breaking news
Woman
-
నైట్క్లబ్లో దారుణం.. భార్యపై లైంగిక దాడి.. భర్తకు చావు దెబ్బలు
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో దారుణం చోటుచేసుకంది. ఇక్కడి ఒక నైట్క్లబ్ యజమాని తన కోరిక తీర్చలేదని ఒక మహిళను లైంగికంగా వేధించి, ఆమె భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన జైపూర్లోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘క్లబ్ ఆల్ఫా’లో చోటుచేసుకుంది. బాధితురాలు ఇరామ్ షేక్ తన భర్త నవేద్ ఉస్మానీతో కలిసి క్లబ్కు వెళ్లింది. ఇంతలో అక్కడున్న ఒక వెయిటర్.. క్లబ్ యజమాని భరత్ ఆమెను ఒక ప్రైవేట్ గదిలో కలవాలనుకుంటున్నట్లు తెలియజేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. కాగా క్లబ్ యజమాని అభ్యర్థనను ఆమె తిరస్కరించారు.ఆ దంపతులు క్లబ్లో సేదతీరిన కొద్దిసేపటి తర్వాత ఇరామ్ షేక్ వాష్రూమ్ వైపు వెళ్లారు. అదే సమయంలో క్లబ్ యజమాని భరత్, మేనేజర్ దీపక్, పలువురు బౌన్సర్లు ఆమెను చుట్టుముట్టి, అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నవేద్ ఉస్మానీ అక్కడకు పరుగుపరుగున వచ్చాడు. అతను క్లబ్ యజమాని, సిబ్బందిని అడ్డుకున్నాడు. దీంతో భరత్, మేనేజర్ దీపక్, బౌన్సర్లు కలిసి నవేద్ ఉస్మానీపై దాడి చేసి, ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ దాడిలో నవేద్ ఉస్మానీ కాలు విరిగింది. అంతటితో ఆగని బౌన్సర్లు బాధిత దంపతుల కారును కూడా ధ్వంసం చేశారు.కొద్దిసేపటి తరువాత బాధితులు ఈ దాడి గురించి పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన నవేద్ను ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత దంపతులు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఏసీపీ బలరామ్ చౌదరి తెలిపారు. ఘటన జరిగినప్పటి సీసీటీవీ ఫుటేజీని, నిందితుల కాల్ డీటెయిల్ రికార్డులను సేకరిస్తున్నామన్నారు. సేకరించిన ఆధారాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా నైట్క్లబ్ యజమాని, సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు -
'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్మస్క్పై నెటిజన్లు ఫైర్
స్త్రీత్వంపై ప్రపంచ కుభేరుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపాయి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోనీ సైంటిఫిక్గా చెప్పని అందరికి సమంజసంగా ఉండేలా మాట్లాడాలి గానీ మరి ఇలానా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..టెస్లా, స్సేస్ ఎక్స్ దిగ్గజం ఎలోన్ మస్స్ స్త్రీత్వంపై తన అభిప్రాయలను పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శులు వెల్లువెత్తాయి. మస్క్ స్త్రీకి నిర్వచనం గర్భం అంటూ గర్భాశయం ఉన్నవాళ్లను స్త్రీలుగా వ్యవహరిస్తారని, గర్భం ఉనికి ద్వారా స్త్రీని నిర్వచించాలి అని నొక్కి చెప్పాడంతో ఒక్కసారివ ఆయనపై తారాస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన వైఖరిని చాలామంది ఖండించారు. అంతేగాదు అస్సలు మనం ఇంకా ఏ కాలంలో జీవిస్తున్నాం అని విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. గర్భం ఉంటే స్త్రీ అంటే.. మరి ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌసర్ సిండ్రోమ్) అరుదైన పరిస్థితితో బాధపడుతున్న ఆడవాళ్లు..స్త్రీలు కాకుండా పోతారా అని నిలదీశారు. ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ అంటే గర్భాశయం లేకుండా లేదా అభివృద్ధి చెందని స్త్రీలని అర్థం. లింగ మార్పిడిని బహిరంగంగా వ్యతిరేకిస్తూ తన ట్రాన్స్జెండర్ కుమార్తె పరిస్థితిని "విషాదకరమైన మానసిక అనారోగ్యం"గా అభివర్ణించారు. ఆయన తనను లక్ష్యంగా చేసుకుని డెమొక్రాట్ అభ్యర్థి కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ ఇలా ప్రతిస్పందించారు. కాగా, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పాడ్కాస్టర్తో తాను ఎక్కువ మంది ట్రాన్స్ పిల్లలను చూడాలనుకుంటున్నానని, తనను తాను ట్రాన్స్-ప్రో చట్టం LGBTQ హక్కుల బలమైన మద్దతుదారుగా భావిస్తానని చెప్పారు. అంతేగాదు సారీ మస్క్ మిమ్మల్ని మీ కూతురు ద్వేషిస్తున్నందుకు అని నేరుగా సెటైర్ వేశారు. దాంతో మస్క్ ఇలా విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. Correct. We’re sorry your daughter hates you, Elon. https://t.co/HeJIm5fJMS— Governor Newsom Press Office (@GovPressOffice) December 11, 2025 (చదవండి: ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా! సర్వేలో షాకింగ్ విషయాలు) -
బాల్కనీకి వేలాడింది..
అది చైనాలోని ఒక నగరం. అందులో ఓ హై–రైజ్ అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు.. అకస్మాత్తుగా ఓ మహిళ బాల్కనీ నుంచి వేలాడటం కనిపించింది. అది చూసినవారంతా హడలిపోయారు. చెమటలు పట్టించిన ఈ దృశ్యం వెనుక కథ తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఒక వ్యక్తి భార్య లేని సమయంలో.. అతని ఇంటికి ప్రియురాలు వెళ్లింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో.. భార్య హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చేసింది. దీంతో భయపడిన ఆ వ్యక్తి.. తన ప్రియురాలిని దాచిపెట్టే ప్రయత్నంలో ఆమెను బాల్కనీలోకి నెట్టేశాడు. పది అంతస్తుల ఎత్తులో ఆ మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేలాడటం మొదలుపెట్టింది. అది చుట్టుపక్కల వారు గమనించారు, పట్టు కోల్పోకుండా నిలబడటానికి ఆమె విఫలయత్నం చేసింది. ఇది గమనించిన వారు అరుపులతో, ఆందోళనతో గంటల తరబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంట్లో ప్రియుడు.. బయట ప్రియురాలు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, ఫ్లాట్ లోపల ఉన్న ప్రియుడు.. కిటికీలోంచి ప్రియురాలితో ఏదో మాట్లాడటం కనిపించింది. ఇంతకీ ఆమె వేలాడటానికి కారణం ఏంటంటే... ఆ మహిళ ప్రియుడి భార్యకు దొరక్కుండా దాక్కోవడానికి ప్రయతి్నంచడమే.. తన భార్య రాగానే ప్రియుడు ఆ మహిళను హడావిడిగా బాల్కనీ వైపు నెట్టేశాడని, దాక్కోవాలని సూచించాడని స్థానిక మీడియా పేర్కొంది. పరువు పోతుందనే భయం.. ఆమెను చావు అంచుల్లోకి నెట్టింది. ప్రాణభయంతో వణికిపోతున్న ఆ మహిళ చేతిలో ఫోన్ పట్టుకునే ఉంది. ఏం చేయాలో తోచక, చివరికి బలం తెచ్చుకుని.. డ్రైన్పైప్లను, కిటికీ అంచులను పట్టుకుని ధైర్యంగా కిందకు దిగడం ప్రారంభించింది. పక్కింట్లో ఆపద్బంధువు!భవనం పక్క గోడకు వేలాడుతూ, అతి కష్టం మీద ఓ వాటర్ పైప్ పట్టుకుని పక్క ఫ్లాట్ కిటికీ వైపు ఆమె జారింది. పక్క ఫ్లాట్ యజమాని కిటికీ తట్టగా.. చివరకు ఆ ఆపద్బాంధవుడు ఆమెను లోపలికి సురక్షితంగా లాగాడు. ఎట్టకేలకు ప్రాణాలను దక్కించుకున్నా.. ఈ సంఘటన మాత్రం ఆమె పరువును, ప్రియుడి పరువును నిలువునా బజారున పడేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు
వింటర్ చైల్డ్, పర్వత మనిషి తనకు తాను గర్వంగా అభివర్ణించుకున్న ఒక పర్వాతారోహకురాలు అనూహ్య పరిస్థితుల్లో కన్ను మూసింది. ఈ ఘటన పర్వతారోహకుల ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ విషాదానికి ఆమె ప్రియుడే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఏం జరిగిందంటే..కెరిస్టీన్ గుర్ట్నర్ అనే33 ఏళ్ల ఆస్ట్రియన్ మహిళ 39 ఏళ్ల ప్రియుడు థామస్ ప్లాంబర్గర్తో ఎత్తైన శిఖరం గ్రాస్గ్లాక్నర్ను అధిరోహించారు. థామస్ అనుభవజ్ఞుడైన గైడ్ కూడా. ఈ జంట అనుకున్న దానికంటే రెండు గంటలు ఆలస్యంగా ఆ అవరోహణను ప్రారంభించారు. -20°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు హరికేన్-పవర్ విండ్స్ లాంటి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. గుర్ట్నర్ అలసిపోయిన గుర్ట్నర్ 150 అడుగుల దిగువన దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే ఆమెను గైడ్ చేసి సాయం చేయాల్సిన ప్లాంబర్గర్ నిర్లక్ష్యంగా వదిలేశాడు. అత్యవసర దుప్పట్లు లేదా బివౌక్ సంచిని ఉపయోగించలేదని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కొన్ని గంటల తరువాత గానీ రెస్క్యూ సర్వీసులను సంప్రదించలేదు. పైగా మొదటి కాల్ తర్వాత తన ఫోన్ను సైలెంట్లో పెట్టుకున్నాడు. దూర నుంచి ఒక హెడ్టార్చ్తప్ప ఇంకేమీ వెబ్ క్యామ్లో కనిపించలేదు.మరోవైపు తీవ్రమైన గాలుల కారణంగా మరుసటి రోజు ఉదయం దాకా రెస్క్యూ బృందాలు గుర్ట్నర్ను చేరుకోలేకపోయాయి. అప్పటికే ఆమె చనిపోయిందని గుర్తించారు. దీంతో ప్లాంబర్గర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.స్నేహితురాలిలా కాకుండా, ఆల్పైన్ హై-ఎలిట్యూడ్ టూర్లతో ఇప్పటికే చాలా అనుభవమున్న వ్యక్తిగా, టూర్ను ప్లాన్ చేశాడు కాబట్టి,బాధ్యతాయుతమైన గైడ్గా వ్యవహరించాలని ఇన్స్బ్రక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. తీవ్ర నిర్లక్ష్యంతో నరహత్యకు పాల్పడ్డాడని, దోషిగా తేలితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దురదృష్టవశాత్తూ జరిగినవిషాదకరమైన ప్రమాదమని ప్లాంబర్గర్ న్యాయవాది వాదిస్తున్నాడు. ఈ కేసును 2026, ఫిబ్రవరి 19న, ఇన్స్బ్రక్ ప్రాంతీయ కోర్టులో విచారించ నున్నారు. గుర్ట్నర్ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆన్లైన్ స్మారక పేజీని ఏర్పాటు చేశారు. అద్భుతమైన మహిళ అంటూ కెర్స్టిన్ గుర్ట్నర్కు అనేకమంది నివాళులర్పించారు. పలు సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. -
ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!
హైదరాబాద్: గోవాకు వెళ్లిన ఓ జంట కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలను రహస్యంగా తీసి రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్న గోవాకు చెందిన ఓ వ్యక్తిపై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డకు చెందిన ఓ మహిళ (35) తన వివాహం కాకముందు 2023లో శ్రీనాథరావు అనే వ్యక్తితో కలిసి గోవాకు వెళ్లింది. వీరికి గోవాలోని యశ్వంత్ (40) అనే వ్యక్తి వసతితో పాటు ఇతర ఏర్పాట్లను చేశాడు. అదే సమయంలో ఆ జంట కలిసి ఉన్నప్పటి వీడియోలను రహస్యంగా తీశాడు. ఈ వీడియోలను భద్రపరిచిన యశ్వంత్ తాజాగా శ్రీనాథరావుకు ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇదిలా ఉండగా సదరు మహిళకు గత ఏడాది వేరొకరితో పెళ్లి జరిగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన బెదిరింపుల విషయాన్ని శ్రీనాథరావు ఆ మహిళ దృష్టికి తీసుకువచ్చాడు. భయాందోళనకు గురైన బాధితురాలు సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు యశ్వంత్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపినట్లు పోలీసులు తెలిపారు. -
న్యూయార్క్ మహిళపై ఆరోపణలు
న్యూయార్క్: కెనడా సరిహద్దుల మీదుగా అమెరికాలోకి భారత్ నుంచి దొంగచాటుగా తరలించేందుకు ప్రయతి్నస్తున్నదంటూ న్యూయార్క్కు చెందిన మహిళపై అధికారులు కేసు నమోదు చేశారు. పిట్స్బర్గ్కు చెందిన స్టేసీ టేలర్(42)కు అంతర్జాతీయ దొంగరవాణా ముఠాతో సంబంధాలున్నట్లు అక్టోబర్లో అధికారులు ఆరోపణలు చేశారు. ఈ వారంలో అల్బనీలోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఎదుట ఆమె హాజరు కావాల్సి ఉంది. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కెనడాలోని క్విబెక్, అమెరికాలోని చురుబుస్కో సమీపంలో ఈ ఏడాది జనవరిలో అమెరికా బోర్డర్ పెట్రోల్ అధికారులు స్టేసీ టేలర్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆ వాహనంలో నలుగురు విదేశీయులు ఉన్నట్లు గుర్తించామని బోర్డర్ పెట్రోల్ విభాగం ఆరోపించింది. నలుగురిలో ముగ్గురు భారత జాతీయులుగా కాగా, ఒకరు కెనడా వాసి అని వీరిని కెనడా నుంచి అమెరికాలోకి దొంగచాటుగా తీసుకువచ్చారని పేర్కొంది. స్టేసీ టేలర్ సెల్ఫోన్ను క్షుణ్నంగా పరిశీలించగా అందులో..అంతకుముందు కూడా ఆమె ఇలా పలుమార్లు అక్రమ రవాణాకు పాల్పడినట్లు తెలిపే టెక్ట్స్ మెసేజీలున్నాయని వివరించింది. ఇతరులతో కలిపి ఆమె స్మగ్లింగ్ రాకెట్ నడుపుతున్నారని అధికారులు ఆరోపించారు. ఈ ఆరోపణలు రుజువైతే స్టేసీకి కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. -
కేసు వాయిదా కోసం వచ్చి.. రేప్..! ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ?
-
ఎయిర్ పోర్ట్ సిబ్బందితో నైజీరియన్ మహిళ ఫైట్
-
అక్కడ మహిళల జనాభానే ఎక్కువ..! ఎందుకంటే..
మహిళల సంఖ్య తగ్గిపోతోంది, బ్రూణ హత్యలు పెరిగిపోతున్నాయి అంటూ గగ్గోలు పెడుతున్న గణాంకాలు గురించి విన్నాం. కానీ వీటన్నింటికి విరుద్ధంగా మహిళలు సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం గురించి విన్నారా..?. ఔను ఇది నిజం. అక్కడ మహిళల సంఖ్య ఎంతలా ఉందంటే..మొత్తం కార్యాలయాల్లో అంతా మహిళలే కనిపిస్తారు. కనీసం ప్లంబింగ్, వడ్రంగి పనులు వంటి వాటిల్లో కూడా మహిళలే ఉంటారు. అందుకు గల కారణం..?, ఫలితంగా మహిళలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే..లాట్వియాలో గణనీయమైన లింగ అసమతుల్యత ఎదుర్కొంటోంది. అక్కడ పురుషుల కంటే 15.5% ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఇది యూరోపియన్ యూనియన్లో సగటు అంతరం కంటే మూడు రెట్లు ఎక్కువ. 65 ఏళ్లు అంత కంటే ఎక్కువ వయసున్న పురుషులకు రెండింతలు మహిళలు ఉన్నారు. రోజువారి జీవితంలో పురుషుల కొరత చాలా ఘోరంగా ఉంటుందని వరల్డ్ అట్లాస్ పేర్కొంది. దాంతో అక్కడ మహిళ ఇంటి పనుల్లో సహాయం కోసం భర్తలను నియమించుకుంటున్నారట. అంటే అద్దెకు భర్తలను తెచ్చకుంటున్నారు. ఆ మహిళలంతా ఆన్లైన్లో ఒక గంటకు భర్తలను బుక్ చేసుకుంటారట అక్కడ మహిళలు. వారు ప్లంబింగ్, వడ్రండి,టెలివిజన్ ఇన్స్టాలేషన్ వంటి పనుల్లో సాయం అందిస్తారు. అంతేగాదు పెయింటింగ్, కర్టెన్లు ఫిక్సింగ్ వంటి ఇతర పనులు కూడా చేస్తారట. చాలామంది ఈ సేవలను వినియోగించుకోవడానికే మొగ్గు చూపిస్తారట. పురుషుల కొరతకు రీజన్దీనికి పురుషుల తక్కువ ఆయుర్దాయమే కారణమని చెబుతున్నారు. అధిక ధూమపాన రేటు, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరుగుతుందని పేర్కొన్నారు లాట్వియా నిపుణులు. వరల్డ్ అట్లాస్ ప్రకారం లాట్వియన్ పురుషులలో 31% మంది ధూమపానం చేస్తున్నారట. అదీగాక వారిలో చాలామంది అధిక బరువు సమస్యలను ఎదుర్కొంటున్నారట కూడా.ఫలితంగా అద్దెకు భర్తల ట్రెండ్ఇంతలా మగవాళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో భర్తలను అద్దెకు తీసుకునే ట్రెండ్వై పుకే మొగ్గు చూపుతున్నారట అక్కడ మహిళలు. ఇదేమీ కొత్తదికాదు ఎందుకంటే గతంలో యూకేలో లారా యంగ్ అనే మహిళ 2022లో "రెంట్ మై హ్యాండీ హస్బెండ్" అనే వ్యాపారం కింద తన భర్త జేమ్స్ను చిన్న చిన్న ఉద్యోగాలకు అద్దెకు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. (చదవండి: అమెరికా-భారత్కి మధ్య ఇంత వ్యత్యాసమా..!) -
ఫుల్లుగా తాగి.. యువతిని లాక్కెళ్లి మానభంగం
-
అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడా
బహుశా కథల్లో కూడా ఇలాంటి రాక్షసుల గురించి విని ఉండవేమో. ముద్దులొలికే చిన్నారులను దారుణంగా హత్య చేసిందో మహిళ. ఈ హత్యలకు కారణం తెలుసుకొని పోలీసులే నిర్ఘాంత పోయారు.హర్యానాలోని పానిపట్లోని ఒక గ్రామంలో బాజా భజంత్రీలు మోగుతున్న తరుణంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పెళ్లివేడుకకోసం అందంగా ముస్తామైన ఆరేళ్ల బాలికను దారుణంగా హత్య చేసింది. దీంతో బంధువులంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. జర్మన్ అద్భుత కథ స్నో వైట్లోని దుష్ట రాణిని మరపించిన పోలీసులు ఈ భయంకరమైన హత్యాకాండను ఛేదించారు.తన కంటే అందంగా ఉందనిపానిపట్లో తన మేనకోడలిని హత్య చేసింది పూనమ్ అనేమహిళ. తనకంటే ఎవరూ అందంగా కనిపించ కూడదనే కారణంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. బాధితురాలు విధిని నీటితొట్టిలో ముంచి ఆ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. అంతేకాదు పూనమ్ 2023లో తన కొడుకు దారుణంగా హతమార్చిందంటే ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు. హత్య ఎలా జరిగిందిసోనిపట్కు చెందిన విధి తన కుటుంబంతో కలిసి పానిపట్లోని ఇస్రానా ప్రాంతంలోని నౌల్తా గ్రామానికి బంధువుల వివాహానికి హాజరైంది. ఆమెతో పాటు ఆమె తాత పాల్ సింగ్, అమ్మమ్మ ఓంవతి, తండ్రి సందీప్, తల్లి, 10 నెలల తమ్ముడు వచ్చారు. పెళ్లిలో సీతాకోక చిలుకలా ముస్తామై, ఆనందంగా తిరుగుతున్న విధిపై పూనమ్ కన్నుపడింది. రాక్షసిలా మారిపోయింది.అకస్మాత్తుగా విధి అదృశ్యమైంది. విధి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి, కుటుంబం ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. దాదాపు గంట తర్వాత, విధి అమ్మమ్మ ఓంవతి వారి బంధువుల ఇంటి మొదటి అంతస్తులోని స్టోర్రూమ్కి వెళ్లింది. బైట గడియ వేసి వున్న ఆ గదిని తెరిచినప్పుడు, విధి తల నీటి తొట్టిలో మునిగిపోయి, కాళ్ళు పైకి తేలి ఉన్నాయి. హుఠాహుఠిన చిన్నారిని NC మెడికల్ కాలేజీకి తరలించారు. కానీ వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించారు. దీంతో విధి తండ్రి తరువాత కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితురాలు పూనమ్ విధికి అత్త అని తేలింది. ఆమెను అరెస్ట్ చేశారు.పిల్లలను చంపే విధానంపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూనమ్ తనకంటే అందంగా ఎవరూ కనిపించకూడదని కోరుకోవడంతో అసూయ ,ఆగ్రహంతో పిల్లలను నీటిలో ముంచి చంపే అలవాటు ఉంది. ప్రత్యేకంగా చిన్న, అందమైన అమ్మాయిలే ఆమెటార్గెట్ అని పోలీసులు తెలిపారు. ఇలా మొత్తంగా పూనమ్ నలుగురు పిల్లల్ని ముగ్గురు అమ్మాయిలతోపాటు తన కొడుకుని కూడా ఇలాగే చంపినట్లు అంగీకరించింది.2023లో, పూనమ్ తన వదిన కుమార్తెను చంపింది. అదే సంవత్సరం, అనుమానం రాకుండా ఉండటానికి ఆమె తన కొడుకును కూడా నీటిలో ముంచి చంపింది. ఈ సంవత్సరం ఆగస్టులో, పూనమ్ సివా గ్రామంలో మరో అమ్మాయిని హత్య చేసింది ఎందుకంటే వీరంతా తనకంటే 'అందంగా' కనిపించారట ఆమెకు. విధి హత్య కేసులో విచారణ సమయంలో పూనమ్ నిజం స్వరూపం బైటపడింది. ఆమె స్వయంగా ఈ హత్యలు చేసినట్టు ఒప్పుకుంది. అప్పటివరకు ఈ పిల్లల మరణాలు ప్రమాదవశాత్తు జరిగినట్లు భావించారు. ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతో -
ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతో
ధైర్యం, దృడ సంకల్పం, కృషి అన్నీ ఉన్నాయి. సాధించాలన్న పట్టుదలా మెండుగా ఉంది. కానీ ఫలితం కోసం ఎనిమిదేళ్లు నిరీక్షించింది. చివరికి ఆమె సంకల్పం, కల ఫలించింది. తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇంతకు ఏమిటా కల, ఆమె సాధించిన విజయం ఏమిటి? ఈ వివరాలు తెలియాలంటే ఈ స్ఫూర్తిదాయక కథనాన్ని తప్పకుండా చదవాల్సిందే.ప్రియాంక దల్వి పేదింటి బిడ్డ. ఆమె తండ్రి ఒక సాధారణ రైతు. ఆయన గుండె ఉప్పొంగేలా చేసిన ఆడబిడ్డ ప్రియాంక. నాన్నకిచ్చిన మాటను నెరవేర్చేందుకు ఎనిమిదేళ్లు కష్టపడింది. ఆ కల నిజమైన రోజు భావోద్వేగంతో కన్నీటి ప్రవాహమైంది. మహారాష్ట్రలో మహిళా & శిశు అభివృద్ధి శాఖలో అధికారిణి అయ్యింది. మారుమూల గ్రామంలో ఒక రైతుబిడ్డగా ఆమె సాధించిన ఈ విజయం నిజంగా స్ఫూర్తిదాయకం! View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) నవేఖేడ్ గ్రామంలో గుడ్డిదీపాల మధ్య మసక వెలుగులో చదువుకున్న ప్రియాంక మహారాష్ట్రను అగ్రస్థానంలో నిలిచింది. మహిళా & శిశు అభివృద్ధి శాఖలో అధికారి పదవిని సంపాదించింది. ఫలితాల రోజున, ప్రియాంక తల్లిదండ్రులు తమ కుమార్తె విజయానికి చూడటానికి వారి ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఫలితాలు రాగానే తండ్రిని గట్టిగా కౌగిలించుకుంది. ఇన్నేళ్ల పోరాటం నిశ్శబ్ద ప్రార్థనలు ఆమె కంట కన్నీరుగా ప్రవహించాయి. ఇదీ చదవండి: మాస్క్తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్ని ఎందుకు కలిశాడు? -
‘సుప్రీం’ ఆదేశం.. బంగ్లాదేశ్ గర్భిణికి ఉపశమనం
న్యూఢిల్లీ: భారత్ నుంచి బహిష్కృతురాలై బంగ్లాదేశ్కు చేరిన గర్భిణీ సోనాలి ఖాటూన్, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడికి సుప్రీంకోర్టు ఉత్తర్వుతో ఊరట లభించింది. న్యాయస్థానం ‘మానవతా దృక్పథం'తో తీసుకున్న ఈ నిర్ణయం.. చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న ఒక నిస్సహాయ కుటుంబానికి స్వాంతన కల్పించింది. సోనాలి ఖాటూన్ బంగ్లాదేశీయురాలైనప్పటికీ, ఆమె పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్లో నివసిస్తున్నారనే అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది.మానవతా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, వారిద్దరినీ తిరిగి తీసుకువస్తామని, వారిని నిఘాలో ఉంచి, ఉచిత వైద్య సహాయం అందిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును ప్రత్యేక దృష్టితో విచారించింది. ఒక గర్భిణీ పరిస్థితిని, ఆమె కుమారుడిని దృష్టిలో ఉంచుకుని, తల్లిదండ్రులు/తల్లి బిడ్డలను వేరు చేయకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కోర్టు నొక్కి చెప్పింది. ఈ ఉత్తర్వుతో సోనాలికి అవసరమైన వైద్య సంరక్షణతో పాటు ఆమె కుమారుడికి రోజువారీ సంరక్షణ అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.ఈ న్యాయపోరాటం సోనాలి తండ్రి భోడు సేఖ్తో ప్రారంభమైంది. తన కుమార్తె, అల్లుడు, మనవడిని మే 2025లో గుర్తింపు ధృవీకరణ డ్రైవ్ పేరుతో అక్రమంగా నిర్బంధించి, జూన్లో బంగ్లాదేశ్కు పంపించారని ఆయన ఆరోపించారు. తాను, తన కుటుంబ సభ్యులు పుట్టుకతో భారత పౌరులమని ఆయన వాదించారు. సెప్టెంబర్లో కలకత్తా హైకోర్టు వీరిని తిరిగి తీసుకురావాలని ఆదేశించినా, పౌరసత్వ ధ్రువపత్రాలు లేవనే కారణంతో ఆ తీర్పును సవాలు చేస్తూ, కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పౌరసత్వ రుజువులు చూపడంలో విఫలమైనప్పటికీ, తల్లి, బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న సానుకూల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్వాగతించింది. చట్టపరమైన నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, అత్యవసర సందర్భాల్లో మానవతా దృక్పథంపైచేయి సాధిస్తుందని ఈ కేసు నిరూపించింది.ఇది కూడా చదవండి: ‘20 ఏళ్లుగా చావులే లేవు’..‘సర్’ డేటాలో భారీ గోల్మాల్! -
తప్పు తెలిసీ మౌనం... నేరంగా మారిన ఇద్దరు మహిళలు
సాక్షి,హైదరాబాద్: నేరుగా తప్పు చేయడమే కాదు... తప్పు జరుగుతోందని, జరిగిందని తెలిసీ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. ఈ కారణంగానే జూబ్లీహిల్స్ ఠాణాలో నమోదైన పోక్సో, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఇరువురు మహిళలు నిందితులుగా మారారు. గత ఏడాది చోటు చేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు అధికారులు ఇటీవల కోర్టులో చార్జ్షిట్ దాఖలు చేశారు. ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) లైంగికదాడి చేసిన వ్యక్తి మాత్రమే నిందితుడిగా ఉండగా... అభియోగపత్రాల్లో మాత్రం ఆ విషయం తెలిసీ మిన్నకుండిపోయిన మహిళలూ నిందితులుగా మారారు.ఐదు రోజులు నిర్భంధించి ఘాతుకం..జూబ్లీహిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మహిళ వద్ద ఆర్. రాజిరెడ్డి అనే వ్యక్తి డ్రైవర్గా పని చేసేవాడు. అదే అపార్ట్మెంట్లో మరో మహిళ సెక్యూరిటీ గార్డుగా పని చేసేది. అదే ప్రాంతానికి చెందిన బాలికతో రాజిరెడ్డికి పరిచయం ఉండేది. అతను గత ఏడాది అక్టోబర్ 31న ఓ శుభకార్యానికి తీసుకువెళ్తానంటూ బాలికను కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో అతడి యజమాని సైతం వారితో ఉంది. వీరు సదరు బాలికను షాపింగ్కు తీసుకెళ్లి వ్రస్తాలు కొనిపెట్టారు. ఆపై అపార్ట్మెంట్కు తీసుకువచి్చన రాజిరెడ్డి రెండో అంతస్తులోని తన గదిలో నిర్భంధించి నవంబర్ 5 వరకు సదరు బాలికపై పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. విచారణలో చెప్పని ఆ ఇరువురూ..ఇదిలా ఉండగా... బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి గత ఏడాది అక్టోబర్ 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి పలువురిని విచారించగా ఎవరి నుంచి సరైన సమాచారం లభించలేదు. సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మహిళతో పాటు రాజిరెడ్డి యజమాని సైతం తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. ఐదు రోజుల నిర్భంధం తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక తన తల్లితో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు.అక్కడ అన్నీ చెప్పిన బాలిక..భరోసా కేంద్రంలో ఉన్న కౌన్సిలర్లు, అధికారులు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ ఐదు రోజుల్లో ఏం జరిగిందో చెప్పాల్సిందిగా కోరారు. దీంతో రాజిరెడ్డి తనను నిర్భంధించడంతో పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. తాను నిర్భంధంలో ఉండగా రాజిరెడ్డి యజమాని ఆహారం అందించిందని, ఆ అపార్ట్మెంట్కు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న మహిళకూ తన విషయం తెలుసని వెల్లడించింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నేరం జరిగినట్లు నిర్థారించారు. బాలిక మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా వీరు ఇరువురినీ ప్రశి్నంచినా నోరు విప్పకపోకపోవడాన్నీ సీరియస్గా తీసుకున్నారు. ఆ ఇద్దరినీ నిందితులుగా చేరుస్తూ..దీంతో బాలిక అదృశ్యం కావడంపై నమోదైన మిస్సింగ్ కేసులో పోక్సో యాక్ట్తో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్లనూ చేర్చారు. ఈ కేసులో రాజిరెడ్డి ఒక్కడే కాకుండా ఇద్దరు మహిళల్నీ నిందితులుగా చేర్చారు. బాలికపై దారుణం జరుగుతున్నా అడ్డుకోకపోవడం, జరిగిందని తెలిసీ బయటకు చెప్పకపోవడం నేరాలేనని దర్యాప్తు అధికారులు తేల్చారు. భారతీయ న్యాయ సంహితలోని (బీఎన్ఎస్) సెక్షన్ 211 (ఓ నేరానికి సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టడం), భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 33 (నేరం జరిగినట్లు తెలిసినా వెంటనే పోలీసు లేదా మేజిస్ట్రేట్కు చెప్పకపోవడం) కింద అభియోగాలు మోపారు.దర్యాప్తునకు సహకరించకున్నా దండనేఏదైనా నేరం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు లేదా మేజి్రస్టేట్కు సమాచారం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. నేరాల నిరోధంతో పాటు చట్టాల అమలుకు పాటుపడాలి. ఏదైనా నేరం జరిగిందని తెలిసీ మిన్నకుండిపోవడం నేరమే అవుతుంది. తమ కళ్ల ముందు నేరం జరిగితే నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించే అధికారమూ పౌరులకు ఉంటుంది. వివిధ నేరాలకు సంబంధించి కేసులు నమోదైనప్పుడు పోలీసులు కోరితే దర్యాప్తునకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. బీఎన్ఎస్ఎస్లోని 31, 33, 40 సెక్షన్లు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. అలా చేయకపోవడం కూడా నేరమే అవుతుంది. బీఎన్ఎస్లోని 211, 239లతో పాటు పోక్సో యాక్ట్లోని 19 సెక్షన్ ప్రకారం అభియోగాలు ఎదుర్కోవాల్సిందే.– పి.వెంకటగిరి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ -
ఒంటరిగా ఉంటున్న వదినపై కన్నేసి..!
తమిళనాడు: కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని కట్టుకుడలూర్ ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణన్ భార్య తమిళరసి (35). వీరికి ఇద్దరు కుమారులు హరికృష్ణన్ (13), హరిశక్తి (10) ఉన్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా గత 10 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారు. గోపాలకృష్ణన్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తమిళరసి తన ఇద్దరు కుమారులతో కలిసి తన భర్త తమ్ముళ్లయిన బాలకృష్ణన్, మురుగనాథం ఇంట్లో నివసిస్తోంది. ఈ స్థితిలో కొన్ని రోజుల క్రితం, బాలకృష్ణన్, మురుగానందం తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ తమిళరసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళపై అత్యాచారాల నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు మురుగానందాన్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బాలకృష్ణన్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బాలకృష్ణన్ తాగి ఇంటికి వచ్చాడు. తర్వాత తమిళరసితో గొడవ పడ్డాడు. తర్వాత తన వద్ద దాచిన కత్తితో తమిళరసి తలను నరికి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడే ఉన్న బాలకృష్ణన్ను అరెస్టు చేశారు. -
సూట్కేస్లో ఇన్ఫ్లుయెన్సర్ మృతదేహం
వియన్నా / స్లోవేనియా: వారం రోజులుగా అదృశ్యమైన ఆస్ట్రియన్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ స్టెఫానీ పైపర్ (31) విగతజీవిగా కనిపించింది. స్లోవేనియన్ అడవిలో ఒక సూట్కేస్లో ఆమె మృతదేహం లభ్యమైంది. దీనికి ముందు స్టెఫానీ పైపర్ మాజీ ప్రియుడు తన నేరాన్ని అంగీకరించి, పోలీసులను స్టెఫానీ మృతదేహాన్ని దాచిన ప్రదేశానికి తీసుకెళ్లినట్లు ఆస్ట్రియన్ అధికారులు తెలిపారు.పైపర్ కనిపించకుండా పోవడంతో కలకలం చెలరేగింది. క్రిస్మస్ పార్టీ తర్వాత స్నేహితులు ఆమెను చివరిసారిగా చూశారు. స్థానిక నివేదికల ప్రకారం పార్టీ ముగిశాక పైపర్ తన ఇంటికి చేరుకున్నట్లు స్నేహితులకు వాట్సాప్ సందేశం పంపింది. ఆ తర్వాత తన ఇంటి మెట్ల మార్గంలో ఎవరో తనను అనుసరిస్తున్నట్లు మరో సందేశాన్ని పంపింది. ఆస్ట్రియన్ వార్తాపత్రిక క్రోనెన్ జైటంగ్ నివేదిక ప్రకారం ఆమె మాజీ ప్రియుడు ఆమెను గొంతు కోసి చంపి, ఆపై మృతదేహాన్ని సూట్కేస్లో కుక్కి అడవిలో పడేశాడని పోలీసుల ముందు వెల్లడించాడు. పీపుల్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం ఆమె అదృశ్యమైన రోజున ఆమె మాజీ ప్రియుడిని భవనంలో చూసినట్లు స్థానికులు తెలిపారు.పైపర్ తప్పిపోయినట్లు ఫిర్యాదు అందిన వారం తర్వాత, ఆమె మాజీ ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రియన్ సరిహద్దు సమీపంలోని ఒక క్యాసినోలో అతని కారు మంటల్లో చిక్కుకున్న తరుణంలో పోలీసులు అతనిని పట్టుకున్నారు. అరెస్టు తర్వాత అతను నేరాన్ని అంగీకరిస్తూ, స్లోవేనియన్ అడవిలో మృతదేహాన్ని పడవేసిన ప్రదేశానికి పోలీసులను తీసుకెళ్లాడు. హత్యకు గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ప్రియుడితో పాటు, ఈ కేసులో అతని ఇద్దరు బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరంలో వారి ప్రమేయంపై సమాచారం ఇంకా తెలియరాలేదు.ఇది కూడా చదవండి: అణుశక్తి బిల్లు.. గేమ్ చేంజర్ అయ్యేనా? -
ఒంటరి మహిళపై ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం
-
ఒంటరిగా ఉంటున్నానని.. లక్షల్లో సంపాదిస్తున్నానని..
సాక్షి, హైదరాబాద్: కల్లబొల్లి మాటలతో వల వేసి.. కలిసి పెట్టుబడి పెడితే మంచి లాభాలంటూ ఊదరగొట్టిన సైబర్ నేరగాళ్లు ఓ డాక్టర్ నుంచి 60 రోజుల వ్యవధిలో రూ.14.61 కోట్లు కొల్లగొట్టారు. సీఎంసీ మార్కెట్స్ ట్రేడింగ్ పేరుతో ఈ మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు. బ్యాంక్ లావాదేవీలు, ట్రేడింగ్ లింకుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్కు చెందిన ప్రైవేట్ డాక్టర్ కె.మహేశ్వర్ రెడ్డికి ఆగస్టు 27న ఫేస్బుక్ మెసెంజర్లో మోనికా మాధవ్ పేరుతో ఫేస్బుక్ రిక్వెస్ట్ వచ్చింది. తను భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని తెలిపింది. విడాకుల కేసు కోర్టులో పెండింగ్ ఉందని నమ్మించింది. తనను తాను సీఎంసీ మార్కెట్స్ ట్రేడింగ్ ప్రతినిధిగా పరిచయం చేసుకుంది. చాటింగులు, షేరింగులతో వల వాట్సాప్, టెలిగ్రామ్లో చాటింగులు, షేరింగ్లు చేసింది. ఈ క్రమంలోనే సీఎంసీ ట్రేడ్ మార్కెట్లో రోజుకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పింది. తనతో కలిసి ఇన్వెస్ట్ చేయాలని సూచించింది. ఇదంతా సైబర్ నేరగాళ్లు చేస్తున్న పని అని డాక్టర్ గుర్తించలేకపోయారు. విడతల వారీగా పెట్టిన పెట్టుబడికి పదింతలు లాభాలని ఫేక్ యాప్లో చూపుతూ ఈ నెల 26వ తేదీ వరకు 60 రోజుల వ్యవధిలో మొత్తం రూ.14.61కోట్లు డాక్టర్ నుంచి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా విఫలమవడంతో తాను మోసపోయానని గుర్తించిన డాక్టర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు. టీజీ సీఎస్బీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ మంత్రి PA కీచకపర్వం.. పక్కలో పడుకోవాలంటూ హుకుం
-
‘పాదరసం’తో భార్య ప్రాణం తీశాడు
దొడ్డబళ్లాపురం: ఓ భర్త అత్యంత క్రూరంగా భార్యను హత్య చేశాడు. పాదరసం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా.. ఒక్కో అవయవం పాడయ్యేలా చేసి.. 9 నెలల పాటు నరకం చూపించి హతమార్చాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది. విద్య(37), బసవరాజు దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరు బెంగళూరులోని అత్తిబెలెలో నివసిస్తున్నారు. కొన్నాళ్లుగా భార్య, భర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో భార్యను ఎవరికీ అనుమానం రాకుండా అంతమొందించాలనుకున్న బసవరాజు.. ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో పని చేసే శ్వేత, ఆమె భర్త సాయంతో క్లోరోఫాం, పాదరసం, సిరంజిలు తీసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాత్రి బసవరాజు విద్యతో ప్రేమ గా మాట్లాడుతూ.. క్లోరోఫాం ఇచ్చాడు. కొంచెం మత్తులోకి జారుకున్నాక పాదరసం ఇంజెక్షన్ చేశాడు.మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన విద్యకు కుడి తొడ భాగంపై వాపు, విపరీతమైన నొప్పి వచ్చింది. అప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో మార్చి 7న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వారు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆమె శరీరాన్ని పాదరసం విషమయం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కొక్క అవయవం పాడవుతుండగా.. 9 నెలల పాటు నరకం చూసిన విద్య సోమవారం మరణించింది. తన భర్త, మామ కలిసి తనను హత్య చేసేందుకు పాదరసం ఇంజెక్షన్ ఇచ్చారని ముందుగా ఇచ్చిన వీడియో వాంగ్మూలంలో తెలిపింది. -
శవపేటికలో శబ్దాలు.. అసలేం జరిగిందంటే..
బ్యాంకాక్: అది బ్యాంకాక్ శివార్లలో నిశ్శబ్దం తాండవించే వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయం. అంత్యక్రియల కోసం వచ్చేవారితో రద్దీగా ఉండే ప్రదేశం. ఆ రోజు, ఆలయ జనరల్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే ఫిత్సనులోక్ ప్రావిన్స్ నుండి 500 కిలోమీటర్లు ప్రయాణించి ఒక వ్యక్తి 65 ఏళ్ల తన సోదరి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకొచ్చాడు.ఇంతలో శవపేటికలో శబ్దాలు వినిపించడంతో.. ఆలయ సిబ్బంది నిశ్చేషు్టలయ్యారు. లోపల కదులుతున్న వృద్ధురాలిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. బ్యాంకాక్ శివార్లలోని నాన్థాబురి ప్రావిన్స్లోని వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. అసలేం జరిగిందంటే.. ఆలయ జనరల్, ఫైనాన్షియల్ అఫైర్స్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్ మాట్లాడుతూ.. ‘రెండు రోజుల క్రితం ఒక వృద్ధురాలు ఊపిరి ఆగిపోయి, చనిపోయినట్లు కనిపించడంతో ఆమె సోదరుడు శవపేటికలో భద్రపరిచి తీసుకొచ్చాడు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరుగుతుండగా, శవపేటిక నుండి సన్నని శబ్దం వినిపించింది. నాకు కాస్త ఆశ్చర్యం వేసింది, అందుకే శవపేటిక తెరవమని కోరాను. ఆమె మెల్లగా కళ్లు తెరుస్తూ, శవపేటిక పక్కకు తడుతూ కనిపించింది. ఆమె చాలా సేపటి నుండి తడుతూ ఉందేమో’.. అని ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు.మరణ ధ్రువపత్రం లేక.. వాస్తవానికి, ఆ మహిళ గతంలోనే తన అవయవదానానికి సమ్మతించడంతో.. ఆమె సోదరుడు మొదట బ్యాంకాక్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ, అధికారిక మరణ ధ్రువపత్రం లేకపోవడంతో ఆసుపత్రి తిరస్కరించింది. అనంతరం వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయంలో ఉచిత దహన సంస్కారాలు చేస్తారని తెలిసి ఆదివారం శవపేటికను తీసుకురాగా, అక్కడ కూడా అదే ధ్రువపత్రం అడిగారు. ఆలయ జనరల్, ఫైనాన్షియల్ అఫైర్స్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్.. ఆ పత్రం గురించి వృద్ధురాలి సోదరునికి వివరిస్తున్నప్పుడే.. శవపేటికలో శబ్దం వినిపించింది.వెంటనే ఆలయ సిబ్బంది ఆమెను పరీక్షించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఖర్చులను తామే భరిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు ప్రకటించారు. చనిపోయిందనుకున్న మహిళ తిరిగి ప్రాణాలతో రావడం, ఆలయ సిబ్బందికి, ఆమె సోదరుడికి జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని మిగిల్చింది. -
షాంఘై ఎయిర్పోర్ట్లో మహిళకు వేధింపులు : చైనా రియాక్షన్ ఇదే
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా అధికారులు షాంఘై విమానాశ్రయంలో 18 గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన ఘటనలో చైనా స్పందించింది. షాంఘై విమానాశ్రయంలో భారతీయ మహిళను వేధించారనే ఆరోపణలను చైనా ఖండించింది. థాంగ్డోక్కు ఎదురైన అనుభవంపై స్పందన కోరగా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆ మహిళ ఆరోపించినట్లుగా ఎటువంటి తప్పనిసరి చర్యలు, నిర్బంధం లేదా వేధింపులకు లేవని పేర్కొన్నారు.లండన్ నుంచి జపాన్కు ప్రయాణిస్తున్నకి షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో భారతీయ మహిళలను అడ్డుకున్న దుమారం రేగిన ఒక రోజు తరువాత డ్రాగన్ కంట్రీ దీనిపై వివరణ ఇచ్చింది. నవంబర్ 21న లండన్ నుండి జపాన్కు ప్రయాణిస్తున్న యూకేకి చెందిన భారతీయ పౌరురాలు పెమా వాంగ్జోమ్ థాంగ్డాక్, పాస్పోర్ట్లో జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని పేర్కొనడంపై ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది తనను ఆపారని తెలిపింది. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీసుకున్న చర్యలు చట్టాలు , నిబంధనల ప్రకారం ఉన్నాయని పేర్కొంటూ ఈ సందర్భంగా వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. కాగా అరుణాచల్ చైనా భూభాగం అంటూ షాంఘైలో విమానంలో దిగిన థాంగ్లో పాస్పోర్ట్ను చూసిన చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం, కనుక ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదని వాదించి అవమానించి వేధింపులకు గురిచేశారు. తదుపరి విమానం ఎక్కకుండా, కనీసం ఆహారం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె థాంగ్డోక్ తన స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారతీయ కాన్సులేట్కు సమాచారం అందించింది. భారతీయ అధికారుల జోక్యం తర్వాత ఆమెను రాత్రి ఆలస్యంగా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. -
అరుణాచల్ ప్రదేశ్ మాది..!
