రీల్స్‌ కోసం యువతి దుస్సాహసం | Mysuru Woman Films Reels with Dasara Elephants, Sparks Controversy | Sakshi
Sakshi News home page

రీల్స్‌ కోసం యువతి దుస్సాహసం

Sep 21 2025 9:37 AM | Updated on Sep 21 2025 11:11 AM

Woman Allowed To Make Reels With Mysuru Dasara Elephants In Midnight

రాత్రివేళ దసరా ఏనుగులతో చిందులు 

మైసూరు: వీడియోల పిచ్చితో యువతీ యువకులు పడరాని పాట్లు పడుతుంటారు. ఎక్కడ మంచి రీల్స్‌కు చాన్సుందా అని ఆరాటపడుతుంటారు. ఇందుకోసం దుస్సాహసాలు కూడా చేస్తుంటారు. అదే మాదిరిగా మైసూరులోని దసరా ఏనుగులతో ఓ యువతి రీల్స్‌ చేసింది.  వాటిని సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌ అయ్యాయి. మావటీలు, కాపలాదారులు తప్ప ఇతరులు దసరా ఏనుగుల వద్దకు వెళ్లే అవకాశం లేదు.

 కానీ ఓ యువతి రాత్రి సమయంలో వచ్చి ఏనుగుల వద్ద డ్యాన్సులు చేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంది. ఆ సమయంలో అక్కడి సిబ్బంది ఎందుకు ఆమెను అడ్డుకోలేదో తెలియడం లేదు. వీడియోలు వ్యాప్తి చెందగా, ఆమె చర్యపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. గలాటా జరుగుతోందని తెలిసి ఆ యువతి వీడియోలను తొలగించింది. అటవీశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ యువతి కోసం గాలిస్తున్నారు.      

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement