breaking news
Woman
-
టీడీపీ మహిళా నేతపై వేధింపుల ఆరోపణలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం నేత దమయంతి లీలావతి తనను వేధింపులకు గురిచేసిందంటూ ముంబైకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ అనురూప ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బెంగళూరులో పనిచేస్తున్న సమయంలో ఎక్కువ జీతం ఇస్తామని చిత్తూరుకు పిలిచారన్న అనురూప.. డిజైనింగ్ పనులతో పాటు ఇంటి, వంట పనులు చేయించారని ఆరోపించారు. చిత్తూరులో ఆకృతి బోటిక్ నిర్వహిస్తున్న లీలావతి.. అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తామని తీసుకువచ్చి.. జీతం చెల్లించకుండా మానసిక వేధింపులకు గురిచేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లీలావతి, ఆమె కుమారుడు అనుష్ చౌదరి టార్చర్ చేశారంటూ.. కన్నీటి పర్యంతమైన అనురూప వీడియో కలకలం రేపుతోంది. -
భర్తను వదిలి లవర్తో పారిపోయి, చివరికి శవమై సూట్కేసులో
బిహార్లో జరిగిన దారుణ ఘటన దిగ్బ్రాంతి రేపింది. ఛోటీ కుమారి అనే వివాహితను ఆమె ప్రియుడు రిషభ్ కుమార్ దారుణంగా హత్య చేసి, శవాన్ని సూట్కేసులో దాచిపెట్టిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రెండేళ్ల క్రితం భర్తను వదిలి లవర్తో పారిపోయి, చివరికి అతని చేతిలో దారుణంగా హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బిహార్లోని నవాడా జిల్లాకు చెందిన ఛోటీ కుమారికి ఇదివరకే వివా మైంది. అయితే, తన గ్రామానికి చెందిన ప్రేమికుడు రిషభ్ కుమార్ సింగ్తో కలిసి దద్రా అండ్ నగర్ హవేలీలోని సిల్వాస్సాకు పారిపోయి పెళ్లి చేసుకుంది. వీరి వివాహాన్ని ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. దీంతో రిషభ్పై కిడ్నాపింగ్ కేసే నమోదైంది.మరోవైపు పెళ్లయిన తర్వాత తమ సొంత ఊరికి తిరిగి వెళ్దామని ఛోటీ పదేపదే కోరడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో జూన్ 9న జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత, రిషభ్ కోపంతో ఛోటీని గొంతు నులిమి హత్య చేశాడు. బాడీని సూట్కేస్లో కుక్కి అక్కడినుంచి పారిపోయాడు. అయితే ఆగస్టు 3న గది యజమాని వేరే వారికి అద్దెకు ఇవ్వడం కోసం తాళం పగులగొట్టి చూడగా, బాత్రూమ్లో ఉన్న సూట్కేస్ నుండి తీవ్ర దుర్వాసన రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం హత్య తర్వాత వారణాసికి పారిపోయిన రిషభ్, తన పేరు మార్చుకుని ఒక ప్రైవేట్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. -
భారత యువతి హత్య: ఏడు నెలల తర్వాత ప్రియుడి అరెస్ట్!
టొరంటో: కెనడాలోని టొరంటోలో గత డిసెంబర్లో జరిగిన భారత సంతతికి చెందిన హిమాన్షీ ఖురానా (30) హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఆమె భాగస్వామి అబ్దుల్ గఫూరీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 20, 2025న ఈ హత్య జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న గఫూరీని, ఆగస్టు 7న టొరంటో విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు టొరంటో పోలీసులు శనివారం ప్రకటించారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది.నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అతనికి పెరోల్ లేని జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. డిసెంబర్ 19న హిమాన్షీ కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా, మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహం ఆమె ఇంట్లోనే లభ్యమైంది. టొరంటోలోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని ప్రకటించింది. నిందితుడు విదేశాలకు పారిపోయినప్పటికీ, అంతర్జాతీయ పోలీసు ఏజెన్సీల సహకారంతో అతడిని కెనడాకు రప్పించి, అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఇది కూడా చదవండి: బ్రెజిల్లో విషాదం: హెలికాప్టర్ కూలి నలుగురు మృతి! -
AP: పెనమలూరు పీఎస్లో కీచక ఖాకీ
పెనమలూరు(కృష్ణా జిల్లా): ఏపీలో మరో కీచక పర్వం వెలుగు చూసింది. ఓ వివాహిత పట్ల హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చోటు చేసుకుంది. ఓ బాధిత వివాహిత ఫిర్యాదు చేయడానికి పీఎస్కు వస్తే హెడ్ కానిస్టేబుల్ ఆమెను వేధింపులకు గురి చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లాలోని పెనమలూరు పీఎస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న అరిసె శ్రీనివాసరావు.. ఓ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన భర్త పట్టించుకోకపోవడంతో పెనమలూరు పీఎస్ను ఆశ్రయించింది ఓ మహిళ. న్యాయం కోసం వెళ్లిన బాధితురాలిని హెడ్ కానిస్టేబుల్ వేధింపులకు గురి చేశాడు. సాయం పేరుతో వివాహితకు పదే పదే ఫోన్ చేసి వేధించాడు. అర్థరాత్రి ఫోన్ కాల్స్ చేసి మరీ వేధించాడు. హబీస్ ఏంటని అంటూ కుశల ప్రశ్నలతో ట్రాప్ చేసేందుకు యత్నించాడని, ఇంటి లోకేష్ పట్టాలంటూ ఫోన్ కాల్స్లో వేధించ సాగాడు. వాట్సాప్ కాల్లో బాధిత వివాహితతో అసభ్యంగా మాట్లాడుతూ వేధించాడు. -
వెట్టిచాకిరీ చేయలేదని సస్పెండ్ చేశారు
పెనమలూరు/కోనేరుసెంటర్: పోలీస్ శాఖలో వెట్టిచాకిరీ వ్యవహారంపై తీవ్ర చర్చకు దారితీసిన అంశమిది. పెనమలూరు పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పని చేసిన రూపకళ గురువారం యనమలకుదురులో మీడియాతో మాట్లాడుతూ వెట్టిచాకిరీ చేయడానికి నిరాకరించానని తనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ‘భర్త మృతి చెందటంతో నాకు హోంగార్డు పోస్టు ఇచ్చారు. గన్నవరం డివిజన్ పెనమలూరు పీఎస్లో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత నెల 14వ తేదీన హోంగార్డు కార్యాలయం నుంచి సాల్మన్ అనే కానిస్టేబుల్ ఫోన్ చేసి ట్రైనింగ్ ఉందని రమ్మని చెప్పడంతో 15వ తేదీన వెళ్లి కలిశాను. మాచవరంలో ఐజీ ఉంటారని అక్కడ పని చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్నానని వెళ్లలేనని చెప్పాను. దీనిని మనసులో పెట్టుకుని అప్పటి నుంచి నిన్నటి వరకూ ప్రతిరోజూ మచిలీపట్నం తిప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడ గడ్డి పీకించారు. ఆర్ఐని కలిసి నాకు ఆరోగ్యం బాగాలేదని మెడికల్ డాక్యుమెంట్లు చూపాను. ఆర్ఐ న్యాయం చేయకపోవటంతో గన్నవరం సర్కిల్లో హోంగార్డు విధులు పర్యవేక్షించే గుప్తాను కలిశాను. సొమ్ము ఇస్తే పనులు అవుతాయని గుప్తా చెప్పారు. నా నెల జీతం రూ.20 వేలేనని, సొమ్ము ఇవ్వలేనని చెప్పాను. దీంతో అక్కడి నుంచి నన్ను పంపించేశారు.ఉద్యోగం పీకేస్తానని ఎస్పీ బెదిరించారున్యాయం కోసం ఎస్పీని కలిసాను. ఆయన కూడా సీ క్యాటగిరీలో ఉన్న వారు ఇళ్లల్లోనే పని చేయాలని చెప్పారు. తన అర్హతను చూసి పోలీస్స్టేషన్కు కేటాయించారని, తన పరిస్థితి అర్థం చేసుకొని న్యాయం చేయాలని కోరితే ఉద్యోగం పీకేస్తానని బెదిరించారు. ఈ క్రమంలో బుధవారం హోంగార్డ్ ఆఫీసులో నాకు ఒక పేపర్ ఇచ్చి, అందులో ఏముందో కూడా చదువుకునే అవకాశం లేకుండా సంతకం చేయించుకున్నారు. తర్వాత సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. ఆదేశించిన మేరకు ట్రైనింగ్కు హాజరు కాలేదని ఆరోపించారు’ అని కన్నీంటి పర్యంతమయ్యారు. అధికారుల ఇళ్లల్లో పని చేయాలంటే వ్యక్తిగత పనులు, వెట్టి చాకిరి చేయాల్సిందేనని రూపకళ ఈ సందర్భంగా వివరించారు. ‘పిల్లలతో కాలకృత్యాలు తీర్పించి వారికి స్నానాలు చేయించాలి. బాత్ రూమ్లు కడగాలి. వృద్ధులు ఉంటే డైపర్లు మార్చాలి. వంట చేయాలి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.చేయాల్సిందే..మహిళా హోంగార్డు చేసిన ఆరోపణలను కృష్ణా జిల్లా పోలీసు శాఖ ఓ ప్రకటనలో ఖండించింది. సి–కేటగిరికి ఎంపికై న హోంగార్డులు గార్డెనింగ్, టైలరింగ్, శానిటేషన్ తదితర విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని, పోలీస్స్టేషన్లలో మాత్రమే పనిచేస్తానని భీష్మిస్తే కుదరదని పేర్కొంది. -
Tank Bund: చెత్తకుప్ప మంటల్లో యువతి మృతదేహం
హైదరాబాద్: లోయర్ ట్యాంక్బండ్ గోశాల వద్ద ఓ యువతి మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టిన ఘటన కలకలం రేపింది. యువతిని హత్యచేసి.. మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి తగులబెట్టారా? లేక ఇక్కడే హత్య చేసి చెత్తకుప్పలో వేసి నిప్పంటించారా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు.సీఐ అంజద్ అలీ, స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. లోయర్ ట్యాంక్బండ్లోని గోశాల వద్ద డీబీఆర్ మిల్స్ గేట్ సమీపంలోని చెత్త కుప్పల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతి మృతదేహానికి నిప్పంటించి పరారీ అయినట్లు దోమలగూడ పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజిన్ సహకారంతో మంటలుఆర్పివేశారు. మంటల్లో సుమారు 30 ఏళ్ల వయసు యువతి కాలిపోయినట్లు కనుగొన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ దారుణం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
నా భర్తను చంపేయ్... ఆ తర్వాతే కనిపించు
ఖమ్మం రూరల్: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చాలని చూసింది ఓ భార్య. ఈ విషయాన్ని గ్రహించిన భర్త పోలీసులను ఆశ్రయించగా, భార్య, ఆమె ప్రియుడిపై కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడుకు చెందిన గాదె రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానితో 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి నాయుడుపేటలోని అద్దె ఇంట్లో ఉంటూ ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్లో రాజేశ్వరరావు పని చేస్తున్నాడు.రెండు నెలల క్రితం సాయిప్రభాత్నగర్లోని అద్దె ఇంటికి మారారు. అయితే భవాని ప్రవర్తనలో మార్పు వచి్చంది. రాజేశ్వరరావుకు దూరంగా ఉంటూ పిల్లలను సరిగా చూసుకోవడంలేదు. జూలై 27న ఆస్పత్రి నుంచి రాజేశ్వరరావు మధ్యాహ్న భోజనానికి వచ్చేసరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలో నుంచి చూడగా, ఆమె మరో వ్యక్తితో చనువుగా కనిపించింది. దీంతో రాజేశ్వరరావు అరవడంతో ఆమె తలుపు తీయగానే సదరు వ్యక్తి పారిపోయాడు. ఎవరని అడిగితే తనకు తెలియదంటూ భర్తతో గొడవకు దిగింది.ఈ విషయాన్ని ఆయన తన బంధువులకు చెప్పగా చిలుకోడులో పంచాయతీ పెడతామని చెప్పారు. ఈనెల 28న ఇద్దరు పిల్లలను చిలుకోడులో దిగబెట్టాక, పెరుమాండ్ల సంకీసలో ఉన్న సోదరుడిని తీసుకొచ్చేందుకు బైక్పై బయలుదేరాడు. అయితే, ఓ వ్యక్తి తనను అనుసరిస్తుండడంతో పరిశీలించగా తన భార్యతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా గుర్తించి నిలదీస్తుండగా పారిపోయాడు. చంపేయ్ అంటూ చాటింగ్ అక్కడి నుంచి చిలుకోడు వెళ్లిన రాజేశ్వరరావు తన భార్య భవాని సెల్ఫోన్లో ఇన్స్ట్రాగాం, వాట్సాప్ పరిశీలించగా ‘నా భర్తకు వేరే వ్యక్తితో యాక్సిడెంట్ చేయించాకే కనిపించు. వాడు మళ్లీ బతకకూడదు, వేరే వ్యక్తి అయితేనే మనపై అనుమానం రాదు’అంటూ పంపించిన మెసేజ్లు ఉన్నాయి. అవి ఎవరికి పంపిందోనని నంబర్ పరిశీలిస్తే ఖమ్మంలో కొరియర్ బాయ్గా పని చేసే పురిమెట్ల సైదులుగా తేలింది. ఆయనది కూడా భవాని స్వగ్రామమైన రాఘవాపురం అని తెలిసింది. ఈమేరకు తొలుత రాజేశ్వరరావు డోర్నకల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఖమ్మం రూరల్ స్టేషన్కు బదలాయించారు. మరోమారు ఖమ్మం రూరల్లో కూడా ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం భవాని, సైదులుపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
రూ. 20 లక్షల ఖర్చు, ప్రాణాలమీదకు తెచ్చిన ర్యాపిడో రైడ్ : వైరల్ స్టోరీ
సాక్షి, బెంగళూరు : క్యాబ్ సేవల సంస్థ ర్యాపిడోపై ఒక మహిళ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల శని కృష్ణ అనే మహిళకు ర్యాపిడో బైక్ ప్రయాణం పీడకలగా మారింది. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితినుంచి బైటపడింది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్స్టాలోపోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి. చివరికి దీనిపై కంపెనీ స్పందించింది.జూన్ 17న శని కృష్ణ ఆఫీసుకు వెళ్లడానికి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నారు. బాగ్మానే టెక్ పార్క్ వద్ద రైడర్ ఒక ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించడంతో బైక్ నియంత్రణ కోల్పోయింది. రోడ్డుపై పడిపోయిన ఆమెపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి, కాలేయం దెబ్బతింది, 9 పక్కటెముకలు విరిగాయి, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు ప్లీహం (Spleen) తొలగించాల్సి వచ్చింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను కేరళలోని ఆసుపత్రికి తరలించారు. ఈ తీవ్ర ప్రమాదంలో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకోగా, ఆసుపత్రి ఖర్చులు రూ. 20 లక్షలు దాటాయని, అయితే రాపిడో సంస్థ తనకు ఎలాంటి సహాయం అందించలేదని ఆమె ఆరోపించారు.రూ. 20 లక్షల ఖర్చుఅత్యవసర శస్త్రచికిత్సలు, వైద్య ఖర్చుల నిమిత్తం ఇప్పటివరకు రూ. 20 లక్షలకు పైగా ఖర్చయిందని, ఇది తమ కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారంగా మారిందని ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.ర్యాపిడోపై ఆరోపణలుమహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటనలు ఇచ్చే రాపిడో, ప్రమాదం జరిగాక తనను పట్టించుకోలేదని శని కృష్ణ ఆరోపించారు. న్యాయపరమైన నోటీసులు పంపినప్పటికీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ చూసుకోమంటూ కేవలం ఆటోమేటెడ్ ఇమెయిళ్ళు మాత్రమే పంపారని తెలిపారు. ఈ విషయమై తాను వినియోగదారుల కోర్టును (Consumer Court) ఆశ్రయించనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్గా ఘనత View this post on Instagram A post shared by Sani Krishna (@sani_krishna) ఇదీ చదవండి: అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీర్యాపిడో స్పందన:శని కృష్ణ ఇన్స్టాగ్రామ్ వీడియోపై రాపిడో సంస్థ స్పందిస్తూ, తాము బాధితురాలితో సంప్రదింపుల్లో ఉన్నామని, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపడానికి కొంత సమయం కావాలని కోరింది.ఇదీ చదవండి: 'జెన్ జీ' పై ఎంపీ కంగనా రనౌత్ యూటర్న్: ఆసక్తికర వ్యాఖ్యలు -
కాలకృత్యాలకు వెళ్లి.. మొసలి నోటికి చిక్కి..?
కేంద్రపారా: ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టముండై బ్లాక్ పరిధిలోని దామోదర్ పట్నా గ్రామంలో మొసలి దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. నదీతీర ప్రాంతాలలో పెరుగుతున్న మొసళ్ల ముప్పుపై స్థానికుల్లో ఆందోళన పెరిగింది. గతంలోనూ ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆధారాలున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం.. అళపువ పంచాయతీ పరిధిలోని దామోదర్ పట్నా గ్రామానికి చెందిన సుచిత్రా దాస్ సోమవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నదీతీరానికి వెళ్లారు. ఎంతకీ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. నది ఒడ్డున ఆమెకు సంబంధించిన వస్తువులు లభించడంతో.. ఆమెను ఏదైనా మొసలి నీళ్లలోకి లాగికెళ్లి ఉంటుందనే తీవ్ర అనుమానం వ్యక్తమైంది.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుచిత్రా దాస్ ఆచూకీ కోసం బోట్లు, ప్రత్యేక పరికరాల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వంటమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సుచిత్రా దాస్.. తన కుటుంబ పోషణకు ఏకైక ఆధారం కావడంతో, ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: కర్ణాటక మంత్రివర్గంలో కీలక మార్పులు.. కొత్త మంత్రులు వీరే! -
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మహిళ ‘రీల్స్’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మ వారి ఆలయంలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. పెద్ద రాజగోపురం వద్ద రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఓ మహిళ పోస్ట్ చేసింది. సెల్ఫోన్పై నిషేధం ఉన్నా కొందరు దర్జాగా రీల్స్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కార్యాలయం ఎదురుగా రీల్స్ చేస్తున్నా గుర్తించకుండా చోద్యం చూస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు.గతంలోనూ కొందరు పలుమార్లు అమ్మవారి మూల విరాట్ను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వరుస వివాదాలతో దుర్గగుడి ప్రతిష్ట దెబ్బతింటుంది. మహిళ ఇన్ స్టా రీల్తో ఆలయ భద్రత లోపం మరోసారి బయటపడింది. -
మహిళల కోసం రాపిడో కొత్త అడుగు..!
సాక్షి,చెన్నై : తమిళనాడులో రాపిడో పింక్ మోబిలిటీ చొరవ కింద అందుబాటులోకి వచ్చిన బైక్ పింక్ ఫీచర్ మహిళలకు స్వతంత్ర ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, మహిళా ప్రయాణికుల నిత్య జీవిత ప్రయాణాలను అత్యంత సురక్షితంగా మారుస్తున్నది. గిగ్ ఎకానమీ మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ, ఆర్థిక స్వాతం్రత్యాన్ని అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతోమంది మహిళలు తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఈ విజయం వెనుక చెన్నైకి చెందిన రాపిడో బైక్ పింక్ కెపె్టన్లు మహాలక్ష్మి రామలింగం, కె. భువనేశ్వరిలు తమ పయనం గురించి స్థానికంగా మీడియా ముందు ఉంచారు. రాత్రి వేళల్లో మహిళలకు అభయం: గత రెండేళ్లుగా రాపిడో బైక్ పింక్ కెప్టెన్గా సేవలు అందిస్తున్నానని మోగప్పేర్కు చెందిన మహాలక్ష్మి రామలింగం పేర్కొన్నారు.రాత్రి 9 గంటల నుండి ఒంటి గంట వరకు కోయంబేడు బస్సు టెరి్మనల్, పెరంబూర్ రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల నుండి ప్రయాణించే మహిళలకు తాను సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. రాపిడోలో చేరడానికి ముందు ఆత్మరక్షణ విద్యలను నేర్చుకున్నట్టు పేర్కొన్నారు. మరోకెప్టెన్ బి. భువనేశ్వరి స్పందిస్తూ, ఇన్స్ట్రాగామ్ పేజీ ద్వారా గిగ్ వర్కర్ సరికొత్త అవకాశాలను, డ్రైవింగ్ నైపుణ్యాల ద్వారా లభించే ఆర్థిక స్వాతం్రత్యాన్ని డిజిటల్ మాధ్యమంలో తాను విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాపిడో పింక్ మోబిలిటీ సాధిస్తున్న సామాజిక మార్పునకు , మహిళా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని దర్పణంగా , తోటి మహిళలో ఆత్మ విశ్వాసం నింపడమే లక్ష్యంగా వివరించారు. -
భర్తను నేల కింద పాతిపెట్టి.. రెండేళ్ల పాటు డ్రామా!
జామ్నగర్: సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం' సినిమాను తలపించే ఓ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి అదృశ్యానికి సంబంధించి పోలీసులు విస్తుపోయే నిజాలు వెలుగులోకి తెచ్చారు. భర్తను హత్య చేసి, రెండేళ్ల పాటు ఎవరికీ అనుమానం రాకుండా ఓ పారిశ్రామిక యూనిట్ నేలలో మృతదేహాన్ని పాతిపెట్టిన భార్య, ఆమె ప్రియుడి ఉదంతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిగ్నేష్ మావడియా అనే వ్యక్తి గత రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడని అతని కుటుంబ సభ్యులు నమ్ముతూ వచ్చారు. కానీ, అతన్ని హత్య చేసి.. దారెద్ జీఐడీసీ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో దాదాపు 12 అడుగుల లోతున పూడ్చిపెట్టినట్లు పోలీసులు తేల్చారు.కుటుంబ సభ్యులలో ఒకరు ఆస్ట్రేలియాకు ప్రయాణమవుతూ.. అక్కడ జిగ్నేష్కు సంబంధించి స్థానిక కాంటాక్ట్ వివరాలు అడగడంతో ఈ హత్య సంగతి బయటపడింది. జిగ్నేష్ భార్య పృథ్వి, ఆమె ప్రియుడు నిలేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనా స్థలం నుంచి వెలికితీసిన అస్థిపంజర అవశేషాలను డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపించారు. అస్థిపంజరం ఎవరిదనే నిర్ధారణ అయిన తర్వాత హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.విచారణ వివరాల ప్రకారం.. పృథ్వి, నిలేశ్లకు ఆమె వివాహానికి ముందే సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా వారు తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. జిగ్నేష్ను మద్యంలో సైనేడ్ కలిపి హత్య చేశారని.. అనంతరం అతని మృతదేహాన్ని దారెద్ జీఐడీసీలోని ఒక ఫ్యాక్టరీకి తరలించి, సుమారు 12 అడుగుల లోతు గుంట తవ్వి నేల కింద పాతిపెట్టారు. జిగ్నేష్ ఉపాధి నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు పృథ్వి కుటుంబ సభ్యులకు నమ్మబలికిందని.. దీంతో దాదాపు రెండేళ్ల పాటు ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదని పోలీసులు తెలిపారు.జిగ్నేష్ సోదరుడు అశోక్ మావడియా ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ జిగ్నేష్ ఆచూకీ ఏమాత్రం లభించకపోవడంతో సిటీ బి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో పృథ్వి తన నేరాన్ని అంగీకరించిందని.. మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టిందో ఆ ప్రాంతాన్ని తెలిపింది. ఈ సమాచారం ఆధారంగా అసిస్టెంట్ కమిషనర్ ప్రతిభ నేతృత్వంలో సిటీ బి పోలీసులు దారెద్ జీఐడీసీలోని ఫ్యాక్టరీ ప్రాంగణంలో తవ్వకాలు జరిపి.. జిగ్నేష్దిగా భావిస్తున్న అస్థిపంజర అవశేషాలను వెలికితీశారు. ఈ అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించగా.. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. -
క్యాబ్ కోసం వేచి చూస్తుంటే.. మీ రేటు ఎంత..?
బెంగళూరు: మహిళను అసభ్యకరంగా మాట్లాడిన బైకిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నగరం కృష్ణరాజపురం పరిధిలోని రామమూర్తి నగర్లో ఒక మహిళ క్యాబ్ కోసం ఎదురుచూస్తుండగా బైక్పై వచ్చిన ఒక వ్యక్తి ‘మీ రేటు ఎంత’ అని అడిగాడు. ఆ మహిళ ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ‘నేను క్యాబ్ కోసం ఎదురుచూస్తుండగా, స్కూటీపై ఉన్న ఒక వ్యక్తి నా రేటు ఎంత అని అడిగాడు. నా భద్రత కోసం నేను వీడియో తీస్తున్నాను. అది గమనించిన ఆ వ్యక్తి నన్ను తిట్టి పారిపోయాడు’ అని పేర్కొంది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని 42 ఏళ్ల విజయ్ రాఘవ్గా గుర్తించారు. అతను పండ్ల వ్యాపారి, హోరమావు నివాసి. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, స్కూటర్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు రామమూర్తి నగర్ పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అతను వేరొకరి స్కూటర్ను ఉపయోగిస్తున్నాడని తెలిపారు. A woman was waiting by the roadside for a cab in Bengaluru when a man on a scooty approached her.MAN: I’ll give you ₹10,000. Come with me to a hotel room.WOMAN: What? Why the f*uck are you asking me? I’ll file a police complaint.MAN: Why would you file a police complaint?… pic.twitter.com/bz26WFsDV4— Lakshay Mehta (@lakshaymehta08) July 28, 2026 -
రెండు సార్లు గర్భవతి.. పెళ్లి పేరుతో సర్పంచ్ మోసం
బోధన్టౌన్(బోధన్): ప్రేమ పేరు చెప్పి సహజీవనం చేసి, మోసం చేశాడని, నాకు న్యాయం చేయండని బాధిత మహిళ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బోధన్లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి «ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ.. పోతంగల్ మండలంలోని జల్లాపల్లి గ్రామ సర్పంచ్ దస్తగిరి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లు సహజీవనం చేశాడన్నారు. వివాహం చేసుకుంటానని పలుమార్లు వాయిదా వేయడంతోపాటు, తను వేరే వారిని పెళ్లి చేసుకుంటే విడాకులు ఇప్పించాడన్నారు. ప్రస్తుతం పెళ్లి చేసుకుందామని నమ్మించి బోధన్లో అద్దె ఇంట్లో ఉంచి నాలుగేళ్లు సహజీవనం చేశాడన్నారు. తనకు రెండు సార్లు అబార్షన్ చేయించాడని పేర్కొంది. సర్పంచ్తోపాటు అబార్షన్ చేసిన ఆర్ఎంపీ ఇలియాస్పై పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. విషయం తెలిసిన సర్పంచ్, ఆర్ఎంపీ డాక్టర్ ఇద్దరు పారిపోయారని, సర్పంచ్ కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు, పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. -
ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
దేవరపల్లి: న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన నల్లజర్ల మండలం దూబచర్లలో ఆదివారం జరిగింది. తన ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో ఆమె బైఠాయించి పోరాటం చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని తనను శారీరకంగా వాడుకుని, ముఖం చాటేస్తున్న అనిల్ కుమార్కు డీఎన్ఏ పరిక్ష చేసి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.సంఘటనకు సంబంధించి బాధితురాలి కథనం ప్రకారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన అడబాల హేమలత నల్లజర్ల మండలం దూబచర్లలో ఓ జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో ఫ్యాక్టరీ యజమాని కుమారుడు అనిల్కుమార్ తనకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని లొంగదీసుకున్నట్టు ఆమె తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా అలాగేనని నమ్మించి ముఖం చాటుశాడని ఆమె తెలిపారు. దీనిపై ఏడాది క్రితం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది.అయినప్పటికి తనకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. తనను మోసం చేసిన వ్యక్తికి ఇంతవరకు డీఎన్ఏ పరీక్ష చేయించలేదని ఆమె తెలిపారు. ఆమె తల్లి అడబాల లక్ష్మి కుమార్తెకు అండగా ఉన్నారు. దీనిపై నల్లజర్ల సీఐ రవికుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఈ సంఘటన 2025లో జరిగిందన్నారు. బాధితురాలు హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు పూర్తయిందని ఆయన తెలిపారు. అయితే అనిల్కుమార్కు డీఎన్ఏ పరీక్ష చేయించాలని హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు. -
మహిళతో అసభ్య ప్రవర్తన.. బస్సులోనే దాడి
బనశంకరి: బెంగళూరు బీఎంటీసీ బస్సుల్లో గొడవలు కొత్త కాదు. ఇప్పుడో రగడ వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని యువతితో పాటు బస్సు డ్రైవరు అతన్ని చితకబాదారు. సంపిగేహళ్లి పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేశారు. వివరాలు.. ఈ నెల 24వ తేదీ మద్యాహ్నం 12:42 సమయంలో బీఎంటీసీ బస్సు మాన్యతా టెక్పార్కు వైపు వెళ్తోంది. ఓ యువతిని నిందితుడు కావాలనే తాకాడని ఆమె కోపంతో అతన్ని కేకలు వేసింది. తరువాత డ్రైవరుకు చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి అతన్ని బస్సులో మూలకు తోసి బట్టలు విప్పి చితకబాదారు. డ్రైవరు కాలితో ఎడాపెడా కొట్టాడు. చివరకు అతడు బస్సులో నుంచి దిగి పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు వ్యక్తిని మతిస్థిమితం లేనివానిగా భావిస్తున్నారు. తరచూ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఆకతాయిగా ప్రవర్తిస్తుంటాడని సమాచారం. యువతి ధైర్యంగా అతనికి గుణపాఠం చెప్పిందని కొందరు నెటిజన్లు అన్నారు. మరికొందరు అతన్ని అంత ఘోరంగా కొట్టడం సరికాదని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని పట్టుకుని విచారించడానికి పోలీసులు గాలింపు చేపట్టారు.A woman faced sexual harassment by a copassenger on a #BMTC bus near Manyata Tech Park in #Bengaluru.After she confronted the accused, the BMTC driver locked the bus doors to stop him from fleeing and assaulted him. A video of the incident has gone viral. #Karnataka pic.twitter.com/MhXMNMZs4e— Imran Khan (@KeypadGuerilla) July 25, 2026 -
నా భర్తకు తెలిస్తే నా జీవితం నాశనమవుతుంది..!
హైదరాబాద్: ఓ మహిళ నగ్న ఫొటోలను ఆమె భర్తకు చూపిస్తానని బెదిరించిన వ్యక్తిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్లో సె క్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళ (34)కు హెడ్ సెక్యూరిటీ గార్డు బి.రమేషతో పరిచయం ఏర్పడి సన్నిహతంగా మెలిగారు. ఈ క్రమంలో ఆమెకు తెలికుండా తీసిన నగ్న ఫొటోలను రమేష్ ఆమెకే చూపించాడు. ఈ విషయం గురించి భర్తకు చెబితే తన కు టుంబ జీవితమే నాశనమవుతుందని భయపడి చెప్పలేదు. ఇదిలా ఉండగా, సోమవారం రమేష్ బాధితు రాలికి ఫోన్ చేసి బెదిరించి తనకు సహకరించకపోతే రహస్య ఫొటోలను భర్తకు చూపిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె గురువారం ఫిర్యాదు చేసింది. -
నడకమార్గంలో ‘పెద్ది’ సినిమా పోస్టర్తో మహిళ హల్చల్
సాక్షి, తిరుమల: తిరుమలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ లోపం మరోసారి బయటపడింది. తిరుమల నడక మార్గంలో ‘పెద్ది’ సినిమా పోస్టర్తో ఓ మహిళ హల్చల్ చేసింది. నిషేధం ఉన్నా పోస్టర్తో మహిళ రావడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రాజకీయ, సినిమా ప్రచారాలకు తిరుమలలో అనుమతి లేదు. పెద్ది సినిమా పోస్టర్తో మహిళ నడిచిన వీడియో వైరల్గా మారింది. తిరుమల పవిత్రతపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.కాగా, గత శుక్రవారం(జులై 17) తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం శ్రీరంగం నుంచి పట్టువ్రస్తాల సమర్పణ వైభవంగా జరుగుతుండగా, మరోవైపు మహాద్వారం గుండా అనుమతి లేకుండానే ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడన్న ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధుల కథనం ప్రకారం.. రాజారెడ్డి అనే వ్యక్తి అధికారిక అనుమతి లేకుండానే శుక్రవారం తిరుమల ఆలయ మహాద్వారం ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. మహాద్వారం వద్ద విధులు నిర్వహించే విజిలెన్స్ అధికారులు ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతించాల్సి ఉండగా, ఈ ఘటనలో ఆ ప్రక్రియ సక్రమంగా అమలు కాలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఒంటరిగా వెళ్తున్నయువతిని ఎత్తుకెళ్ళి అత్యాచారం..!
కర్ణాటక: రాత్రి ఒంటరిగా వెళ్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన యువతిని కారులో అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మైసూరు జిల్లాలోని టి. నరసిపుర తాలూకాలోని ముగురు గ్రామం వద్ద జరిగింది. ఈ కేసులో టి.నరసిపురలో బట్టల దుకాణదారు రిహాన్ ఖాన్, హౌసింగ్ బోర్డ్వాసి కిషోర్ కుమార్, హెలవర హుండి గ్రామానికి చెందిన కిరణ్ అలియాస్ హుచ్చాను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బెంగాల్కు చెందిన 30 ఏళ్ల యువతి, టి.నరసిపుర పట్టణంలో అద్దె ఇంట్లో నివసిస్తూ, ఒక చాట్ సెంటర్లో పనిచేస్తోంది. ఆమె 19న రాత్రి పార్టీ ఉందంటే మైసూరులో స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తిరిగి బస్టాండులో దిగి నడిచి వస్తుండగా, కారులో వచ్చిన నిందితులు ఆమెను ఏదో చిరునామా అడిగారు, తనకు తెలియదని చెప్పగా, బలవంతంగా ఎక్కించుకున్నారు. పలు లాడ్జిలు తిప్పుతూ చివరకు ముగురు గ్రామం సమీపంలో ఉన్న ఒక లాడ్జికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్తో పాటు రూ. 5 వేలు దోచుకున్నారు. రూ.లక్ష ఇవ్వాలని బెదిరించి రూ.లక్ష ఇవ్వాలని దుండగులు డిమాండ్ చేశారని బాధితురాలు తెలిపింది. డబ్బు ఇంట్లో ఉందని, తీసుకెళ్తే ఇస్తానని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లారని ఆమె పేర్కొంది. బాధితురాలు కారు దిగి వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని సహాయం కోసం కేకలు వేసింది. దీంతో నిందితులు పారిపోయారు. ఇంటి యజమాని సహాయంతో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల ఆధారంగా కారును సీజ్ చేసి, నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి మంగళవారం తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
ఆస్ట్రేలియాకు చెందిన 34 ఏళ్ల జెనిటార్ సా నా’అమోవానా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈమె ఇటీవల నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటికే నలుగురు చిన్న పిల్లలను పెంచుతున్న ఆ దంపతుల ఇల్లు ఈ నలుగురు పాపల రాకతో మొత్తం ఎనిమిది మంది సభ్యుల కుటుంబంగా మారింది. కానీ ఈ సంతోషకరమైన పరిణామం రాత్రికి రాత్రే వారికి సరికొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది.నలుగురు ఆడపిల్లలు పుట్టడం తల్లిదండ్రులు తాము మర్చిపోలేని ఆశీర్వాదంగా అభివర్ణించారు. కానీ వారిని సంరక్షించేందుకు ఆర్థిక వనరులు అవసరమం. ముఖ్యంగా డైపర్లు, ఫార్ములా పాలు, బట్టలు లాంటి రోజువారీ ఖర్చులు ఊహించని భారమే. అయితే ఒకేసారి నలుగురు నవజాత శిశువులను పోషించేందుకు స్నేహితులు, అభిమానులు మొదట్లో చాలా సాయంగా నిలిచారు. మరికొంతమంది ఆ దంపతుల పట్ల ప్రశంసలు కురిపిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబాన్ని నిర్వహించే క్రమంలో సమాజం నుండి లభిస్తున్న ఈ మద్దతు వారికి ఎంతో విలువైందిగా మారింది.అయితే వీరికి ఇంకో సమస్య వచ్చి పడింది. వీళ్లందరితో ప్రయాణించేందుకు ప్రస్తుతం ఉన్న కారులో అందరూ సురక్షితంగా కూర్చోవడానికి సరిపడా సీట్లు లేవు. ఆసుపత్రి పర్యటనలు, స్కూల్ డ్రాప్లు, ఇతర ప్రయాణాలు సులభంగా సాగేందుకు 10 సీట్ల వ్యాన్ (10-seater van)అవసరం ఉంటుందని ఆ కుటుంబం భావిస్తోంది. అలాంటి వ్యాన్ను కొనుగోలు చేయడానికి ఆ తల్లి ఆన్లైన్లో విరాళాల సేకరణను (fundraising) ప్రారంభించడం విశేషంగా నిలిచింది. తమ ఏడుగురు పిల్లలందరికీ సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి సరైన వాహనం, వనరులు ఉన్నాయని నిర్ధారించుకోవడమే ఆ కుటుంబం తక్షణ లక్ష్యంగాపెట్టుకుంది.డాక్టర్ అలెక్సా బెండాల్ ఏమన్నారంటేమోనోజైగోటిక్ క్వాడ్రప్లెట్స్ (ఒకే ఫలదీకరణం చెందిన అండం నుండి ఏర్పడిన ఒకేలా ఉండే నలుగురు శిశువులు) ప్రపంచంలోనే అత్యంత అరుదైన గర్భధారణ రకాల్లో ఒకటి. నామోనా విషయంలో విశేషం ఏమిటంటే, ఆమెకు పుట్టిన ఈ నలుగురు శిశువులకు ఒకే మాయ (placenta) అని నామెనాకు వైద్యం చేసిన డాక్టర్, రాయల్ బ్రిస్బేన్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్కు చెందిన ఫీటల్ మెడిసిన్,ప్రసూతి వైద్యురాలు డాక్టర్ అలెక్సా బెండాల్ తెలిపారు. 1.5 కోట్ల కేసుల్లో ఒకరికి మాత్రమే జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఒకటి రెండు కేసులు ఉండి ఉండవచ్చు కానీ ఆస్ట్రేలియాలో తమకు తెలిసినంత వరకు ఇదే ఏకైక కేసు అని చెప్పారు. View this post on Instagram A post shared by Brisbane Times (@brisbane_times) ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్. -
ప్రియుడిని నరికి, ట్యాప్ కింద పెట్టి..
థానే: మహారాష్ట్రలోని థానేలో మన్పాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భయానక ఘటన వెలుగుచూసింది. పూణెకు చెందిన హసిబా అనే మహిళ తన ప్రియుడు హమిదిల్లా ఇస్లామ్ను దారుణంగా హత్య చేసింది. వివాహేతర సంబంధం లేదా వ్యభిచార కూపంలోకి నెట్టేయాలని చూశాడనే అనుమానంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. సుమారు ఐదు రోజుల క్రితం ప్రియుడిని హతమార్చిన నిందితురాలు, మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. అనంతరం దుర్వాసన రాకుండా, త్వరగా కుళ్లిపోవడానికి బాత్రూమ్లోని రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద ఆ మృతదేహాన్ని గోనెసంచిలో దాచింది.ఈ దారుణానికి పాల్పడిన తర్వాత హసిబా కోల్కతాకు పరారైంది. అయితే ఫ్లాట్ యజమానికి వాయిస్ మెసేజ్ పంపి తాను హత్య చేసినట్లు తెలిపింది. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలలో విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తాళాలు పగలగొట్టి పరిశీలించగా, కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితురాలిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని కోల్కతాకు పంపారు.ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఉద్రిక్తత.. ‘మహా పంచాయత్’తో కదం తొక్కిన అన్నదాతలు! -
Hyd: జూబ్లీహిల్స్ కార్పిడియం పబ్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ కార్పిడియం పబ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం(జూలై 20వ తేదీ) రాత్రి సమయంలో కార్పిడియం పబ్లో మహిళలపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తనపై దాడి చేయవద్దని సదరు మహిళ వేడుకున్నా వినకుండా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగం రావడంతో.. భార్యకు చిత్రహింసలు..!