అరుణాచల్ ప్రదేశ్.. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి. అయితే చైనా మాత్రం అరుణాచల్ ప్రదేశ్పై ఎప్పటికప్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. మనతో స్నేహం అంటూనే భారతదేశంలో సూర్యుడు ఉదయించే తొలి ప్రాంతం అరుణాచల్ను తరచు తమది అంటోంది. తాజాగా వారి అరాచకం మరోసారి బయటపడింది. యూకేలో ఉంటున్నభారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆమె పాస్పోర్ట్పై అరుణాచల్ప్రదేశ్-భారతదేశం అని ఉండటంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాలో బాగమని ఆమెతో వాదించారు. ఆ పాస్పోర్ట్ చెల్లదు అంటూ తీవ్ర అసహనానికి గురిచేశారామెను. పెమా వాంఘజామ్ థోంగ్డాక్ అనే లండన్ నుంచి జపాన్కు వెళ్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. మధ్యంతర విరామంలో భాగంగా చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్లో మూడు గంటలు పాటు వేచి ఉన్న ఆమెకు.. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. పాస్పోర్ట్ కౌంటర్లో అరుణాచల్ ప్రదేశ్-భారత్ అని ఉందేంటని ప్రశ్నించారు. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ భాగమని ఆమె వాదించగా, కాదంటూ వారు వాగ్వాదానికి దిగారు. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమంటూ వితండ వాదం చేశారు. మూడు రోజుల క్రితం అంటే నవంబర్ 21వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె.. జాతీయ వార్త సంస్థ ఇండియా టుడేకి స్పష్టం చేసింది. తనను చైనా అధికారుల ఎంతటి వేధింపులకు గురి చేశారో వెల్లబుచ్చింది. గత ఏడాది తాను చైనా మీదుగా ప్రయాణించినా ఎటువంటి ఇబ్బంది రాలేదని, అలాగే లండన్లో ఉన్న చైనా ఎంబాసీ కూడా ఎప్పుడూ తనను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. తాజాగా ఎదురైన అనుభవంతో తాను షాక్కు గురైనట్లు ఆమె వాపోయింది. ఈ కారణంగా తాను కేవలం కొంత పరిధి వరకే పరిమితమయ్యానని, టికెట్లను రీబుక్ చేసుకోలేకపోయానని, భోజనం కూడా కొనలేకపోయానని, ఆఖరకు టెర్మినల్స్ మధ్య కదలడానికి కూడా వీల్లేకుండా పోయిందని తెలిపింది. చైనా ఈస్టర్న్లో ప్రత్యేకంగా కొత్త టికెట్ కొనాలని అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని, అలా చేసిన తర్వాతే తన పాస్పోర్ట్ తిరిగి ఇస్తామన్నారని పేర్కొంది. దీనివల్ల పలు ఆటంకాలు ఏర్పడి ఆర్థిక నష్టం చవిచూడాల్సి వచ్చిందన్నారు. చివరకు లండన్లో ఉన్న తన ఫ్రెండ్ సాయంతో షాంఘైలో ఉన్న బారత ఎంబాసీని కలిశానని, ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో తాను చైనాను వీడి వెళ్లే అవకాశం దక్కిందన్నారు. ఇదొక భయానక ఘటనగా ఆమె అభివర్ణించారు.ఇదీ చదవండి: మీరు మాకు చెప్పాల్సింది: ప్రధాని మోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడుసరిహద్దులు మారొచ్చు.. రాజ్నాథ్ సింగ్ -
యూనిఫామ్ వేసి బందోబస్తు డ్యూటీ చేసిన యువతి
హైదరాబాద్: పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన ఓ యువతి.. తానే పోలీస్ అని తప్పుదోవ పట్టించింది. విషయం తెలియడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. షాపూర్నగర్కు చెందిన ఓ యువతి (22) పోలీస్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగం రాకపోవడంతో తాను పోలీస్ అని అందరిని నమ్మించాలని అనుకుంది. అందుకు తగ్గట్టుగానే యూనిఫామ్ ధరించి పలుచోట్ల ఎవరికీ అనుమానం రాకుండా బందోబస్తు డ్యూటీ సైతం చేసింది. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి వద్ద కూడా 10 రోజుల బందోబస్తు డ్యూటీ చేసిందట. ఈ విషయం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు తెలియడంతో వారు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ దీనిపై విచారించి..ఆ యువతిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రైలు ఏసీ కోచ్లో మ్యాగీ : వీడియో వైరల్, నెటిజన్లు ఫైర్
కుటుంబాలతో కలిసి రైల్లో ప్రయాణించేటపుడు ఎక్కువ ఫుడ్ను ఆస్వాదిస్తాం. పులిహోర, దద్జోజనం, పూరీలు చికెన్, స్వీట్ పూరీలు, చపాతీలు, బిర్యానీ , టీ-కాఫీ వరకు రకరకాలుగా ముందే ప్రిపేర్ చేసుకుని వెళ్లి, రైలు బోగీలో తింటూ ఉండే అదో ఆనందం. ముఖ్యంగా పిల్లలు ఇలాంటి జర్నీలను బాగా ఎంజాయ్ చేస్తారు. మారు మాట్లాడకుండా, మారం చేయకుండా చక్కగా తింటారు. మరో విధంగా చెప్పాలంటే ఇదొక మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. అయితే మరికొంతమంది వేడి వేడిగా తినడానికి ఇష్టపడతారు. అయితే రైల్వే క్యాంటీన్లో ఆర్డర్ చేసకుంటాం. లేదంటే రైలు ఆగినపుడు ఆయా స్టేషన్లలో కొనుక్కుంటాం. కానీ మహారాష్ట్ర మహిళ చేసిన పని గురించి తెలుసుకుంటే అవాక్కవుతారు. పదండి ఆ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఇదీ చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ ఏకంగా ఏసీ రైలు బోగీలోనే మ్యాగీ తయారు చేసింది. రైలు ఏసీ కంపార్ట్మెంట్లోని చార్జింగ్ సాకెట్లో ఎలక్ట్రిక్ కెటిల్ పెట్టి కెటిల్లో ఇన్స్టంట్ నూడుల్స్ ప్రిపేర్ చేసింది పైగా కెమెరాకు చక్కగాఫోటోలకు పోజులిచ్చింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రైలులో మ్యాగీ వేడిగా వడ్డిస్తే తినడం బాగానే ఉంటుంది, కానీ సేఫ్టీ పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు మినిమం సెన్స్ లేదు, ఇలా చేస్తే చాలా ప్రమాదకరం కదా అని కమెంట్ చేశారు. రైలులోని ఎలక్ట్రికల్ సర్క్యూట్పై అదనపు భారం పడి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని మరికొందరు హెచ్చరించారు. This is a major safety hazard and can cause fire endangering lives of all onboard. That's why we cannot have good things. Many will misuse the facilities and then be proud of it. Most lack civil sense. pic.twitter.com/JSRCpIXPW9— Backpacking Daku (@outofofficedaku) November 20, 2025"చాలా ఏళ్ల క్రితం, చెన్నై నుండి టాటానగర్కు రైలులో వెళుతుండగా, ఒక కుటుంబం పూజ చేసి అగర్ బత్తి, కర్పూరం వెలిగించింది. నేను వెంటనే టీసీకి ఫిర్యాదు చేశాను ఈ రోజుల్లో జనానికి బుద్ధి లేదు. ఇలాంటి పిచ్చి పనులు మానడం లేదు.’’ అంటూ గతంలో తనకు ఎదురైన అనభవాన్ని షేర్ చేశారొకరు. డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నంత మాత్రాని, మొత్తం ప్రయాణికుల ప్రాణాల్ని ఫణంగా పెట్టే పనులు చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. -
జస్ట్ నాలుగు నెలల్లో..24 కిలోల బరువు..! ఈ సింపుల్ డైట్ ప్లాన్తో..
వెయిట్లాస్ జర్నీలో కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఎంతలా అంటే.. ఎలాంటి క్రాష్ డైట్లు పాటించకుండా ఆరోగ్యకరమైన రీతీలో ఏదో మాయ చేసినట్లుగా అమాంతం స్లిమ్గా మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఇక్కడ అలానే జాహ్నవి అనే మహిళ ఎంత అద్భుతంగా బరువు తగ్గిందంటే..చాలా తక్కువ సమయంలోనే అధిక బరువుని కోల్పోయింది. అదికూడా ఆరోగ్యకరమైన పద్ధతిలోనే తగ్గడం విశేషం. అదెలాగో ఆమె మాటల్లోనూ సవివరంగా తెలుసుకుందామా..!.జాహ్నవి అనే మహిళ వెయిట్ లాస్ జర్నీలో అందరికీ స్ఫూర్తి అంటూ ఫిట్నెస్ నిపుణుడు మాక్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. అంతేగాదు త్వరిగతిన ఫలితాలు పొందాలనుకునేవారికి ఆమె ప్రేరణ అని పోస్ట్లో పేర్కొన్నారు. బరువు తగ్గడం అనేది కాస్త కఠినమైన టాస్క్ అయినా..క్రమశిక్షణ, డెడికేషన్ ఉంటే..ఈజీగా బరువు తగ్గిపోవచ్చట. ముందుగా ఈ వెయిట్లాస్ జర్నీలో ప్రతిఒక్కరికి స్థిరత్వంతో కూడిన అంకితభావం ప్రధానమని..నొక్కి చెబుతోంది జాహ్నవి. తాను 94 కిలోల మేర అధిక బరువు ఉండేదాన్ని..జస్ట్ నాలుగు నెలల్లోనే 24 కిలోలు వరకు తగ్గిపోయానని పేర్కొంది. పైగా తన డైట్ ఎలా ప్లాన్ ఎలా ఉండేదో కూడా వివరించింది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉసిరి కాయ రసం, ఐదు బాదం పప్పులు, అజ్వైన్(క్యారమ్ గింజలు), దాల్చిన చెక్క నీరు, నానబెట్టిన వాల్నెట్స్, మెంతినీరు తప్పనిసరిగా తీసుకుంటానని అంటోంది. బ్రేక్ఫాస్ట్ రొటీన్ (ఉదయం 8)అల్పాహారం కోసం, జాహ్నవి మిల్లెట్ దోస, చియా సీడ్ స్మూతీ, పెసరపప్పుతో చేసే ఇడ్లీ తింటానంటోంది.మిడ్-మార్నింగ్ రొటీన్ (ఉదయం 11)ఈ సమయంలో, ఫిట్నెస్ ప్రియురాలు సీజనల్ పండ్లు, ఫ్రూట్ స్మూతీ, రాగి (ఫింగర్ మిల్లెట్) మాల్ట్ను ఆశ్రయించింది.లంచ్ రొటీన్ (మధ్యాహ్నం 2)ఆమె లంచ్ మెనూలో బియ్యం, కూరగాయల కూర, పెరుగు, లేదా మిల్లెట్ పులావ్, మిశ్రమ కూరగాయలు, రైతా వంటి సరళమైన వంటకాలు ఉన్నాయి.స్నాక్ రొటీన్ (సాయంత్రం 4)స్నాక్స్ కోసం, జాహ్నవి తనకు తానుగా ఉడికించిన గుడ్డు, భెల్(మరమరాలు), నల్ల చన్నా (సెనగలు) చాట్ తీసుకున్నట్లు తెలిపింది.డిన్నర్ రొటీన్ (రాత్రి 7)ఆమె తన విందును ముందుగానే ముగించేదాన్ని అంటోంది. ఆమె ఆహారంలో కూరగాయలతో ఉడికించిన చికెన్, గుడ్డు ఆమ్లెట్, కూరగాయల కూరతో మిల్లెట్ రోటీ ఉన్నాయి.పడుకునే ముందు (రాత్రి 9)పడుకునే ముందు, జాహ్నవి హెర్బల్ టీ లేదా పుదీనా, కొత్తిమీర నీరు వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకున్నట్లు తెలిపింది. ఇలా కేర్ఫుల్గా తీసుకునే డైట్పై ఫోకస్ పెడితే.. హెల్దీగా బరువు తగ్గడం ఏమంత కష్టం కాదని అంటోంది జాహ్నవి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: అత్యుత్తమ చికెన్ రెసిపీ జాబితాలో బటర్ చికెన్కి చోటు..! ఎన్నో స్థానంలో ఉందంటే..) View this post on Instagram A post shared by Fitelo | Customised Diet Plans (@fitelo_tamil) -
చిత్తూరు కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం
చిత్తూరు కలెక్టరేట్: తమ పొలానికి దారి ఇవ్వడంలేదని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ఒక మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు ఆమె చేతిలోని పురుగుమందు డబ్బా లాగేయడంతో ప్రాణాపాయం తప్పింది. వి.కోట మండలం మిట్టూరు గ్రామానికి చెందిన నందిని తమ పొలానికి దారి సమస్యను పరిష్కరించాలని పీజీఆర్ఎస్లో వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్కు వచి్చంది. ఈ సందర్భంగా వి.కోట రెవెన్యూ అధికారులు తమ సమస్యను తీర్చడం లేదంటూ పురుగుమందు తాగింది.పోలీసులు పురుగుమందు డబ్బాను లాగేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ‘కలెక్టర్ సార్ని రమ్మని చెప్పండి మాట్లాడాలి. వి.కోట తహసీల్దార్, వీఆర్వోల వద్ద న్యాయం లేదు సర్. నాకు న్యాయం కావాలి. మా దగ్గర న్యాయం ఉంది ఎవరూ పట్టించుకోవడం లేదు. మేం పక్కా టీడీపీ కార్యకర్తలం’ అంటూ బిగ్గరగా అరిచి మరీ చెప్పింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గం పక్కనే ఉన్న పలమనేరు నియోజకవర్గంలోని మిట్టూరులో నందిని నివసిస్తున్నారు. గ్రామంలోని సర్వే నంబరు 223లో ఉండే పొలానికి చుట్టుపక్కలవారు దారి సమస్య సృష్టిస్తుండడంతో న్యాయం చేయాలని 17 నెలలుగా మండల రెవెన్యూ కార్యాలయంలోను, కలెక్టరేట్లోను వినతిపత్రాలు ఇచ్చారు.సమస్య పరిష్కరించాలంటూ వీఆర్వోని, వి.కోట తహసీల్దారును అనేకసార్లు కోరినా ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో తమ సమస్యను ఎవరూ పట్టించుకోరంటూ మనస్తాపం చెంది ఆమె సోమవారం కుటుంబీకులతో కలెక్టరేట్కు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. నందినిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ విషయమై మిట్టూరు వీఆర్వో నవీన్ను సంప్రదించగా.. తనకు రెండువారాల కిందటే అదనపు బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. రీసర్వే పనుల ఒత్తిడిలో దానిపై ఫోకస్ పెట్టలేదని, క్షేత్రస్థాయిలో పరిశీలించలేదని తెలిపారు. వాస్తవంగా బాధితురాలి భూమికి చుట్టూ సెటిల్మెంట్ భూమి ఉందని, దారి ఇచ్చేందుకు వారు ఒప్పుకోవడం లేదని చెప్పారు. -
ఆర్బీఐ, సీబీఐ అంటూ.. 6 నెలల్లో రూ. 32 కోట్లు!
డిజిటల్ అరెస్ట్ స్కామ్లో బెంగళూరుకు చెందిన ఒక మహిళ దారుణంగా మోసపోయింది. సైబర్ క్రైమ్ విభాగం, ఆర్బీఐ, సీబీఐ అంటూ నెల రోజులు పాటు వేధించి కోట్ల రూపాయలను దోచుకున్నారు.బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ ‘‘డిజిటల్ అరెస్ట్" స్కామ్లో చిక్కుకుంది. నెల రోజులపాటు ఆమెను వర్చువల్ కస్టడీకి పరిమితం చేశారు సైబర్ నేరగాళ్లు. కొరియర్ DHL సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సీనియర్ అధికారులం అంటూ నమ్మించి భయ భ్రాంతురాల్ని చేశారు.నవంబర్ 14న దాఖలు చేసిన FIR ప్రకారం 2024 సెప్టెంబర్ 15న ఆమెకు ఒక కొరియర్ వచ్చినట్టు వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ముంబైలోని అంధేరి నుండి ఆమె పేరు మీద బుక్ చేసుకున్న ప్యాకేజీలో నాలుగు పాస్పోర్ట్లు, మూడు క్రెడిట్ కార్డులు , MDMA వంటి నిషేధిత వస్తువులు ఉన్నాయని చెప్పాడు. అయితే తాను ముంబైకి ప్రయాణించలేదని మొత్తుకుంది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఇది సైబర్ క్రైమ్ కేసు కిందికి వస్తుందని భయపెట్టారు. ఏంజరిగిందో ఆలోచించుకునే లోపే సీబీఐ అధికారులు అంటూ మరో కాల్ వచ్చింది. మీరు పెద్ద నేరమే చేశారు, మిమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించారు. దీనికి సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు . అంతేకాదు దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకూడదని కూడా హెచ్చరించారు. రెండు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. దుర్భాషలాడారు. ఆమె ఫోన్ యాక్టివిటీ , లొకేషన్ గురించి తెలుసని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే తాము చెప్పినట్టు చెయ్యాలని పట్టుబట్టారు. నకిలీ సీబీఐ ఆఫీసర్లు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నకిలీ లేఖలను కూడా సమర్పించారు. స్కైప్ ద్వారా రోజువారీ నిఘాలో ఉంచారు. దీంతో కుటుంబ భద్రతకు భయపడి, బాధితురాలు ఆమె అడిగిన డబ్బును చెల్లించేందుకు ఒప్పుకుంది.దీన్నుంచి బయట పడాలంటే RBI కింద ఉన్న ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) ద్వారా ధృవీకరణ కోసం ఆమె ఆస్తులు, బ్యాంకు ఖాతాలను వివరాలను సమర్పించడం ఒక్కటే ఏకైక మార్గమని చెప్పారు. చెప్పబడింది. సెప్టెంబర్ 24-అక్టోబర్ 22, 2024 మధ్య అన్ని బ్యాంకు వివరాలను అందజేసింది. ఈ ఆస్తులకు 90 శాతం క్లియరెన్స్ కావాలంటే కొంత సొమ్మును డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత దీనికి అదనంగా రూ. 2 కోట్లు పూచీకత్తుగా డిపాజిట్ చేయాలని, పన్నులు ఇంకొంత సొమ్మును లాక్కున్నారు. ఇలా మొత్తంగా, 187 లావాదేవీల్లో ఆ మో రూ. 31.83 కోట్ల విలువైన డబ్బును బదిలీ చేసింది. ఈ స్కామ్ ప్రధానంగా ఆమె మొబైల్ నంబర్కు కాల్స్, నిరంతర పర్యవేక్షణ ద్వారా జరిగింది.డిసెంబర్ 1 ఆమెకు నకిలీ క్లియరెన్స్ లెటర్ వచ్చింది. దీంతో డిసెంబర్ 6న ఆమె కొడుకు నిశ్చితార్థాన్ని కార్యక్రమాన్ని ముగించింది. కానీ విపరీతమైన మానసిక, శారీరక ఒత్తిడికి లోనైంది. ఫలితంగా నెలరోజుల పాటు అనారోగ్యానికి గురైంది. 2025 ప్రారంభం దాకా స్కామర్ల దందా కొనసాగింది. అడిగిన ప్రతీసారి డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి వచ్చేస్తామని హామీ ఇస్తూనే వచ్చారు. చివరికి 2025 మార్చిలో అకస్మాత్తుగా వారి మొత్తం కమ్యూనికేషన్ బంద్ అయింది. ఒక వైపు తన అనారోగ్యం, మరోవైపు కొడుకు పెళ్లి, కారణంగా ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పాక్లో పంజాబ్ మహిళ అదృశ్యం
న్యూఢిల్లీ: గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా ‘ప్రకాశ్ పుర్బ్’ వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్కు వెళ్లిన భారత్లోని పంజాబ్కు చెందిన ఒక మహిళా యాత్రికురాలు తిరిగి రాలేదు. సర్బ్జిత్ కౌర్గా గుర్తించిన ఈ మహిళ పంజాబ్లోని కపుర్తలా జిల్లాలోని అమానిపూర్ గ్రామానికి చెందినది. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పంజాబ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.సర్బ్జిత్ కౌర్ 2025, నవంబర్ 4న అట్టారి-వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్కు చేరుకున్నారు. ఆమె 1,900 మందికి పైగా సిక్కు సభ్యులతో కూడిన ‘జాతా’ (తీర్థయాత్ర సమూహం)లో భాగంగా వెళ్లారు. ఈ బృందం గురుద్వారా నంకనా సాహిబ్లో ప్రార్థనలు నిర్వహించేందుకు, ఇతర చారిత్రక సిక్కు మందిరాలను సందర్శించేందుకు 10 రోజుల యాత్రకు వెళ్లింది. అయితే గురువారం రాత్రి ఈ బృందం భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, సర్బ్జిత్ కౌర్ వారిలో లేరు. ఆమె తిరిగి రాకపోవడాన్ని గుర్తించిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. #WATCH | Kapurthala, Punjab | Station House Officer (SHO) of Talwandi Chaudhrian, Nirmal Singh says, "Sarbjit Kaur, a resident of Amanipur village in Kapurthala, was part of the jatha which went to Nankana Sahib, Pakistan. She did not return. The police are conducting an… pic.twitter.com/fPpMWzjcuK— ANI (@ANI) November 14, 2025ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. తల్వాండి చౌదరియన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)నిర్మల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కపుర్తలాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే దీనిపై కేసు నమోదయ్యిదన్నారు. భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు కౌర్ కుటుంబ సభ్యుల నుంచి, ఆమె గ్రామం నుంచి మరింత సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె అదృశ్యం వెనుక కారణాలు, ఆమె పాకిస్తాన్లో ఉండిపోయారా? లేదా మరేదైనా జరిగిందా? అనే కోణాల్లో పోలీసు దర్యాప్తు జరుగుతోంది.గురువారం తిరిగి వచ్చిన ఈ యాత్రికుల బృందం ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్కు వెళ్లిన మొదటి ‘జాతా’ కావడం గమనార్హం. గతంలో పలు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాకిస్తాన్కు ప్రయాణ ఆంక్షలు విధించింది. గత జూన్లో మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతికి సిక్కులు పాకిస్తాన్ను సందర్శించకుండా నిషేధించారు. సుమారు రెండు వారాల నిరాకరణ తర్వాత, అక్టోబర్ రెండున కేంద్ర ప్రభుత్వం ఈ తీర్థయాత్రకు అనుమతి ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేయడంతో, ప్రస్తుతం భారత పౌరులు మాత్రమే అట్టారి సరిహద్దు ద్వారా ప్రయాణించగలుగుతున్నారు. ఈ కఠిన నిబంధనల మధ్య యాత్రికురాలు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’ -
మంత్రిగారూ.. న్యాయం చేయండి
శ్రీకాకుళం జిల్లా: ‘అచ్చెన్నాయుడు గారూ... మాకు న్యాయం చేయండి. నా భర్త కట్టిన ఇంటిని ఆడపడుచు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. దీనికి అధికారులు, మీ నేతలే సహకరిస్తున్నారు’ అంటూ బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద రోడ్డుపై ఓ మహిళ తన కుమార్తె, తల్లితో నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళితే... టెక్కలి ఎన్టీఆర్ కాలనీకి చెందిన దేబారికి సంధ్య కొద్దిరోజుల క్రితం భర్తతో పాటు అత్తమామలను కోల్పోయింది. తమ సొంత డబ్బుతో నిర్మించుకున్న ఇంటిని ఆడపడుచు ఆక్రమించుకుని దౌర్జన్యానికి పాల్పడుతోందని బాధితురాలు సంధ్య వాపోయారు. ఇదే విషయమై పోలీసులను ఆశ్రయించినా న్యాయం చేయడం లేదని, కొంతమంది టీడీపీ నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కలగజేసుకుని తక్షణమే న్యాయం చేయాలని, లేకపోతే కుమార్తె సహా ఆత్మహత్యే శరణ్యమంటూ బోరున విలపించారు. -
మహిళపై టీచర్ అత్యాచార యత్నం
-
చంద్రకళ జీవితంలో చీకట్లు నింపిన టీడీపీ నాయకుడు
ఆమె పేరులో ఉన్న ‘కళ’ను జీవితంలో లేకుండా చేశారు. వేధించి, దాడి చేసి, అవమానపరచి జీవచ్ఛవంలా మార్చేశారు. ఇంత జరిగినా వారి ఆక్రోశం మాత్రం చల్లారలేదు. ఇంకా వేధిస్తూనే ఉన్నారు. కాస్త దయ చూపమంటూ ‘పెద్ద’లను ఆశ్రయిస్తే పట్టించుకోలేదు.. సరికదా వెక్కిరిస్తున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన ఖాకీలు దాడి చేసిన వారికే వత్తాసు పలుకుతుండడంతో బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అనంతపురం: కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డే కాలనీకి చెందిన చంద్రకళ, చిన్నా దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం కాగా, కుటుంబం సంతోషంగా జీవనం సాగించేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రకళపై స్థానిక టీడీపీ నాయకుడు రామాంజినేయులు కన్నుపడింది. కోరిక తీర్చాలంటూ వెంటపడడం ప్రారంభించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పద్ధతి మార్చుకోవాలంటూ రామాంజినేయులును చంద్రకళ హెచ్చరించింది. విషయం తెలుసుకున్న రామాంజినేయులు కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. రామాంజినేయులు భార్య లక్ష్మీ , బంధువులు గాయత్రి, రామకృష్ణ, శిరీష, రమేష్ కలిసి చంద్రకళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపైనా దాడి చేశారు. విషయంపై బాధితులు కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. జరిగిన అవమానంతో మనస్తాపానికి గురైన చంద్రకళ ఎనిమిది నెలల క్రితం ఇంట్లో యాసిడ్ తాగింది. జీవచ్ఛవంలా.. కుటుంబ సభ్యులు వెంటనే చంద్రకళను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళ్లారు. దాదాపు 8 నెలలు వెంటిలేటర్పై కొట్టుమిట్టాడిన చంద్రకళ ప్రాణం ఎలాగోలా నిలిచింది. అయితే, అప్పటికే ఆస్పత్రిలో చికిత్సల కోసం బాధిత కుటుంబం రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేసింది. దొరికిన చోటల్లా అప్పు చేసి, ఉన్నవన్నీ కుదువ పెట్టి డబ్బు సమకూర్చారు. అయితే, ఇంకో రూ. 8 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పడంతో దిక్కుతోచలేదు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో చేసేది లేక ఇంటికి తిరిగి వచ్చారు. దాతల కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రకళ ప్రస్తుతం నేరుగా ఆహారం తీసుకోలేకపోతోంది. బాగా చిక్కిపోయి జీవచ్ఛవంలా బతుకీడుస్తోంది. పొట్ట భాగంలో రంధ్రం చేసి పైపు ద్వారా ద్రవ పదార్థాలు అందిస్తున్నారు. అలా చేస్తేనే సాయమట! ఇటీవల బాధితురాలి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఆశ్రయించారు. అయితే, బాధితులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులని తెలుసుకున్న ఆయన.. టీడీపీలోకి వస్తే వైద్య ఖర్చులకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు బాధిత కుటుంబసభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యత్నించగా ‘మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టుకోండి’ అంటూ టీడీపీ నేతలు కించపరిచేలా మాట్లాడారని చంద్రకళ కుటుంబ సభ్యులు వాపోయారు. పట్టించుకోని పోలీసులు.. చంద్రకళ ఫిర్యాదు చేసిన సమయంలో పట్టించుకోని పోలీసులు.. ఆమె యాసిడ్ తాగాక అప్రమత్తమై టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి, గంటలోపే స్టేషన్ బెయిల్ ఇచ్చి నిందితులను పంపించేయడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ప్రశి్నస్తే.. తమకు ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని, విసిగించకుండా వెళ్లిపోవాలంటూ హెచ్చరించారని వారు వాపోతున్నారు. ఆగని వేధింపులు... తమ పార్టీ నాయకులపై పెట్టిన కేసుకు సంబంధించి చంద్రకళ కుటుంబీకులపై ఇటీవల టీడీపీ నాయకులు వేధింపులకు దిగుతున్నట్లు తెలిసింది. కేసు రాజీ కావాలంటూ టీడీపీ నేతలు తిమ్మరాజు, వైపీ రమేష్ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. చెప్పినట్లు వినకుంటే మీరే దాడి చేశారంటూ ఫిర్యాదు చేయించి మీపైనే కేసు నమోదు చేయిస్తామని వేధిస్తుండడంతో బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.కాపాడండి.. నా కుమార్తెపై టీడీపీ నాయకులు కక్ష సాధిస్తున్నారు. వారు ఎలా చెబితే అలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నా కుమార్తె జీవితం చిన్నాభిన్నమైంది. అయినా టీడీపీ నేతలు, పోలీసులు వేధింపులు ఆపడం లేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు. దయ ఉన్న మారాజులు స్పందించి నా కుమార్తె ఆస్పత్రి ఖర్చులకు సాయం చేయాలని చేతులు జోడించి కోరుతున్నా. – బయన్న, చంద్రకళ తండ్రి -
డాడీ ఇది నా చివరి కోరిక..
జనగామ జిల్లా: హాస్టల్ భవనంపై నుంచి దూకి యువతి (ప్రైవేట్ ఉద్యోగి) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. ఎస్సై చెన్నకేశవులు, స్థానికుల వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామానికి చెందిన వి.మౌనిక జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ షోరూంలో పని చేస్తోంది. రాత్రి హాస్టల్కు వచ్చిన ఆమె తెల్లవారుజామున హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. రెండు కాళ్లు విరిగి, తీవ్రగాయాల పాలైన మౌనికను సహచరులు, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాడీ ఇది నా చివరి కోరిక..ఘటనా స్థలంలో మౌనిక వద్ద ఉన్న సూసైడ్ నోట్ను ఎస్సై చెన్నకేశవులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మౌనిక.. ‘డాడీ నా గురించి తప్పుగా అనుకోకు. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. ఎవరినీ ఏమనొద్దు. నా మరణం వల్ల ఎవరూ ఇబ్బంది పడవద్దు.. ఇదే నా చివరి కోరిక’అంటూ అందులో పేర్కొంది. అమ్మ, డాడీ, గణేశ్ గుడ్ బాయ్, టేక్ కేర్ ఆల్, ఐ లవ్ యూ నాన్న అని రాసి హాస్టల్ భవనంపై నుంచి దూకగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఘటనపై ప్రాథమిక వివరాలు తీసుకున్నామని, కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు వచి్చన వెంటనే దర్యాప్తు చేస్తామని ఎస్సై చెన్నకేశవులు తెలిపారు. -
మహిళ కాళ్లపైకి ఎక్కిన పవన్ కళ్యాణ్ కారు
-
పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశ్రుతి
సాక్షి, చిత్తూరు జిల్లా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముసలిమడుగు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మహిళ కాలిపై నుంచి పవన్ కల్యాణ్ కారు దూసుకెళ్లింది. కనీస మానవత్వం మరిచిన.. పవన్ కల్యాణ్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. బాధితురాలు హేమలతను స్థానికులు పలమనేరు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తీరుపై పలమనేరు వాసులు మండిపడుతున్నారు.ఆదివారం.. పలమనేరులో పర్యటించిన పవన్ కళ్యాణ్ కుంకీ క్యాంపును పరిశీలించారు. అయితే, కుంకీల ఆపరేషన్ సర్కస్ ఫీట్లకే పరిమితమైంది. ఇంకా శిక్షణ, ట్రయల్ రన్తోనే సాగుతోంది. ఒకపక్క ఏనుగులు భీకర దాడులు చేస్తున్నా కట్టడి చేయలేని పరిస్థితి ఏర్పడింది. చేతికొచ్చిన పంటలు సర్వనాశనమవుతున్నా.. మనుషులను తొక్కి ప్రాణాలు తీస్తున్నా చూస్తూ మిన్నకుండిపోవాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన కుంకీల క్యాప్చరింగ్ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. -
‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’: ఇంటి హింస ఇంతింతై..
బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ అనేది మహిళలు తమ గృహహింస కారణంగా ఎదుర్కొనే మనోవేదన. ఒకరకంగా చూస్తే తీవ్రమైన వేదన కారణంగా అంటే రేప్కు గురైనవాళ్లూ, యుద్ధాల్లో సర్వం పోగొట్టుకున్నవాళ్లూ అనుభవించే అత్యంత వేదనాభరితమైన కండిషన్తో వచ్చే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ)లో ఇదో రకం అని చెప్పవచ్చు. మహిళలు తమ పార్ట్నర్ చేతుల్లో అనుభవించిన గృహహింస కారణంగా ఇది తమ ఖర్మ అంటూ సమాధానపడుతూ నిత్యం అనుభవించే రంపపుకోత కారణంగా వాళ్లు అనుభవించే మానసిక సమస్యే ఈ ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’. ఈ మానసిక సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...పెళ్లి తర్వాత భర్త లేదా జీవిత భాగస్వామి పెట్టే వేదనలను అనుభవించే భార్యల్లో కొందరికి ఇది తమ ఖర్మ అనే ఫీలింగ్ తప్ప... దీన్ని ఎదుర్కోవాలనిపించడం, పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించడం కూడా ఉండదు. అలా మొదలయ్యే ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’లో ఆ మహిళ... తన భర్త అలా హింసిస్తుండటాన్ని కూడా తన తప్పుగానే అనుకుంటూ ‘అపరాధభావన’తో బాధపడుతుంటుంది.సిండ్రోమ్ తాలూకు నాలుగు దశలివి... బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్కు దారితీసే వాళ్ల వాళ్ల ఇంటి పరిస్థితులు ప్రతి మహిళకూ వేర్వేరుగా ఉన్నప్పటికీ... వారు అనుభవించే కొన్ని కామన్ దశలను బట్టి చూసినప్పుడు వారి మానసిక స్థితి ఈ కింద పేర్కొన్న నాలుగు దశల్లో కొనసాగుతుంది. మొదటి రెండు దశల్లో మహిళలు నిశ్శబ్దంగా తమ వేదనలు అనుభవించినప్పటికీ... ఈ వేదనల నుంచి బయటకు వచ్చేందుకు తాము చేసే ప్రయత్నాలు ఈ చివరి రెండు దశల్లో కొంతమేర జరుగుతాయి. 1. డీనియల్ : తాము వేదన అనుభవిస్తున్న సంగతి తెలియని పరిస్థితి ఇది. భర్త తమను వేధిస్తున్నారని కూడా వాళ్లు అంగీకరించరు. అదేదో ఈసారికి అలా జరిగింది తప్ప భర్త తమను హింసిస్తున్నట్టు గుర్తించడానికి నిరాకరించే దశే ఈ ‘డీనియల్’. 2. గిల్టీ (అపరాధభావన) : భర్త తనను హింసించడానికి లేదా కొట్టడానికి ఒక రకంగా తాను చేసిన తప్పే అని సర్దిచెప్పుకునే ధోరణే ఈ అపరాధభావనకు కారణం. 3. ఎన్లైట్మెంట్ : భర్త చేతుల్లో ఇలా తరచూ హింసకు గురికావడం తమకు తగదనీ, దాన్నుంచి బయటకు రావాలనే భావన కలగడం ఈ ఎన్లైట్మెంట్ దశలో జరుగుతుంది. 4. రెస్పాన్సిబిలిటీ : ఈ దశలో వారు తామీ హింస నుంచి బయటపడటం అన్నది తమ చేతుల్లోనే ఉందనీ, అది తమ బాధ్యత అని గ్రహిస్తారు. అవసరమైతే బంధం నుంచి బయటపడైనా ఈ హింసనుంచి విముక్తి పొందవచ్చని అనుకునే దశ ఇది. బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ మొదలయ్యేదిలా... మొదట్లో ఏదో మనస్పర్థల కారణంగా భర్త ఆగ్రహానికి గురైనప్పుడు మహిళ అంతగా ప్రతిఘటించక΄ోవచ్చు. ఇది పెళ్లయిన కొత్తలో ఇలా జరగడానికి అవకాశముంది. భర్త తొలుత శారీరకంగానో లేదా మానసికంగానో బాధపెట్టాక ఎందుకో అలా జరిగి΄ోయిందనీ, ఇకపై అలా జరగదంటూ ఎమోషనల్గా మాట్లాడతాడు. ఆమె ఆమోదం పొందడం కోసం అవసరమైనదానికంటే ఎక్కువ రొమాంటిక్గా వ్యవహరిస్తూ ఆమెను నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ హింస అక్కడితో ఆగకుండా అదేపనిగా మాటిమాటికీ కొనసాగుతూ ఉంటుంది. దాంతో తొలుత అతడు చెప్పే (కన్వీన్స్ చేసే) అంశాలకు లొంగి΄ోయిన మహిళ ఆ తర్వాత అదో రొటీన్ తంతు అని గ్రహించి, పెద్దగా స్పందించడమూ మానేస్తుంది. అలా గృహహింస వేదనలకు గురవుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి ఆర్థిక సమస్యలూ, విడి΄ోతామేమోనన్న భయం, తనను తాను సముదాయించుకునే సర్దుబాటు ధోరణీ... ఇలాంటి కారణాలు చాలానే ఉండవచ్చు.నిర్వహణ: యాసీన్ప్రభావాలు... స్వల్పకాలిక ప్రభావాలివి... జీవితం వృథా అనుకోవడం, తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్) ఆత్మవిశ్వాసం లోపించడం (లో సెల్ఫ్ ఎస్టీమ్) తీవ్రమైన ఉద్విగ్నత (సివియర్ యాంగ్జైటీ).దీర్ఘకాలిక ప్రభావాలివి... తరచూ గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లడం, తానేమిటో మరచి΄ోయి వేరేగా ప్రవర్తించడం (డిసోసియేటివ్ స్టేట్), తీవ్రంగా ప్రతిస్పందించడం (వయొలెంట్ ఔట్బరస్ట్... ఇది సుదీర్ఘకాలం తర్వాత వచ్చే పరిణామం) హైబీపీ, గుండెజబ్బుల వంటివి కనిపించడం, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ దీర్ఘకాలికం (క్రానిక్)గా వచ్చే వెన్నునొప్పి, తలనొప్పి.బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్కు ఇవే గుర్తులు... హింసించే తన భర్తకు అన్నీ తెలుసు... తనకేమీ తెలియనందువల్ల తనవల్లనే తప్పు జరిగిందేమోననే అపరాధభావన ∙జరిగిందానికి తామే బాధ్యురాలినేమో అనే భావనతో కలిగే వేదన ∙జరిగిందీ, తాను అనుభవించిన వేదనను తమ ఇంటివాళ్లకూ, ఫ్రెండ్స్కూ చెప్పక΄ోవడం ∙పిల్లల జీవితం ఏమై΄ోతుందోనన్న తీవ్రమైన ఆందోళన. -
ఇంటి హింస ఇంతింతై!
పెళ్లి తర్వాత భర్త లేదా జీవిత భాగస్వామి పెట్టే వేదనలను అనుభవించే భార్యల్లో కొందరికి ఇది తమ ఖర్మ అనే ఫీలింగ్ తప్ప... దీన్ని ఎదుర్కోవాలనిపించడం, పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించడం కూడా ఉండదు. అలా మొదలయ్యే ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’లో ఆ మహిళ... తన భర్త అలా హింసిస్తుండటాన్ని కూడా తన తప్పుగానే అనుకుంటూ ‘అపరాధభావన’తో బాధపడుతుంటుంది.సిండ్రోమ్ తాలూకు నాలుగు దశలివి...బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్కు దారితీసే వాళ్ల వాళ్ల ఇంటి పరిస్థితులు ప్రతి మహిళకూ వేర్వేరుగా ఉన్నప్పటికీ... వారు అనుభవించే కొన్ని కామన్ దశలను బట్టి చూసినప్పుడు వారి మానసిక స్థితి ఈ కింద పేర్కొన్న నాలుగు దశల్లో కొనసాగుతుంది. మొదటి రెండు దశల్లో మహిళలు నిశ్శబ్దంగా తమ వేదనలు అనుభవించినప్పటికీ... ఈ వేదనల నుంచి బయటకు వచ్చేందుకు తాము చేసే ప్రయత్నాలు ఈ చివరి రెండు దశల్లో కొంతమేర జరుగుతాయి.1. డీనియల్ : తాము వేదన అనుభవిస్తున్న సంగతి తెలియని పరిస్థితి ఇది. భర్త తమను వేధిస్తున్నారని కూడా వాళ్లు అంగీకరించరు. అదేదో ఈసారికి అలా జరిగింది తప్ప భర్త తమను హింసిస్తున్నట్టు గుర్తించడానికి నిరాకరించే దశే ఈ ‘డీనియల్’.2. గిల్టీ (అపరాధభావన) : భర్త తనను హింసించడానికి లేదా కొట్టడానికి ఒక రకంగా తాను చేసిన తప్పే అని సర్దిచెప్పుకునే ధోరణే ఈ అపరాధభావనకు కారణం.3. ఎన్లైట్మెంట్ : భర్త చేతుల్లో ఇలా తరచూ హింసకు గురికావడం తమకు తగదనీ, దాన్నుంచి బయటకు రావాలనే భావన కలగడం ఈ ఎన్లైట్మెంట్ దశలో జరుగుతుంది.4. రెస్పాన్సిబిలిటీ : ఈ దశలో వారు తామీ హింస నుంచి బయటపడటం అన్నది తమ చేతుల్లోనే ఉందనీ, అది తమ బాధ్యత అని గ్రహిస్తారు. అవసరమైతే బంధం నుంచి బయటపడైనా ఈ హింసనుంచి విముక్తి పొందవచ్చని అనుకునే దశ ఇది.బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ మొదలయ్యేదిలా...మొదట్లో ఏదో మనస్పర్థల కారణంగా భర్త ఆగ్రహానికి గురైనప్పుడు మహిళ అంతగా ప్రతిఘటించకపోవచ్చు. ఇది పెళ్లయిన కొత్తలో ఇలా జరగడానికి అవకాశముంది. భర్త తొలుత శారీరకంగానో లేదా మానసికంగానో బాధపెట్టాక ఎందుకో అలా జరిగిపోయిందనీ, ఇకపై అలా జరగదంటూ ఎమోషనల్గా మాట్లాడతాడు. ఆమె ఆమోదం పొందడం కోసం అవసరమైనదానికంటే ఎక్కువ రొమాంటిక్గా వ్యవహరిస్తూ ఆమెను నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తాడు.కానీ ఈ హింస అక్కడితో ఆగకుండా అదేపనిగా మాటిమాటికీ కొనసాగుతూ ఉంటుంది. దాంతో తొలుత అతడు చెప్పే (కన్వీన్స్ చేసే) అంశాలకు లొంగిపోయిన మహిళ ఆ తర్వాత అదో రొటీన్ తంతు అని గ్రహించి, పెద్దగా స్పందించడమూ మానేస్తుంది. అలా గృహహింస వేదనలకు గురవుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి ఆర్థిక సమస్యలూ, విడిపోతామేమోనన్న భయం, తనను తాను సముదాయించుకునే సర్దుబాటు ధోరణీ... ఇలాంటి కారణాలు చాలానే ఉండవచ్చు. -నిర్వహణ: యాసీన్చికిత్స... ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. వారు అనుభవించిన, అనుభవిస్తున్న బాధలూ లేదా వారిలో వ్యాధి తీవ్రతను బట్టి కౌన్సెలింగ్, ఇంటర్పర్సనల్ థెరపీ, అవసరాన్ని బట్టి కొన్ని యాంటీ డిప్రెసెంట్ మందులు వాడాల్సి ఉంటుంది. ఇక సామాజికంగా ఈ వేదననుంచి విముక్తి కావడం కోసం వారి కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల సంప్రదింపుల తర్వాత పోలీసులను సంప్రదించడం వంటి ప్రత్యామ్నాయాలూ అనుసరించవచ్చు.గుర్తించడం ఎలా...కొన్ని గుర్తుల (లక్షణాల) ఆధారంగా ఓ మహిళ బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ బారిన పడిందని గుర్తించవచ్చు. అవి... ∙తాను నలుగురిలో కలవకపోవడం... ఎందుకని అడిగినప్పుడు ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉండటం ∙భర్త వచ్చే టైమ్కు చాలా తీవ్రమైన ఉద్నిగ్నానికీ, ఆందోళనకు లోనవుతుండటం⇒ దేహంపై కనిపించే గాయాల గురించి అడిగితే ఏవేవో పొంతనలేని కారణాలు చెప్పి దాటవేయడానికి చూడటం. దుస్తులను గాయాలను దాచేలా సర్దుతుండటం. (ఉదాహరణకు మంచి వేసవిలోనూ దేహమంతా కప్పివేసే దుస్తులు ధరించడం) ∙తన ఉద్యోగం కారణంగా వచ్చే జీతం వంటివన్నీ తన భర్త అధీనంలోనే ఉంచడం⇒ భర్తనుంచి ఏదైనా కాల్ రాగానే తీవ్రమైన కలవరపాటుకు గురవుతుండటం.ప్రభావాలు...స్వల్పకాలిక ప్రభావాలివి...⇒ జీవితం వృథా అనుకోవడం, తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్) ∙ఆత్మవిశ్వాసం లోపించడం (లో సెల్ఫ్ ఎస్టీమ్) ∙తీవ్రమైన ఉద్విగ్నత (సివియర్ యాంగై్జటీ).దీర్ఘకాలిక ప్రభావాలివి...⇒ తరచూ గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లడం, తానేమిటో మరచిపోయి వేరేగా ప్రవర్తించడం (డిసోసియేటివ్ స్టేట్), తీవ్రంగా ప్రతిస్పందించడం (వయొలెంట్ ఔట్బరస్ట్... ఇది సుదీర్ఘకాలం తర్వాత వచ్చే పరిణామం) హైబీపీ, గుండెజబ్బుల వంటివి కనిపించడం, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ దీర్ఘకాలికం (క్రానిక్)గా వచ్చే వెన్నునొప్పి, తలనొప్పి.డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై హెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ – సీనియర్ సైకియాట్రిస్ట్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్ -
అన్నా.. ప్లీజ్ అన్నా.. వద్దన్నా..!
బైక్పై వెళ్తున్న టైంలో హఠాత్తుగా అతను నా కాళ్లపై చేతులు వేశాడు. వద్దని చెప్పినా మళ్లీ మళ్లీ అదే పని చేశాడు. నా గుండె ఆగినంత పనైంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉండిపోయా. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు ఎదురు కాకూడదని కోరుకుంటున్నా.. ఇన్స్టాగ్రామ్లో ఓ బైక్ డ్రైవర్తో తనకు ఎదురైన పరిస్థితిని ఓ యువతి పంచుకోగా అది నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించాల్సిన పరిస్థితి ఎదురైంది. మెట్రో నగరం బెంగళూరులో ఓ యువతితో బైక్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. బైక్పై వెళ్తున్న సమయంలో ఆమెను తాకుతూ ఇబ్బంది పెట్టాడు. ఈ వేధింపులను ఆ యువతి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గురువారం సాయంత్రం విల్సన్ గార్డెన్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో నేపథ్యం, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి చర్చ్ చర్చ్ స్ట్రీట్ నుంచి తాను ఉండే హాస్టల్కు ర్యాపిడో ద్వారా బైక్ రైడ్ను బుక్ చేసుకుంది. ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి కెప్టెన్ తన చేతులతో ఆమె తొడలను తాకడం ప్రారంభించాడు. దీంతో ఆమె అతన్ని వారించింది. అయినా కూడా పట్టించుకోకుండా అతను అదే పని చేస్తూ ఉండిపోయాడు. దీంతో ఆమె ‘‘అన్నా.. ఏం చేస్తున్నావ్?.. వద్దన్నా..’’ అంటూ బతిమాలుకుంది. అయినా ఆ కామాంధుడు వినలేదు. ఈలోపు.. తన గమ్యస్థానం రావడంతో ఆమె దిగేసింది. ఆ సమయంలోనూ ఆమె ఇబ్బందిని గమనించిన ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశాడు. జరిగిందంతా చెప్పడంతో ఆ వ్యక్తి ఆ కెప్టెన్ను నిలదీశాడు. దీంతో తప్పైపోయిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోసాగాడు. కాస్త దూరం వెళ్లాక యువతిని చూస్తూ చేతులతో అసభ్య సంజ్ఞలు చేశాడు. దీంతో ఆమె భరించలేకపోయింది. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.తాను సిటీకి కొత్త అని, అందుకే ఆ రైడ్ను మధ్యలో ఆపలేకపోయానని, ఇలాంటి ఘటనలు కొత్త కాకపోయినా తనకు ఎదురైన అనుభవం మరేయితర మహిళకు ఎదురుకాకూడదని, ఇలాంటి ప్రయాణాల్లో ఒంటరి మహిళలు భద్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ పోస్ట్ చేసింది. నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నట్లు విల్సన్ గార్డెన్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ర్యాడిడో సంస్థ స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: తుపాకులు కావాలా? ల్యాప్ట్యాప్లు కావాలా? -
నగల దుకాణంలో ‘అమ్మగారికి’ దేహశుద్ధి
నగలు, బట్టల దుకాణాల్లో చేతివాటం చూపించే మహిళా దొంగల గురించి చాలా వీడియోలు చూశాం. కానీ నగల దుకాణంలో చోరీకి ప్రయత్నించి చావు దెబ్బల తిన్న వైనం నెట్టింట వైరల్గా మారింది. గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఒక ఆభరణాల దుకాణంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. నవంబర్ 3న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన CCTVలో రికార్డయింది. దీని ప్రకారం అహ్మదాబాద్లోని రాణిప్ కూరగాయల మార్కెట్ సమీపంలోని బంగారం మరియు వెండి దుకాణంలోకి కస్టమర్గా ఒక మహిళ జ్యుయల్లరీ దుకాణంలోకి ప్రవేశించింది. దుపట్టా అడ్డం పెట్టుకుని, అదును చూసి దుకాణ యజమానిపై కారంపొడి చల్లి అందినంతా దోచుకోవాలని ప్రయత్నించింది. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. ఊహించని పరిస్థితి ఎదురైంది. మహిళ చోరకళను గుర్తించిన దుకాణదారుడు తక్షణమే అలర్ట్ అయిపోయాడు. వెంటనే లేచి చెంపలు పగలగొట్టేశాడు. 25 సెకన్లలో దాదాపు దాదాపు 20 సార్లు కొట్టాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించి దుకాణదారుడు ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. విచారణ జరుగుతోంని రాణిప్ పోలీస్ స్టేషన్ పిఐ కేతన్ వ్యాస్ తెలిపారు. అమ్మగారికి తగిన శాస్తి జరిగింది, సీన్ సితార్ అయ్యింది అంటు నెటిజన్లు పలు రకాలుగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తండ్రి త్యాగం, కొడుకు సర్ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగం In Ahmedabad, a woman tried to rob a jewelry store owner by throwing red chili powder into his eyes.Even after the chili got into his eyes, the owner stood strong.#IPL2026 #Kumbha #Fourthnattawat pic.twitter.com/rAqmVDlVpo— 🦋 KOMAL SINGH🦋 💯 Follow Back (@Singh_Komall) November 7, 2025 -
విశాఖ: వృద్ధురాలి మృతి కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పెందుర్తిలో అత్త జయంతి కనక మహాలక్ష్మి (66) అనుమానాస్పద మృతి కేసులో హత్య కోణం బయటపడింది. కోడలు సినీ పక్కిలో పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.కోడలు, మనవరాలు ‘దొంగ-పోలీస్’ ఆట పేరుతో అత్తను కుర్చీకి కాళ్లను తాళ్లతో బంధించారు. కళ్లకు గంతలు కట్టి కదలకుండా బంధించిన కోడలు.. అనంతరం కుర్చీలో కదలలేని పరిస్థితుల్లో ఉన్న అత్తపై పెట్రోల్ పోసి.. దేవుడి గదిలో ఉన్న దీపం విసిరి నిప్పంటించింది.అనంతరం కోడలు.. అగ్ని ప్రమాదం జరిగిందంటూ అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. మొదట అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తనపై అనవసరంగా చిరాకు పెడుతుందనే కారణంతోనే అత్తను హతమార్చినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. భార్యాభర్తలు సుబ్రహ్మణ్య శర్మ, లలిత, మనవడు, మనవరాలు, అత్త జయంతి కనకమాలక్ష్మి పెందుర్తి అప్పన్నపాలెంలో నివాసముంటున్నారు. -
తిరుమల కొండపై ఏడు అడుగుల మహిళ (ఫోటోలు)
-
అయ్య బాబోయ్.. ఎంత పొడవో!
తిరుమలలో ఏడు అడుగుల పొడవైన మహిళ సందడి చేశారు. సోమవారం ఉదయం వానమామలై పీఠాధిపతి జీయర్ స్వామి, ఆయన శిష్య బృందంతోపాటు ఏడు అడుగుల పొడవున్న శ్రీలంకకు చెందిన నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆమె ఎత్తును చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. -
‘నాడు ఎనిమిదింటికే రమ్మన్నారు?’.. మమతపై బీజేపీ విసుర్లు
న్యూఢిల్లీ: తొలిసారి వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకూ అంతా భారత మహిళా క్రికెట్ జట్టును అభినందిస్తున్నారు. అయితే ఇదేవిధంగా వ్యవహరించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి.పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేసిన దరిమిలా, అది రాజకీయ చర్చకు దారి తీసింది. మహిళలు అర్థరాత్రి బయటకు వెళ్లడంపై మమతా గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోమారు తెరపైకి వచ్చాయి. బీజేపీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ మమతను ఎద్దేవా చేసింది. వివరాల్లోకి వెళితే సీఎం మమత భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ ‘ఎక్స్’ పోస్టులో ‘ఈ రోజు, ప్రపంచ కప్ ఫైనల్లో ఘన విజయం సాధించిన మా ‘ఉమెన్ ఇన్ బ్లూ’ను చూశాక దేశమంతా గర్విస్తోంది. వారు చూపిన ప్రతిభ, టోర్నమెంట్లోవారి అద్భుత ప్రదర్శన తరతరాలుగా యువతులకు ప్రేరణగా నిలుస్తుంది. మీరు అత్యున్నత స్థాయిలో ఆడి, ప్రపంచ స్థాయి జట్టు అని నిరూపించారు. మీరు మాకు కొన్ని అద్భుత క్షణాలను అందించారు. మీరే మా హీరోలు. భవిష్యత్తులో భారీ విజయాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. మేము మీకు తోడుగా నిలుస్తాం’అని రాశారు.భారత మహిళా క్రికెట్ జట్టును ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించిన తీరును పలువురు మెచ్చుకున్నారు. అయితే ఇంతలోనే ఇది రాజకీయ మలుపు తీసుకుంది. గతంలో దుర్గాపూర్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జరిగిన సామూహిక అత్యాచారం కేసు విషయంలో మమతా బెనర్జీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తాజాగా బీజేపీ గుర్తు చేసింది. వెస్ట్ బెంగాల్ బీజేపీ ఒక ట్వీట్ చేస్తూ.. ‘దేవుడా.. వాళ్లు 12 గంటల వరకు ఆడారు. మీరేమో వాళ్లని 8 గంటలలోపు ఇంట్లో ఉండమని చెప్పారు’ అని రాసింది. గత అక్టోబర్లో మమతా బెనర్జీ వైద్య విద్యార్థినిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, బాధితురాలు రాత్రి 12.30 గంటలకు బయటకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ముఖ్యంగా రాత్రిపూట ఆడపిల్లను బయటకు రానివ్వకూడదు. వారు స్వీయ రక్షణలో ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. నాడు బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాలలో ఆగ్రహాన్ని తెప్పించాయి. మమత.. రాష్ట్ర శాంతిభద్రతలను కాపాడేందుకు బదులు బాధితురాలిని నిందించారని పలువురు ఆరోపించారు.ఇది కూడా చదవండి: ఉద్యోగం కోసం ఎమ్మెల్యేపై దాడి?.. యువకుడు అరెస్ట్ -
కలల్ని అమ్ముకున్నారు.. ఇప్పుడు స్థానం లేదంటారా?
అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్కు ఊహించని పరిణామం ఎదురైంది. వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని భారతీయ మూలాలున్న ఓ యువతి వాన్స్ ముఖం మీదే ఎండగట్టింది. అంతేకాదు.. ఆయన వ్యక్తిగత జీవితంపైనా ఆమె వేసిన ఓ ప్రశ్నతో ఆయన ఇబ్బందిపడినట్లు కనిపించారు. అమెరికాలోని మిసిసిప్పీ విశ్వవిద్యాలయంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ Turning Point USA అనే ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వాన్స్ ప్రసంగిస్తూ.. అమెరికాలో కఠినమైన వీసా పరిశీలన విధానానికి (strict vetting process) మద్దతు ప్రకటించారు. అమెరికాలోకి చట్టబద్ధంగా వచ్చే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో.. భారతీయ సంతతికి చెందిన ఓ యువతి మైక్ అందుకుంది. ఆయన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ‘‘మీరు ఇంతకాలం అమెరికా కలల్ని మాకు అమ్మారు, మా యవ్వనాన్ని, సంపదను ఖర్చు పెట్టించారు. అలాంటిది ఇప్పుడేమో ఎక్కువ మంది వస్తున్నారు.. వాళ్లను వెనక్కి పంపాలి అంటారా?.. మాకు ఇక్కడ స్థానం లేదంటారా?. మేము చట్టబద్ధంగా వచ్చాం, మీ నిబంధనలు పాటించాం. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి చెందనివాళ్లమంటారా?’’ అని వాన్స్ను నిలదీశారు. ఆ సమయంలో.. A brave young woman asks JD Vance: “When you talk about too many immigrants here, when did you guys decide that number? Why did you sell us a dream? You gave us the path and now tell us we don't belong here? Why do you have to be Christian to be American?” pic.twitter.com/mQ3CTAnN58— The Tennessee Holler (@TheTNHoller) October 30, 2025కొందరు చప్పట్లు చరుస్తూ ఆమెను అభినందించడం గమనార్హం. అయితే వాళ్లను వారిస్తూ ఆమె ఈ ప్రశ్నతో గొడవ చేయాలన్నది తన ఉద్దేశం కాదంటూ స్పష్టం చేశారు. దానికి వాన్స్ సమాధానం ఇవ్వలేదు. బదులుగా.. అత్యధిక ఇమ్మిగ్రేషన్ అమెరికా సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని.. కొంతమంది అక్రమ వలసదారులు దేశానికి మేలు చేశారని.. అంతమాత్రాన అందువల్ల లక్షల మందిని అనుమతించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు. ఆ వెంటనే.. ఆ యువతి.. అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్ కావాల్సిందేనా? అని అడిగింది. దానికి వాన్స్ స్పందిస్తూ తాను మత బోధనను విశ్వసిస్తానని.. తన భార్య కూడా భవిష్యత్తులో అదే విశ్వాసాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే, ఆమెకు స్వేచ్ఛ ఉందని, అది తనకు సమస్య కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. వాన్స్ వైఖరిపై ఇండో అమెరికన్లు మండిపడుతున్నారు. హిందూ భార్యను కలిగి ఉండి, మతపరమైన మార్పును ఆశించడం ద్వంద్వ వైఖరేనంటూ పలువురు వ్యాఖ్యానించారు. వాన్స్ వివాహం వేద హిందూ సంప్రదాయంలో జరిగినదని కూడా కొందరు గుర్తు చేశారు. వాన్స్ను ప్రశ్నించిన ఆమె ఎవరన్నదానిపై ఇంకా స్పష్ట త రావాల్సి ఉంది.When JD Vance had hit his lowest, it was his “Hindu” wife and her Hindu upbringing that had helped him navigate through the tough times. Today in a position of power, her religion has become a liability. What a fall. What an epic fall for the man. pic.twitter.com/Zvz7bFQ0hZ— Monica Verma (@TrulyMonica) October 30, 2025 -
ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..
గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్లో పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించనుంది పుణేకి చెందిన రేసర్ డయానా పండోలె. ఈ ఛాంపియన్షిప్ నవంబర్లో మొదలవుతుంది. ఫెరారీ 296 చాలెంజ్ కారుతో దూసుకుపోనుంది. డయాన. ఫెరారీ 296 అనేది ఇటాలియన్ బ్రాండ్కు సంబంధించిన అత్యాధునిక, ట్రాక్–ఫోకస్ట్ మెషీన్.‘రేసింగ్’ అనేది డయానా ఎవరి నోటి నుంచో విన్న మాట కాదు. చిన్నప్పటి నుంచే రేసింగ్కు సంబంధించిన కబుర్లు ఇంట్లో వినేది. అమ్మా,నాన్నలకు రేసింగ్ అంటే ఇష్టం. కాలక్రమంలో వారి ఇష్టమే తన ఇష్టంగా మారింది.మొదట బైక్ నేర్చుకుంది. ఆ తరువాత కారు నడపడం నేర్చుకుంది. ఆ తరువాత రేస్ కార్లతో దూసుకుపోయేది. డయానాలో ఉత్సాహమే కాదు దానికి తగిన శక్తి,సామర్థ్యాలు ఉన్నాయి. అందుకే ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ను గెల్చుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది డయానా.పోటీలకు సంబంధించి పెళ్లికి ముందు ఉన్న ఉత్సాహం పెళ్లయిన తరువాత కొద్దిమందిలో కనిపించదు. ఇద్దరు పిల్లల తల్లి అయిన 32 ఏళ్ల డయానాలో మునపటి ఉత్సాహం ఎంతమాత్రం తగ్గలేదు. తరగని ఆ ఉత్సాహమే గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్ పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా మరోసారి చరిత్ర సృష్టించేలా చేస్తోంది.(చదవండి: ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..) -
కారులో మహిళ.. కళ్లు తెరిచేంతలో మృతి
పూణె: ప్రతిమనిషికి ఏదో ఒకరోజు మృత్యువు సంభవిస్తుందనేది అందరికీ తెలిసిందే. అయితే అది ఎలా వస్తుందనేది ఎవరూ చెప్పలేరు. కొందరికి ఎవరూ ఊహించని విధంగా మృత్యువు వాటిల్లుతుంది. ఇటువంటి ఘటనే అత్యంత ఖరీదైన కారులో విలాసవంతగా వెళుతున్న మహిళకు ఎదురయ్యింది. పూణే నుండి మాంగావ్కు వోక్స్వ్యాగన్ వర్టస్ కారులో వెళుతున్న ఒక మహిళ అకస్మాత్తుగా మృత్యువాత పడింది.కొండపై నుంచి ఒక పెద్ద బండరాయి ఆమె వెళుతున్న కారుపై పడి, అది కారు సన్రూఫ్ను చీల్చుకొని, అమాంతం కారులోని ఆమెపై పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలిని గుజరాత్కు చెందిన స్నేహల్(43)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని తమ్హిని ఘాట్లో చోటుచేసుకుంది.మరో ఘటనలో ముంబై నుండి జల్నాకు వెళుతున్న ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటన హైవేలోని నాగ్పూర్ లేన్లో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, అతని సహాయకునితో పాటు 12 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తమైన బస్సులోని ప్రయాణికులకు కిందకు దింపి, వారి ప్రాణాలను కాపాడాడు. ఇదేవిధంగా అక్టోబర్ 18న మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో వేగంగా వస్తున్న మినీ ట్రక్కు లోయలో పడటంతో ఎనిమిది మంది మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: Sudan: ఉపగ్రహ చిత్రాల్లో సామూహిక రక్తపాత దృశ్యాలు -
కిడ్నీ మార్పిడి కోసం కేన్సర్ రోగిని పెళ్లాడింది..కట్చేస్తే..!
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ..అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ ...అన్న పాట గుర్తుకొస్తుంది ఈ ఘటన. ఏదో వ్యాధుల కారణంగా.. అవసరార్థం పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఎలాంటి ప్రేమ, ఇష్టం వంటివి లేదు. రోగాల కారణంగా ఒక్కటయ్యారు..కానీ వారి మధ్య విడదీయరానంత ప్రేమ చిగురించేలా చేసి..అద్భుతమే చేసింది ఆ దంపతుల మధ్య. ఎవరా ఆ జంట..? ఏమా కథ చూసేద్దామా..!2014లో చైనాలోని షాంగ్జీకి చెందిన 24 ళ్ల వాంగ్ జియావో అనే మహిళ యురేమియా అనే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి ఎంతలా ఉందంటే..ఆమెకు మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స జరగకపోతే.. ఒక్క ఏడాదికి మించి బతకదని తేల్చి చెప్పేశారు వైద్యులు. అయితే ఆమెకు కిడ్నీ దానం చేసేందుకు సన్నిహితులు, బంధువులు ముందుకొచ్చినా..వాళ్లెవ్వరిది ఆమెకు సరిపోలేదు. ఓ పక్క సమయం మించిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో ఆమెకు కేన్సర్ పేషెంట్ అయిన జాంగ్ లియాంగ్ అనే వ్యక్తి ఓ విచిత్రమైనా ఆఫర్ ఇచ్చాడామెకు. "తాను కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని, చనిపోయేంతవరకు చికిత్స సమయంలో తనను ప్రేమగా చూసుకునే తోడు కోసం ఆశిస్తున్నానని, అందుకు ప్రతిగా తను మరణించాక కిడ్నీని ఇస్తానని చెబుతాడు". ఇక్కడ వాంగ్కి మరో ఛాన్స్లేదు. పైగా తక్కువ వ్యవధి ఉంది. మరోవైపు జాంగ్కి సంరక్షణ, ఒక తోడు కావాలి. దాంతో బాగా ఆలోచించి వాంగ్ ఓ ఒప్పందం ప్రకారం..జాంగ్ని పెళ్లి చేసుకుంది. ఒకరు మనుగడ కోసం, మరొకరు సంరక్షణ ఆశిస్తూ చేసుకున్న ఈ వివాహం వారి జీవితాను ఊహించిన మలుపు తిప్పింది.అద్భుతం చేసిన ప్రేమ..మొదట్లో ఒప్పందాల పెళ్లి కాస్త. .బలమైన బంధంగా మారిపోయింది. అతడి కోసం వంట చేసి, కీమోథెరపీ చికిత్సలలో జాంగ్ కోరిన సంరక్షణను అందించింది. వైద్య సమస్యల కారణంగా పరిచయమైన ఈ అపరిచిత జంట వారాలు గడుస్తున్న కొద్ది.. ఇద్దరి మధ్య అనురాగం ఏర్పడి..విడిచి ఉండలేనంతగా ప్రేమ చిగురించింది. అచ్చం ప్రేమికులు మాదిరిగా అయిపోయారు ఆ దంపతులు. దూకుడుగా ఉన్న జాంగ్ కేన్సర్ వాంగ్ సహచర్యం ప్రేమ కారణంగా మెరుగవ్వుతూ..వైద్యులే విస్తుపోయేలా తగ్గిపోయింది. మొత్తానికి ఆ మహమ్మారి కేన్సర్ని జయించాడు జాంగ్. అతడు బాగుండటమే చాలు అన్నంత స్థితికి వాంగ్ వచ్చేసింది కూడా. మొదట్లో తాను బతకాలని ఆశించినా .. రాను రాను అతడు ఉంటేనే తన ప్రాణం ఉంటుంది అన్నంతగా ప్రేమను పెంచేసుకుంది. ఇక్కడ వాంగ్కి జాంగ్ కిడ్నీ రాలేదు, అయినా అలా వ్యాధితో పోరాడతూనే ఉండాలనే ఫిక్స్ అయ్యింది. విచిత్రం ఏంటంటే..ఆ వ్యాధులు ఇద్దరిని దంపతులుగా చేసి, వాటిని క్యూర్ అయ్యేలా చేశాయి. ఇక్కడ వాంగ్కి కూడా మూత్రపిండాల వ్యాధి సివియర్గా లేదని మెరుగవ్వుతుందని, మందులతో నిర్వహించొచ్చని వైద్యులు చెప్పడం విశేషం. ఇలా జరుగుతుందని ఊహించను కూడా లేదని ఉబ్బితబ్బిబవ్వుతోంది ఆ జంట. ఈ స్టోరీ ప్రేమ గొప్పతనం ఏంటో చెప్పకనే చెబుతోంది. పైగా జీవిత పరమార్థమే తానని చెప్పకనే చెప్పేసింది ఈ రెండక్షరాల ప్రేమ ..! మనం కోసం ఓ వ్యక్తి ఉన్నారు అంటే ఎంతటి అగాథాన్ని అయినా..సవాలునైనా అధిగమించి సునాయసంగా బటయపడగలం అనేందుకు ఈ దంపతులే ఉదాహరణ. ఇక్కడ ఆ జంట విషయంలో ప్రేమ అద్భుతమే చేసింది కదూ..!. (చదవండి: Delhi Police constable Sonika Yadav: వెయిట్లిప్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!) -
తెలుగుదేశం పార్టీ నాయకుల కాల్ మనీ ఆగడాలకు బలి మహిళా
-
ఢిల్లీలో యువతిపై వేధింపులు.. యాసిడ్ దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ముకుంద్పూర్కు చెందిన ఓ యువతి ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుకుంటోంది. ఆదివారం అదనపు క్లాసులని కాలేజీ వైపు నడిచి వెళ్తున్న ఆమెను అదే ప్రాంతానికి చెందిన జితేందర్ బైక్పై ఇషాన్, అర్మాన్ అనే మరో ఇద్దరితో కలిసి వచ్చి అడ్డగించాడు. ఇషాన్ ఇచ్చిన బాటిల్ను ఓపెన్ చేసిన అర్మాన్ అందులోని యాసిడ్ను యువతి ముఖంపై చల్లాడు. రక్షణగా అడ్డు పెట్టుకున్న రెండు చేతులపై యాసిడ్ పడి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి బైక్పై పరార య్యారు. అనంతరం కుటుంబీలకు సాయంతో బాధితురాలు ఆస్పత్రికి చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా బాధితురాలిని జితే ందర్ వేధింపులకు గురి చేస్తున్నాడు. నెల రోజు ల క్రితం ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగింది. అప్పటి నుంచి వేధింపులు తీవ్రతర మయ్యాయి. ఈ మేరకు బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు యాసిడ్ చల్లినందుకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ సాయంతో వారిని పట్టుకు నేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
ప్రభుత్వ తీరుకు నిరసనగా ఫ్రీ బస్సులో టికెట్ తీసుకున్న మహిళ
కర్నూలు (అగ్రికల్చర్): ‘ఉచిత బస్సు కావాలని ఎవరడిగారు. ఉల్లి సాగుచేసి నాశనమయ్యాం. క్వింటాలు ఉల్లిని రూ.200కు అడుగుతున్నారు. రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. రైతులను పట్టించుకునే వారు లేరు. 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్నారు. ఇంతవరకు కొత్త పింఛన్లే లేవు. ఉచిత బస్సు ప్రయాణం వద్దు. టికెట్ ఇవ్వండి’ అంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ టికెట్ తీసుకున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న కొట్టాల గ్రామానికి చెందిన సుంకులమ్మ వెల్దుర్తి మండలంలోని బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వెల్దుర్తిలో బస్సు ఎక్కి చిన్నటేకూరుకు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకునే సమయంలో ఉచిత బస్సు వద్దని, రైతుల్ని ఆదుకోవాలని ఆమె నినాదాలు చేశారు. -
అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి..
ఫరీదాబాద్: హర్యానాలోని గ్రేటర్ ఫరీదాబాద్లో దారుణం చోటుచేసుకుంది. తల్లి తమతో పాటు ఉండకూడదని భార్య, అత్తామామలు, బావమరుదులు వేధిస్తుండటంతో తీవ్రంగా కలత చెందిన ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన కుమార్ గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రేడియోథెరపిస్ట్గా పనిచేస్తున్నాడు. అతనికి తొమ్మిదేళ్ల క్రితం నేహా రావత్తో వివాహం జరిగింది. వారికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఈ దంపతులు గతంలో నోయిడాలో ఉండేవారు. అక్కడ నేహా ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేది.. మృతుడి మామ ప్రకాష్ సింగ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో వారు కుమార్తెను చూసుకోలేకపోయారు. ఈ నేపధ్యంలో యోగేష్ తన తల్లిని తమతో పాటు ఉండేలా చూసుకోవాలని అనుకున్నాడు. అయితే నేహా ఇందుకు అంగీకరించలేదు.ఆరు నెలల క్రితం యోగేష్ తన కుమార్తెతో సహా గ్రేటర్ ఫరీదాబాద్లోని సెక్టార్ 87లోని పెర్ల్ సొసైటీకి మారాడు. అయితే నేహా.. నోయిడా నుండి యోగేష్తో పాటు ఇక్కడికి రాలేదు. దీంతో యోగేష్ తమ కుమార్తెను చూసుకునేందుకు తన తల్లిని తీసుకువచ్చాడు. ఇంతలో నేహా తన యోగేష్తో పాటు ఉండేందుకు పెర్ల్ సొసైటీ అపార్ట్మెంట్కు వచ్చింది. తరువాత యోగేష్ తల్లి తమతో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నేహా తల్లిదండ్రులు, సోదరులు ఆశిష్ రావత్, అమిత్ రావత్ కూడా ఈ విషయమై యోగేష్తో గొడవ పడ్డారు. దీంతో యోగేష్ తీవ్రంగా కలత చెందాడు.గురువారం, యోగేష్ తన భార్య నేహాను గ్వాలియర్లోని తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తూ, నేహాను నోయిడాలో దింపి, ఒంటరిగా తమ అపార్ట్మెంట్కు తిరిగి వచ్చాడు. శుక్రవారం రాత్రి పెర్ల్ సొసైటీలోని 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతని మామ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మృతుని భార్య నేహా రావత్, అత్త శాంతి రావత్, మామ వీర్ సింగ్ రావత్, నేహా సోదరులు ఆశిష్, అమిత్ రావత్ లపై కేసు నమోదు చేశామని భూపాని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంగ్రామ్ దహియా మీడియాకు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: కెనడాపై ఉరిమిన ట్రంప్.. సుంకాలు 10 శాతం పెంపు -
‘మహిళ వేషంలో బిన్ లాడెన్’.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సంచలంగా మారింది. 2001, సెప్టెంబర్ 11 ఉగ్ర దాడులతో అమెరికాకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా మారిన అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్.. మహిళ వేషంలో టోరా బోరా కొండల నుండి తప్పించుకున్నాడని కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) మాజీ అధికారి జాన్ కిరియాకౌ తాజాగా వెల్లడించారు. 2001లో టోరా బోరా కొండలలో అమెరికా దళాలు ఒసామా బిన్ లాడెన్ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు, అతడు మహిళా వేషం ధరించి అక్కడి నుంచి తప్పించుకున్నాడని తెలిపారు.జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా సైన్యంలో రహస్యంగా చొరబడిన అల్ ఖైదా కార్యకర్త సహాయంతో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. మహిళ వేషం వేసుకుని, టోరా బోరా నుంచి తప్పించుకున్నాడని తెలిపారు. సీఐఏలో 15 ఏళ్లు పనిచేసి, పాకిస్తాన్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు నాయకత్వం వహించిన కిరియాకౌ, అమెరికాలో సైనిక శ్రేణుల్లో అల్ ఖైదా కార్యకర్తల చొరబాట్లను తెలియజేశారు. 9/11 దాడుల అనంతరం అమెరికా సంయమనంగా వ్యవహరించింది, ఆఫ్ఘనిస్తాన్లో బాంబు దాడులను చేపట్టేందుకు నెల్లాళ్లు వేచివుందన్నారు. ఈ తరుణంలోనే అల్ ఖైదా చొరబాటుదారునిగా తేలిన అనువాదకుడు ఉగ్రవాది బిన్ లాడెన్ తప్పించుకునేందుకు అవకాశం కల్పించాడని తెలిపారు. EP-10 with Former CIA Agent & Whistleblower John Kiriakou premieres today at 6 PM IST“Osama bin Laden escaped disguised as a woman...” John Kiriakou“The U.S. essentially purchased Musharraf. We paid tens of millions in cash to Pakistan’s ISI...” John Kiriakou“At the White… pic.twitter.com/pM9uUC3NIC— ANI (@ANI) October 24, 2025లాడెన్ తప్పించుకున్న ఘటన దరిమిలా యూఎస్ ఉగ్రవాద నిరోధక దృష్టి పాకిస్తాన్ వైపు మళ్లిందని జాన్ కిరియాకౌ తెలిపారు. ఈ నేపధ్యంలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్తో చర్చలు జరిగాయని, అతను అమెరికా నుంచి ఆర్థిక, సైనిక సహాయానికి బదులుగా దేశంలోకి యూఎస్ కార్యకలాపాలను అనుమతించాడని పేర్కొన్నారు. అదే సమయంలో సీఐఏ పాకిస్తాన్ గ్రూప్ లష్కరే తోయిబా, అల్-ఖైదా మధ్య గల సంబంధాలను గుర్తించిందన్నాను. ఇది అమెరికా నిఘా వ్యవహారాల్లో మైలురాయిగా నిలిచిందన్నారు.భారత్-పాక్ల గురించి మాట్లాడిన జాన్ కిరియాకౌ 2002లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందని అమెరికా నిఘా సంస్థలు భయపడ్డాయని, పార్లమెంట్ దాడి, ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో పెరిగిన ఉద్రిక్తతలే దీనికి కారణమన్నారు. నాడు అమెరికా ఈ ముప్పును తీవ్రంగా పరిగణించిందని, అందుకే ఇస్లామాబాద్ నుండి అమెరికన్ కుటుంబాలను ఖాళీ చేయించామని అన్నారు. ఆ సమయంలో వాషింగ్టన్ దృష్టి అల్ ఖైదా, ఆఫ్ఘనిస్తాన్పైననే ఉందని, అందుకే భారతదేశ ఆందోళనలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన వివరించారు.2008 ముంబై దాడుల గురించి కిరియాకౌ మాట్లాడుతూ ఈ దాడుల వెనుక పాకిస్తాన్ మద్దతు కలిగిన కశ్మీరీ ఉగ్రవాద గ్రూపుల హస్తం ఉందని అమెరికా నిఘా సంస్థలు భావించాయన్నారు. పాకిస్తాన్.. భారతదేశంలో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని ఆయన అన్నారు. పార్లమెంట్, ముంబై దాడుల తర్వాత భారత్ సంయమనం పాటించిందని, అయితే ఇప్పుడు భారత్ వ్యూహాత్మక సహనాన్ని కలిగి ఉండలేని స్థితిలో ఉందని ఆయన అన్నారు. ఎప్పుడు యుద్ధం వచ్చినా, భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోతుందని ఆయన కిరియాకౌ హెచ్చరించారు. నిరంతరం భారతీయులను రెచ్చగొట్టడంలో అర్థం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, 2011 మే 2న అమెరికా నేవీ సీల్ టీమ్ 6 పాకిస్తాన్లోని అబోటాబాద్లో బిన్ లాడెన్ను హతమార్చినట్లు అధికారికంగా ప్రకటించబడింది. కేవలం 2001లో అమెరికా పట్టుకునేందుకు యత్నించిన సమయంలో లాడెన్ తప్పించుకున్నాడనేది మాజీ సీఐఏ అధికారి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. -
మంత్లీ మ్యారేజ్ రివ్యూ!
పుస్తక సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంకా చెప్పుకోవాలంటే నిర్ణీత కాలవ్యవధిలో చేసే ‘వ్యాపార సమీక్ష’ల గురించి మనకు తెలుసు. అయితే ‘మ్యారేజ్ రివ్యూ’ అనేది మనం ఎప్పుడూ విని ఉండలేదు. బెంగళూరుకు చెందిన టెక్ ప్రొఫెషనల్ ప్రతీమ్ భోస్లే, ఫ్రెంచ్ యువకుడు సచా ఎర్బోనెల్ను వివాహం చేసుకొని ఆమ్స్టర్డామ్లో స్థిరపడింది. ఇటీవల ఆమె ‘మంత్లీ మ్యారేజ్ పెర్ఫార్మెన్స్ రివ్యూ’ పేరుతో ‘ఎక్స్’లో షేర్ చేసిన పోస్ట్ నెటిజనులను నవ్వుల్లో ముంచెత్తడమే కాదు ఆలోచింపజేస్తోంది. ఈ పనులు సజావుగా జరుగుతున్నాయి, ఈ పనుల్లో ఇబ్బంది ఏర్పడుతుంది, మెరుగు పరుచుకోవాల్సిన విషయాలు... ఇలా రకరకాల కోణాలలో మ్యారేజ్ మంత్లీ రివ్యూ రాసింది ప్రతీమ్. రివ్యూలో భాగంగా కొన్ని తీర్మానాలు కూడా రాసింది.అనవసర సలహాలు ఇవ్వకూడదు.ఒకరి పనుల్లో ఒకరు సహాయం చేసుకోవాలి.'నీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను కదా’ ఇలాంటి మాటలతో తగాదాలకు ఆస్కారం ఇవ్వకూడదు.అనుకోకుండా తగాదా జరిగితే దాని గురించి సోషల్ మీడియాలో రాయకూడదు.‘నవ దంపతులు ప్రతీమ్–సచా ఎర్బోనెల్ మ్యారేజ్ రివ్యూను అనుసరించి తప్పొప్పులను బేరీజు వేసుకుంటే వారి సంసారంలో ఎలాంటి సమస్యలూ ఉండవు’ అని రాశాడు ఒక నెటిజనుడు. నిజమే కదా! (చదవండి: Prabhas Diet: హీరో ప్రభాస్ అన్ని గుడ్లు తినేవాడా? బాహుబలి డైట్ అలా ఉండేదా..?) -
ఆపరేషన్ మధ్యలో క్లారినెట్ వాయించిన మహిళ..! ఆశ్చర్యపోయిన వైద్యులు
ఇటీవల బ్రెయిన్కి సర్జరీ మెలుకువగా ఉండగా చేసిన ఘటనలు చూశాం. కొందరూ పాటలు, సినిమాలు చూస్తూ చేయించుకున్నారు. అదంతా ఒక ఎత్తైతే. బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా..మధ్యలో ఓ సంగీత వాయిద్యాన్ని వాయించింది ఒక మహిళ . వైద్యులు సైతం విస్తుపోయారు. దీని కారణంగా తమ సర్జరీ సక్సెస్ అనేది తక్షణమే నిర్థారించుకోగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. మరి ఆ ఆసక్తికర కథేంటో చకచక చదివేద్దామా..!.లండన్లో చోటుచేసుకుంది ఈ అద్భుత ఘటన. లండన్లో క్రౌబేర్కు చెందిన 65 ఏళ్ల డెనిస్ బెకన్(Denise Bacon) గత కొన్నేళ్లుగా పార్కిన్సన్స్తో(Parkinsons disease) బాధపడుతోంది. రిటైర్డ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ అయినా ఆమె పార్కిన్సన్స్ నుంచి ఉపశమనం పొందేందుకు కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. ఆమెకు ఈ వ్యాధి 2014లో నిర్థారణ అయ్యింది. ఫలితంగా నడవడం, ఈత కొట్టడం, డ్యాన్స్ చేయడం వంటివి ఏమి చేయలేకపోయింది. ఐదేళ్ల నుంచి తను ఎంతో ఇష్టపడే గ్రిన్స్టెడ్ కచేరీ బ్యాండ్ ప్రదర్శనలో సైతం పాల్గొనడం మానేసిందామె. ఆ నేపథ్యంలో ఇలా బ్రెయిన్కి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది బేకన్. ఇది సుమారు నాలుగు గంటల ఆపరేషన్. అందులో భాగంగా ఆమె పుర్రెకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్నారు వైద్యులు. అంతలో మధ్యలో ఆమె చేతి వేళ్లను సునాయాసంగా కదిలించగలగడేమ కాదు, ఆపరేషన్ చేస్తుండగా మధ్యలోనే క్లారినెట్ను అద్భుతంగా వాయించింది. దాన్ని చూసి వైద్యుల సైతం విస్తుపోయారు. బ్రెయిన్ సర్జరీలో భాగంగా ఎలక్ట్రోడ్లు సక్రియం చేస్తుండగా చేతులు కదులుతున్నట్లు గమనించి.. ఇలా వాయిద్యాని వాయించాలని భావించానంటోంది. దీని కారణంగా తమ సర్జరీ విజయవంతమని, ఆమె సమస్య నుంచి బయటపడి మెరుగ్గా ఉందని తక్షణమే నిర్థారించగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. అంతేగాదు ఆమె ఆ సాహసం చేయాలనుకోవడం చాలా ప్రశంసించదగ్గ విషయమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశారు వైద్యులు. నెటిజన్లు సైతం శస్త్రచికిత్స మధ్యలో క్లారినెట్ వాయించడం అంటే.. అది మాములు ధైర్యం కాదంటూ బెకాన్ని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. Patient with Parkinson's disease plays clarinet during brain procedure at London hospital pic.twitter.com/en2vpRRfaA— The Associated Press (@AP) October 23, 2025 (చదవండి: కూతురి డ్రీమ్, తండ్రి సంకల్పం..! ఆ నాణేల సంచి వెనుక ఇంత భావోద్వేగ కథనా..) -
Bihar Election: మహిళలకు శాశ్వత ఉద్యోగం: తేజస్వీ భారీ హమీ
పట్నా: బిహార్లో వచ్చేనెల(నవంబర్)లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో నేతల ప్రచార పర్వం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ రాష్ట్రంలోని మహిళలకు భారీ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘జీవికా దీదీ’లకు ఉద్యోగం పర్మినెంట్ చేయడంతోపాటు, నెలకు రూ.30 వేల జీతం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న ‘జీవికా దీదీ’ పథకంలోని లోపాలను చక్కదిద్ది, మహిళలకు అండగా ఉంటామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఆర్జేడీ నేత నేత తేజస్వీ యాదవ్ తన ఎన్నికల ప్రచారంలో ‘జీవికా దీదీ’లపై హామీల వర్షం కురిపించారు. బిహార్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ‘జీవికా దీదీ’లకు రూ. 30 వేల జీతంతోపాటు వారు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని, బీమా కవరేజీని అందిస్తామని హామీనిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వ చేపట్టిన ‘జీవికా దీదీ’ పథకం తీరుతెన్నులపై తేజస్వీ పలు విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ‘జీవికా దీదీ’లకు అన్యాయం జరుగుతున్నదనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ పథకంలోని మహిళలను పర్మినెంట్ చేయాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని తాము నిర్ణయించామని తేజస్వీ పేర్కొన్నారు. వారి జీతం కూడా నెలకు రూ. 30 వేలకు పెంచుతామని, ఇది సాధారణ ప్రకటన కాదని అన్నారు. జీవికా దీదీల దీర్ఘకాల డిమాండ్ సాకారం చేయనున్నామని తేజస్వి యాదవ్ పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. జీవికా దీదీల ప్రస్తుత రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని, రాబోయే రెండేళ్లకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. దీనికితోడు ప్రతి జీవికా దీదీకి నెలకు రూ. రెండువేల అదనపు భత్యం, రూ. ఐదు లక్షల బీమా కవరేజ్ అందిస్తామన్నారు. కాగా ‘జీవికా దీదీ’ పథకం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. -
కారుతో ఢీకొట్టి.. కత్తులతో గొంతు కోసి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : పట్టపగలు ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీకొట్టి.. కత్తులతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మ కూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో మంగళవా రం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి మల్ల య్య–భిక్షమమ్మ(40) దంపతులకు ఇద్దరు కుమారు లు. మల్లయ్య లారీ డ్రైవర్గా, పెద్ద కుమారుడు భరత్ హైదరాబాద్లో మెకానిక్గా, చిన్నకుమారుడు ప్రవీణ్ సూర్యాపేటలో ఓ చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. మల్లయ్య–భిక్షమమ్మ దంపతులకు ఇటీవల తగాదాలు జరగ్గా.. మంగళవారం పెద్దల సమక్షంలో మా ట్లాడి భిక్షమమ్మ ఇంటికి తిరిగి వస్తోంది. గ్రామ నడిబొడ్డుకు రాగానే గుర్తుతెలియని వ్యక్తులు భిక్షమమ్మను వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. కిందపడిన ఆమె వద్దకు దుండగులు కారు దిగి వచ్చి తమ వెంట తెచ్చుకున్న కత్తులతో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో భిక్షమమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో.. మృతురాలు భిక్షమమ్మకు ఆమె భర్త మల్లయ్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భిక్షమమ్మకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. ఈ విషయమై పెద్దలు సైతం పంచాయితీలు చేసి సర్ది చెప్పినట్టు తెలిసింది. ఇటీవల సూర్యాపేటకు చెందిన ఓ దేశ గురువు భిక్షమమ్మతో చనువుగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. ఇదే విషయమై మల్లయ్య పెద్దల సమక్షంలో భార్యను మందలించేందుకు స్థానికంగా ఓ పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. పెద్దలు ఇరువురిని సముదాయించి పంపించగా.. కొద్దిసేపటికే ఆ పార్టీ కార్యాలయ సమీపంలోనే భిక్షమమ్మ దారుణ హత్యకు గురైంది. మృతురాలి భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులతోపాటు దేశ గురువు, వారి కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలే హత్య జరిగిన సమాచారం తెలుసుకున్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్గౌడ్లు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఒకప్పుడు మిలిటరీ డాక్టర్.. ఇప్పుడేమో క్యాబ్ డ్రైవర్!
బెంగళూరుకు చెందిన ఓ మహిళకు కెనడాలో కారులో మిస్సిస్సాగా నుంచి టొరంటోకు ప్రయాణిస్తున్నప్పుడు వింత అనుభవం ఎదురైంది. తాను ఎక్కిన క్యాబ్ డ్రైవర్తో మాటామంతి సాగిస్తుండగా తన ప్రొఫైల్ విని ఆశ్చర్యపోయింది. ఆ డ్రైవర్ తనతో ఏ విషయాలు పంచుకున్నారో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయింది.క్యాబ్ డ్రైవర్ బెంగళూరు మహిళ మేఘనా శ్రీనివాస్తో చెప్పిన వివరాల ప్రకారం..‘నేను ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వ్యక్తిని. గతంలో యూఎస్, కెనడా కోసం మిలిటరీలో వైద్యుడిగా పనిచేశాను. ప్రస్తుతం కెనడాలో పర్మనెంట్ రెసిడెంట్(PR) కోసం ప్రయత్నిస్తున్నాను. నా వైద్య వృత్తిని కొనసాగించడానికి అవసరమైన లైసెన్స్ పొందడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం కెనడాలో ఒక డిగ్రీ కోసం చదువుతున్నాను. రోజువారీ ఖర్చుల కోసం ఇలా క్యాబ్ నడుపుతున్నాను. క్యాబ్ నడపడం ద్వారా సుమారు నెలకు 4,000 డాలర్లు సంపాదిస్తున్నాను. కానీ టొరంటోలో ఒక పడకగదికి సుమారు 3,000(రూ.2.63 లక్షలు) డాలర్లు చెల్లించవలసి వస్తుంది. టొరంటోలో అద్దెగదులు చాలా ఖరీదైనవి’మేఘనా తన పోస్ట్లో విదేశాలకు మకాం మార్చే ముందు ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి సరైన ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. కెనడాకు వెళ్లే ముందు విద్యార్థులు, ఇతర వ్యక్తులు క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పారు. అక్కడి విద్యా వ్యవస్థ లేదా నగరాల గురించి మాత్రమే కాకుండా జీవన ఖర్చులు, విధానాలు, ఉద్యోగ మార్కెట్.. వంటి చాలా అంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలని తెలిపారు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
నా ఫోటో చూపిస్తే పోలీసులకే దడ పుడుతుంది..
ఎన్టీఆర్ జిల్లా: ఆర్డీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తమపై దురుసుగా ప్రవర్తించిందని డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎనీ్టఆర్ జిల్లా కంచికచర్లలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళ జగ్గయ్యపేట డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సును విజయవాడలో ఎక్కింది. ఆమె పరిటాలలో దిగాల్సి ఉంది. ఆమె బస్సు ఎక్కి ఫుట్పాత్పై నిల్చుంది. గమనించిన డ్రైవర్ ఆమెను లోపలికి వెళ్లమని సూచించాడు. దీనిపై ఆమె డ్రైవర్పై గొడవకు దిగింది. ఎందుకమ్మా డ్రైవర్పై గొడవ పడతున్నావన్న కండక్టర్పైనా ఆమె మండిపడింది. ఇద్దరు కలసి తనను మందలిస్తారా.. ఇది ఫ్రీ బస్సు.. నా ఫొటో తీసుకో.. ఈ ఫొటోను విజయవాడ సిటీలో లేదా చిల్లకల్లు, కంచికచర్ల పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చూపించుకో.. నా ఫొటో చూడగానే పోలీసులకే దడ పుడుతుందంటూ కండక్టర్పై దురుసుగా ప్రవర్తించింది. ‘అమ్మా కండక్టర్ అయ్యప్ప మాల ధరించాడు అతనిపై దుర్భాషలాడకూడదు’ అని హితవు పలికిన తోటి మహిళలను కూడా దుర్భాషలాడింది. బస్సు డ్రైవర్ పరిటాల గ్రామంలో బస్సును ఆపకుండా నేరుగా కంచికచర్ల పోలీస్స్టేషన్ వద్ద బస్సు ఆపి మహిళపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విశ్వనాథ్ మహిళను మందలించి కండక్టర్, డ్రైవర్లకు సర్ది చెప్పి పంపించి వేశారు. -
సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ బాలికపై లైంగికదాడి
కొత్తపల్లి (కరీంనగర్): బాలికపై అత్యాచారం చేస్తూ.. సెల్ఫోన్లో చిత్రీకరించి ఆపై వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ఇద్దరు యువకులు ప్రేమపేరుతో నమ్మించారు. ఓ రోజు గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తేరుకున్న బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్కుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ యువకులు విశ్వతేజ (19), సన్నీ (21)లను అరెస్టు చేసి పోక్సో కింద కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది..దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!
చదువు అయిన తరువాత ఉద్యోగం రావడం అంత సులువుకాదు. అదీ మన మనసుకు నచ్చిన జాబ్ రావడమంటే జాక్ పాట్ కొట్టినంత ఆనందమే. దీనికి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు , తెగువ, స్మార్ట్నెస్ కూడా ఉండాలని నిరూపించిందో యువతి. కేవలం అయిదే అయిదు నిమిషాల్లో ఉద్యోగాన్ని సాధించిన యువతి స్టోరీని టెక్ కంపెనీ సీఈవో సోషల్మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈస్టోరీ నెట్టింట హల్చల్ చేస్తోంది.కోడ్ ఆఫ్ అజ్ CEO సాండి స్లోంజ్సాక్ అందించిన వివరాల ప్రకారం కేవలం ఐదు నిమిషాలు మాట్లాడిన తరువాత ఒక కళాశాల విద్యార్థినిని తాను నియమించు కున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మనోధైర్యం, తెలివి, నిజాయితీపై ప్రశంసలు కురిపించారు. "తమ కంపెనీలో ఎలాంటి ఉద్యోగ ఖాళీలు లేకపోయినా ... ఓపెన్ లెటర్ దరఖాస్తు పంపే ధైర్యం ఉంది, తనకు ఏమీ తెలియదని ఒప్పుకోవడమేకాదు, కష్టపడి పని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది" అని చెప్పుకొచ్చారు. ఆమె సూపర్ కమ్యూనికేటివ్, స్ట్రెయిట్ షూటర్. చాలా స్మార్ట్, చాలా వినయంతో ఉంది. జీతం గురించి పట్టించుకోనని తెలిపిందంటూ ట్వీట్ చేశారు. ఖాళీ సమయంలో తన సొంత ప్రాజెక్టులలో పనిచేసిందని చెప్తూ, కృషి అంకితభావాన్ని గురించి చెప్పుకొచ్చారు. ఆమె నిజాయితీ, అభిరుచి, పట్టుదల తనను చాలా ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. మూడు నెలల కనీస వేతనంతో జాబ్ ఆఫర్ చేసి, రేపటినుంచే ఉద్యోగంలో చేరిపోవచ్చని ఆమెకు గుడ్ న్యూస్ చెప్పారు. (హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!)today i hired a college student after just 5 minutes of talking to her1. had the guts to send an open letter application although we had no job openings 2. straight up admitted she knows nothing3. told she’s willing to work as an animal to learn as much as she can4. open…— Sandi Slonjšak (@sandislonjsak) October 8, 2025సోషల్ మీడియా రియాక్షన్సోషల్ మీడియాలో సీఈవో, విద్యార్థిని ఇద్దరిపైనా ప్రశంసలు వెల్లువెత్తాయి.‘నిజమైన రత్నాన్ని గుర్తించారు.. మీ కంపెనీలో నేర్చుకోవాలనే ఆమె ఆసక్తిని ఎలా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందా? అనే అసక్తిని ప్రదర్శించారు. రిక్రూటర్లు అందరూ మీలా వుండరు సార్ , ఆమెకు ఎంచుకున్నందుకు సంతోషం, ఆమెను మీ ఆధ్వర్యంలో బాగ నైపుణ్యాన్ని సాధిస్తుందని మరొకరు కమెంట్ చేశారు.చదవండి: జస్ట్ 10 లక్షల లోన్తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి! -
చిన్న ప్రయత్నమే..కానీ ఎఫెక్ట్ ఎవరెస్టు రేంజ్..!
ప్రజలకు అవగాహన కల్పించేలా చేయడం అంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. కార్యరంగంలోకి దిగాక తెలుస్తుంది అసలైన సమస్య. కానీ ఈ మహిళ అవేమి పట్టించుకోకుండా స్వచ్ఛందంగా పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న తీరు ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది. పైగా రెండు భాషల్లో వారికర్థమయ్యేలా చెబుతున్న తీరుకి హ్యాట్సాఫ్ అనాల్సిందే. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ స్వచ్ఛందంగా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. అందుకోసం సిటీ బస్సు ఎక్కి మరీ వీధుల్లో చెత్త వేయొద్దంటూ ప్రయాణికులను కోరడమే గాక..ఇలా అందరూ సమిష్టిగా చేస్తే..దాని ప్రభావం దేనికి దారితీస్తుందో నొక్కి చెప్పింది. ఈ ఘటన బెంగళూరు సిటీ బస్సులో చోటుచేసుకుంది. ఆమె కన్నడ, హిందీ భాషలలో ప్రజలకు తన సందేశాన్ని వినిపించడం విశేషం. అంతేగాదు ప్రయాణికులు టిక్కెట్ల, గుట్కా ప్యాకెట్లు రోడ్లపై వేయొద్దని అభ్యర్థిస్తూ అవగాహన కల్పించింది. "మార్పు మన నుంచి మొదలవ్వాలి.. మీ చెత్తను ఇంటికి తీసుకువెళ్లండి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం." అని పిలుపునిస్తున్న తీరు అక్కడున్నవారందర్నీ బాగా ఆకర్షించింది. ఎవరేం అనుకున్నా పర్లేదు..మార్పు ఒక్కటే ముఖ్యం అంటూ వాలంటీర్గా ముందుకువచ్చి ఇలా బహిరంగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. కచ్చితంగా ఇది ఎవరెస్టు రేంజ్కి మార్పుకి నాంది పలికి తీరుతుంది అంటూ పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తూ పోస్టులు కూడా పెట్టారు. అంతేగాదు ప్రయత్నం చూడటానికి సాదాసీదాగా కనిపించొచ్చు..మార్పు సంతరించుకున్నప్పడూ కచ్చితంగా దాని విలువ తప్పక తెలుస్తుంది కదూ..!. View this post on Instagram A post shared by Pune News Age (@punenewsage) (చదవండి: హిమాలయన్ ఆంటీ'..ఆమె శిఖరాగ్ర శక్తికి సాటిలేదు!) -
ఆంటీ నువ్వంటే నాకు ఇష్టం..!
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): వివాహిత మహిళ స్నానం చేస్తుండగా చూడడమే కాకుండా.. ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన బాలుడు (16)పై అజిత్సింగ్నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. న్యూరాజరాజేశ్వరీపేట కేర్ అండ్ షేర్ స్కూల్ సమీపంలో నివసిస్తున్న 35 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం ఉదయం ఇంట్లో స్నానం చేసి దుస్తులు మార్చుకొంటుండగా అదే ప్రాంతానికి చెందిన బాలుడు ఆమెను గమనిస్తూ నువ్వంటే ఇష్టం అంటూ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు పెట్టడంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జగన్ పై అంతులేని ప్రేమ.. నడి రోడ్డుపై దిష్టి తీసిన మహిళ
-
Delhi: నిద్రిస్తున్న భర్తపై మరిగే నూనె, ఎర్ర కారం.. అరిస్తే ఇంకా పోస్తానంటూ..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని మదన్గీర్లో ఉంటున్న దినేష్.. ఇంట్లో నిద్రస్తున్న సమయంలో అతని భార్య అతనిపై సలసల మరుగుతున్న నూనె, ఎర్రటి కారం పొడి పోసి, అతనికి నరకం అంటే ఏమిటో చూపించింది. అక్టోబర్ 3న ఫార్మాస్యూటికల్ కంపెనీ కార్మికుడు దినేష్(28) కాలిన గాయాలతో సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేరిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది.అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం దినేష్ నిద్రపోతున్నసమయంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అతని భార్య అతని శరీరంపై వేడి నూనె పోసింది. ఆ సమయంలో ఆ దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె ఇంట్లోనే ఉంది. అక్టోబర్ 2న.. తన పని ముగించుకున్నాక ఇంటికి తిరిగి వచ్చి, రాత్రి భోజనం చేసి, పడుకున్నానని దినేష్ పోలీసులకు తెలిపాడు. ‘నా భార్య, కుమార్తె అదే గదిలో నిద్రపోతున్నారు. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో, నాకు అకస్మాత్తుగా శరీరం అంతటా మంటపుట్టింది. నా భార్య నా శరీరం, ముఖంపై మరిగే నూనె పోయడం నేను చూశాను. నేను సహాయం కోసం అరుస్తున్నంతలో ఆమె నా కాలిన గాయాలపై ఎర్రని కారం పొడి చల్లింది" అని అతను తన ఫిర్యాదులో ఆరోపించాడు.బాధితుడు అరుస్తుండగా అతని భార్య ‘అరచి గోల చేస్తే.. మీ మీద మరింత నూనె పోస్తానని బెదిరించింది. అయితే దినేష్ బాధను తట్టుకోలేక గట్టిగా కేకలు పెట్టాడు. దానిని విన్న కింద అంతస్తులో ఉంటున్న అతని ఇంటి యజమాని కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో ఒకరైన అంజలి మీడియాతో మాట్లాడుతూ ‘ఏం జరుగుతున్నదో చూసేందుకు మా నాన్న ముందుగా పైకి వెళ్ళారు. దినేష్ భార్య లోపలి నుంచి తలుపు తాళం వేసింది. తలుపు తెరవమని మేము వారిని అడిగాం. కొద్దిసేపటి తరువాత ఆమె తలుపులు తెరిచింది. దినేష్ బాధతో విలవిలలాడటాన్ని చూశాం’ అని తెలిపింది.ఈ ఘటన దరిమిలా ఇంటి యజమాని కలగజేసుకుని, బాధితుడిని ఆటోలో ఒంటరిగా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని మెరుగైన చికిత్స కోసం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి పంపించారు. దినేష్ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం దినేష్ భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వివాదంలో పోలీసులు ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. తాజాగా ఘటనలో దినేష్ భార్యపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. -
నడుం నొప్పి తట్టుకోలేక, ఎనిమిది కప్పల్ని మింగేసింది... కట్ చేస్తే
ఎవరో ఏదో చెప్పారని, అశాస్త్రీయమైన వైద్య విధానాల్ని, పద్ధతుల్ని అవలంబించేవారికి ఇది షాకింగ్ న్యూస్. ఎన్నాళ్లుగానో వేధిస్తున్న నడుం నొప్పిని తట్టుకోలేక చైనాకు చెందిన ఒక వృద్ధురాలు పాత ఆచారాన్ని పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. విషయం ఏమిటంటే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం తూర్పు చైనాలోని 82 ఏళ్ల వృద్ధురాలు జాంగ్ హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతోంది . ఈ బాధను భరించలేక బతికున్న కప్పలను మింగేసింది.ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిందింటిని మింగింది. ఇలా సజీవ కప్పలను మింగడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని స్థానికంగా ప్రచారంలో ఉన్న విషయాన్ని నమ్మి ఇలాచేసినట్టు తెలుస్తోంది.నడుం నొప్పి తగ్గలేదు సరికదా, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రి పాలైంది. విషయం తెలిసి వైద్యులే నివ్వెర పోయారు. చాలాకాలంగా హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతున్న జాంగ్, అసలు విషయం చెప్ప కుండానే తనకు కప్పలు కావాలని కుటుంబ సభ్యులను కోరింది. ఇలా మొదటి రోజు మూడు కప్పలను, మరుసటి రోజు ఐదు కప్పలను సజీవంగా మింగేసింది. దీంతో క్రమంగా పరిస్థితి క్షీణించడంతో అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు వైద్యులను సంప్రదించారు. వైద్యుల ప్రకారం ఆమె పొట్టలో పరాన్నజీవి సంక్రమణను కనుగొన్నారు. ఆక్సిఫిల్ కణాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కప్పలలో సాధారణంగా కనిపించే టేప్వార్మ్ లార్వా స్పార్గానమ్తో సహా, ఇతర బాక్టీరియా ఉనికిని వైద్యులు నిర్ధారించారు. నడవలేని స్థితిలో రెండు వారాల పాటు చికిత్స తీసుకుని ఎట్టకేలకు ఇంటికి చేరింది సజీవంగా కప్పలను మింగడం వల్ల రోగి జీర్ణవ్యవస్థ దెబ్బతిని, పరాన్నజీవులు చేరాయి ఆసుపత్రి వైద్యుడు తెలిపారు.నోట్ : ఆరోగ్య చిట్కాలు చిట్కాలు మాత్రమే అని గమనించాలి.అవి పరిష్కారం ఎంతమాత్రం కావు. అందులోనూ సుదీర్ఘ కాలంలో బాధపడుతున్న వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. లేదంటే మొదటికే మోసం రావచ్చు. -
షాకింగ్ వీడియో.. మహిళను నదిలోకి లాక్కెళ్లిన మొసలి
జాజ్పూర్: ఒడిశాలోని జాబ్పూర్ జిల్లా కాంతియా గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ఖరస్రోత నదిలో ఓ మొసలి.. మహిళను లాక్కెళ్లిపోయింది. నదిలో స్నానం చేస్తున్న సౌదామిని (57)ని ఒక ముసలి లాక్కెళ్లడంతో గ్రామంలో కలకలం రేగింది. మహిళను రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించి.. విఫలమయ్యారు. గల్లంతైన మహిళ కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సోమవారం( అక్టోబర్ 6) సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆమె బట్టలు ఉతికేందుకు ఖరస్రోత నది వద్దకు వెళ్లింది. నది ఒడ్డున ఓ చోట స్నానం చేస్తుండగా ఓ మొసలి ఆమెను ఒక్కసారిగా నదిలోకి లాక్కెళ్లింది. అయితే ఓ వంతెనపై వెళ్తున్న స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. గ్రామస్తులు ఆ మొసలిని వెంబడించి ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. చివరికి ఆమెను కాపాడలేకపోయారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.A live video went viral from Jajpur, Bari area, where a crocodile dragging a waman in to the river, pubil getting panic after watching video #odisha #jajour #crocodile #news #viral #live pic.twitter.com/J1lR1k01D2— Ajay kumar nath (@ajaynath550) October 7, 2025 -
నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?
ఒకపుడు ఆమెను తమ సంస్థలో ఉద్యోగానికి తిరస్కరించింది.కట్ చేస్తే రెండేళ్లలోపే అదే కంపెనీలో ఉన్నత పదవికి ఎంపికైంది. ఇదే కదా సక్సెస్ కిక్ అంటే.. ఆ సక్సెస్ పేరే రాగిణి దాస్. ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారిన రాగిణీ దాస్ స్టోరీ ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలోమహిళా-కేంద్రీకృత ప్రొఫెషనల్ నెట్వర్క్ లీప్.క్లబ్(Leap club) సహ వ్యవస్థాపకురాలు, FICCIలో ఉమెన్ ఇన్ స్టార్టప్స్ కమిటీ చైర్పర్సన్ రాగిణి దాస్ ఇపుడు గూగుల్ ఇండియాలో స్టార్టప్ హెడ్గా ఎంపికైంది. 2013లో గూగుల్ ఉద్యోగానికి సంబంధించి చివరి ఇంటర్వ్యూ రౌండ్లో ఎంపిక కాలేక పోయింది. కట్ చేస్తే లీప్.క్లబ్ సహ వ్యవస్థాపకురాలిగా జొమాటో వంటి సంస్థలతో కూడా పనిచేసిన అనుభవంతో గూగుల్ ఇండియా స్టార్టప్ హెడ్గా నియమితులైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిజంగా జీవితం చక్రం లాంటిది.. తిరిగి అవకాశం వచ్చింది అంటూ ట్విట్ చేసింది.గూగుల్లో తన కొత్త బాద్యతలను గురించి వ్యాఖ్యానిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లను సమర్థులైన వ్యక్తులు, ఉత్పత్తులు , ఉత్తమ పద్ధతులతో అనుసంధానించడం ద్వారా వాటిని అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి, వారికి సాయం అందించే లక్ష్యంతో ఉన్నామని తెలిపింది. (84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా! )Life has come full circle, and I’m excited to share that I’ve joined @Google as Head of Google for Startups - India 🍋The backstory: In 2013, I sat for two interviews: one at Google and one at Zomato. pic.twitter.com/Hs9cqKHFxJ— Ragini Das (@ragingdas) October 6, 2025ఎవరీ రాగిణి దాస్?గురుగ్రామ్లో జన్మించిన రాగిణి దాస్, చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమంలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. అందుకు ముందు సాంస్కృతిక కార్యదర్శిగా కూడా పనిచేసింది. అలాగే గ్రాడ్యుయేషన్ సమయంలో, ఆమె స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ , ఇతర సంస్థలతో ఇంటర్న్ గా, మార్కెట్ పరిశోధన మరియు భారత మార్కెట్ కోసం వ్యాపార ప్రణాళికలను డెవలప్ చేసింది. 2012లో, దేశీయ మార్కెటింగ్ కోసం ఫ్రంట్లైన్ వ్యవస్థాపకురాలిగా ట్రైడెంట్ గ్రూప్ ఇండియాలో చేరింది. అనంతరం యూరప్ అండ్ యుఎస్ మార్కెటింగ్ నిర్వహణలో పదోన్నతి పొందింది. తిరిగి ఒక్క ఏడాదిలోనే 2013లో, జొమాటోలో రాగిణి సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్గా చేరింది. అకౌంట్ మేనేజర్, ఏరియా సేల్స్ మేనేజర్తో సహా వివిధ పాత్రల్లో ఆరేళ్లు తన సేవలను అందించింది.చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో 2017లో, ఆమె జోమాటో గోల్డ్ వ్యవస్థాపక బృందంలో భాగమైంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఖతార్ మరియు లెబనాన్తో సహా 10 అంతర్జాతీయ మార్కెట్లలో జోమాటో గోల్డ్ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించింది.2020లో, వేలాది మంది మహిళల కోసం ఆన్లైన్ యాప్ మరియు ఆఫ్లైన్ క్లబ్ను leap.clubను సహ-స్థాపించింది వేలాది మంది మహిళలకు నెట్వర్కింగ్, ప్రొఫెషనల్ అవకాశాలు, క్యూరేటెడ్ ఈవెంట్లు ,ఆసక్తి-ఆధారిత కమ్యూనిటీలను అందిచింది. ఈ ఏడాది జూన్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రస్తుతం రాగిణి దాస్, గూగుల్ ఫర్ స్టార్టప్స్ భారతదేశ విభాగానికి కొత్త హెడ్గా ఎంపికకావడం విశేషం. -
చెట్టు.. తీసింది కీర్తన ఊపిరి
దొడ్డబళ్లాపురం: బెంగళూరు నగరానికి చెట్లు ఎంత అందాన్ని ఇస్తాయో అంతే ముప్పుగా కూడా మారాయి. ఎప్పుడు ఏది విరిగిపడి ప్రాణం తీస్తుందో తెలియడం లేదు. చెట్టు పడి యువతి దుర్మరణం చెందగా, మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన సిటీలో సోలదేనహళ్లిలో జరిగింది. హెబ్బాళకు చెందిన కీర్తన (24) మృతురాలు కాగా, మరో బైకిస్టు భాస్కర్, రాధ క్షతగాత్రులు. గతంలో ఫిర్యాదు ఈ ఘటనతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను కొట్టివేయాలని ఎన్నిసార్లు పాలికె సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. పడిపోయిన చెట్టు ఏడాది నుంచి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. మ్యాచ్ చూసి వస్తుండగా.. ఎలా జరిగిందంటే.. ఆదివారం కీర్తన, ఆమె స్నేహితురాలు రాధతో ఆచార్య మైదానంలో జరిగే శాండల్వుడ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ను చూడడానికి స్కూటర్లో వెళ్లారు. మ్యాచ్ ముగిశాక సాయంత్రం 7 గంటల సమయంలో తమ స్కూటర్లో ఇళ్లకు బయల్దేరింది. కీర్తన స్కూటర్ వెనుక కూర్చుంది. సోలదేనహళ్లి పోలీస్స్టేషన్ సమీపంలో పెద్ద చెట్టు విరిగి పడింది. ఆ సమయంలో ఎలాంటి గాలి వాన లేవు.చెట్టు కింద నలిగిన కీర్తన క్షణాల్లోనే చనిపోయింది. రాధ, మరో బైక్పై వస్తున్న భాస్కర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అందరినీ స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు కీర్తన చనిపోయినట్లు తెలిపారు. మిగతా ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. -
నువ్వు చాలా అందంగా ఉన్నావ్..
సాక్షి, నంద్యాల: ఆమె భర్తను కోల్పోయిన ఒంటరి మహిళ. దీంతో ఆ సీఐ కన్నుపడింది. ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్..! నిన్ను, నీ పిల్లలను బాగా చూసుకుంటాను’’ అంటూ మాటలు కలిపాడు. లోబర్చుకునేలా పొగిడాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పెట్టించుకున్నాడు. ఇప్పుడు నీతో సంబంధమే లేదు పో అంటూ తిరస్కరిస్తున్నాడు. దీంతో నంద్యాల పట్టణంలోని మూలసాగరానికి చెందిన బాధితురాలు శనివారం మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకుంది.ఆమె చెప్పిన వివరాలు... ‘‘నా భర్త రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో నాకు రైల్వేలో ఉద్యోగం ఇచ్చారు. నంద్యాల త్రీటౌన్ సీఐ కంబగిరి రాముడుది మా ఊరే. 8 నెలల క్రితం ఫోన్లో పరిచయమయ్యారు. సొంత ఊరి వారవడంతో అరమరికలు లేకుండా మాట్లాడాను. ఖాళీగా ఉంటే స్టేషన్ వద్దకు రా అంటూ పిలిచేవారు. ఈ విధంగా మా మధ్య చనువు ఏర్పడింది. అయితే, సీఐ మభ్యపెట్టి నా వీడియోలు, ఫొటోలు తీశారు. వీటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని కర్నూలు డీఐజీ, నంద్యాల జిల్లా గత ఎస్పీకి పలుసార్లు ఫిర్యాదు చేసినా వారు ఆయనకే వత్తాసు పలికారు.’అనిఆవేదన వ్యక్తం చేసింది.పిల్లల్ని చంపేస్తా.. గంజాయి కేసు పెడతానా వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, నన్ను, నా పిల్లలను చంపేస్తానని, గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించారు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని గత ఎస్పీకి ఫిర్యాదు చేశా. ఆ తర్వాత ‘‘నీ ఫొటోలు అన్నీ డిలీట్ చేయించా. సీఐ ఇక నీ జోలికి రాడు. ఆయనపై కేసు పెట్టొద్దు అని డీఎస్పీ తెల్లకాగితంపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారు.నేను కర్నూలు డీఐజీని కలిసేందుకు వెళ్లి... సీఐ పేరు చెప్పగానే ఇక్కడినుంచి వెళ్లు, ఏమైనా ఉంటే అక్కడ తేల్చుకో అని కసురుకుని పంపించేశారు. సీఐ కారణంగా మానసికంగా కుంగిపోయా. ఎప్పుడు ఏం చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నా. కూటమి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగడం లేదు’’ అని బాధితురాలు వాపోయింది. కాగా, మహిళ ఆరోపణలపై సీఐ కంబగిరిరాముడును ఫోన్లో వివరణ కోరగా స్పందించలేదు. -
కంగారు పెట్టకండి.. గుద్దితే నాకే బొ*.. : మంత్రి నారా లోకేష్
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇందులో నేతలకు ఓ పద్ధతి అంటూ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ నేతల బూతు పురాణాలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా.. స్వయంగా చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవువుతున్నాయి. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ఓ మహిళా ఆటోడ్రైవర్ పక్కనే కూర్చున్న లోకేష్.. ఆమె కంగుతినే రేంజ్లో మాట అన్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఇతర నేతలంతా ఆటోలో ప్రయాణించారు. ఆ సమయంలో.. ఆటో వెనుక రాసిన కొటేషన్లు చదువుతూ, లోకేష్ హాస్యం చేయబోయారు. ‘‘కంగారు పెట్టకండి..గుద్దితే నాకే బొ*’’ అంటూ లోకేష్ నోట మాట వచ్చింది. దీంతో ఆ మహిళా డ్రైవర్ ఒక్కసారిగా కంగుతింది. అయితే మంత్రిగారూ ఫీలవుతారనుకుందో ఏమో.. ఆమె కూడా ఇబ్బందిగానే నవ్వుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు చేరింది. కనీస గౌరవం లేకుండా ఓ మహిళ ముందు ఇలాగేనా మాట్లాడేంది అంటూ ప్రశ్నిస్తున్నారు పలువురు. -
విజయవాడలో దారుణం.. లాడ్జిలో మహిళ స్నానం చేస్తుండగా..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన తెలంగాణకు చెందిన మహిళపై వేధింపులకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యవకులు.. మహిళ నగ్న వీడియోలు చిత్రీకరించారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.గవర్నర్పేటలోని ఓ లాడ్జిలో స్నానం చేస్తున్న మహిళను పక్క రూమ్లో నుంచి ఇద్దరు యువకులు వీడియో చిత్రీకరించారు. అలజడి కావడంతో యువకుల్ని బాధితురాలు గుర్తించింది. బాధితురాలు గవర్నర్పేట పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, ఇటీవల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానం టీటీడీ సదనంలో ఒక భక్తురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి భక్తురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆపై అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన (మంగళవారం, సెప్టెంబర్ 23) తెల్లవారుజామున జరిగింది. -
జపాన్ రాజకీయాల్లో పెనుసంచలనం!
జపాన్ రాజకీయాల్లో అత్యంత అరుదైన ఘట్టం ఈ శనివారం చోటు చేసుకోబోతోంది. కాబోయే ప్రధానిని(Japan Next PM) ఎన్నుకునేందుకు అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ శనివారం ఓటింగ్ నిర్వహించుకోనుంది. ప్రధాని రేసులో ఐదుగురు అభ్యర్థుల పేర్లు తెరపైకి రాగా.. సనాయే టకాయిచీ (64) మరియు షింజిరో కోఇజుమి (44) ప్రధానంగా పోటీలో ముందున్నారు.2024 అక్టోబర్, 2025 జూన్, 2025 జూలైలో పార్లమెంట్ ఉభయ సభలకు జరిగిన ఎన్నికల్లో ఎల్డీపీ వరుస పరాజయాలు చవిచూసింది. పార్టీ క్రమక్రమంగా మెజారిటీ కోల్పోవడం, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, పాత పాలనా విధానాలపై విమర్శల నేపథ్యంలో.. షిగెరూ ఇషిబా తన ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో పార్టీ కొత్త అధ్యక్షుడ్ని(ప్రధాని కూడా) ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే.. ఈ ఎన్నికతో జపాన్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతోంది. అయితే యువ ప్రధాని, లేదంటే తొలి మహిళా ప్రధాని రాబోయే రోజుల్లో ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతో హిరోబుమి 1885 డిసెంబర్ 22న జపాన్ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా మాజీ ప్రధాని ఇషిబాతో కలిపి 64 మంది ఆ దేశానికి ప్రధానులుగా చేశారు. అయితే పురుషాధిక్య రాజకీయాలతో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ దేశానికి.. మహిళా ప్రధాని అవకాశం లేకుండా పోయింది. అయితే.. యూరికో కోయికె 2016లో టోక్యో గవర్నర్గా ఎన్నికై.. జాతీయ స్థాయిలో నాయకత్వం కోసం మహిళలు పోటీ చేసే అవకాశానికి తలుపులు తెరిచారు. ఇప్పుడు.. సనాయే టకాయిచీ ప్రధాని రేసులో నిలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. బలాబలాలు.. అనుభవం వర్సెస్ యువ రక్తంగా జపాన్ ఈ ఎన్నికను భావిస్తోంది. ఎందుకంటే.. టకాయిచీకి దివంగత మాజీ ప్రధాని షింజో అబే రాజకీయ వారసురాలిగా పేరుంది. ఆయన ఆశీస్సులతోనే 2021 సెప్టెంబర్లో జరిగిన ఎల్డీపీ అధ్యక్ష పదవికిపోటీ చేశారామె. అయితే.. ఆ ఎన్నికల్లో పుషియో కిషిదా చేతిలో ఓడారామె. ఇక ఇప్పుడు.. ఆమె దూకుడు ఆర్థిక వ్యయం ప్రతిపాదనతో పీఎం రేసులో ప్రధానంగా నిలిచారు. పైగా ట్రంప్ను హ్యాండిల్ చేయడం ఈమె వల్లే సాధ్యం కావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోందక్కడ.ఇక.. జపాన్ రాజకీయాల్లో పాత తరపు నాయకత్వ శైలికి ప్రత్యామ్నాయం కావాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. దానికి తగ్గట్లే కోయిజుమి మితవాద పన్ను తగ్గింపు విధానాన్ని ముందుంచారు. ఇది జపాన్ ఆర్థిక దిశను మలుపు తిప్పే అంశం కావడంతో ఆసక్తి నెలకొంది.ముందస్తు పోల్స్, అంచనాల ప్రకారం.. పోటీ తీవ్రంగానే ఉన్నా కోయిజుమీనే ఆధిక్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం జరగబోయే ఎన్నికల్లో.. తొలి రౌండ్లో గనుక ఫలితం లేకపోతే మరో రౌండ్కు వెళ్తారు. తీవ్ర సంక్షోభం మధ్య.. జపాన్లో గత కొన్ని దశాబ్దాలుగా 1995 సిస్టమ్ అధికారం కొనసాగుతోంది. 1955లో స్థాపించబడిన ఎల్డీపీ(LDP) ఇప్పటికీ జపాన్ రాజకీయాలను శాసిస్తోంది. ఈ 70 ఏళ్ల కాలంలో.. 1993–1996(కూటమి ప్రభుత్వం), 2009–2012(డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ DPJ) మధ్య కాలాలను మినహాయిస్తే మిగతా ఏళ్లు ఎల్డీపీనే అధికారంలో కొనసాగింది. అయితే అనారోగ్య కారణాలతో షింజో అబే ప్రధాని పదవి నుంచి దిగిపోయాక.. ఆ పార్టీ పట్టు కోల్పోతూ వస్తోంది. ఈ తరుణంలో కొత్త నాయకత్వం ద్వారా పార్టీని పునరుద్ధరించుకోవాలని భావిస్తోంది.ఇదీ చదవండి: మోదీ నా స్నేహితుడు.. ఆయన అలాంటి పని చేయబోరు! -
హైదరాబాద్లో యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అనుమానాస్పదస్థితిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివురాలిలా ఉన్నాయి. హైదర్గూడ ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్తె ఇషిక (29) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ప్రముఖ సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తోంది.జూన్ చివరి వారంలో నగరంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చిన ఆమె అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం గదిలో నుంచి బయటికి రాకపోవడంతో తల్లి రాత్రి 7 గంటల ప్రాంతంలో బెడ్రూమ్ వద్దకు వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించింది. దీంతో రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. -
పండుగ పూట పెట్టెతో సహా గోల్డ్ కొట్టేసింది..! వీడియో వైరల్
బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి.కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతూ సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది పసిడి. గ్రాము బంగారం కొనాలంటే జనం బెంబేలెత్తుతున్న పరిస్ఙతి. ఈ క్రమంలో ట్విటర్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లోని ఒక జ్యుయల్లరీ దుకాణంలో ఒక మహిళ తన చేతివాటి చూపించింది. బంగారం షాపింగ్ చేస్తున్నట్టుగానే నటిస్తూ లక్షలు విలువ చేసే నగను పెట్టెతో సహా దాచేసింది. కానీ విషయం షాపులోనే ఉన్న కెమెరానుంచి మాత్రం తప్పించు కోలేక పోయింది. ఒక ట్విటర్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. బంగారం ధరలు గ్రాముకు రూ 12 వేలు దాటేసింది. ఇలాంటి దొంగతనాలు బాగా పెరిగే అవకాశం ఉంది... ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఎప్పుడూ లేనంతగా అప్రమత్తంగా ఉండాలి! అనే క్యాప్షన్తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 🚨 With gold prices soaring past ₹12k/gram, theft cases are bound to spike...Jewellers must stay more alert than ever!#UttarPradesh | Bulandshahr: Woman caught on camera stealing..stuffs an entire jewellery box inside her saree 👇 pic.twitter.com/5FRxWAQrA0— Nabila Jamal (@nabilajamal_) October 1, 2025 -
దుర్గా పూజలో విషాదం : మహిళ మృతి.. పోలీసుల నిర్లక్ష్యం?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అంతటా ప్రస్తుతం అత్యంత వేడుకగా దుర్గా పూజలు జరుగుతున్నాయి. అయితే కోల్కతాలోని ఒక దుర్గా పూజా మండపంలో విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి పూజలు జరుగుతున్న ఒక మండపానికి వచ్చిన మహిళ అనారోగ్యానికి గురై, మృతిచెందింది. అయితే మృతురాలి కుటుంబీకులు ఈ ఘటనకు పోలీసుల నిరక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.‘ఏబీపీ ఆనంద’లోని వివరాల ప్రకారం కోల్కతాలోని ‘బెహలా నూతన్ దాల్’ దుర్గామాత పూజా మండపానికి వచ్చిన సంగీత రాణా అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది బాధితురాలికి వెంటనే సీపీఆర్ అందించారు. అయినా ఆమె పరిస్థితి విషమించడంతో విద్యాసాగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, ఆమె మృతిచెందింది. అనంతరం అమె మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా సంగీత దీర్ఘకాలంగా ఆస్తమాతో బాధపడుతోందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.మృతురాలి బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ‘బాధితురాలికి ఆక్సిజన్ అందించాలని తాము పదేపదే అభ్యర్థించినప్పటికీ పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. అలాగే బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్లో ఆక్సిజన్ సౌకర్యాలు లేవు’ అని ఆరోపించారు. అయితే ఈ వాదనను పోలీసులు ఖండించారు. ఇదిలావుండగా బీజేపీ నేత సజల్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు జనాన్ని అదుపుచేయడంలో, వారికి సహాయం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాగా డయల్ 100కు దుర్గా మండపాలకు సంబంధించిన పలు ఫిర్యాదులు వస్తున్నాయని డీసీ సెంట్రల్ ఇందిరా ముఖర్జీ తెలిపారు. విపరీతమైన శబ్ధాల కారణంగా పలువురు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. -
కాబోయే భర్తకు లవర్ ఉందని తెలిసి.. షాకిస్తున్న మరో ఘటన
సంభాల్: ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో దారుణం చోటుచేసుకుంది. ఒక ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్లో అరెస్ట్ చేశారు. ఈ దాడికి అతనిని ప్రేరేపించిన జాహ్నవి అలియాస్ అర్చనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.కాబోయే భర్త ప్రియురాలిపై యాసిడ్ దాడిపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని అమ్రోహా జిల్లాలోని తిగ్రి గ్రామానికి చెందిన నిషు తివారీ (30)గా గుర్తించారు. సెప్టెంబర్ 23న నఖాసా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 22 ఏళ్ల టీచర్ పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళుతుండగా, నిందితుడు స్కూటర్పై వస్తూ, దేహ్పా గ్రామం సమీపంలో ఆమె ముఖంపై యాసిడ్ పోశాడని పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) కృష్ణ కుమార్ తెలిపారు. దాడిలో టీచర్కు 20 నుండి 30 శాతం మేరకు కాలిన గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే బాధితురాలిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి చేర్చారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు సాగించారు.ఎన్కౌంటర్లో నిందితునికి గాయాలుగురువారం రాత్రి కళ్యాణ్పూర్ గ్రామం సమీపంలో స్కూటర్పై వెళుతున్నప్పుడు నఖాసా పోలీసులు నిషును ఆపినప్పుడు, అతను అధికారులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో అతని రెండు కాళ్లకు దెబ్బలు తగిలాయని పోలీసులు తెలిపారు. వెంటనే నిషును అరెస్టు చేసి, చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతని వద్ద నుంచి ఒక పిస్టల్, రెండు కార్ట్రిడ్జ్లు, స్కూటర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అక్కాచెల్లెళ్ల పేరుతో నాటకమాడి..పోలీసులు విచారణలో నిషు తివారి పలు ఆసక్తికర వివరాలు తెలిపాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక మహిళ తనను ప్రేమిస్తున్నట్లు చెప్పిందని, ఆమె డాక్టర్ అర్చనగా పరిచయం చేసుకున్నదని తెలిపాడు. డాక్టర్ అర్చన తనతో.. ఆమె సోదరి జాన్వికి ఒక సైనికుడితో నిశ్చితార్థం జరిగిందని, అయితే అతనికి అప్పటికే ప్రియురాలు ఉండటంతో అతను వివాహాన్ని రద్దు చేసుకున్నాడని వివరించింది. అందుకే అతని ప్రియురాలైన టీచర్ను అడ్డుతొలగించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఈ నేపధ్యంలోనే ఆ టీచర్పై యాసిడ్ దాడి చేయాలని తనకు చెప్పిందని నిషు తివారి పోలీసులకు తెలిపాడు. కాగా జాన్వి, డాక్టర్ అర్చన ఒకరేనని.. నిషు తివారీకి అబద్ధం చెప్పి, అతని చేత టీచర్పై యాసిడ్ దాడి చేయించిందని విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా నిషు తివారీ,జాన్విలను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. -
మాట్లాడుదామంటూ రమ్మని పిలిచి.. యువతిపై దాడి..!
