్ర కారం.. అరిస్తే ఇంకా పోస్తానంటూ..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని మదన్గీర్లో ఉంటున్న దినేష్.. ఇంట్లో నిద్రస్తున్న సమయంలో అతని భార్య అతనిపై సలసల మరుగుతున్న నూనె, ఎర్రటి కారం పొడి పోసి, అతనికి నరకం అంటే ఏమిటో చూపించింది. అక్టోబర్ 3న ఫార్మాస్యూటికల్ కంపెనీ కార్మికుడు దినేష్(28) కాలిన గాయాలతో సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేరిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది.అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం దినేష్ నిద్రపోతున్నసమయంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అతని భార్య అతని శరీరంపై వేడి నూనె పోసింది. ఆ సమయంలో ఆ దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె ఇంట్లోనే ఉంది. అక్టోబర్ 2న.. తన పని ముగించుకున్నాక ఇంటికి తిరిగి వచ్చి, రాత్రి భోజనం చేసి, పడుకున్నానని దినేష్ పోలీసులకు తెలిపాడు. ‘నా భార్య, కుమార్తె అదే గదిలో నిద్రపోతున్నారు. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో, నాకు అకస్మాత్తుగా శరీరం అంతటా మంటపుట్టింది. నా భార్య నా శరీరం, ముఖంపై మరిగే నూనె పోయడం నేను చూశాను. నేను సహాయం కోసం అరుస్తున్నంతలో ఆమె నా కాలిన గాయాలపై ఎర్రని కారం పొడి చల్లింది" అని అతను తన ఫిర్యాదులో ఆరోపించాడు.బాధితుడు అరుస్తుండగా అతని భార్య ‘అరచి గోల చేస్తే.. మీ మీద మరింత నూనె పోస్తానని బెదిరించింది. అయితే దినేష్ బాధను తట్టుకోలేక గట్టిగా కేకలు పెట్టాడు. దానిని విన్న కింద అంతస్తులో ఉంటున్న అతని ఇంటి యజమాని కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో ఒకరైన అంజలి మీడియాతో మాట్లాడుతూ ‘ఏం జరుగుతున్నదో చూసేందుకు మా నాన్న ముందుగా పైకి వెళ్ళారు. దినేష్ భార్య లోపలి నుంచి తలుపు తాళం వేసింది. తలుపు తెరవమని మేము వారిని అడిగాం. కొద్దిసేపటి తరువాత ఆమె తలుపులు తెరిచింది. దినేష్ బాధతో విలవిలలాడటాన్ని చూశాం’ అని తెలిపింది.ఈ ఘటన దరిమిలా ఇంటి యజమాని కలగజేసుకుని, బాధితుడిని ఆటోలో ఒంటరిగా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని మెరుగైన చికిత్స కోసం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి పంపించారు. దినేష్ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం దినేష్ భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వివాదంలో పోలీసులు ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. తాజాగా ఘటనలో దినేష్ భార్యపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. -
నడుం నొప్పి తట్టుకోలేక, ఎనిమిది కప్పల్ని మింగేసింది... కట్ చేస్తే
ఎవరో ఏదో చెప్పారని, అశాస్త్రీయమైన వైద్య విధానాల్ని, పద్ధతుల్ని అవలంబించేవారికి ఇది షాకింగ్ న్యూస్. ఎన్నాళ్లుగానో వేధిస్తున్న నడుం నొప్పిని తట్టుకోలేక చైనాకు చెందిన ఒక వృద్ధురాలు పాత ఆచారాన్ని పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. విషయం ఏమిటంటే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం తూర్పు చైనాలోని 82 ఏళ్ల వృద్ధురాలు జాంగ్ హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతోంది . ఈ బాధను భరించలేక బతికున్న కప్పలను మింగేసింది.ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిందింటిని మింగింది. ఇలా సజీవ కప్పలను మింగడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని స్థానికంగా ప్రచారంలో ఉన్న విషయాన్ని నమ్మి ఇలాచేసినట్టు తెలుస్తోంది.నడుం నొప్పి తగ్గలేదు సరికదా, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రి పాలైంది. విషయం తెలిసి వైద్యులే నివ్వెర పోయారు. చాలాకాలంగా హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతున్న జాంగ్, అసలు విషయం చెప్ప కుండానే తనకు కప్పలు కావాలని కుటుంబ సభ్యులను కోరింది. ఇలా మొదటి రోజు మూడు కప్పలను, మరుసటి రోజు ఐదు కప్పలను సజీవంగా మింగేసింది. దీంతో క్రమంగా పరిస్థితి క్షీణించడంతో అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు వైద్యులను సంప్రదించారు. వైద్యుల ప్రకారం ఆమె పొట్టలో పరాన్నజీవి సంక్రమణను కనుగొన్నారు. ఆక్సిఫిల్ కణాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కప్పలలో సాధారణంగా కనిపించే టేప్వార్మ్ లార్వా స్పార్గానమ్తో సహా, ఇతర బాక్టీరియా ఉనికిని వైద్యులు నిర్ధారించారు. నడవలేని స్థితిలో రెండు వారాల పాటు చికిత్స తీసుకుని ఎట్టకేలకు ఇంటికి చేరింది సజీవంగా కప్పలను మింగడం వల్ల రోగి జీర్ణవ్యవస్థ దెబ్బతిని, పరాన్నజీవులు చేరాయి ఆసుపత్రి వైద్యుడు తెలిపారు.నోట్ : ఆరోగ్య చిట్కాలు చిట్కాలు మాత్రమే అని గమనించాలి.అవి పరిష్కారం ఎంతమాత్రం కావు. అందులోనూ సుదీర్ఘ కాలంలో బాధపడుతున్న వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. లేదంటే మొదటికే మోసం రావచ్చు. -
షాకింగ్ వీడియో.. మహిళను నదిలోకి లాక్కెళ్లిన మొసలి
జాజ్పూర్: ఒడిశాలోని జాబ్పూర్ జిల్లా కాంతియా గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ఖరస్రోత నదిలో ఓ మొసలి.. మహిళను లాక్కెళ్లిపోయింది. నదిలో స్నానం చేస్తున్న సౌదామిని (57)ని ఒక ముసలి లాక్కెళ్లడంతో గ్రామంలో కలకలం రేగింది. మహిళను రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించి.. విఫలమయ్యారు. గల్లంతైన మహిళ కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సోమవారం( అక్టోబర్ 6) సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆమె బట్టలు ఉతికేందుకు ఖరస్రోత నది వద్దకు వెళ్లింది. నది ఒడ్డున ఓ చోట స్నానం చేస్తుండగా ఓ మొసలి ఆమెను ఒక్కసారిగా నదిలోకి లాక్కెళ్లింది. అయితే ఓ వంతెనపై వెళ్తున్న స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. గ్రామస్తులు ఆ మొసలిని వెంబడించి ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. చివరికి ఆమెను కాపాడలేకపోయారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.A live video went viral from Jajpur, Bari area, where a crocodile dragging a waman in to the river, pubil getting panic after watching video #odisha #jajour #crocodile #news #viral #live pic.twitter.com/J1lR1k01D2— Ajay kumar nath (@ajaynath550) October 7, 2025 -
నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?
ఒకపుడు ఆమెను తమ సంస్థలో ఉద్యోగానికి తిరస్కరించింది.కట్ చేస్తే రెండేళ్లలోపే అదే కంపెనీలో ఉన్నత పదవికి ఎంపికైంది. ఇదే కదా సక్సెస్ కిక్ అంటే.. ఆ సక్సెస్ పేరే రాగిణి దాస్. ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారిన రాగిణీ దాస్ స్టోరీ ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలోమహిళా-కేంద్రీకృత ప్రొఫెషనల్ నెట్వర్క్ లీప్.క్లబ్(Leap club) సహ వ్యవస్థాపకురాలు, FICCIలో ఉమెన్ ఇన్ స్టార్టప్స్ కమిటీ చైర్పర్సన్ రాగిణి దాస్ ఇపుడు గూగుల్ ఇండియాలో స్టార్టప్ హెడ్గా ఎంపికైంది. 2013లో గూగుల్ ఉద్యోగానికి సంబంధించి చివరి ఇంటర్వ్యూ రౌండ్లో ఎంపిక కాలేక పోయింది. కట్ చేస్తే లీప్.క్లబ్ సహ వ్యవస్థాపకురాలిగా జొమాటో వంటి సంస్థలతో కూడా పనిచేసిన అనుభవంతో గూగుల్ ఇండియా స్టార్టప్ హెడ్గా నియమితులైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిజంగా జీవితం చక్రం లాంటిది.. తిరిగి అవకాశం వచ్చింది అంటూ ట్విట్ చేసింది.గూగుల్లో తన కొత్త బాద్యతలను గురించి వ్యాఖ్యానిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లను సమర్థులైన వ్యక్తులు, ఉత్పత్తులు , ఉత్తమ పద్ధతులతో అనుసంధానించడం ద్వారా వాటిని అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి, వారికి సాయం అందించే లక్ష్యంతో ఉన్నామని తెలిపింది. (84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా! )Life has come full circle, and I’m excited to share that I’ve joined @Google as Head of Google for Startups - India 🍋The backstory: In 2013, I sat for two interviews: one at Google and one at Zomato. pic.twitter.com/Hs9cqKHFxJ— Ragini Das (@ragingdas) October 6, 2025ఎవరీ రాగిణి దాస్?గురుగ్రామ్లో జన్మించిన రాగిణి దాస్, చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమంలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. అందుకు ముందు సాంస్కృతిక కార్యదర్శిగా కూడా పనిచేసింది. అలాగే గ్రాడ్యుయేషన్ సమయంలో, ఆమె స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ , ఇతర సంస్థలతో ఇంటర్న్ గా, మార్కెట్ పరిశోధన మరియు భారత మార్కెట్ కోసం వ్యాపార ప్రణాళికలను డెవలప్ చేసింది. 2012లో, దేశీయ మార్కెటింగ్ కోసం ఫ్రంట్లైన్ వ్యవస్థాపకురాలిగా ట్రైడెంట్ గ్రూప్ ఇండియాలో చేరింది. అనంతరం యూరప్ అండ్ యుఎస్ మార్కెటింగ్ నిర్వహణలో పదోన్నతి పొందింది. తిరిగి ఒక్క ఏడాదిలోనే 2013లో, జొమాటోలో రాగిణి సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్గా చేరింది. అకౌంట్ మేనేజర్, ఏరియా సేల్స్ మేనేజర్తో సహా వివిధ పాత్రల్లో ఆరేళ్లు తన సేవలను అందించింది.చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో 2017లో, ఆమె జోమాటో గోల్డ్ వ్యవస్థాపక బృందంలో భాగమైంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఖతార్ మరియు లెబనాన్తో సహా 10 అంతర్జాతీయ మార్కెట్లలో జోమాటో గోల్డ్ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించింది.2020లో, వేలాది మంది మహిళల కోసం ఆన్లైన్ యాప్ మరియు ఆఫ్లైన్ క్లబ్ను leap.clubను సహ-స్థాపించింది వేలాది మంది మహిళలకు నెట్వర్కింగ్, ప్రొఫెషనల్ అవకాశాలు, క్యూరేటెడ్ ఈవెంట్లు ,ఆసక్తి-ఆధారిత కమ్యూనిటీలను అందిచింది. ఈ ఏడాది జూన్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రస్తుతం రాగిణి దాస్, గూగుల్ ఫర్ స్టార్టప్స్ భారతదేశ విభాగానికి కొత్త హెడ్గా ఎంపికకావడం విశేషం.