ఖమ్మం: అదనపు కట్నం కోసం భర్త, ఆడపడుచులు పెట్టిన శారీరక, మానసిక వేధింపులు భరించలేక ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. శంభునిగూడెం గ్రామానికి చెందిన భట్టు భద్రయ్య తన కుమార్తె సుమ (25)ను 2023 మే 16న లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన వజ్జా వెంకటేశ్వర్లుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.లక్ష కట్నంగా ఇచ్చారు. వివాహం అనంతరం కొద్దిరోజుల పాటు ఈ దంపతులు హైదరాబాద్లో ఉన్నారు. ఏడాది గడిచిన తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను అనుమానించడం, బంధువులతో ఫోన్ మాట్లాడినా అవమానించడం, ఎవరితోనూ మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టడం ప్రారంభించాడు. కాగా, తొమ్మిది నెలల క్రితం వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వీరిద్దరూ నాగార్జునసాగర్కు కాపురం మార్చారు. సుమకు పిల్లలు కలగకపోవడం, మరోవైపు వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో అతడి కుటుంబంలో మార్పులు వచ్చాయి. భర్త వెంకటేశ్వర్లుతో పాటు అతని అక్కలు అదనంగా కట్నం తీసుకురావాలంటూ సుమను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారు. పది రోజుల క్రితం భర్త వెంకటేశ్వర్లు సుమను చిత్రహింసలకు గురిచేసి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో సుమ శంభునిగూడెంలోని పుట్టింటికి వచ్చింది. శనివారం భర్త వెంకటేశ్వర్లు, అతని అక్కలు కలిసి శంభునిగూడెంలోని సుమ పుట్టింటికి వచ్చిన, అక్రమ సంబంధం అంటకట్టి, దూషించి, విపరీతంగా కొట్టి వెళ్లిపోయారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సుమ ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి బట్టు భద్రయ్య ఫిర్యాదు మేరకు భర్త వెంకటేశ్వర్లు, ఆడ బిడ్డలు విజయ, రజిత, సుజాతలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తిరుపతి వెల్లడించారు. -
గుంటూరు ఘటన అత్యంత అమానవీయం: అంబటి
సాక్షి, తాడేపల్లి: గుంటూరు ఘటన అత్యంత అమానవీయం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో అమానుషంగా మహిళను వివస్త్రను చేసి.. టీడీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నూరి ఫాతిమా పరామర్శించారు. బాధిత మహిళకు ధైర్యం చెప్పారు.అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడు రోజుల క్రితం సంఘటన జరిగితే నిన్న జరిగినట్టు చంద్రబాబు చెప్తున్నారు. ఈ మూడు రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు అబద్దాలు చెప్పటం దుర్మార్గం. టీడీపీ నేత మల్లెల మూర్తి బాధిత మహిళ, ఆమె కుమారుడిని దారుణంగా కొట్టారు. అదే రోజు పోలీసు స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు’’ అని ఆయన మండిపడ్డారు.‘‘నా మీదే స్టేషన్కు వెళ్తావా? అంటూ రోడ్డు మీదే కొట్టారు. ఆ మహిళను వివస్త్ర చేశారు. కేసు పెట్టకపోగా కేసు రిజిస్టర్ చేయలేదు. ఆ తర్వాత 16న నమోదు చేసి అరెస్టు కూడా చేయలేదు. సీసీ కెమెరా పుటేజీ బయటకు వచ్చాక చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే మేల్కొన్నారు. ఆ టీడీపీ నేత మూర్తిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మేము పరామర్శకు వెళ్తున్నామని తెలిసి బాధిత కుటుంబాన్ని విచారణ పేరుతో పీఎస్కు తరలించారు...టీడీపీ నేత డబ్బులు వసూలు చేసే దందాలో జరిగిన గొడవ ఇది. దీన్ని వెలుగులోకి రాకుండా తొక్కేసేందుకు ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ కుట్ర జరిగింది. కానీ పోలీసులను బలి చేసే కుట్ర చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న సంఘటనలను చూసి హోంమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. తన పదవికి రాజీనామా చేసి వెళ్లాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు. -
‘టీడీపీ నేతలు కాలకేయుల్లా మారిపోయారు’
సాక్షి, విశాఖపట్నం: గుంటూరులో సభ్య సమాజం తల దించుకునే ఘటన జరిగిందని.. టీడీపీ నేతలు కాలకేయుల్లా మారిపోయారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళలు కూటమి పాలనలో స్వేచ్ఛగా బతకలేరా..?. మల్లెల మూర్తి అనే వ్యక్తి నీటి కుళాయి కోసం మహిళ వద్ద రూ.10 వేలు లంచం అడిగాడు. అక్కడ తలెత్తిన ఘర్షణ కారణంగా ఆమెను వివస్త్రను చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘రాష్ట్రంలో చట్టం, న్యాయం అమలు కావా..?. మహిళలపై వేధింపులు, దాడుల్లో కూటమి నేతలు ఉన్నారు. గుంటూరు ఘటనలో ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరులు సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు ఇలాంటి పనులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. టీడీపీ అంటే దుస్సాసన, దుర్మార్గుల పార్టీ. ఇలాంటి సంఘటన జరిగినందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. హోం మంత్రి ఇప్పుడు వీడియో కాల్లో పరామర్శ చేస్తారా..?. ఆ కుటుంబాల దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో తెలుసుకోవాలి. టీడీపీ కార్యకర్తలు ఇంతటి దారుణనికి ఒడిగడితే మహిళా కమిషన్ ఏం చేస్తుంది?..ఘటన జరిగి మూడు రోజులు అయితే మీకు తెలియదా..?. సీఎం చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మల్లెల మూర్తి మీ పార్టీ కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి గళ్ళా మాధవి పేటెంట్. అంబటి ఇంటిపై దాడి చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇలాంటి దారుణాలకు టీడీపీ నాయకులు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే నజీర్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే మహిళను లోబరుచుకొని అబార్షన్ చేయిస్తే చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే మిగతా వారు ఇలాగే చేస్తారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను మోసం చేస్తే మీరు ఏం చేశారు?. కిరణ్ రాయల్ వలన లక్ష్మి అనే మహిళ ఇబ్బంది పడితే మీరు ఏం చర్యలు తీసుకున్నారు’’ అంటూ వరుదు కళ్యాణి నిలదీశారు. -
జంతర్మంతర్: సీజేపీ చీఫ్ అభిజిత్పై ఇంక్ దాడి
ఢిల్లీ జంతర్మంతర్ దగ్గర మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఓ మహిళ ఇంక్ చల్లింది. ఉదయం నుంచి జంతరమంతర్ దగ్గర దీప్కే నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పోరాటానికి మద్దతుగా సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం ఆయనను సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు.ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనల మేరకే ఈ చర్య తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ చర్యపై సీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాంగ్చుక్ శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు బలవంతంగా తరలించారని ఆరోపించారు. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం జంతర్ మంతర్ దగ్గర మరో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. దీప్కే ప్రసంగిస్తుండగా ఓ మహిళ ఆయనపై సిరా లాంటి ద్రవాన్ని విసిరింది. దీంతో గందరగోళం నెలకొంది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.20 రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలో వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో.. శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. నిరసనకారులు పోలీసుల చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో కాసేపు తోపులాట జరిగింది. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సీజేపీ నేతృత్వంలో జరుగుతున్న నిరసనకు మద్దతుగా జూన్ 28 నుంచి వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్యులు.. ఈ దీక్షలో ఆయన దాదాపు 9.5 కిలోల బరువు తగ్గారని తెలిపారు. -
రెచ్చిపోయిన పోకిరీకి, యువతి గుణపాఠం : వీడియో వైరల్
మహారాష్ట్రలోని భూసావల్-వర్ధా ప్యాసింజర్ రైలులో ఒక యువతి తన ధైర్యసాహసాలతో నెట్టింట వైరల్గా మారింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోకిరీకి విచిత్రమైన రీతిలో, జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. తోటి ప్యాసింజర్లు కూడా ఆమెకు తోడవడంతో, నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. తద్వారా వేధింపులకు భయపడి మౌనంగా ఉండకుండా గట్టిగా ప్రతిఘటించాలనే ధైర్యాన్నిచ్చింది.కదులుతున్న రైలులో ఒక యువకుడు ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అంతే అసాధారణ ధైర్యం ప్రదర్శించి, తోటి ప్రయాణికుల సహాయంతో అతడిని పట్టుకుంది.ఆ పోకిరీకి చేతులకు గాజులు తొడిగి, పెదవులకు లిప్స్టిక్ పూసి అవమానించింది. ఆ కంపార్ట్మెంట్లోని చాలా మంది ఆ మహిళను చప్పట్లతో అభినందిస్తూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్పాట్ : నిద్రలేమే వరంలా మారిందిA brave young woman on the Bhusawal-Wardha Passenger Train taught a sexual harasser a lesson he will never forget, in a unique and viral act of justice. When a young man behaved indecently with her inside the moving train, the woman showed remarkable courage and caught hold of… pic.twitter.com/PPOyN0YdKI— Pune Mirror (@ThePuneMirror) July 17, 2026 వేధింపులపై మౌనంగా ఉండకుండా నిలబడిన ఈ సాహసికి, ఆమె తోటి ప్రయాణికులకు విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ ఘటన మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారి తీసింది. అయితే గాజులు, బొట్టు పెట్టడం అంటే తిరిగి మనల్ని మనం అవమానించుకున్నట్టే.. కానీ ఏదో విధంగా ప్రతిఘటించడం అభినందనీయం అంటున్నారు కొంతమంది. మహిళలు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురైనప్పుడు పక్కన ఉన్నవారు జోక్యం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను మరికొందరు నొక్కి చెప్పారు. ఇలాంటి పోకిరీలకు తగిన శిక్ష విధించేలా అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీ -
నడి రోడ్డుపై మహిళను వివస్త్రరణ చేసి టీడీపీ నేతల బరితెగింపు..
-
మరదలిపై బావ దాడి.. అడ్డొచ్చిన అత్తను నరికి చంపాడు..!
సాక్షి, చెన్నై: నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కోపంతో మరదలిపై ఓ యువకుడు కొడవలితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించినా అత్తపై కూడా విచక్షణారహితంగా విరుచుకుపడ్డాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనలో యువతి తల్లి ప్రాణాలు కోల్పోగా.. యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కరియాపట్టి తాలూకా కల్కురిచి గ్రామానికి చెందిన ముత్తుకుమార్, వినాయకజ్యోతి(45) దంపతులకు వర్ష(21) అనే కుమార్తె ఉంది. ముత్తుకుమార్ సోదరి కుమారుడు యువరాజన్(32)తో ఆమెకు వివాహం చేసేందుకు నిశి్చతార్థం చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లికి వర్ష నిరాకరించడంతో వివాదం మొదలైంది. బుధవారం ఉదయం తీవ్ర ఆగ్రహానికి గురైన యువరాజన్.. ముత్తుకుమార్ ఇంటికి వచ్చి వర్షతో గొడవకు దిగాడు. కోపం పట్టలేక తన వెంట తెచ్చుకున్న కొడవలితో వర్షపై దాడి చేశాడు. అదే సమయంలో కుమార్తెను రక్షించేందుకు వినాయకజ్యోతి అడ్డువెళ్లింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువరాజన్.. వినాయకజ్యోతిని దారుణంగా నరికేశాడు. ఇంతలో చుట్టుపక్కలవారు రావడంతో.. అతను పారిపోయాడు. ఘటనాస్థలంలోనే వినాయక జ్యోతి మరణించగా.. తీవ్ర గాయాలపాలైన వర్షను ఆస్పత్రికి తరలించారు. యువరాజన్ బుధవారం సాయంత్రం మల్లంగి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. అత్తను, మరదలి -
అమెరికాలో ఏపీ యువతి మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి మృతి చెందింది. మృతురాలిని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్నగా గుర్తించారు. ఆమె ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లారు. ఇటీవలే చదువు పూర్తి చేసిన ప్రసన్న ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు.న్యూజెర్సీలో ప్రసన్న తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితులకు గాయాలు కాగా, ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. సాయం అందించాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
డెలివరీ బాయ్ వికృత చేష్టలు.. మహిళ ఇంట్లోకి చొరబడి..
మెట్రో నగరాల్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బెంగళూరులోని ఒక ఫ్లాట్లో ఒంటరిగా ఉన్న మహిళా పట్ల డెలివరీ బాయ్ హేయంగా ప్రవర్తించాడు. తన ఇంట్లోకి బలవంతంగా చొరబడి.. తన ముందు అసభ్యంగా ప్రవర్తించాడని నగరానికి చెందిన ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. ఈ పోస్ట్కు స్పందించిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.సదరు డెలివరీ బాయ్ ఒక పార్సిల్ డెలివరీ చేయడానికి తన ఇంటికి వచ్చాడని.. ఆ తర్వాత వాష్రూమ్ ఉపయోగించుకోవచ్చా అని అడిగాడని ఆ మహిళ పేర్కొంది. అయితే ఆమె నిరాకరించినప్పటికీ.. అతను బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డాడని, వాష్రూమ్ నుండి బయటకు వస్తూ తన ప్రైవేట్ భాగాలను చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది."నేను మర్యాదపూర్వకంగానే పలుమార్లు నిరాకరించాను. అపరిచితులను నా ఫ్లాట్లోకి రానివ్వనని స్పష్టంగా చెప్పాను. అత్యవసరం అయితే పక్కింటి పురుషులను అడగాలని కూడా సూచించాను. నేను ఎన్నిసార్లు వద్దని చెప్పినా వినకుండా.. అతను తన చెప్పులు విప్పేసి.. నా అనుమతి లేకుండా బలవంతంగా నా ఇంట్లోకి చొరబడ్డాడని ఆమె తెలిపింది. ఈ ఘటనపై ఫ్లిప్కార్ట్ సంస్థ తీవ్రంగా స్పందించింది. కస్టమర్ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే.. సదరు డెలివరీ బాయ్ను ఉద్యోగం నుంచి తొలగించామని పేర్కొంది. -
8 నెలల గర్భిణిపై భర్త కిరాతకం..!
కడుపులో పెరుగుతున్న బిడ్డ వద్దనుకున్న భర్త 8 నెలల కడుపుతో ఉన్న భార్యను హత్య చేయడానికి ప్రయత్నించిన సంఘటన చిక్కబాణావర పోలీస్స్టేషన్ పరిధిలోని హెసరఘట్ట రోడ్డులో చోటు చేసుకుంది. మహమ్మద్ పీర్(40) అనే వ్యక్తి తన భార్య హసీనా(35)పై హత్యాయత్నం చేశాడు. వివరాలు.. మహమ్మద్ పీర్, హసీనాకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే అంతకు ముందే మహమ్మద్ పీర్కు వివాహమై సంతానం కూడా ఉన్నారు. ఈక్రమంలో హసీనా రెండు సార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. మళ్లీ ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవడానికి హసీనా ఒప్పుకోలేదు. మహమ్మద్ పీర్ ఆమెపై దాడి చేసి అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసినా హసీనా ససేమిరా అంది. గురువారం సాయంత్రం హసీనా ఇంట్లో నిద్రిస్తుండగా చున్నీ(వేల్)తో గొంతు బిగించి హత్యాయత్నం చేశాడు. పెనుగులాటలో హసీనా మూర్ఛబోవడంతో మృతి చెందిందని భావించి పరారయ్యాడు. అయితే హసీనాకు స్పృహ వచ్చాక పుట్టింటికి ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పింది. కుటుంబ సభ్యులు వెంటనే హసీనాను వెంటబెట్టుకుని పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించి నిందితుడిని అరెస్టు చేశారు.కర్ణాటక: -
ఏయ్ ఉండమ్మా.. మహిళపై చంద్రబాబు ఆగ్రహం
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లెలోని మీ భూమి-మీ హక్కు సభలో ఓ మహిళపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సమస్య చెప్పేందుకు ప్రయత్నించిన మహిళపై చంద్రబాబు మండిపడ్డారు. ఏయ్ ఉండమ్మా.. అంటూ మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. ఇది పవిత్ర కార్యక్రమం అంటూనే సమస్య వినకుండా చంద్రబాబు దాటవేశారు.మహిళను అడ్డుకోలేదని పోలీసులపై కూడా చంద్రబాబు చిందులు తొక్కారు. ఏయ్ గీయ్ అంటూ కాసేపు హడావుడి చేసిన చంద్రబాబు తీరుపట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా పలుసార్లు చంద్రబాబు ఇలాగే ప్రవర్తించారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.2018లో సచివాలయం బయట నాయీ బ్రాహ్మణులతో చంద్రబాబు ఇలానే బిహేవ్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఇయ్యమయ్యా... కనీస వేతనాలు ఇవ్వమని చెబుతున్నా. ఇవ్వం... మళ్లీ మళ్లీ చెబుతున్నా.. తోక జాడిస్తే కట్ చేస్తా. బీ కేర్పుల్. బెదిరిస్తే తోక కట్ చేస్తా’ ‘పిచ్చాటలాడితే మాత్రం.. చాలా సీరియస్గా ఉంటది’ ‘ఏం తమాషాలాడుతున్నారా...’ అంటూ బెదిరింపులకు దిగారు. చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడుతూ.. వేలు చూపిస్తూ హెచ్చరికలు చేయటంతో నాయీ బ్రాహ్మణులు నిర్ఘాంతపోయారు. అప్పటి ఘటనను కూడా గుర్తు చేస్తూ.. సోషల్ మీడియాలో ప్రజలు మండిపడుతున్నారు. -
5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది
మహిళలు పెళ్లి, పిల్లలు తరువాత చాలా బరువు పెరుగుతారు. ఇలా అదనంగా పెరిగిన బరువును తగ్గించు కోవడానికి చాలానే కష్టపడాల్సి వస్తుంది. కానీ అసాధ్యం కాదు. ఈ విషయాన్నే అక్షరాలా నిరూపించారు గురుగ్రామ్కు చెందిన దీప్తి హర్షానా. ఆహారం కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. డైటీషియన్ సహాయం లేకుండా, ఖరీదైన డైట్ ప్లాన్స్ జోలికి వెళ్లకుండానే తన బరువును 92 కిలోల నుండి 60 కిలోలకు తగ్గించుకున్నారు. అదెలాగో ఒకసారి చూద్దాం.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు చురుకైన జీవనశైలిని కలిగి ఉండటం బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడినప్పటికీ, బరువు తగ్గాల నుకునే వారికి సరైన ఆహారపు అలవాట్లు (డైట్) చాలా ముఖ్యం. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి హర్షానా సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాల ప్రకారం ఆమె కేవలం ఇంట్లో వండుకునే సాధారణ భోజనం, రోజుకు 45 నిమిషాల వ్యాయామంతో ఈ విజయాన్ని సాధించారు. ముఖ్యంగా 5 పదార్థాలను తన ఆహారం నుండి పూర్తిగా దూరం పెట్టి ఈ సక్సెస్ను సాధించడం విశేషం. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana)చక్కెర పానీయాలు (Sugary Drinks)ఇవి శరీరంలో కేలరీలను, బరువును మరియు ముఖం ఉబ్బిపోయేలా చేసే 'వాటర్ రిటెన్షన్'ను పెంచుతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఆమె నిమ్మరసం, కొబ్బరి నీళ్లు మరియు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకున్నారు. వైట్ బ్రెడ్ (White Bread)మైదాతో చేసే వైట్ బ్రెడ్లోని రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. దీనికి బదులుగా మల్టీగ్రెయిన్ లేదా హోల్ వీట్ (గోధుమ) బ్రెడ్, సోర్డో (sourdough) బ్రెడ్ మరియు ఓట్స్ ఎంచుకున్నారు.ప్యాక్ చేసిన స్నాక్స్ (Packaged Snacks)చిప్స్, కుర్కురే లాంటి స్నాక్స్లో ఉప్పు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరానికి (bloating, ఇంకా లేనిపోని ఆకలికి కారణమవుతాయి. వీటి స్థానంలో కొద్దిగా వేయించిన శనగలు (roasted chana), డ్రై ఫ్రూట్స్ (nuts), తామర గింజలు (makhana) తిన్నారు.నూనెలో వేయించిన ఫాస్ట్ ఫుడ్ (Fried Fast Food)వీటిలోని అధిక కొవ్వు, ఉప్పు బరువును పెంచడమే కాకుండా శరీరాన్ని బద్ధకంగా మారుస్తాయి. అందుకే ఇంట్లోనే చేసుకునే హెల్తీ వ్రాప్స్ (wraps), పనీర్ లేదా చికెన్ టిక్కా మరియు సాధారణ ఇంటి భోజనాన్ని ప్రాధాన్యత ఇచ్చారు. ఇదీ చదవండి: 256 గంటలు, 131 మంది శ్రమ : ఆమీర్-గౌరీ అరుదైన వెడ్డింగ్ రింగ్అర్ధరాత్రి స్నాక్స్ (Late-Night Snacking)రాత్రి వేళల్లో ఆలోచించకుండా ఏది పడితే అది తినడం వల్ల శరీరానికి అవసరం లేని అదనపు కేలరీలు చేరతాయి. ఈ విషయాన్నిగ్రహించిన ఆమె రాత్రి వేళ చిరుతిండ్లను పూర్తిగా దూరం పెట్టాడు. అలాగే ఆకలిగా లేదా ఏదైనా తినాలనిపిస్తే హెర్బల్ టీ తాగాలని ఆమె సూచించారు. ఇంకా రోజుకు 2-3 లీటర్ల నీళ్లు తాగడం, 7 గంటల నిద్ర, ప్రతీరోజూ వాకింగ్ చేస్తే, బాడీలో, ముఖ్యంగా మార్పు తప్పకుండా గమనిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana)నోట్: కచ్చితమైన ప్రణాళిక, నిపుణుల పర్యవేక్షణ ఉంటే అధిక బరువును తగ్గించుకోవడం సులువే అవుతుంది. ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. బరువు తగ్గడానికి ఎలాంటి డైట్ పాటించాలన్నా ముందుగా వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం మంచిది.ఇదీ చదవండి: ఆమీర్ భార్య గౌరి బ్రైడల్ లుక్ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా? -
హైదరాబాద్.. అతడి రూమ్కి చాలాసార్లు పిలిపించుకున్నాడు..!
నల్లగొండ: యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హుజూర్నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరామ ప్రసాద్ మంగళవారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొబ్బ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలానికి చెందిన యువతి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో నివాసం ఉంటుంది. ఆమె వివాహం నిమిత్తం ఒక మ్యారేజ్ బ్యూరోకు తన బయోడేటా పంపింది. విషయం తెలుసుకున్న హైదరాబాద్లోని బోడుప్పల్లో నివాసముండే గొర్రె ప్రభుదాస్ ఆమెను సంప్రదించి, వివాహం చేసుకుంటానని నమ్మించాడు.తాను నిరుద్యోగినని తన అవసరాలకు కొంత డబ్బు కావాలని పెద్ద మొత్తంలో వివిధ దఫాల్లో డబ్బులు తీసుకున్నాడు. తన స్వగ్రామమైన కర్నూల్లో నివాసముంటున్న తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని ఆమెను నమ్మించి కర్నూలు కు తీసుకువెళ్లాడు. ఈక్రమంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా హైదరాబాద్లోని అతడి రూమ్కి కూడా చాలాసార్లు పిలిపించుకున్నాడు. అనంతరం అధిక కట్నం ఆశించి ప్రభుదాస్ వేరే సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిసి ఆమె అతనిని కలిసి పెళ్లి చేసుకోమని కోరగా అతను అందుకు నిరాకరించి వేరే సంబంధం చేసుకుంటానని తేల్చిచెప్పాడు.ఆమెను దుర్భాషలాడి, చంపుతానని బెదిరించడంతో సదరు యువతి గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ రామకృష్ణారెడ్డి కేసు నమోదు చేశారు. హుజూర్నగర్ సీఐ భాస్కర్ దర్యాప్తును పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల పూర్తి విచారణ అనంతరం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొబ్బ కోటిరెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితుడు గొర్రె ప్రభుదాస్పై నేరం నిరూపణ కావడంతో మూడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ 1,500ల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరొక నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్కు లైజన్ ఆఫీసర్ వెంకన్న సహకరించారు. -
భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టి..
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికంద్రా పరిధిలోని దహతోరా ప్రాంతంలో సురేంద్ర శర్మ (44) తన భార్య రూబీ శర్మ, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. వీరికి వివాహమై 16 ఏళ్లు పూర్తయింది. కాగా గత మే 26న సురేంద్ర శర్మ కనిపించకుండా పోయాడంటూ సికంద్రా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది.పోలీసుల దర్యాప్తులో రూబీ శర్మ ఒక పథకం ప్రకారం భర్తను హత్య చేసిందని తేలింది. ఘటన జరిగిన రోజున ఆమె తన ఇద్దరు కుమార్తెలను సురేంద్ర శర్మ పెద్దన్నయ్య ఇంటికి పంపించివేసింది. ఆ తర్వాత భర్తకు నిద్రమాత్రలు కలిపిన ఖీర్ను ఇచ్చింది. అది తిన్న సురేంద్ర శర్మ స్పృహ కోల్పోగానే, ఆమె అతడి గొంతు నులిమి హత్య చేసింది. మరుసటి రోజు ఉదయం, బాత్రూమ్లో ఒక గొయ్యి తవ్వి, అందులో భర్త శవాన్ని పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ప్రదేశాన్ని సిమెంట్ ఫ్లోరింగ్తో పూర్తిగా కప్పివేసింది.తన భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడని బంధువులను, పొరుగువారిని 45 రోజులుగా రూబీ నమ్మిస్తూ వచ్చింది. అయితే, సురేంద్ర శర్మకు సంబంధించిన ఒక పాత కేసుకు సంబంధించి రొటీన్ వెరిఫికేషన్ కోసం పోలీసులు ఇటీవల అతడి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రూబీ శర్మ కంగారుపడుతూ, తన బావను (భర్త అన్నయ్యను) ఇంటికి పిలిపించింది. పోలీసులు రూబీ శర్మను తమదైన శైలిలో విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించి శవాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని చూపించింది. పోలీసులు వెంటనే బాత్రూమ్ ఫ్లోరింగ్ను పగలగొట్టి, సురేంద్ర శర్మ మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఆగ్రా హరిపర్వత్ సర్కిల్ ఏసీపీ అమీషా మీడియాతో మాట్లాడుతూ.. మే 26న సురేంద్ర మిస్సింగ్ కేసు నమోదైందని, విచారణలో భార్యే అతడిని హత్య చేసి బాత్రూమ్లో పూడ్చిపెట్టినట్లు తేలిందన్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: పాక్లో కలకలం: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ల కోసం ‘మాయ’ స్మగ్లింగ్ -
నా దుస్తులు విప్పేస్తా… నీ గతి అదోగతే!
కొన్నిరోజులుగా ఇంట్లో వరుసగా డబ్బు, నగలు మాయం అవుతుండటంతో యజమానికి అనుమానం పెరిగింది. ఇంటా బయట సీసీటీవీలు ఏర్పాటు చేయించాడు. వాటిల్లో కనిపించిన దృశ్యాలు ఆయనను షాక్కు గురి చేశాయి. వెంటనే అప్రమత్తమై దొంగను అడ్డుకోగా.. ఆమె చేసిన పని నెట్టింట వైరల్గా మారింది.రాజస్థాన్లోని జైపూర్ ముహానా ప్రాంతంలోని ఓ ఇంట్లో కొద్దిరోజులుగా అనుమానాస్పద చోరీలు జరుగుతున్నాయి. మొదట్లో చిన్నగా డబ్బు మాయం కావడం ప్రారంభమై, తర్వాత నగలు కూడా కనిపించకపోవడంతో యజమాని అనుమానం బలపడింది. దీంతో ఆయన ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.గురువారం కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో సీసీటీవీ లైవ్ ఫీడ్లో ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి నేరుగా బెడ్రూమ్ వైపు వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అల్మారా తెరిచి నగల పెట్టెను పరిశీలిస్తున్న దృశ్యాలను చూసిన యజమాని ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. తక్షణమే అప్రమత్తమైన యజమాని పొరుగువారికి సమాచారం ఇచ్చి ఇంటి గేటును లాక్ చేయించాడు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న వారు ఆమెను ఇంట్లోనే అడ్డుకున్నారు.అయితే ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బయటపడే మార్గం లేకపోవడంతో ఆమె తీవ్రంగా బెదిరింపులకు దిగింది. పోలీసులు వస్తారా? రానివ్వు.. వాళ్లు వచ్చేలోపు నా దుస్తులు విప్పేస్తా!. నువ్వు నన్ను బలవంతం చేయబోయావని ఏడుస్తా.. వాళ్లు నిన్నే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. నీ గతి అదోగతే.. నన్ను బయటకు పోనివ్వండి’’ అంటూ ఆమె చెప్పిన మాటలు విని ఆ ఓనర్, స్థానికులు నిర్ఘాంతపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పెళ్లి పేరుతో ఎర... రూ.3.5 కోట్ల టోకరా
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాపారి టి.క్రాంతి సింగ్ 2019లో కుటుంబ వేడుకలో పరిచయమైన హర్షితా సింగ్ తనను వివాహం చేసుకుంటానని నమ్మించి రూ.3.5 కోట్లు కాజేసిందని సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. ఆమెకు అప్పటికే వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం దాచింది. అత్యవసరం, వైద్య ఖర్చులు అంటూ ఆమె, కుటుంబ సభ్యులు డాక్టర్ శైలేందర్ సింగ్, లాజ్వంతి సింగ్ భారీ మొత్తాలు కోరారు. బాధితుడు రుణాలు, తాకట్టు, బంగారం విక్రయం ద్వారా చెల్లించాడు. చికిత్సలపై అనుమానం రావడంతో ఆసుపత్రుల్లో విచారించి అబద్ధమని తేల్చాడు. డబ్బు తీసుకున్నట్లు అంగీకరించినప్పటికీ బెదిరించారని ఆరోపించాడు. 2024 ఆగస్టులో ఆత్మహత్యకుప్రయత్నించాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భూమి అభివృద్ధి పేరిట రూ.2 కోట్ల మోసం మొహమ్మద్ అమీర్ హుస్సేన్ (మెరిడియన్ హోమ్స్ భాగస్వామి)ను రియల్ ఎస్టేట్ వ్యాపారులు విశ్వనాథుల శశిధర్, చికోటి కృష్ణ, జి. వెంకటేశ్వర్రావు, వి. రాజ్యలక్ష్మి రూ.2 కోట్లకు మోసం చేసినట్లు సీసీఎస్లో కేసు నమోదైంది. నిందితులు నందిగామలో 80 ఎకరాల భూమిపై అభివృద్ధి హక్కులు ఉన్నాయని చెప్పి, 2021–2022 మధ్య మూడు విడతల్లో రూ.2 కోట్లు తీసుకున్నారు. ఎంఓయూ రాసుకున్నప్పటికీ, అసలు భూ యజమానులు హక్కులు లేవని వెల్లడించారు. డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా, మరో ఎంఓయూ చేసి రూ.3 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ డబ్బును వేరే అవసరాలకు మళ్లించారని తెలిసి బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఒకేసారి ముచ్చటగా మూడు ఉద్యోగాలు
పార్వతీపురం మన్యం: పట్టుదల, కృషి ఉంటే విజయాలు తప్పకుండా వరిస్తాయని నిరూపించింది నెల్లిమర్ల మండలంలోని మొయిద విజయరాంపురం గ్రామానికి చెందిన యువతి పతివాడ రమాదేవి. పోటీ పరీక్షలకు సిద్ధమైన ఆమె ఒకేసారి మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. విజయనగరం మహారాజా కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసిన రమాదేవి కొంతకాలంగా బ్యాంకింగ్ రంగ ఉద్యోగాలపై దృష్టి సారించి పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఇటీవల నిర్వహించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు నియామక పరీక్షల్లో పాల్గొని మూడింటిలోనూ అర్హత సాధించింది. మూడు బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రమాదేవి తెలిపింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె అసాధారణ విజయం సాధించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రమాదేవి తండ్రి వెంకటరమణ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అసిస్టెంట్ సర్వేయర్గా విధులు నిర్వహిస్తుండగా..తల్లి రమణమ్మ గృహిణి..కుమార్తె సాధించిన విజయం తమకు గర్వంగా ఉందని వారు సంతోషం వెలిబుచ్చారు. యువతి రమాదేవి విజయం పట్ల ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు, గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. -
వ్యవసాయ బావిలో 24 గంటలు
కరీంనగర్ జిల్లా: నీటిలో గంటసేపు ఉంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటిది వ్యవసాయబావిలో 24 గంటలపాటు నరకం అనుభవించిందో మహిళ. బావి యజమాని చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. కరీంనగర్ కిసాన్నగర్కు చెందిన లక్ష్మి అడ్డా కూలీ. నిత్యం నగరంలోని టవర్ సర్కిల్ వద్ద ఉన్న లేబర్ అడ్డా వద్దకు పని కోసం వస్తుంది. బుధవారం ఉదయం కూడా అడ్డా మీదకు వచ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పని ఉందని పిలిచాడు. రాపిడో బైక్ బుక్ చేసి తిమ్మాపూర్ స్టేజీ వరకు పంపించాడు. మరో బైక్పై వెనకే వెళ్లాడు. తిమ్మాపూర్ నుంచి తన బైక్ ఎక్కించుకొని నుస్తులాపూర్ శివారులోని ఓ రైతు వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బెదిరించి, ఒంటిపై ఉన్న బంగారం లాక్కొని, బావిలోకి తోసేశాడు. లక్ష్మికి ఈత రావడంతో దరికి చేరి తాడు పట్టుకుంది. ఆ తాడును కోసేసి అతను అక్కడి నుంచి పరారయ్యాడు. బావిలో దొరికిన మరో ఆసరాతో బుధవారం రాత్రంతా, గురువారం మధ్యాహ్నం వరకు లక్ష్మి బావిలోనే ఉండిపోయింది. మిస్సింగ్ కేసు నమోదుతో.. బుధవారం రాత్రయినా ఇంటికి రాకపోవడంతో లక్ష్మి కొడుకు కరీంనగర్లోని త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ఉదయం లేబర్ అడ్డా వద్ద తన తల్లిని డ్రాప్ చేశానని, ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా లక్ష్మి నుస్తులాపూర్ ఏరియాలో ఉన్నట్టు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం వ్యవసాయ బావివద్దకు వెళ్లిన పొలం యజమానికి బావిలోంచి అరుపులు వినిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు బావి వద్దకు చేరుకొని మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. రాపిడో బుక్ చేసిన వివరాలు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
వాషింగ్ మెషీన్ డ్రమ్లో కూర్చోబెట్టి..
బెంగళూరు: డేకేర్ సెంటర్ పిల్లల పాలిట నరకమైంది. బెంగళూరులో కార్పొరేట్ సంస్థలోని డేకేర్ సంరక్షణలో ఉన్న పిల్లలను అక్కడ పనిచేస్తున్న సిబ్బంది దారుణంగా శిక్షించారు. ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగ సమయంలో పిల్లల్ని ఈ డేకేర్ సెంటర్లో వదిలి వెళ్తున్నారు. అక్కడ పని చేసే ఐదుగురు సిబ్బంది పిల్లల అల్లరిని మాన్పించడానికి పైశాచిక పద్ధతులు అనుసరించారు. చిన్న పిల్లలనే మానవత్వం లేకుండా కర్కశంగా శిక్షించారు.పిల్లలు ఏడ్చినప్పుడు ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్లో ఉంచి తలుపు మూసేసి భయపెట్టారు. వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్పై కూర్చోబెట్టి, హై ప్రెజర్ జెట్తో నోట్లో నీళ్లు కొట్టడం, చీకటి బాత్రూమ్లో బంధించడం వంటివి చేశారు. ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ క్యాప్జెమిని బెంగళూరు క్యాంపస్లో నడుస్తున్న డేకేర్ నుంచి బయటికొచ్చి వీడియోలు పిల్లల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి.వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురు మహిళలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారులు, డేకేర్ సిబ్బంది, ఇతర సాక్షుల నుంచి వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. పోలీసులు ఫుటేజీని ధృవీకరించి, సంఘటనల క్రమాన్ని పరిశీలిస్తున్నారు. ఆ డేకేర్ సెంటర్లో ఇలాంటి వేధింపులు చాలాకాలంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. -
ఏవండీ.. నన్ను కిడ్నాప్ చేశారు.. లొకేషన్ షేర్ చేశా!
బెంగళూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహిత యువతిని ముగ్గురు వ్యక్తులు అపహరించి రామనగరలోని ఓ ఇంటిలో అక్రమంగా నిర్బంధించారు. ఫిర్యాదు మేరకు రామనగర పోలీసులు కార్యాచరణ జరిపి బాధితురాలిని కాపాడి, ముగ్గురు కిడ్నాపర్లను అరెస్టు చేశారు. వివరాలు... మైసూరుకు చెందిన ఆలనహళ్లి శివకుమార్ భార్య భవ్య (19). ఎలక్ట్రిషియన్గా పని చేసే శివకుమార్ ఏడాది క్రితం హాసన్ జిల్లా సకలేశపురకు చెందిన భవ్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆలనహళ్లిలో నివాసం ఉంటున్నారు. జూన్ 25న శివకుమార్ పని మీద బోగాదికి వెళ్లారు. భార్యకు ఫోన్ చేయగా, స్విచాఫ్ వచ్చింది. రాత్రయినా భార్య ఇంటికి రాకపోవడంతో ఆందోళనలో ఉన్న శివకుమార్కు మరునాడు ఫోన్ వచ్చింది. అతని భార్య మాట్లాడుతూ తనను ముగ్గురు వ్యక్తులు అపహరించి రామనగరకు పిలుచుకొచ్చి ఇక్కడ ఒక ఇంటిలో నిర్బంధించారు, కాపాడమని కోరి లొకేషన్ షేర్ చేసింది. వెంటనే అప్రమత్తమైన శివకుమార్ 112కు ఫోన్ చేసి రామనగర పోలీసులకు పూర్తి వివరాలు అందించారు. పోలీసులు కార్యాచరణ జరిపి భవ్యను కాపాడారు. కిడ్నాప్కు పాల్పడిన రామనగరవాసులు సుమ, కిరణ్, మరొక మహిళను బంధించి కటకటాల వెనక్కు నెట్టారు. -
లక్షల జీతం వదులుకుని వెయిటర్గా..! ఎందుకంటే..
కార్పొరేట్ ఉద్యోగాలు అంటే ఏ రేంజ్లో వర్క్ టెన్షన్స్ ఉంటాయో తెలిసిందే. చాలామంది ఆ ఒత్తిడి తట్టుకోలేక రిజైన్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఈ అమ్మాయి నెట్టింట షేర్ చేసిన పోస్ట్ అందర్నీ షాక్కి గురి చేసింది. ఆ కార్పొరేట్ ఉద్యోగం వదిలేశాక హాయిగా ఆరోగ్యంగా ఉన్నానని చేసిన పోస్ట్ అందరిలో తీవ్ర ఆందోళనలు లేవనెత్తింది. వివరాల్లోకెళ్తే..33 ఏళ్ల మహిళ మంచి కార్పొరేట్ జీతాన్ని వదిలి వెయిటర్గా మారానంటూ పెట్టిన వీడియో నెట్టింట్ చర్చనీయాంశంగా మారింది. కార్పొరేట్ ఉద్యోగం తన ఆరోగ్యాన్ని ఎలా హరించేసిందో పంచుకుంది. అంతులేని వైద్య పరీక్షలతో ఆస్పత్రులు చుట్టూ ఎలా తిరింగిందో వెల్లడించింది. తన అనారోగ్యానికి మూలం ఆ ఆరు అంకెల జీతం ఆర్జించే ఉద్యోగమే అని అనిపించి తక్షణమే మానేసి వెయిటర్ మారానని, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. కానీ అంతకమునుపు ఆ కార్పొరేట్ ఉద్యోగం కారణంగా చివరి ఆరు నెలలు తీవ్రమైన ఐబీఎస్ (IBS - Irritable Bowel Syndrome) అనేది పెద్ద ప్రేగును ప్రభావితం చేసే వ్యాధితో బాధపడ్డానని, దానికోసం ఆస్పత్రులు చుట్టూ ఎంతలా తిరిగిందో పేర్కొంది. చివరికి ఈ సమస్యకు ప్రధాన కారణం కార్పొరేట్ ఒత్తిడేనని అని తేలడంతో తక్షణమే ఉద్యోగానికి రిజైన్ చేశానని చెప్పింది. ఎప్పుడైతే ఉద్యగోం మానేసానో ఆ తదనంతరం తన అనారోగ్య సమస్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. అంతేగాదు ఆరు అంకెల జీతాన్ని ఎప్పుడైతే వదులుకున్నానో ఆ తదనంతరం ఐబీఎస్ సమస్య పూర్తిగా తగ్గిందని పేర్కొది. పైగా ఆ సమస్య మళ్లీ రాకూడదనే.. ఈ ఉద్యోగంలోనే కొనసాగుతానని అంటోంది. అంతేగాదు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని తెలసుకున్నా అంటూ నవ్వుతూ నేలను తుడుస్తూ వీడియోలో కనిపించడం చూడొచ్చు. అయితే నెటిజన్లు..ఫ్యామిలీ ఉంటే కచ్చితంగా వెయిటర్గా బతకడం అంత సులభం కాదు. పైగా అక్కడున్న వారికి సర్వ్ చేస్తున్నప్పుడూ కూడా కస్టమర్ల నుంచి వచ్చే చీత్కారాలు, సమస్యలు ఒత్తిడికి గురిచేస్తాయని..అది కూడా ఏమంత ఆరోగ్యదాయకమైన ఉద్యోగం కాదంటూ పోస్టులు పెట్టారు. కానీ కొందరు మాత్రం నచ్చిన ఉద్యోగంలో కొనసాగితే..సంతోషం, ఆరోగ్యం రెండూ ఉంటాయంటూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Sarame Cornish (@girlswhodetach) (చదవండి: జేఈఈ ఫెయిల్యూర్..ఇవాళ ఐఐటీ మద్రాస్ డైరెక్టర్) -
గోదావరిలో దూకిన మహిళ
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బ్రిడ్జి పైనుంచి ఓ మహిళ బుధవారం గోదావరిలోకి దూకింది. అదే సమయాన గోదావరిలో చేపలు పడుతున్న జాలర్లు ఆమెను రక్షించి ఒడ్డు కు చేర్చారు. అనంత రం భద్రాచలం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె వివరాలు ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో నిర్ధారణ కాలేదు. ఆ మహిళ మతిస్థిమితం కోల్పోయిందా లేక మద్యం మత్తులో ఉందా అన్నది తేలాల్సి ఉంది. కాగా, సదరు మహిళ బ్రిడ్జిపై కాసేపు తచ్చాడి దూకే క్రమాన కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుండగా, సమీపంలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
35 సెకండ్లలో 10 సార్లు తన్నిన స్వీపర్ : ఎంత అమానుషం
ఉత్తరప్రదేశ్లోని రాయబలేరిలోని ఒక ఆసుపత్రి ఉద్యోగిని నిస్సహాయుడైన రోగిపట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యంత అమానుషమైన ఘటనగా స్వయంగా అధికారులే ప్రకటించారు. యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఆదేశాల మేరకు ఆసుపత్రి యాజమాన్యం సదరు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది.ఈ వీడియో ప్రకారం మానసిక ఆరోగ్యంగా సరిగ్గాలేని యువ రోగిని కేవలం 35 సెకండ్లలో సుమారు 10 సార్లు నిర్దాక్షిణ్యంగా తన్నడమే కాకుండా నోటికొచ్చినట్లు అతనిపై దుర్బాష లాడింది. అక్కడే సెక్యూరిటీ గార్డుకూడా చోద్యం చూశాడు తప్ప ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీనిపై స్పందించిన జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పుష్పేంద్ర కుమార్ సంబంధిత ఉద్యోగినిపై చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఉద్యోగిని ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తున్న పింకీగా గుర్తించినట్లు తెలిపారు. సస్పెన్షన్ కాలంలో పింకీని జిల్లా ఆసుపత్రిలోని ఆయుష్ (AYUSH) అవుట్పేషెంట్ విభాగానికి బదిలీ చేశారు. ఈ ఘటనపై నిర్ణీత కాలపరిమితిలోగా విచారణ జరిపేందుకు డాక్టర్ దినేష్ ప్రతాప్ సరోజ్ (ఆర్థోపెడిక్ కన్సల్టెంట్), డాక్టర్ రిచా (మైక్రోబయాలజిస్ట్), సుష్మా యాదవ్ (సిస్టర్-మేట్రన్) ముగ్గుర సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.ఇదీ చదవండి: షాకింగ్ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!Who is mentally ill?A staff member at the district hospital in #Raebareli, #UttarPradesh, kicked a mentally ill young man. In this act of inhumanity, the female staff member kicked the young man on the head, face, and shoulder. The security guard standing nearby remained silent… pic.twitter.com/jejNEj56FV— Siraj Noorani (@sirajnoorani) June 30, 2026 అలాగే మెడికల్ అండ్ హెల్త్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అమిత్ కుమార్ ఘోష్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్లందరికీ సేవా ప్రవర్తనా నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. రోగుల పట్ల దుష్ప్రవర్తన లేదా అమానుషంగా ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.ఇదీ చదవండి: అయోధ్య విరాళాల స్కామ్ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చుఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ -
ఆటో డ్రైవర్ రిప్లై చూసి షాకైన యువతి, వైరల్ వీడియో
ఒక సాధారణ ఆటో ప్రయాణం, పేమెంట్ ఫెయిల్ , ఆ తర్వాత సదరు ఆటో డ్రైవర్తో జరిగిన కార్పొరేట్ లెవల్ సంభాషణ విధంగా ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆఫీస్ ఈమెయిల్స్ను తలపించేలా సాగిన ఈ చాటింగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నిష్ఠా శెట్టి అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో ఈ ఆసక్తికర కథనాన్ని షేర్ చేసింది. అసలేం జరిగిందంటే?నిష్ఠా శెట్టి ఒకరోజు ఆఫీస్కు వెళ్లడానికి ఆటో ఎక్కింది. గమ్యస్థానం చేరుకున్నాక డ్రైవర్కు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపింది. అయితే, ఐడీ సమస్య వల్ల ఆ పేమెంట్ ఫెయిల్ అయిందని ఆమె తర్వాత గమనించింది. దీని గురించి డ్రైవర్కు హిందీలో మెసేజ్ చేస్తూ.. "ఆప్కా పేమెంట్ ఫెయిల్ హో గయా హై బికాజ్ యే ఐడీ కా కుచ్ ఇష్యూ హో రహా హై" (ఐడీ సమస్య వల్ల మీ పేమెంట్ ఫెయిల్ అయింది) అని పంపింది. దానికి ఆ ఆటో డ్రైవర్ ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్గా నిలిచింది. View this post on Instagram A post shared by Nishta🌸 (@shettynishta)ఆమె పంపిన సాధారణ మెసేజ్కు ఆ ఆటో డ్రైవర్ ఎంతో ప్రొఫెషనల్గా, ఒక కస్టమర్ సర్వీస్ ఈమెయిల్ తరహాలో ఇంగ్లీష్లో కార్పొరేట్ కంపెనీ మేనేజర్ లెవల్లో సమాధానం పంపాడు."ఒకవేళ మీరు ఆటోలోనే తిరిగి రావాలని ప్లాన్ చేసుకుంటుంటే, నేనే వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, ఈజ్ దట్ ఓకే (సరేనా)? వీలైతే ఆ సమయంలో నాకు క్యాష్ ఇవ్వచ్చు. మీకు ఓకేనా? లేదా నేను మిమ్మల్ని ఎక్కడైతే డ్రాప్ చేశానో అక్కడికే వస్తాను, మీ దగ్గర క్యాష్ ఉంటే అక్కడ కలెక్ట్ చేసుకుంటాను."డ్రైవర్ చాటింగ్ టోన్ చూసి నిష్ఠా ఆశ్చర్యపోయింది. "అతనేంటి ఆఫీస్ ఈమెయిల్కు రిప్లై ఇచ్చినట్లు మాట్లాడుతున్నాడు?" అని వీడియోలో పేర్కొంది. అతని ప్రొఫెషనలిజం చూసి కాస్త కంగారు పడ్డానంటూ సరదాగా చెప్పుకొచ్చింది. వెంటనే ఆమె కూడా తన టోన్ మార్చేసి, ఇంగ్లీష్లోనే.. "ప్లీజ్ కమ్ బై 6 పీఎం. వైల్ రిటర్నింగ్" (తిరిగి వెళ్లేటప్పుడు సాయంత్రం 6 గంటలకల్లా రండి) అని మెసేజ్ పెట్టింది. దానికి ఆ డ్రైవర్ కేవలం ఒకే ఒక్క ముక్కలో "Noted" (నోటెడ్) రిప్లై ఇవ్వడంతో మరింత ఆశ్చర్యపోవడం నిష్ఠా వంతైంది. ఇదీ చదవండి: హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులునెటిజన్ల కామెంట్లు ఈ చాటింగ్పై నిష్ఠా జోక్ చేస్తూ తాను సగం మందితో పోలిస్తే ఈ ఆటో డ్రైవర్కే కార్పొరేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా ఉన్నాయంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్!"ఈ ఆటో డ్రైవర్కు కచ్చితంగా ఒక లింక్డ్ఇన్ (LinkedIn) ప్రొఫైల్ ఉండాలి" అని ఒకరు కామెంట్ చేయగా. చివర్లో 'Noted' అని చెప్పడం పీక్ కార్పొరేట్ బిహేవియర్" అంటూ మరొకరు సరదాగా కామెంట్ చేశారు.ఒక చిన్న పేమెంట్ సమస్య వల్ల జరిగిన ఈ సంభాషణ, ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. -
కాల్ లిఫ్ట్ చేయలేదని కామపిశాచిగా డెలివరీ బాయ్..
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఒక ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థకు చెందిన డెలివరీ పార్ట్నర్ ఒక మహిళను తీవ్రంగా వేధించిన ఘటన కలకలం రేపింది. జూన్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెలివరీ బాయ్ చేసిన ఫోన్ కాల్ను సదరు మహిళ ఎత్తకపోవడంతో, ఆ కాల్ వాయిస్మెయిల్కు డైవర్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆమె ఆ వాయిస్మెయిల్ను వినగా, అందులోని అత్యంత అసభ్యకర పదజాలంతో కూడిన సందేశం ఆమెను భయాందోళనలకు గురిచేసింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ముంబై పోలీసులకు, సదరు డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేసింది.వాయిస్మెయిల్లో దారుణంసదరు మహిళ ఇంట్లో లేని సమయంలో ‘షాడోఫాక్స్’ డెలివరీ ఏజెంట్ ఆమెకు కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రికార్డ్ అయిన వాయిస్మెయిల్లో అతను అత్యంత దారుణ రీతిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అత్యంత అసభ్యకరమైన హిందీ పదజాలంతో బూతులు తిడుతూ ఆడియో మెసేజ్ పంపాడు. ఈ మాటలు విన్న సదరు మహిళ ఒక్కసారిగా షాక్కు గురైంది.సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ఈ భయానక అనుభవాన్ని నిషా బాలకృష్ణ అనే మహిళ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. డెలివరీ ఏజెంట్కు తన ఇంటి చిరునామా పూర్తిగా తెలుసని, దీనివల్ల తనకు ప్రాణభయం పట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై పోలీసులను , షాడోఫాక్స్ సంస్థను ట్యాగ్ చేస్తూ తనకు న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు.కఠిన చర్యలకు డిమాండ్ఈ వేధింపుల ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కామెంట్లలో ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరికొందరు మహిళలు కూడా డెలివరీ బాయ్స్ నుండి తాము ఎదుర్కొన్న ఇలాంటి చేదు అనుభవాలను ఈ పోస్ట్ క్రింద పంచుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వివాహ వార్షికోత్సవం రోజే దారుణం
వేలూరు(తమిళనాడు): తమిళనాడులోని తిరువణ్ణామలైలో గిరిప్రదక్షిణ చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వీడియోలు తీసి, బ్లాక్మెయిల్ చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న దారుణ ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన నిందితుల్లో ఎనిమిది మందిపై కలెక్టర్ ఆదేశాల మేరకు గూండా చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. వివాహ వార్షికోత్సవం రోజే దారుణం పోలీసుల వివరాల మేరకు.. ధర్మపురి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువతి తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరువణ్ణామలై గిరివలయం మార్గంలో వెళ్తుండగా ఒక ముఠా ఆమెను అడ్డుకుంది. ఆ యువతిని బలవంతంగా నగ్నంగా మార్చి, వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఆపై ఆమె వద్ద ఉన్న నగలు, నగదును దోచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రధాన నిందితులు సహా మొత్తం 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 9 మొబైల్ ఫోన్లు, 3 బైక్లను స్వా«దీనం చేసుకున్నారు. స్వా«దీనం చేసుకున్న సెల్ ఫోన్లలో అనేక మంది మహిళలకు సంబంధించిన అశ్లీల వీడియో రికార్డింగ్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. పూర్తి వివరాల కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు. కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక రానుంది. గూండా చట్టం కింద అరెస్ట్ ఈ కేసులో నిందితులుగా ఉన్న వాసుదేవన్, ఆకాశ్ అప్పు, హరిహరన్, శర్మ శివగణేశన్, అరుణ్కుమార్, దురై సహా మొత్తం 8 మందిని సమాజానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా గుర్తిస్తూ వారిపై గూండా చట్టాన్ని ప్రయోగించాలని జిల్లా ఎస్పీ ఉదయకుమార్ కలెక్టర్కు సిఫార్సు చేశారు. సిఫార్సును పరిశీలించిన జిల్లా కలెక్టర్ వందనాకార్గ్ సదరు 8 మందిపై గూండా చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ఆధారంగా నాన్ బెయిల్బుల్ సెక్షన్గాఉన్న గుండా యాక్ట్ నమోదు చేసి నిందితులను వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. -
గర్భిణీపై కనికరం లేకుండా.. నీళ్ల బకెట్లో ముంచి..
ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్లో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టిన ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది. పరాయి పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో, ఆరు నెలల గర్భిణీ అయిన భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. నిత్యం ఆమెను ఇంట్లోనే బంధించి నరకం చూపించడమే కాకుండా, చివరకు ఆమె తలను నీళ్ల బకెట్లో ముంచి ప్రాణాలు తీసిన ఈ ఘటనా వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి.రోజుకు 10 గంటల గృహ నిర్బంధంఢిల్లీలోని లాజ్పత్ నగర్లో గ్రాఫిక్ డిజైనర్గా పనిచేసే అమిత్ గుప్తా (26) అనే వ్యక్తికి, నేహా కుమారి (23) అనే మహిళతో వివాహమైంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అమిత్, ఆమెను ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదు. ప్రతిరోజూ ఉదయం 8:30 నుండి రాత్రి 7 గంటల వరకు తను ఆఫీసుకు వెళ్లే సమయంలో, నేహాను కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోనే పెట్టి బయట నుండి తాళం వేసేవాడు. ఒంటరిగా మార్కెట్కు వెళ్లేందుకు కూడా ఆమెకు అనుమతి ఉండేది కాదు. ఈ విషయాన్ని నేహా తన పుట్టింటి వారితో చెప్పినప్పటికీ వారు ఎప్పుడూ ఆమె భర్తను నచ్చజెప్పలేదు.బకెట్ నీళ్లలో ముంచి దారుణ హత్యకొన్నాళ్ల నుండి అమిత్ ఆఫీసుకు వెళ్లడం మానేశాడు. ఈ క్రమంలోనే గురువారం నాడు వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర ఆగ్రహానికి లోనైన అమిత్.. గర్భవతి అని కూడా చూడకుండా నేహా తలను బలవంతంగా నీళ్లతో నిండిన బకెట్లో ముంచి శ్వాస ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. శనివారం నాడు మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో మృతురాలికి శవపరీక్ష నిర్వహించారు. దీనిపై పూర్తి నివేదిక రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.కట్నం కోసమేనా? పోలీసుల దర్యాప్తుఈ దారుణానికి సంబంధించి ఫరీదాబాద్ పోలీస్ పీఆర్వో యశ్పాల్ యాదవ్ కీలక విషయాలు వెల్లడించారు. నేహా తండ్రి.. అల్లుడు అమిత్ ఒత్తిడి తట్టుకోలేక ఒక స్థలాన్ని కొనుగోలు చేసి, దానిని అమిత్ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా, వారి కోసం ఒక కొత్త ఇల్లు కూడా నిర్మించి ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు అమిత్ గుప్తా పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. -
మేడం నా క్యాబ్లో బీరు తాగొద్దు..
బెంగళూరు: క్యాబ్లో ప్రయాణికురాలు జ్యూస్ తాగుతుండగా, బీరు తాగుతున్నావంటూ డ్రైవరు ఆమెతో గొడవకు దిగాడు. ఈ ఘటన బెంగళూరు అశోక్నగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఈ నెల 21న రాత్రి మహిళ కోరమంగళ రెస్టారెంట్ నుంచి తన ఇంటికి ఉబర్ కారును బుక్ చేసుకొంది. కారు ఎక్కగానే జ్యూస్ బాటిల్ తీసి తాగుతుండగా, కారులో బీరు తాగవద్దంటూ డ్రైవరు ఆమెను దబాయించాడు. ఇది బీరు కాదు, జ్యూస్ అని చెప్పినా అతడు వినిపించుకోలేదు. కారులో నుంచి బయటకు తోసేందుకు ప్రయత్నించాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పోలీసులకు వచ్చిన ఫిర్యాదులో తెలిపింది. డ్రైవర్ దౌర్జన్యంగా మాట్లాడటంతో మహిళ కారును, నిలిపి తన ట్రిప్ను రద్దు చేయాలని పదేపదే కోరింది. అయినా కారును నిలపకపోవడంతో అతికష్టం మీద డోర్ను తెరిచి కిందకు దూకేసింది. డ్రైవర్ కారుతో వెళ్లిపోయాడని తెలిపింది. పోలీసులు డ్రైవరు కోసం గాలింపు చేపట్టారు. -
ఆమెను చంపాలని ప్లాన్ : కారులోనే కాలిపోయాడు
కర్ణాటకలో ఒక వింత ఘటన కాదు కాదు దారుణ ఘటన చోటు చేసుకుంది. తుమకూరు జిల్లాలో శనివారం ఒక కారు పేలి మంటలు అంటుకున్నాయి. దీంతో 30 ఏళ్ల వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అసలు ఆ కారు ఎందుకు పేలింది. చనిపోయిన వ్యక్తి ఎవరు? ఈ విషయాలు తెలిస్తే విస్తుపోవడం మీ వంతు అవుతుంది. ఏమైంది అంటే...కారు పేలిన ఘటనలో చనిపోయిన వ్యక్తిని నాగేంద్ర (30)గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నాగేంద్ర బెంగళూరులో ఒక కారును బుక్ చేసుకున్నాడు.రమ్య ఉల్లాస్ (23)తో కలిసి ఈ కారులో ప్రయాణం మొదలు పెట్టాడు. డ్రైవర్ ఇచ్చిన ప్రాథమిక స్టేట్మెంట్ ప్రకారం, వీరిద్దరూ బెంగళూరులో కారు ఎక్కి అంకోలా వైపు బయలుదేరారు. కారు తుమకూరు సమీప ప్రాంతానికి చేరుకోగానే వారిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం మొదలైంది.ఈ గొడవ జరుగుతుండగా, నాగేంద్ర కత్తితో రమ్యపై దాడి చేసి పొడిచాడు. దాంతో తీవ్ర భయాందోళనకు గురైన రమ్య.. నాగేంద్ర వద్ద బాంబు ఉందని గట్టిగా అరుస్తూ డ్రైవర్ను హెచ్చరించింది. గాయాలపాలైనప్పటికీ, ఆమె ఎలాగోలా కారులోంచి బయటకు దూకేసింది.అది గమనించిన డ్రైవర్ ప్రవీణ్ వెంటనే కారును రోడ్డు పక్కన ఆపి, తాను కూడా బయటకు పరుగులు తీశాడు.ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం పోయింది : నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్రమ్య, డ్రైవర్ ఇద్దరూ బయటకు దూకేసిన తర్వాత..నాగేంద్ర కారు డోర్లను లోపలి నుండి లాక్ చేసుకుని, తనతో పాటు తెచ్చుకున్న నాటు బాంబును పేల్చేసుకున్నాడు. ఈ పేలుడు తీవ్రతకు కారు పూర్తిగా తగలబడిపోయింది, నాగేంద్ర లోపలే సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రవీణ్కు కూడా గాయాలయ్యాయి. గాయపడిన యువతి రమ్య ఉత్తర కన్నడ జిల్లా నివాసి.బెంగళూరులోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్గా పనిచేస్తోంది. ఈ దాడిలో గాడయపడిన రమ్య,ప్రస్తుతం తుమకూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.పోలీసుల దర్యాప్తుస్థానికుల సమాచారం మేరకు తుమకూరు జిల్లా ఎస్పీ అశోక్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? నాగేంద్ర అంతటి ఘాతుకానికి ఒడిగట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అసలు ఈ పేలుడు ఎలా జరిగింది? అతను వాడిన పేలుడు పదార్థం ఎలాంటిది? అనే విషయాలను నిర్ధారించడానికి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: 30 ఏళ్ల నమ్మకం ఖరీదు రూ. 97 లక్షలు : నట్టేట ముంచేశాడు -
ఇంత ప్రేమించినట్టు నటించి ఎలా చంపేసావమ్మా!
-
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఉషారాణి..!
రేణిగుంట: తాను సహజీవనం చేసిన మహిళ మోసకారి అని తెలుసుకుని దూరం పెట్టగా, కక్ష పెంచుకున్న ఆ మహిళ బ్లాక్ మెయిల్ చేసి వేధించడంతో రేణిగుంటలోని సీఆర్ఎస్ ఉద్యోగి రవి (36) ఉరివేసుకొని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం.. తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన కిల్లి రవి రేణిగుంట సమీపంలోని సీఆర్ఎస్లో ఉద్యోగం చేస్తూ బుగ్గ వీధిలోని ఓ ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన ఓ మహిళ పరిచయమైంది. ఆ మహిళతో మూడేళ్లుగా సన్నిహితంగా ఉన్నాడు. గతంలో మహిళకు మూడు పెళ్లిళ్లు జరిగిన విషయం గ్రహించిన రవి ఆమెని దూరం పెట్టాడు. ఇది జీర్ణించుకోలేని మహిళ సీఆర్ఎస్లోని ఉద్యోగానికి నామినీగా తన పేరును చేర్చాలని, అదేవిధంగా కోటి రూపాయలు తనకు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఆమెకు తిరుపతిలోని వామపక్ష నాయకులు అండగా నిలిచి అతనిని మానసికంగా వేధించారు. ఈ వేధింపులు తాళలేక గతంలో అనేకసార్లు మీడియా ముందు తన బాధను వెల్లడించాడు. అయినా ఆమె వేధింపులు తీవ్రం అవడంతో చేసేదేమీ లేక మంగళవారం తాను కాపురం ఉన్న బాడుగ ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందాడు. అంతకు ముందు సూసైడ్ నోట్ రాసి, సూసైడ్ నోటును తన సహచర ఉద్యోగస్తులకు, తమ్ముడికి వాట్సాప్ ద్వారా పంపించారు. సూసైడ్ నోట్లో తన చావుకు ఉషారాణి, విజయలక్ష్మి , రాధాకృష్ణ అనేవారు కారణమని వారిపై పోలీసులకు నేను గతంలో ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి వారికి శిక్ష పడేటట్టు చేయాలని కోరాడు. రేణిగుంట అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకొని, విచారణ చేపట్టారు. -
ఆలస్యం.. సమస్యాత్మకం..!?
ఈ నెల 15న.. మెట్పల్లిలోని మఠంవాడకు చెందిన మహిళపై దాడి ఘటన కర్ర లేదా రాళ్లతోనే జరిగిందని పోలీసులు చెప్పారు. చివరికి మహిళ తలలో బుల్లెట్ లేదా ఇనుప ముక్క బయటపడటంతో పోలీసు విచారణ ప్రశ్నార్థకంగా మారింది.శనివారం సాయంత్రం మెట్పల్లిలోని ఆదర్శనగర్లో దాసరి రాజేంద్రప్రసాద్ అనే బిల్డర్ మృతి చెందాడు. ఆయన మెడలో ఉన్న చైన్ మాయం కావడం, తల వెనక బలంగా పదునైన ఆయుధంతో కొట్టిన ఆనవాళ్లు ఉండటం వంటి అంశాల గుర్తింపులో జాప్యం జరిగింది. నిబంధనల ప్రకారం మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తరువాత హత్య కేసుగా మార్చారు. ఈ కాస్త జాప్యం నిందితుడు దూర ప్రాంతాలకు పరారై సమస్యను మరింత జఠిలం చేసేందుకు ఆస్కారం చిక్కుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు సంఘటనల్లోనూ పోలీసుల విచారణ సరైన సమయంలో.. సరైన రీతిలో జరగలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. సంఘటన జరిగిన సమయంలో కాస్త లోతుగా విచారణ జరిపితే ఆయా సంఘటనల పూర్వాపరాలు పూర్తిస్థాయిలో బయటపడే అవకాశాలు ఉంటాయి. కోరుట్ల/మెట్పల్లి: ఆలస్యం చేస్తే అమృతం విషంగా మారుతుందన్న నానుడి అందరికీ తెలిసిందే. నేర సంఘటనలు జరిగిన సమయంలో కారణాలు గుర్తించడంలో ఆలస్యం సమస్యను మరింత జఠిలం చేస్తుంది. మెట్పల్లిలో ఈనెల 15న మహిళపై దాడి జరిగిన సంఘటనలో ముగ్గురు ఉన్నట్లు బాధితురాలు చెబితే.. ఇద్దరిపైనే కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. బాధితురాలు చెప్పిన మరో వ్యక్తిని కేసులో ఎందుకు చేర్చలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాడి సమయంలో పెద్దగా రేకుల చప్పుడు వచ్చిందని చుట్టుపక్కల వారు చెప్పినట్లు తెలిసింది. అది రేకుల చప్పుడు కాదని, ఏదైనా పేలిన శబ్దంగా అనుమానించడంలో అధికార యంత్రాంగం తాత్సారం చూపిందా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మహిళ తలలో దొరికిన ఇనప ముక్క దాదాపు బుల్లెట్టు అని నిర్ధారణకు వస్తున్నా.. ఫోరెన్సిక్ నివేదిక వచ్చేవరకూ విషయం తేటతెల్లం కాదు. ఒకవేళ బుల్లెట్గా తేలితే.. జరిగిన జాప్యం ఫలితంగా తపంచా లేదా రివాల్వర్.. ఎవరు..ఎక్కడి నుంచి తెచ్చారు..? ఎవరు దాడి సమయంలో కాల్చారు..? అనే విషయం తేల్చడంలో ఆలస్యంతోపాటు నిందితులు తప్పించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుమానం హత్యగా తేలిందిశనివారం సాయంత్రం మెట్పల్లిలోని ఆదర్శనగర్లో బిల్డర్ రాజేంద్రప్రసాద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలో రాజేంద్రప్రసాద్ తల వెనక భాగంలో పదునైన గాయం ఉంది. మొదట బిల్డింగ్పై నుంచి పడి మృతి చెందాడని అనుమానించారు. రాజేంద్రప్రసాద్ మెడలో ఉండాల్సిన బంగారు చైన్ ఎక్కడికి వెళ్లిందన్న విషయం ఆ సమయంలో పోలీసుల దృష్టికి రాలేదు. ఈ విషయం ఆదివారం బయటపడింది. రాజేంద్రప్రసాద్ వద్ద పనిచేసే పేయింటర్ తనకు సకాలంలో డబ్బులు చెల్లించలేదని గొడవ పడి అందుబాటులో ఉన్న పదునైన ఆయుధంతో బలంగా తల వెనక కొట్టాడు. దీంతో రాజేంద్రప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు రాజేంద్రప్రసాద్ మృతి కేసును హత్యగా మార్చి విచారణ ప్రారంభించారు. మొత్తం మీద ఏదైనా నేర సంఘటనలు జరిగిన సమయంలో విచారణ లోతుగా జరిపితే బాధితులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
50 ఏళ్ల వయసులో కాలేజ్కి వెళ్తున్న మహిళ..!
చదువుకి వయసు పరిమితి కాదని చాలామంది నిరూపిస్తున్నారు. అదే కోవలోకి మరో మహిళ వచ్చింది. అందుకు సంబంధించి వీడియోని నెట్టింట షేర్ చేసింది.. ఆ వీడియో ‘గైస్ ఈ రోజు నాకు పరీక్ష ఉంది’ అంటూ మొదలవుతుంది. ఒక మహిళ తనకంటే చిన్న వయసు ఉన్న విద్యార్థులతో పరీక్ష కేంద్ర వైపుకి వెళ్తున్నట్లు చెబుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దశాబ్దాల క్రితం చదువు వదిలేసిన ఆమె పరీక్షకు సిద్దమవుతున్నప్పుడు సహజంగా విద్యార్థులు పడినట్లుగానే చిన్నపాటి టెన్షన్ ఉందని చెబుతోంది వీడియోలో. తను బ్యాక్లాగ్ పేపర్ ఒకటి క్లియర్ చేయడానికి వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు ఆమె ఈ వీడియోకి ‘చదువుకోవడానికి వయసు పరిమితి కాదు’ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. అంతేగాదు సుదీర్ఘ విరామం తర్వాత చదువుని కొనసాగించినందుకు చాలామంది ఆ మహిళను ప్రశంసించారు. మరికొందరు ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకమని, నేర్చుకోవడానికి లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడు ఆలస్యం కాదని ఆమె ఉదంతం నిరూపిస్తోందంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Manju narang (@student_at_50) (చదవండి: మేమున్నాం అనే భరోసా చాలు) -
బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరం
అమెరికాలో రోజు రోజుకి అస్తవ్యస్థంగా మారిపోతున్న వైద్య వ్యవస్థ, సేవల్లో జాప్యం, ఖరీదైన వైద్యంలాంటి వాటిపై ఇప్పటికే చాలా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇండియాలో హెల్త్కేర్ సిస్టం, అందిస్తున్న సేవలపై ఒక అమెరికన్ మహిళ ప్రశంసలు కురిపించడం విశేషంగా నిలిచింది. అమెరికా చూసి నేర్చుకోఅంటూ ఇన్స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అపాయింట్మెంట్ లేకుండా భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్లు కొనుక్కో గలిగాను అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.ఆమె తన వీడియోలో వివరించిన వివరాల ప్రకారం భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్ల కొనుగోలు ప్రక్రియ ఎంతో అందుబాటులోనూ, తక్కువ ధరలోనూ ఉంది.ఒక ఆప్టికల్ స్టోర్కు వెళ్లి లెన్స్లను ఆర్డర్ చేయడం, చాలా తక్కువ ధరకే వాటిని త్వరగా పొందడం వంటి విషయాలను వివరిస్తూ, ‘ఐవీ' (Ivy) అనే మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు. అమెరికా దీనిని గమనించాలని (పాఠంనేర్చుకోవాలని) ఆమె సూచించారు. బీమా లేదా ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే రూ. 2,451లకే కొనుగోలు చేసి, ఇక్కడి వైద్య సేవల లభ్యతను ఆమె కొనియాడారు.షాపింగ్ అనుభవం ఐవీ కోసం కేవలం ఒక జత కాంటాక్ట్ లెన్స్లు మాత్రమే తెచ్చుకుంది. దీంతో మరో జత కొనాలని నిర్ణయించుకుంది. కేవలం 20 నిమిషాల నడక దూరంలో ఉన్న ఒక మాల్లోని ఆప్టికల్ స్టోర్కు వెళ్లి, తన ప్రిస్క్రిప్షన్ను వారికి చూపించింది. ఆమె వాడే బ్రాండ్ లెన్స్లను సోమవారం రాత్రి కల్లా తెప్పించి ఇస్తామని స్టోర్ సిబ్బంది చెప్పారు. మరిన్ని బాక్సులు కొంటే అదనపు డిస్కౌంట్ ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ, ఆమె ఒక బాక్స్ మాత్రమే తీసుకుంది. చెప్పిన సమయానికి ఆమెకు లెన్స్లు అందడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది.ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీఇలా నేరుగా ఆప్టికల్ స్టోర్లోకి నడుచుకుంటూ వెళ్లి లెన్స్ కొనుక్కోవడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అమెరికాలో ఇలా చేయడం అస్సలు సాధ్యం కాదు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ లేకుండా అస్సలు కుదరదని ఐవీ పేర్కొంది. చాలా తక్కువ ధరకే మూడు జతలు వచ్చాయంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది.నెటిజన్లు ఏమన్నారంటేఈ పోస్ట్ వైరల్ కావడంతో, అమెరికన్లకు కాంటాక్ట్ లెన్స్లు కొనడానికి కూడా ఇన్సూరెన్స్ కావాలనే విషయం తెలిసి మెజారిటీ నెటిజన్లు ఆశ్చర్యపోయారు "నిజమా! నేనైతే ఎప్పుడు పడితే ఒక మామూలు గ్లాసెస్ షాప్కి వెళ్తాను. నా కళ్లద్దాలు లూజ్ అయితే టైట్ చేయించుకుంటాను. దానికోసం ఆ షాప్ అతను ఒక్క రూపాయి కూడా తీసుకోడు, ఫ్రీగా చేస్తాడు." అని తెలిపారు. కాంటాక్ట్ లెన్స్ కోసం ఇన్సూరెన్స్ కావాలనే కాన్సెప్ట్ వినడానికే చాలా వింతగా ఉందంటూ మరొక యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకూ ఈ విషయం తెలియదంటూ మరికొందరు కూడా విస్తుపోయారు. కాగా ఇటీవల మరొక అమెరికన్ మహిళ (విక్టోరియా) అమెరికాలో సుమారు రూ. 94వేలు ఖరీదు చేసే ముఖ్యమైన మందులను ఇండియా నుంచి కేవలం రూ. 2,350 లకే కొనుగోలు చేసానని, , అమెరికా హెల్త్కేర్ సిస్టమ్ను ఒక "స్కామ్" అని అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు -
ఆ డ్రైవర్ ఊహించని 'రైడ్ మెనూ'..!
ఇంతవరకు పలు డ్రైవర్లు తమ ప్రయాణికుల సౌకర్యార్థం వైఫై నుంచి పుస్తకాలు, స్నాక్స్ వంటి ఏర్పాట్లతో ఫిదా చేశారు. కానీ ఈ డ్రైవర్ ఒక అడుగు ముందుకేసి ప్రయాణికులు నచ్చినట్లు జర్నీ చేసే అనుభవాన్ని అందించాడు. అది కూడా వాళ్లకు వాళ్లుగా ఎలాంటి రైడ్ చేయలనుకుంటున్నారో ఎంచుకునే మెనూతో ఇప్రెస్ చేయడం విశేషం. అందుకు సంబంధించిన విషయం నెట్టింట వైరల్గా మారింది.ఒక మహిళ సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్ అదరి మనసులను తాకింది. ఆ పోస్ట్లో ఆ మహిళ తానొక అద్భుతమైన ప్రశాంతమైన రైడ్ చేశానంటూ ఆ అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె మూడు రోజుల పాటు విదేశీ వ్యాపార పర్యటన అనంతరం తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చినట్లు రాశారు. ఇంటికి వెళ్లేందుకు 45 నిమిషాల ఉబెర్ రైడ్ బుక్ చేసుకున్నారు. పైగా బాగా మూడు రోజులు పర్యటన కారణంగా బాగా అలిసిపోయి ఉండటంతో అస్సలు మాట్లాడే ఓపిక లేదని రాసుకొచ్చింది. ఆ డ్రైవర్ పేరు కబీర్ అని తన హెడ్రెస్ట్ వెనుకభాగంలో అంటించిన లామినేటెడ్ కార్డుని ఆమెకు అందించాడని చెప్పారు. దాన్ని ఆమె "రైడ్ మెనూ"గా వర్ణించారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులు తాము ఇష్టపడే సంభాషణను ఎంచుకునే వీలు కల్పించేలా రూపొందించాడు. ఆ కార్డులో నిశబ్దం కోసం "ది సైలెంట్ రైడ్", తమ రోజు విశేషాలు పంచుకోవాలనుకునేవారికి "ది థెరపిస్ట్ రైడ్", నగరం గురించిన వాస్తవాలు, కథలు చెప్పే "ది టూరిస్ట్ రైడ్", ప్రయాణికులు కేవలం విశ్రాంతి తీసుకుంటూ సంగీతం వినగలిగే "ది రేడియో రైడ్" వంటి ఆప్షన్లు ఉన్నాయని చెప్పారామె. అయితే తాను సైలెంట్ రైడ్ ఎంపికను ఎంచుకుని, డ్రైవర్కు నిశ్శబ్దంగా ధన్యవాదాలు తెలిపానని చెప్పింది. వెంటనే కబీర్ తల ఊపి ఎయిర్ కండిషనింగ్ సర్దుబాటు చేసి, మొత్తం ప్రయాణాన్ని నిశబ్దంగా చేశాడు. ఆ అనుభవాన్ని తలుచుకుంటూనే అద్భుతంగా అనిపిస్తుందన్నారామె. ఈ ఏడాది తాను ఆస్వాదించిన ప్రశాంతబైన రైడ్ ఇదేనని చెప్పారామె. పైగా తాను పూర్తిగా విశ్రాంతి తీసుకోగలిగానని పేర్కొందామె. ఆ తర్వాత తాను ఉదారంగా టిప్ ఇచ్చి, కబీర్ వ్యాపార ఆలోచనను ప్రశసించానని చెప్పారామె. అయితే డ్రైవర్ ఆ మెనూ ఏర్పాటు వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ..ఇది మెరుగైన టిప్స్ లేదా రేటింగ్లు సంపాదించడం కోసం ఈ కార్డుని తయారు చేయలేదని చెప్పడం విశేషం. తన కుమార్తె ప్రేరణతో ఈ కార్డుని రూపొందించినట్లు తెలిపాడు. ఆమె కూడి అలిసిపోయినప్పుడు..అపరిచితులతో మాములు సంభాషణ ఎంత విసుగ్గా, నీరసం తెప్పించినట్లు ఉంటుందో పంచుకుందని, దాన్ని ఆమె "మారథాన్ పరుగు"తో పోల్చిందని, చెప్పుకొచ్చాడు. ఆ నేపథ్యంలోనే ప్రయాణికులు విమర్శల భయం లేకుండా తమ ఇష్టపూర్వంగా సౌకర్యవంతమైన ప్రయాణం చేసేలా వ్యక్తపరిచే మెనూని రూపొందించానని తెలిపాడు. ఆ వివరణ తనను ఎంతగానో కదిలించిందని చెప్పుకొచ్చింది. ఆధునిక జీవతం ప్రజలను నిరంతరం ఎలా ఒత్తిడికి గురిచేస్తోందో కదూ అనుకుంటూ..ఔను కొన్నిసార్లు ఒంటరిగా వదిలేయడంకు మించిన గొప దయ ఇంకొకటి లేదంటూ తన పోస్టుని ముగించారామె. ఈ పోస్ట్ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..ఇది మంచి ఆలోచన అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. i took a 45-minute uber ride home from the airport last night after a brutal, three-day business trip. i was completely emotionally and physically drained, and my social battery was at absolute zero.when i got into the car, the driver.. an older guy named kabir.. didn't say…— noor୨୧ (@wottheberry) June 6, 2026 (చదవండి: థాయిలాండ్లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్ ..) -
వరంగల్ లో కీచక ఎస్సై.. నగ్న ఫోటోలు బయటపెడతానంటూ..
-
శబరిమల మహిళల ప్రవేశం.. మళ్లీ చర్చల్లోకి..
శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశం జరిగిన సమయంలో చోటుచేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాలు ఇప్పుడు కేరళ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. 2019 జనవరిలో భారీ పోలీస్ రక్షణ నడుమ ఇద్దరు మహిళలు సన్నిధానంలోకి ప్రవేశించినప్పుడు, అప్పటి ట్రావెన్కోర్ దేవాస్వం బోర్డు ప్రెసిడెంట్ ఎ. పద్మకుమార్ను కావాలనే అక్కడకు రాకుండా అడ్డుకున్నారనే నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆయన సన్నిహితులు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మొత్తం వ్యవహారం వెనుక అత్యున్నత స్థాయి శక్తుల వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.అర్ధరాత్రి ఫోన్ కాల్.. సగం దారిలోనే వెనక్కి2019 జనవరి 1వ తేదీన మకరవిళక్కు తీర్థయాత్ర సమయంలో పద్మకుమార్ స్వామి అయ్యప్పన్ రోడ్డు మార్గంలో సన్నిధానానికి వెళ్తుండగా, అధికార వర్గాల నుంచి ఆయనకు ఒక అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. ఆయనను వెంటనే తిరువనంతపురం చేరుకోవాలని, ప్రముఖ రాజకీయ నేతను కలవాలని ఆదేశించారు. దీంతో ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తిరువనంతపురం చేరుకున్నారు. అయితే సదరు నేత నివాసానికి వెళ్లిన పద్మకుమార్కు లోపలికి ప్రవేశం దక్కలేదు. తెల్లవారుజామున 5:30 గంటల మార్నింగ్ వాక్ సమయంలో మాత్రమే కలవడం సాధ్యమవుతుందని పోలీసులు తేల్చి చెప్పారు.టీవీలో చూసి షాక్.. పెద్ద మోసంతిరిగి ఇంటికి వెళ్లి, తెల్లవారుజామున 5 గంటలకు నాయకుడిని కలవడానికి సిద్ధమవుతున్న పద్మకుమార్ టీవీ ఆన్ చేసి చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బిందు అమ్మణి, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు సన్నిధానంలోకి ప్రవేశించి పూజలు చేసినట్లు బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ఆ తర్వాత సదరు సీనియర్ నేతను కలిసిన పద్మకుమార్, ‘నాకు ఇంతటి ద్రోహం జరుగుతుందని ఊహించలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. తన కుటుంబం నుంచి యువతులెవరూ శబరిమలకు వెళ్లరని గతంలో పద్మకుమార్ ప్రకటించినందుకే, మహిళల ప్రవేశం వేళ ఆయన సన్నిధానంలో ఉండకుండా ఈ వ్యూహం పన్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అదే రోజు భద్రతా బాధ్యతల్లో ఉన్న ఐజీ ఎస్. శ్రీజిత్ను కూడా అక్కడి నుంచి పోలీస్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయడం గమనార్హం.రాజీనామా యత్నం.. పార్టీలో ఒంటరిఈ అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైన పద్మకుమార్, దేవస్వం బోర్డు అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తన రాజీనామా లేఖతో సొంత ఊరిలోని ఒక సన్నిహితుడిని కలిశారు. అయితే ఆ సమయంలో సదరు మిత్రుడు ఆయనను వారించి, రాజీనామా చేయకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత కాలంలో అధికార పక్ష నాయకత్వంతో పద్మకుమార్కు సంబంధాలు దెబ్బతిన్నాయి. తదనంతర పరిణామాల్లో పార్టీ కూడా ఆయనను క్రమంగా పక్కన పెట్టేసింది. ఏళ్ల క్రితం జరిగిన ఈ హైడ్రామా ఇప్పుడు కేరళలో మళ్లీ చర్చనీయాంశంగా మారింది. -
అదృష్టం అంటే ఇదే.. వారం వ్యవధిలోనే రెండు లాటరీలు!
అదృష్టం ఒక్కసారి తలుపు తట్టడమే చాలా మందికి జీవితంలో మరపురాని అనుభవం. కానీ కెనడాకు చెందిన ఓ మహిళకు మాత్రం వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు అదృష్టం వరించింది. రెండు వేర్వేరు లాటరీల్లో భారీ మొత్తాలను గెలుచుకుని ఆమె వార్తల్లో నిలిచారు.కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్లో ఉన్న మిస్సిసాగా నగరానికి చెందిన ట్రాంగ్ ఫామ్ తన నలుగురు సహోద్యోగులతో కలిసి గత ఏడాది ఒక లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. ఆ టికెట్కు ఏకంగా 60 మిలియన్ కెనడియన్ డాలర్ల జాక్పాట్ తగిలింది. భారత కరెన్సీలో దీని విలువ రూ.407 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ భారీ ప్రైజ్ మొత్తాన్ని ఐదుగురు సభ్యులు సమానంగా పంచుకోవడంతో ట్రాంగ్కు కూడా గణనీయమైన మొత్తం లభించింది.అయితే ఆమె అదృష్టం అక్కడితో ఆగలేదు. తొలి లాటరీ గెలిచిన కేవలం వారం రోజులకే ట్రాంగ్ మరోసారి స్క్రాచ్ కార్డ్ లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. ఆశ్చర్యకరంగా ఈ టికెట్కు కూడా జాక్పాట్ తగిలింది. దీంతో ఆమెకు మరో 2,50,000 కెనడియన్ డాలర్లు లభించాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.60 కోట్లకు సమానం.ఈ రెండో లాటరీని ఆమె వ్యక్తిగతంగా కొనుగోలు చేశారా, లేక మరెవరితోనైనా కలిసి తీసుకున్నారా అనే వివరాలు వెల్లడికాలేదు. అయితే వారం వ్యవధిలోనే రెండు భారీ లాటరీలు గెలుచుకోవడం అత్యంత అరుదైన ఘటనగా నిలిచింది. సాధారణంగా జీవితకాలంలో ఒక్కసారి కూడా లాటరీ గెలవడం కష్టమని భావించే పరిస్థితుల్లో, ట్రాంగ్ వరుసగా రెండుసార్లు జాక్పాట్ దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ ఘటన కెనడా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లాటరీ నిపుణులు కూడా ఇలాంటి సంఘటనలు అత్యంత అరుదుగా జరుగుతాయని పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను 'లక్కీ లేడీ'గా అభివర్ణిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. మొత్తంగా ట్రాంగ్ ఫామ్ కథ అదృష్టం ఎప్పుడు, ఎలా వరుస్తుందో చెప్పలేమనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. -
పురుషుల ప్రైవేట్ పార్ట్స్పై ప్రేలాపనలు : సేజల్ పవార్కు భారీ షాక్
పురుషులు ప్రైవేట్ పార్ట్స్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముంబై కేఈఎమ్ (KEM) హాస్పిటల్ వైద్య విద్యార్థిని సేజల్ పవార్ భారీ షాక్ తగిలింది. స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోలో ‘పురుషుల శవాల’ (Male Cadavers) పై వివాదాస్పద వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ముంబైలోని సేథ్ జీఎస్ మెడికల్ కాలే, కేఈఎమ్ హాస్పిటల్లో చివరి సంవత్సరం ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్న సేజల్ పవార్ను హాస్పిటల్ యాజమాన్యం 15 రోజుల పాటు నిర్బంధ సెలవుపై పంపింది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన అంతర్గత కమిటీ, సేజల్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని తేల్చింది. ఒక వైద్య విద్యార్థినికి ఉండాల్సిన గౌరవం, వృత్తిపరమైన బాధ్యతలకు భిన్నంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని సంస్థ పేర్కొంది. నిర్బంధ సెలవు అనేది తాత్కాలిక నిర్ణయం మాత్రమే. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకునేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేశారు. శనివారం సేజల్ తల్లిదండ్రులను హాస్పిటల్కు పిలిపించి, ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించేలా చర్యలు తీసుకున్నారు.అసలు వివాదం ఏమిటి?దాదాపు మూడు నెలల క్రితం రికార్డ్ అయిన ప్రణీత్ మోరే కామెడీ షోకు సంబంధించిన వీడియో క్లిప్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ షోలో ప్రేక్షకురాలిగా ఉన్న సేజల్ పవార్, తన అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం) శిక్షణ సమయంలో ఎదురైన అనుభవాలను వివరిస్తూ, మృతదేహాల పురుషాంగాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం తీవ్రమవ్వడంతో సేజల్ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ సేజల్, ప్రణీత్ మోరే, అదే షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన హిమాన్షు జంగ్రాపై కూడా మహారాష్ట్ర సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి: విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?ఎన్సీడబ్ల్యూ: మరోవైపు కనీస మర్యాద లేకుండా, లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా మాట్లాడినందుకు గాను జాతీయ మహిళా కమిషన్ (NCW), కమెడియన్ ప్రణీత్ మోరే , హిమాన్షు జంగ్రాలకు సమన్లు జారీ చేసింది.ఇదీ చదవండి: మైనర్పై ఫుట్బాల్ కోచ్ లైంగిక దాడి : వీడియోలతో బ్లాక్మెయిల్రెసిడెంట్ డాక్టర్ల సంఘం స్పందనకేఈఎమ్ హాస్పిటల్కు చెందిన మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ కూడా సేజల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ఇలాంటి మాటలు వైద్య వృత్తికి తగనివని పేర్కొంది. అలాగే సోషల్మీడియాలో ఆమెపై జరుగుతున్న దాడి , వ్యక్తిగత దూషణలను ఆపాలని కోరింది.ఇదీ చదవండి: డేంజరస్ స్టంట్ : యెమెన్ స్పైడర్ మ్యాన్ దుర్మరణం -
వాడొక కామాంధుడు.. మహిళా పైలట్ ని తనతో గడపమని..
-
అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల వయసులో ఆమె ..
చాలామంది యువకులు సైతం ప్రయత్నించడానికి సంకోచించే డేరింగ్ ఫీట్ ఇది. నేర్చుకోవాలనుకున్నా లేదా ఏదైనా సాహసం చేయాలన్న వయసు ఎన్నటికీ అడ్డంకి కాదు అనే చెప్పే సంఘటన ఇది. ఓ కూతురు తల్లి కలను నెరవేర్చి ఆమె కళ్లలో ఉబికి వచ్చిన ఆనందం చూసి ఉప్పొంగింది. వాళ్లను బాగా కేర్గా చూసుకోవడం కాదు..వాళ్ల కలలను కూడా నెరవేర్చే ప్రయత్నం చేయండి అంతకన్న ఇంకేం ఆశించరు అన్న అంశాన్ని నొక్కి చెప్పింది ఈ ఘటన. అందుకు సంబంధించిన వీడియోని రూపాలి జన్బంధు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో ఆమె 53 ఏళ్ల తల్లి తన కూతురుతో కలిసి ఒక స్కైడైవింగ్ క్లిప్ని చూస్తూ..కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె కూతురితో తాను కూడా ప్రయత్నించొచ్చా అని సరదాగా అడుగుతుంది. ఏదో సరదాగా అన్న ఆమాటను కూతురు నిజం చేస్తుందని ఆ క్షణం ఆమె అనుకోలేదు. కానీ ఆ తర్వాత కూతురు ఆ సాహసాన్నే తల్లికి ఊహించని సర్ప్రైజ్ గిప్ట్లా ఇచ్చింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ చాలా ఉత్సాహంతో ఎప్పడెప్పుడు ఆకాశంలోకి ఎగిరిపోతానో అన్నట్లుగా స్కైడైవింగ్ దుస్తులతో ఆత్రుగా ఉందామె. ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా ఎగరడానికి సిద్ధం అన్నట్లుగా డేరింగ్ చేసింది ఆ స్టంట్. పైగా ఆ స్కైడైవింగ్ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న ఆమెను చూస్తే..ఎవ్వరికైన జీవితాన్ని అందంగా ఆస్వాదించేలా తప్ప వయసు, భయాలను అడ్డంకిగా చేసుకోకూడదనిపిస్తుంది. అంతేగాదు ఈ వీడియోకి కూతురు రూపాలి..“73 ఏళ్లకే ఎగరడానికి సిద్ధం. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది అమ్మా” అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ప్రేమిస్తున్నా అని చెప్పే బదులు..వారి కలలను నెరవేర్చేలా చూడండి..ఉన్నది ఒక్కటే జీవితం..హాయిగా జీవించనివ్వండి అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rupali Janbandhu (@nofussfitness_rup) (చదవండి: అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్ ఖేర్) -
విద్యుత్ తీగలు అమర్చి చంపాలనుకుంది
టేకుమట్ల: కడవరకు నీతోనే ఉంటానని పెళ్లినాటి ప్రమాణాలను మరిచిన ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నానికి పాల్పడింది. విద్యుదాఘాతంతో మృతిచెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో బుధవారం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత, మరో గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, అతన్ని చంపాలనుకుంది. మంగళవారం రాత్రి భర్త పడుకున్న సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. లైట్ ఆఫ్ చేసి, భర్త కాళ్లకు విద్యుత్ తీగలను అమర్చి ఆత్రుతగా స్విచ్ బోర్డ్లో విద్యుత్ సరఫరా లేని ప్లగ్లో పెట్టగా విద్యుత్ సరఫరా కాలేదు. వెంటనే ఇద్దరు కలిసి వేరే ప్లగ్లో పెట్టాలని మాట్లాడుకుంటున్న క్రమంలో భర్తకు మెలకువ వచ్చింది. ఎవరంటూ అరవడంతో ప్రియుడు పరార య్యాడు. వెంటనే లైట్లు ఆన్ చేయగా కాళ్లకు అమర్చిన విద్యుత్ వైర్లు, కరెంటు సరఫరాలేని ప్లగ్లో పెట్టడాన్ని గమనించి గ్రామస్తులకు తెలిపాడు. స్థానిక సర్పంచ్ సదరు మహిళను పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు సమాచారం. -
వెలుగులోకి మరో జనసేన నేత మోసం
సాక్షి, విజయవాడ: మరో జనసేన నేత మోసం వెలుగులోకి వచ్చింది. జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్ తనను మోసం చేశాడంటున్న ఓ మహిళ.. కాంట్రాక్టులు ఇప్పిస్తానని చేశాడని పేర్కొంది. ఆ మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. కరోనా సమయంలో పరిచయమైన విజయ్ శేఖర్.. రాబోయేది మన ప్రభుత్వమేనని తన నుంచి భారీగా డబ్బు తీసుకున్నాడని ఆ మహిళ చెబుతోంది.2024లో ప్రభుత్వం రాగానే ఇసుక క్వారీలు, గ్రానైట్, వైన్ షాపులు మనవేనంటూ విజయ్ శేఖర్ ఆ మహిళను నమ్మించాడు. ఆయన్ని నమ్మి రూ.కోటి 75 లక్షలు ఇచ్చింది. ఆ మహిళ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టించిన విజయ్ శేఖర్.. అధికారంలోకి రాగానే మోహం చాటేశాడు. తన డబ్బు ఇవ్వమని అడిగితే ఆ మహిళపై విజయ్శేఖర్ దాడి చేశారు.బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంగళగిరిలో బేతపూడి విజయ్ శేఖర్తో పరిచయమైంది. అధికారంలోకి వస్తే ఇసుక క్వారీలు, గ్రానైట్, బిజినెస్, వైన్ షాప్ మనవేనని నమ్మించాడు. ముందుగా కొంత పెట్టుబడి పెట్టాలని నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా విజయ్శేఖర్కు నామినేటెడ్ పదవి వచ్చింది. నామినేటెడ్ పోస్టు వచ్చిన తర్వాత నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు. నా డబ్బుల గురించి అడిగితే నీ దిక్కున్నచోట చెప్పుకోమంటున్నాడు..నాకు న్యాయం చేయమని అందరి దగ్గరికీ వెళ్లా. జనవాణిలో మూడుసార్లు దరఖాస్తు పెట్టుకున్నా. నాకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్కు తప్ప అందరికీ తెలుసు. మంత్రి కందుల దుర్గేష్కు కూడా తెలుసు. నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించి న్యాయం చేయండి. నాకు న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్ సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటా. నా చావుకి జనసేనలో ఉన్నవారంతా బాధ్యులే’’ అంటూ ఆమె హెచ్చరించింది. -
రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త
భార్య వైద్య అవసరాల కోసం నానా పాట్లు డుతోంటే భర్త ఏకంగా రూ. 19 కోట్లను దాచిపెట్టి, తనకు కనీసం 35 వేలు ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టాడని ఒక మహిళ వాపోయిన వైనం సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం,తన భర్త తనకు తెలియకుండా ఇన్నాళ్లుగా సుమారు 14 మిలియన్ యువాన్లను (దాదాపు రూ.19 కోట్లు) రహస్యంగా ఉంచాడని చైనాకు చెందిన 53 ఏళ్ల మహిళ గుర్తించింది. ఒక పక్క తాను దాదాపు రూ. 95వేల వైద్య బిల్లులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, ఆయన మాత్రం విలాసంగా జీవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త ఆస్తులన్నింటినీ రహస్యంగా ఉంచాడనిఆరోపించింది. విడాకుల ప్రక్రియ సమయంలో ఆర్థిక రికార్డులను పరిశీలించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. తన ఆదాయాన్నిగానీ, ఆస్తులను గానీ ఎపుడూ వెల్లడించలేదని వాపోయింది. ఇంతకాలం అవగాహన లేక అతని ఆస్తిపాస్తులపై పట్టించుకోలేదని వాపోయింది.వైద్య ఖర్చులకు ఇబ్బందులుఇంత సంపద దాచిపెట్టినప్పటికీ, తన భర్త కనీస ఆర్థిక సాయం చేయడానికి కూడా నిరాకరించాడని వాంగ్ ఆరోపించింది. తనకు నెలకు ఇవ్వాల్సిన 2,500 యువాన్ల (సుమారు రూ.35,000) అలవెన్స్ను ఇచ్చేందుకు నిరాకరించాడని, అలాగే తన వైద్య చికిత్సకు ఒక్క రూపాయికూడా సహాయం చేయలేదని ఆమె పేర్కొంది. బీజింగ్లో చికిత్స పొందుతున్న సమయంలో చాలా పొదుపుగా జీవించాల్సి వచ్చిందని. అద్దె తక్కువ ఇంట్లో ఉంటూ, చౌక ధరల బట్టలు ధరిస్తూ , వైద్య ఖర్చులు భరించే స్తోమత లేక ఇబ్బందులు పడ్డాడని వెల్లడించింది. ఈ సమయంలో తన భర్త మాత్రం బ్రాండెడ్ వస్తువులు, కాస్మెటిక్ ట్రీట్మెంట్ల కోసం విపరీతంగా ఖర్చు చేసేవాడని ఆమె ఆరోపించింది.గృహహింస, శారీరక దాడి ఈ కేసులో తీవ్రమైన గృహహింస ఆరోపణలు మరో ముఖ్యమైన అంశం. భర్త చేతిలో పదేళ్ల పాటు శారీరక హింసను భరించింది. ఆమె కొట్టిన దెబ్బలు పక్కటెముకలు విరగడమే కాకుండా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించిన 100 కి పైగా ఫోటోలను ఆమె ఆధారాలుగా చూపించింది. ఈ శారీరక హింస , ఆర్థిక నియంత్రణ వల్లే తాను తీవ్రమైన డిప్రెషన్కు, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
పోలీసుస్టేషన్కు సూది పంచాయితీ!
శ్రీసత్యసాయి జిల్లా: వెనుక నుంచి సూది గుచ్చిందంటూ ఓ మహిళ మరో మహిళతో గొడవకు దిగింది. చివరికి ఈ పంచాయితీ పోలీసుస్టేషన్కు చేరింది. వివరాలు.. కదిరి పట్టణానికి చెందిన పక్కీరమ్మ సోమవారం ఆరోగ్యం బాగాలేకపోవడంతో బత్తలపల్లి ఆసుపత్రికి వెళ్లేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్కు వచ్చింది. వెనక వైపు నుంచి సూదితో గుచ్చినట్లు అనిపించగా.. వెనకే ఉన్న మహిళ గుచ్చిందంటూ ఆమెతో వాగ్వాదానికి దిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాబ్జాన్ వెంటనే అక్కడకు చేరుకుని ఇద్దరినీ పోలీసుస్టేషన్కు తరలించారు. అనంతరం పక్కీరమ్మను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఆమె శరీరంపై ఎటువంటి ఇంజెక్షన్ ఆనవాళ్లు లేవని తేలడం గమనార్హ -
బంగారం చూపెట్టి రీల్స్ చేసింది! తెల్లారేసరికి బంగారం మాయం
-
సెల్ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య
గూడూరు: సెల్ఫోన్ కొనివ్వలేదని క్షణికా వేశంలో ఓ యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టెవాడలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన బొడ్డు రాములు–కరుణశ్రీ దంపతులకు కూతురు బిందు (22), ఇద్దరు కుమారులు న్నారు. కూతురు పీజీ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. శనివారం రాత్రి సెల్ఫోన్ కొనివ్వాలని బిందు తండ్రిని అడగడంతో డబ్బులు లేవన్నాడు. దీంతో క్షణికావేశానికి గురైన ఆమె రాత్రి బయటికి వెళ్లింది. రాత్రి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. తండ్రి బొడ్డు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. -
స్త్రీల కోసం రైడ్
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతతోపాటు వారి స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర మహిళా భద్రత విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒంటరి మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు మహిళలే డ్రైవర్లుగా ఉన్న బైక్, ఆటోలతో కూడిన క్యాబ్ సర్విసులను స్త్రీ రైడ్ పేరిట అందుబాటులోకి తెచి్చంది. మహిళా డ్రైవర్ల వాహనాలను డీజీపీ సీవీ ఆనంద్ ఇతర అధికారులతో కలిసి శనివారం హైదరాబాద్లో జెండా ఊపి ప్రారంభించారు.ఈ సేవలను పొందేందుకు మహిళా ప్రయాణికులు మోవో ఫ్లీట్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లే వచ్చి పికప్ చేసుకొని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారు. ఇందులో భాగంగా తొలివిడతలో మొత్తం 55 మంది మహిళా డ్రైవర్లకు బైక్, ఆటో డ్రైవింగ్లో శిక్షణ ఇప్పించడంతోపాటు వారంతా రవాణా, డెలివరీ రంగాల్లో స్వయం ఉపాధి పొందేలా మొబిలిటీ సర్విస్ ప్రొవైడర్లు, అగ్రిగేటర్స్తో మహిళా భద్రత విభాగం అనుసంధానం చేసింది. మహిళలు కూడా గిగ్ వర్కర్లుగా రావడం శుభపరిణామం: డీజీపీ అంతకుముందు డీజీపీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, మహిళా భద్రత విభాగం డీజీ చారు సిన్హా, మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ స్విగ్గీ, జొమోటో వంటి గిగ్వర్కర్లలో ఇప్పటివరకు పురుషులే ఉండేవారని.. ఇకపై అందులోకి మహిళలు కూడా రావడం శుభపరిణామం అన్నారు. డ్రైవర్లుగా పనిచేస్తున్న మహిళలకు ఏ ఇబ్బందులున్నా అండగా ఉంటామని మహిళా భద్రత విభాగం డీజీ చారుసిన్హా అన్నారు. కార్యక్రమంలో శాంతిభద్రతల డీజీ మహేశ్ భగవత్, డీజీ ఆర్గనైజేషన్స్ స్వాతిలక్రా పాల్గొన్నారు. ధైర్యం పెరిగింది భర్త చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లల కోసం కష్టపడుతున్నాను. నాలుగు నెలలుగా బైక్ నేర్చుకుంటున్నాను. ఈ శిక్షణతో నాలో ధైర్యం పెరిగింది. – అర్చన, శ్రీరామ్కాలనీ, శంషాబాద్ నెలకు రూ. 30 వేలకు సంపాదిస్తున్నా ‘మోవో ఫ్లీట్’లో రెండేళ్లుగా పనిచేస్తున్నాను. నెలకు రూ. 30 వేల వరకు సంపాదిస్తున్నాను. ఇప్పుడు స్త్రీ రైడ్లోకి వచ్చాక మరింత ధైర్యం పెరిగింది. ఉమెన్ టు ఉమెన్ పికప్, డ్రాప్లు చేసేందుకు మహిళా భద్రత విభాగం అవకాశం కల్పిస్తోంది. -
లిఫ్ట్ వచ్చిందనుకుని గేట్లు ఓపెన్, 5వ అంతస్తు నుంచి పడిన మహిళ
-
విమానంలో లగేజీ గొడవ, పోలీసు చేయి కొరికేసింది
విమాన ప్రయాణాల్లో ప్రయాణికులకు చాలా టెన్షన్ ఉంటుంది. విమానంలో ఎలాంటి వస్తువులు తీసుకెళ్లవచ్చు అనే సందేహాలు మొదలు, సయానికి సెక్యూరిటీ చెకప్ ముగించుకుని గేట్లోకి వెళ్లడం, లగేజీ నిర్దేశించిన బరువులో ఉందా లేదా చూసుకోవడం దాకా చాలా తతంగమే ఉంటుంది. ముఖ్యంగా పరిమితి కంటే లగేజీ బరువు కాస్త ఎక్కువైనా ప్యాసెంజర్లకు చుక్కలే. అదనపు చార్జీల (Excess baggage fee) మోత మోగుతుంది. ఇక్కడే చాలా వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఇటీవల అర్జెంటీనాలోని ఒక విమానాశ్రయంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఎక్స్ట్రా లగేజీ ఫీజుకు సంబంధించిన హైడ్రామా ఊహించని రేంజ్కి చేరింది.అసలేం జరిగింది?‘మిర్రర్ యూకే’ కథనం ప్రకారం.. అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరెస్ (Buenos Aires) లో గ ‘జార్జ్ న్యూబెరీ ఎయిర్పార్క్’ లో జెట్స్మార్ట్ (JetSmart) విమానంలో ఈ సంఘటన జరిగింది. కొర్డోబాకు వెళ్లాల్సిన ఆ విమానం ఎక్కేందుకు ఒక మహిళా ప్రయాణికురాలు వచ్చింది. అయితే, ఆమె పరిమితికి మించి క్యాబిన్ లగేజీని తీసుకురావడంతో, దానికి అదనపు రుసుము చెల్లించాలని ఎయిర్పోర్ట్ సిబ్బంది కోరారు. దానికి ఆమె నిరాకరించడంతో బోర్డింగ్ గేట్ వద్ద వివాదం మొదలైంది.గేట్ వద్ద గొడవ జరుగుతున్నప్పటికీ, ఆమె సిబ్బంది కళ్లుగప్పి ‘ఫ్లైట్ JA 3104’ లోపలికి వెళ్ళిపోయింది. ప్రామాణిక బోర్డింగ్ నియమాలను ఉల్లంఘించి ఆమె విమానం ఎక్కేసిందని గ్రహించిన సిబ్బంది, వెంటనే భద్రతా సిబ్బందిని ఎలర్ట్ చేశారు.నిజానికి బోర్డింగ్ గేట్ వద్దే ముగిసిపోవాల్సిన ఈ గొడవ, ఆమె విమానం లోపలికి వెళ్లడంతో మరింత వివాదాస్పందగా మారింది. అప్పటికే ప్రయాణికులంతా తమ సీట్లలో కూర్చుని, విమానం టేకాఫ్కు సిద్ధమవుతోంది. ఆ సమయంలో పోలీసులు విమానంలోకి ప్రవేశించి, ఆమెను కిందకు దించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ఆ మహిళ ఒక్కసారిగా ఒక మహిళా పోలీస్ అధికారిణి కుడి చేతిపై గట్టిగా కొరికింది. ఈ ఊహించని ఘటనతో విమానంలోని ప్రయాణికులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడుతీవ్ర ఘర్షణ తర్వాత ఎయిర్పోర్ట్ పోలీసుల ఎట్టకేలకు ఆమెను నియంత్రించి, విమానం నుండి కిందకు దించేశారు. దీనిపై అర్జెంటీనా 'నేషనల్ క్రిమినల్ అండ్ కరక్షనల్ ఫెడరల్ కోర్ట్ నెం. 3' ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. గాయపడిన మహిళా అధికారిణి, షిఫ్ట్ సూపర్వైజర్, జెట్స్మార్ట్ విమాన సిబ్బంది నుండి దర్యాప్తు అధికారులు స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ప్రస్తుతం కోర్టు ఈ కేసును పరిశీలిస్తోంది.ఇదీ చదవండి: సీజేపీ ధర్నాలో ఆసక్తికర డిమాండ్, విద్యామంత్రిగా ఆయన? -
'బంధనం', 'బాధ' ఆవిష్కరించిన అద్భుత కళ..!
ఓ వ్యక్తి ఎలాంటి తప్పు చేయకుండా బంధింపబడి, బాధలకు గురైతే..కుంగిపోయి ఢీలా పడిపోతాడు. కానీ సోనాబాయి అలా కాదు. తన కష్టాల్ని, నిశబ్ద బాధని అద్భుతమైన కళకు ఊపిరిపోసి, స్వేచ్ఛకు మార్గం వేసింది. పైగా యావత్తు ప్రపంచం తనవైపు తిరిగేలా గుర్తింపు తెచ్చుకుంది. బాధలను వరంగా మార్చుకుని తన ఉనికిని ఎలా తెలియజేయాలో చాటి చెప్పింది. కళ అంటేనే సృజనాత్మక ప్రతిభకు సంబంధించింది. తన తప్పు ఏమి లేకుండా భర్త చేత సమాజం నుంచి వెలివేయబడి నిర్బంధింపబడింది సోనాబాయి రాజావర్. చత్తీశ్గఢ్కు చెందిన సోనాబాయి తన భర్త దురహంకారానికి బలైన మహిళ అని చెప్పొచ్చు. ఆయన ఆమెను కిటికీలు లేని ఇంట్లో బంధించేవాడు. దాంతో ఆమె తన కొడుకుతో ఒంటిరిగా, నిశబ్ద వేదనను అనుభవించింది. నాటి మూఢనమ్మకాలు, చాదస్తాలకు బాధితురాలిగా మారిన మహిళ సోనాబాయి. అయితే ఆ బంధనాన్ని తన స్వేచ్ఛను సంపాదించుకునే మార్గానికి పునాది వేసింది. మొదట తన కొడుకుని ఊరడించడానికి బావి వద్ద ఉన్న మట్టితో బొమ్మలు చేసేది. కాలక్రమేణ ఆమెలోని అద్భుత ప్రతిభా పాటవాలతో గొప్ప కళ పుట్టుకొచ్చి..మొత్తం ఇల్లు ఆ బొమ్మలతో నిండిపోయింది. బొమ్మలకు వేసే రంగులను సైతం ఆమె స్వయంగా ఇంట్లో సహజసిద్ధిమైన వాటితో తయారు చేసి ఉపయోగించేది. అంతేగాదు వేసవికాలంలో ఉక్కపోతాలకు తాళ్లలేక ఇంటిని చల్లగా ఉంచే మార్గం కోసం అన్వేషించి ఓ చక్కటి పరిష్కారాన్ని వెతికింది. వెదురు, బంక మట్టిలతో చిన్నపాటి రంధ్రాలతో ఇంటి చుట్టు ప్రహరీని ఏర్పరుచుకుని చల్లటి గాలి లోపలికి వచ్చి ఎండ వేడిని అధిగమించింది. అంతేగాదు ఆమె ఇంటి గోడలు సైతం తన కళతో కళకళలాడుతుండేవి. నిజానికి టాలెంట్ ఉన్నవాడిని బంధించడం అంత ఈజీ కాదు అనేందుకు ఉదహారణగా నిలిచేలా ఆమె కళకు గుర్తింపు దక్కింది, పైగా ప్రపంచమంతటికీ ఆమె పేరు మారుమ్రోగిపోయింది. సరిగ్గా 1983లో భారత్ భవన్కు చెందిన క్షేత్ర పరిశోధకుల బృందం ఆమె ఇంటిని కనుగొనడంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అదే ఏడాది ఆమె తులసి సమ్మాన్ అవార్డును అందుకుంది.ఆమె నిశబ్ద తిరుగుబాటుకు, దృఢత్వానికి ప్రతీకగా మారింది. నిజానికి ఆమె ఈ కళ కోసం ఎలాంటి శిక్షణ తెలుసుకోలేదు. ఆమె బాధలు, కష్టాలకు ఈ కళకు ఊపిరిపోశాయి. అందులోంచే తన ఆనందం, స్వేచ్ఛను వెతుక్కుంటూ మంచి కళకారిణిగా మలుచుకుని జీవితాన్ని స్వర్గధామంగా మార్చుకుంది. అంతేగాదు ప్రతికూల అణిచివేత వాతావరణంలో ఎలాంటి మద్దతు లేకుండా కేవలం కళా ప్రతిభతో ధైర్యంగా మనుగడ సాగిస్తే..ఏదోనాటికి గుర్తింపు లభిస్తుందని ప్రూవ్ చేసింది. సోనాబాయి 2007లో కన్నుమూశారు. అంతేగాదు ఆమె మరణాంతరం ఛత్తీశ్గఢ్ ప్రభుత్వం 2015లో ఆమె స్వగ్రామం ఫుహ్పుత్రలో ఆమె గౌరవార్థం ఒక మ్యూజియంను స్థాపించింది. రాష్ట్రంలో ఒక కళాకారిణి జ్ఞాపకార్థం నిర్మించిన తొలి మ్యూజియం ఇదే కావడంతో ఇది మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. నిజంగా ఈ కథ అద్భుతమైన జీవిత పాఠాన్ని నేర్పిస్తోంది కదూ..!.(చదవండి: నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్: ఇంత ప్రమాదకరమైనదా?) -
జనసేన నేత కాబట్టే చర్యలు లేవా?
పిఠాపురం రూరల్ : తనకు రావాల్సిన ఆస్తి అడుగుతుంటే తన మామ, జనసేన నాయకుడు అయిన గరగ సత్యానందం వేధింపులకు గురి చేస్తున్నారని పిఠాపురం మండలం గోకివాడకు చెందిన గరగ కృష్ణ స్వాతి ఆరోపించారు. తనకు న్యాయం కావాలని, తన కుమార్తెతో కలిసి పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ చట్టబద్ధంగా తనకు రావలసిన ఆస్తి హక్కులను కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భర్త గరగ జగన్నాథ్ 2021లో కోవిడ్తో మరణించారని, భర్త మరణానంతరం తనను మానసికంగా, ఆర్థికంగా మామ సత్యానందం వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన పిఠాపురం జనసేన నాయకుడు కావడంతో జనసేన కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కుమార్తెను పోషించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కృష్ణ స్వాతి తెలిపారు. భర్త చనిపోయిన సమయంలో తన వద్ద నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, మామగారే కదా అని నమ్మి సంతకం పెట్టానని, ఆస్తి కోసం ఇంత మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని కంటతడి పెట్టారు. స్థానిక జనసేన నాయకులు తనకు అండగా నిలవకుండా మామ సత్యానందానికే మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి, చేబ్రోలులోని పార్టీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశానని, హైదరాబాద్లో పవన్ నివాసానికి రెండుసార్లు వెళ్లానని అయినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన చిన్న కుమార్తెకు రక్షణ కల్పించి జీవన భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. -
డ్రెస్ చూసి ‘క్యారెక్టర్లెస్’ అంటారా?
మోరల్ పోలీసింగ్ అంశం దేశంలో తరచూ చర్చకు వస్తూనే ఉంది. ముఖ్యంగా మహిళల వేసుకునే దుస్తులు, వ్యక్తిగత ఎంపికలు, ప్రవర్తనపై అనవసర వ్యాఖ్యలు, బహిరంగ విమర్శలు వంటి ఘటనలు తరచూ పెద్ద డిబేట్కు దారి తీస్తున్నాయి. “వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడ ముగుస్తుంది?.. సమాజం పేరు మీద నియంత్రణ ఎక్కడ మొదలవుతుంది?” అనే ప్రశ్నలు ప్రతి సారి మళ్లీ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఓ విద్యార్థిని, ఓ మహిళ మధ్య దుస్తులపై జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అస్సాంలో ఓ చిన్న వీడియో ఇప్పుడు పెద్ద సామాజిక చర్చకు దారి తీసింది. పనికోసం బయటకు వెళ్లిన ఓ విద్యార్థినిపై ఓ పెద్దావిడ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నీ బట్టలే నీ క్యారెక్టర్ ఏంటో చెబుతాయి” అంటూ జరిగిన ఆ వాగ్వాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. “మోరల్ పోలీసింగ్” మళ్లీ హాట్ టాపిక్గా మారిందితేజ్పూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని అనుష్క శర్మ తన ప్రాక్టికల్ పరీక్ష కోసం అవసరమైన మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు స్కూటర్పై బయటకు వెళ్లింది. అదే సమయంలో రోడ్డుపై ఓ వృద్ధ మహిళ ఆమె దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే సమాజం చెడిపోతుంది. ఏం చేద్దామని ఇలాంటి బట్టలు వేసుకుని బయటకు వచ్చావ్” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని వేడెక్కించాయి. అంతేకాదు, “క్యారెక్టర్లెస్” వంటి పదాలు ఉపయోగించడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది.రికార్డింగ్తో బయటపడ్డ వివాదంఈ ఘటనను అనుష్క స్వయంగా తన మొబైల్లో రికార్డ్ చేసింది. వీడియోలో ఆమె తన దుస్తులపై ఎందుకు ఇంత విమర్శ వస్తోందని ప్రశ్నించినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో వృద్ధ మహిళ కూడా ఆమెను చిత్రీకరిస్తూ తన అభిప్రాయాన్ని కొనసాగించింది. వీడియోలో అనుష్క నలుపు రంగు ట్యాంక్ టాప్, ట్రౌజర్స్ ధరించి కనిపించింది. దుస్తులపై విమర్శలు పెరుగుతుండగా, ఆమె ధైర్యంగా ఎదుర్కొని మాట్లాడటం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు పొందుతోంది.హాట్ డిబేట్వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. చాలామంది యువతులు, మహిళా హక్కుల సంఘాలు అనుష్కకు మద్దతు తెలుపుతూ వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రశ్నలు వేస్తున్నాయి. “ఎవరికి ఏం వేసుకోవాలో చెప్పే హక్కు ఎవరికుంది?” అనే కామెంట్లు విస్తృతంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటన “మోరల్ పోలీసింగ్ vs వ్యక్తిగత స్వేచ్ఛ” అనే పెద్ద చర్చగా మారింది.A viral video from Tezpur has triggered a huge debate online. A student was allegedly shamed publicly over her clothes, but she chose to speak up instead of staying silent.#Assam #Tezpur #ViralVideo #WomenRights pic.twitter.com/wNq8TDmVbz— Kaushiki Dey (@De7845Dey) June 2, 2026 -
చిత్తూరు కలెక్టరేట్లో దివ్యాంగురాలు ఆత్మహత్యాయత్నం
చిత్తూరు కలెక్టరేట్: ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగం దక్కకపోవడం.. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దివ్యాంగురాలు చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగురాలు మనెమ్మకు కొన్నేళ్ల కిందట చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం ఉప్పరపల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త వదిలేసి వెళ్లిపోయాడు. అయినా చిన్నచిన్న పనులు చేస్తూ ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటోంది. దివ్యాంగుల బ్యాక్లాగ్ ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయని తెలుసుకొని.. దరఖాస్తు చేసుకుంది. అన్ని అర్హతలున్నా నాన్ లోకల్ పేరుతో తనకు ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) అలసత్వం వల్లే తనకు అన్యాయం జరిగిందని మనెమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నాన్ లోకల్ కేటగిరి గురించి స్పష్టం చేయకుండా దరఖాస్తు స్వీకరించారని వాపోయింది. తీరా ప్రక్రియ ముగిశాక అసలు విషయం చెప్పారని కన్నీటిపర్యంతమైంది.ఈ నిబంధన ముందే చెప్పి ఉంటే తన సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకునేదానినని వాపోయింది. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో.. సోమవారం నాలుగేళ్ల కుమార్తెతో వచ్చి కలెక్టర్ సుమిత్ను కలిసి తన ఆవేదన చెప్పుకున్నట్లు తెలిపింది. ఈ విషయంలో తామేమీ చేయలేమని కలెక్టర్ చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇక ఆత్మహత్యే శరణ్యమంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకోవడమే కాకుండా.. కొంత పెట్రోల్ను తాగేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను పోలీసులు, స్థానికులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. -
ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
జనగామ: సంతానం కోసం కలలు కంటున్న దంపతుల ఆశలు ఫలించాయి. ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ మహిళ. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన మాచర్ల మౌనిక, రమేష్ దంపతులకు ఎనిమిది ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం లేకపోవడంతో అనేక ఆస్పత్రులకు తిరిగారు. చివరకు జనగామ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకున్నారు. గర్భం దాల్చిన మౌనిక స్కానింగ్ సమయంలో ముగ్గురు శిశువులు ఉన్నట్టు నిర్ధారించగా, వైద్యుల సూచనల మేరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతినెలా రెగ్యులర్ చెకప్లు చేయించుకున్నారు. ఈ నెల 21న మౌనికకు పురిటినొప్పులు రావడంతో అదే ఆస్పత్రిలో చేరి్పంచారు. డాక్టర్ స్వప్న, లింగమూర్తి నేతృత్వంలోని వైద్యబృందం సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు. ఒకేసారి ముగ్గురు మగ శిశువులు జన్మించడంతో కుటుంబ సభ్యులతోపాటు ఆస్పత్రి సిబ్బంది సంబరపడ్డారు. పుట్టిన ముగ్గురు పిల్లలు, తల్లీ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ‘ఎనిమిదేళ్లుగా పిల్లల కోసం ఎదురుచూశాం. దేవుడి దయ, డాక్టర్ చలవతో ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు పుట్టారు. మా ఆనందానికి అవధులు లేవు’.. అని తండ్రి రమేష్ సంతోషం వ్యక్తం చేశాడు. -
షాకింగ్ ఘటన : మృత్యువు ఇలా కూడా..!
దక్షిణ కరోలినాలో ఊహించని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సరస్సు ఒడ్డున ఉన్న ఒక రెస్టారెంట్ ఆరుబయటి ప్రాంగణంలో తన భర్తతో కలిసి భోజనం చేస్తున్న ఒక మహిళ అనూహ్యంగాప్రాణాలు కోల్పోయింది. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న ఆమె జీవితం క్షణాల్లో గాల్లో కలిసిపోయింది. మృత్యువు ఎపుడు? ఎలా? ముంచుకొస్తుందో తెలియదు అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. బాధితురాలు హ్యూగర్కు చెందిన 56 ఏళ్ల డానా వీంగర్. ఈమె తన భర్తతో కలిసి 'లేక్ మేరియన్' (Lake Marion) వద్ద ఉన్న డ్రిఫ్ట్వుడ్ గ్రిల్ (Driftwood Grill) రెస్టారెంట్లో భోజనం చేస్తుండగా, అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా బలమైన గాలులు తీవ్రమవ్వడంతో, ఆ గాలుల తాకిడికి ఆరుబయటి ప్రాంగణంలోని ఒక బరువైన ప్యాటియో గొడుగు (Patio Umbrella) ఊడిపోయి బాధితురాలిని బలంగా తాకింది. అత్యవసర సహాయక బృందాలు చేరుకునే సమయానికే ఆమె ప్రాణాలు విడిచింది.క్లారెండన్ కౌంటీ కరోనర్ జాక్వెలిన్ బ్లాక్వెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గొడుగు డైనా తల, మెడ భాగంలో బలంగా తాకడంతో తీవ్రమైన గాయమైంది. రాత్రి 7:40 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాండర్స్ (EMS) ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెను బ్రతికించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. క్లారెండన్ గొడుగు బలంగా తగలడం వల్ల ఆమె మెడలోని ప్రధాన రక్తనాళం (Carotid Artery) తెగిపోవడంతోనే మరణం సంభవించినట్టు అంచనా వేశారు.తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో అవుట్డోర్ ఫర్నిచర్ భద్రతా ప్రమాణాలపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి బుధవారం (మే 27) పోస్టుమార్టం నిర్వహించనున్నారు.రెస్టారెంట్ స్పందనఈ ఊహించని ప్రమాదంపై 'డ్రిఫ్ట్వుడ్ గ్రిల్' రెస్టారెంట్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేసింది. తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల జరిగిన ఈ ఘోర ప్రమాదం తమను ఎంతగానో కలచివేసిందంటూ బాధితకుటుంబానికి సానుభూతి ప్రకటించింది. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి సహాయం చేసిన ఎమర్జెన్సీ సిబ్బందికి, స్థానికులకు ధన్యవాదాలు తెలిపింది. ఇదీ చదవండి: 3 రోజులు, 10 గంటలు : సీబీఐ విచారణలో ట్విషా భర్త షాకింగ్ ఆరోపణలు -
ట్విషా శర్మ కేసులో మరో కీలక పరిణామం
న్యూఢిల్లీ: అత్తవారింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన ట్విషా శర్మ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్విషా శర్మ మృతదేహానికి రెండోసారి పోస్ట్మార్టం నిర్వహించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ రెండవ పోస్ట్మార్టంను ఎయిమ్స్ ఢిల్లీ బృందం నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.ప్రాథమిక పోస్ట్మార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలినప్పటికీ, ఆమె కుటుంబం ఈ నిర్ధారణలను తిరస్కరిస్తూ, ఇందులో కుట్ర ఉందని ఆరోపిస్తోంది. తమ బిడ్డను అత్తింటివారే ఆత్మహత్యకు పురికొల్పారని ఆరోపిస్తూ ట్వీషా తల్లిదండ్రులు మృతదేహానికి ఎయిమ్స్ ఢిల్లీ బృందంతో రీ-పోస్ట్మార్టం నిర్వహించాలని దిగువ కోర్టును ఆశ్రయించారు. దీన్ని కోర్టు తిరస్కరించడంతో, తిరిగి వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం జస్టిస్ అవనీంద్ర కుమార్ సింగ్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మృతదేహాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లడమా, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ ఏర్పాటు చేసిన, నిపుణుల బృందాన్ని విమానంలో పిలవడమా, ఈ రెండింటిలో ఏది ఉత్తమమైన మార్గమని ఈ కోర్టు అడగగా, అడ్వకేట్ జనరల్ తాము అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఏ కమిటీని ఏర్పాటు చేసినా వీలైనంత త్వరగా వారు భోపాల్కు వచ్చి పోస్ట్మార్టం నిర్వహిస్తారని తెలిపారు. మొదటి పోస్ట్మార్టంలో లోపాలున్నాయని, ట్విషా మరణించిన మూడు రోజుల తర్వాత కేసు నమోదు చేశారని, అలాగే ఉరి వేసుకోవడానికి ఉపయోగించినట్లు చెబుతున్న బెల్ట్ను మొదటి పోస్ట్మార్టం పరీక్ష సమయంలో అందించలేదని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. మరోసారి పోస్ట్మార్టం చేయాలని డిమాండ్ చేసింది. అలాగే పోస్ట్మార్టం సమయంలో నమోదు చేసిన ట్విషా ఎత్తు, పోలీసు నివేదికలో పేర్కొన్న ఎత్తుతో సరిపోలడం లేదని బాధితురాలి న్యాయవాదివాదించారు. ఆమె శరీరంపై ఉన్న గాయాల గురించి పోస్ట్మార్టం నివేదికలో ఎందుకు వివరంగా ప్రస్తావించలేదని కూడ ప్రశ్నించారు.కాగా మోడల్,నటి ట్విషా 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా న్యాయవాది సమర్థ్ సింగ్తో పరిచయమైంది. ఆ తరువాత 2025 డిసెంబర్లో పెళ్లాడింది. పెళ్లైన ఐదు నెలలకే (మే 12న) ట్విషా అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. దీంతో భర్త, అత్తమామలు తమబిడ్డను శారీరక హింసతో సహా వివిధ రకాల వేధింపులకు గురి చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ డిమాండ్ను ట్విషా అత్తగారైన గిరిబాల సింగ్ తరఫు న్యాయ బృందం తీవ్రంగా వ్యతిరేకించింది. ఎయిమ్స్లోని నిపుణులచే ఇప్పటికే తొలి పరీక్ష పూర్తి అయిందికాబట్టి రెండో పరీక్ష అవసరం ఏముందని ప్రశ్నించారు. మరో పోస్ట్మార్టం కోరడం అంటే వృత్తిపరమైన వైద్యుల సామర్థ్యాలపై అవిశ్వాసాన్ని చూపడ మేనని వారు వాదించారు.మరోవైపు గత పదిరోజులుగా పరారీలో ఉన్న ట్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్ హైకోర్టులో తనమ ముందస్తు బెయిల్ దరఖాస్తును ఉపసంహరించుకుని, విచారణకు ముందే లొంగిపోవడానికి ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన న్యాయవాది శుక్రవారం మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలియజేశారు ఇదీ చదవండి: ‘దీదీ కాపాడు’ అని మొరపెట్టుకున్న కొన్ని క్షణాల్లోనే -
‘దీదీ కాపాడు’ అని మొరపెట్టుకున్న కొన్ని క్షణాల్లోనే
వరకట్నరక్కసి కోరలు సరికొత్తగా విస్తరిస్తున్న చాయలు ఇటవలికాలంలో బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యం రాజధాని నగరం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నిన్న గాక మొన్న ట్విషా శర్మ, దీపికా నాగర్ అనుమానాస్పద మరణం ఘటనలు కలకలంరేపాయి. కట్నం కోసమే తమ బిడ్డల్ని పొట్టనపెట్టుకున్నారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపణల పర్వం కొనసాగుతుండగానే ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నన్ను బతికించండి అని మొరపెట్టుకున్న నిమిషాల వ్యవధిలోనే ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం ఉద్రిక్తతను రాజేసింది.వీణా కుమారి (28) 2022లో రాజు సింగ్తో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన కొద్దిరోజులకే వారు ఉత్తరప్రదేశ్లోని సంభాల్ నుండి ఢిల్లీలోని ఇందర్పురికి మకాం మారారు. మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లి జరిగినప్పటి నుండి కట్నం విషయంలో వీణను భర్త రాజు వేధిస్తూ ఉండేవారు. నీకంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడినంటూ నిత్యం పోరు పెట్టేవాడు. మరోవైపు ఇటీవలే పెళ్లి చేసుకున్న మరిది రాజ్కుమార్ తన భార్య తెచ్చిన కట్నంతో (46 ఇంచుల టీవీ, బైక్) వీణ తెచ్చిన కట్నాన్ని (32 ఇంచుల టీవీ) పోల్చుతూ వేధించేవాడు. ఇద్దరూ కలిసి వీణను మానసికంగా, శారీరకంగాహింసించేవారు. ఎంతలా అంటే ఒకసారి కొట్టిన దెబ్బలకు వీణ కర్ణభేరి పగిలిపోయింది.దీంతో పాటు ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్, అదనపు ట్నం వేధింపులు మరింత పెరిగాయి. అయితే కుటుంబం పరువు పోతుందనే భయంతోనే ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సోదరి వీణ ఆపిందని ఆయన పేర్కొన్నారు. ఇంతలోనే అన్యాయం జరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 7 నిమిషాల్లో అంతారాత్రి పదిగంటలకు వీణ తన సోదరి రీనాకి ఫోన్ చేసింది. ఏడుస్తూ.. "దీదీ నన్ను కాపాడు. వీళ్లు నన్ను బాగా కొడుతున్నారు. నన్ను బతకనివ్వరు. చంపేస్తారు" అని చెప్పింది. అంతేకాదు తను చనిపోయాక తన 6 నెలల కొడుకును జాగ్రత్తగా చూసు కోమని వేడుకుంది. అంతలోనే కాల్ కట్ అయింది. ఆందోళన చెందిన రీనా తిరిగి ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. వెంటనే ఆమె వీణ ఇంటికి బయలుదేరింది. బచా లో దీదీ అని ప్రాధేయపడిన కేవలం 7 నిమిషాలకే, వీణ బావ రీనాకు ఫోన్ చేసి, "వదిన మేడ పైనుంచి కింద పడిపోయింది" అని చెప్పాడు. రీనా అక్కడికి చేరేలోపే వీణ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.దీంతో అదనపు కట్నం కోసం ఆమె అత్తవారింటి వారే భవనం పైనుంచి తోసి చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ కొనసాగుతోందని పశ్చిమ ఢిల్లీ డీసిపీ శరద్ భాస్కర్ వెల్లడించారు.అత్తవారింటి వాదనవీణ మామ జైపాల్ ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. దంపతుల మధ్య చిన్నచిన్న గొడవలు సహజమేనని, తాము ఒక్క స్పూన్ కూడా కట్నం అడగలేదని చెప్పారు. ఆమె భవనం పైనుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయిందని భర్త రాజు సింగ్ వాదిస్తున్నాడు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోం కాదు.. వర్క్ ఫ్రం బీచ్, అదీ గోవాలో -
రూ.2,500 రూపాయలు ఎప్పుడు వస్తాయి..
చెన్నై: తన మనవడు, మనవరాలు చెప్పినందుకే టీవీకే పార్టీకి ఓటు చేశామని రూ. 2,500 ఎప్పుడు వస్తాయని ఒక మహిళ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యేను ప్రశ్నించారు. శివగంగ జిల్లాలోని మనమదురై ప్రభుత్వ ఆసుపత్రిని టీవీకే ఎమ్మెల్యే ఇలంగోవన్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రాథమిక సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న చికిత్సను ఆయన పరిశీలించారు. ఆయన ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. తనిఖీ సమయంలో, మునియమ్మల్ అనే ఒక రోగి ఎమ్మెల్యేను ఇలా అడిగారు, ‘నా మనవడు, మనవరాలు అందరూ మీకు ఓటు వేయమని నన్ను అడిగారు. అందుకే మీకు ఓటు వేశాము. మేము కూడా మీరు రూ. 2,500 ఎప్పుడు ఇస్తారని ఎదురుచూస్తున్నాం అని అడిగారు.’ దీనికి ప్రతిస్పందనగా, ఎమ్మెల్యే ఇలంగోవన్, ‘ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 2,500 కంటే కూడా యువతకు ఉద్యోగాలు కల్పించడమే ముఖ్యం’ అని చెప్పారు. ఇది విని మునియమ్మాల్ నిరాశ చెందారు. -
మహిళ వెనుక వెళ్లి.. డ్రెస్ను పైకెత్తి
హైదరాబాద్: ఇటీవల నార్సింగి సైకిల్ ట్రాక్లో జాగింగ్ చేస్తున్న యువతిని చూస్తూ ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడం మరచిపోకముందే అలాంటిదే మరో ఘటన నెక్నాంపూర్ డివిజన్ అలకాపూర్ టౌన్షిప్లో చోటుచేసుకుంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, నార్సింగి ఎస్ఐ సరిత తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ రోడ్ నం. 4లో మధ్యాహ్నం వేళ కూతురును ఎత్తుకుని వెళ్తోంది. ఓ యువకుడు నక్కినక్కి వచ్చి వెనకనుంచి మహిళ డ్రెస్ను పైకెత్తాడు. అకస్మాత్తు పరిణామంతో నివ్వెరపోయిన మహిళ గట్టిగా అరిచింది. దీంతో నిందితుడు పారిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది. కొందరు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది. విషయం పోలీసులకు చేరడంతో బాధిత మహిళను గుర్తించి ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఇలాంటివి జరగకుండా పోలీసులు గస్తీ పెంచాలని, కాలనీల్లో సీసీ కెమెరాలన్నింటినీ పనిచేసేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.చిల్లర నా కొడుకులు ఎక్కువైపోయారు 💦ఏం బ్రతుకులు రా మీవి ముండల్లారThis incident happened in Manikonda on 14 may afternoon pic.twitter.com/kcvlzogBme— Prudvi Kumar (@Prudvikumar_54) May 19, 2026 -
రూ. 51 లక్షలు, ఫార్చ్యూనర్ కారు కోసం దారుణం?
తమ బిడ్డ పెళ్లి కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. రూ. 11 లక్షల నగదు, రూ. 50 లక్షల విలువైన బంగారం, ఫర్నిచర్ , ఒక స్కోర్పియో (Scorpio) కారు లాంటి ఖరీదైన కానుకలను కట్నంగా ఇచ్చారు. కానీ ఏం లాభం, పెళ్లైన 17 నెలలకే తీరని కట్నం దాహానికి 25 ఏళ్ల కొత్త కోడలు బలైపోయింది. దీంతో అమ్మాయి తల్లి దండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అత్యంత హృదయ విదారకమైన ఈ ఘటన, గ్రేటర్ నోయిడాలోని జల్పురా ప్రాంతంలో, Ecotech-III పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడా (జల్పురా ప్రాంతం)లో 25 ఏళ్ల దీపికా నాగర్ అనే వివాహిత తన అత్తవారింటి పైకప్పు (టెర్రస్) పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరణించింది. 2024 డిసెంబరులో దీపిక వివాహం జరిగింది. ఈ వివాహం కోసం దీపిక తండ్రి సంజయ్ నగర్ దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లయిన 3-4 నెలల నుంచే అత్తవారింటి వేధింపులు మొదలయ్యాయని దీపిక తల్లిదండ్రలు ఆరోపించారు. నిందితులు అదనంగా ఒక ఫార్చ్యూనర్ కారు, రూ. 51 లక్షల నగదు కావాలని దీపికను వేధించడం ప్రారంభించారు. కట్నం కోసమే ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఎలాగైన తనబిడ్డ సంసారం నిలబడుతుందనే ఆశతో, సర్దుకుపోతుందని భావించి తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కూతురి జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించామని దీపిక తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. అంత కట్నం ఇచ్చినా నా కూతురు నాకు దక్కలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పడిపోయిందా? తోసేశారా? ఆదివారం నాడు దీపికా తన తండ్రికి ఫోన్ చేసి, భర్త మరియు అత్తవారింటి వారు తనను తీవ్రంగా కొడుతున్నారని ఏడుస్తూ చెప్పింది. దాంతో తండ్రి బంధువులు ఆ సాయంత్రం అత్తగారింటికి వెళ్లి గొడవను సర్దిచెప్పి, వారు ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే, రాత్రి 12:30 గంటల ప్రాంతంలో దీపికా మూడో అంతస్తునుంచి పైనుంచి కింద పడిందని సమాచారం అందింది.అయితే ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి చెప్పారు. ఆమెను తీవ్రంగా కొట్టి, కడుపులో స్క్రూడ్రైవర్ లేదా కత్తితో పొడిచి, ఆపై పైనుంచి కిందకు తోసేసారని ఆరోపించారు. ఆసుపత్రిలో ఆమె శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, ముక్కు, చెవులలోంచి రక్తం కారుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను కొట్టి, ఆపై అది ఒక ప్రమాదంలా కనిపించేలా చేయడానికి కిందకు విసిరేశారని దీపిక బాబాయ్ విశేష్ నాగర్ ఆరోపించారుమామ, భర్త అరెస్ట్సెంట్రల్ నోయిడా డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి పైకప్పు పైనుంచి దూకి మరణించినట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దీపిక భర్త రితిక్ తన్వర్, మామ మనోజ్ లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శవపరీక్ష (Post-mortem) నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. -
రైలు బోగీలో మహిళ మొండెం.. లక్నోలో దారుణం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది. ఛప్రా నుండి లక్నో చేరుకున్న గోమతినగర్ ఎక్స్ప్రెస్లో ఓ గుర్తుతెలియని ఓ మహిళ తలలేని మృతదేహం బయటపడటం తీవ్ర కలకలం రేపింది. అత్యంత కిరాతకంగా మహిళను హత్య చేసి, శరీర భాగాలను విడదీసి బాక్సుల్లో ప్యాక్ చేసిన తీరు చూసి రైల్వే అధికారులు సైతం నివ్వెరపోయారు.ఎస్ వన్ కోచ్లో భయానక దృశ్యంఛప్రా నుండి బయలుదేరిన గోమతినగర్ ఎక్స్ప్రెస్ (15114) లక్నోకు చేరుకున్న తర్వాత, ఒక పారిశుధ్య కార్మికుడు ఎస్ వన్ స్లీపర్ కోచ్ (217570 NER S1) శుభ్రం చేయడానికి లోపలికి వెళ్ళాడు. ఒక బెర్త్ కింద అనుమానాస్పదంగా ఉన్న ఒక బాక్సు, ఒక బ్యాగ్ను గమనించిన అతను వెంటనే అప్రమత్తమై సీనియర్ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎప్), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.పెట్టెలో మొండెం.. మరో బ్యాగులో కాళ్లు, చేతులుపోలీసులు ఆ బాక్సును తెరిచి చూడగా, అందులో సుమారు 30 నుండి 35 ఏళ్ల వయసున్న ఒక మహిళ మొండెం మాత్రమే కనిపించింది. దాని పక్కనే ఉన్న మరో బ్యాగులో పాలిథిన్ కవర్లో చుట్టి ఉన్న ఆమె కాళ్లు, చేతులు లభ్యమయ్యాయి. వెంటనే ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పంచనామా నిర్వహించి పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతురాలి గుర్తింపు ఆరామే 17 ఆదివారం నాడు ఈ భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చినట్లు జీఆర్పీ అధికారులు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. వివిధ మార్గాల ద్వారా ఆ మహిళ ఎవరనేది గుర్తించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం అధికారులు రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే, పొరుగు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను సైతం సేకరిస్తున్నారు. -
జడ్చర్లలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, మహబూబ్నగర్: జడ్చర్లలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదని ఓ యవకుడు.. యువతి ప్రాణం తీశాడు. యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని స్థానికులు చితకబాదారు. నిందితుడి పరిస్థితి విషమంగా ఉంది. -
మరో ‘బ్లూ డ్రమ్’ ఘోరం: భర్తతో కలిసి ప్రియుడిని..
థానే: అర్ధరాత్రి ఛాటింగులు, ప్రేమ సందేశాలతో మొదలైన ఓ ‘అక్రమ’ ప్రేమకథ చివరకు అత్యంత ఘోరమైన హత్యతో ముగిసింది. ప్రియుడు డబ్బులు ఇవ్వడం మానేశాడనే కోపంతో ఓ వివాహిత తన భర్త, ఇతరులతో కలిసి ప్రియుడిని కిరాతకంగా హత్య చేసింది. అనంతరం అతని మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్లో కుక్కి, నిర్జన ప్రదేశంలో పడేసింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.ప్రేమ పేరిట వల.. ఆపై దారుణంథానే జిల్లాలోని ముంబ్రా ప్రాంతానికి చెందిన అర్బాజ్ మక్సూద్ అలీ ఖాన్ (26) డోంబివిలిలోని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వసాయికి చెందిన వివాహిత మెహజబీన్ ఖాతున్ ఏక్రాన్ షేక్ (25)తో అతనికి 2021 నుండి వివాహేతర సంబంధం ఉంది. మొదట్లో వీరి వ్యవహారం బాగానే సాగింది. ఈ క్రమంలో మెహజబీన్ నుంచి తరచూ అర్బాజ్ నుండి భారీగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. అతను కూడా ప్రతి నెలా ఆమె బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపుతూ వచ్చాడు. అయితే ఇటీవలి కాలంలో అర్బాజ్ డబ్బులు ఇవ్వడం నిలిపివేయడంతో ఆమె అతనిపై కక్ష పెంచుకుంది. తన భర్త హసన్ షేక్, సోదరుడు తారిక్ షేక్, అతని స్నేహితుడు మొజ్జమ్ పఠాన్లతో కలిసి అర్బాజ్ హత్యకు ప్లాన్ చేసింది.డబ్బుల కోసం పిలిపించి హత్యఏప్రిల్ 3న ఆఫీస్ పనిమీద దాదర్ వెళ్లిన అర్బాజ్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని తండ్రి ముంబ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అర్బాజ్ కాల్ డేటా, మొబైల్ లొకేషన్ను పరిశీలించగా, అతను అదృశ్యమైన రోజు మెహజబీన్ లొకేషన్తో సరిపోలింది. అంతేకాకుండా అదృశ్యానికి ఒక రోజు ముందే అతను ఆమెకు రూ. 50,000 బదిలీ చేసినట్లు తేలింది. అనుమానంతో పోలీసులు మెహజబీన్ను అదుపులోకి తీసుకుని, విచారించగా అసలు నిజం బయటపడింది. డబ్బుల కోసమే అతడిని వసాయిలోని తన నివాసానికి పిలిపించానని, అక్కడ అతని వద్ద ఏమీ లేకపోవడంతో తామంతా కలిసి అర్బాజ్ కాళ్లు, చేతులు కట్టేసి ప్లాస్టిక్ పైపుతో తలపై తీవ్రంగా కొట్టి చంపినట్లు ఆమె అంగీకరించింది.పోలీసుల వేటహత్య అనంతరం నిందితులు అర్బాజ్ మృతదేహాన్ని ఒక డ్రమ్లో కుక్కి, వాలీవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య డ్రైనేజీ కాల్వలో పడేశారు. ఈ ఘోరానికి పాల్పడిన మెహజబీన్, ఆమె సోదరుడు తారిక్లను పోలీసులు మే ఏడున అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె భర్త హసన్, అతని స్నేహితుడు పఠాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కిడ్నాప్, హత్య, సాక్ష్యాధారాల నాశనం లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: బెంగాల్లో అర్ధరాత్రి భారీ విధ్వంసం -
అరుదైన ఘటన.. ‘సాధారణం’లో అ‘సాధారణం’
ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఐదు రోజుల వ్యవధిలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అత్యంత అరుదైన కేసుగా వైద్యులు అభివర్ణించారు. సాధారణంగా ఇలాంటి ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు హై-రిస్క్ గర్భధారణల కారణంగా సిజేరియన్ (సి-సెక్షన్) శస్త్రచికిత్స అవసరమవుతుంది. కానీ.. మొరాదాబాద్లోని తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఈ నలుగురు పిల్లలు సాధారణ కాన్పు ద్వారా జన్మించడం ఒక అసాధారణ కేసుగా ఆశ్చర్యపరుస్తోంది.అమీనాగా అనే ఆ మహిళకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, నవజాత శిశువులు ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. అల్ట్రాసౌండ్ స్కాన్లలో నలుగురు పిండాలు ఉన్నట్లు నిర్ధారణ అయినప్పటి నుండి.. ఈ గర్భధారణ అత్యంత సంక్లిష్టమైనది వైద్యులు చెప్పారు. దీనివల్ల ఉండే ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని.. కనీసం ఇద్దరు పిల్లలనైనా సురక్షితంగా ప్రసవించే అవకాశాలను పెంచడం కోసం "ఫీటల్ రిడక్షన్" (పిండాల సంఖ్యను తగ్గించడం) చేయాలని వైద్య బృందం సలహా ఇచ్చింది. అయితే నలుగురు పిల్లలతోనే గర్భాన్ని కొనసాగించాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది.గర్భధారణ సమయంలో అమీనా రక్తపోటు (బీపీ), కాలేయ సంబంధిత (లివర్) సమస్యలతో కూడా బాధపడ్డారు. దీంతో ఆమె చికిత్స కోసం పలుమార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆసుపత్రి పరిపాలన విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. మే 8వ తేదీన అమీనాకు మొదటిసారి నొప్పులు వచ్చాయి. మే 9న ఆమె తన మొదటి కుమారుడికి జన్మనిచ్చింది. ఆ శిశువు బరువు సుమారు 710 గ్రాములు ఉంది.ఆ సమయంలో గర్భం ఇంకా ఆరున్నర నుండి ఏడు నెలల దశలోనే ఉండటంతో, వైద్యులు ఆమె పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. మిగిలిన ప్రసవాలను ఆలస్యం చేయగలిగారు. ఐదు రోజుల తర్వాత.. మే 14న ఆమెకు మళ్లీ ప్రసవ వేదన రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆమె మిగిలిన ముగ్గురు పిల్లలకు (ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు) జన్మనిచ్చింది. నవజాత శిశువులలో ఒకరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, మిగిలిన ఇద్దరు ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు తెలిపారు.ఈ కేసు వైద్యపరంగా అత్యంత అరుదైనదని.. సవాలుతో కూడుకుందని ఆసుపత్రి వైద్య బృందం పేర్కొంది. నలుగురు పిల్లలు వేర్వేరు సంచులలో (separate sacs) ఉన్నారని, దీనివల్ల సాధారణ ప్రసవాలు విజయవంతం కావడం వైద్యపరంగా అత్యంత అసాధారణమైన విషయమని వైద్యులు చెప్పారు. ఈ చికిత్స, పర్యవేక్షణలో వైద్యుల బృందంతో పాటు పలువురు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సకాలంలో స్పందించడం, నిరంతర పర్యవేక్షణ, కుటుంబ సభ్యుల సహకారం ఈ హై-రిస్క్ గర్భధారణను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాయని వైద్యులు తెలిపారు. పిల్లల తండ్రి, కిరాణా దుకాణం యజమాని మహ్మద్ ఆలిమ్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
బంగారం కోసం మహిళను హత్య చేసిన దుండగులు
-
ఒంగోలులో దారుణం.. అంధురాలి గొంతుకోసి హత్య చేసిన దుండగులు
-
ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదులుతున్న బస్సులో..
ఢిల్లీ: ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. స్లీపర్ బస్సులో ఓ మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ కేసులో బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. బస్సులో ఇద్దరు వ్యక్తులు తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా.. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బాధితురాలు పీతంపురలోని మంగోల్పురిలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తోంది. మే 11వ తేదీ రాత్రి సదరు మహిళ పని ముగించుకుని ఎప్పటిలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో సరస్వతి విహార్లోని బస్టాప్ వద్ద ఓ స్లీపర్ బస్సు ఆగింది. బస్సు తలుపు వద్ద నిలబడిన వ్యక్తిని ఆమె సమయం ఎంత అని అడిగింది. ఆ సమయంలో నిందితులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు.అనంతరం నిందితులు బస్సును నాంగ్లోయ్ వైపు నడిపారు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటన అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. బస్సును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుగుతోందని.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. -
AP: కుమార్తెకు తండ్రి ఆస్తిలో సమానహక్కు
సాక్షి, అమరావతి: హిందూ వారసత్వ సవరణ చట్టం–2005 ప్రకారం కుమార్తె పుట్టుకతోనే కుమారుడితో సమానంగా ఆస్తి హక్కు కలిగి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కుమార్తె ఈ సమాన వాటా పొందేందుకు 2005లో సవరణ చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి జీవించి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆస్తిలో సమాన హక్కు పొందేందుకు సవరణ చట్టం వచ్చిన 2005 సెప్టెంబర్ 9 నాటికి కుమార్తె జీవించి ఉంటే సరిపోతుందని చెప్పింది. విభజన దావా (పార్టిషన్ సూట్)లో ప్రాథమిక తీర్పు (ప్రిలిమినరీ డిక్రీ) ద్వారా వాటాల నిర్ణయం జరిగి, తుది తీర్పు (ఫైనల్ డిక్రీ) పెండింగ్ ఉంటే, ఆ తరువాతి కాలంలో చట్టపరమైన, వాస్తవిక మార్పులు జరిగితే కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపింది. ‘విభజన దావాలో ఆస్తి వాటాలను నిర్ణయించిన తర్వాత, తుది తీర్పు రాకముందే కుటుంబంలో మార్పులు సంభవిస్తే వాటాలు మారతాయి. ఒక వాటాదారు మరణిస్తే, వారి వాటా మిగిలిన వారసులకు చెందుతుంది. దీనివల్ల ఇతరుల వాటా శాతం పెరుగుతుంది. కొత్తగా వారసుడు జన్మిస్తే, అతడికి/ఆమెకు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఇతరుల వాటా తగ్గుతుంది. ఇటువంటి సందర్భాల్లో మారిన వాటాలను ఖరారు చేస్తూ కోర్టు మరో ప్రాథమిక తీర్పు ఇవ్వవచ్చు’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. 2005 చట్ట సవరణ నేపథ్యంలో తుది తీర్పు వెలువడకముందటి ప్రాథమిక తీర్పును సవరించి కుమార్తెలకు సమానవాటా ఇవ్వవచ్చని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా వీరమ్మ అనే మహిళకు తండ్రి మారెప్ప నుంచి సంక్రమించే ఆస్తి వాటాను హైకోర్టు సవరించింది. 2003లో వీరమ్మకు తండ్రి ఆస్తిలో 1/6 వాటా రాగా, 2005 సవరణ చట్టం నేపథ్యంలో మారెప్ప కుమారుడితో సమానంగా వీరమ్మ వాటాను సగానికి పెంచింది. సవరించిన వాటాను పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా తుది తీర్పు వెలువరించాలని కింది కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ మెడమల్లి బాలాజీ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఆస్తిలో వాటా కోసం న్యాయ పోరాటం కర్నూలు జిల్లాకు చెందిన వి.మారెప్పకు భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ, కుమారుడు బుసప్ప ఉన్నారు. మారెప్ప ఆస్తిలో వాటా కోసం వీరమ్మ 1988లో కోర్టులో దావా వేశారు. ఆ తరువాత ఈ వివాదం హైకోర్టుకు చేరింది. విచారణ జరిపిన హైకోర్టు.. మారెప్ప ఆస్తిలో భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ, బుసప్పకు వాటానిస్తూ 2003లో తీర్పు ఇచ్చింది. 2005లో హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కుమార్తెకు సైతం సమాన హక్కు కల్పించడంతో వీరమ్మకు ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు ధర్మాస నం.. ఆమెకు తండ్రి ఆస్తిలో సగం ఆస్తిని వాటాగా ఇస్తూ తీర్పు వెలువరించింది. -
పోక్సో కేసులో మహిళా అధికారికి ఐదేళ్ల జైలు శిక్ష
ఒంగోలు: పోక్సో కేసులో ఓ మహిళా ప్రత్యేక అధికారికి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు అందించిన వివరాల మేరకు.. 2018 జూన్ 26న ఓ విద్యార్థిని పట్ల అదే విద్యాలయంలో మహిళా ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహిళ అసభ్యకరంగా ప్రవర్తించారు.ఈ ఘటనపై అప్పటి మర్రిపూడి ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషిటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం మహిళా ప్రత్యేక అధికారికి 5 సంవత్సరాల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధించారు. బాధిత విద్యార్థినికి రూ.22 వేలు పరిహారం అందించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చర్యలు చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
బిడ్డ కోసం కెరీర్ను కొనసాగించాలనుకోవడం క్రూరత్వం కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: విద్యావంతురాలైన మహిళ తన కెరీర్ను కొనసాగించాలని నిర్ణయించుకోవడం, తన బిడ్డకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని భావించడం క్రూరత్వం లేదా భర్తను నిర్లక్ష్యం చేయడంగా భావించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక మహిళ డెంటిస్ట్గా తన వృత్తిని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడాన్ని క్రూరత్వంగా పేర్కొంటూ కుటుంబ న్యాయస్థానం తీర్పింవ్వగా గుజరాత్ హైకోర్టు సమర్ధించింది. ఈ తీర్పులను తిరోగమనవాదం, అతి సంప్రదాయవాద ధోరణిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. రెండు కోర్టుల తీర్పులను కొట్టివేసింది.భార్య వృత్తిపరమైన గుర్తింపు కేవలం భర్త ఇష్టాయిష్టాలకు లోబడి ఉండదని స్పష్టం చేసింది. వేరుగా ఉంటున్న భార్యాభర్తల పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మంగళవారం పైవ్యాఖ్యలు చేసింది. వివాహ బంధంతో రాజీపడే అవకాశం ఎంతమాత్రం లేదని మహిళ చేసిన వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. వివాహ బంధం పునరుద్ధరించలేనంతగా దెబ్బతిన్నదనే కారణంతో కింది కోర్టులు మంజూరు చేసిన విడాకుల ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, ఈ విడాకులు మహిళ క్రూరత్వం లేదా పరిత్యాగం ఆధారంగా కాదని స్పష్టం చేసింది.కేసు వివరాలివీ.. పిటిషనర్లయిన భర్త భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ కాగా, భార్య దంత వైద్యురాలు. పుణెలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న డెంటిస్ట్కు 2009లో కల్నల్తో వివాహమైంది. పెళ్లయిన వెంటనే భర్త వెంట ఆమె సరిహద్దుల్లోని కార్గిల్కు వెళ్లారు. వారికి ఒక కుమార్తె పుట్టింది. బిడ్డకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తడంతో ప్రత్యేక వైద్యం కోసం అహ్మదాబాద్ వెళ్లారు. కుమార్తె వెంట ఉండిపోవాల్సి రావడంతో అహ్మదాబాద్లోనే డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నారు. భర్తకు ఇది నచ్చలేదు. విషయం ఫ్యామిలీ కోర్టుకు, ఆపై హైకోర్టుకు వెళ్లింది. రెండు కోర్టులూ దీనిని భార్య కూరత్వంగానే పేర్కొన్నాయి. భర్త ఎక్కడ ఉద్యోగం చేస్తే భార్య కూడా అక్కడే నివసించడం తప్పనిసరి విధి అని ఫ్యామిలీ కోర్టు పేర్కొంది. -
స్నేహితురాలి పెళ్లికి వెళ్లి..
హైదరాబాద్: అమెరికాలో స్విమ్మింగ్పూల్లో పడి నగర యువతి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడ డివిజన్ న్యూ శివపురి కాలనీకి చెందిన ముద్దసాని దేవేందర్ రెడ్డి, సునీత దంపతుల కూతురు శ్రీవీణ (28)కు 2023లో ప్రశాంత్ రెడ్డితో వివాహమైంది. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవీణ స్నేహితురాలి వివాహం సందర్భంగా రెండు రోజుల క్రితం ఫ్లోరిడా వెళ్లారు. అక్కడ శ్రీవీణ స్విమ్మింగ్పూల్లో విగతజీవిగా కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఒక్కగానొక్క కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో నగరంలోని దేవేందర్ రెడ్డి, సునీత దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీవీణ తల్లిదండ్రులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్రెడ్డి, మాజీ కార్పొరేటర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్రెడ్డి పరామర్శించారు. ఆమె భౌతిక కాయాన్ని అమెరికా నుంచి భారత్కు వీలైనంత తొందరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
యూట్యూబ్లో చూసి ప్లాన్.. భార్యకు పాలకోవా తినిపించి..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులో వివాహిత పద్మజ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఏఎస్పీ విభుకృష్ణ మీడియాకు వెల్లడించారు. భర్త కిరణ్కుమార్.. పాలకోవలో విషం కలిపి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. కిరణ్కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు.. మీడియా ఎదుట హాజరుపరిచారు.భర్త కిరణ్.. భార్య హత్యకు యూట్యూబ్లో శోధించి ప్లాన్ వేశాడు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు కొరియర్ ద్వారా విషం తెప్పించిన భర్త.. పాలకోవాలో విషం కలిపి భార్యకు తినిపించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. భార్య చనిపోయిందో లేదో అనుమానంతో భర్త కిరణ్.. ఆమె ముఖంపై దిండుతో నొక్కినట్లు ఏఎస్పీ వెల్లడించారు. భార్య లావుగా ఉండటం, తనను నిత్యం అనుమానిస్తోందన్న కారణంతోనే కిరణ్ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. -
ప్రెగ్నెన్సీ 7వ నెలలో వైట్ డిశ్చార్జ్.. సమస్యేనా?