హైదరాబాద్: యువతిని మాట్లాడుదాం అని పిలిచి ఆమెను బ్లేడుతో కోసి ఓ యువకుడు పరారరయ్యాడు.ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... మూసాపేటకు చెందిన మోషిన్ (20) అఫ్రిన్ (20) ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అనంతరం ఇద్దరూ ప్రేమించుకున్నారు. అతను ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుండటంతో అతని ప్రవర్తనతో తట్టుకోలేకపోయిన ఆమె చాలా నెలలు నుండి అతనిని దూరంగా ఉంచాలని నిర్ణయించుకుంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ఆమె ఇంటికి వెళుతుండగా ఫోన్ చేసి మాట్లాడటానికి మూసాపేట మెట్రో స్టేషన్కు రమ్మని కోరారు. ఆమె రాత్రి 11 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ గొడవ పడటం ప్రారంభించారు. ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా నిందితుడు వెంట తెచ్చుకున బ్లేడ్ తీసుకుని ఆమె కడుపులో పొడిచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న యువతిని స్థానికులు కూకట్పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
క్షణం.. క్షణం.. ఉత్కంఠ రేపే జానపద నృత్యం..!
ఎన్నో రకాల నృత్యాలు చూశాం. కానీ ఈ నృత్యం చూస్తుంటే ఎలా చేయగలదా అన్న అనుమానం..ఏం జరుగుతోందో అన్న టెన్షన్తో అలర్ట్గా ఉండేలా చేసే అద్భుతమైన నృత్యం. సాహసోపేతమైన డ్యాన్స్కి మరో రూపం ఇదేనేమో అన్నట్లు ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియొలో ఒక మహిళ సంప్రదాయ లెహెంగా చోలి, చక్కటి ఆభరణాలు ధరించి అద్భుతమైన జానపద నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఉత్కంఠభరితమైన ఆ నృత్యం భారతీయ సంస్కృతికి అసలైన అందంగా అలరారింది. చూస్తున్నంతసేపు చేయగలదా అన్న టెన్షన్, నిజమైన ప్రతిభకు అర్థం పట్టే డ్యాన్స్ ఇది. ఆ వీడియోలో ఒక మహిళ తన తలపై మూడు మట్టికుండలను బ్యాలెన్స్ చేస్తూ..కింద ఒక ప్లేట్పై డ్యాన్స్ చేస్తున్నట్లు చూడొచ్చు. ఆ నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాలంటే, ప్రతిభ, దృష్టి, ఏకాగ్రత, బ్యాలెన్స్పై మంచి పట్టు ఉండాలి. అప్పుడే ఆ నృత్యంలో దాగున్న అద్భతమైన అందం ప్రేక్షకుల్ని అటెన్షన్తో తిలకించేలా చేస్తుంది. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి మీరు చేసిన విధానం అత్యంత అద్భుతంగా ఉంది, నిజమైన ప్రతిభ భారతదేశ సంస్కృతికి అసలైన అందం అని కీర్తిస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by राजस्थानी छोरी🫣 (@lok_nritya) (చదవండి: మంచు పొరలపై బతుకమ్మ, దాండియా సంబరాలు) -
United States: గుజరాతీ మహిళ హత్యకేసులో యువకుని అరెస్ట్
దక్షిణ కరోలినా: దక్షిణ కరోలినాలో గుజరాతీ మహిళ హత్య కేసులో ఒక అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 16న గుజరాతీ మహిళ కిరణ్ పటేల్ మరణానికి దారితీసిన కాల్పుల సంఘటనతో సహా రెండు కాల్పుల సంఘటనలలో ప్రమేయం ఉన్న జైడాన్ మాక్ హిల్ (21)ను పోలీసులు అరెస్టు చేశారు.సెప్టెంబర్ 16న దక్షిణ కరోలినాలోని యూనియన్ కౌంటీలోని సౌత్ మౌంటైన్ స్ట్రీట్లోని ఒక యార్డ్లో చార్లెస్ నాథన్ క్రాస్బీ(67) అనే వృద్దుడిని మృతిచెందిన స్థితిలో పోలీసులు గుర్తించారు. ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం అదే రోజు సాయంత్రం, కిరణ్ పటేల్ (49) పై డీడీస్ ఫుడ్ మార్ట్ పార్కింగ్ స్థలంలో కాల్పులు జరిగాయి. ఆమె తీవ్రంగా గాయపడి మృతిచెందింది. గో ఫండ్మీ పేజీలోని వివరాల ప్రకారం ఈ ఘటన సెప్టెంబర్ 16న రాత్రి 10:30 గంటలకు జరిగింది. ఆ సమయంలో కిరణ్ పటేల్ యూనియన్ కౌంటీలో గ్యాస్ స్టేషన్-కమ్-కన్వీనియన్స్ స్టోర్ రిజిస్టర్ వద్ద నగదు లెక్కిస్తున్నారు. హిల్ ఆమె వద్దకు వచ్చి, క్యాష్ రిజిస్టర్ లాక్కున్నాడు. ఆమె అతనికి నగదు ఇచ్చేలోపుగానే అతను కిరణ్ పటేల్పై కాల్పులు జరిపాడు.అతనిని అడ్డుకునేందుకు కిరణ్ పటేల్ అతనిపైకి ప్లాస్టిక్ బాటిల్ విసిరి పరిగెత్తింది. హిల్ కూడా ఆమె వెంట పరిగెత్తాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు పార్కింగ్ స్థలం వైపు పరిగెత్తిన కిరణ్ పటేల్ పై హిల్ కాల్పులు కొనసాగించాడు. ఆమెకు బుల్లెట్ తగిలి, తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. తరువాత అతను ఆమె దగ్గరకు వచ్చి మరోమారు కాల్పులు జరిపాడు. కేసు దర్యాప్తు చేపట్టిన సౌత్ కరోలినా లా ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ అధికారులు అరెస్ట్ వారెంట్తో సౌత్ చర్చి స్ట్రీట్లోని హిల్ ఇంటికి చేరుకున్నారు. అయితే హిల్ వారిని ప్రతిఘటించాడు. ఎట్టకేలకు పోలీసులు హిల్ను అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రీల్స్ కోసం యువతి దుస్సాహసం
మైసూరు: వీడియోల పిచ్చితో యువతీ యువకులు పడరాని పాట్లు పడుతుంటారు. ఎక్కడ మంచి రీల్స్కు చాన్సుందా అని ఆరాటపడుతుంటారు. ఇందుకోసం దుస్సాహసాలు కూడా చేస్తుంటారు. అదే మాదిరిగా మైసూరులోని దసరా ఏనుగులతో ఓ యువతి రీల్స్ చేసింది. వాటిని సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయ్యాయి. మావటీలు, కాపలాదారులు తప్ప ఇతరులు దసరా ఏనుగుల వద్దకు వెళ్లే అవకాశం లేదు. కానీ ఓ యువతి రాత్రి సమయంలో వచ్చి ఏనుగుల వద్ద డ్యాన్సులు చేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంది. ఆ సమయంలో అక్కడి సిబ్బంది ఎందుకు ఆమెను అడ్డుకోలేదో తెలియడం లేదు. వీడియోలు వ్యాప్తి చెందగా, ఆమె చర్యపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. గలాటా జరుగుతోందని తెలిసి ఆ యువతి వీడియోలను తొలగించింది. అటవీశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ యువతి కోసం గాలిస్తున్నారు. -
ప్రేమజంట పెళ్లి.. వధువుపై కేసు
దొడ్డబళ్లాపురం: యువకున్ని వివాహం చేసుకున్న యువతిపై కేసు నమోదు చేసిన సంఘటన మాగడి తాలూకా కుదూరులో జరిగింది. వివరాలు.. సౌమ్య (19), వసంత్(19) అనే యువతీ యువకులు ప్రేమించుకున్నారు. సౌమ్య తరఫు పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా కూడా జూలై 11న ఇద్దరూ మాగడిలోని ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. చట్ట ప్రకారం వధువుకి 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్లు నిండాలి.అయితే ఇక్కడ పెళ్లికొడుకు వయసు 19 ఏళ్లే కావడంతో అతని కుటుంబీకులు సౌమ్యపై కుదూరు పోలీస్స్టేషన్లో బాల్య వివాహం చట్టం కింద ఫిర్యాదుచేయగా కేసు నమోదయింది. -
పానీపూరీ కోసం మన జెన్ జెడ్ ఆందోళనలు!
జెన్ జెడ్.. నేపాల్ ఉద్యమం తర్వాత ఎక్కువగా వార్తల్లో కనిపించిన పదం. ఇదొక తరం. 1997 నుంచి 2012 మధ్య జన్మించినవాళ్లు ఈ తరం కిందకు వస్తారు. జెడ్ జనరేషన్వాళ్లను జూమర్లు (Zoomers), డిజిటల్ నేటివ్స్(Digital Natives) అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వంటి డిజిటల్ టెక్నాలజీతో పెరిగిన మొదటి తరం ఇదే. అయితే.. టెక్నాలజీతో మమేకమైన ఈ తరం.. సామాజిక చైతన్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం.. వ్యక్తిత్వం విషయంలో ఎంతో మెరుగ్గానే ఉండేదే. కానీ, రాను రాను పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. సోషల్ మీడియాకు బానిసలవ్వడం, మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించకపోవడంతో భారత్లో జెడ్ జెనరేషన్ పరిస్థితి దారుణంగా తయారవుతోందట. ఎంతలా అంటే.. గుజరాత్ వడోదరలో తాజాగా ఓ యువతి పానీపూరీ కోసం సత్యాగ్రహం చేపట్టింది. రూ.20 చెల్లించిన ఆమె ప్లేట్కు 6 పానీపూరీలు రావాల్సి ఉండగా.. ఆ పానీపూరి భయ్యా 4 ఇవ్వడంతో హర్టయ్యింది. నా రెండు పానీ పూరీలు నా కావాల్సిందేనని రోడ్డుపై బైఠాయించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు బతిమాలి చివరకు ఆమెతో ధర్నా విరమింపజేశారు. ఈ క్రమంలో.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి. పానీపూరీ ప్రొటెస్టర్ అంటూ అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ‘‘జెన్ జెడ్ తరం.. చిన్న విషయాన్ని కూడా పెద్ద ఉద్యమంగా మార్చగలదు. చుట్టు పక్కల దేశాల్లో అది వేరే పోరాటం.. మన దేశంలో పానీపూరీ కోసం ఆరాటం. ఆమెది న్యాయమైన డీల్!’’ అంటూ వెటకారమూ ప్రదర్శించారు. కానీ, పానీపూరి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ఆమె మానసిక ఆరోగ్యం గురించి చర్చించేవాళ్లే కరువయ్యారు. న్యాయం కోసం పోరాటం చిన్నదైనా పెద్దదైనా ముఖ్యం అని అనేవాళ్లు కనిపించలేదు.A woman went to have panipuri but was served 4 instead of 6 for ₹20.She objected, sat down on the road in protest, and even broke into tears.The twist? Kudos to Vadodara Police for stepping in and resolving this pani-filled crisis swiftly!pic.twitter.com/37DYZAOMkd— Kumar Manish (@kumarmanish9) September 19, 2025ఆమె జెన్ జెడ్ తరానికి చెందినదే. తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురైందని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు చెప్పినట్లుగా అక్కడి లోకల్ మీడియా కథనాలు ఇచ్చింది. ఆ మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని ఆమె కొట్టిందంటూ ఆ పానీపూరీ బండివాడు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు కూడా. కానీ, ఆమె ఈ స్థితికి కారణం.. తీవ్ర పని ఒత్తిడి, సోషల్ మీడియా అడిక్షన్తో నిద్రకు దూరం కావడం!. భారత్లో జెన్జీ ఆందోళనలు చేయడం మాట అటుండి.. జెన్జీ గురించే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తాజాగా ఓ సర్వే వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 2025 ఎడిషన్లో జెన్ జీ గురించి ఓ ఆందోళనకరమైన అంశాలను పంచుకుంది. ఈ తరం ఇప్పుడు నిద్రలేమితో తీవ్రంగా బాధపడుతోందట. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి, సోషల్ మీడియా వినియోగం, డూమ్ స్క్రోలింగ్ (Doomscrolling) లాంటి అలవాట్లు నిద్రను దూరం చేస్తున్నాయట. డూమ్ స్క్రోలింగ్ అంటే.. నిరంతరంగా నెగటివ్ వార్తలు, భయానక సమాచారం, ఆందోళన కలిగించే కంటెంట్ను ఆన్లైన్లో చదవడం, ఆపకుండా రీల్స్, పోస్టుల రూపంలో ఫోన్లో స్క్రోల్ చేసి చూడడం అన్నమాట. ఇప్పుడున్న జెడ్ జనరేషన్లో 70 శాతం.. ఉద్యోగం గురించి, ఇళ్ల అద్దెల లాంటి ఆర్థిక అంశాలను తీవ్రంగా ఆలోచిస్తూ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. అయితే ఆర్థిక ప్రణాళిక గురించి కాకుండా బెడ్ రాటింగ్ (బెడ్లో గంటల తరబడి ఉండటం), టీవీ చూడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. దీని ప్రభావం.. బ్రెయిన్ హెల్త్, మానసిక స్థితి, శారీరక శక్తి మీద తీవ్రంగా పడుతోంది. ఇది నిద్ర రిథమ్ను పూర్తిగా దెబ్బతీస్తోంది. రాత్రిళ్లు మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. ఇకోసోషియోస్పేర్ కథనం ప్రకారం.. Gen Z తరానికి చెందిన 100 మందిలో 93 మంది తమ నిద్ర సమయాన్ని సోషల్ మీడియా వల్ల కోల్పోతున్నారని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నది అసలు ముచ్చట. ఫోమో (Fear of Missing Out) వల్ల Gen Z ఆన్లైన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంటే ఏదైనా మంచి విషయం, అనుభవం, లేదంటే అవకాశాన్ని కోల్పోతున్నానేమో అనే భయం. ఉదాహరణకు.. మీ ఫ్రెండ్స్ ట్రిప్కు వెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తే, మీరు వెళ్లలేకపోయినందుకు బాధపడటం. ఎవరో కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే, మీ ఫోన్ పాతదిగా అనిపించడం. ట్రెండింగ్ వీడియోలు, ఫ్యాషన్, ఈవెంట్స్.. అన్నింటిని మిస్ అవుతున్నానేమో అనే భావన ఇలాగన్నమాట. ఇది నిద్రలేమి, ఆత్మవిశ్వాస లోపం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారి తీస్తోందివీటి నుంచి బయటపడాలంటే.. వరీ విండో అనే పద్ధతిని పాటించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. రాత్రి దాకా కాకుండా రోజు మధ్యలోనే ఆ ఆందోళనలపై ఆలోచించేందుకు సమయం కేటాయించాలంటున్నారు. తద్వారా నిద్ర చెడిపోదని చెబుతున్నారు. అలాగే.. డిజిటల్ డిటాక్స్, స్క్రీన్-ఫ్రీ బెడ్రూమ్, మెడిటేషన్ వంటి అలవాట్లు నిద్రను మెరుగుపరుస్తాయి కూడా.::వెబ్డెస్క్ ప్రత్యేకం -
పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!
పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుని ఇండియాకు వచ్చిన భారతసంతతికి చెందిన US పౌరురాలు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం సృష్టించింది. జూలైలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళ మిస్సింగ్ కేసు నమోదైన తరువాత షాకింగ్ విషయాలను పోలీసులు ప్రకటించారు.పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్లోని లుధియానా జిల్లాలో అమెరికన్ పౌరురాలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోఇండియాకు వచ్చింది. లూధియానాకు చెందిన ఇంగ్లాండ్కు చెందిన నాన్-రెసిడెన్షియల్ ఇండియన్ (NRI) చరణ్జిత్ సింగ్ గ్రెవాల్ (75)ను వివాహం చేసుకోవాలని భావించింది. అతని ఆహ్వానం మేరకు రూపిందర్ కౌర్ పాంధేర్ (71) భారతదేశానికి వచ్చారు. అయితే సియాటిల్ నుండి ఇండియాకు వచ్చిన కొద్దిసేపటికే ఏళ్ల మహిళ హత్యకు గురైంది. అయితే ఫోన్లకు స్పందించకపోవడం, ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన పాంధేర్ సోదరి కమల్ కౌర్ ఖైరా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో జూలై 28న న్యూఢిల్లీలోని అమెరికిఆ రాయబార కార్యాలయానికి సంప్రదించారు. ఎంబసీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గ్రెవాల్ ఆమెను కిరాయి హంతకులతో హత్య చేయించాడని తేల్చారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ హత్య జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు గ్రేవాల్తో పెళ్లికి ముందు అతనికి పెద్దమొత్తంలో డబ్బును బదిలీ చేసినట్టు కూడా గుర్తించారు. రూపిందర్ అమెరికా పౌరురాలు. యూకేలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చార్జిత్ సింగ్ గ్రెవాల్తో పెళ్లికోసం ఇండియాకు వచ్చింది. అయితే ఆమెను తుదముట్టించాలని పథకం వేసుకున్న గ్రెవాల్ కాంట్రాక్ట్ కిల్లర్ సుఖ్జీత్ సింగ్ సోనూతో రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆమెను కిరాతంగా హత్య చేయించాడు. అయితే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే సమయంలోనే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశాడని సోనూ దెహ్లోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించాడు. తన నివాసంలోని స్టోర్రూమ్లో రూపిందర్ శరీరాన్ని కాల్చి, బూడిద చేసి లెహ్రా గ్రామంలోని కాలవలో పారవేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ మేరకు సంఘటనా స్థలంలో మృతరాలి ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) హర్జిందర్ సింగ్ గిల్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును విచారణ సాగుతోంది. పరారీలో ఉన్నగ్రెవాల్తో పాటు, అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు. సోను వెల్లడించిన దాని ఆధారంగా బాధితురాలి అస్థిపంజర అవశేషాలు, ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు ఈ ఘటన ఇటు భారత్తోపాటు, అటు అమెరికా, యూకే ఎన్ఆర్ఐ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. -
తండ్రి మరణం, కన్నెత్తి చూడని బంధువులు..! సాఫ్ట్వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ
ఇంటి పెద్దనే కొల్పోతే ఆ కుటుంబం ఓ పెద్ద కుదుపుకులోనై కోలుకోవడం అంత సులభం కాదు. ఆదుకునే వాళ్లు ఉంటే పర్లేదు, బరువు అనుకుంటే ఆ కుటుంబ ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతూ నరకం చవిచూస్తుంది. అలాంటి సమయంలో స్థిరమైన తెగువతో పోరాడే వాళ్లే..యావత్తు ప్రపంచం తమవైపుకి తిప్పుకునేలా సక్సెస్ని అందుకుంటారు. అలాంటి విజయాన్నే అందుకుంది ఈ సాఫ్ట్వేర్ ఇంజీనర్. ఆమె సక్సెస్స్టోరీ ఆర్థిక ఇబ్బందులతో గెలుపుని అందుకోలేకపోతున్నామని సతమతమై యువతకు ఆదర్శం. నెట్టింట ఈ టెక్కీ స్టోరీ వైరల్గా మారింది. రెడ్ఇట్లో వ్యవసాయ కుటుంబ నేపథ్యానికి చెందని ఓ యువతి తాను టెక్నాలజీ రంగంవైపు అడుగులు వేసి ఎలా గొప్ప సక్సెస్ని అందుకుందో నెట్టింట షేర్చేసుకుంది. సుమారు వంద కుటుంబాలు ఉండే ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన తాను టీనేజ్ వయసులోనే తండ్రిని కోల్పోయానంటూ మర్చిపోలేని నాటి ఆవేదనను గుర్తుచేసుకుంది. తన తండ్రి ఒక రైతుగా అవిశ్రాంతంగా పనిచేసేవాడని, ఉన్నటుండి వచ్చి పడిన అనారోగ్యం ఆయన్ను మింగేసిందంటూ తనకు కన్నీళ్లు మిగిల్చిన నాటి విషాదం గురించి చెప్పుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా ఆర్థిక సమస్యలు చుట్టుమట్టాయని, మరోవైపు బంధువులు తమను దూరం పెడుతూ ఎంత మానసిక ఆవేదన కలిగించారో చెప్పుకొచ్చింది. డబ్బుంటేనే బాంధవ్యాలని గ్రహించేలోపే కళ్లముందు అంతా చీకటి, ఈ సమస్య నుంచి గట్టేక్కుతామో లేదో తెలియని పరిస్థితి..ఆ సమయంలో తనకు చదువే వీటన్నింటికి పరిష్కారమని ప్రగాఢంగా నమ్మింది. ఎంతటి ఆర్థిక పరస్థితుల్లోనూ కూడా చదవడం ఆపలేదు, పైగా పాఠశాల నుంచి కాలేజీ వరకు అన్నింట్లోనూ టాపర్గా నిలింది. అలా ఆమె కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేరయ్యి వందలోపు ర్యాంక్ సాధించింది. ఆ నేపథ్యంలోనే ఆమెకు బెంగళూరులోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు పొందే ఛాన్స్ అందుకుంది. అదే ఆమె జీవితాన్ని పెద్ద యూటర్న్ తీసుకునేలాచేసింది. ఓ పక్క పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు తన లక్ష్యాన్ని మరింతగా పెంచేశాయి.పట్టుదలతో ఈ ఆర్థికకష్టాలకు చెక్పెట్టేలా మంచి కెరీర్ని ఏర్పరచుకునేలా సన్నద్ధమైంది. అలా సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టి..సుమారు ఆరు ఏళ్ల నిర్విరామ కృషితో..దాదాపు రూ. 80 లక్షల వార్షిక ప్యాకేజ్ని అందుకుని అందరినీ విస్తుపోయేఆల చేసింది. రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తాను ఇంత పెద్ద మొత్తంలో వేతనం అందుకునే స్థాయికి చేరుకోవడం గురించి ఆలోచిస్తే చాలా గర్వంగా అనిపిస్తోందంటూ ఆనందం వ్యక్తం చేసింది. అమూల్యమైన మాటలు..తండ్రి లేకపోవడం అనేది పూడ్చుకోలేని బాధ అయినా..తాను సాధించిన ఈ విజయాన్ని తన తండ్రి ఎక్కడ నుంచే చూస్తూనే ఉంటాడని, ఆనందపడతానని నమ్ముతానని అంటోందామె. అలాగే తనలాంటి కష్టాలు అనుభవించే వాళ్లేందరో ఉన్నారని, వారందరూ కష్టాలను దురదృష్టంగా చూడకపోతే కచ్చితంగా సక్సెస్ సాధిస్తారని అంటోంది. ఎప్పుడైనా చుట్టుముట్టే కష్టాలు, కన్నీళ్లు ఎన్నింటినో నేర్పించడమే కాదు.. లక్ష్యంపై ఫోకస్ని చెదరిపోనీవ్వకుండా చేసే సోపానాలని అంటుంది. చూసే దృక్పథం మీదే సక్సెస్ అదృష్టం ఆధారపడి ఉంటుందని చెబుతోంది. బాధలు ఎప్పుడు బరువు కాదు బాధ్యతగా వ్యవహరించడం నేర్పిస్తాయి, బలోపేతంగా ఉండటం ఎలానో తెలియజేస్తాయని చెబుతోంది. అందుకు కావాల్సింది ఓర్చుకునే సహనం, పట్టుదల అని, అవే అసలైన ఐశ్వర్యాలని మరవకండి అంటూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు సైతం అద్భుతం మీ విజయం అంటూ ఆ టెక్కీని ప్రశంసించారు. అంతేగాదు మరోనెటిజన్ తాను కూడా అలానే కష్టపడి చదివి పైకొచ్చానని, మీ సక్సెని ఇక్కడితో ఆపోద్దు, ఈ ప్రపంచం నీదే అని ప్రోత్సహిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: 'రిచ్'..రుచి! ఇడ్లీ రూ.1200, చాక్లెట్ రూ.1800) -
అతడికి 22, ఆమెకు 35.. పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయతీ
పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలకు చెందిన ఓ మహిళకు పెద్దపల్లి మండలం అప్పన్న పేటలో నివసించే అరవింద్తో స్నాప్ చాట్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అయితే అతడికి 22, ఆమెకు 35 సంవత్సరాలు. అంతే కాదు ఆమె ఓ వివాహిత. తనకు 12 సంవత్సరాల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు.వీరి ప్రేమ వ్యవహారం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలియడంతో భార్యను ఇంటి నుంచి గెంటేశాడు ఆ మహిళ భర్త. ఏం చేయాలో పాలుపోక ప్రియుడు అరవింద్ ఇంటి ముందు బైఠాయించి పెళ్లి చేసుకోవాలని వేడుకున్న ప్రియురాలు. 12 సంవత్సరాల వయసు గల పిల్లలున్న మహిళతో పెండ్లి ఎలాగని తలలు పట్టుకుంటున్న అరవింద్ కుటుంబ సభ్యులు. ఇరు కుటుంబాల్లో చిచ్చు పెట్టిన స్నాప్ చాట్ వ్యవహారం. పోలీస్ స్టేషన్కు చేరిన స్నాప్ చాట్ ప్రేమ పంచాయతీ. ఇరు కుటుంబాలను కౌన్సిలింగ్ కోసం పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు -
డెంగీ లక్షణాలతో యువతి మృతి
పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట): ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో డెంగీ లక్షణాలతో ఓ యువతి ఆదివారం మృతి చెందింది. గ్రామంలోని తుఫాన్ కాలనీకి చెందిన పెద్ది రూప (23) కోయంబత్తూరులో బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటోంది. నెల క్రితం ఆమె గ్రామానికి వచ్చింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతోంది. జ్వరం తగ్గకపోవటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి డెంగీ సోకిందని నిర్థారించి చికిత్సచేశారు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి 3 రోజుల క్రితం తరలించగా..చికిత్స పొందుతూ ఆదివారం రూప మృతి చెందినట్లు ఆమె తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. అయితే రూప రిపోర్టుల్లో డెంగీ నెగటివ్గా ఉందని, వైరల్ జ్వరంతో పాటు వీక్గా ఉండటంతో అవయవాలు దెబ్బతిన్నాయని, జ్వరానికి హైడోస్ మందులు కూడా వాడారని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. తుఫాన్ కాలనీలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారని వైద్యాధికారి డాక్టర్ నాగలక్ష్మి తెలిపారు. -
వైరల్ వీడియో.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్!
లక్నోలో ఓ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ మహిళ.. పిజ్జా డెలివరీ బాయ్పై రెచ్చిపోయింది. లక్నోలోని రద్దీగా ఉండే రోడ్డులో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్ బైక్.. ఓ మహిళ నడుపుతున్న కారును స్వల్పంగా తాకింది. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ మహిళ పిజ్జా డెలివరీ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టింది.దీంతో ఆగకుండా తన కారుకి జరిగిన డ్యామేజ్ కోసం రూ.30 వేలు ఇవ్వలంటూ డిమాండ్ చేసింది. అతని ఫోన్ను లాక్కోవడానికి ప్రయత్నిస్తూ బిగ్గరగా అరుస్తూ హల్చల్ చేసింది. నగదు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. ఈ ఘటనతో షాక్కు గురైన డెలివరీ బాయ్ తన వైపు వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ.. తోటి రైడర్లకు ఫోన్ చేశాడు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించేందుకు ప్రయత్నించారు.ఎవరిపైనా చేయి చేసుకోవడానికి హక్కు లేదంటూ మహిళను వారించారు. దీంతో ఆ మహిళ.. సలహాలు ఇవ్వకండి. నష్టం కలిగించింది ఇతనే కనుక డబ్బులు కూడా ఇతనే చెల్లించాలి. మీరు కావాలంటే పోలీసులకు ఫోన్ చేయండి” అంటూ మరింత చెలరేగిపోయింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళ చర్యను దాడిగా పేర్కొంటూ.. ఆమెను అరెస్టు చేయాలని కొందరు డిమాండ్ చేశారు.Lucknow 📍Woman Slaps Pizza Delivery Guy Over Minor Accident, Demands ₹30,000 As Damage Control pic.twitter.com/mmS3bCHay5— Mayank Burmee (@BurmeeM) September 13, 2025 -
పట్టపగలు వివాహిత...
రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్లో ఆదివారం పూసల రమాదేవి(35) దారుణ హత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా రెడ్డికాలనీకి చెందిన రమాదేవిని .. పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్కాలనీలో నివాసం ఉండే పూసల కృపాకర్ సుమారు 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకన్నారు. వీరికి ఒక కుమారుడు జాన్సన్, కుమార్తెలు జోషిత(9), జ్యోత్స్న ఉన్నారు. ఏడాదిగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. అప్పటినుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రమాదేవి ఆదివారం కృపాకర్ ఇంటికి చేరుకుంది. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కత్తితో రమాదేవిపై కృపాకర్ దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఎస్సై శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య అనంతరం కృపాకర్, అతడి తల్లిదండ్రులు పరారయ్యారు. అయితే, తల్లిదండ్రులు మంథని పోలీసుస్టేషన్లో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కృపాకర్ కోసం ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణామని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్సై వివరించారు. పంచాయితీయే ప్రాణం తీసిందా? ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్న రమాదేవి ఆదివారం అత్తగారింటికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. సెంటినరికాలనీకి చెందిన ఒకమతపెద్ద ద్వారా కృపాకర్ రాయబరం చేయడంతో రమాదేవిని అక్కడకు వచి్చందని, మతపెద్ద సమక్షంలో పంచాయితీ జరిగిందని తెలిసింది. ఆ తర్వాత రమాదేవి వకీల్పల్లి ప్లాట్స్కాలనీకి చేరుగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈక్రమంలోన అత్తగారింటి ఎదుట రోడ్డుపై విగతజీవిగా పడిపోయిందని స్థానికులు కంటతడి పెట్టారు. క్షణికావేశంలో భార్యను చంపండంతో ముగ్గురు పిల్లలు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. కుటుంబ కలహాలు పచ్చనికాపురంలో చిచ్చుపెట్టడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు. -
కదులుతున్న ఆటోలో.. ఆమె సాహసాన్ని చూస్తే షాకే!
పంజాబ్లో ఓ మహిళ.. దొంగలతో ధైర్యంగా పోరాడి తప్పించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పట్టపగలే ఆటోలో మహిళను దోచుకోవడానికి ప్రయత్నించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జలంధర్-లుథియానా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ఫిల్లౌర్కు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా, డ్రైవర్తో పాటు ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు.అయితే, ఆమె ధైర్యంగా దుండగులను ప్రతిఘటించింది.. ఆటో నుంచి బయటకు వేలాడుతూ సాయం కోసం అరవడం ప్రారంభించింది. ఆమె దాదాపు అర కిలోమీటర్ వరకు వేలాడుతూ సాయం కోసం ఆమె పిలుస్తూనే ఉంది. ఇంతలో, వెనుక కారులో ప్రయాణిస్తున్న కొంతమంది యువకులు ఆటోను వెంబడించారు. ఆమె సాహసాన్ని వీడియో తీశారు. దొంగలను పట్టుకోవడానికి వారు సాయం చేశారు.ఆటో వేగంగా వెళ్లి ఒక కారును ఢీకొట్టింది. చివరికి ఆటో బోల్తా పడింది. దాంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఓ వ్యక్తి పరారయ్యాడు. ఈ వీడియోలో ఆ మహిళ ఆటోకు బయట వేలాడుతూ దొంగల్ని ఎదుర్కొంటున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. ధైర్యంతో ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా దొంగలను కూడా పట్టించగలిగిందని.. ఈ ఘటన మహిళల ధైర్యానికి నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.In an extremely courageous act, a Ludhiana woman saved herself from a robbery in a moving auto by clinging on the vehicle while signalling for help from other commuters. Three robbers who tried to snatch her phone and money inside auto arrested by @Ludhiana_Police @IndianExpress pic.twitter.com/N7KXS62Olp— Divya Goyal (@divya5521) September 10, 2025 -
కూకట్పల్లిలో దారుణం.. అపార్ట్మెంట్లో మహిళ హత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో దారుణం జరిగింది. రేణు అగర్వాల్(50) అనే మహిళ హత్యకు గురయ్యారు. కాళ్లు, చేతులు కట్టేసిన దుండగులు.. ఆ మహిళను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.ఇంట్లో పనిచేసే వ్యక్తులే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కొత్తకారుతో నిమ్మకాయల్ని తొక్కించబోయి..
కొత్తగా కారు కొన్నాక కొందరు పూజలు చేయించి నిమ్మకాయలు తొక్కించి బండిని ముందుకు తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే అలాంటి ప్రయత్నాన్ని షోరూమ్లోనే చేయబోయింది ఓ మహిళ. పొరపాటు జరగడంతో 27 లక్షల విలువ చేసే కొత్తకారు యాక్షన్ సినిమాలో మాదిరి అద్దాలు బద్దలు కొట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి భూమ్మీద బొక్కబొర్లాపడిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్ అనే మహిళ తన భర్త ప్రదీప్తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి బయటకు తేవాలనుకుంది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ కారు ధర రూ. 27 లక్షలుగా తెలుస్తోంది. दिल्ली के निर्माण विहार में स्थित महिंद्र शोरूम से महिला ने 27 लाख की थार खरीदी और शोरूम में ही पूजापाठ की, महिला को कार का पहिया नींबू पर चढ़ाना था लेकिन महिला ने ज्यादा एक्सीलेटर दिया और कार बिल्डिंग को तोड़ते हुए 15 फीट नीचे गिर गई#delhi #thar #viralvideo #laxminagar pic.twitter.com/oGgAvDkeZg— Live Viral Breaking News (@LVBNewsOfficial) September 9, 2025అయితే మరికొన్ని మీడియా చానెల్స్ మాత్రం మరోలా కథనాలు ఇస్తున్నాయి. షోరూం సిబ్బంది ఆ భార్యభర్తలకు డెమో ఇచ్చే టైంలో ప్రమాదం జరిగిందనిప్రసారం చేస్తున్నాయి. డెమో ఇచ్చే టైంలో ఆ సిబ్బంది కారు ఇంజిన్ ఆన్ చేశాడని, హఠాత్తుగా ఆ మహిళ ఎక్సలేటర్ తొక్కడంతో కారు బయటకు దూసుకొచ్చిందన్నది ఆ కథనం సారాంశం. ఏదిఏమైనా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు వ్యంగ్యంగా స్పందిస్తుననారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించాలంటూ పలువురు నెటిజన్లు కోరుతుండడం గమనార్హం. -
మంత్రి ముందే.. భర్తకు భార్య దేహశుద్ధి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): బీడీసీసీ బ్యాంకు ఎన్నికల పేరుతో తన భర్త మంత్రి సతీష్ జార్కిహొళి అనుచరులతో కలిసి వారంపాటు ఇంటికి రాకుండా, ఫోన్ చెయ్యకుండా తిరుగుతున్నాడని ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ భర్త కనిపించగానే దాడి చేసింది. ఈ విచిత్ర సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా మదిహళ్లి గ్రామంలో జరిగింది. బెళగావి బీడీసీసీ బ్యాంకు ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. అభ్యర్థులు ఓటర్లు జారిపోకుండా శిబిరాలకు తరలించాయి. పీకేపీఎస్ సభ్యుల్లో ఒకడైన మారుతి అనే వ్యక్తి వారం రోజుల నుంచి కనబడకుండాపోయాడు. సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా జార్కిహొళి సభకు హాజరయ్యాడు, అక్కడే ఉన్న అతని భార్య వారం నుండి ఎక్కడికి పోయావంటూ కాలర్ పట్టుకుని లాగి కొట్టింది. కిందపడేసి పిడిగుద్దులు గుద్దింది. ఇదంతా మంత్రి సతీష్ జార్కిహొళి కళ్ల ముందే జరుగుతున్నా భార్యభర్తల గొడవతో నాకేం పని అనుకుని చూస్తుండిపోయారు. కొందరు జనం ఆమెను శాంతపరిచారు, బాధితుడు మళ్లీ మంత్రి అనుచరులతో కలిసి వెళ్లిపోయాడు. -
భారత్లోనే 11 ఏళ్లుగా రష్యన్ మహిళ..! ఆ మూడింటికి ఫిదా..
విదేశాలను ఆకర్షిస్తున్న మన దేశ సంస్కృతి వారిని ఇక్కడే ఉండేలా చేసేలా మన్ననలను అందుకుంటోంది. ఎందరో మనసులను దోచిన ఇచ్చటి విభిన్న సంస్కృతులు, ఆతిథ్యం తమను మళ్లీ మళ్లీ ఈ గడ్డ వద్దకు వచ్చేలా చేస్తుందని, వదిలి వెళ్లలేమని అంటున్నారు. అలా ప్రశంసలు కురిపిస్తున్న విదేశీయుల కోవలోకి తాజాగా ఈ రష్యన్ మహిళ కూడా చేరిపోయింది. పైగా ఆమూడింటికే పడిపోయానని, అంతలా అవి తనని ప్రభావితం చేశాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. రష్యాన్ మహిళ కంటెంట్ క్రియేటర్ యులియా ఇన్స్టా పోస్ట్లో భారత్లోనే 11 ఏళ్లుగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక్కడి భారతదేశం తనను ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంది. ఐదు నెలల్లో పూర్తిచేసే ఇంటర్న్షిప్కు వచ్చి..అతుక్కుపోయానంటోంది. ఇంటర్న్షిప్ పూర్తి అయ్యి తిరిగి రష్యాకు పయనమయ్యానని, ఆ తర్వాత కొన్నేళ్లకు సర్కస్ కోసం ఏనుగుని కొనడానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయానని చెప్పుకొచ్చింది. ఇక్కడే విజయవంతంగా వ్యాపారం చేయడమే గాక, ఇక్కడ ఒక కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టి ఇక్కడే ఉండిపోయానంటోంది. కట్టిపడేసిన ఆ మూడు విషయాలు..భారతదేశంలో ఆతిథ్యం వేరేస్థాయిలో ఉంటుంది. ప్రజలు చాలా ఘటనంగా స్వాగతిస్తారు. వారి విశాల హృదయం కట్టిపడేస్తుంది. ప్రతి విషయంలోనూ మంచి సహాయకారిగా ఉంటారు. ఇక్కడ చాలామటుకు అందరూ సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు. అంతేగాదు భారతదేశం ఒక అయస్కాంతంలాంటిదని, ఇక్కడ ఏమి చూడాలనుకుంటున్నారో, విశ్వానికి ఏమి అందించాలనుకుంటున్నారో, అన్నింటిని ఈనేలే మీకు దిశానిర్దేశం చేస్తుంది. నాలా ఈ భారతదేశంలోకి అడుగుపెట్టి, కొన్ని సవాళ్లను అధిగమించి మరి ఇక్కడి అందాలకు మంత్రముగ్ధులైన వారిక కథలెన్నో నా చెంత ఉన్నాయని ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) (చదవండి: Dance For Fitness: మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!) -
తమిళనాడులో షాకింగ్ ఘటన.. మహిళను చెట్టుకు కట్టేసి..
కడలూరు: తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుతి సమీపంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి.. దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఓ మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా దాడి చేయడంతో పాటు వివస్త్రను చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నలుగురు మహిళలలు కలిసి ఓ మహిళను ఆమె చీరతోనే చెట్టుకు కట్టేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.‘‘నువ్వు కుక్కతో సమానం’’ అంటూ బాధితురాలిని ఓ మహిళ అసభ్యకరంగా తిడుతుండగా, మరొకరు కర్రతో దాడి చేశారు. మరొ మహిళ ఆమె జట్టుపట్టుకుని లాగుతూ.. బాధితురాలి జాకెట్ను చించివేసింది. ఒక మహిళ ఈ దాడిని వీడియో తీస్తూ.. ఇలా చేస్తే జైలుకెళ్తారంటూ హెచ్చరించినా కూడా మిగతా వారు పట్టించుకోలేదు. సమారు 2.13 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఫుటేజ్ వైరల్గా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు మహిళలో ఒకరు అరెస్టు కాగా, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు.భూ వివాదం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న వారిని గాలించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. దాడికి కుల వివక్ష కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కండక్టర్పై మహిళ దాడి
ఏలూరు జిల్లా: ఫోన్లో కాకుండా ఆధార్ కార్డు ఒరిజనల్ గాని, జిరాక్స్ గాని చూపించాలని అడిగినందుకు కండక్టర్పై ఓ మహిళ దాడి చేసింది. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు పరిధిలో శనివారం జరిగింది. విజయవాడ విద్యాధరపురం డిపో బస్సు విజయవాడ–విస్సన్నపేట మధ్య నడుస్తుంది. నూజివీడులో సాయంత్రం విజయవాడ వెళ్లేందుకు బస్సు ఎక్కిన మహిళను కండక్టర్ ఎంవీ ప్రసాద్ ఆధార్ కార్డు చూపించమని అడగ్గా ఆమె ఫోన్లో చూపించింది. కండక్టర్ ఒరిజనల్ గాని, జిరాక్స్ గాని చూపించాలని, లేకపోతే టికెట్ తీసుకోవాలని మహిళకు స్పష్టం చేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన మహిళ..వాటర్ బాటిల్తో కండక్టర్ను కొట్టింది. అంతటితో ఆగక...చేతులతో కూడా దాడి చేసింది. బస్సులోని మహిళలు దాడి చేస్తోన్న మహిళను నిలువరించారు. ఈ గొడవ జరుగుతున్నంత సేపు కొన్నంగుంట వద్ద బస్సును నిలిపివేశారు. బస్సులోని ప్రయాణికులు మహిళకు నచ్చజెప్పడంతో ఆమె టికెట్ తీసుకుంది. ఘర్షణ సద్దుమణిగిన తరువాత బస్సు విజయవాడకు బయలుదేరింది. -
పైలెట్ పాడుపని.. సిగరెట్ లైటర్ స్పై కెమెరాలతో..
ఢిల్లీ: నగరంలో ఓ పైలట్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. పైలెట్ మోహిత్ ప్రియదర్శిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్స్కు వచ్చే యువతులను టార్గెట్ చేసిన మోహిత్.. స్పై కెమెరాతో యువతుల వీడియోలు తీస్తూ.. కీచకుడి అవతారం ఎత్తాడు. సిగరెట్ లైటర్ ఆకారంలో ఉన్న స్పై కెమెరాలతో వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఇటీవల ఢిల్లీలోని కిషన్గఢ్ ప్రాంతంలోని శని బజార్లో మోహిత్ లైటర్తో మహిళల వీడియోలను రికార్డ్ చేయడాన్ని ఓ యువతి గమనించింది. వెంటనే అప్రమత్తమైన ఆ మహిళ.. పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. అనంతరం మార్కెట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.మోహిత్ ప్రియదర్శి.. ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్థారించారు. విచారణలో నిందితుడు ఓ ప్రముఖ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేస్తున్నట్లు తేలింది. నిందితుడు ప్రియదర్శికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపారు. మోహిత్ వద్ద నుంచి స్పై కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మహిళలకు సంబంధించిన అనేక అభ్యంతరకర వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రియదర్శికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపారు. -
ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందా..?