నాకు ఇరవై ఐదు సంవత్సరాలు. నాకిది రెండో ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఏడవ నెల. గత కొన్ని రోజులుగా యోనిలో ఎక్కువగా తెల్లటి డిశ్చార్జ్ కనిపిస్తోంది. కొన్నిసార్లు దురద కూడా ఉంది. ఇది పెద్ద సమస్యేనా? – రమ్య, నెల్లూరు.గర్భధారణ సమయంలో యోనిలో తెల్లటి డిశ్చార్జ్ కనిపించడం చాలా సాధారణం. గర్భధారణలో శరీరంలో హార్మోన్ మార్పులు ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి పెరగడం వల్ల యోని స్రావం కూడా కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు. ఇది సాధారణ ప్రక్రియ. ఈ డిశ్చార్జ్ యోని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడంలో, హానికరమైన ఇన్ఫెక్షన్లు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఆరోగ్యకరమైన డిశ్చార్జ్ తెలుపు లేదా పారదర్శకమైన రంగులో ఉంటుంది. పలుచగా లేదా కొద్దిగా జిగురుగా ఉంటుంది. తేలికపాటి వాసన లేదా వాసన లేకుండా ఉంటుంది. దురద, మంట లేదా అసౌకర్యం లేకుండా ఉంటుంది. గర్భధారణ ముందుకు సాగేకొద్దీ ఇది కొంచెం ఎక్కువగా కనిపించడం సహజమే. అయితే మీరు చెప్పినట్లుగా డిశ్చార్జ్తో పాటు దురద కూడా ఉంటే, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియా అసమతౌల్యం వంటి చిన్న సమస్యల సంకేతం కావచ్చు. సాధారణంగా ఇవి సులభంగా చికిత్సతో తగ్గిపోతాయి. బలమైన దుర్వాసన రావడం, చేప వాసనలాగా ఉండటం. పసుపు, ఆకుపచ్చ లేదా బూడిద రంగులో మారడం. ముద్దలాగా గట్టిగా ఉండటం. తీవ్రమైన దురద, మంట లేదా ఎర్రదనం ఉండటం. ఒక్కసారిగా ఎక్కువగా నీళ్లలాగా కారడం. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు చేసి, అవసరమైతే సరైన మందులు ఇస్తారు. గర్భధారణలో స్వయంగా మందులు వాడటం మంచిది కాదు. డాక్టర్ సలహాతో మాత్రమే చికిత్స తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్లు నివారించడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. యోని బయట భాగాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచాలి. లూజుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఆ ప్రాంతంలో ఎక్కువగా సబ్బులు, వాష్లు లేదా పౌడర్లు వాడకూడదు. డాక్టర్ సలహా లేకుండా క్రీములు లేదా మందులు కూడా వాడకూడదు. సాధారణంగా ఇది చిన్న సమస్యే అయినా, మీరు 7 నెలల గర్భంతో ఉన్నందున ఒకసారి డాక్టర్ను కలసి చెక్ చేయించుకుంటే మరింత మంచిది.ప్రసవ నొప్పులేనా? నేను 36 వారాల గర్భిణిని. ఇది నా మొదటి గర్భం. కొన్నిసార్లు పొత్తికడుపు గట్టిగా పట్టేయటం, పీరియడ్స్లా నొప్పులు వస్తున్నాయి. కొన్ని నిమిషాల్లో అవి మామూలుగా మారిపోతాయి. ఇవి ప్రసవ నొప్పులేనా? – స్వాతి, విజయనగరం.మీరు 36 వారాల గర్భంతో ఉన్నప్పుడు పొత్తికడుపు కొన్నిసార్లు గట్టిపడటం లేదా పీరియడ్స్లా నొప్పులు రావడం చాలా సాధారణం. కొన్ని నిమిషాల్లో తగ్గిపోతే అవి నిజమైన ప్రసవ నొప్పులు కావు. నిజమైన ప్రసవానికి ముఖ్యమైన లక్షణం గర్భాశయ సంకోచాలు క్రమంగా రావడం. ఇవి తప్పుడు నొప్పుల కంటే భిన్నంగా ఉంటాయి. మొదట కొద్దిగా ప్రారంభమై, తర్వాత సమయం గడిచేకొద్దీ మరింత బలంగా, ఎక్కువసేపు కొనసాగుతాయి. విశ్రాంతి తీసుకున్నా తగ్గవు. ఒక సులభమైన నియమం ఏమిటంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి నొప్పి రావడం, ప్రతి నొప్పి కనీసం ఒక నిమిషం పాటు కొనసాగడం, ఈ పరిస్థితి దాదాపు ఒక గంట పాటు ఉండటం. ఇలా జరిగితే మీరు ఆసుపత్రికి వెళ్లాలి. మరొక ముఖ్యమైన సంకేతం నీరు కారడం. అంటే ఒక్కసారిగా ఎక్కువగా ద్రవం రావడం లేదా నెమ్మదిగా నిరంతరం కారడం అనిపించవచ్చు. ఆ ద్రవం సాధారణంగా పారదర్శకంగా ఉంటుంది. ఒకసారి నీరు కారితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. కొన్నిసార్లు గులాబీ రంగులో లేదా కొద్దిగా రక్తం కలిసిన మ్యూకస్లా డిశ్చార్జ్ కనిపిస్తే ప్రసవం త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అలాగని వెంటనే డెలివరీ జరుగుతుందని చెప్పలేం.ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి: ∙ఎక్కువగా రక్తస్రావం కావడం ∙తీవ్రమైన పొత్తికడుపు నొప్పి ఉండటం ∙బిడ్డ కదలికలు తగ్గిపోవడం లేదా ఆగిపోవడం. ∙ఎక్కువ జ్వరం రావడం ∙తీవ్రమైన తలనొప్పి లేదా చూపు మసకబారడం ∙ముఖం లేదా చేతులు ఒక్కసారిగా ఉబ్బడం ∙మొదటిసారి గర్భిణులలో ప్రసవం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. కానీ నొప్పులు క్రమంగా, దగ్గర దగ్గరగా వస్తూ బలంగా మారితే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లడం మంచిది. ∙ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండటం మంచిది. మీకు ఏదైనా కొత్త లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం సురక్షితం. -
బట్టలు ఆరేసాక, సడెన్గా వర్షం వస్తే : అమ్మడి ఐడియా అదుర్స్!
బట్టలు ఆరేయడం, మడతపెట్టడం, వాటిని జాగ్రత్తగా అల్మరాలలో సర్దడం ఒక పెద్ద పని. దీనికి చాలా ఓపిక శ్రద్ధ ఉండాలి. అందుకే చాలామంది ఇళ్లల్లో ఏ సోఫాలోనో, కుర్చీల్లోనో లేదంటే దీవాన్ బెడ్స్మీదో ఉతికిన బట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. ఇ పోతే బట్టలను ఆరబెట్టడం ఎండాకాలంలో అయితే పెద్దగా సమస్య ఉండదు కానీ, మిగతా సీజన్లలో కొంచెం కష్టమే... ఎంతో కష్టపడి ఉతికి (వాషింగ్ మెషీన్లోనే అనుకోండి) ఆరేసినపుడు, ఉన్నట్టుండి వర్షం వస్తే... గోవిందా.. గోవిందా. ఆ కష్టం పగోడికి రావద్దు అనిపిస్తుంది. అయితే దీనికోసం ఒక అమ్మడు మంచి ఆలోచన చేసింది.చిన్న బాల్కనీలున్న ఇళ్లలో, సరైన ప్లేస్ దొరకనపుడు బట్టల రాక్లను ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. బాత్రూంలో గోడకు, బాల్కనీలో,బాత్రూంలో, పడకగదుల్లోనూ బట్టల రాక్లు అమర్చుకుంటాం. ఇంకా వాష్స్టాండ్, సీలింగ్ డ్రాయర్ ర్యాక్ ట్రైపాడ్ డ్రైయింగ్ ర్యాక్స్ లాంటివి వాడతాం. అయితే ఆరు బయట తీగల మీద ఆరేసిన బట్టల్ని వర్షం వచ్చినపుడు పరుగెట్టాల్సిన అవసరం లేకుండానే ఒక వినూత్న టెక్నిక్ను వాడింది. దీనికి జస్ట్ అలా వీల్ అమర్చిన స్టాండ్ను లోపలికి జరిపింది. అంతే ఆకస్మిక వర్షాల నుండి రక్షణగా, బట్టలు ఆరబెట్టే సొంత అమరికను ఏర్పాటు చేసుకుందో మహిళ.Aniden basan yağmurlara karşı kendi imkanlarıyla raylı çamaşır asma düzeneği kuran bir kadın; pic.twitter.com/APFfTHUbFk— Gezegen ve İnsan (@gezegenveinsan) May 1, 2026నెటిజన్ల స్పందన గుడ్ ఐడియా అంటూ కొంతమంది నెటిజన్లు అభినందించారు. మరి కొంతమంది మాత్రం టేం వేస్ట్, స్పేస్ వేస్ట్ అంటూ పెదవి విరిచారు. మంచి ఆలోచనే! కాకపోతే, ఎంత స్థలం వృధా అవుతుందో! ఆ మొత్తంలో బట్టలను, దీని పరిమాణంలో సగం ఉండే ప్లేస్లోనే నేను ఆరేయగలను. పైగా వర్షం గురించి కూడా చింతించాల్సిన పనే లేకుండా ఆ షెడ్డు కిందనే, సూర్యరశ్మి వేడి , గాలి వల్ల బట్టలు చక్కగా ఆరిపోతాయి. ఇది పూర్తిగా వృధా! అని ఒకరు కామెంట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్! -
చాలా వేధించాడు.. సూసైడ్ నోట్లో షాకింగ్ విషయాలు!
బిజ్నోర్: ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో ఓ మహిళ పెళ్లిరోజుకు ముందే ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణించిన రెండు రోజుల తర్వాత ఆమె రాసిన సూసైడ్ నోట్ భర్తకు లభించింది. ‘ఆ వ్యక్తి మీ అమ్మను చాలా హింసించాడు. తనను డిజిటల్ అరెస్ట్ పేరుతో వేధించారు’’ అని తెలిపింది. అయితే, వేధింపులకు పాల్పడిన వ్యక్తి పేరును లేఖలో ఆమె పేర్కొనలేదు. ప్రతి జన్మలోనూ మీలాంటి కుటుంబమే రావాలని కోరుకుంటున్నాను. నా పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. నన్ను క్షమించు.. అమ్మ చనిపోవాల్సి వస్తోందంటూ ఆమె ఆ నోట్లో రాసింది.ఆమె మొబైల్ ఫోన్ను పరిశీలించగా, రెండు మూడు అనుమానాస్పద నంబర్ల నుండి కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆ నంబర్లకు తిరిగి కాల్ చేయగా, ఒక్కరూ కూడా స్పందించలేదు. కానీ ఒక నంబర్ నుండి మాత్రం వీడియో కాల్ చేసి కుటుంబ సభ్యులను బెదిరించారు. బిజ్నోర్ ఎస్పీ అభిషేక్ ఝా మాట్లాడుతూ మహిళ మరణించిన రెండు రోజుల తర్వాత, ఏప్రిల్ 30న పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, అనుమానాస్పద నంబర్ నుండి వచ్చిన వీడియో కాల్ను ఈ కేసులో కీలక ఆధారంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. -
ఆమెకు బోర్ కొడితే చావాల్సిందే.. చరిత్రలో అత్యంత క్రూరమైన మహిళా కిల్లర్!
-
34 ఏళ్ల మర్డర్ మిస్టరీ : క్షుద్ర పూజలు, భూత్ బంగ్లాలో ఎముకలు
అహ్మదాబాద్లోని వత్వా (Vatva) ప్రాంతంలో ఒక పాత "దెయ్యాల కొంప" (Haunted House) రహస్యం వెల్లడైంది. 32 ఏళ్ల క్రితం జరిగిన ఒక దారుణ హత్యను, క్షుద్రపూజలు గుట్టును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 1992 నాటి హత్యతో సంబంధం ఉన్న ఒక దెయ్యాల కొంపలో మానవ అవశేషాలు లభ్యం కావడంతో మిస్టరీ వీడింది.దర్యాప్తు అధికారులు అందించిన వివరాల ప్రకారం ముంబైకి చెందిన ఫర్జానా రాధన్పురి (40) ఆస్తి వివాదం కారణంగా 1992లో హత్యకు గురయ్యారు. ముఖ్యంగా తన ప్రియుడు షంసుద్దీన్ ఖేడావాలా ఆస్తిలో సమాన వాటా కావాలని ఆమె కోరడంతో వివాదం మొదలైంది. 1992లో జూలై లేదా ఆగస్టు నెలలో ఒక వర్షం కురిసిన రాత్రి, షంసుద్దీన్ తన సోదరుడు ఇక్బాల్, మరో అనుచరుడు అబ్దుల్ జవ్రావాలా సహాయంతో ఫర్జానాను గొంతు నులిమి చంపేశాడు. వాట్వాకు చెందిన అబ్దుల్ జవ్రావాలా ఆమె చేతులను పట్టుకోగా, కుతుబ్నగర్లోని మరో సహచరురాలైన షాలియాబీవి పఠాన్ ఇంట్లో జరిగినట్లు సమాచారం. ఆ తరువాత అందరూ కలిసి ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ను తవ్వించి, ఆమె మృతదేహాన్ని అందులో వేసి మట్టి, ఇసుక, సిమెంట్తో పూడ్చిపెట్టారు. ఇక్కడితో కథ ముగిసిపోతుందనుకున్నారు. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. నిందితులను అపరాధభావం, భయం వెంటాడుతూ వచ్చాయి. దీనికి తోడు వరుస మరణాలతోఫర్జానా ఆత్మ తిరుగుతోందనే భయం నిందితుల్లో మొదలైంది.ముఖ్య నిందితుడు షంసుద్దీన్ 2015లో గుండెపోటుతో మరణించగా, మిగిలిన నిందితులు కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. దీంతో కుటుంబ సభ్యుల్లో వణకు మొదలైంది. ఆమె శాపం వల్లే వీరంతా చనిపోతున్నారని కుటుంబ సభ్యులు, ఇతరులు నమ్మారు. ఉపశమనం పొందే ప్రయత్నంలో, వారు క్షుద్రపూజల్ని ఆశ్రయించారు. చివరికి ఆ ఇల్లు ఖాళీ అయిపోవడంతో ఆ ఇంటిని స్థానికులు "భూత్ బంగ్లా" అని పిలవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నేరానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. నిందితుడి కుటుంబంలో చోటుచేసుకున్న ఒక విచిత్రమైన పరిణామమనని సీనియర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి పేర్కొన్నారు. ఆ కుటుంబ సభ్యులకు మృతురాలి గురించి పదేపదే ఏవేవో భ్రాంతులు రావడంతో, వారిలో తీవ్ర భయాందోళనలకు, మానసిక క్షోభకు దారితీసింది. దీన్నుంచి ఉపశమనం పొందే ప్రయత్నంలో, వారు క్షుద్రపూజలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే నేరానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.ఇదీ చదవండి: వారెవ్వా..ఆమ్లెట్లు అమ్ముతూ, ఆట కట్టించారు!పోలీసుల ఎంట్రీఆత్మ శాంతి కోసం నిందితుల కుటుంబ సభ్యులు ఈఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారనే సమాచారం అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అందింది. దీనిని కేవలం మూఢనమ్మకంగా కొట్టిపారేయకుండా, పోలీసులు రహస్యంగా నిఘా పెట్టారు. 1992లో అక్కడ ఒక హత్య జరిగిందని, ఆ పాపం కడుక్కోవడానికే వారు ఈ పూజలు చేస్తున్నారని ఇన్ఫార్మర్ల ద్వారా నిర్ధారించు కున్నారు. బుధవారం ఉదయం క్రైమ్ బ్రాంచ్ బృందం ఆ పాడుబడిన ఇంటిపై దాడి చేసి, అనుమానిత స్థలంలో తవ్వకాలు చేపట్టింది. సాయంత్రానికి సుమారు 5-6 పళ్ళు, 7-8 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఫర్జానావేనని భావిస్తున్నారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: భార్యను నమ్మించి గొంతు కోశాడు.. తర్వాత! -
‘బోష్’ మహిళా ఉద్యోగిని అనుమానాస్పద మరణం
బెంగళూరులోని ఒక అద్దె ఇంట్లో 34 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. రక్తపు మడుగులో ఆమె నగ్న మృతదేహం లభ్యం కావడం మరింత ఆందోళన రేపింది. ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగువారు అధికారులకు సమాచారం అందించారు. దీంతో సోమవారం నాడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలిని జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాకు చెందిన పూజా దత్తాగా గుర్తించారు. ఆమె బెంగళూరులోని 'బాష్' (Bosch) కంపెనీలో పనిచేస్తోంది. గత మూడేళ్లుగా ఆమె బెంగళూరులో ఒంటరిగా నివసిస్తోంది.ఏం జరిగింది?పోలీసుల సమాచారం ప్రకారం సోమవారం నాడు ఆమె నివసిస్తున్న ఫ్లాట్ నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులొచ్చి తలుపులు పగులగొట్టి చూడగా, పూజా దత్తా మృతదేహం నగ్నంగా, రక్తపు మడుగులో పడి ఉంది. మృతదేహం అప్పటికే కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. ఫోరెన్సిక్ నిపుణుల అంచనా ప్రకారం, మృతదేహం లభ్యం కావడానికి రెండు లేదా మూడు రోజుల ముందే ఆ మహిళ మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: బండిపై 6 గురు బుడ్డోళ్లు, పేరెంట్స్ను అరెస్ట్ చేయాలి!గత మూడేళ్లుగా ఆమె తన ఫ్లాట్లో అద్దెకు నివసిస్తోందని, ఏప్రిల్ 23న కిరాణా సామాగ్రి కొనడానికి వెళ్లినప్పుడు ఆమె చివరిసారిగా కనిపించిందని ఇంటి యజమాని తెలిపారు. అయితే, గదిలో చెల్లా చెదురుగా పడి ఉన్న కాగితాలు తప్ప ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ దొరకలేదు. అయితే తలుపు లోపలి నుండి వేసి ఉండటంతో, ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, పోలీసులు దీనిని "అనుమానాస్పద మృతి"గా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్ -
కార్పొరేట్ జాబ్ వదిలేసి 50 ఏళ్ల వయసులో కోట్ల డాలర్ల కంపెనీ
50 ఏళ్లు రాగానే చాలామంది ఇక కష్టపడింది చాల్లే రిటైర్మెంట్ తీసుకుందాం అని ఆలోచిస్తుంటారు. కానీ కాథరిన్ బ్రికెన్ మాత్రం ఇందుకు భిన్నం. 50 ఏళ్ల వయసులో క్యాన్సర్ను జయించడమేకాదు, కోట్లాది డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. సంకల్పం ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా ఎంతటి కష్టాలనైనా జయించి విజయం సాధించవచ్చని నిరూపించిన కేథరీన్ స్టోరీ తెలుసుకుందాం.లండన్కు చెందిన కాథరిన్ బ్రికెన్ తన ఉద్యోగాన్ని వదిలేసి, ఇంటి నుండే ఏదైనా పని చేయాలనుకుంది. మొదటి కాన్పులో కవలలు, ఆ తరువాత కొద్ది కాలానికే మరో బిడ్డ పుట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలా పిల్లలునిద్రపోయే సమయంలో కేకులు, కుకీలు తయారు చేయడం ప్రారంభించింది.2017లో 'డోలిషియస్' అనే బహుళ-మిలియన్ డాలర్ల స్నాక్ బ్రాండ్కు నాంది పలికింది.వ్యాపార ఆలోచన ఎలా పుట్టింది2008లో అమెరికా నుండి లండన్కు మారినప్పుడు, అక్కడ అమెరికన్ తరహా సాఫ్ట్ కుకీలు దొరకడం లేదని గమనించింది. అలాంటివే తాను తయారు చేసి విక్రయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అలా 2017లో50 ఏళ్ల వయసులో, 'డోలిషియస్' 'Doughlicious' అనే సంస్థను స్థాపించింది. వ్యాపారం ప్రారంభంలో ఆమె రోజుకు 20 గంటలు పని చేసేవారు. నిరంతరం పిండి కలపడం వల్ల ఆమె చేతి వేలి కీలు దెబ్బతిని, శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.బ్రెస్ట్ క్యాన్సర్2019లో ఆమెకు స్టేజ్-1 రొమ్ము క్యాన్సర్ సోకింది. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. సర్జరీ, రేడియేషన్ తీసుకుంటూనే వ్యాపారాన్ని నడిపించింది. అంతే కాదు వ్యాపారంపై ఉన్న ధ్యాస తన బాధను మర్చిపోయేలా చేసిందని తెలిపింది.ప్రస్తుతం ఆమె వయసు 59 ఏళ్లు. ఆమె గత ఐదేళ్లుగా క్యాన్సర్ నుండి విజయవంతంగా కోలుకుంది. అలాగే ఆమె బ్రాండ్ 'Doughlicious' ఇప్పుడు వారానికి 10 లక్షలకు పైగా కుకీలను ఉత్పత్తి చేస్తోంది. టెస్కో, హోల్ ఫుడ్స్, టార్గెట్ వంటి అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాల స్టోర్లలో ఆమె ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి.ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలుఅలుపెరుగని శ్రమ, ఎన్నో సవాళ్లుఅయితే తన సక్సెస్ అంత ఈజీగా రాలేదు అంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది. అటు కేటరింగ్ పనులు చేయడం, కుకీలు తయారు చేయడం, ఇటు తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రలేకుండా ఉండటం, మళ్ళీ ఉదయం 7 గంటలకు లేచి అమ్మగా బాధ్యతలు నిర్వర్తించడం తనకు ఒక సవాల్ గా ఉండేదని తెలిపారు. కానీ క్యాన్సర్ గురించి గానీ, లేదా నొప్పి గురించి గానీ ఆలోచించే సమయం లేకుండా తన సంస్థ తనకు ఎంతో మేలు చేసిందన్నారు. ఎందుకంటే తన గురించి తన వ్యాధి గురించి మథనపడటానికి అస్సలు సమయమే లేదు, తాను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయనే విషయాన్ని తన బాధ్యత గుర్తు చేసిందని అదే తన విజయానికి బాటలు వేసిందంటారు కాథరిన్ బ్రికెన్ . ఇదీ చదవండి: రూ. లక్షకు కొని, ‘లక్’ లేదని వదిలేశారు.. షాకింగ్ ఫ్యాక్ట్స్ -
పెళ్లైన మహిళలు ఏం సెర్చ్ చేస్తారో తెలుసుకుంటే భర్తలు షాక్ అవుతారు..!
-
ముంబై నడిరోడ్డుపై మంత్రికి చెమటలు పట్టించిన మహిళ
-
బెంగాల్లో భారీగా పోలింగ్ : ఎండ తీవ్రతకు నలుగురు మృతి
సాక్షి,కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 మొదటి దశలో భాగంగా ఈరోజు (గురువారం) పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటa వరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పశ్చిమ మేదినిపూర్ 65.77 శాతం పోలింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ పోలింగ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓటు వేసే ప్రయత్నంలో తీవ్రమైన వేడి, శారీరక శ్రమ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు ఓటర్లు మరణించారు. తూర్పు, పశ్చిమ మేదినీపూర్, మాల్దా, బీర్భూమ్ జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఏప్రిల్ మాసంలో తీవ్రమైన వేడి కారణంగా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఈ నలుగురూ గుండెపోటుకు గురయ్యారు. పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతున్నప్పటికీ, జరిగిన మరణాలు ఆనాటి కార్యకలాపాలపై నీడను పడేశాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నడుమ ఓటర్ల భద్రతపై ఆందోళనలు రేకెత్తాయి.మృతులను తూర్పుమేదినీపూర్ జిల్లాలోని పటాష్పూర్కు చెందిన నృపేంద్ర దాస్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేశ్పూర్కు చెందిన ఇస్రతన్ బీబీ, మాల్దా జిల్లాలోని మాలతీపూర్కు చెందిన ప్రమీలా బాగ్డి, బీర్భూమ్ జిల్లాలోని సూరికి చెందిన అసిమ్ రాయ్గా గుర్తించారు.మాలతీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కందరన్ ప్రాంతంలో పోలింగ్ బూత్ వద్ద మహిళా ఓటరు స్పృహ కోల్పోయింది. కాసేపటికే ఆమె కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. తన తల్లి, తన సోదరుడితో కలిసి ఓటు వేయడానికి వెళ్లిందనీ, ఆమె ఓటు వేయబోతుండగా స్పృహ కోల్పోందని మృతురాలి కుమారుడు సన్నీ తెలిపాడు. ఆమె పోలింగ్ బూత్లోనే మరణించిందని కంట తడి పెట్టాడు. ఈ జిల్లాల్లో ఏప్రిల్ మధ్య నుంచి వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓటర్లు, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకుండా ఉండాలని వైద్య నిపుణులు కూడా సూచించారు.#WATCH | Malda, West Bengal | Woman voter falls unconscious and passes away at a polling booth in Kandaran area of Malatipur assembly constituencyThe deceased woman's son, Sunny, says, "My mother, along with my brother, had gone to cast her vote. Just as she was about to cast… pic.twitter.com/v7xhWKh4R1— ANI (@ANI) April 23, 2026 > కాగా ఉత్తర బెంగాల్లోని 152 నియోజకవర్గాల్లో, రాష్ట్రంలోని దక్షిణ భాగంలోని పలు జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 294 నియోజకవర్గాలలో 152 నియోజకవర్గాల్లో సుమారు 3.6 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు వేయనున్నారు. కనీసం 80 స్థానాల్లో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణపై చెలరేగిన రాజకీయ దుమారం , బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న ప్రతిపక్ష బీజేపీ వ్యూహాలు,తిరిగి అధికారం తమదే అని చెబుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉత్కంఠగామారుతోంది. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
ఫేక్ అయితేనేం... ఫేమ్ అయ్యింది!
సమాజం సవ్యంగా ఉండాలంటే కుటుంబాలు బాగుండాలి. ఆ కుటుంబాల కోసం పిల్లల పెంపకం నుంచి ఇంటిపనుల వరకు మహిళలు ఎంతో శ్రమిస్తారు. తల్లుల కష్టమే కుటుంబ రథానికి ఇంధనం అవుతుంది. అయితే వారి శ్రమ ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతుంటుంది. పైగా... ‘పురుషులు బయటకి వెళ్లి కష్టపడతారు. స్త్రీలు ఇల్లు కదలకుండా సుఖంగా ఉంటారు’ అనే ప్రచారం ఒకటి. వారి శ్రమకు వెల కట్టేవారు లేరు. వారి శ్రమ కనిపించని శ్రమ అయింది. తాజా విషయానికి వస్తే.,...‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్లో ఉందని చెబుతుంటారు.‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్ని బద్దలు కొట్టే శిల్పం ఇది. జోస్ లూయిస్ ఫెర్నాండేజ్ రూపొందించారని చెబుతున్న ఈ శిల్పంలో... ఒకవైపు పిల్లలను చేతిలో పట్టుకొని, మరోవైపు... చీపురు, వాషింగ్ మెషిన్, బకెట్లాంటి ఇంటిబరువును వీపున మోస్తున్న స్త్రీ కనిపిస్తుంది. ముగ్గురు పిల్లలను, ఇంటి పనులను వీపుపై మోస్తున్న ఈ స్త్రీ శిల్పం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. అసలు విషయం ఏమింటే, ఇలాంటి శిల్పం నిజంగా లేదు. పూర్తిగా కల్పితం. అయినప్పటికీ ఈ కల్పిత శిల్పం విపరీతంగా వైరల్ అయింది. లక్షలాది వ్యూస్ను సొంతం చేసుకొని ‘వైరల్ స్టాచ్యూ’ గా పేరు తెచ్చుకుంది. ‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్లో ఉందట! ‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్నిబద్దలు కొట్టే శిల్పం ఇది. -
ఇక్కడ నుంచి వెళ్లిపోండి.. మంత్రికే షాకిచ్చిన మహిళ
ముంబై: నగరంలో ఓ మహిళ.. ఏకంగా మంత్రిని నడిరోడ్డుపై నిలదీసిన ఘటన సంచలనం రేపింది. వర్లీ ప్రాంతంలో రాజకీయ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆ మహిళా.. మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్, స్థానిక పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఓ నిరసన ప్రదర్శన చేపట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు.సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని నినాదాలు చేశారు. వర్లీలోని జంబోరి మైదాన్ నుండి డోమ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ర్యాలీ ఆలస్యం కావడంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తన బిడ్డను స్కూలు నుండి తీసుకురావడానికి కారులో వెళ్తున్న ఒక స్థానిక మహిళ.. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. తీవ్ర అసహనానికి గురైన ఆ మహిళ.. తన వాహనం దిగి నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మంత్రి మహాజన్తో వాగ్వాదానికి దిగారు. రాజకీయ ర్యాలీల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యంపై ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి!" అంటూ ప్రదర్శనకారులపై అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.Mumbai woman, who taught Maharashtra minister Girish Mahajan a lesson in civics sense, also lashed out at a cop who tried to shut her down. In reply, a chilling "Shut up" reverberated. https://t.co/fHwlntCQoJ pic.twitter.com/Dr4ZXX8YJl— Piyush Rai (@Benarasiyaa) April 22, 2026సమీపంలో ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ వందలాది మంది వేచి చూస్తున్నారు. అక్కడ ఖాళీ మైదానం ఉంది కదా! అంటూ మంత్రిపై ఆ మహిళ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆమె ముంబై పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. ఆమె ఒక పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు. సీనియర్ అధికారులతో మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ వాగ్వాదం తర్వాత, పోలీసులు ఆమెను రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఆమె సమస్యను వినే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
షటప్.. నోర్ముయ్.. మంత్రిపై మండిపడ్డ మహిళ
-
డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తానని పిలిచి లవర్ పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రేయసి
-
యువతి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
హైదరాబాద్: చెరువులో ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న యువతిని పోలీసులు కాపాడారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. కల్వకుర్తికి చెందిన ఓ యువతి (20) పటాన్చెరువులో ఉద్యోగం చేస్తూ కేపీహెచ్బీ కాలనీలోని షణ్ముఖ హాస్టల్లో ఉంటోంది. వ్యక్తిగత సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలకుంది. దీంతో ఆదివారం కూకట్పల్లి ఐడియల్ చెరువులోకి దిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే చెరువు వద్దకు చేరుకున్నారు. ఎస్ఐ చంద్రశేఖర్, దీక్షిత, వెంకటప్పలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చెరువులోకి దూకి వెళ్లి యువతిని కాపాడి బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఎస్ఐ కాలికి గాయాలయ్యాయి. అనంతరం యువతిని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇప్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదని పోలీసులు తెలిపారు. -
మొగుడుపై అలిగి, రూ. కోటిన్నర నోట్లను బాల్కనీలోంచి విసిరేసింది!
చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రాంతం, శాంతౌ (Shantou) నగరంలో జరిగిన ఈ విస్తుపోయే సంఘటన ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఒక చిన్న గొడవ రోడ్డు మీద ఉన్న సామాన్యులకు కాసుల వర్షం కురిపించి నంత పని చేసింది. అతి పెద్ద విలాసవంతమైన భవనం ఫ్లాట్నుంచి ఉన్నట్టుండి నోట్ల వర్షం కురిసింది. శాంతౌలోని లాంగ్హు జిల్లాలో ఉన్న 'స్టార్ లేక్ సిటీ' అనే నివాస సముదాయంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఎక్కడిదీ నగదు? వీటిని ఎవరు విసిరేశారు? హై రేంజ్ భవనం బాల్కనీ నుంచి అనూహ్యంగా రూ. 1.5 కోట్లను విసిరి పారేసిందో మహిళ. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవే దీనికి కారణమని సమాచారం. అంతే ఆ కోపంతో ఆమె ఇంట్లోని డబ్బును బయటకు విసిరేసింది. సుమారు 1.5 కోట్ల రూపాయల విలువైన (సుమారు 162,000డాలర్లు) హాంకాంగ్ డాలర్ నోట్లను కిందకు విసిరేసింది.గాల్లోంచి నోట్లు ఎగిరి పడటంతో ఒక్కసారి జనం పోగయ్యారు. ఆ నగదును దక్కించుకునేందుకు ఎగబడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నగదును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రాపర్టీ మేనేజ్మెంట్ కార్యాలయం ఆ నోట్లు అసలైనవేనని ధృవీకరించింది. డబ్బు తీసుకున్న వారు తిరిగి ఇచ్చేయాలని కోరింది. కొందరు నివాసితులు ఇప్పటికే ఆ నగదును తిరిగి అప్పగించారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిThis Chinese woman is going viral after she threw over $162,000 out onto the streets from her balcony after an argument with her husband. 🙆♂️ pic.twitter.com/rWiLFu9Rrj— Erimus (@HeDontMakeNoise) April 15, 2026నెటిజన్ల స్పందన ఈవీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు "మనం కష్టపడి సంపాదించిన డబ్బును పన్నుల నుండి కాపాడు కోవడానికి పోరాడుతుంటే, ఈమె ఇలా గాలిలో కలిపేస్తోంది"అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నా మనేది చూసుకోవడం అవసరం. ఇదే అతిపెద్ద ఆర్థిక సలహా" అంటూ మరొకరు చురకలు వేశారు. "గాలిలో ఆనందాన్ని (డబ్బు) విసరడం గురించి ఊహించలేక పోతున్నాను" అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: మీటింగ్లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు -
అత్త గదిలో మంచం కింద నక్కిన చిరుత
-
విజయవాడలో వృద్ధురాలు భూమి లాగేసుకుని.. ఇది చంద్రబాబు నీ పాలన..
-
ప్రేమించినోడే యముడు.. ప్రియుడి HIV ఇంజెక్షన్ తో.. యువతి ఆత్మహత్య
-
పెర్కిట్ ఉదంతంపై కలెక్టర్ సీరియస్
నిజామాబాద్అర్బన్: పెర్కిట్ మహిళా ప్రాంగణంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ ఇందిర శుక్రవారం సాయంత్రం కలెక్టర్ను కలిసి జరిగిన ఘటనను వివరించారు. మార్చి 2 నుంచి 31 వరకు బ్యూటీషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కోర్సు లో శిక్షణ అందించిన స్నేహ బాలికలు, యువతుల ఫొటోలు, ఫోన్ నంబర్లను సతీశ్ అనే వ్యక్తికి పంపించిందని అన్నారు. దీంతో సతీశ్ కొంతమంది యువతులకు కాల్స్ చే యడం, వాట్సాప్ చాటింగ్ ద్వారా వేధింపులకు గురి చేశాడని వివరించారు. బాధిత యువతులు ఈ విషయాన్ని గురువారం తమ దృష్టికి తీసుకురాగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ ఉదంతంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులైన వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. -
బెంజ్ కారు, నడిరోడ్డులో తలస్నానం, తిట్టిపోస్తున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో క్రేజ్కోసం ఎ లాంటి పనిచేయడానికైనా వెనుకాడటం లేదు. ప్రాణాలు పోతున్నా పట్టించు కోవడం లేదు. తాజాగా రష్యన్ మహిళ నిర్వాకం ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.రష్యాకు చెందిన ఒక మహిళ లగ్జరీ కారునే బాత్రూమ్గా మార్చేసింది. మార్పులు చేర్పులు చేసిన మెర్సిడెస్ కారులో ప్రయాణిస్తూ జుట్టును వాష్ చేసుకుంది. నడిరోడ్డుపై పోతూ పొడవాటి తన జుట్టుకు షాంపూ పూసుకోవడం, నీళ్లతో కడుక్కోవడం,టవల్ చుట్టుకోవడం లాంటి తతంగాన్నంతా పూర్తి చేసింది. కార్లో వెడుతూనే జుట్టు కడుక్కున్న వైనం నెట్టింట దుమారాన్ని రేపుతోంది. ⚡️🚨 شابة روسية تقوم بغسل شعرها اثناء مرور سياره مرسيدس محوله السياره إلى حمام منزلي مما أثارت جدل واسع جداً بطريقتها الغريبة . pic.twitter.com/KILM9cZgzp— موسكو | 🇷🇺 MOSCOW NEWS (@M0SC0W0) April 9, 2026 ; ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేలం వెర్రి అని తిట్టిపోస్తున్నారు. అంత పెద్ద జుట్టునుఅలా వాష్ చేసుకుంటోంది...పొరపాటున ఆ జుట్టు టైర్ల కింద పడితే పరిస్థితి ఏంటి అంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే! -
AP: ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిని గొంతు కోసి చంపేశాడు. తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు.. యువతి గొంతు కోశాడు. కడప రిమ్స్కు తరలిస్తుండగా చెన్నూరు వద్ద దారిలోనే యువతి ప్రాణాలు విడిచింది.ఖాజీపేట అగ్రహారంలో కీర్తన(16) అనే విద్యార్థినిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థి ఆవుల వెంకటేష్(19) పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఖాజీపేట మోడల్ స్కూల్లో కీర్తన ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
సారూ.. మహిళతో ఇలాగేనా మాట్లాడేది?
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల వ్యవసాయాధికారి ఎ.వాసు తీరు వివాదాస్పదమైంది. మహిళా వీఏఏను ఫోన్లో అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని నిరసిస్తూ బుధవారం స్థానిక కార్యాలయం ఎదుట వీఏఏలు నిరసన తెలిపారు. వివరాలు.. గుండెమడకల సచివాలయ పరిధిలో పనిచేస్తున్న వీఏఏ మేఘనను వింజమూరు కార్యాలయానికి బుధవారం రావాలని ఏఓ మంగళవారం చెప్పాడు. అయితే బుధవారం గుండెమడకల సచివాలయానికి డిప్యూటీ ఎంపీడీఓ తనిఖీకి రావడంతో ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. దీంతో ఏఓ.. వీఏఏకు ఫోన్ చేసి కార్యాలయానికి రావాల్సిందిగా చెప్పాడు. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆమె రాక ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి గురైన వాసు అసభ్య పదజాలంతో మాట్లాడాడు. ఆమె మనస్తాపానికి గురై కన్నీటిపర్యంతమైంది. విషయం తెలుసుకున్న సహోద్యోగులు ఏఓను నిలదీశారు. అయినా అతను ఎలాంటి పశ్చాత్తాపం చెందకుండా నేను ఇలాగే మాట్లాడతానంటూ అందరి ముందు దురుసుగా సమాధానమిచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వీఏఏ మేఘన భోరున విలపించింది. సచివాలయాల్లో మహిళా ఉద్యోగులకు భద్రత, గౌరవం కరువైందని మిగిలిన వీఏఏలు ఆవేదన వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణిని ఫోన్లో సంప్రదించగా వీఏఏలు ఈ అంశం తన దృష్టికి తీసుకురాలేదన్నారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్య పదజాలం ఉపయోగించిన అధికారులను ఉపేక్షించేది లేదని, కలెక్టర్ కూడా సీరియస్గా ఉన్నారన్నారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఏఓను వివరణ కోరగా పనిఒత్తిడితో తాను అసభ్య పదజాలంతో మాట్లాడిన విషయం వాస్తవమేనని, అదేమి తప్పు పదం కాదని సమ రి్థంచుకున్నాడు. -
ఆంటీ అనకూడదు
లండన్: తనను ఆంటీ అని పిలవడం సుతరామూ ఇష్టంలేదని ఎన్నోసార్లు చెప్పినా పదేపదే అదే పదంతో పిలిచి ఇబ్బంది పెట్టిందంటూ ఘనామూలాలున్న నర్సుపై పెట్టిన పరువునష్టం దావాలో భారతీయమూలా లున్న మహిళ బ్రిటన్ కోర్టులో విజయం సాధించింది. ‘‘61 ఏళ్ల ఇల్డా ఎస్టీవ్స్ మనో భావాలు దెబ్బతిన్నాయి. పరువునష్టం కింద 1,425.15 బ్రిటన్ పౌండ్ల(దాదాపు రూ.1,76,700)ను ఆమెకు వెస్ట్ లండన్ నేషనల్ హెల్త్ సర్వీస్ విభాగం తక్షణం చెల్లించాలి’’ అని యాజమాన్యాలు, ఉద్యోగుల మధ్య కేసులను విచారించే వాట్ఫోర్డ్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి జార్జ్ ఎలియోట్ తీర్పు చెప్పారు. ఈ కేసు వాదోపవాదనలు గత ఏడాది పూర్తికాగా గత నెలలో వివరణాత్మక తీర్పును వెలువర్చిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్వదేశంలో వయోధికులను గౌరవసూచకంగా ఆంటీ అని పిలవడం ఆనవాయితీగా వస్తోందని ఘనా దేశస్తురాలైన ఛార్లెస్ ఒపోంగ్ అనే మహిళా నర్సు చేసిన వాదనలను ముగ్గురు సభ్యుల ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ఇల్డా ఎస్టీవ్స్ వయసు 61 ఏళ్లు. అయినాసరే ఆమెకు ఆంటీ అని పిలవడం ఇష్టంలేదు. ఆ విషయం ఆమె నీకు చాలా సార్లు చెప్పింది. పేరుతోనే పిలవాలని సూచించింది. అయినా నువ్వు పదేపదే పనిగట్టుకుని ఆంటీ అని పిలిచావు. తన డ్యూటీ సమయం అయిపోయాక నీకు బాధ్యతలు అప్పగించేటప్పుడు, కారిడార్లలో అదేపనిగా ఆంటీ ఆంటీ అని పిలిచావు. అది ఇల్డాకు ఏమాత్రం నచ్చలేదు. నీ మాటలు ఆమెను గాయపరిచాయి. పనివాతావరణాన్ని నువ్వు కాస్తంత పాడుచేశావు’’ అని ధర్మాసనం ఛార్లెస్ ఒపోంగ్ను మందలించింది. ఈమె ప్రవర్తనకు ఎన్హెచ్ఎస్దే పరోక్ష బాధ్యత. అందుకే ఈ పరువునష్టం చెల్లింపును ఎన్హెచ్ఎస్ చెల్లించాల్సిందే’’ అని కోర్టు చెప్పింది. అయితే జాత్యహంకారం, ఉద్దేశపూర్వకంగా వేతనంలో కోత వంటి ఆరోపణలను మాత్రం కోర్టు కొట్టేసింది. -
BMWలో అమ్మడికి జాక్పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు!