విలాసవంతమైన జీవితం కంటే తల్లిదండ్రుల బాగోగులే ముఖ్యం అంటూ భారత సంతతి మహిళ భారత్కి తిరిగి వచ్చేయాలనకుంటున్నా అంటూ తన మనసులో మాటను నెట్టింట షేర్ చేసుకుంది. అయితే ఇక్కడ అంత జీతంతో తాను లైఫ్ని లీడ్ చేయగలనా అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చింది. అయితే నెటిజన్లు ఆమె ఆలోచన విధానానికి ఇంప్రెస్ అవ్వగా మరికొందరూ వాళ్లు ఎన్నోత్యాగాలు చేసి పంపితే ఆ కష్టమంతా మట్టిలో కలిపేస్తారా అనే ప్రశ్నను లేవనెత్తడం విశేషం. అసలేం జరిగిందంటే..యూఎస్లోని డెన్వర్లో తన జీవిత భాగస్వామితో విలాసవంతమైన జీవితాన్న గడుపుతున్న భారత సంతతి మహిళ రెడ్డిట్ వేదికగా తన గోడుని వెల్లబోసుకుంది. తాను భారత్కి తిరిగి వచ్చేయాలని చూస్తున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేశారని, వారి బాగోగులు చూసుకునేందుకు తిరిగి ఇండియాకు వచ్చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ భారత్లో ప్రజలు కొందరు చాలా దురుసుగా, కోపంగా ప్రవర్తించడం చూసి చాలా అసహనానికి గురయ్యానని చెప్పుకొచ్చింది. తాను మాస్టర్స్ పూర్తి చేశానని ఏడాదికి రూ. 3 కోట్లు పైనే సంపాదిస్తానని, తన భర్త ఏడాదికి దాదాపు రూ. 2 కోట్లు వరకు సంపాదిస్తారని అన్నారు. తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చేయాలని భావిస్తున్నా..బెంగళూరులో ఉండే అవకాశం లభిస్తోంది. అక్కడ ఏడాదికి సుమారు రూ. 1.2 కోట్లు వేతనం అని, అక్కడ లైఫ్ లీడ్ చేయడానికి ఆ మాత్రం సంపాదన సరిపోతుందా అని సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే తనకు యూఎస్లో మంచి స్నేహితులు ఉన్నారని, సౌకర్యవంతంగా జీవించేదాన్ని అని చెప్పుకొచ్చింది. అదీగాక అమెరికాలో తన జీతం పెద్ద మొత్తం కావడంతో చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేయగలిగానని, అందువల్లే భారత్తో సహా వివిధ దేశాలకు సులభంగా వెళ్లగలిగేదాన్ని అని చెప్పుకొచ్చింది. అలాగే వర్క్ పరంగా ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదంటూ అమెరికాలోని తన లైఫ్స్టైల్ గురించి తెలిపింది. పైగా తన తల్లిదండ్రులు అమెరికాకు వచ్చేందుకు సిద్ధంగా లేరంటోంది. అదీగాక వాళ్లు ఇక్కడ సంస్కృతికి, స్నేహితులకు అలవాటుపడ్డ మనుషులకు అలా నాలుగు గోడల మధ్య బతకడం అంటే అత్యంత దుర్భరంగా అనిపిస్తుందని వాపోయింది. అందుకే వారి బాగోగులును తాను స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.,అయితే తన సొంతూరిలో ఉద్యోగం చేయడం సాధ్యపడదని ఇలా బెంగళూరులో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే మరి బెంగళూరులో బతికేందుకు ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందంటారా అని సందేహ్నాన్ని లేవనెత్తతూ పోస్ట్ ముగించింది. (చదవండి: నాన్న చెప్పిన కథలే.. స్ఫూర్తి..) -
ఎనభై రెండేళ్ల ఎనర్జీ!
సోషల్ మీడియా వేదికగా అసామాన్య సామాన్యుల గురించి పరిచయం చేస్తుంటారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. తాజాగా ఆయన తమిళనాడులోని పొల్లాచికి చెందిన కిట్టమ్మాళ్ గురించి పోస్ట్ పెట్టారు.శక్తికి వయసు అడ్డుకాదని నిరూపించింది 82 సంవత్సరాల కిట్టమ్మాళ్. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో పాల్గొనే కిట్టమ్మాళ్ ఉత్సాహానికి కేరాఫ్ అడ్రస్.‘ఎనభై రెండు సంవత్సరాల వయసులో ఆమె పైకెత్తేది బరువులను కాదు. మనలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని. కలలు కలడానికి, ఆ కలలు నెరవేర్చుకోవడానికి వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించిన మహిళ’ అంటూ కిట్టమ్మాళ్ విల్పవర్ను కొనియాడారు ఆనంద్ మహీంద్రా.కునియముత్తూరులో జరిగిన ‘స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ సౌత్ ఇండియా’ పోటీలో పాల్గొన్న కిట్టమ్మాళ్ 17 మంది మహిళలతో పోటీ పడింది. ఈ మహిళలందరూ 30 కంటే తక్కువ వయసు ఉన్నవారే! డెడ్లిఫ్టింగ్ 50 కేజీల విభాగంలో అయిదో స్థానంలో నిలిచింది. తన మనవళ్లు రోహిత్, రితిక్ నుంచి స్ఫూర్తి పొందిన కిట్టమ్మాళ్ బామ్మ పవర్లిఫ్టింగ్లో పవర్ చాటుతోంది.బరువులు ఎత్తడం ఆమెకు కొత్తేమీ కాదు. 25 కిలోల బియ్యం బస్తాలను అవలీలగా మోసుకెళ్లేది. ‘నేను తీసుకునే ఆహారమే నా శక్తి’ అంటున్న కిట్టమ్మాళ్ సంప్రదాయ, పోషక విలువలతో కూడిన ఆహారానికిప్రాధాన్యత ఇస్తుంది. -
ఖాకీనంటూ... మహిళలకు ట్రాప్!
నరసరావుపేట టౌన్: సీసీఎస్ ఎస్సైనని, తక్కువ ధరకు రికవరీ బంగారం ఇస్తానని నమ్మబలుకుతూ మహిళలను వంచిస్తున్న నకిలీ ఖాకీ గుట్టు రట్టయింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన ఈ మోసగాడి గురించి సేకరించిన వివరాల ప్రకారం.. నకరికల్లుకు చెందిన మేకల సాయికుమార్ తన పేరును ట్రూ కాలర్లో క్రైమ్ ఎస్ఐ విజయ్గా వచ్చేలా చేసి, మహిళా ఉద్యోగులు టార్గెట్గా ఫోన్లు చేస్తాడు. కాల్ చేసిన వెంటనే తాను ఎస్ఐ అంటూ పరిచయం చేసుకుని మాటలతో మభ్యపెడతాడు.కొన్ని రోజుల తర్వాత దొంగతనం కేసులో బంగారం రికవరీ చేశామని, ఇందులో కొంత పక్కకు తీశానని చెబుతాడు. ఆ బంగారాన్ని తక్కువ ధరకు ఇస్తానని నమ్మబలికి వారి నుంచి నగదు కాజేస్తాడు. మరికొందరికి బంగారాన్ని ఆశగా చూపి లోబర్చుకుంటాడు. ఆ తరువాత వారితో సన్నిహితంగా ఉన్న ఆడియో, వీడియోలను చూపి బెదిరింపులకు పాల్పడి డబ్బులు, బంగారాన్ని బలవంతంగా గుంజుకుంటాడు.ఈ నేపథ్యంలో నరసరావుపేటకు చెందిన ఒక మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడు ఏడు మొబైల్స్ వినియోగించినట్లు సమాచారం. ఇప్పటి వరకు అతని చేతిలో మోసపోయిన మహిళలు ఆరుగురు ముందుకొచ్చారని నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామకృష్ణ తెలిపారు. -
కష్టాలనూ ఆడేసుకున్నారు
‘మాది పేదకుటుంబం అయినా, నా దగ్గర విలువైన సంపద ఉంది’ అంటూ ఉండేది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఓపీ జైషా. ‘ఆ సంపద ఏమిటి?’ అని అవతలి వ్యక్తి అడిగే లోపే... ‘కష్టం, పట్టుదల’ అని చెప్పేది జైషా. జైషా మాత్రమే కాదు...పేదరికంలో పుట్టి పెరిగిన ఎంతోమంది అమ్మాయిలు ‘కష్టం, పట్టుదల’ అనే విలువైన సంపదతో పేదరిక కష్టాలను అధిగమించారు. హాకీ నుంచి ఆర్చరీ వరకు ఎన్నో క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు పతాకాలు ఎగరేశారు.ఆకలి తట్టుకోలేక మట్టితిన్న అమ్మాయిఓపీ జైషా అయిదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చని పోయాడు. అసలే అంతంత మాత్రంగా ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఆకలి తట్టుకోలేక జైషా మట్టి తిన్న రోజులు కూడా ఉన్నాయి. పొద్దుటే లేచి కిలోమీటర్ల కొద్దీ దూరాలు నడిచిపాలు అమ్మేది. ‘రేపు భోజనం ఎలా?’ అనేది జైషా కుటుంబం ముందు ఉన్న ప్రధాన సవాలు. అయినప్పటికీ ఆటలపై తన ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. కేరళకు చెందిన జైషా ప్రఖ్యాత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. మారథాన్లో నేషనల్ రికార్డ్ హోల్డర్. ‘అవకాశాలు, అదృష్టాలు అనేవి ఎక్కడి నుంచో రావు. మన కష్టంలో నుంచే వస్తాయి’ అంటుంది జైషా.గురి తప్పని లక్ష్యంరాంచీలో పుట్టి పెరిగిన దీపిక కుమారి తండ్రి ఆటోడ్రైవర్. చిన్నప్పుడు చెట్టు పైనున్న మామిడి కాయలను గురి తప్పకుండా కొట్టేది. గురితప్పని ఆ ఉత్సాహమే దీపికను ఆర్చరీ వైపు అడుగులు వేసేలా చేసింది. ట్రైబల్ స్పోర్ట్స్ అకాడమీలో చేరిన దీపిక కుమారికి రోజుకు మూడు పూటలా భోజనం దొరికేది. పేదరికం నేపథ్యం నుంచి వచ్చిన దీపికకు అదే లగ్జరీగా అనిపించేది.కష్టాల్లో సైతం వెరవని ధైర్యం, అంకితభావంతో ఎన్నో విజయాలు సాధించింది దీపిక. కామన్వెల్త్ గేమ్స్ (2010)లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ‘కొన్ని సంవత్సరాల క్రితం చాలామందికి ఆర్చరీ అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు పిల్లలు కూడా ఆర్చరీ గురించి మాట్లాడుతున్నారు. నాకు ఆర్చరీపై ఆసక్తి కలగడానికి మీరే స్ఫూర్తి అని పిల్లలు చెబుతున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది’ అంటుంది దీపిక కుమారి.పరుగు ఆపొద్దు‘ఐ బికమ్ ఏ రన్నర్’ పేరుతో పుస్తకం రాసింది సొహినీ ఛటో పాధ్యాయ. అంతర్జాతీయ స్థాయిలో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎనిమిది మంది ప్రసిద్ధ ఉమెన్ రన్నర్ల స్ఫూర్తిదాయక జీవిత కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. 1952 ఒలింపిక్స్లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన మేరీ డిసౌజా, బ్యాంకాక్ అసియన్ గేమ్స్(1970)లో బంగారు పతకం గెలుచుకున్న కమల్జిత్ సందు, పీటి ఉషా, శాంతి సౌందర్యరాజన్, పింకీ ప్రమానిక్, దూతీ చంద్లాంటి క్రీడకారుల జీవితవిశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.ఈ విజేతలకు క్రీడా ప్రయాణం అనేది నల్లేరు మీద నడక కాలేదు. ‘ఆర్థిక కష్టాలు’ కొందరికీ, ‘అమ్మాయిలకు ఆటలెందుకు!’ అనే ఈసడింపులు మరికొందరికీ... ఇలా రకరకాల సవాళ్లు ఎదురయ్యాయి. అయినా వారు పరుగు ఆపలేదు. ఆటలకు పేదరికాన్ని దూరం చేసే శక్తి ఉందనే విషయాన్ని కూడా ఈ పుస్తకం ద్వారా చాటిచెప్పింది సోహిని. ‘పేదరికం నుంచి బయటపడడానికి ఆటలు నాకు ఉపకరించాయి’ అంటుంది ఒలింపియన్ లలిత బాబర్.మైదాన ఆటలే మేలుపిల్లల ప్రపంచానికి ఆన్లైన్ ఆటలు దగ్గరయ్యాయి. మైదాన ఆటలు దూరం అయ్యాయి. ఆన్లైన్ ఆటలతో పోల్చితే మైదానాల్లో ఆడే ఆటల వల్ల పిల్లలకు అనేక రకాలుగా మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. మైదాన క్రీడలు పిల్లలకు వ్యాయామంలా పనిచేస్తాయి. మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. నలుగురిలో త్వరగా కలిసి పోయే స్వభావాన్ని పెంచుతాయి. కుంగుబాటును దూరం పెట్టి చురుగ్గా ఉండేలా చేస్తాయి. శరీరంపై నియంత్రణ ఉండేలా చేస్తాయి.ఆకలి రోజుల నుంచి టోక్యో వరకురోజుకు రెండు పూటలా కడుపు నిండా తింటే, ఆ కుటుంబానికి ఆరోజు ఘనమైన రోజులా ఉండేది. అలాంటి కడు పేద కుటుంబంలో పుట్టిన భావనా జాట్ ఆర్థిక కష్టాలను అధిగమించి ‘రేస్ వాకర్’గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. టోక్యో 2020 ఒలింపిక్స్ కోసం అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా రేస్ వాకర్గా చరిత్ర సృష్టించింది. రాజస్థాన్లోని కబ్రా అనే చిన్న గ్రామానికి చెందిన భావనా జాట్ పేదరికపు సమస్యలకు ఎప్పుడూ భయపడలేదు. కలలకు తెరవేయలేదు.విరిగి పోయిన హాకీ స్టిక్తో...ఆసియన్ గేమ్స్ (2018) మహిళల హాకీ జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వహించిన రాణి రాం పాల్ పేదింటి బిడ్డ. హరియాణకు చెందిన రాణి ఇల్లు ఎండొచ్చినా, వానొచ్చినా సమస్యే అన్నట్లుగా ఉండేది. విద్యుత్ సదు పాయం ఉండేది కాదు. దోమలు వీరవిహారం చేసేవి. రాణికి హాకీపై ఆసక్తి చిన్నప్పటి నుంచే మొదలైంది. తన ఇంటికి సమీపంలోని హాకీ అకాడమీలో ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తుంటే గంటల తరబడి చూస్తుండేది. ఎక్కడో దొరికిన విరిగి పోయిన హాకీ స్టిక్తో వారిని అనుకరిస్తూ ఉండేది.‘నాకు హాకీలో శిక్షణ ఇవ్వండి’ అని హాకీ అకాడమీ వారిని అడిగితే తిరస్కరించారు. ‘ఆ సమయంలోనే నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను’ అంటున్న రాణి తన కలను నిజం చేసుకుంది. హాకీలో అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది.వెక్కిరింపులు ఎదురైనా...మణిపుర్లోని పేద కుటుంబంలో పుట్టిన బింద్యారాణిదేవికి చిన్నప్పటి నుంచి ఆటలు అంటే ఇష్టం. ఎత్తు తక్కువగా ఉండడం వల్ల వెయిట్లిఫ్టింగ్ను ఎంపిక చేసుకుంది. అంతకుముందు తైక్వాండో సాధన చేసేది. ‘ఎందుకు తల్లీ ఈ కష్టాలు, బరువులు ఎత్తడాలు....’ అనేవాళ్లు చుట్టుపక్కల వాళ్లు. ఎవరి మాట ఎలా ఉన్నా తనకు మాత్రం పెద్ద కలలు ఉండేవి.‘మహా అంటే జిల్లా స్థాయి వరకు వెళ్లగలవు’ అనే వెక్కిరింపుల మాట ఎలా ఉన్నా జిల్లా స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది రాణిదేవి. థాయ్లాండ్లో జరిగిన ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ కప్(2024)లో కాంస్య పతకం గెలుచుకుంది. ఐడబ్ల్యూఎఫ్ వెయిట్ లిఫ్టింగ్ వరల్డ్ కప్లో మహిళల 55 కేజీ ఈవెంట్లో పతకం గెలుచుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ‘ప్రతికూల మాటలు ఎన్ని వినబడినా లక్ష్యసాధనలో దృఢంగా ఉండాలి’ అంటుంది బింద్యారాణి దేవి. -
17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల అమ్మమ్మ
జైపూర్: కొన్ని ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అటువంటి ఉదంతం రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. ఒక మహిళ తన 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనివ్వడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ బిడ్డ పుట్టకముందే ఆమె పలుమార్లు అమ్మమ్మగా మారడం మరో విశేషం.లీలావాస్ గ్రామానికి చెందిన కవారా రామ్ భార్య రేఖ(55) రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలోని జాడోల్ బ్లాక్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో తన 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కుటుంబ సభ్యులనే కాకుండా స్థానికులను సైతం ఆశ్చర్యపరిచింది. కవారా,రేఖ దంపతులు ఇప్పటివరకూ మొత్తం 17 మంది పిల్లలను కన్నారు. వీరిలో ఐదుగురు శిశువులు పుట్టిన వెంటనే మరణించారు. ప్రస్తుతం ఈ దంపతులకు 12 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఏడుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు.కవారా తెలిపిన వివరాల ప్రకారం వారి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలకు వివాహం అయ్యింది. ఈ వివాహితుల్లో ఒక్కొక్కరికి ఇద్దరు నుండి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రేఖ.. ఇప్పుడు బిడ్డకు జన్మనివ్వకముందే పలుమార్లు అమ్మమ్మగా మారింది. వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. స్క్రాప్ డీలర్గా పనిచేసే కవారా పిల్లల వివాహాల కోసం అప్పులు చేశాడు. మరోవైపు ఈ దంపతుల పిల్లల్లో ఎవరూ పాఠశాలకు వెళ్లి చదువుకోలేదు.రేఖ ప్రసవాన్ని పర్యవేక్షించిన డాక్టర్ రోషన్ దరంగి మీడియాతో మాట్లాడుతూ.. రేఖ తన దగ్గరకు వచ్చిన ప్పుడు తొలుత ఇది తన నాల్గవ కాన్పు అని చెప్పిందన్నారు. అయితే ఆ తరువాత, ఆమె ఇప్పటికే 16 మంది పిల్లలకు జన్మనిచ్చిందని, వారిలో ఐదుగురు చనిపోయారని తెలిసిందన్నారు. ఆమెకు గతంలో చాలా ప్రసవాలు జరగడంతో, గర్భాశయం బలహీనపడి అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఏర్పడేది. తల్లి ప్రాణాలకు ముప్పు ఏర్పడేది. అయితే అదృష్టవశాత్తూ, అటువంటిదేమీ లేకుండానే డెలివరీ జరిగిందని, తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమమేనేని తెలిపారు. -
ఏటా 6,516 వరకట్న హత్యలు.. భయపెడుతున్న ఎన్సీఆర్బీ డేటా
లక్నో: యూపీలోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకున్న వరకట్న వేధింపుల ఘటనలో ఒక మహిళ బలయ్యింది. ఆమెను భర్త, అత్తింటివారు సజీవదహనం చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది దేశంలో వివాహిత మహిళలు ఎదుర్కొంటున్న హింసాయుత ఘటనల తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చింది.అత్యాచారాల కంటే అధికందేశంలో వరకట్న మరణాలనేవి అత్యాచారాల కంటే అధికంగా ఉన్నాయని హోం మంత్రిత్వశాఖకు చెందిన జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) తెలియజేసింది. బ్యూరో వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం 2022లో భారత్లో 6,516 వరకట్న మరణాలు చోటుచేసుకున్నాయి. అత్యాచారం, గ్యాంగ్రేప్ తరువాత హత్యకు గురైన మహిళల మరణాల కంటే ఈ మరణాలు 25 రెట్లు ఎక్కువ అని వెల్లడయ్యింది. ప్రతి మూడో మహిళ..2022లో 13,641 మహిళలు వరకట్న వేధింపులకు గురయ్యారు. ఈ ఉదంతాలు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ సంఖ్యను అనుసరించి చూస్తే, వరకట్న వేధింపులకు గురైన ప్రతి మూడో మహిళ మరణిస్తున్నదని తెలుస్తోంది. బాధితులు చివరివరకు న్యాయపరమైన సహాయాన్ని కోరడంలో వెనుకడుగు వేస్తుండటమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. న్యాయం దొరకే అవకాశాలు బహు స్వల్పం2022 చివరి నాటికి 60,577 వరకట్న కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉండగా, అందులో 54,416 కేసులు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ఆ ఏడాది 3,689 కేసులకు సంబంధించిన విచారణ పూర్తయినా, కేవలం 33శాతం తీర్పులలో నిందితులకు శిక్ష పడింది. కోర్టులకు పంపిన 6,161 నూతన కేసుల్లో కేవలం 99 కేసుల్లో మాత్రమే శిక్షలు అమలయ్యాయి. దీని ప్రకారం చూస్తే బాధిత కుటుంబాలకు ఏడాదిలోపు న్యాయం దొరకే అవకాశాలు రెండు శాతం కంటే చాలా తక్కువేని తేలింది. వరుడి కుటుంబంతో పోలిస్తే..భారతదేశంలో వరకట్నం ఇప్పటికీ ఒక ఆచారంగా కొనసాగుతోంది. పలు అధ్యయనాలు ఈ సమస్య నేటికీ తీవ్రంగానే ఉందని తెలియజేస్తున్నాయి. ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే (2004-05)లో వెల్లడైన వివరాల ప్రకారం పెళ్లిళ్లలో వరుడి కుటుంబంతో పోలిస్తే వధువు కుటుంబం 1.5 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నది. 24 శాతం కుటుంబాలు టీవీలు, ఫ్రిజ్లు, కార్లు, బైక్లు తదితర వస్తువులను వరునికి కట్నంగా ఇచ్చాయి.మహిళల్లో 29 శాతం మంది..2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) తెలిపిన వివరాల ప్రకారం 18-49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 29 శాతం మంది భర్తలు లేదా భాగస్వాముల నుంచి శారీరక లేదా లైంగిక హింస అనుభవిస్తున్నారు. వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. -
ఆమె చిరునవ్వులో ఏదో మాయజాలం..!
ఒక్క చిరునవ్వు సంభాషణతో పనిలేకుండా చేస్తుంది. అదే వెయ్యి మాటలకు సమానం అని చెప్పొచ్చు. కొందరు ప్రతి మాటకు చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పి..అవతలి వారి మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి హృదయపూర్వక సంఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. ఆమె ఆ ఒక్క సంజ్ఞతో సంభాషణకు తావివ్వకుండా మాట్లాడింది.అందుకు సంబంధించిన వీడియోనెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సంచిత అగర్వాల్ అనే కంటెంట్ క్రియేటర్ ఒక వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది అచ్చం సినిమాలో కనిపించే సన్నివేశంలా ఉంటుంది. ఆ వృద్ధ మహిల కృజ్ఞత చూపిస్తూ..ఆమె సాయం తీసుకుంటుంది. ఆ కారు ఎక్కగానే ఆమె ముఖం వెలిగిపోతుంది. ఎక్కడకి వెళ్లున్నావని సంచిత ప్రశ్నించగా ఆమె "జీవన్ భారతి" అని సమాధానం ఇస్తుంది. గమ్యస్థానంకి చేరుకోగానే కంటెంట్ క్రియేటర్ జాగ్రత్తలు చెబుతూ నిష్క్రమిస్తుంది. అయితే ఆమె మాత్రం మారుమాట్లాడకుండా ఒక్క చిరునవ్వుతో సమాధానమిస్తుంది. చిన్న స్మైల్తో తన భావన అంతా చెబుతున్నట్లుగా ఉంది ఆ వృద్ధురాలి నవ్వు. ఆ నవ్వులో ఏదో మాయ జాలం ఉంది అంటూ ఇన్స్టాలో ఆ విషయాన్ని షేర్ చేసుకుంది కంటెంట్ క్రియేటర్. అంతేగాదు కొన్నిసార్లు జీవితంలో సినిమాలోని సన్నివేశాలు చోటుచేసుకుంటాయి అనే క్యాప్షన్తో ఈ వీడియోని పంచుకున్నారామె. ఈ వీడియోకి ఏకంగా రెండు మిలియన్ల వ్యూస్, లైక్లు వచ్చాయి. ఇంకెందుకు మీరు ఓ లుక్కేయండి మరి.. View this post on Instagram A post shared by Sanchita Agarwal (@littlesweet_family) (చదవండి: వద్దనుకున్న బిడ్డ నవ్వుల రాణి అయింది) -
కుక్కకు ఆహారం వేస్తూనే ఉంది.. చెంప దెబ్బలు తింటూనే ఉంది!
ఘజియాబాద్: వీధి కుక్కలు స్వైర విహారంతో ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతున్న అంశాన్ని సుప్రీంకోర్టు సైతం తీవ్ర పరిగణించిన సంగతి తెలిసిందే. వీధుల్లో ప్రమాదకరంగా సంచరించే కుక్కలను తగు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని అక్కడకు తరలించాలని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. ఇదిలా ఉంచితే, యూపీలో ఒక ఉదంతం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఘజియాబాద్లో ఒక మహిళ.. కుక్కకు ఆహారం పెడుతూ చెంప దెబ్బల బారిన పడింది. తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న వీధి కుక్కకు ఓ మహిళ ఆహారం పెడుతుంటే దాన్ని ఆ అపార్ట్మెంట్ వాసి ఒకరు అడ్డుకున్నారు. ఇక్కడ ఎందుకు కుక్కకు ఆహారం పెడుతున్నావా? అని అడగ్గా, ఇందులో తప్పేముంది అంటూ ప్రశ్నించింది. దాంతో ఆ మహిళను చెంప దెబ్బ కొట్టాడు సదరు వ్యక్తి. ఇలా ఆమె ఆహారం పెడుతూనే ఉంది.. అతను చెంప దెబ్బలు కొడుతూనే ఉన్నాడు. సుమారు 38 సెకన్లలో 8సార్లు చెంప దెబ్బలకు గురైంది సదరు మహిళ. ఘజియాబాద్లోని విజయ్ నగర్లోని బ్రహ్మపుత్రా ఎన్క్లేవ్ సోసైటీలో ఇది జరిగింది. ఆ మహిళను చెంప దెబ్బలు కొట్టిన వ్యక్తిని కమల్ ఖన్నాగా గుర్తించారు. ఇదీ చదవండి: స్టెరిలైజేషన్ తర్వాత వదిలేయాల్సిందే -
మొసళ్లతో పోరాడి గెలిచిన మహిళలు
బహ్రెయిచ్: తమ వారికి ఏదైనా ఆపదొస్తే మహిళ అపరకాళిగా మారుతుందన్న విషయాన్ని ఉత్తరప్రదేశ్ మహిళలు రుజువుచేశారు. ప్రవాహంలో హఠాత్తుగా ప్రత్యక్షమై ప్రాణసంకటంగా మారిన మొసళ్ల నుంచి తమ వారికి ఇద్దరు మహిళలు రక్షించుకున్న ఘటనలు ఆదివారం బహ్రెయిచ్ జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. «భర్త కాలిని నోట కరిచిన మొసలి నుంచి భార్య కాపాడగా, మరో ఘటనలో ఐదేళ్ల కుమారుడిని మొసలి బారి నుంచి చాకచక్యంగా కాపాడి మరో మహిళ తన తల్లిప్రేమను నిరూపించుకుంది. ఖైరీఘాట్ పరిధిలోని ఘాఘ్రా నదీప్రవాహానికి అనుసంధానంగా ధకియా గ్రామంలో ఒక కాలువ ప్రవహిస్తోంది.ఇందులోకి ఏడు అడుగుల మొసలి వచి్చచేరింది. ఆదివారం కాలువ సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు వీరును అది ఒక్కసారిగా నోటకరిచి కాలువలోకి లాక్కెళ్లింది. అక్కడే ఉన్న బాలుడి తల్లి మాయా ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా వెంటనే మొసలిని సమీపించి తన వద్ద ఉన్న ఇనుప రాడ్డుతో దానిపై దాడిచేసింది. ఆపకుండా పలుమార్లు రాడ్తో కొట్టడంతో దెబ్బలకు తాళలేక అది బాలుడిని విడిచిపెట్టింది. విషయం తెల్సుకున్న బహ్రెయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడికి చేరుకుని కాలువలోకి మళ్లీ మొసళ్లురాకుండా వలలు ఏర్పాటుచేయించారు.మోతీపూర్ పరిధిలోని మాధవపూర్ గ్రామంలో అటుగా వెళ్లేందుకు రామ్తాలియా కాలువ దాటాల్సి ఉంటుంది. ఆదివారం 45 ఏళ్ల సైఫూ తన భార్య సుర్జానా, బంధువుతో కలిసి కాలువ దాటుతుండగా అందులోని పెద్ద మొసలు సైఫూ కాలిని నోట కరిచి కాలువ లోపలికి లాక్కెళ్లింది. ప్రాణభయంతో సైఫూ అరడం మొదలెట్టాడు. పక్కనే ఉన్న భార్య సుర్జానా ఏమాత్రం భయపడకుండా చీర కొంగును అతని వైపు విసిరి పట్టుకుని బయటకు లాగింది. ఇది చూసిన సమీప గ్రామస్థులు పరుగున వచ్చి కర్రలతో మొసలిపై దాడి చేసి సైఫూ కాలిని ఎలాగోలా విడిపించారు. -
జైలు శిక్ష తప్పించుకునేందుకు.. నాలుగేళ్లలో ముగ్గురు పిల్లలు, చివరికి
జైలు శిక్షను తప్పించుకునేందుకు ఒక మహిళ వింత నాటకానికి తెర తీసింది. దేశంలోని చట్టాలను ఉపయోగించుకొని మరీ జైలుకు వెళ్లకుండా తప్పించుకుంది. నాలుగేళ్లలో మూడు సార్లు గర్భం దాల్చిన ఘటన వార్తల్లో నిలిచింది. ఆలస్యంగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) కథనం ప్రకారం 2020లో చెన్ హాంగ్ అనే మారుపేరుతో పిలువబడే మహిళ మోసం కేసులో దోషిగా తేలింది. ఇందుకుగాను ఆమెకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. కానీ జైలు శిక్ష అనుభవించకుండా చైనా చట్టంలో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు జైలుకెళ్లకుండానే, తాత్కాలికంగా తమ శిక్షను అనుభవించే వెసులుబాటును ఉపయోగించుకుంది. ఇలాంటి ఖైదీలు జైల్లో కాకుండా సాధారణంగా ఇంట్లో లేదా ఆసుపత్రులలో కమ్యూనిటీ దిద్దుబాటు సెంటర్లలో వీరు ఉండవచ్చు. 2020 - 2024 మధ్య, చెన్ ఒకే పురుషుడితో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రతీ సారి జైలుకెళ్లడం వాయిదా పడుతూ వచ్చింది. అయితే చైనీస్ చట్టం ప్రకారం, అటువంటి పరిస్థితులలో దోషులు ప్రతి మూడు నెలలకు వైద్య నివేదికలను సమర్పించాలి . స్థానిక కరెక్షన్ సెంటర్లలో క్రమం తప్పకుండా చెకప్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే చెన్ బండారం బైటపడింది.కానీ మే 2025లో జరిగిన ఒక సాధారణ తనిఖీలో, చెన్ బేబీ కనపించకపోవడంతోపాటు, పిల్లల రిజిస్ట్రేషన్ ఆమె మాజీ భర్త సోదరి పేరుతో నమోదై ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు ఆమె తొలి సంతానం కూడా తన మాజీ భర్తతో నివసిస్తున్నట్లు తేలింది. దీంతో అసలు విషయాన్ని ఒప్పుకుంది చెన్. భర్తకు విడాకులు ఇచ్చి, ముగ్గురు పిల్లలను ఆయనకే ఇచ్చానని ఒప్పుకుంది. జైలు శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆమె ఉద్దేశపూర్వకంగా గర్భధారణను ఒక వ్యూహంగా ఉపయోగించుకుందని స్థానిక ప్రొక్యూరేటరేట్ కూడా నిర్ధారించింది. ఇదీ చదవండి: రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలొదిలేసింది: వైరల్ వీడియోఅయితే ఆమెకు నిర్దేశించిన శిక్షాకాలం ఇక ఏడాది కాలమే మిగిలి ఉండటంతో చెన్ను మిగిలిన కాలానికి నిర్బంధ కేంద్రానికి పంపారు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్ గామారింది. కొందరు నెటిజన్లు ఆమెపై జాలి చూపించగా మరికొందరు ఔరా అంటూ నో రెళ్ల బెట్టారు. తల్లి జైలు నుండి తప్పించు కోవాలనే కోరికతోనే జన్మించిన ముగ్గురు పిల్లలపైనా మరికొందరు జాలి చూపించారు. కోరుకున్నప్పుడు గర్భవతి కావడం నిజంగా షాకే అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత -
సలాం సఫురా..! నెటిజన్ల మనసు గెలుచుకున్న మహిళా డ్రైవర్..
అమ్మాయిలు అన్ని రంగాల్లోకి రావాలని చెబుతుంటారు. గానీ ఇంట్లో వాళ్ల వల్లనో సమాజం ధోరణి కారణంగానే కొన్ని రంగాలవైపుకి అస్సలు రారు. పొరపాటున కన్నెత్తి కూడా అటువైపుగా చూడరు. కానీ ఈ అమ్మాయి తనకు డ్రైవింగ్ ఇష్టం అని చెప్పడమే కాదు ఏ వాహనమైనా సరే నడిపేస్తానని ధైర్యంగా చెబుతోంది. ఆమె ధైర్యానికి, ఆలోచన తీరుకి ఫిదా అవ్వుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమన్నా తన్వీర్ అనే ప్రయాణికురాలు ఓలా లేదా రాపిడో బుక్ చేసుకోవడం కుదరకపోవడంతో..ఏదో ఒక ఆటోని పట్టుకని వెళ్లిపోదాం అనుకుంటుంది. సరిగ్గా ఆ సమయానికి ఒక మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటో ఎదురవుతుంది. మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటోని చూడటం ఇదే తోలిసారి అనుకుంటూ తమన్నా వెంటనే ఎక్కేయడమే గాక..ఆ రైడ్లో తనతో మాటలు కలుపుతుంది. అదంతా రికార్డు చేసి నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోలో సఫురా అనే మహిళా డ్రైవర్ ఆటో నడుపుతున్నట్లు చూడొచ్చు. తనకు డ్రైవింగ్ అంటే పాషన్ అని, ఏ వెహికల్ అయినా నడుపుతానని చెబుతోంది. అయితే తన వద్ద అంత బడ్డెట్ లేకపోవడంతో ఆటోతో ప్రారంభించానని, భవిష్యత్తులో స్విఫ్ట్ కారు కొనాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. తనకు ఇలా డ్రైవింగ్ చేయడం ఇష్టమైన పని కాబట్టి, అలసట అనిపించిందని చెబుతోంది. ప్రతిరోజు అత్యంత ఉత్సాహంగా పనిచేస్తానని తెలిపింది. మరి తన కుటుబం ఈ వృత్తిని ఎంచుకుంటే ఏం అనలేదా అని ప్రయణికురాలు తమన్నా ప్రశ్నించగా..మొదట తన అమ్మ భయపడిందని, అయితే తన కూతురు ధైర్యవంతురాలని, ఏదైనా చేయగలదని ఆమెకు తెలుసని గర్వంగా చెప్పింది. రైడ్ ముగింపులో తమన్నాకు హైఫై ఇచ్చి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయింది. సఫురా మూసధోరణలను బద్ధలు కొట్టి మహిళలకు స్ఫూర్తిని అందివ్వడమే కాకుండా మనసుకు నచ్చింది చేయడంలో ఉన్న ఆనందం ప్రాముఖ్యతను కూడా హైలెట్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆమె శక్తికి సలాం అంటున్నారు, ఏళ్లనాటి స్లీరియోటైప్ను బద్దలు కొట్టినందుకు హ్యాట్సాఫ్ అంటూ కీర్తిస్తున్నారు. View this post on Instagram A post shared by Tamanna Tanweer | Your Online Bestie (@tamannapasha_official) (చదవండి: పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..) -
క్షణం ఆలస్యమైతే అంతే సంగతులు : వైరల్ వీడియో
రైలు ప్రయాణాల్లో పిల్లలు, పెద్దలూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా రైలు ఎక్కేటపుడు, దిగేటపుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు అసలు పనికి రాదు. ప్రాణాలు ముఖ్యం అనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. తాజాగా కేరళలో జరిగిన ఒక ఘటన ఈ విషయాలను మరోసారి గుర్తు చేస్తుంది.కేరళలోని ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్లో ఒక మహిళను ప్రాణాపాయం నుంచి కాపాడిన ఘటన విశేషంగా నిలిచింది. రైలు నుండి దిగడానికి ప్రయత్నించినప్పుడు ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది. దాదాపు పట్టాలపై పడిపోయింది. అక్కడనే రైల్వే ఉద్యోగి రాఘవన్ ఉన్ని తక్షణమే స్పందించారు. ఆమెను ఒడుపుగా పట్టుకొని పక్కకు లాగారు. వెంటనే అలర్ట్ అయ్యి శరవేగంగా ఆయన స్పందించకపోతే ఆమె ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. ఆసీసీ టీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన నెట్టింట్ వైరల్గా మారింది. నెటిజన్లు రాఘవన్ చాకచక్యంపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు రైల్వే సిబ్బంది అంకితభావాన్ని ప్రశంసిస్తూనే, మెరుగైన భద్రతా చర్యల అవసరాన్ని కూడా నొక్కి చెబుతుండటం గమనార్హం.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంతKerala : ಚಲಿಸುವ ರೈಲಿನಿಂದ ಇಳಿಯಲು ಹೋದ ಮಹಿಳೆಗೆ ಏನಾಯಿತು ನೋಡಿ.? | Sanjevani News....#kerala #train #Ernakulam #NorthRailwayStation #viralvideo #ಕೇರಳ pic.twitter.com/LTd6J1YQmF— Sanjevani News (@sanjevaniNews) August 20, 2025కాగా 2022లో ఇలాంటి ఘటన ఒకటి రైలు ప్రమాదాల్లో సిబ్బంది అప్రమత్తతను గుర్తు చేస్తూ కేరళలోని తిరూర్ రైల్వే స్టేషన్లో సతీష్ అనే RPF హెడ్ కానిస్టేబుల్ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారిపడిన మైనర్ బాలికను రక్షించాడు. దీనికి సంబంధించిన RPF ఇండియా విడుదల చేసింది. ఈ వీడియోలో లిప్తపాటులో స్పందించి కానిస్టేబుల్ అమ్మాయిని రక్షించాడు. -
నువ్వు నాతో ఉండకపోతే.. నీ జీవితాన్ని నాశనం చేస్తా..
సనత్నగర్: ‘నువ్వు నాతో ఉండకపోతే, నీ ఫొటోలను ప్రతిచోటా వైరల్ చేస్తా..నీ జీవితాన్ని నాశనం చేస్తా.. నువ్వు ఎవరికీ నీ ముఖాన్ని చూపించలేవు..’ అంటూ మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫోటోలు, వీడియోలతో ఓ యువతిని బెదిరించిన వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బేగంపేట ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీకి చెందిన యువతి (18) కామన్ లా అడ్మిషన్ టెస్ట్కి ప్రేపర్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ హార్దోల్కు చెందిన అర్షద్ఖాన్ ఏఐ పరిజ్ఞానంతో మార్ఫింగ్ చేసిన ఆమె అశ్లీల ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ గత కొంతకాలంగా బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ క్రమంలో ఆమెతో పాటు ఆమె సోదరుడికి కూడా ఆ ఫొటోలు పంపించి బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. ఆమెకు ఫోన్ చేసి నాతో రావాలని, నేను చెప్పినట్లు వినాలని బెదిరించాడు. దీంతో అర్షద్ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లగ్జరీ కారులో పేరెంట్స్ను సర్ప్రైజ్ చేసిన భారతీయ యువతి
బాగా చదువుకోవాలి..మంచి ఉద్యోగం సంపాదించాలి అమ్మానాన్నల్నికారులో తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయాలి. లేదంటే.. తొలిసారి వాళ్లని విమానం ఎక్కించాలనే కలను సాకారం చేసుకోవాలి. ఇలాంటి కలలు విదేశాల్లో ఉద్యోగాలు చేసే సగటు భారతీయ ఉద్యోగులకు సర్వ సాధారణం. అలా ఒక భారతీయ యువతి ఖరీదైన కారులో తల్లిదండ్రులను షికారుకు తీసుకెళ్లిన వీడియో ఒకటి నెట్టింట్ పలువుర్ని ఆకట్టుకుంటోంది.ఇండియాకు చెందిన అపూర్వ బింద్రే తన తల్లిదండ్రులను డ్రైవర్ లేని కారులో శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవ్కు తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోతో పాటు తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్ల ఆమెను, ఆమె తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేస్తూ, బింద్రే “నా తల్లిదండ్రులను శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లెస్ కారు వేమోలో తీసుకెళ్లా.. వావ్, నైస్ ఫీలింగ్! ఇది మాన్యువల్ డ్రైవర్ కంటే సురక్షితంగా, స్మూత్గా అనిపించింది. అందుకే వెంటనే ఇంకో రైడ్ కూడా బుక్ చేసుకున్నాం. మా అమ్మా నాన్న చెప్పాల్సింది చాలా ఉంది అది త్వరలోనే’’ అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 94 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు View this post on Instagram A post shared by Apurva Bendre (@apurva_bendre)‘‘ఈ రైడ్తో మీ పేరెంట్స్ పూర్తిగా థ్రిల్ అయి ఉండాలి!” అని ఒకరు, “చాలా సరదాగా ఉంది! వారి స్పందన ఏమిటి?” అని మరొకరు దీనిని “ఒక తరాల ప్రయాణం” అని ఇంకొకరు అభివర్ణించారు. చాలా గర్వంగా ఉంది. మీరు మీ తల్లిదండ్రుల కలను నెరవేర్చడం సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అనే కమెంట్లు కూడా చూడొచ్చు.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
టీడీపీ నేతల వేధింపులు భరించలేకపోతున్నా.. నావల్ల కావట్లే!
శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్యే తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ వాపోయిన కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య.. బలవనర్మణానికి ప్రయత్నించారు. టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ‘‘టీడీపీ నేతల వేధింపులు భరించలేకపోతున్నా. గత మూడు రోజులుగా నన్ను, నా కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. నా వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని ఆస్పత్రి బెడ్ మీద కన్నీళ్లు పెట్టున్నారు. ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా ఆమెపై నెగెటివ్గా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ నేతలు వాళ్ల సంబంధిత అకౌంట్లలో ఆ పోస్టులు చేయిస్తున్నారని ఆమె అంటోంది. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వ్యవహారం రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఆ ఆరోపణలు సంచలనంగా మారాయి. మూడు రోజుల నుంచి బాధితురాలు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య మీడియా ముఖంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని కూడా ఆమె అన్నారు. ఎమ్యెల్యే వేధింపులు తట్టుకోలేకపోతున్నానని.. నావల్ల కావడం లేదంటూ.. మీటింగుల పేరుతో రాత్రి 11 గంటల వరకు ఇబ్బంది పెడుతున్నారని మీడియా ముందు కన్నీరుపెట్టుకుంది. ఉన్నతాధికారులు కూడా ఎమ్మెల్యే చెప్పిందే వింటున్నారని చెప్పుకొచ్చింది. ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు తనపై అవినీతి ఆరోపణలు చేసి ఇచ్చాపురం ట్రాన్స్ఫర్ చేశారని మండిపడిందామే. ఇదే విషయంపై SC కమిషన్కు కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యే రవి ఆ ఆరోపణలను ఖండించారు. ఆమెపై మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. సౌమ్యపై టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయగా.. తీవ్ర మనస్థాపంతో ఆమె బలవన్మరణానికి ప్రయత్నించింది. -
భారత్ వ్యక్తిని పెళ్లాడిన బ్రెజిలియన్ ముద్దుగుమ్మ..!
ప్రేమ అంటే ఇదేరా అనేలా ఉండేలా ఎన్నో లవ్ స్టోరీలను చూశాం. వాటన్నింటిలో ప్రేమ ప్రేమే. దాని కోసం ఏం చేయడానికైనా రెడీ అనట్లుగా సిద్ధపడుతున్న ప్రేమికులు గాథల వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎల్లలు, సరిహద్దు దాటి ఎన్నో ప్రయాసలు పడి ఒక్కటైన జంటలెందరినో చూశాం. కానీ ఇక్కడ ఈ జంట అంత కష్టాలు చవి చూడకపోయినా..వీరిద్దరూ ఒక్కటైనా విధం చూస్తే..ఎక్కడైన లవ్వు..లవ్వే కథ అనిపిస్తుంది. మరి ఆ జంట అందమైన కథేంటో చకచక్క చదివేయండి మరి..బ్రెజిలియన్ మహిళ తైనాషా భారతీయ వ్యక్తిని పెళ్లాడింది. ఎలా తమ ప్రేమ చిగురించి పెళ్లిపీటలక్కెందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. తామిద్దరం విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వాళ్లం. కానీ తాను ఆ గుజరాతి వ్యక్తితో ఆశ్చర్యకరంగా ప్రేమలో పడిపోయానని అంటోంది. 2020 కోవడిడ్ 19 సమంయంలో ఇద్దరు ఆన్లైన్ కలుసుకున్నారు. ఇంకా అప్పటికీ టీకాలు వేయించుకోని క్రిటికల్ టైంలో ఆమెను కలవాలని గుజరాతీ భర్త పడిన ప్రయాసను చూసి..ఫస్ట్ మీట్లోనే అతని ప్రేమకు ఫిదా అయి లవ్లో పడిపోయిందట. ప్రేమలో పడిన ఐదునెలలకే ఇద్దరు పెళ్లిచేసుకున్నాం అని పేర్కొంది. తమ వివాహం బ్రెజిల్లోనే జరిగిందని, తమ పెళ్లిని తన భర్త తరుఫు భారతీయ కుటుంబం కూడా అంగీకరించిందని చెప్పుకొచ్చింది తైనా. తామిద్దరిది వేర్వేరు నేపథ్యమే అయినా..మా మధ్య ఉన్న అభిమానం, ప్రేమ రోజు రోజుకి మరింతగా బలపడుతుందని, ఇంతవరకు తమ దాంపత్య జీవితాన్ని విజయవంతంగా లీడ్ చేయగలిగేలా చేసినా ఈ విశ్వానికి సదా కృతజ్ఞతలు అని చెబుతోంది తైనా. ఆ దంపతుల ప్రేమ కథ నెటిజన్లను తెగ ఆకర్షించడమే గాక, ఎక్కడైన ప్రేమ.. ప్రేమే..దానికున్న శక్తి అనంతం, అజేయం అంటూ ఆ జంటని ప్రశంసిస్తూ ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Tainá Shah (@tainashah) (చదవండి: ‘రాక్స్టార్’: 150 ఏళ్ల నాటి పియానోని ప్లే చేసిన సీఎం) -
చంద్రబాబును బుక్ చేసిన మహిళ.. స్క్రిప్ట్ చూసుకోవాలి కదమ్మా.!
-
మంత్రి సవిత అనుచరులు తన కొడుకుని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపిస్తున్న మహిళ
-
ప్రేమంటే ఇదేరా.. ప్రియుడి కోసం శ్రీలంక యువతి సాహసం
అన్నానగర్: ప్రేమించిన యువకుడి కోసం ఓ యువతి ఏకంగా దేశం దాటి వచ్చిన ఉదంతమిది. ప్రియుడి కోసం ప్రియురాలు తన దగ్గరున్న నగలు అమ్ముకుని మరీ శ్రీలంక నుంచి నకిలీ పడవలో భారత్కు వచ్చిన ఘటన బుధవారం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటిలో జరిగింది. పోలీసు అధికారుల కథనం మేరకు.. అరిచలమునై బీచు బుధవారం ఉదయం ఓ యువతి శరణార్థిగా వచ్చిందని కోస్టల్ పోలీసులకు సమాచారం అందింది.ఆ మహిళను కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగం పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. పోలీసుల కథనం మేరకు.. శ్రీలంకలోని మన్నార్కు చెందిన విదుర్షియ (25) తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా పళనిలో ఒక శరణార్థి శిబిరంలో తన తల్లి, తండ్రితో కలిసి నివసించేది. ఆ సమయంలో ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. గత ఏప్రిల్లో ఆమె శ్రీలంకకు వెళ్లగా, తిరిగి అక్కడి నుంచి భారత్కు రావడానికి వీసా పొందలేకపోయింది.అయితే ఆమె తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవడానికి నకిలీ పడవలో రావాలని నిర్ణయించుకుంది. దీని కోసం ఆ మహిళ తన నగలను అమ్మి వచ్చిన నగదుతో తలైమన్నార్ బీచ్ నుంచి ఓ ప్లాస్టిక్ పడవ ఎక్కి అరిచల్ మునైకి చేరుకుంది. దర్యాప్తు అనంతరం ఆ యువతిని మండపం శరణార్థి శిబిరానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. -
ఎమ్మెల్యే నసీర్కు, ఆ టీడీపీ మహిళా నేతకి మధ్య ఎఫైర్: సూఫియా
సాక్షి, గుంటూరు: టీడీపీ మహిళా కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసుకున్న సూఫియాను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సూఫియా మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు ఓ టీడీపీ మహిళా నేతకు మధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్తవం. ఆ మహిళా నేత భర్త నవీన్ కృష్ణే నాకు చెప్పాడు’’ అంటూ సూఫియా చెప్పుకొచ్చింది.‘‘నేను నా భార్యను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దగ్గరకు తీసుకువెళ్లే వాడినని నవీన్ కృష్ణ నాకు చెప్పాడు. నవీన్ కృష్ణ తన భార్య ఫోన్ను హ్యాక్ చేశాడు. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుకునే కాల్స్ అన్ని భర్త నవీన్ కృష్ణ వింటూ ఉండేవాడు. తన భార్యకు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు సంబంధించిన వీడియోలు ఆమె భర్త నవీన్ కృష్ణ దగ్గర ఉన్నాయి. నేను నసీర్ అహ్మద్ దగ్గరికి వెళ్లి ఆమె భర్త దగ్గర మీ వీడియోలు ఉన్నాయని చెప్పాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నసీర్ బెదిరించాడు. ఇప్పుడు వాళ్లందరూ ఏకమై ఈ వ్యవహారాన్ని నాపై నెడుతున్నారు...పోలీసులు మా కుటుంబ సభ్యుల్ని తరచూ పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక నేను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించి ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకుంటే అన్ని వీడియోలు బయటకు వస్తాయి. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో నవీన్ కృష్ణ బయటికి విడుదల చేశాడు. నవీన్ కృష్ణ, ఆయన భార్య వాళ్ల బంధువు విజయ్ కృష్ణను అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని సూఫియా పేర్కొంది. -
Viral Video: కర్మ రిటర్న్ అంటే ఇదే.. తనని తినాలనుకున్న యువతిపై రొయ్య ప్రతీకారం..
-
ఢిల్లీలో మరో దారుణం.. యువతిపై మానవ మృగాల అకృత్యం
న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలో పంద్రాగస్టు వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో మరో ఘోరం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువతిపై నలుగురు యవకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బాధితురాలిని వారు బెదిరించారు. వివరాల్లోకి వెళితే ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్లో ఆదివారం రాత్రి జరిగిన ఒక పార్టీలో 24 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు, వారి కోసం గాలింపు కొనసాగుతున్నదన్నారు. ఆ నలుగురు నిందితులు బాధితురాలిని వాష్రూమ్లోనికి లాకెళ్లి, సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్లోని ఒక సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు తాను పార్టీలో మద్యం సేవించిన తర్వాత నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపారని ఆరోపించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.తన స్నేహితుడు తనను సివిల్ లైన్స్లోని మరో స్నేహితుని ఇంటికి పార్టీకి ఆహ్వానించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ ఆమె తన స్నేహితురాలు, మరొక పరిచయస్తుడు, మరో ఇద్దరు యువకులను కలుసుకుంది. వారంతా మద్యం సేవించి, అర్థరాత్రి వరకు పార్టీ చేసుకున్నారు. ఆ తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. తరువాత నలుగురు యువకులు ఆమెను వాష్రూమ్కు తీసుకెళ్లి, సామూహిక అత్యాచారం చేశారు. అలాగే దీనిని వీడియో తీశారు.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బాధితురాలిని వారు బెదిరించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆ యువకులు ఆమెను.. ఆమె ఇంటి బయట దింపి వెళ్లిపోయారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి, జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. ఒక మహిళా అధికారి ఆమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. తరువాత బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారని పోలీసులు వివరించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మాన ప్రాణాల కోసం పరిగెత్తి..
చట్టాలు, కఠిన శిక్షలు.. మానవ మృగాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒకమూల ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీసీ కెమెరాల సాక్షిగా జరిగిన ఓ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తన మాన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువతి రోడ్డుపై పరుగులు తీసిన దృశ్యాలు అందులో ఉన్నాయి.కొందరు కీచకులు ఓ బధిర యువతిని బైకుల మీద వెంటాడి.. ఎత్తుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రకటనకు విరుద్ధంగా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ నేరానికి సంబంధించిన వాస్తవ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.ఉత్తర ప్రదేశ్లోని బలరామ్పూర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం తన బంధువు ఇంటి నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది!. ఆమె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనతో గాలించగా.. పోలీస్ అవుట్పోస్ట్ సమీపంలోని పొదల్లో దుస్తులు చినిగిపోయి స్పృహ లేని స్థితిలో ఆమె కనిపించింది.వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి.. వైద్యపరీక్షల అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. బైక్ మీద వచ్చిన వ్యక్తి తన వెంటపడ్డాడని.. అతని నుంచి రక్షించుకునేందుకు పరిగెత్తానని ఆమె తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు ప్రకటించారు. అయితే.. ఈ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఉండే బంగ్లా సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. అదే సమయంలో.. యువతిపై జరిగింది సామూహిక అత్యాచారమని బాధిత కుటుంబం అంటోంది. ఈలోపు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజీలో బైక్ మీద కొందరు ఆమెను వెంబడించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఆ ఫుటేజీని పరిశీలించి ఇప్పటిదాకా ఇద్దరిని అరెస్ట్ చేశారు.A 21-year-old disabled girl was allegedly gang raped in Balrampur. A video has surfaced before the alleged gang rape, in which the girl is seen running on the road to escape from the accused. 5-6 bikes can be seen coming from behind. Police have now released a statement that they… pic.twitter.com/YPRdsaWodJ— Mohammed Zubair (@zoo_bear) August 12, 2025 -
రాత్రిళ్లు నగ్నంగా వీడియో కాల్స్.. వీఆర్కు ఎస్ఐ రాజశేఖర్
పుట్టపర్తి టౌన్/ ముదిగుబ్బ: న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించడంతో పాటు రాత్రి వేళల్లో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడిన ‘పట్నం’ ఎస్ఐ రాజశేఖర్పై వేటు పడింది. పోలీసు స్టేషన్కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న అతను అమాయక గిరిజన మహిళను వేధించడంతో వీఆర్కు పంపుతూ ఎస్పీ రత్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదిగుబ్బ మండలం గరుగుతండాకు చెందిన ఓ గిరిజన మహిళలను లైంగికంగా వేధించిన రాజశేఖర్ గురించి ‘సాక్షి’ మంగళవారం ‘నాతో వస్తే ఓకే... లేదంటే ఇబ్బంది పడతావ్..’ శీర్షికన వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే అతన్ని వీఆర్కు పంపారు. అలాగే ఎస్ఐ రాజశేఖర్పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సంబం«ధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. విచారణ అనంతరం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్నం ఎస్ఐగా జయరాంనాయక్ ‘పట్నం’ ఎస్ఐగా కె. జయరాంనాయక్ను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు. దీంతో మంగళవారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో ఇప్పటి వరకూ పట్నం ఎస్ఐగా ఉన్న రాజశేఖర్ను వీఆర్కు పంపిన ఎస్పీ రత్నం..ఆయన స్థానంలో వీఆర్లో ఉన్న జయరాంనాయక్ను నియమించారు. నాతో వస్తే ఓకే.. లేదంటే ఇబ్బందిపడతావ్.. -
గంటన్నరపాటు ఎదురు చూసినా రాని 108
మహబూబాబాద్ జిల్లా: పురుగు మందు తాగిన ఓ యువతిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లేందుకు గంటన్నరపాటు ఎదురుచూసినా 108 వాహనం రాకపోవడంతో, బాధితురాలికి సెలైన్ బాటిల్ పెట్టుకొని బైక్పై ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుగులోత్ మేఘమాల (18) ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూం క్లీన్చేసే యాసిడ్ తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇరుగుపొరుగు వారు గమనించి ఆ యువతిని బైక్పై గార్ల సీహెచ్సీకి తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో సీహెచ్సీలో అందుబాటులో ఉన్న 108 వాహనం రమ్మంటే కాసేపు డ్రైవర్ లేడని, కాసేపు మరమ్మతుకు గురైందని సిబ్బంది పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో వారు మరో 108 వాహనా నికి ఫోన్ చేశారు. గంటన్నర అయినా రాకపో వడంతో గత్యంతరం లేక మేఘమాలకు సెలైన్ బాటిల్ పెట్టించి తన బాబాయ్ బైక్పై ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో 108 వాహనం వచ్చింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది తీరుపై యువతి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, యువతి పురుగుల మందు తాగడానికి గల కారణాలు తెలియరాలేదు. -
నారీ స్వారీ!
శారీరక దృఢత్వం భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోగల మానసిక బలాన్నిపెంచి... కరిగిపోని కాన్ఫిడెన్స్ను ఇస్తుంది! అది జీవన దృక్పథాన్నే మార్చేస్తుంది! ఇలాంటి అద్భుతాలను క్రియేట్ చేసే కొలువులున్నాయి.. వాటిల్లో రాణించే అమ్మాయిలున్నారు! ఆ ఫోర్సే.. మౌంటెడ్ పోలీస్.. పదిమంది నారీమణులతో కూడిన ఆ అశ్వదళం హైదరాబాద్ను పహారా కాస్తోంది.. సెల్ఫ్ ప్రోటెక్షనే కాదు.. శాంతిభద్రతల పర్యవేక్షణలోనూ స్త్రీ శక్తిని చాటుతోంది!ఇంట్లో ఆడపిల్ల వీథి చివరన ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలన్నా తమ్ముణ్ణి తోడు ఇచ్చే పంపే కాలానికిక చెల్లు ఏమో అనిపిస్తోంది.. హైదరాబాద్లోని కీలక్రపాంతాల్లో గుర్రాల మీద గస్తీ తిరుగుతూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న అశ్వదళ మహిళా పోలీసులను చూస్తుంటే! నిజానికి వాళ్లను మహిళా పోలీస్ అంటే వాళ్లనలా తీర్చిదిద్దిన వాళ్ల దళాధిపతులు .. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షితామూర్తి ఒప్పుకోరు.‘జాబ్కి జెండర్ ఏంటీ.. శక్తిసామర్థ్యాలు ప్రామాణికం కానీ..’ అంటారు. అందుకే తొలిసారిగా.. ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్) పోలీస్లోని పదిమంది అమ్మాయిలను అశ్వదళంలోకి ఆహ్వానించి.. వారికి గుర్రపు స్వారీలో శిక్షణనిప్పించి విధులను అప్పగించారు. వీళ్లు ప్రతి శుక్రవారం మక్కా మసీదు, చార్మినార్ దగ్గర, రోజు విడిచి రోజు లేక్ డ్యూటీలు చేస్తున్నారు. ర్యాలీలు, పండగలు, గణేశ నవరాత్రులు, శోభాయాత్రలు వంటి సందర్భాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.శక్తి చూపించింది.. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.. ఈ దళంలోని పదిమంది అమ్మాయిలది భిన్న నేపథ్యం. కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరినప్పటికీ మౌంటెడ్ పోలీస్ అంటే వాళ్లెవరికీ తెలియదు.. ఆ ఫోర్స్ గురించి నోటీస్ వచ్చేదాకా. ఏఆర్ పోలీస్లో రెండువందల మందికి పైగా మహిళలుంటే మౌంటెడ్ పోలీస్లో చేరడానికి పదిమంది మాత్రమే ముందుకు వచ్చారు. మౌంటెడ్ పోలీస్ అంటే ఏంటో రీసెర్చ్ చేశారు. ‘ట్రైనింగ్ టఫ్గా ఉంటుంది.. ఫిట్నెస్ చాలా అవసరం.. ఆసక్తి ఉంటేనే రండి’ అని ట్రైనర్ చెప్పాక దాన్నో సవాలుగా తీసుకున్నారు. శిక్షణలో గుర్రాల మీద నుంచి పడ్డారు. దెబ్బలు తగిలాయి. అయినా వెనుకడుగు వేయలేదు.గుర్రాలను మాలిమి చేసుకోవడంలో కొన్ని మెళకువలను కనుగొన్నారు. గుర్రాలు చెప్పినట్టు వినడం మొదలెట్టాయి. అలా శిక్షణలోని ఆంతర్యాన్ని పసిగట్టి.. తదనుగుణంగా ముందుకు సాగారు. ఆ ట్రైనింగ్ వాళ్ల ఆత్మస్థయిర్యాన్నే కాదు.. ఫిజికల్ ఫిట్నెస్నూ పెంచింది. జీవన దృక్పథాన్నే మార్చింది. విధి నిర్వహణలో వాళ్లు గుర్రాలను మచ్చిక చేసుకోవడం దగ్గర్నుంచి, తమ కమాండ్స్తో వాటిని చెప్పుచేతల్లో పెట్టుకోవడం మొదలు.. జనసమ్మర్ధంలో పరిస్థితిని అదుపు తప్పకుండా చూసుకోవడం వరకు మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా సామర్థ్యాన్ని చాటుకుంటున్నారు. ఈ దళంలో పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న కానిస్టేబుల్ అఖిల కూడా ఉన్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరు సభ్యులు సుభద్ర, హవంతిక ఈ కొత్త కొలువు గురించి వివరించారు. మగవాళ్లకే పరిమితమైన కొలువుల్లోకి మహిళలు వస్తే.. పనిప్రదేశం లో విమెన్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుందని ఈ అశ్వదళం నిరూపించింది.– సరస్వతి రమ – ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్కష్టాలు, సవాళ్లంటే గౌరవం ఏర్పడింది.. ఎస్సై కావాలని, గృహ హింస మీద మహిళలకు అవగాహన కల్పించాలనేది నా లక్ష్యం. దానికోసమే రీసెంట్గా డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేశాను. ముందు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడేసరికి ఇందులో చేరిపోయాను. కొత్త పనులు చేయడమన్నా, నేర్చుకోవడమన్నా చాలా ఇష్టం. అందుకే మౌంటెడ్ పోలీస్ గురించి చెప్పగానే అందులో చేరడానికి అందరికన్నా ముందుగా నేను చెయ్యెత్తాను.అయితే నాకు రెండు డెలివరీలూ సిజేరియనే అవడంతో మౌంటెడ్ పోలీస్కి కావల్సినంత ఫిజికల్ ఫిట్నెస్ లేక ట్రైనింగ్ మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. వెనక్కి వెళ్లిపోతే మిగిలిన అమ్మాయిలు నిరుత్సాహపడతారేమో అనిపించింది. ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టాను. కాన్ఫిడెన్స్ వచ్చింది. లైఫ్ పట్ల అప్పటిదాకా నాకున్న దృక్పథమే మారిపోయింది. లేనిదాని గురించి దిగులుపడే బదులు ఉన్నదాని గురించి పాజిటివ్గా ఎలా ఆలోచించాలో తెలుసుకున్నాను. జీవితంలోని కష్టాలు, సవాళ్లంటే గౌరవం ఏర్పడింది – అఖిలఉత్సాహం.. ప్రోత్సాహం.. చిన్నప్పటి నుంచీ విలక్షణంగా... విభిన్నంగా ఉండాలనే తపన. అందుకే ఈ పోలీస్ జాబ్లోకి వచ్చాను. అది రొటీన్ అయిపోతోందనుకుంటున్నప్పుడే మౌంటెడ్ పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. గుర్రపు స్వారీ కష్టమని మా నాన్న వద్దన్నారు. కానీ ఆయన్ని ఒప్పించి ట్రైనింగ్లో చేరాను. నన్ను డ్యూటీలో చూసిన మా బంధువులు ‘నీ బిడ్డ ఠీవిగా భలే డ్యూటీ చేస్తోంద’ని తనతో చెబుతున్నారని మా నాన్న నాతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఆయన కళ్లల్లో కనిపించే గర్వం చెప్పలేని సంతోషాన్నిస్తుంది. ఐపీఎస్ కావాలనే నా లక్ష్యానికి తగిన ప్రోత్సాహన్నిస్తుంది. – మర్రి హవంతికబ్యాలెన్సింగ్ నేర్చుకున్నాను..చిన్నప్పటి నుంచీ నాకు టఫ్ టాస్క్స్ అంటే ఇష్టం. అందుకే కరాటే, టైక్వాండో నేర్చుకున్నాను. స్పోర్ట్స్లో కూడా ముందుండేదాన్ని. ఆ స్పిరిటే నన్ను పోలీస్ జాబ్ వైపు, మౌంటెడ్ పోలీస్ వైపు మళ్లేలా చేసింది. ఈ కొలువు నాకో కొత్త చాలెంజ్. గుర్రపు స్వారీతో లైఫ్ బ్యాలెన్సింగ్ను నేర్చుకున్నాను. నా భవిష్యత్ లక్ష్యం గ్రూప్ వన్ ఆఫీసర్. – సుభద్ర -
ఇప్పుడొచ్చి మీరేం చేస్తారు..
-
నాతో వస్తే ఓకే.. లేదంటే ఇబ్బందిపడతావ్..
సాక్షి టాస్క్ఫోర్స్: న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లెక్కిన ఓ గిరిజన మహిళను ఆ స్టేషన్ ఎస్ఐ లైంగికంగా వేధించాడు. తన కోరిక తీరిస్తే.. కేసులో న్యాయం చేస్తానని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ బెదిరించాడు. రాత్రి వేళల్లో పదే పదే వీడియో కాల్స్ చేసి వేధించేవాడు. దీంతో బాధిత మహిళ తన భర్తకు విషయం చెప్పగా.. ఆయన కూడా ఎస్ఐని బతిమాలినా ఆ ఎస్ఐ వెనక్కు తగ్గలేదు. ఆమె కదలికలపై నిఘా పెట్టి ఆమెను వెంబడించి వేధించేవాడు. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం పట్నం పోలీస్స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ వేధింపులతో ఆ యువతి తీవ్ర మానసిక వేదన అనుభవిస్తోంది. వెంబడించి మరీ వేధింపులు గరుగుతండాకు చెందిన భార్యాభర్తల విడాకుల కేసులో భాగంగా ఆ భార్యకు రావాల్సిన భరణం గురించి మాట్లాడేందుకు ఇటీవల పట్నం పోలీస్స్టేషన్కు ఆమె బంధువులు వెళ్లారు. ఆ మహిళకు న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి వెళ్లిన పాపానికి ఎస్ఐ తనను లైంగికంగా వేధిస్తున్నారని బాధిత మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఎస్ఐ తనకు నగ్నంగా చేసిన వీడియో కాల్స్ను రికార్డ్ చేసినట్టుగా ఆమె చెప్పింది. ఇటీవల తాను వ్యక్తిగత పని మీద అనంతపురం వెళ్తే.. ఎస్ఐ రాజశేఖర్ తనను వెంబడించి తన వద్దకు వచ్చి వాహనంలోకి ఎక్కాలంటూ బలవంతపెట్టాడని కన్నీటిపర్యంతమైంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన అధికారే తమను ఇలా వేధిస్తుంటే.. ఇక తాము ఎవరికి చెప్పుకోవాలంటూ బాధిత మహిళతో పాటు, ఆమె బంధువులు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. కాగా, ఎస్ఐ రాజశేఖర్ ప్రవర్తనపై ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
మహిళా మార్ట్.. బిజినెస్ భేష్!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన నాణ్యమైన ఉత్పత్తుల అమ్మకానికి ఖమ్మంలోని మహిళామార్ట్ వేదికగా నిలుస్తోంది. ఏళ్లుగా సభ్యులు ఉత్పత్తులను తయారుచేస్తున్నా.. సరైన మార్కెటింగ్ లేక నష్టపోయారు. వివిధ ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటుచేసినా ప్రదర్శనకే పరిమితమయ్యారు. కానీ కార్పొరేట్ తరహాలో ఖమ్మంలో మహిళా మార్ట్ ఏర్పాటవడంతో వారి కష్టాలు తీరాయి.జిల్లాలోని అన్ని స్వయంసహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులను ఒకే చోట విక్రయించేలా ఈ మార్ట్ను తీర్చిదిద్దారు. రాష్ట్రంలో ఈ తరహా మార్ట్ ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మే 28న ఈ మార్ట్ మొదలుకాగా.. రెండు నెలల్లోనే వ్యాపారం దాదాపు రూ.17 లక్షలు దాటింది. దీని ద్వారా ఆరు ఎస్హెచ్జీల సభ్యులకు ఉపాధి లభించడమే కాక మిగతా సంఘాల సభ్యులు తయారుచేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సులువవుతోంది. గత కలెక్టర్ ఆలోచనతో.. జిల్లాలోని ఎస్హెచ్జీల సభ్యులు గ్రామీణ ప్రాంతా ల్లో లభ్యమయ్యే ముడిసరుకుతో ఉత్పత్తులను తయా రు చేస్తుండగా మార్కెటింగ్ లేక, పెట్టుబడి కూడా రాక నిరాశకు లోనయ్యారు. ఇదే అదనుగా కొందరు వీరి నుంచి తక్కువ ధరకు ఉత్పత్తులను కొనుగోలు చేసి హైదరాబాద్ వంటి నగరాల్లో అధిక ధరకు విక్రయించే వారు. ఈనేపథ్యంలో గత కలెక్టర్ ముజమ్మిల్ఖాన్.. మహిళామార్ట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రూ.30 లక్షల సెర్ప్ నిధులతో పాత భవనాన్ని ఆధునికీకరించి మహిళా మార్ట్ ఏర్పాటు చేయించడంతో వీరి వ్యాపారాలకు ఆదరణ లభిస్తోంది. 15 రోజులకోసారి చెల్లింపులుస్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులు తమ ఉత్పత్తులను ఇక్కడికి తీసుకొస్తే.. వాటిని పరిశీలించి నాణ్యత ఆధారంగా ధర నిర్ణయిస్తారు. ఆపై మహిళా మార్ట్ స్టిక్కర్తో విక్రయాలు చేస్తున్నారు. ఈ లావాదేవీలకు సంబంధించిన సొమ్ము జిల్లా సమాఖ్య ఖాతాలోకి వెళ్తుంది. ప్రతీ 15 రోజులకోసారి లెక్కలు తీసి.. మండల సమాఖ్యలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇచ్చేస్తారు. ఈ మహిళా మార్ట్లో ప్రస్తుతం 200కు పైగా ఉత్పత్తులను అమ్ముతున్నారు. వందలాది కుటుంబాలకు ఊతం.. మహిళా మార్ట్ .. జిల్లాలోని వందలాది కుటుంబాలకు ఊతంగా మారింది. ఉత్పత్తులు నాణ్యంగా ఉన్నాయనే ప్రశంసలు వస్తుండటంతో మరిన్ని ఉత్పత్తులను అమ్మకానికి ఉంచాలని వినియోగదారులు కోరుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మార్ట్లో ప్రతిరోజు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. జూన్ నెలలో రూ.8 లక్షలు, జూలైలో రూ.8.50 లక్షల అమ్మకాలు జరగడం విశేషం.శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి నేను ఇంటర్ చదవడంతో వ్యాపార నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. కంప్యూటర్లో వివరాల నమోదు, బిల్లుల జారీ, ప్యాకింగ్పై అవగాహన రావడంతో మహిళా మార్ట్ ప్రారంభమయ్యాక పిలిపించారు. ఇక్కడ కూడా మరికొంత శిక్షణ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకున్నారు. – అరవికట్ల వసంత, వేపకుంట్ల, రఘునాథపాలెం మండలంమహిళలకు మంచి అవకాశం చదువుకుని ఇంట్లో ఖాళీగా ఉంటున్న నాకు ఉద్యోగం లభించింది. డిగ్రీ వరకు చదివిన నేను స్టాక్ రిసీవర్గా పని చేస్తున్నా. విక్రయాలు మరింత పెరిగితే ఇంకా ఎక్కువ మంది మహిళలు ఉపాధి పొందుతారు. – తుడుం త్రివేణి, నేలపట్ల, కూసుమంచి మండలంనెలకు రూ.50 వేల సరుకులు ఇస్తున్నా జొన్న మురుకులు, మిక్చర్, సజ్జ బూరెలు, జొన్న లడ్డూ, రాగి లడ్డూ్డ, కారప్పూస, అరిసెలు, రాగిచెక్కలు, సకినాలు, చేపలు, చికెన్ పచ్చళ్లు వంటి ఉత్పత్తులతో రూ.50 వేల విలువైన సరుకులు నెలనెలా మార్టుకు ఇస్తున్నా. గతంలో గిరాకీ ఉన్న చోటకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు తిరిగే ఇక్కట్లు తప్పాయి. – మద్దినేని పద్మ, తులశమ్మ సంఘం, గోపారం, కొణిజర్ల మండలం -
బస్సు డ్రైవర్ పై చేయి చేసుకున్న మహిళ
-
రెండుసార్లు ఓటేసిన మహిళ ఆధారాలివ్వండి
బెంగళూరు: గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ మహిళ రెండుసార్లు ఓటే సిందంటూ చేసిన ఆరోపణలకు ఆధారాలను అందజేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కర్ణాట క చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) లేఖ రాశారు. షకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటేసినట్లు పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డులు చెబుతు న్నాయని రాహుల్ కొన్ని పత్రాలను ప్రదర్శించారు. ఓటరు ఐడీ కార్డును ఆమె రెండు సార్లు ఉపయోగించుకున్నారు. పోలింగ్ బూత్ టిక్ మార్కు వేశారు’అని అందులో ఉందని రాహుల్ ఆరోపించా రు. అయితే, తమ దర్యాప్తుపై షకున్ రాణి ఒక్క సారి ఓటేసినట్లు వెల్లడైందని సీఈవో తెలి పారు. టిక్ మార్కు పెట్టినట్లుగా రాహుల్ గాంధీ చూపిన ఓటరు జాబితా పోలింగ్ అధికారి అందజేసిందని కాదని సీఈవో స్పష్టం చేశారు. ‘షకున్ రాణి లేదా మరొకరు రెండు సార్లు ఓటేశారని ఆరోపిస్తూ మీరు చూపిన పత్రాలను మాకు అందజేయండి. పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతాం’అని రాహుల్కు రాసిన లేఖలో సీఈవో కోరారు. లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, కర్ణాటకలో మహదేవపు రం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ఓటరు జాబితాలో దొంగ ఓట్లు నమోదయ్యా యని రాహు ల్ ఈసీ లక్ష్యంగా ఆరోపణలు చేయడం తెల్సిందే. -
విశాఖలో ఆటీన్ రాణులు
విశాఖ సిటీ: విశాఖ ఆటీన్ రాణులు పెరిగిపోతున్నారు. చతుర్ముఖ పారాయణంలో మునిగితేలుతున్నారు. పలువురు మహిళలు ఏకంగా పేకాట డెన్లు సైతం నిర్వహిస్తున్నారు. కుటుంబాలను సైతం పట్టించుకోకుండా మూడు ముక్కలాటలో నిమగ్నమైపోతున్నారు. తన భార్య పేకాట మత్తు లో పడి తమను పట్టించుకోవడం లేదని ఒక భర్త నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగి్చకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. మహిళామణుల జూద క్రీడ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లే్ల పేకాట డెన్లు ఇప్పటి వరకు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన వారంతా మగవారే. కానీ ఇపుడు కాలం మారిపోయింది. అన్నింట్లోను సమానమే అన్నట్లు ముక్కలాటలోను జోరుమీద ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గ్యాంగ్ను సిద్ధం చేసుకుంటున్నారు. జూద క్రీడకు ఎక్కడకు వెళ్లకుండానే ఇళ్లనే పేకాట డెన్లుగా మార్చేసుకుంటున్నారు. భర్తలను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ముక్కలు విసిరే పనిలో బిజీగా ఉంటున్నారు. దీన్నే కొందరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇళ్లలో పేకాట నిర్వహణకు కమీషన్ సైతం తీసుకుంటున్నారు. కొన్ని అపార్టుమెంట్లలో జోరుగా పేకాట నిర్వహిస్తున్నారు. ఆరుగురి అరెస్ట్ సీపీ ఆదేశాలతో పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. లోపల పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలను స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాల్లో నిత్యం పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారు. వీరు ఎక్కడెక్కడ పేకాట నిర్వహిస్తున్నరన్న విషయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. భార్య పేకాటపై భర్త ఫిర్యాదు ఇప్పటి వరకు సీరియల్స్, సినిమాలు, ఫోన్లలో పడి భర్తలు, పిల్లలను పట్టించుకోని ఆడవారు ఉన్నట్లు వింటూ వస్తున్నాం. కానీ పేకాటలో పడి పిల్లలను, తనను పట్టించుకోవడం లేదన్న విషయం ఒక భర్త ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కయ్యపాలెం లలితానగర్ ప్రాంతంలో ఒక ఇల్లు పేకాట డెన్గా మారింది. ఆ ఇంటి గృహిణే ఈ జూద క్రీడకు లీడర్గా వ్యవహిరస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి ఆ ఇంట్లో నిత్యం మూడు ముక్కలాట ఆడిస్తోంది. భర్తను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ఆటోలోనే మునిగితేలుతోంది.భర్త ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో విసుగెత్తిపోయిన భర్త ఇటీవల ఫోర్త్ టౌన్ సీఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. అతను పట్టించుకోకపోవడంతో నేరుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. తన భార్య పేకాట కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తన గోడును విన్నవించుకున్నాడు. పేకాట డెన్గా మారిపోయిన తమ ఇంటిని మార్చాలని కోరారు. దీనికి స్పందించిన సీపీ విచారణ అనంతరం సీఐని బదిలీ చేశారు. -
ఉచిత బస్సుల్లో చార్జీల వసూలా..?
అన్నానగర్: తమిళనాడు ప్రభుత్వం ’విడియల్ ప్రయాణం’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా మహిళలు సాధారణ ఛార్జీల సిటీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ స్థితిలో మహిళలు ప్రయాణించడానికి ఛార్జీలు లేవని రాసి ఉన్న బస్సు నుంచి డబ్బు తీసుకొని పురుషులకు మహిళలకు టిక్కెట్లు ఇస్తున్నారు. ఇది ఏమిటి? అని ఓ మహిళ తన సోషల్ మీడియా పేజీలో టికెట్తో పోస్ట్ చేసింది. తిరుచ్చి నుంచి ముసిరి వరకు పురుషుడికి రూ. 42, ఇద్దరు వ్యక్తులకు రూ. 84 అని అందులో పేర్కొంది. చాలా మంది దీనిని షేర్ చేశారు. కొందరు తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. దీని తరువాత, తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ విషయంలో, తమిళనాడు ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతా ఫ్యాక్ట్ చెకింగ్ ఆఫీస్ ఓ పోస్ట్ను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఉన్న బస్సు విడియాల్ ట్రావెల్ స్కీమ్ కింద ఉన్న బస్సు కాదు. ఇది తిరుచ్చి నుంచి ముసిరికి వెళ్లే –4 సబర్బన్ బస్సు (నీలం రంగు). దీనికి ప్రయాణ రుసుము ఉంది. ఎలక్ట్రానిక్ టికెట్లో ప్రయాణికుల వివరాలు స్త్రీ అని కాకుండా పురుషుడు అని పేర్కొంటూ బస్సు కండెక్టర్ పొరపాటున టికెట్ జారీ చేశారని బిజినెస్ పార్టనర్షిప్ (సేలం సబర్బన్ బస్) డిప్యూటీ మేనేజర్ తెలిపారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని అని సూచించారు. -
లండన్లో పూర్ణిమ దీప్తులు
డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ: దేశం కాని దేశం, అందులోనూ అత్యున్నత పురస్కారం పొందడమంటే మామూలు విషయం కాదు.. ఎంతో సేవ చేసి, అందరితో శభాష్ అనిపించుకోవాలి.. అచ్చం అలానే సేవల్లో గుర్తింపు తెచ్చుకుని లండన్లో బ్రిటన్ రాజవంశం ఇచ్చే పౌర పురస్కారం తీసుకుని కోనసీమ జిల్లా ఆడపడుచు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. బ్రిటన్ రాజవంశం ఇచ్చే పౌర పురస్కారాల్లో అత్యున్నతమైన కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ అంపైర్ (సీబీఈ)ను కొత్తపేట ఆడపడుచు అయ్యగారి అన్నపూర్ణ (పూర్ణిమ తణుకు) దక్కించుకున్నారు. ప్రస్తుతం లండన్లో ఐదేళ్ల లోపు పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న నేషనల్ డే నర్సరీస్ అసోసియేషన్కు పూరి్ణమ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఉన్నారు. విభిన్న రంగాల్లో నిస్వార్థంగా సేవ చేస్తూ తమ జీవితాన్ని అంకితం చేసిన వారికి బ్రిటిష్ రాజవంశం ఇచ్చే పౌర పురస్కారాల్లో అత్యున్నత సీబీఈ లభిస్తుంది. అటువంటి పురస్కారం ఇటీవల పూర్ణిమకు దక్కింది. కొత్తపేట నుంచే బాట కొత్తపేటలో ప్రస్తుతం పొట్టిశ్రీరాములు వీధిని ఒకప్పుడు సత్యవోలు రామమూర్తి వీధి అని పిలిచేవారు. ఆ సత్యవోలు రామమూర్తి మనుమరాలు, కొత్తపేట మాజీ సర్పంచ్ సత్యవోలు రామకృష్ణ మేనకోడలు అయ్యగారి అన్నపూర్ణ (పూరి్ణమ). ఆమె తండ్రి విశ్వేశ్వరయ్య అమలాపురంలో టైప్ ఇనిస్టిట్యూట్ నడిపేవారు. తల్లి రత్నాంబ గృహిణిగా ఉండేవారు. అన్నపూర్ణ కొత్తపేటలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకున్నారు. 1960 దశకంలో కొత్తపేట పంచాయతీ సమితి నంబరు– 1 ప్రాథమిక పాఠశాల (వీరయ్యగారి బడి)లో ప్రాథమిక విద్య, 1963–68 వరకూ చింతం అమ్మాణమ్మ జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత పీయూసీ, డిగ్రీ అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజ్లో, పీజీ ఆంధ్రా యూనివర్సిటీలో చదివిన అయ్యగారి అన్నపూర్ణ అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ప్రతిభా పురస్కారాలను కైవసం చేసుకున్నారు. రిటైర్డ్ హెచ్ఎం, కొత్తపేట ప్రియదర్శినీ బాలవిహార్ వ్యవస్థాపకుడు, కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అద్దంకి కేశవరావు కుమార్తె స్వరాజ్యకుమారి వద్ద శాస్త్రీయ నృత్యం, గైడ్ స్టూడెంట్గా శిక్షణ పొందారు. లండన్లో సర్జన్ అయిన తణుకు వెంకట సూర్యనారాయణతో వివాహానంతరం ‘పూరి్ణమ తణుకు’గా కొత్త జీవితాన్ని ఆరంభించారు. విశేష కృషికి గుర్తింపుగా.. పూరి్ణమ తణుకు మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు అందించే విద్యలో చేసిన విశేష కృషికి ఈ గుర్తింపు లభించింది. ఇంత వరకూ బ్రిటన్లో స్థిరపడి పౌరసత్వం పొందిన తెలుగు వారెవరికీ దక్కని గౌరవమిది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారి కృషిని భిన్నస్థాయిల్లో అత్యంత నిశితంగా పరిశీలించి ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తారు. గత నెల 22న బ్రిటిష్ రాజవంశీకులుండే విండ్సార్ కేజిల్లో ఎంతో అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో క్వీన్ ఎలిజబెత్–2, ప్రిన్స్ ఫిలిప్ల కుమార్తె, ప్రస్తుత బ్రిటన్రాజు చార్లెస్ ఏకైక సోదరి అయిన ప్రిన్సెస్ ఆనీ ఈ పురస్కారాన్ని పూరి్ణమకు అందజేశారు. హేమాహేమీల çపక్కన.. ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, బ్రిటన్ ఆధునిక నాటక రచయిత, దర్శకుడు, నోబెల్ బహుమతి గ్రహీత అయిన హెరాల్డ్ పింటర్, రగ్బీ ఆటగాడు జొనాథన్ పీటర్ విల్కిన్సన్ వంటి హేమాహేమీలు గతంలో ఈ పురస్కారం అందుకున్న ప్రముఖుల్లో కొందరు. ఇటీవలే ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ సంస్థ ‘షెనెల్’కు సీఈఓగా ఉంటున్న లీనా నాయర్ కూడా సీబీఈ పురస్కారం అందుకున్నారు. తాజాగా పూరి్ణమ అందుకుని ఆ ప్రముఖుల సరసన నిలిచారు. ఈ పురస్కారాన్ని పొందటంలో తన కుటుంబం ఎంతో తోడ్పడిందని, అలాగే మిత్రులు, తన బృంద సభ్యుల కృషి కూడా ఉందని పూర్ణిమ తెలిపారు. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపేట ఆడపడుచు, అక్కడ పూర్వ విద్యార్థిని అయిన పూరి్ణమకు బ్రిటన్ అత్యున్నత పురస్కారం పొందడం పట్ల ఈ గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
బావ సాయంతో భర్తను కడతేర్చిన భార్య.. ఏడాది తర్వాత..