బీఎండబ్ల్యూ (BMW) వంటి దిగ్గజ సంస్థలో 19 ఏళ్ల యువతి డిగ్రీ లేకుండానే ఉద్యోగం సాధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ రోల్ సాధించాలంటే కనీసం డిగ్రీతో పాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. కానీ, గౌరీ ఎమ్ అనే 19 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ ఎలాంటి ఫార్మల్ డిగ్రీ లేకుండానే, డిజిటల్ స్పేస్లో ఆమెకున్న పర్సనల్ బ్రాండింగ్ పవర్ కారణంగా ఆ సంస్థలో పర్సనల్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.ఎలాంటి డిగ్రీ లేకుండానే ప్రపంచంలోనే ప్రీమియం కార్లు, మోటార్సైకిళ్లను ప్రతిష్టాత్మక కంపెనీ బీఎండబ్ల్యూలో ఉద్యోగం సంపాదించిందంటూ ఒక లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్ అవుతోంది. అకడమిక్ అర్హతలతో సంబంధం లేకుండా, కేవలం బలమైన వ్యక్తిగత బ్రాండ్ను, సోషల్ మీడియా ఉనికి ద్వారా కంటెంట్ క్రియేటర్ గౌరీ ఎం పూర్తికాల పర్సనల్ మార్కెటింగ్ ఉద్యోగాన్ని సాధించడం విశేషం. వివిధ ప్లాట్ఫామ్లలో గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా లింక్డ్ఇన్లో 65,000 మందికి పైగా, ఇన్స్టాగ్రామ్లో 35 వేల మందికి పైగా ఉన్నారని ఆ పోస్ట్ ద్వారా తెలుస్తోంది.పైగా ఆమె ఏ కంపెనీకి దరఖాస్తు చేసుకోలేదు, కనీసం కోల్డ్ ఈమెయిల్స్ కూడా పంపలేదు. ఆమె కంటెంట్ చూసి కంపెనీ ప్రతినిధులే స్వయంగా ఆమెను సంప్రదించడం విశేషం."నేను కేవలం 19 ఏళ్ల అమ్మాయిని, నాకున్న వనరులతో ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రపంచ స్థాయి కార్ల తయారీ సంస్థ నన్ను గుర్తించి ఉద్యోగం ఆఫర్ చేయడం నమ్మలేకపోతున్నాను" అని ఆమె లింక్డ్ఇన్లో పోస్ట్లో వెల్లడించింది.నెటిజన్ల స్పందన ఈ విషయంలో నెటిజన్లు రెండు రకాలుగా స్పందించారు. ప్రస్తుతకాలంలో కేవలం డిగ్రీల కంటే నైపుణ్యం (Skills) , పర్సనల్ బ్రాండింగ్ ముఖ్యమని, సోషల్ మీడియాను కెరీర్ ఎదుగుదలకు ఎలా వాడుకోవాలో గౌరీ నిరూపించిందని కొందరు ప్రశంసించారు. మరోవైపు ఇలాంటివి అరుదుగా జరుగుతాయి, అన్ని రంగాల్లో డిగ్రీ లేకుండా ఉద్యోగాలు రావడం సాధ్యం కాదు అంటూ ఉద్యోగార్థులను హెచ్చరించారు. సంప్రదాయ విద్యా విధానం ప్రాముఖ్యతను తక్కువ చేయకూడదని సూచించడం గమనార్హం.ఇదీ చదవండి: షార్ట్కట్ జర్నీ : కుటుంబంలో 9 మంది సజీవ సమాధి -
నీకు సిగ్గుందా... రాధాకృష్ణపై మహిళా నాయకురాలు విరుచుకుపడ్డారు
-
మహిళను ఇంట్లోంచి ఈడ్చి కొట్టిన జనాలు!
కర్ణాటక: పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ వ్యభిచారం చేస్తోందనే అనుమానంతో స్థానిక జనం ఇంట్లోంచి బయటకు ఈడ్చి దాడి చేసిన సంఘటన బెంగళూరు వర్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. 4వ తేదీన రాత్రి ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్తూరు పీఎస్ పరిధిలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ రాత్రి అపరిచిత యువకునితో ఉందని ఆరోపిస్తూ స్థానికులు కేకలు వేస్తూ ఆమెను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి కొట్టారు. మహిళ గాయపడగా కొందరు ఆస్పత్రికి తరలించారు. వర్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఎన్నికల వేళ.. షాకిస్తున్న కేరళ సర్కారు వైఖరి!
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోనికి అన్ని వయసుల మహిళల ప్రవేశ వ్యవహారంలో కేరళ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ.. మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ, సంప్రదాయాలను కాపాడాలని కోరుతున్న వారికి మద్దతుగా నిలుస్తూ, ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేరళ ప్రభుత్వం గతంలో పూర్తిగా సమర్థించింది. ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంది. 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ, దాఖలైన రివ్యూ పిటిషన్లను తాము సమర్థిస్తున్నామని, వ్యతిరేక వర్గంతో కలిసి తమ వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ నిషే రాజెన్ శోంకర్, పిటిషనర్ల నోడల్ కౌన్సిల్ కృష్ణకుమార్ సింగ్కు ఈ మేరకు అధికారికంగా లేఖ పంపారు.శతాబ్దాల నాటి మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకునే ముందు కోర్టులు.. మత పెద్దలు, సామాజిక సంస్కర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం లిఖితపూర్వకంగా సుప్రీంకు తెలిపింది. అయితే కచ్చితమైన వైఖరి చెప్పకుండా దాటవేసిన సర్కార్, ఇప్పుడు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించే వారితో చేతులు కలపడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ రివ్యూ పిటిషన్లపై మంగళవారం(నేటి) నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయి. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వాదనలకు నాయకత్వం వహిస్తూ, మతపరమైన అంతర్గత ఆచారాలపై తీర్పునిచ్చే అధికారం కోర్టులకు లేదని వాదించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం ఆచారాల్లో సంస్కరణలను బలవంతంగా రుద్దలేరని ఆయన స్పష్టం చేయనున్నారు. అనంతరం ఆలయ ట్రస్టు తరపున సీనియర్ న్యాయవాది వి.గిరి, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీలు మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించనున్నారు. ఏప్రిల్ 9న కేరళ ప్రజలు పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటు వేయడానికి ముందుగా, సుప్రీంకోర్టులో ఈ కీలక వాదనలు జరగనుండటం గమనార్హం. అయితే సింఘ్వీ వాదనలకు ముందే కోర్టు ముందు తమ తాజా వైఖరిని వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాచారం. ఏదేమైనప్పటికీ ఎన్నికల ముందు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.ఇది కూడా చదవండి: బెంగాల్ రణరంగం: ‘దీదీ’ ముంగిట అతిపెద్ద గండం -
రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్చేస్తే..
మంచి హోదాలో హుందాగా సాగిపోతున్న లగ్జరీ లైప్ని వదులుకుని నిలకడగా డబ్బులు రాని రంగంలోకి వెళ్లడానికి చాలా ధైర్యం కావాలి. పోనీ వెళ్లినా..నిలదొక్కుకోలేకపోతే అంతే సంగతులు. ఈ యువతి అలాంటి నిర్ణయం తీసుకుని ఎంతో సతమతమై చివరకు సక్సెస్ అయిన విధానాన్ని నెట్టింట షేర్ చేసుకుంది. అంతేగాదు తనలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఎలా ధైర్యంగా ముందడుగు వేయాలో సూచనలివ్వడమే గాక, ఆ ఛాలెంజ్కి ఎలా కట్టుబడి ఉండాలో ఆలోచింపచేసేలా చెబుతుండటం విశేషం.ఆ అమ్మాయే సాన్యాబాత్ర. కంటెంట్ క్రియేషన్ రంగంలోకి ప్రవేశించడానికి మంచి జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులకున్న తన ప్రయాణం గురించి సోషల్ మీడియా వేదికగా వివరించింది. ఆ నిర్ణయం వల్ల కలిగిన భయం, అనిశ్చితి, రిస్క్లు గురించి హైలెట్ చేసింది. ఏడాదికి రూ. 50 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్ని వదిలేసినప్పటి క్షణాన్ని గుర్తు చేస్తుకుంటూ..ఆ నిర్ణయం ఏ మాత్రం సులభం కాదని త్వరలో అర్థమైందన్నారు. ముఖ్యంగా చుట్టూ ఉన్నవారి సందేహాలు, అనుమానాలు తనను వెంటాడాయని అన్నారు. అలాగే తన తీసుకున్న రంగంలో సక్సెస్ అందుకోగలనా అనే భయం అంకంతకు పెరిపోయిందని చెప్పుకొచ్చింది. ఎక్కువ జీతం వచ్చే స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకున్న వెర్రిదాన్ని తానేనేమో అనే భయంతో నిద్ర కూడా పట్టేది కాదని అంటోంది. నిజానికి కంటెంట్ క్రియేషన్ అన్నది సరైన కెరీర్ కాదు. పైగా ఉద్యోగాన్ని వదిలేయడం అంటే ఆర్థిక భద్రతను కాదనుకోవడమే అని ఆ సమయంలోనే తెలుసొచ్చిందని అంటోంది. అయితే ఇన్ని సవాళ్లు, భయాలు వెన్నాడినా..స్థిరత్వంతో నీపై నువ్వు నమ్మకంతో సాగిపో అని అంతరాత్మ చెప్పే ప్రబోధం వైపుకే ధైర్యంగా సాగి విజయవంతమయ్యానని ఆనందంగా చెబుతోంది. అంతేగాదు కంటెంట్ను క్రియేట్ చేయడం, నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడం చేస్తూ..నెమ్మదిగా మెరుగుపడ్డానని అంటోంది. కానీ నిలకడగా చేశానని అదే సక్సెస్ అయ్యేలా చేసిందని చెబుతోంది. అంతేగాదు సందిగ్థాలు ఎదురై టైంలో మనల్ని మనం నమ్మడం గురించి తెలుస్తుంది, దాని వాల్యూ తెలుస్తుందని అంటోంది. పెద్ద నిర్ణయం తీసుకుని దాని అంచున నిలబడి ఉంటే..బహుశా మిమ్మల్ని మీరు ఇంకొంచెం ఎక్కువగా నమ్మడానికి ఇది సంకేతం కావొచ్చు అని గుర్తించుకోండి అని చెబుతోంది. చివరగా ఏ నిర్ణయం తీసుకున్నా..ఎన్ని సవాళ్లు, భయాలు వెంటాడినా..నిలకడగా చేయడం అత్యంత ముఖ్యమైనది, అదే మిమ్మల్ని విజయతీరాల వైపుకి నడిపిస్తుందని చెబుతోంది. నెటిజన్లను ఈ పోస్ట్ అమితంగా ఆకర్షించడమే కాదు..మీలా ఎవ్వరూ ధైర్యం చేయలేరు మేడమ్..పలానా అవ్వాలని అనుకోవచ్చేమో గానీ..అంతలా డేర్ చేయలేరంటూ సాన్యపై పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Sanya Batra | Travel & Lifestyle (@insanyaty) (చదవండి: మహారాణిలా కియారా అద్వానీ.. చీర, నెక్లెస్ ధర తెలిస్తే విస్తుపోతారు!) -
అదృష్టం అంటే ఆమెదే.. చెత్తలో ‘టికెట్’కు రూ. కోటి!
అలప్పుజ: అదృష్టం తలుపు తట్టడమే కాదు.. ఒక్కోసారి చెత్తబుట్టలో నుంచి కూడా పలకరిస్తుందని కేరళకు చెందిన ఓ మహిళ విషయంలో నిరూపితమయ్యింది. తెలియక పారేసిన లాటరీ టికెట్ ఆమెను రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిని చేసింది. తృటిలో చేజారిన మహాభాగ్యం తిరిగి దక్కిన ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.కేరళలోని అలప్పుజ జిల్లా తలవాడి పంచాయతీ పరిధిలోని ఎడతువా ప్రాంతానికి చెందిన కుంజమ్మ అనే మహిళ, అంబలప్పుజా-తిరువల్లా రాష్ట్ర రహదారి పక్కన ఒక చిన్న దుకాణాన్ని నడుపుకుంటూ తన జీవనం సాగిస్తున్నారు. రోజూవారీ వ్యాపారంతో పాటే ఆమె స్థానికంగా ఉండే జార్జ్కుట్టి అనే లాటరీ విక్రేత వద్ద రెండు ‘కారుణ్య’ లాటరీ టికెట్లను కొనుగోలు చేశారు. గురువారం నాడు లాటరీ ఫలితాలు వెలువడగా, కుంజమ్మ ఎంతో ఆసక్తిగా తన వద్ద ఉన్న లాటరీ నంబర్లను ఫలితాలతో సరిచూసుకున్నారు. అయితే తాను కొన్న రెండు టికెట్లలో ఒక దానికి మాత్రమే రూ. 5,000 కన్సోలేషన్ బహుమతి వచ్చినట్లు ఆమె గమనించారు. తనకు దక్కిన అదృష్టం అంతేనని సరిపెట్టుకున్న కుంజమ్మ, రెండో టికెట్కు ఎలాంటి బహుమతీ రాలేదని భావించి, దానిని తన దుకాణంలో ఉన్న చెత్తబుట్టలో పారేశారు.అయితే అసలు కథ అప్పుడే మొదలైంది. లాటరీ ఫలితాలను నిశితంగా గమనించిన కుంజమ్మ సోదరుడు ఆమెకు ఒక కళ్లు చెదిరే వార్తను చెప్పారు. పనికిరాదని ఆమె చెత్తలో పారేసిన ఆ రెండో టికెట్కే ఏకంగా రూ. ఒక కోటి మొదటి బహుమతి వరించిందన్నాడు. ఆ మాట విన్న వెంటనే కుంజమ్మకు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చేతిదాకా వచ్చిన అదృష్టాన్ని తానే స్వయంగా చెత్తపాలు చేశానని గ్రహించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, రాత్రికి రాత్రే తన సోదరుడిని వెంటబెట్టుకుని ఆమె తిరిగి తన దుకాణానికి పరుగులు తీశారు. ఇద్దరూ కలిసి ఆ చెత్తబుట్టలో వెతకడం ప్రారంభించారు. కాసేపటి తర్వాత వారి నిరీక్షణ ఫలించింది. చెత్తలో పారేసిన ఆ కోటి రూపాయల లాటరీ టికెట్ ఎట్టకేలకు దొరికింది. అది చూసి ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన స్థానికుంగా సంచలనంగా మారింది.ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచం.. మూడు సరికొత్త సంచలనాలు -
ముఖంపై వెంట్రుకలు పెరుగుతున్నాయా?
నాకు పద్దెనిమిది సంవత్సరాలు. ఇటీవల పైపెదవి, గడ్డం కింద ఒత్తుగా, దట్టంగా వెంట్రుకలు వస్తున్నాయి. బరువు కూడా పెరుగుతోంది. ఇది ఏ సమస్యకు సంకేతం? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?– మమత, జమ్మలమడుగు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఇది హిర్సూటిజం (అనవసరంగా వెంట్రుకలు పెరగడం) అనే సమస్య కావచ్చు. సాధారణంగా మహిళల్లో పై పెదవి, గడ్డం, ఛాతీ, వెన్ను వంటి ప్రాంతాల్లో మందంగా, నల్లగా వెంట్రుకలు పెరగడం ఈ సమస్య లక్షణం. ఇది ఎక్కువగా శరీరంలో పురుష హార్మోన్లు (ఆండ్రోజెన్స్) అధికంగా ఉండటం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అడ్రినల్ గ్రంథుల సమస్యలు, అరుదుగా ట్యూమర్లు కూడా కారణం కావచ్చు. ఈ సమస్యను నిర్ధారించడానికి గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. డాక్టర్ ముందుగా పూర్తి శరీర పరీక్ష చేస్తారు. అవసరమైతే కొన్ని రక్తపరీక్షలు, హార్మోన్ టెస్టులు, అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఓవరీల పరిస్థితిని పరిశీలిస్తారు. చికిత్స సమస్య తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్లను సరిచేసే మందులు, బరువు తగ్గించే చర్యలు. అవసరమైతే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, లేజర్ హెయిర్ రిమూవల్ వంటి జీవనశైలిలో మార్పులు చాలా ముఖ్యం. చక్కెర, స్వీట్స్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తగ్గించడం, నియమిత వ్యాయామం చేయడం ద్వారా బరువు నియంత్రణలో ఉంచాలి. ఇది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మానసికంగా కూడా ప్రభావం చూపొచ్చు. కొంతమందిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిది. సరైన వైద్య చికిత్సతో పాటు అవసరమైతే లేజర్ వంటి పద్ధతుల ద్వారా వెంట్రుకలను తగ్గించుకోవచ్చు. దీంతో జీవన నాణ్యత మెరుగుపడుతుంది. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ ∙ -
ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : రూ. 4 కోట్లు వచ్చాయ్!
చైనాలో అనారోగ్యంతో ఉన్న ఒక మహిళ, అనూహ్య పరిస్థితిలో రైలులో రక్త వాంతి చేసుకుంది. అయితేతన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదని ఆమె చేసిన పని లక్షలాది మంది మనసులను గెలుచుకుంది. అంతేకాదు ఆమె పరిస్థితి వారిని కదిలించి, కోట్ల రూపాయలను భారీ విరాళాలను ఆమెకు అందించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అసలేం జరిగింది? స్థానిక మీడియా కథనం ప్రకారం చైనాకు చెందిన హు జిన్యావో (Hu Xinyao) అనే 23 ఏళ్ల యువతికి చిన్న వయసులోనే ANCA-అసోసియేటెడ్ వాస్కులైటిస్' (ANCA-associated vasculitis) అనే అరుదైన రక్తనాళాల వ్యాధితో బాధపడుతోంది. ఇంజెక్షన్ తీసుకోవడానికి హు జిన్యావో ఆసుపత్రికి వెళ్తుండగా జీర్ణవ్యవస్థలో అంతర్గత రక్తస్రావం జరగడం వల్ల అనుకోకుండా రక్తం కక్కుకుంది. దీంతో వెంటనే తోటి ప్రయాణీకులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తన కోట్తోనే నెమ్మదిగా ఆ రక్తాన్ని శుభ్రపర్చింది. ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ ఆమె బాధ్యతాయుతమైన ప్రవర్తనకు నెటిజన్లు ఫిదా అయ్యారు.జియుపాయ్ న్యూస్ ప్రకారం, మార్చి 23న, చాంగ్కింగ్లోని మెట్రో రైలులో ఒక ప్రయాణికుడు ఆ మహిళను చిత్రీకరించగా, ఆ వీడియో చైనాలోని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె వైద్యం కోసం భారీగా విరాళాలు అందాయి. సుమారు 4,00,000 యువాన్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 4.7 కోట్లు విరాళాలు సమకూరాయి.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!నెటిజనుల రియాక్షన్స్"ఆమె మనసు చాలా మంచిది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, "నేను ధన వంతుడ్ని కాకపోయినా, ఆమె చికిత్స కోసం నా వంతు సాయం చేస్తాను" అని మరొకరు తన వంతు సాయం చేశారు. ఇలా వారంలోపే ఆమెకు భారీగా విరాళాలు అందాయి. ఎంతలా అంటే, ఆమె సోషల్ మీడియా ఖాతాకు విరాళాలు వెల్లువెత్తడంతో ప్లాట్ఫారమ్ తాత్కాలికంగా ఆ ఖాతాను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో స్పందించిన ప్రతీ ఒక్కరికీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. "నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరి పేరు, వారు పంపిన మొత్తాన్ని నేను నోట్ చేసుకున్నాను. ప్రజలు నాపై చూపిన ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. భవిష్యత్తులో వారు కష్టాల్లో ఉన్నప్పుడు నేను కూడా సాయం చేయాలని ఆశిస్తున్నాను," అని హు భావోద్వేగంతో చెప్పింది. ఎవరీ హు హు ఒక సాధారణ గ్రామీణ కుటుంబం నుండి వచ్చింది. 2018లో స్కూల్లో ఉన్నప్పుడే ఆమెకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఫలితంగా వైద్య ఖర్చులు భరించలేక చదువు మధ్యలోనే ఆపేసింది. ఆపై రోడ్డు పక్కన ఆరెంజ్ జ్యూస్ అమ్ముతూ జీవనం సాగించింది. Hu కుటుంబం ఆమె అనారోగ్య చికిత్స కోసం లక్షల కొద్దీ ఖర్చుపెడుతోంది. గత ఏడాది కాలంలోనే ఆమెకు ఆసుపత్రి నుండి 20 సార్లు 'క్రిటికల్ ఇల్నెస్' (ప్రాణాపాయ స్థితి) నోటీసులు వచ్చాయి. అయినా జీవితాన్ని నెట్టుకొస్తూ ప్రస్తుతం ఆన్లైన్ నవలలు రాస్తూ నెలకు 5,000 నుండి 6,000 యువాన్లు సంపాదిస్తుండటం గమనార్హం.ప్రియుడితో బ్రేకప్ ఇలాగత సెప్టెంబర్లో ఆమె మాజీ ప్రియుడు 'సియావో' ప్యాంక్రియాటైటిస్తో మరణిస్తూ, తన దగ్గర ఉన్న 50,000 యువాన్ల పొదుపు మొత్తాన్ని హు చికిత్స కోసం ఇచ్చి వెళ్ళాడు. తమ బంధం కేవలం రెండు నెలలే అయినప్పటికీ, తన అనారోగ్యం వల్ల అతడి జీవితం పాడవకూడదని హు అంతకుముందే అతడికి బ్రేకప్ చెప్పింది. వారి మధ్య ఉన్న ఆ నిస్వార్థమైన బంధం కూడా ప్రజలను ఎంతగానో కదిలించింది.గొప్పమనసుపెద్ద నగరాల్లో వైద్య చికిత్స పొందుతున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నవారు ,వారి బంధువులు బస చేయడానికి వీలుగా ఒక "రోగుల గృహం" నిర్మించడానికి తాను తీవ్రంగా కృషి చేస్తున్నానని హు మీడియాకు తెలిపింది. ఇటీవల ఆమె పరిస్థితి కిడ్నీ వైఫల్యానికి దారితీసింది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవచ్చో లేదో తెలుసుకోవడానికి ఆమె ఏప్రిల్ ప్రారంభంలో తూర్పు జియాంగ్సు ప్రావిన్స్లోని నాన్జింగ్లో ఉన్న ఒక ప్రధాన ఆసుపత్రిని సందర్శించాలని యోచిస్తోంది. -
పిఠాపురంలో రెచ్చిపోయిన జనసేన నేతలు
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు రెచ్చిపోయారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దళిత మహిళపై దాష్టీకం ప్రదర్శించారు. సెటిల్మెంట్ వివాదంలో మహిళపై జనసేన నేతలు దాడి చేశారు. రాజమండ్రికి చెందిన ఆ మహిళను జనసేన నేత బారతాల గోవింద్ నేల మీదకు నెట్టేశారు.తన భర్త ఆర్థి లావాదేవిల సెటిల్మెంట్ కోసం సోదరుడితో కలిసి తాటిపర్తిలో సుబ్రమణ్యం అనే వ్యక్తి ఇంటికి ఆ మహిళ వచ్చింది. తన తరపున సెటిల్మెంట్ కోసం జనసేన నేతలు కుంపట్ల సత్యనారాయణ, గోవింద్, వీరబాబులను సుబ్రహ్మణ్యం పిలిపించుకున్నారు. తన సోదరుడు సతీష్పై సుబ్రహ్మణ్యం దాడికి పాల్పడటంతో సెల్లో ఆమె వీడియో తీసే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన జనసేన నాయకులు.. సెల్ ఫోన్ లాక్కుని దాడి చేశారు. గొల్లప్రోలు పోలీస్స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. -
Hyderabad: ఇంట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడి యత్నం..!
హైదరాబాద్: ఇంట్లోకి చొరబడిన భార్యభర్తలు ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. అంతే కాకుండా సదరు వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు .. గంగపుత్ర కాలనీకి చెందిన ఓ మహిళ(29) భర్తతో కలిసి నివాసముంటోంది. భర్త రాంనగర్కు చెందిన రాజు అనే వ్యక్తితో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు. ఇటీవల బాధిత మహిళ తల్లి రాజుకు ఫోన్ చేసి మందలించింది. దీంతో రాజు, అతని భార్య సింధు కలిసి గురువారం మధ్యాహ్నం బాధితురాలి ఇంటికి వెళ్లి దాడిచేశారు. అంతేకాక రాజు లైంగికదాడికి యత్నించాడు. ఇందుకు అతని భార్య కూడా ప్రోత్సహించింది. దీంతో బాధితురాలు బయటకు పరుగులు తీయడంతో దంపతులిద్దరూ పరారయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి బాధితురాలు వారాసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా భార్యాభర్తలిద్దరూ బాధితురాలిపై కూడా ఫిర్యాదు చేశారని, కులం పేరుతో దూషించిందని అట్రాసిటీ కేసు పెట్టారని ఎస్ఐ రామచంద్రారెడ్డి తెలిపారు. -
మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం
-
వైఎస్ జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్న వృద్ధ మహిళా రైతు
సాక్షి, తాడేపల్లి: రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శేషగిరమ్మ గురువారం వైఎస్ జగన్ను కలిశారు.రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, నష్టపరిహారం ఇవ్వకుండా తనను మోసం చేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా శేషగిరమ్మకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ఆమెకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో శేషగిరమ్మ కుటుంబ సభ్యులు బ్రహ్మేంద్ర కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
డియర్ లీడర్స్.. ‘ఆమె’ కరుణిస్తేనే కుర్చీ!
ఒకప్పుడు ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు రావడానికే సంకోచించిన మహిళలు, ఇప్పుడు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలకమైన ‘నిర్ణయాత్మక శక్తి’గా అవతరించారు. ఇప్పుడు ఏ పార్టీ గెలవాలన్నా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్నా మహిళల మద్దతు తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది.సైలెంట్ ఓటర్లు కాదు.. డిసైడింగ్ ఫ్యాక్టర్గత మూడు దశాబ్దాలుగా మహిళల రాజకీయ చైతన్యం ఊహించని రీతిలో పెరిగింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు మహిళలు పురుషులతో సమానంగా, కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కేవలం ఓటు వేయడమే కాదు, తమ ఓటుతో గెలుపోటములను తలకిందులు చేస్తున్నారు. అందుకే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు, నేరుగా నగదు బదిలీ వంటి పథకాలన్నీ ఈ ‘మహిళా ఓటు బ్యాంకు’ను ఆకట్టుకోవడానికేనని స్పష్టమవుతోంది.రాష్ట్రాల వారీగా మహిళల సత్తా ఇదే..అస్సాం: ఇక్కడ పెను మార్పు కనిపిస్తోంది. 2011లో కాంగ్రెస్ వైపు ఉన్న మహిళలు, 2021 నాటికి బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. సంక్షేమ పథకాలు, స్థానిక అంశాలు మహిళల ఓటింగ్ సరళిని పూర్తిగా మార్చేశాయి.పశ్చిమ బెంగాల్: ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పట్టు బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న అనుబంధం, మహిళా కేంద్రీకృత పథకాల వల్ల మహిళా ఓటర్లలో దాదాపు సగం మంది ఇప్పటికీ ‘దీదీ’ వెంటే నడుస్తున్నారు.కేరళ: మలయాళ గడ్డపై రాజకీయ విధేయతలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ మహిళా ఓట్లు ప్రధాన కూటముల మధ్య దాదాపు సమానంగా చీలిపోయినా, ఓటర్లు తమ అభిప్రాయాలను అంత సులభంగా మార్చుకోవడం లేదు.తమిళనాడు: ఇక్కడ మహిళల తీరు విభిన్నం. వీరు ఏ ఒక్క పార్టీకి కట్టుబడి ఉండరు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరును బట్టి తమ మద్దతును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అధికార మార్పిడికి కారకులవుతున్నారు. మొత్తానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల ఫలితాలను శాసించేది మహిళలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెజారిటీ ఓట్లతో గెలుపు మార్జిన్ను నిర్ణయించేది కూడా వారే కావడం విశేషం. -
ర్యాపిడో బుక్ చేస్తే ఇదేనా..? యువతికి చేదు అనుభవం
బెంగళూరు: యువతి పట్ల ర్యాపిడో బైక్ డ్రైవర్ అసభ్యకరంగా వ్యవహరించగా అ తన్ని బెంగళూరు ఇందిరానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక యువతి బీటీఎం లేఔట్ నుంచి ఇందిరానగర్ వెళ్లడానికి ర్యాపిడో బుక్ చేసుకుంది. బైక్ డ్రైవర్ మహమ్మద్ ఖాజా ప్రయాణం సమయమంతా యువతిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించాడు. దీంతో యువతి ఇందిరానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. ‘కుక్కకాటుకు కోమాలోకి..బెంగళూరు: వీధి కుక్కల దాడిలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి జారుకున్న సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా హొల్లోళిహట్టి గ్రామంలో చోటుచేసుకుంది. బసవరాజు (18) అనే వ్యక్తిపై ఇటీవల వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని బిమ్స్ ఆస్పత్రికి తరలించగా కోమాలోకి వెళ్లిపోయాడు. -
రూ. 10 కోట్లు చూసి ఆమె షాక్ : నెటిజన్లు మాత్రం ఫిదా
‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు ’ఈ ఫ్యామస్ డైలాగ్ గుర్తుందా? కానీ ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో జరిగిన ఘటన గురించి తెలుస్తే అవాక్కవ్వాల్సిందే. ఒక సామాన్య రైతు భార్య బ్యాంకు ఖాతాలోకి ఉన్నట్టుండి కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. అయితే డబ్బెవరికి చేదు అని ఆమె అనుకోలా. ఆమె చేసిన పని ఇపుడు నెట్టింట విశేషంగా నిలుస్తోంది. స్టోరీ ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని మైనపురి జిల్లాకు చెందిన ఒక రైతు భార్య రీటా. రాష్ట్రంలోని దేవగంజ్ గ్రామంలో తన భర్త పరాస్భన్ బహేలియాతో కలిసి నివసిస్తోంది. ఇటీవల జరిగిన నవరాత్రి ఉత్సవాల సమయంలో, ఆమె కొంత నగదు విత్డ్రా చేయడానికి స్థానిక బ్యాంకుకు వెళ్లింది. అయితే, 'మహా అష్టమి' పర్వదినం కారణంగా బ్యాంకు మూసివేసి ఉండటంతో ఆమె నగదు తీసుకోలేకపోయింది. ఆ తర్వాత, నగదు విత్డ్రా చేయడానికి ఆమె సమీపంలోని ఏటీఎం (ATM) కేంద్రానికి వెళ్లింది. తన బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.10 కోట్లు(రూ. 9,99,49,588) జమ అయినట్లు గుర్తించి, రీటా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆ విషయాన్ని నమ్మలేక, ఖాతాలో ఉన్న మొత్తాన్ని సరిచూసుకోవడానికి, నిర్ధారించుకోవడానికి ఆమె మరో ఏటీఎంకు వెళ్లింది. అక్కడ కూడా అదే మొత్తం కనిపించింది. ఆమె ఈ విషయాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయగా, అది కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ప్రశంసలందుకుంటున్న ఆమె నిర్ణయంపొరపాటున తన 'బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఖాతాలో జమ చేసిన రూ. 10 కోట్లను చూసి అత్యాశకు పోలేదు. రీటా ఆ డబ్బును విత్డ్రా చేయడానికి నిరాకరించింది. అంతేకాకుండా, ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆ డబ్బును ముట్టుకోవద్దని తన కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పొరుగువారితో పాటు ఇతరులు కూడా ఆమె నిజాయితీని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది. రీటా నిజాయితీని చాలామంది సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.బ్యాంక్ అధికారుల ప్రశంసలు ఆమె నిజాయితీపై బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రిషికాంత్ పాండే స్పందించారు. టెక్నికల్ ఎర్రర్, లేదా పొరబాటున ఇలా జరిగి ఉంటుందని, విచారణ జరిపి ఆ డబ్బును వెనక్కి తీసుకుంటామని హామీ పాండే తెలిపారు.సోషల్ మీడియా ఫిదా'ఈ డబ్బు నాది కాదు, దీన్ని వెనక్కి తీసుకోండి' అని ఆమె బ్యాంకు అధికారులతో స్పష్టం చేసింది. దీంతో తన బ్యాంక్ అకౌంట్లో పొరపాటున పది కోట్ల రూపాయలు పడినా, ఆశపడకుండా నిజాయితీని చాటుకుని అందరి ప్రశంసలందుకుంటోంది. సాధారణ ప్రజలలో అత్యధికులు నిజాయితీపరులేనని, అందుకే మానవజాతి మనుగడ సాగిస్తోంది అంటూ ఎక్స్ యూజర్ శేఖర్ వెంబు వ్యాఖ్యానించారు. -
యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు
ఘజియాబాద్కు హరీష్ రాణా దేశంలోనే తొలి కారుణ్య మరణం పొందిన వ్యక్తిగా నిలిచారు. 13 ఏళ్ల పాటు మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా బతికిన ఆయనకు సుప్రీంకోర్టు అనుమతితో ఎయిమ్స్ వైద్యులు చికిత్స నిలిపివేయగా, ఇటీవల తుదిశ్వాస విడిచారు. దాదాపు ఇలాగే చట్ట అనుమతితో కారుణ్య మరణం పొందిన స్పానిష్ యువతి గురించి తెలుసా? వేదన భరించలేక కారుణ్య మరణం ఎంచుకున్న అత్యాచార బాధితురాలి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.స్పానిష్ యువతి నోలియా కాస్టిల్లో (Noelia Castillo) ఉదంతం చాలా హృదయవిదారకమైన గాథ. మృత్యువు అంచుల వద్ద కూడా ఎలాగైనా బతకాలనే కోరుకుంటారు ఎవరైనా. కానీ కోరి కోరి మృత్యువును ఎంచుకోవడం అంటే ఆ నరకయాతన, మానసిక క్షోభను, కుటుంబం భావోద్వేగ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నోలియా కాస్టిల్లో కారుణ్య మరణంస్పానిష్ ప్రభుత్వ ప్రసార సంస్థ TVE , ఇతర స్థానిక మీడియా నివేదికల ప్రకారం, బార్సిలోనాకు చెందిన 25 ఏళ్ల నోలియా కాస్టిల్లో, కాటలోనియాలోని శాంట్ పెరె డి రిబ్స్లోని ఒక ఆసుపత్రిలో గురువారం సాయంత్రం ఈ ప్రక్రియ పూర్తి అయింది. దీన్ని ఎలాగైనా ఆపాలని ఆమె తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి స్పెయిన్, యూరప్లోని న్యాయస్థానాల అనుమతితో మూడు రకాల మందుల మిశ్రమంతో చేసే ఇంజెక్షన్ ద్వారా 15 నిమిషాల చికిత్సా ప్రక్రియలో ఆమె ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది. నోలియా మరణం స్పెయిన్లో కారుణ్య మరణంపై మళ్ళీ చర్చను లేవనెత్తింది. మతసంస్థలు, సంప్రదాయ వాదులు ఇది వైద్య వ్యవస్థ వైఫల్యమని విమర్శించారు. అయితే స్వచ్ఛంద మరణం కోసం పోరాడే సంఘాలు, గౌరవప్రదమైన మరణాన్ని ఎంచుకునే హక్కు అంటూ ఈ ప్రక్రియను సమర్థించాయి.భరించలేని హింస , బాధ2022లో ఒక ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ముగ్గురు వ్యక్తులు నోలియాపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె తీవ్రమైన డిప్రెషన్లోకి జారిపోయింది. ఆపై తాను ఉంటున్న భవనంలోని ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తృటిలో ప్రాణాలతో బయటపడింది కానీ పక్షవాతానికి గురైంది. ఇక అప్పటినుంచి మంచానికే పరిమితమై నరకయాతన అనుభవించిన నోలియా, సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత తానుకున్నట్టుగానే మనశ్శాంతిగా కన్నుమూసింది. ఆ గాయం నుండి కోలుకోలేక ఆమె ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యా యత్నం చేశారు. ప్రాణాలతో బయటపడినప్పటికీ, నడుము కింది భాగం పక్షవాతానికి గురైంది. అప్పటి నుండి, ఆమె వీల్చైర్కే పరిమితమై, శారీరక , మానసిక వేదనతో కుమిలిపోయింది.శారీరక వేదనతోపాటు,అత్యాచారం తాలూకూ చేదు జ్ఞాపకాలు ఆమెను నిరంతరం వెంటాడేవి. "నేను ఏమీ చేయలేకపోతున్నాను, కనీసం నిద్రపోవడం కూడా కష్టంగా ఉంది. తన బాధ కేవలం శారీరకమైనది మాత్రమే కాదని, తీవ్రమైన భావోద్వేగపరమైంది అందుకే ఈ నరకం నుంచి విముక్తి కావాలి. ఇక ఈ బాధ భరించలేను, నేను అనుభవించిన ప్రతీ బాధను మననం చేసుకుంటూ జీవించడం నావల్లకాదు ఇక వెళ్లిపోవాలను కుంటున్నాను, నాకు విముక్తి కావాలి శాంతి కావాలి” అని ఆమె మరణానికి ముందు రోజు ప్రసారమైన మరో ఇంటర్వ్యూలో చెప్పింది.తండ్రి అభ్యంతరంఏప్రిల్ 2024లో నోలియా దీని కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె పరిస్థితిని గమనించిన ఆరోగ్య బోర్డు అందుకు అనుమతించింది. కానీ నోలియా తండ్రి దీనిని ఎప్పటికప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఇది సరైన నిర్ణయం కాదని, చనిపోవడం సమస్యకు పరిష్కారం కాదంటూ కోర్టులను ఆశ్రయించారు. ఈ పోరాటంలో సుప్రీంకోర్టు నుండి ఐరోపా మానవ హక్కుల కోర్టు వరకు వెళ్లినా, ఆయన విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది.తల్లి యోలాండా రామోస్ నిస్సహాయత: "నేను ఆమె నిర్ణయంతో ఏకీభవించడం లేదు, కానీ నా బిడ్డ పడుతున్న బాధను చూడలేను. చివరి వరకు ఆమె పక్కనే ఉంటాను" అని భావోద్వేగంగా చెప్పారు.చివరి కోరిక"నేను అందంగా కనిపిస్తూ మరణించాలని అనుకుంటున్నాను. నాకిష్టమైన డ్రెస్ వేసుకుని, మేకప్ వేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోతాను" అని ఆమె తన చివరి కోరికను వెల్లడించారు. ఆమె కోరుకున్నట్టుగా, చట్ట నియమాల మేరకు ఆమె తనువు చాలించారు.స్పెయిన్ 2021లో కారుణ్య మరణాన్ని (Euthanasia) చట్టబద్ధం చేసింది. దీని ప్రకారం నయం చేయలేని వ్యాధులు లేదా దీర్ఘకాలిక అశక్తత ఉన్నవారు మరణాన్ని కోరుకోవచ్చు. -
షాకింగ్ వీడియో : బుల్లెట్ బండిని ధ్వంసం చేసిన మహిళ
జైపూర్ : జైపూర్లో జరిగి ఒక విభ్రాంతికర ఘటన నెట్టింట వైరల్గా మారింది. జైపూర్లోని ఒక కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒక మహిళ బహిరంగంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను ధ్వంసం చేసే వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన మార్చి 22న జరిగింది.సౌరభ్ శర్మ అనే వ్యక్తి తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్పై ఆఫీసుకి వెళ్తుండగా, ముందున్న స్కూటర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న క్యాబ్ కూడా ఆగింది. అయితే నియంత్రణ కోల్పోయిన సౌరభ్ తన ముందున్న క్యాబ్ను బుల్లెట్తో స్వల్పంగా ఢీకొట్టాడు.అయితే మర్యాదగా సౌరభ్ వెళ్లి వెంటనే క్యాబ్ డ్రైవర్కు క్షమాపణలు చెప్పాడు. కానీ క్యాబ్లో ఉన్న మహిళ మాత్రం హైడ్రామా క్రియేట్ చేసింది. ఆగ్రహం ఊగిపోతూ ఆమె బుల్లెట్ రైడర్తో గొడవకు దిగడమే కాకుండా, ఊహించని విధంగా సౌరభ్ హెల్మెట్ తీసుకుని అతని బైక్ అద్దాలను పగలగొట్టింది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని బైక్ బాడీని, వెనుక లైట్లను పదే పదే బాదుతూ విధ్వంసం సృష్టించింది. ఈ తంతంగా అంతా సీసీటీవీలో రికార్డైయింది.Jaipur Woman Badly Damages Man's Bullet After It Grazes Her Scooterhttps://t.co/VNGAn5Q54t pic.twitter.com/Gt52R463vS— NDTV (@ndtv) March 26, 2026 ఇప్పటికే రూ. 1,700 నష్టం జరిగింది, చాలు ఇక వదిలేయండి. బైక్ పాడైపోతోంది అంటూ సౌరభ్ వేడుకున్నా ఆమె వదల్లేదు సరిగదా, ఎందుకు వదలాలి?" అంటూ మరింత కసిగా బైక్ను రాయితో కొట్టింది. బైక్ పాడైపోతోంది, వదిలేయండి, కేసుపెడతాను బెదిరించాడు అతగాడు. దీంతో నువ్వు నన్నేమీ చేయలేవు అంటూ విరుచుకుపడింది.పోలీసుల తీరుపై విమర్శలుసౌరభ్ ఆరోపణల ప్రకారం, ఈ గొడవ జరుగుతున్నప్పుడు కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నప్పటికీ, అతను పట్టించుకోలేదు. మహిళను ఆపమని పదే పదే కోరినప్పటికీ ఆ అధికారి పట్టించుకోలేదని బుల్లెట్ రైడర్ సౌరభ్ శర్మ ఆరోపించారు.ఈ విషయం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లగా ఇరు పక్షాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితి సామరస్యంగా పరిష్కారమైందని, ఆ మహిళపై ఎలాంటి అధికారిక కేసు గానీ, చట్టపరమైన చర్యలు గానీ నమోదు చేయలేదని అధికారులు ధృవీకరించారు. అయితే, బహిరంగంగా ఒక వ్యక్తి వాహనాన్ని ధ్వంసం చేయడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, పోలీసుల నిర్లిప్తతపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: దేశవ్యాప్త లాక్డౌన్ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!ఇదిలా ఉండగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజస్థాన్ పోలీస్ హెల్ప్డెస్క్ బహిరంగంగా స్పందిస్తూ, ఈ కేసును సమీక్షించి, ప్రస్తుత పరిస్థితిపై అప్డేట్ అందించాలని జైపూర్ పోలీసులను కోరింది.ఇదీ చదవండి : బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..! -
108 కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు.. ఎమ్మెల్యే ముందు యువతి కన్నీళ్లు
-
Ameerpet: యువతి స్నానం చేస్తుండగా ఫొటోలు
హైదరాబాద్: హాస్టల్లో నివాసముంటున్న ఓ యువకుడు హాస్టల్ యజమాని కుమార్తె స్నానం చేస్తుండగా ఫొటోలు తీయడంతో అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ బాపూనగర్లోని ప్రైవేటు హాస్టల్లో వరంగల్ జిల్లా, గీసుకొండకు చెందిన రంజిత్ (28) ఉంటున్నాడు. సేల్స్ మెన్గా పనిచేసే రంజిత్ హాస్టల్ యజమాని కుమార్తె స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి రహస్యంగా ఫొటోలు తీశాడు. దీనిని గుర్తించిన సదరు యువతి కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు రంజిత్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘దీన్ని తన్ని స్టేషన్లో వేయండి’
పామర్రు: తన తండ్రిని పోలీసులు ఎందుకు స్టేషన్కు పిలిపించారో తెలుసుకుందామని వెళ్లిన ఓ దళిత యువతి పట్ల అకారణంగా దుర్భాషలాడటమే కాక.. బూటుకాళ్లతో తన్నుతూ.. జుట్టు పట్టుకుని లాగుతూ చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్పృహ కోల్పోయిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కృష్ణాజిల్లా పామర్రు మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జుఝవరపు చిన్ని అదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి కుమారుడు తేజ, కుమార్తె సుప్రియ ఉన్నారు. తేజ తండ్రితో పాటు పనులు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో చెట్లు నరికే పనులకు వెళ్తుంటాడు.కుమార్తె సుప్రియ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. మూణ్ణెళ్ల క్రితం గ్రామంలో ఓ చోట చెట్ల పొదల్లో కలి్టవేటర్ ఎంతోకాలంగా ఉందని గమనించిన తేజ, దాన్ని ఓ పాత ఇనుప సామాన్ల వ్యాపారికి రూ.3 వేలకు విక్రయించాడు. కొద్దిరోజుల తర్వాత ఓ వ్యక్తి వచ్చి కలి్టవేటర్ తనదని చెప్పడంతో తేజను తండ్రి మందలించి ఆ వ్యాపారికి రూ.3 వేలు చెల్లించి దానిని సంబంధిత వ్యక్తికి అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో.. శనివారం ఉదయం పామర్రు పోలీస్స్టేషన్ నుంచి జుఝవరపు చిన్నికి పోలీసులు ఫోన్ చేసి స్టేషన్కు రావాలని చెప్పారు. పనులు ముగించుకుని చిన్ని సాయంత్రం స్టేషన్లో సీఐ సుభాకర్ వద్దకు వెళ్లాడు. సీఐ దుర్భాషలాడుతూ.. పసుమర్రులో ఓ రైతు గడ్డర్ పోయిందని.. దానిని తీశారా అంటూ ప్రశి్నంచారు. తమకు తెలీదని చిన్ని బదులిచ్చాడు. ఎవర్రా ఇది.. ఎక్కువ మాట్లాడుతోంది.. అదే సమయంలో విజయవాడ నుంచి వచ్చిన సుప్రియ.. తన తండ్రిని పోలీసులు పిలిపించారని తెలుసుకుని భయంతో సీఐ వద్దకు వెళ్లింది. పోలీసులు ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్కడే ఉన్న తేజను ‘ఏరా నువ్వు దొంగతనాలేనా.. మానభంగాలు కూడా చేస్తున్నావా?’ అంటూ పామర్రు ఎస్ఐ ప్రశి్నంచారు. ‘సార్ కాస్త మర్యాదగా మాట్లాడండి. మేం చదువుకున్నాం.మాకూ రూల్స్ తెలుసు’ అని సుప్రియ అనడంతో ఎస్ఐ కోపంతో.. ‘ఎవ్వర్రా ఇది? ఎక్కువగా మాట్లాడుతోంది. దీన్ని తన్ని స్టేషన్లో వేయండి’ అంటూ పోలీసులను ఆదేశించారు. వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మహిళా హోంగార్డు సుప్రియను డాబాపై నుంచి బూటుకాళ్లతో తన్నుకుంటూ, జుట్టు పట్టుకుని లాక్కుంటూ కిందకు తీసుకొచ్చారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇది చూసి బాలిక తండ్రి చిన్ని 108కు ఫోన్చేయగా వారు వచ్చి రక్తపు గాయాలు లేనందున తాము ఆస్పత్రికి తీసుకెళ్లబోమని చెప్పి వెళ్లిపోయారు. ఇక చేసేదిలేక చిన్ని తన కుమార్తెను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. దీనిపై సీఐ సుభాకర్ను వివరణ కోరగా.. పోలీస్స్టేషన్లోని హోంగార్డునే ఆ యువతి కొట్టి గాయపర్చిందని, అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయని బదులిచ్చారు. ఆమెపైన కేసు నమోదు చేశామన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
హైదరాబాద్: ప్రేమ విషయంలో మానసిక ఒత్తిడికి గురై ఓ యువతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించానని వెంటపడ్డ యువకుడు దాడిచేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బుధవారం ధర్నా, రాస్తారాకో నిర్వహించారు. చిలకలగూడ ఠాణా పరిధిలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా రేబల్లె గ్రామానికి చెందిన గుడిసె కోటేశ్వరరావు, రమాదేవి దంపతులు సికింద్రాబాద్ శ్రీనివాసనగర్లో ఉంటూ పద్మారావునగర్లో కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, ఇంటర్ చదువుతున్న కుమార్తె జెనిమా (19) ఉన్నారు. జగదీష్ అనే యువకుడు, జెనిమా కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో జెనిమా కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతోంది. మంగళవారం ఉదయం జెనిమా మాత్రమే ఇంట్లో ఉంది. ఆసమయంలో జగదీష్ ఇంటికి వచ్చాడు. కొంత సమయం తర్వాత యువతి తల్లి రమాదేవికి ఫోన్ చేసి .. మీ కుమార్తె లోపల నుంచి తలుపు గడియపెట్టుకుంది. మీరు త్వరగా రావాలని చెప్పాడు. జెనిమా తల్లి రావడంతో స్థానికులతో కలిసి జగదీష్ తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. ద్విచక్ర వాహనంపై గాం«దీఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.. తమ కుమార్తెను జగదీష్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా జెనిమాపై దాడికి పాల్పడి ఆపై హత్య చేశాడని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం చిలకలగూడ గాంధీ చౌక్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలు మహబూబ్నగర్ జిల్లా నర్వ మండలం పెద్దపుడుమూరుకు చెందిన నిందితుడు జగదీష్ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చిలకలగూడ ఎస్హెచ్ఓ రామకృష్ణ తెలిపారు. మృతురాలి ఇంట్లో సూసైడ్నోట్ స్వాదీనం చేసుకున్నామని, అందులో ప్రేమ విషయమై మానసిక ఒత్తిడికి గురైనట్లు ఉందని స్పష్టం చేశారు. మృతురాలి కాళ్లకు గాయాలైనట్లు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. -
బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!