న్యూఢిల్లీ: భర్తను తన బంధువు(బావ) సాయంతో అత్యంత పాశవికంగా హత్యచేసిన మహిళను, ఆమె ప్రియుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఢిల్లీలోని అలీపూర్ నివాసి సోనియా (34), సోనిపట్కు చెందిన రోహిత్(28)గా గుర్తించామని, ఈ కేసులో మరో కీలక నిందితుడు విజయ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) హర్ష్ ఇండోరా మీడియాకు తెలిపారు.మృతుడు ప్రీతమ్ ప్రకాష్ (42) అలీపూర్కు చెందిన చరిత్రకారుడు. 2024, జూలై 5న ప్రీతమ్ ప్రకాష్ సోనిపట్లోని గన్నౌర్లో సోదరి ఇంటిలో ఉంటున్న సోనియాను తీసుకెళ్లడానికి వచ్చాడు. అయితే ఏదో విషయమై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రీతమ్ ప్రకాష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భర్తపై ఆగ్రహంతో ఉన్న సోనియా తన బంధువు(బావ) విజయ్కి రూ. 50 వేలు ఇచ్చి, భర్తను హత్యచేయాలని కోరింది. ఇంతలో ప్రీతమ్ ప్రకాష్ తిరిగి వచ్చి, సోనియాను ఇంటికి రమ్మని వేడుకున్నాడు. ఆ రోజు రాత్రి ప్రీతమ్ ప్రకాష్ టెర్రస్పై పడుకున్నాడు. ఇదే సమయంలో విజయ్ అతనిని హత్య చేశాడు. తరువాత ఆ మృతదేహాన్ని ఒక పథకం ప్రకారం అగ్వాన్పూర్ సమీపంలోని కాలువలో పడేశాడు.జూలై 20న, సోనియా తన భర్త అదృశ్యమైనట్లు ఆలీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఏడాది తర్వాత ప్రీతమ్ ప్రకాష్ ఉపయోగించిన ఫోన్ యాక్టివ్ మోడ్లోకి రావడాన్ని పోలీసులు గుర్తించారు. సోనిపట్లోని రోహిత్ ఆ ఫోన్ను ఉపయోగిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అతనిని ప్రశ్నించగా, అతను తొలుత దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టించాడు. అయితే ఆ తరువాత నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అలాగే తనకు సోనియాతో సంబంధం ఉన్నదని, సోనియా, విజయ్లు ప్రీతమ్ను చంపడానికి కుట్ర పన్నారని రోహిత్ పోలీసులకు తెలిపాడు. భర్తను హత్యచేసేందుకు సోనియా.. విజయ్కు డబ్బులు ఇచ్చిందన్నాడు.ప్రీతమ్ ప్రకాష్ హత్య తరువాత సోనియా అతని ఫోన్ను రోహిత్కు ఇచ్చిందని పోలీసులు తెలిపారు. కాగా సోనియాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె ప్రీతమ్ను ప్రేమించి, కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంది. అనంతరం వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. అయితే ఇదే సమయంలో సోనియా, రోహిత్లు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. కాగా రోహిత్పై గతంలో హత్య, ఆయుధాలు కలిగి ఉండటం తదితర నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రీతమ్ ప్రకాష్ను హత్యచేసిన విజయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని,అతని కోసం గాలిస్తున్నామని డీసీపీ ఇండోరా తెలిపారు. -
‘నా సీటది.. లేస్తావా.. లేపమంటావా?’.. ఎయిర్పోర్టులో మహిళపై యువకుని దౌర్జన్యం
బొగోటా: కొలంబియాలోని ఎల్ డొరాడో విమానాశ్రయంలో ఆ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కూర్చున్న సీటును వదులుకునేందుకు ఇష్టపడని ఒక మహిళపై ఒక యువకుడు దాడి చేశాడు. దీంతో విమానాశ్రయంలో కాసేపు గందరగోళం నెలకొంది.కొలంబియాలోని బొగోటాలో గల ఎల్ డొరాడో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదంతం టెర్మినల్ వద్ద జరిగింది. ఒక మహిళ తాను కూర్చున్న సీటును ఇచ్చేందుకు నిరాకరించడంతో ఒక యువకుడు ఆమె చెంపపై కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఇది టెర్మినల్ వద్ద గందరగోళానికి దారితీసింది. #INACEPTABLE. En la noche del pasado 27JUL, en el aeropuerto El Dorado (Bogotá) violento sujeto agredió a una mujer por pelear una silla. Las imágenes han generado rechazo contra el energúmeno hombre a tal punto que su esposa tuvo que salir en un video a dar explicaciones. pic.twitter.com/wvxFo0GhHg— Colombia Oscura (@ColombiaOscura_) July 30, 2025ఆ యువకుడిని హెక్టర్ శాంటాక్రూజ్ గాను, బాధితురాలిని క్లాడియా సెగురాగా విమాన సిబ్బంది గుర్తించారు. అతను పక్కకు వెళ్లినప్పుడు అతని భార్య పక్కనున్న సీటులో క్లాడియా సెగురా కూర్చుంది. అతను తిరిగి వచ్చి ఆమెను కుర్చీలో నుంచి లేవాలని కోరాడు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. దీంతో అతను ఆమెతో ‘నువ్వు లేస్తావా? లేదా నన్ను లేపమంటావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తరువాత పక్కనే ఉన్న ఒక వ్యక్తితో ఫోన్లో రికార్డు చేయమని కోరుతూ, ఆమెపై చేయి చేసుకున్నాడు.దీనిని గమనించిన అక్కడున్నవారు అతనిని అడ్డుకున్నారు. తరువాత అక్కడి భద్రతా సిబ్బంది అతనికి సంకెళ్లు వేసి, అక్కడి నుంచి తీసుకెళ్లారు. క్లాడియా సెగురా తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ‘నేను వెయిటింగ్ ఏరియాకు చేరుకున్నప్పుడు, అక్కడంతా నిండిపోయింది. అయితే ఒక ఖాళీ కుర్చీని చూశాను. ఆ కుర్చీలో ఏమీ లేకపోవడంతో దానిలో కూర్చున్నాను. ఇంతలో అతను వచ్చి నా చేతిపై కొట్టాడు. నా ఫోన్ లాక్కున్నాడు. నా ముఖంపైన, తలపై బలంగా కొట్టాడు’ అని చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్ పబ్లో కిలాడీ స్కెచ్
హైదరాబాద్: భర్తతో కలిసి ఓ కిలాడీ లేడీ పక్కా స్కెచ్ వేసి సినీ ఫక్కీలో ఓ నగల దుకాణం ఉద్యోగిని కిడ్నాప్ చేసి నగదు, నగలు దోచుకోవడమేగాకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడింది. ఈ ఘటనలో యువతితో సహా నలుగురు కిడ్నాపర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్కు చెందిన సచిన్దూబే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని తిబారుమల్ జ్యువెలర్స్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. తరచూ పబ్లకు వెళ్లే అతడికి కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో బార్ డ్యాన్సర్గా పనిచేస్తున్న డింపుల్యాదవ్తో పరిచయం ఏర్పడింది.గత శనివారం తమ పబ్లో ప్రత్యేక కార్యక్రమం ఉందని సచిన్దూబేను ఆహ్వానించింది. దీంతో సచిన్ తన బైక్ను నగల దుకాణం వద్దనే పార్కు చేసి క్యాబ్లో పబ్కు వెళ్లాడు. పథకం ప్రకారం డింపుల్యాదవ్ డ్యాన్స్ చేస్తూ సచిన్ను రెచ్చగొడుతూ పీకలదాకా మద్యం తాగేలా చేసి మత్తులోకి దింపింది. అర్ధరాత్రి తర్వాత తూలుతూ, తూగుతూ బయటకు వచ్చిన సచిన్ను తాను బైక్పై దింపుతానంటూ తన స్కూటీ వెనుక ఎక్కించుకుని బంజారాహిల్స్కు వచ్చింది. అయితే.. అప్పటికే పథకంలో భాగంగా డింపుల్ భర్త తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో సచిన్, డింపుల్ వెళ్తున్న స్కూటీని అనుసరించాడు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లోని టీవీ9 చౌరస్తా వద్దకు రాగానే కిడ్నాపర్లు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తన్నారంటూ బెదిరించడమే కాకుండా తాము టాస్క్ఫోర్స్ పోలీసులమని వెనుక కూర్చొన్న సచిన్ను కారులో ఎక్కించుకుని ఫిర్జాదీగూడ వైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతడికి నిద్ర మాత్రలు కలిపిన కూల్డ్రింక్ తాగించడంతో పూర్తిగా స్పృహ తప్పాడు. అనంతరం.. సచిన్ మెడలో ఉన్న గొలుసు, పర్సులో ఉన్న డబ్బులు లాక్కుని మంచంపై పడుకోబెట్టారు. అక్కడే ఉన్న అపరిచిత యువతితో సచిన్ బట్టలు తొలగించి నగ్న వీడియోలు తీయించారు. ఆపై, ఉదయం 6 గంటల సమయంలో సచిన్ను అత్తాపూర్లోని ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన గంట తర్వాత సచిన్ భార్యకు ఫోన్ చేసి తాము పోలీసులమని, రాత్రి మద్యం మత్తులో మీ భర్త ఒక మహిళను హత్య చేశాడని, తమ వద్ద వీడియోలు ఉన్నాయని బెదిరించడమే కాకుండా, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీడియోలు బయటపెడతామని బ్లాక్మెయిల్ చేశారు.అయితే ఆమె భయపడకుండా హత్య చేస్తే ఇంటికి వచ్చి తన భర్తను అరెస్టు చేసుకోవచ్చని చెప్పింది. వారం రోజులుగా కిడ్నాపర్లు ఆమెకు ఫోన్లు చేస్తూ చివరకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్పల్లిలోని పబ్ వద్ద విచారణ చేపట్టి బార్ డ్యాన్సర్ డింపుల్ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయ్యింది.పథకం ప్రకారమే.. కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో బార్ డ్యాన్సర్గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్ భర్త పవన్కుమార్యాదవ్ గతంలో అదే పబ్లో బౌన్సర్గా పనిచేశాడు. అయితే వీరి స్వస్థలం ఢిల్లీ కాగా హైదరాబాద్కు మకాం మార్చి అంబర్పేటలో అద్దెకు ఉంటున్నారు. ఈజీ మనీ కోసం అమాయకుడైన సచిన్ను మద్యం మత్తులో దింపి కిడ్నాప్ నాటకం ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. డింపుల్యాదవ్, పవన్కుమార్యాదవ్తో పాటు కిడ్నాప్లో పాల్గొన్న సాయిప్రసాద్, హరికిషన్, అంగార సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు.కిడ్నాప్నకు వాడిన కారుపై లా ఆఫీసర్ ఎయిమ్స్ బీబీనగర్ అని ఉండడంతో పోలీసులు ఎవరూ అనుమానించకూడదనే ఇలా రాసినట్లుగా వెల్లడైంది. నిందితులు వాడిన బైక్లతో పాటు సచిన్ నుంచి నుంచి లాక్కున్న బంగారు గొలుసును స్వా«దీనం చేసుకున్నారు. తనను మద్యం మత్తులోకి దింపి పథకం ప్రకారమే కిడ్నాప్ చేసి నగ్న వీడియోలు తీసి రూ.10 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహారాణి.. ఆటలోనే కాదు అందంలోనూ తనకు తానే సాటి! (ఫొటోలు)
-
సృష్టించకుండా శిశు విక్రయాలు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఓ జంటను మోసగించడం..తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించగా, దీనిపై పోలీసుల దర్యాప్తులో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ సెంటర్ కేంద్రంగా వ్యవస్థీకృత శిశు విక్రయాల దందా సాగుతున్న వైనం బట్టబయలయ్యింది. ఇప్పటికే పది కేసులు ఉండి, ఎలాంటి అనుమతులు లేకుండా ఈ సెంటర్ నిర్వహిస్తున్న అట్లూరి నమ్రత అలియాస్ పచ్చిపాల నమ్రత మరో వైద్యురాలి పేరుతో కథ నడిపిస్తున్నట్లు తెలిసింది. సంతానం కోసం వచ్చే వారికి ప్రభుత్వ అనుమతి, ఇతర ప్రొసీజర్తో పని లేకుండా సరోగసీ చేస్తామని చెప్పి లక్షల్లో వసూళ్లు చేస్తూ.. చివరకు అలాంటి ప్రక్రియ ఏదీ చేయకుండా నిరుపేద దంపతులకు ఎరవేసి, వారికి చెందిన పిల్లల్ని అప్పగిస్తున్నట్లు తేలింది. రాజస్థాన్కు చెందిన ఓ జంటకు కూడా ఇలాగే చేయగా..వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ‘సృష్టి’నిర్వాకం తాజాగా మరోసారి బయటపడింది. గోపాలపురం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నంలో కలిపి 8 మందిని అరెస్టు చేశామని, వీరిలో గాంధీ ఆస్పత్రి అనస్థీషియా స్పెషలిస్ట్ సదానందం కూడా ఉన్నట్లు నార్త్జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ఆదివారం వెల్లడించారు. మరో 50 మంది పరారీలో ఉన్నారని వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని తెలిపారు. ఏసీపీ సుబ్బయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఇప్పటికే 10 కేసులు..రెన్యువల్ కాని లైసెన్స్ 1995 నుంచి వైద్య వృత్తిలో ఉన్న నమ్రత 1998 నుంచి ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ రంగంలోకి దిగారు. సికింద్రాబాద్, కొండాపూర్, విశాఖపట్నం, విజయవాడల్లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. లింగ నిర్థారణ పరీక్షలు సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈమెపై హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో 10 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహణ లైసెన్స్ను 2021లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పొడిగించలేదు. దీంతో తాను ఆ వృత్తి నిర్వహించట్లేదంటూ నమ్రత లేఖ కూడా ఇచ్చారు. నగరంలో నాలుగు చోట్ల సెంటర్లు నమ్రత సికింద్రాబాద్లోని గోపాలపురంలో నాలుగు అంతస్తుల భవనంతో పాటు మరో మూడుచోట్లా అక్రమంగా ఈ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్ హెడ్స్తో కథ నడిపిస్తున్నారు. ఆన్లైన్తో పాటు కరపత్రాల ద్వారా ఐవీఎఫ్ విధానం పేరుతో ప్రచారం చేస్తున్న నమ్రత.. సంతాన భాగ్యం కోసం తమ వద్దకు వచ్చే వారికి కొన్ని పరీక్షలు చేసి, ఆ విధానంతో ఫలితం లేదని చెప్తున్నారు. ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా గుట్టుగా సరోగసీ చేస్తామంటూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. అంగీకరించిన భార్యభర్తల నుంచి ఎగ్, వీర్య సంగ్రహణ పేరుతో సికింద్రాబాద్తో పాటు వైజాగ్లో ఉన్న క్లినిక్స్లో హడావుడి చేస్తున్నారు. హైదరాబాద్లో ఈ తంతు నిర్వహణలో గాంధీ ఆస్పత్రి అనస్థీషియా స్పెషలిస్ట్ నార్గుల సదానందం సహకరిస్తున్నారు. ఎంపిక చేసిన మహిళతో సరోగసీ చేస్తున్నామని, వివరాలన్నీ రహస్యమని చెబుతూ భార్యభర్తలకు ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం ఇస్తున్నారు. అయితే సరోగసీ ప్రక్రియ ఏదీ నిర్వహించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకున్న దళారుల ద్వారా నిరుపేద గర్భవతుల్ని గుర్తించి వారి భర్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పుట్టిన శిశువును తమకు విక్రయిస్తే నగదు ఇస్తామంటూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రసవ సమయానికి మహిళల్ని తామే తీసుకువెళ్లి డెలివరీలు చేస్తున్నారు. ఒక ప్రాంతానికి చెందిన వారిని మరో ప్రాంతానికి తరలించి ఈ తంతు పూర్తి చేస్తున్నారు. ఆ సమయంలోనూ సిజేరియన్ సహా మరికొన్ని ఖర్చులు అయ్యాయంటూ ఒప్పందం చేసుకున్న వారి నుంచి మరికొంత గుంజుతున్నారు. వేరే వారికి పుట్టిన శిశువును ఆయా జంటలకు సరోగసీ బిడ్డగా అప్పగిస్తున్నారు. ఇలా ఒక్కో కేసుకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. శిశువు పోలికలపై అనుమానంతో.. సికింద్రాబాద్లో నివసించిన రాజస్థాన్ జంటను నమ్రత ఇలానే మోసం చేశారు. శిశువు పోలికలపై అనుమానం వచ్చిన దంపతులు నమ్రతను నిలదీయగా సరైన సమాధానం రాలేదు. దీంతో ఢిల్లీలో డీఎన్ఏ టెస్టులు చేయించుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సరోగసీ పేరుతో తమ వద్ద రూ.30.25 లక్షలు తీసుకున్నారని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. దీంతో నార్త్జోన్ టాస్్కఫోర్స్ సాయంతో దాడులు చేసిన గోపాలపురం పోలీసులు.. నమ్రత, జయంత్ కృష్ణ, విశాఖ బ్రాంచ్ మేనేజర్ సి.కళ్యాణి, టెక్నీషియన్ జి.చిన్నారావు, సదానందం, దళారి డి.సంతోషి, అసోం నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న సదరు శిశువు తల్లిదండ్రులైన మహ్మద్ అలీ ఆదిక్, నస్రీన్ బేగంలను అరెస్టు చేశారు. ‘సృష్టి’నుంచి సేకరించిన రికార్డుల ఆధారంగా మరో 50 మందిని నిందితులుగా గుర్తించారు. వీరికోసం గాలిస్తున్నారు. ఫిర్యాదు చేసిన జంట నుంచి శిశువును స్వా«దీనం చేసుకున్న పోలీసులు శిశువిహార్కు తరలించారు. ఎవరైనా ప్రశి్నస్తే రంగంలోకి నమ్రత కుమారుడు ఈ దందాలో ఎవరికైనా, ఏదైనా అనుమానం వచ్చి ప్రశి్నస్తే.. ‘సృష్టి’ప్రాంగణంలో లీగల్ ఆఫీస్ నిర్వహిస్తున్న నమ్రత కుమారుడు, న్యాయవాది జయంత్ కృష్ణ రంగంలోకి దిగుతాడని తెలిసింది. ఈ వ్యవహారంలో మీదీ నేరమే అని, విషయం బయటకు వస్తే అంతా అరెస్టు అవుతారని చెప్పి భయపెడతాడని, సెంటర్ ఆర్థిక లావాదేవీలను ఇతడే పర్యవేక్షిస్తుంటాడని తెలిసింది. కాగా తన పేరుతో ఈ సెంటర్ నడుస్తున్నట్లు సూరి శ్రీమతికి తెలుసా? లేదా? అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ‘సృష్టి’బారినపడి మోసపోయిన వాళ్లు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. -
‘కోచింగ్ సెంటర్’ లవ్ స్టోరీ.. చివరికి బిగ్ ట్విస్ట్
గద్వాల: ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఓ కానిస్టేబుల్ తనను మోసం చేశాడని.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ ఓ యువతి మంగళవారం గద్వాల డీఎస్పీ మొగిలయ్యను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు.. భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బోరంతపల్లెకు చెందిన ప్రియాంక 2023లో ఉద్యోగ పోటీ పరీక్షల శిక్షణకు హైదరాబాద్కు రాగా.. గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్గౌడ్ సైతం శిక్షణ కోసం హైదరాబాద్కు చేరుకున్నారు.ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుందామంటూ రఘునాథ్గౌడ్ యువతి తల్లిదండ్రులను ఒప్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం చేసుకుందామని నమ్మించారు. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగం రాగా వివాహం చేసుకుందామని ఫోన్లో సంప్రదించగా దాటవేస్తూ వచ్చారని బాధితురాలు చెప్పారు. ఈ నెల 17న రఘునాథ్గౌడ్ ఇంటికి వెళ్లి వివాహ విషయం మాట్లాడగా కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పాటు తనపై చేయి చేసుకున్నట్లు డీఎస్పీకి వివరించింది.తీవ్ర మనస్తాపానికి గురై వారి ఇంటి ముందే నిద్రమాత్రలు మింగగా స్థానికులు గుర్తించి 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాప్రాయం తప్పిందని తెలిపింది. మంగళవారం ఉదయం కూడా మరోమారు వారి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కుటుంబంతో కలిసి వెళ్లగా నిరాకరించారన్నారు. ప్రస్తుతం శాంతినగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న రఘునాథ్గౌడ్, దాడి చేసిన కుటుంబ సభ్యులౖపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బాధిత యువతి, తల్లిదండ్రులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేశాం.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ రఘునాథ్గౌడ్పై గట్టు పోలీస్స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైందని డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. కానిస్టేబుల్ను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని.. మోసం చేసిన వ్యక్తి ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. బాధితురాలికి అన్నివిధాలా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
టీడీపీ నేత వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో ఎల్లో నేతలు.. మహిళల పట్ల కీచకుల్లా మారి పెట్రేగిపోతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామంలో టీడీపీ నేత వేధింపులతో దళిత మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్వాక్రా వీఏవోగా పని చేస్తున్న మహిళను చిలుకూరు గ్రామ టీడీపీ నేత కాటేపల్లి సుబ్బారావు వేధిపులకు గురి చేస్తున్నారు.సుబ్బారావు వేధింపులు తాళలేక డ్వాక్రా వీఏవో పురుగుల మందు తాగింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న ఆమెపై డ్వాక్రా గ్రూపు సభ్యులతో దాడి చేయించేందుకు సుబ్బారావు యత్నించాడు. సుబ్బారావుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకుంటోంది. -
నువ్వు ఊ అంటే అన్నివిధాలా చూసుకుంటా..
అనంతపురం: భర్తను కోల్పోయిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలను వెంట బెట్టుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. కొంతకాలంగా కూలి పనులు చేసుకుంటూ కన్న వారిని, పిల్లలను పోషించుకుంటోంది. ఆమె పెద్ద కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. తన కూతురిని ఏదైనా హాస్టల్లో ఉంచి చదివిస్తే..తనకు భారం కొద్దివరకైనా తగ్గుతుందని భావించింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని కేజీబీవీలో ప్రవేశానికి సంబంధించిన పత్రాలను సిద్ధం చేసుకుంటుండగా బ్రహ్మసముద్రానికే చెందిన ఓ టీడీపీ నాయకుడు గమనించాడు. తాను టీడీపీ మండల కన్వీనర్ అనుచరుడినని, తాను ఫోన్ చేసి చెబితే..ఏ స్కూల్లో అయినా సీటు గ్యారంటీ అని నమ్మించాడు. ఓ అన్నలా సాయం చేయడానికి ముందుకు వచ్చాడని ఆమె భావించింది. తాను ఫోన్లో మాట్లాడి సీటు విషయం చెబుతానంటూ ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. మరుసటి రోజే ఆమెకు ఫోన్ చేసి సీటు కావాలంటే కొంత ఖర్చవుతుందని చెప్పాడు. ఎంతవుతుందని అడగ్గా..రూ.10 వేలు ఇవ్వాలన్నాడు. అంత డబ్బు ఇచ్చుకోలేననడంతో ‘నువ్వు ఊ అంటే నీ కూతురు చదువుకునేందుకు స్కూల్ తో పాటు హాస్టల్ సీటు కూడా ఇప్పిస్తా’ అని అన్నాడు. దీంతో ఆమె సదరు టీడీపీ కార్యకర్తకు మాటలతో బుద్ధి చెప్పింది. అయినా అతడు వదల్లేదు. అదే రోజు రాత్రి మళ్లీ ఫోన్ చేసి..‘సమాజంలో ఇలాంటివి సహజం. నీ ఒంటరి జీవితానికి తోడుగా ఉంటా. నీ పిల్లల జీవితానికి అన్ని విధాలుగా అండగా ఉంటా. మా నాయకుడితో చెప్పి ఆ స్కూల్లో నీ కూతురికి సీటు ఇప్పిస్తా. నీకు కూడా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి జీతం వచ్చేలా చేస్తాను’ అంటూ లొంగదీసుకునేందుకు యతి్నంచాడు. అతడి చేష్టలకు విసిగిపోయిన బాధితురాలు తన సన్నిహితులతో ఈ విషయాన్ని చెప్పి ఆవేదన చెందింది. అలాగే ఆమె ఆవేదన చెందుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
షార్జాలో మరో విషాదం : బర్త్డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణం
షార్జాలో మరో మలయాళీ మహిళ మరణం ఆందోళన రేపుతోంది. కేరళకు చెందిన అతుల్య శేఖర్ శనివారం తెల్లవారు జామున యుఎఇలోని షార్జా అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై హత్య కేసు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు.గల్ఫ్ న్యూస్ ప్రకారం, అతుల్య 30వ పుట్టినరోజే కన్నుమూసింది. అదీ కొత్త ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఆమె అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. మహిళ తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం,ఆమె భర్త సతీష్ ఆమెను గొంతు పిసికి, కడుపుపైతన్నాడు, తలపై ప్లేట్తో కొట్టాడు, ఫలితంగానే ఆమె మరణించింది. మృతురాలికి పదేళ్ల కుమార్తె కూడా ఉంది. అతుల్య ఏకైక కుమార్తె ఆరాధిక (10) ప్రస్తుతం కొల్లాంలో తన అమ్మమ్మ, తాతాయ్య రాజశేఖరన్ పిళ్లై , తులసి భాయ్లతో ఉంది అతుల్య మరణం భారతీయ సమాజాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.చదవండి: లవ్ ప్రపోజల్ తిరస్కరించిన ఇండియన్ టెకీకి బాస్ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే2014లో సతీష్, అతుల్య వివాహం జరిగింది. భర్త సతీష్తో కలిసి షార్జాలో నివసిస్తోంది అతుల్య అప్పటినుంచీ బైక్, 43 తులాల బంగారం ఇచ్చినప్పటికీ, తగినంత కట్నం తీసుకురాలేదని పదేపదే వేధించే వారని అతుల్య కుటుంబం ఆరోపిస్తోంది. అల్లుడు మద్యానికి బానిస అని ఎప్పుడూ కొడుతూ ఉండేవాడని అతుల్య తండ్రి ఆరోపించారు.పాప కోసంమే తన బిడ్డ అన్ని హింసలను భరించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులకు సంబంధించి గతంలో ఇరు కుటుంబాల మధ్య చర్చలకు జరిగాయి. పోలీసు కేసు కూడా నమోదైంది. ఇదీ చదవండి: బాలీవుడ్ తరహా ఈవెంట్లు, లగ్జరీ లైఫ్ : 100మందికి పైగా ముంచేసిన ఎన్ఆర్ఐ జంటఅయితే ఈ ఆరోపణలను సతీష్ ఖండించాడు. అతుల్య మరణంలో తన పాత్ర లేదని పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందంటే తాను నమ్మడం లేదన్నాడు. కాగా యూఏఈ షార్జాలో వరకట్న వేధింపుల కారణంగా కేరళకు చెందిన మహిళ బిడ్డను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. జూలై 8న షార్జాలోని అల్ నవ్దాలో 32 ఏళ్ల విపంజిక మణి తన 16 నెలల కుమార్తెను హత్య చేసి, తాను తనువు చాలించిన సంగతి తెలిసిందే. -
16 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ, సప్త సముద్రాలు దాటి పెళ్లి : వైరల్ లవ్ స్టోరీ
"మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అంటే ఇదేనేమో. ఒక అమెరికా మహిళ వేల మైళ్ల దూరంలో ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సప్తసముద్రాలు దాటి అదీ తన కన్నా చిన్నవాడైన వ్యక్తిని మనువాడింది. ప్రేమకు సరిహద్దులు..అవధులు లేవు అని నిరూపించిన ఆ ప్రేమ జంట గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన మిండీ రాస్ముస్సేన్ (Mindy Rasmussen, 47) , అప్పర్ దిర్ జిల్లా నివాసి 31 ఏళ్ల ఫేస్బుక్ ప్రేమికుడు సాజిద్ జెబ్ ఖాన్ను ప్రేమించింది. ప్రియుడ్ని పెళ్లాడేందుకు ఏకంగా అమెరికా నుంచి పాకిస్తాన్కు వెళ్లింది. అంతేకాదు ఇస్లాంలోకి మతం మారింది. మధ్య 16 సంవత్సరాల వయస్సు తేడా స్పష్టంగా ఉన్నప్పటికీ, ఈ నెల ప్రారంభంలో సాంప్రదాయ నిఖా వేడుకలో వివాహం చేసుకున్నారు. సామాజిక విమర్శలను పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ జంట ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంటోంది.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!ఫేస్ బుక్ పరిచయంస్థానిక మీడియా కథనాల ప్రకారం దాదాపు ఒక సంవత్సరం క్రితం ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్లో పాకిస్తాన్కు చెందిన సాజిద్ జెబ్ ఖాన్ పరిచయం ఏర్పడింది. మొదట్లో అందరిలాగానే మామూలుగా మాట్లాడుకునే వారు. అది కాస్తా సుదీర్ఘ వీడియో కాల్స్గా మారింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ముందుగా రాస్ముస్సేన్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అటు వీరి ప్రేమకు ఇరు కుటుంబాలూ అంగీకారం తెలిపాయి. ఈ నెల ప్రారంభంలోనే 90 రోజుల వీసా గడువుతో రాస్ముస్సేన్ అమెరికా నుంచి ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Islamabad International Airport) వచ్చింది. ఆమెకు ప్రేమగా స్వాగతం తెలిపిన సాజిద్ జెబ్ ఖాన్ స్వగ్రామానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కూడా సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. ఇస్లాం మతాన్ని స్వీకరించి ‘జులేఖ’గా పేరు మార్చుకుంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిఖా చేసుకున్నారు. తమ నిఖా వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాస్ముస్సేన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకుంది. దీంతో ఈ లవ్స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. -
‘చనిపోయేందుకు రాలేదు’: అనుమానాలకు తెరదించిన రష్యన్ మహిళ
బెంగళూరు: కర్ణాటకలోని గోకర్ణ గుహలో పిల్లలతో పాటు ఉంటున్న రష్యన్ మహిళ ఉదంతం సంచలనంగా మారింది. ఈ వార్త వెల్లడి కాగానే ఆమె ఎందుకు అక్కడ ఉంటోంది? పిల్లలను అలా ఎందుకు సాకుతోంది? చనిపోయేందుకే పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చిందా? అనే సందేహాలు పలువురిలో కలుగుతున్నాయి. వాటికి ఆమె స్వయంగా సమాధానం చెప్పింది.గోకర్ణ గుహలో తలదాచుకుటున్న రష్యన్ మహిళ నీనా కుటినా.. తాను, తన పిల్లలు ఉంటున్న గోకర్ణ గుహ గ్రామానికి చాలా దగ్గరగా ఉందని, అది ప్రమాదకరం కాదని మీడియాకు తెలిపింది. రామతీర్థ కొండలలోని ఈ గుహలో తన ఇద్దరు కుమార్తెలతో పాటు ఉండటాన్ని ఆమె సమర్థించుకుంది. తమ కుటుంబం ప్రకృతిని ప్రేమిస్తుందని, తాము కొన్నేళ్లుగా 20 దేశాల అడవులలో నివసించామని చెప్పుకొచ్చింది. గుహలో తనకు, తన పిల్లలకు ఎటువంటి హానిలేదని నీనా కుటినా తెలిపింది. ప్రకృతిలో ఉండటం తమకు గొప్ప అనుభూతినిస్తుందని, ఇక్కడికి మేము చనిపోయేందుకు రాలేదని, తన పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆమె మీడియాకు తెలిపింది. #WATCH | Bengaluru | Russian national Nina Kutina, who was found living with her two daughters in a remote cave near Gokarna in Karnataka, says, "We have a lot of experience staying in nature and we were not dying. I did not bring my children to die in the jungle...We used to… pic.twitter.com/iY0Bi8I6xb— ANI (@ANI) July 14, 2025నినా కుటినా తన పిల్లలతో గుహలో ఉండటాన్ని చూసి పలువురు ఆశ్యర్యపోయారు. అయితే ఆ గుహ జనావాసాలకు దూరంగా అడవిలో లేదని, గ్రామానికి చాలా దగ్గరలోనే ఉందని ఆమె తెలిపింది. తాము ఇక్కడి జలపాతంలో ఆనందంగా ఈత కొట్టామని పేర్కొంది. తాను 2016లో బిజినెస్ వీసాపై భారతదేశానికి వచ్చానని, ఆ వీసా గడువు 2017తో ముగిసిపోయిందని, ఇప్పుడు తమ దగ్గర చెల్లుబాటు అయ్యే వీసా లేదని ఆమె వివరించింది. 2017 తర్వాత తాము నాలుగు దేశాలలో తిరిగామని, ఇప్పుడు భారత్ వచ్చామని ఆమె తెలిపింది. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన తర్వాత సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో అధికారులకు ఆమెతో పాటు పిల్లలు గోకర్ణ గుహలో కనిపించారు. రామతీర్థ కొండలోని గుహ వెలుపల చీర, ఇతర దుస్తులను వేలాడదీసి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తరువాత నినా కుటినాను, ఆమె ఇద్దరు పిల్లలను గమనించారని ఉత్తర కన్నడ పోలీసు సూపరింటెండెంట్ ఎం నారాయణ తెలిపారు. -
మహిళను కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టిన మంజునాథ్
-
చంద్రబాబు ఇలాకాలో మహిళ నిర్బంధం
శాంతిపురం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని కర్లగట్ట పంచాయతీ తమ్మిగానిపల్లిలో సోమవారం ఒక మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తమ్మిగానిపల్లె గ్రామానికి చెందిన మునెప్పకు ఇద్దరు భార్యలు. అనారోగ్యం బారినపడ్డ ఆయన ఈనెల 5న మృతి చెందాడు. మొదటి భార్య మునెమ్మకు కుమారుడు మంజున, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్య గంగమ్మకు కుమారుడు సురేష్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇరువురు భార్యల పిల్లల మధ్య ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో మునెప్ప రెండో భార్య గంగమ్మను విద్యుత్ స్తంభానికి కట్టేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ ఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. సురేషే తన తల్లి గంగమ్మను కరెంటు పోల్ వద్ద నిలబెట్టి, డ్రిప్పు పైపును చుట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని ఎస్ఐ ఒక ప్రకటనను విడుదల చేశారు. -
Kuppam: గంగమ్మ అనే మహిళను కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టిన మంజునాథ్
-
ఆర్పీఎఫ్ తొలి మహిళా సారధిగా సోనాలి మిశ్రా
న్యూఢిల్లీ: మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. భారత సైన్యంలోనూ ప్రవేశించి, తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారిణి సోనాలి మిశ్రా.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. జూలై 31న పదవీ విరమణ చేయనున్న మనోజ్ యాదవ్ స్థానంలో ఆమె ఈ పదవిని చేపడుతున్నారు.సోనాలి మిశ్రాను ఈ పదవిలో నియమించేందుకు క్యాబినెట్ నియామకాల కమిటీ అధికారికంగా ఆమోదం తెలిపింది. సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం 2026, అక్టోబర్ 31 వరకూ అంటే పదవీ విరమణ చేసే వరకు సోనాలి మిశ్రా ఈ పదవిలో కొనసాగనున్నారు. రైల్వే ఆస్తులను కాపాడటం, ప్రయాణికుల భద్రత తదితర విధులతో పాటు, వాటి బాధ్యతలను అధికారులకు అప్పగించే విషయంలో ఆర్పీఎఫ్కు సోనాలీ మిశ్రా తొలి మహిళా అధికారిగా విధులు నిర్వహించనున్నారు.సోనాలి మిశ్రా మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన 1993 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిణి. ఆమె ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసు విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ (సెలక్షన్)గా పనిచేస్తున్నారు. కాగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)1957లో పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటయ్యింది. దీనికి 1985, సెప్టెంబర్ 20న యూనియన్ సాయుధ దళం హోదా ఇచ్చారు. 2021 జూలైలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఏర్పాటుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా కమాండర్గా సోనాలి మిశ్రా పేరొందారు. -
మాకు అన్యాయం చేశారు.. కూటమిపై మహిళా పోలీసులు ఫైర్
-
జిమ్కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది
అధిక బరువుకు కారణాలనేకం. జీవన శైలి, ఆహార అలవాట్లు, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అయితే ‘‘చిన్నప్పటినుంచీ నేనింతే’’ అని కొంతమంది సరిపెట్టుకుంటే, మరికొంతమంది మాత్రం భిన్నంగా ఉంటారు. అధిక బరువుతో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా అయితేనే నేమి, అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరికతోనేమి కష్టపడి శరీర బరువును తగ్గించు కుంటారు. అలా జిమ్ కెళ్లకుండానే 95 కిలోల వెయిట్ నుంచి 65 కిలోలకు చేరుకుందో యవతి. అదెలాగో తెలుసుకుందాం.ఇది ఉదితా అగర్వాల్ వెయిట్ లాస్ జర్నీ. బరువు తగ్గడం అనేది కష్టమైన ప్రయాణం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ బరువు తగ్గాల్సి వస్తే ఇంకా కష్టం. అందుకే కారణాలను విశ్లేషించుకుని నిపుణుల సలహాతో ముందుకు సాగాలి. అలా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అయిన ఉదితా అగర్వాల్ కేవలం ఫిట్నెస్ కోసం మాత్రమే కాకుండా తన ఆరోగ్యాన్ని మెరుగుపరచు కోవడానికి కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అద్బుతమైన విజయాన్ని సాధించింది.ఇదీ చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లుఉదితా చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడేది. దీనికి తోడు పిగ్మెంటేషన్, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, విపరీతంగా జుట్టు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద అన్వాంటెడ్ హెయిర్ ఇలా సవాలక్ష సమస్యలతో సతమతమయ్యేది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలికి మారడం ద్వారా 8 నెలల్లో 30 కిలోల బరువు తగ్గింది. అదీ జిమ్కు వెళ్లకుండానే 95 కిలోల బరువున్న ఉదితా 65 కిలోలకు చేరుకుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. View this post on Instagram A post shared by Udita Agarwal (@udita_agarwal20) తన వెయిట్ లాస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్గా మారింది. శుభ్రమైన ఆహారాలు తినడం ద్వారా ఆమె సహజంగానే 30 కిలోల బరువు తగ్గింది. ముఖ్యంగా "బరువు తగ్గడంలో జంక్ ఫుడ్ను మానేయడమే అది పెద్ద చాలెంజ్’’ అని ఆమె చెప్పుకొచ్చింది.చదవండి: చిన్నతనం నుంచే ఇంత పిచ్చా, పట్టించుకోకపోతే ముప్పే : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ఉదిత వెయిట్ లాస్లో సాయపడిన అలవాట్లుడీటాక్స్ వాటర్: ప్రతిరోజూ డీటాక్స్ వాటర్ తీసుకునేది. ముఖ్యంగా జీరా, అజ్వైన్, సోంపు, మెంతిని నీటిలో మరిగించి తాగేది. ఇది ఉబ్బరాన్ని నివారించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.ఆహారంపై దృష్టి: అప్పుడప్పుడు చీట్ మీల్ తీసుకున్నా.. ఆరోగ్యకరమైన ఆహార నియమాన్ని కచ్చితంగా పాటించేది.ఒక్కోసారి వెయిట్ పెరిగినా నిరాశపడలేదు: ప్రతీ రోజు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండేది. ఒకసారి బరువు పెరిగినా నిరుత్సాహ పడేది కాదు,అసలు ఆ హెచ్చుతగ్గులను పట్టించుకోలేదు.ఇంటి ఫుడ్: ఇంట్లో ఉన్నా, బయటికెళ్లినా, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినేది. చియా సీడ్ వాటర్: చియా విత్తనాలను అర లీటరు నీటి నాన బెట్టి రోజుకు 3-4 లీటర్ల చొప్పున రోజంతా తాగేది. రోజుకు ఒకసారి టీ, మైదా ఫుడ్కు దూరంగా ఉంటూ అతిగా తినకుండా ఉండటానికి ఉదిత ప్రతి భోజనానికి ముందు నీరు త్రాగేది. -
అప్పుడు ఆశ్చర్యపరిచాయి.. ఇప్పుడు అలవాటుగా మారింది..!
మన దేశంలో జీవించడమే మంచిది ఇక్కడే హాయిగా ఉంటుందని పలువురు విదేశీయలు భారతదేశాన్ని మెచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక విదేశీయురాలు తన పిల్లలను ఇక్కడే పెంచుతానని చెప్పగా, మరొకరు ఇక్కడ జీవిస్తానని అన్నారు. ఇప్పుడు ఈ విదేశీ మహిళ ఏకంగా మన భారతీయుల అలవాట్లు నచ్చాయి, వాటికి అలవాటు పడిపోయాను అని చెబుతుండటం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టిట తెగ వైరల్ మారింది. మరి ఇంతకీ ఆమె అనుసరిస్తున్న భారతీయ అలవాట్లు ఏంటంటే..బెంగళూరులో నివశిస్తున్న కంటెంట్ క్రియేటర్ యులియా అస్లమోవా అనే రష్యన్ మహిళ భారతీయ అలవాట్ల గురించి షేర్ చేసుకుంది. మొదట్లో ఆ అలవాట్లు చూసి ఆశ్చర్యపోయానని, ఇప్పుడు అవి తన దైనందిన జీవితంలో భాగమైపోయానని చెప్పుకొచ్చింది. పైగా వాటిని తాను కూడా పాటిస్తున్నానని చెప్పడం విశేషం. అందుకు సంబంధించిన మొత్తం ఎనిమిది అలవాట్లను లిస్ట్ ఔట్ చేసింది. అవేంటో వరసగా చూద్దామా..! ఈ అలవాట్లు వింతగా ఉన్నప్పటికీ, తన దినచర్యలో భాగమై కొండంతా సంతోషాన్ని మద్దతుని ఇస్తున్నాయని అంటోంది యులియా. ఇంతకీ అవేంటంటే..అత్తమామలతో జీవించడం: ఇంటిని తాను నిర్వహించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇదొక వరంలా భావిస్తోందామెచేతులతో తినడం: ఇది ఎంతో కంఫర్ట్బుల్గా ఉందంటోంది. పైగా ఇలా తింటేనే ఆహారం రుచిగా అనిపిస్తోందట. కొంచెం ఆలస్యమైనా పట్టించుకోను: ఎవరైనా వ్యక్తులు ఆలస్యంగా వచ్చినా..అందుకు తగ్గట్టుగా తాను ఇతర పనులు ప్లాన్ చేసుకుంటోందట, సమస్యగా ఫీల్ కాలేదట. ఎక్కువ మంది పనిమనుషులు ఉండటం: ఇది చూడటానికి వింతగా అనిపించినా..ఇదేరాను రాను సౌకర్యవంతంగా, స్మార్ట్గా అనిపిస్తోందిచర్చలు: భారతదేశం నుంచి నేర్చుకున్నది ఇదే. దీన్ని సూపర్ పవర్గా అభివర్ణించింది.మసాలా చాయ్ తాగడం: ఈ టీ తనకెంతో మనశ్శాంతినిస్తుందట. దీన్ని ఆమె మంగోలియన్ చాయ్తో పోల్చారామె. ప్రేమ విలువ: భారతీయ జీవితం సినిమాలు , సంభాషణలు, ప్రేమ చుట్టూ తిరుగుతాయని చెప్పుకొచ్చింది. బహుళ భాషలు మాట్లాడటం: ఇక్కడ ఉండే బహుళ భాషలు నచ్చాయట. అలాగే త్వరలో హిందీ నేర్చుకోవాలని భావిస్తోందట.భారతీయ జీవితంలో ప్రేమ చాలా గాఢంగా ఉంటుందని, సినిమాల్లో లేదా రోజువారీ సంభాషణలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. భారతదేశం చాలా భావోద్వేగ దేశం. అందువల్ల ఇక్కడ ప్రతీది అద్భుతంగా ఉంటుంది. యులియా పోస్ట్ని చూసిన నెటిజన్లు.. భారతదేశ రియల్ స్ఫూర్తిని తెలుసుకున్నారు, స్వీకరించారు కూడా. అలాగే అత్తమామలతో కలిసి ఉండటంపై మీ అభిప్రాయం అత్యంత హర్షాతిరేకంగా ఉందంటూ యులియాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) (చదవండి: పేరెంట్స్ త్యాగాలకు ఫలితం ఏంటో చూపిస్తున్నా..! కుమారుడి భావోద్వేగం..) -
ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. శ్రుతి మించిన యువతి బర్త్డే..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఓ యువతి పుట్టిన రోజు వేడుకలు శ్రుతి మించాయి. నగర నడిబొడ్డున సిరిపురం జంక్షన్లో బర్త్ డే వేడుకలు పేరుతో విద్యార్థులు హంగామా సృష్టించారు. సుమారు 30 మంది వరకు యువకులు.. యువతి పుట్టిన రోజును సెలెబ్రేట్ చేశారు.అయితే, కేకులు కట్ చేసి ఒకరిపై ఒకరు విసురుకున్నారు. రోడ్లపై గన్ ఫైర్ క్రాకర్స్తో పరిగెత్తుకుంటూ వాహనదారులపై కేకులు విసురుతూ హల్చల్ చేశారు. వీరి విపరీత చేష్టలకు వాహనదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. -
ఒకే కాన్పులో పుట్టిన 9 మంది చిన్నారుల.. నాలుగో హ్యాపీ బర్త్ డే
ఈవిడ ఎవరన్నది మీరు మర్చిపోయి ఉంటారు.. నాలుగేళ్ల క్రితం మీడియాలో మార్మోగిన పేరు.. హలీమా.. గంపెడు సంతానానికి కేరాఫ్ అడ్రస్. ఈ పిల్లలూ మామూళోళ్లు కారు.. రికార్డు బ్రేకింగ్ పిల్లలు. నాలుగేళ్ల క్రితం ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చి.. మాలీ దేశానికి చెందిన హలీమా గిన్నిస్ రికార్డు సాధించారు. 9 మంది పుట్టడం రికార్డైతే.. అందరూ బతికిబట్టకట్టడం.. ఇదిగో ఇప్పుడిలా నాలుగో జన్మదినాన్ని జరుపుకోవడం అరుదైన విషయమేకదా.. ఈ సందర్భంగా తండ్రి అర్బీ, తల్లి హలీమాతో వారు దిగిన ఈ ఫొటోను గిన్నిస్ బుక్ తన వెబ్సైట్లో షేర్ చేసుకుంది. సర్పానికి చికిత్స అచ్చంపేట రూరల్: గాయపడిన ఒక సర్పానికి వెటర్నరీ వైద్యుడు చికిత్స చేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లింగోటం సమీపంలోని కోళ్లఫారం వద్ద కొన్నిరోజులుగా పెద్ద పాము సంచరిస్తుండడంతో.. యజమాని స్నేక్క్యాచర్ సుమన్కు సమాచారం అందించాడు. శుక్రవారం కోళ్లఫారం వద్ద పామును పట్టుకునే క్రమంలో.. అతని వద్ద ఉన్న పరికరం గుచ్చుకుని పాముకి గాయమైంది. వెంటనే ఆయన పామును అచ్చంపేటలోని పశువుల ఆస్పత్రికి తీసుకురాగా.. వెటర్నరీ వైద్యుడు హరీశ్ చికిత్స చేశారు. అనంతరం పామును అడవిలో వదిలేశారు.