ప్రపంచంలో అందమైన మహిళ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ బాహ్య సౌందర్యానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రపంచంలో, బిడ్డలకోసం ఎంతో అవమానాన్ని నెత్తిన వేసుకున్న మహిళ గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించక మానదు. కుటుంబ పోషణ కోసం 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ' అన్న బిరుదును స్వీకరించిన సాహసి పేరు మేరీ ఆన్ బెవాన్. తన పిల్లల ఆకలి తీర్చడం కోసం తన ఆత్మగౌరవాన్ని సైతం పణంగా పెట్టి ఈ తల్లి గొప్ప పోరాటమే చేసింది. ఇంతకీ ఎవరా మాతృమూర్తి? ఎందుకు వికారమైన మహిళగా మారింది తెలుసుకుందాం పదండి..!1874లో లండన్లోని న్యూహామ్లో పేద కుటుంబంలో జన్మించింది మేరీ ఆన్ బెవాన్, నర్సింగ్ కోర్స్ చదివి 1894లో నర్సుగా మారింది. ఆ తరువాత థామస్ బెవాన్ అనే వ్యక్తిని ప్రేమిం వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు కలిగారు. జీవితం ఎంతో సాఫీగా సాగిపోతున్న తరుణంలో 32 ఏళ్ల మేరీ జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వైద్యులకు పెద్దగా తెలియని అక్రోమెగాలీ(Acromegaly) అనే అరుదైన వ్యాధి మేరీకి సోకింది. దీంతో కుటుంబమంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైంది. అంతుచిక్కని వ్యాధి - వికృత రూపంమేరీకి అక్రోమెగాలీ సోకడంతో, శరీరంలో వింత మార్పులు మొదలయ్యాయి. ముఖంలోని ఎముకలు, కండరాలు ఉబ్బి, సాధారణం కంటే మూడు రెట్లు పెద్దవిగా మారాయి. చేతులు, కాళ్లు పెద్దవిగా పెరగడం ప్రారంభించాయి. దవడ కిందికి సాగిపోయి ముఖం ఆకారం మారిపోయింది ముక్కు వెడల్పుగా మారింది. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే, ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన మునుపటి 'అందమైన' రూపానికి ఏమాత్రం పోలిక లేకుండా పోయింది.శరీరంలో గ్రోత్ హార్మోన్ అధికంగా విడుదలవ్వడం వల్ల వచ్చే సమస్య. ఇది ఇలా కొనసాగుతుండగానే దురదృష్టం మరోసారి వెంటాడింది. 1914లొ ఆమె భర్త థామస్ మరణించాడు. ఫలితంగా నలుగురు పిల్లలతో మేరీ ఒంటరిదైపోయింది.ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరుపిల్లల కోసం తల్లి మనసు ఆరాటంరూపం మారిపోవడంతో ఆమెకు ఎక్కడా పని దొరకలేదు. ప్రజలు ఆమెను చూసి నవ్వుతుంటే, మరికొందరు భయపడేవారు. పిల్లలకు తిండి పెట్టడమే కష్టమైన తరుణంలో, 1920వ దశకంలో "ప్రపంచంలోనే అత్యంత వికృతమైన మహిళ కావాలి - భారీ వేతనం ఇవ్వబడును." అనే ఒక ప్రకటన చూసింది: కుటుంబానికి సహాయపడే బహుమతి డబ్బును గెలుచుకోవాలనే ఆశతో పోటీకి దిగింది. ఆమె ప్రయత్నాలు ఫలించాయి, ఆమె ఆ పోటీలో గెలిచి 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ'గా పేరు పొందింది. ఎన్నో ఫ్రీక్ షో లలో చేరింది. వేదికపై నిలబడితే జనం ఎగతాళి చేసేవారు. కానీ ఆ తర్వాత ప్రసిద్ధ షోమాన్ పి.టి. బర్నమ్ పిలుపు మేరకు ఆమె అమెరికాకు వెళ్లి కోనీ ఐలాండ్లో ప్రదర్శనలు ఇచ్చింది.అలా త్వరలోనే సర్కస్లో స్పెషల్ ఎట్రాక్షన్గా మారిపోయింది. 1933లో చనిపోయే వరకు కోనీ ఐలాండ్లోని డ్రీమ్ల్యాండ్ సైడ్షోలో 'ఫ్రీక్ షో' ప్రదర్శకురాలిగా పనిచేసింది.మేరీ ఆన్ బెవాన్ 1933, డిసెంబరు 26న లో తన 59వ ఏట కన్నుమూసింది. తన రూపంతో జీవితాంతం ఎన్నో అవమానాల్ని మోసింది. కానీ ఆ అవమానాల నుండి వచ్చిన డబ్బుతోనే తన బిడ్డల కడుపు నింపింది. వారిని గౌరవప్రదంగా పెంచి పెద్ద చేసిన విద్యావంతుల్ని చేసింది.తన పిల్లల భవిష్యత్తు కోసం, బిడ్డలుఆకలితో అలమటించకూడదని మేరీ పోటీలో పాల్గొంది. ఆ పోటీలో ఆమె గెలిచి అవమానకరమైన కిరీటాన్ని జీవితాంతం మోసింది. కానీ అది ఒక తల్లిగా ఆమె మనసును ఎంతగా గాయపరిచిందో ఊహించగలమా? కానీ వాటన్నింటినీ అధిగమించి పిల్లల్నిప్రయోజకుల్ని చేయడమే కాదు, అక్రోమెగలీతో బాధపడే చాలా మందికి మేరీ స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచింది. లోకం దృష్టిలో ఆమె కేవలం ఒక "వికృత మనిషి" కానీ పిల్లల దృష్టిలో తమను ప్రాణప్రదంగా కాపాడుకున్న "అమ్మ". చరిత్రలో "అత్యంత అందమైన మనసున్న తల్లి"గా నిలిచిపోతుంది. ఏమంటారు? -
ఫోటో దిగుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయి..
ఖమ్మం: ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా స్టేజ్లపైనే కుప్పకూలిపోయి మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లి గుండె పోటుతో మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరానికి చెందిన ఓ మహిళ.. బంధువుల గృహ ప్రవేశ వేడుకకు వెళ్లింది. అయితే అక్కడ ఫోటో దిగుతున్న సందర్భంలో పక్కనున్న మరొక మహిళతో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయింది. ఆ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఖమ్మం టూటౌన్కు చెందిన బొమ్మ సుస్మిత అనే మహిళ.. ఖమ్మంలోని ఓ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లారు. అయితే అప్పటివరకూ అందరితో కలివిడిగా మాట్లాడుతూ తిరిగిన మహిళ.. ఫోటో దిగుతున్న సమయంలో గుండెపోటుకు లోనైంది. ఒక్కసారిగా పక్కనున్న మహిళపై చేయి వేస్తూనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
మంచిర్యాల: వృద్ధురాలి చేతిని పీక్కుతిన్న పిల్లులు!
సాక్షి, మంచిర్యాల జిల్లా: హృదయ విదారక స్థితిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చనిపోయిన ఆమె చేతిని పెంపుడు పిల్లులు పీక్కుతిన్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని భగత్సింగ్ నగర్కు చెందిన జక్కనబోయిన లక్ష్మి (80) తన రెండో కుమారుడు సమేందర్ దగ్గర ఉంటున్నారు. అతను పని నిమిత్తం బెల్లంపల్లికి వెళ్లగా లక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉండిపోయారు.ఈ క్రమంలో ఆమె గడప తగిలి కింద పడిపోగా తలకు గాయమై అచేతన స్థితికి చేరుకున్నారు. ఇంట్లో లైట్లు వెలగకపోవడం.. అలికిడి లేకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లిచూడగా కదల్లేని స్థితిలో ఆమె ఉండడం చూసి కుమారులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సరికి ఆమె చనిపోయి ఉన్నారు.అయితే, ఇంట్లో ఉన్న రెండు పెంపుడు పిల్లలు ఆమె చేతిని చాలా వరకు పీక్కుతినడం స్థానికులను కలచివేసింది. సీఐ పర్స రమేష్, ఎస్సై నరేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇక ‘టోల్’ తీసే బాధ్యత మహిళలకే..
న్యూఢిల్లీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతకు బాటలు వేస్తూ, టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులను నియమించనున్నట్లు ప్రకటించింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 1,140కి పైగా టోల్ ప్లాజాల వద్ద సుమారు 5,100 మంది మహిళలను పగటిపూట షిఫ్టుల్లో నియమించనున్నారు.నేషనల్ హైవేస్ అథారిటీ నిర్ణయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళలకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హైవే మౌలిక సదుపాయాల రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. టోల్ బూత్ల వద్ద మహిళా సిబ్బంది ఉండటం వల్ల వాహనదారులకు మరింత మర్యాదపూర్వకమైన సేవలు అందుతాయని నేషనల్ హైవేస్ అథారిటీ భావిస్తోంది.సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య జరిగే వాగ్వాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం దోహదపడనుంది. ప్రశాంతమైన, వృత్తిపరమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు నేషనల్ హైవేస్ అథారిటీ పలు కీలక భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపింది. ఎన్హెచ్బీఎఫ్, హెచ్ఓఏఐ, ఏఐటీయూసీ తదితర సంఘాలతో పాటు టోల్ ఆపరేటర్లు కూడా ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు ప్రకటించారు.ఈ వినూత్న కార్యక్రమం అమలునునేషనల్ హైవేస్ అథారిటీ నిరంతరం పర్యవేక్షించనుంది. విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా వారికి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, టోల్ ఆపరేషన్లలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించడం, భద్రతా నియమాలపై అవగాహన తదితర అంశాల్లో శిక్షణ అందించనున్నారు.ఇది కూడా చదవండి: సోనమ్ వాంగ్చుక్ విడుదల -
హైదరాబాద్లో ‘రాంబాయి’ సినిమా తరహాలో ఘటన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పోచారంలో ‘రాంబాయి’ సినిమా తరహాలో ఘటన జరిగింది. పెళ్లికి నిరాకరించిన యువతికి యువకుడు ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించాడు. యువకుడితో పాటు తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ సోకింది. యువకుడు మనోహర్తో యువతికి వివాహం నిశ్చయమైంది. ఎయిడ్స్ ఉందని తేలడంతో యువతి.. పెళ్లికి నిరాకరించింది.ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి, తనను పెళ్లి చేసుకోవాలంటూ మనోహర్ ఒత్తిడి తెచ్చాడు. పెళ్లికి నిరాకరించడంతో మనోహర్ ఎయిడ్స్ ఇంజెక్షన్ చేశాడు. నిందితుడిని పోచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్
ఆగ్రాలో ఒక మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. నాలుగేళ్లు సహజీవనంచేసి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఒక పోలీస్ కానిస్టేబుల్పై ఆరోపణలు గుప్పిస్తూ చనిపోయే ముందు ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు కూడా విజ్ఞప్తి చేయడంతో ఇది వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సంచలనంగా మారడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అసలు స్టోరీ ఏంటంటే..ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధిత మహిళది స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లా. ఆమె అంతకుముందే విడాకులు తీసుకుని, ఆగ్రాలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో తాజ్గంజ్ పోలీస్ స్టేషన్లోపనిచేస్తున్న జేవీ గౌతమ్ అనే కానిస్టేబుల్తో పరిచయమైంది. దీంతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కుటుంబం ఒప్పుకోదు అంటూ పెళ్లికి నిరాకరించాడు. చివరికి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో వివాదం రేగింది. తీవ్ర ఆవేదనతో వీడియో సందేశం రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వీడియోలో ఇలా పేర్కొంది..తాను కలిసి జీవించిన గౌతమ్ చేతిలో ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఆ తర్వాత మాట తప్పాడని పేర్కొంది. గౌతమ్తో జీవించిన కాలంలో తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆమె పేర్కొంది. ఫిర్యాదు చేయడానికి తాను పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు, తమ చేతుల్లో ఏమీ లేదని, ఆ కానిస్టేబుల్పై ఎటువంటి చర్యలూ తీసుకోలేమని అక్కడివారు చెప్పినట్లు ఆమె తెలిపింది. తాను బతికి ఉన్నప్పుడు తనకు న్యాయం జరగలేదని, కనీసం తన మరణం తర్వాత అయినా తనకు న్యాయం జరగాలని ఆశించింది. అంతేకాదు గౌతమ్, అతని కుటుంబ సభ్యులు తనను ఎంతో మోసం చేశారని, మానసికంగా వేధించారని, చివరికి ఈ దారుణ నిర్ణయం తీసుకునేలా తనను నెట్టారని ఆమె ఆరోపించింది. ఏళ్ల తరబడి అతనితో కలిసి జీవించిన తర్వాత, ఇప్పుడు అతను వేరొక మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని ఆమె వాపోయింది."నా మరణానికి జేవీ గౌతమ్, అతని కుటుంబం మొత్తం కారణం. వారు నన్ను ఎంతగానో మోసం చేశారు. మానసికంగా ఎంతగా వేధించారంటే, చివరికి నేను చనిపోయేలా నన్ను బలవంతం చేశారు." అని చెప్పింది. అలాగే ‘‘అతని అన్నయ్య ఒకవైపు నన్ను పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు. మరోవైపు, నా కుటుంబం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదని జేవీ గౌతమ్ నాతో చెబుతున్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం ఏ అమ్మాయినీ మోసం చేయకు," అని పేర్కొంది."Don't get married to anyone, but don't keep any girl in deception either"The young woman who made a video before suicide in Agra leveled serious allegations of deception against police constable Jitendra Gautam!!Constable is arrested and send to Jail.99 percent of Live in… pic.twitter.com/OCDlXiEbLb— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 13, 2026 ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో కానిస్టేబుల్ జె.వి. గౌతమ్ను సస్పెండ్ చేశారు. మరోవైపు ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుమార్తెకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. -
Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ సందర్భంగా స్ఫూర్తిదాయక మహిళలను గుర్తుచేసుకోవడం మన కర్తవ్యం. కేరళకు చెందిన రేవతి విజయన్ ఓ వైపు ఉన్నత చదువుల కోసం ‘పరిశోధన’ సాగిస్తూ, మరోవైపు కుటుంబాన్ని ఆదుకునేందుకు అర్ధరాత్రి వరకు ఇడ్లీల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఒట్టపాలం మయన్నూర్ వంతెన సమీపంలో రాత్రిపూట రోడ్డు పక్కన ఆమె నడుపుతున్న చిన్నపాటి ఇడ్లీ స్టాల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది.త్రిస్సూర్ జిల్లా పజయన్నూర్ నివాసి అయిన 30 ఏళ్ల రేవతికి చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో మక్కువ. తండ్రి విజయన్ టైలర్ కాగా, తల్లి ప్రియ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తున్నారు. త్రిస్సూర్లోని విమల కళాశాలలో మలయాళంలో డిగ్రీ, అనంతరం ఒట్టపాలం ఎన్ఎస్ఎస్ కళాశాలలో రేవతి బీఈడీ పూర్తి చేశారు. తన చదువు ఖర్చుల కోసం కుటుంబంపై భారం పడకూడదనే ఉద్దేశంతో రేవతి ట్యూషన్లు చెబుతూ, ఆర్థిక స్వాలంబన సాధించారు.వివాహం, ఇద్దరు పిల్లల బాధ్యతల మధ్య తన విద్యాభ్యాసం ఆగిపోతుందేమోనని రేవతి ఆందోళన చెందారు. అయితే తిరిగి పుస్తకం చేత పట్టి, పీజీ పూర్తి చేయడమే కాకుండా, గోల్డ్ మెడలిస్ట్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదటి ప్రయత్నంలోనే ‘నెట్’ (NET) అర్హత సాధించారు. అనంతరం రేవతికి పీహెచ్డీ చేసే అవకాశం లభించింది. అయితే ఇందుకోసం ప్రతిరోజూ పజయన్నూర్ నుంచి త్రిస్సూర్ వరకు ప్రయాణించడం ఆర్థికంగా భారమైంది. దీంతో రాత్రిపూట ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న రేవతి మయన్నూర్ వంతెన వద్ద ‘ఫ్రెష్ మూన్’ పేరుతో ఇడ్లీ స్టాల్ ప్రారంభించారు.కేవలం సాధారణ ఇడ్లీలే కాకుండా.. తట్టు ఇడ్లీ, మసాలా ఇడ్లీ, ఎగ్ ఇడ్లీ, మటన్ ఇడ్లీ, చికెన్ ఇడ్లీ, పొడి ఇడ్లీ వంటి దాదాపు 10 రకాల వైవిధ్యమైన రుచులతో వినియోగదారుల మనసు గెలుచుకుంటున్నారు. రేవతి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కళాశాలలో పరిశోధన పనుల్లో నిమగ్నమై, సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 గంటల వరకు స్టాల్ దగ్గర కష్టపడుతుంటారు. ఈ ప్రయాణంలో ఆమె భర్త అనూప్, సోదరి గౌరీ నంద ఆమెకు సాయంగా నిలుస్తున్నారు. ఇది కూడా చదవండి: రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం -
మానవ మృగాల పాశవికం.. మతిస్థిమితం లేని యువతి గర్భిణి
కొందరు మనుషులు మృగాల కన్నా హీనంగా మారారు. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాలు చేసిన గాయాలతో శరీరం పుండుగా మారింది. అయినా వదల్లేదు. తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో గర్భం దాల్చి రోడ్డున అనాథగా సంచరిస్తున్న ఆమెను మానవతావాది అయిన ఓ ఉపాధ్యాయురాలు గుర్తించి పోలీసుల సాయంతో అనాథాశ్రమానికి చేర్చింది. ప్రస్తుతం ఆ యువతి నిండు గర్భిణి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఓ అభాగ్యురాలి దీనగాథ పలువురిని కలిచి వేస్తోంది.అనంతపురం కల్చరల్: మతిస్థిమితం లేని యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటన కళ్యాణదుర్గం ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. అయినా నేటికీ దోషులెవరో బయటపడలేదు. వారు చేసిన పాపం యువతి గర్భంలో పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. అనాథగా రోడ్డుపై సంచరిస్తూ... కొన్ని నెలల క్రితం కళ్యాణదుర్గంలోని రహదారులపై మతిస్థిమితం లేకుండా ఒంటరిగా తిరుగుతున్న యువతిని ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శశికళ గమనించింది. పలకరించే ప్రయత్నం చేయడంతో సమాధానం ఇవ్వలేదు. ఆకలిగా ఉందా? అని ప్రశ్నించినా మౌనమే సమాధానమైంది. దీంతో అప్పటికప్పుడు ఆహారాన్ని కొనుగోలు చేసి యువతి చేతికి ఇవ్వడంతో ఎన్నాళ్లుగా ఆకలితో ఉందో తెలియదు కానీ గబగబా మొత్తం తినేసింది. ఆ సమయంలో యువతి బెదురు చూపులు గమనించిన శశికళ... ఆమె ఏదో ప్రమాదంలో ఉందని గ్రహించి, విషయాన్ని వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సాయంతో యువతిని అనంతపురం రూరల్ పరిధిలోని కాట్నేకాలువలో ఉన్న ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చారు. శరీరమంతా పుండుగా మారి.. మతి స్థిమితం కోల్పోయి బెదురు చూపులతో ఆశ్రమానికి చేరుకున్న యువతిని నిర్వాహకులు కృష్ణారెడ్డి, దేవి దంపతులు అప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. 25 ఏళ్ల వయస్సులోనూ ఆరేళ్ల చిన్నారిలా ప్రవర్తిస్తున్న ఆ యువతిని ఎంత ప్రశ్నించినా తన తల్లిదండ్రులెవరో చెప్పలేని స్థితిలో ఉంది. శరీరంపై గాయాలు ఉండడంతో ఆస్పత్రికి పిలుచుకెళ్లి చూపించారు. ఆ సమయంలో గాయాలను పరిశీలించిన వైద్యులు అవి మానవ మృగాలు చేసినవిగా నిర్ధారించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె గర్భంతో ఉన్నట్లుగా ధ్రువీకరించారు. ఆ సమయంలో అత్యాచారం జరిగిన విషయం గాని తెలియని స్థితిలో యువతి అమాయకంగా చూస్తుండడం గమనించిన వైద్యులు, సిబ్బంది హృదయాలు ద్రవించి పోయాయి. చికిత్స అనంతరం ఆమెను ఆశ్రమానికి చేర్చిన కృష్ణారెడ్డి దంపతులు అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. పుండుగా మారిన శరీరాన్ని రోజూ శుభ్రం చేస్తూ ఆమెకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ వచ్చారు. ప్రస్తుతం యువతి నిండు గర్భిణి. రేపో.. మాపో ప్రసవమయ్యే సూచనలు ఉన్నాయి. తలుచుకుంటేనే భయమేస్తోంది మానవత్వమున్న ఉపాధ్యాయురాలు గుర్తించి ఈ యువతిని మా ఆశ్రమానికి చేర్చారు. ఆమె ఆశ్రమానికి వచ్చేనాటికి శరీరం మొత్తం పుండుగా మారి ఉంది. మానవ మృగాలు ఎంత పైశాచికంగా పాడు చేశారో తలుచుకుంటేనే భయమేస్తోంది. కనీసం తన తల్లిదండ్రులెవరు అనే విషయం కానీ, తనపై అత్యాచారం జరిగిందనే విషయం గాని ఆమెకు తెలియదు. ఎంతో అమాయకంగా ఉంది. ఆమె భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తోంది. ఆశ్రమంలో ఎందరో అనాథలు ఉన్నారు. వీరెవ్వరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవు. వీరి దైన్య స్థితిపై అధికారులు స్పందించి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు చేస్తే ఆదుకునే అనాథాశ్రమాలకు ఎంతో మేలు చేసిన వారవుతారు. – దేవి, ఆశ్రయ అనాథాశ్రమ నిర్వాహకురాలుఆమె పరిస్థితి చూసి చలించిపోయాను నేను ప్రస్తుతం ఆత్మకూరు మండలం పంపనూరులోని ఎంపీపీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నిరాశ్రయులైన మహిళలెవరైనా కనిపిస్తే అనాథశ్రమాలకు చేరుస్తుంటాను. అలా ఒకసారి కళ్యాణదుర్గంలోని పోలీసుస్టేషన్ సమీపంలో డివైడర్ వద్ద రెండేళ్లుగా దిక్కు లేకుండా కూర్చొని ఉన్న ఓ యువతి కనిపించింది. ఆ సమయంలో ఆమె పరిస్థితి చూసి చలించిపోయాను. వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి, వారి సహకారంతోనే ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చాను. రోజులు గడుస్తుండగా ఆమె శరీరంలో మార్పులు గమనించి వైద్యులకు చూపిస్తే గర్భిణి అని తెలిసింది. ఈ అమానుషంపై ఎవరూ స్పందించకపోవడం బాధాకరం. – శశికళ, ఉపాధ్యాయురాలు -
కుటుంబ బాధ్యత.. ఆర్థిక భరోసా!
మూసాపేట: మహిళలు ఆర్థికంగా ఎదిగనప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత తరంలో ఎందరో మహిళలు చిన్న ఉద్యోగాల నుంచి రైలు, విమానాలు నడిపిస్తున్నారు. ఉద్యోగాలే కాకుండా వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. ప్రభుత్వాలు పేద, మద్య తరగతి మహిళలను, చదువురాని మహిళలు కూడా తమ కాళ్లపై నిలబడేవిధంగా ప్రోత్సహిస్తున్నాయి. మూసాపేట పరిసర ప్రాంతాల్లో సమైఖ్య మహిళ గ్రూపులో ఉండి బ్యాంకు లోన్లు తీసుకుని చిన్న, చిన్న వ్యాపారాలు ఎదుగుతూ తోటి వారికి ఆదర్శంగా ఉన్న పలువురి మహిళల గురించి అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. లోన్తో మేకప్ టీచర్గా... మూసాపేటలో నివాసం ఉండే భాగ్యవతి వైష్ణవి దేవి మహిళ గ్రూపులో 10 మంది మహిళల్లో ఆమె ఒక్కరు. మూడు సంవత్సరాల క్రితం గ్రూపునకు బ్యాంక్ లోన్ మంజూరైంది. తన భాగానికి వచ్చిన రూ. 60 వేలతో మేకప్గా శిక్షణ తీసుకుంది. అనంతరం వాటికి మరికొంత డబ్బు జమ చేసి మేకప్ కిట్ కొనుగోలు చేసింది. అనంతరం మూసాపేట భవానీనగర్లో ఉన్న మేకప్ స్టూడియోలో 12 మందికి టీచింగ్ చేస్తుంది. బ్యాచ్కు 12 మందికి టీచింగ్ ఇస్తూ వారిని మేకప్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక ఈవెంట్లు, పెళ్లిలకు మేకప్లు వేస్తూ నెలకు రూ.50 నుంచి 70వేల వరకు సంపాదిస్తుంది. బ్యాంక్ లోన్ తానేకడుతూ మేకప్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లేందేకు కృషి చేస్తుంది. ప్రముఖ సింగర్ గీత మాధురికి కూడా మేకప్ వేసి ఔరా అనిపించింది. గోలీసోడా వ్యాపారంలో.. గోలిసోడా కొడుతూ వ్యాపారంలో రాణిస్తుంది భరత్నగర్కాలనీకి చెందిన ఎస్. సంధ్య. కాలనీలోని కల్వరి మహిళ పొదుపు సంఘంలో పది మందిలో తాను ఒక్కరు. నెలన్నర క్రితం గ్రూపునకు భ్యాంక్ లోన్ రావడంతో తన భాగం రూ.1.80 లక్షలు వచ్చాయి. వాటితో కొన్ని అప్పులు తీర్చుకుని సుమారు రూ.50వేలతో ఆరెంజ్ గోలి సోడా షాపును ఏర్పాటు చేసుకుంది. వేసవికాలంలో గోలిసోడకు ఆదరణ ఉండటంతో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. పిల్లలను స్కూల్కు పంపి, భర్తను ఉద్యోగానికి పంపి గోలి సోడా కొడుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు షాపు నడిపిస్తుంది. ఒక్కరి వద్ద ఉద్యోగం చేసే బదులు వ్యాపారం ఎంతో మేలు అని అంటుంది. రాజకీయాల్లో రాణిస్తూ బోటిక్ నడిపిస్తూ.. గృహిణిగా పిల్లలు, భర్త బాధ్యతలు చూసుకుంటూనే రాజకీయాలపై మక్కువతో బీఆర్ఎస్ మహిళ కార్యకర్తగా, సోషల్ మీడియా వారియర్గా రాణిస్తుంది మూసాపేట జనతానగర్కు చెందిన శిరీష. కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుని శ్రీహర్ష పేరుతో బోటిక్ నడిపిస్తుంది. భర్త ఇచ్చిన డబ్బులతో పాటు మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్ రూ. 35వేలతో కుట్టు మిషన్ ఇప్పించడంతో షాపును ఏర్పాటు చేసింది. షాపులో ప్రస్తుతం ముగ్గురు పనివారు, నాలుగు కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుంది. చీరలు అమ్మడంతో పాటు సంక్రాంతికి గాలి పటాలు, దీపావళికి టపాసులు, రాఖీ పౌర్ణమికి రాఖీలు విక్రయిస్తుంది. -
హోలీలో విషాదం: మనవడిపై నాన్నమ్మ పైశాచికం
నాగ్పూర్: రంగుల పండుగ హోలీ వేళ మహారాష్ట్రలోని నాగ్పూర్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అల్లరి చేస్తూ, తనపై రంగు చల్లాడన్న కోపంతో, మనవడిపై ఒక నాన్నమ్మ తన పైశాచికాన్ని చూపింది. నాగ్పూర్ జిల్లా కోరాడి ప్రాంతంలోని ఆరామ్షీన్ వార్డు-2లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓమ్ అనే నాలుగేళ్ల బాలుడు తన ఇంటి బయట రంగుల నీళ్ల బాటిల్తో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అతడి నాన్నమ్మ సింధు థాకరే కట్టెల పొయ్యిపై నీళ్లు కాచుకుని బకెట్తో వెళుతోంది. ఇంతలో ఆ బాలుడు పొరపాటున ఆమెపై రంగు నీళ్లు జల్లాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సింధు.. తన చేతిలో ఉన్న మరుగుతున్న నీళ్లను ఆ బాలునిపై పోసింది. ఈ ఊహించని దాడితో ఆ పసివాడు విలవిలలాడిపోయాడు.ఆ సమయంలో అక్కడే ఉన్న మరో మహిళ వెంటనే స్పందించి, ఆ చిన్నారిపై చన్నీళ్లు పోసి, ఉపశమనం కలిగించే ప్రయత్నించింది. ఆ తర్వాత నిందితురాలు కూడా పశ్చాత్తాపంతో బాలునిపై చన్నీళ్లు పోయడం వీడియోలో కనిపించింది. ఈ ఘటనలో బాలుడికి నడుము కింది భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సుమారు 45 శాతం మేర శరీరం కాలిపోవడంతో బాలుడిని నాగ్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితురాలు సింధు థాకరేపై పోలీసులు కేసు నమోదు చేశారు.బారాబంకిలో ఘర్షణఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో హోలీ వేడుకలు హింసాత్మకంగా మారాయి. రంగులు చల్లుకునే విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం చివరికి ముష్టిఘాతాలకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేసుకోవడంతో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 10 నిమిషాల పాటు కొనసాగిన ఈ ఘర్షణ స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ప్రత్యర్థి వర్గం తన ఇంట్లోకి చొరబడి ఆడవారిపై కూడా దాడులు చేశారని స్థానికుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.ఇది కూడా చదవండి: ‘నీలి విషం’ బారిన 61 శాతం భారతీయులు


