-
మాల్దీవులకు హాయ్
వరుస షూటింగ్లతో బిజీ బిజీగా గడిపిన హీరో రజనీకాంత్ హాలిడే ట్రిప్ కోసం మాల్దీవులు వెళ్లారు. చెన్నై నుంచి మాల్దీవుల రాజధాని మాలె వరకు శ్రీలంకన్ ఎయిర్లైన్స్లో రజనీ ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి. ఓ ఫొటోలో ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన ఫ్లవర్ బొకేతో నవ్వుతూ కనిపించిన రజనీ కాంత్, మరో ఫొటోలో బ్యాగ్ పట్టుకుని, కళ్ల జోడు పెట్టుకుని స్టైలిష్గా ఉన్నారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’ సినిమాలో తన ΄ాత్ర (మొయిద్దీన్ భాయ్) షూటింగ్ని పూర్తి చేశారాయన. ఇప్పుడు కొంచెం విరామం దొరకడంతో రిఫ్రెష్ అయ్యేందుకు మాల్దీవులకు వెళ్లారు రజనీకాంత్. కాగా ఆయన నటించిన ‘జైలర్’ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది. -
కొలంబోకు విమాన సర్వీసులు పునఃప్రారంభం
శంషాబాద్: హైదరాబాద్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. 19 నెలల తర్వాత శుక్రవారం ఉదయం 9.55 గంటలకు 120 మంది ప్రయాణికులతో శ్రీలంక ఎయిర్లైన్స్ విమానం ఇక్కడి నుంచి కొలంబోకు బయలుదేరింది. వారానికి రెండుసార్లు (సోమ, శుక్రవారం) ఈ విమాన సర్వీసులు ఉంటాయని గెయిల్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ మీడియాకు వెల్లడించారు. అంతకుముందు కొలంబో నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీలంక ఎయిర్లైన్స్ విమానానికి జీఎంఆర్ ప్రతినిధులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. -
హైదరాబాద్–కొలంబో మధ్య శ్రీలంకన్ సర్వీసు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ శ్రీలంకన్ ఎయిర్లైన్స్ హైదరాబాద్–కొలంబో మధ్య విమాన సేవలను బుధవారం ప్రారంభించింది. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ సర్వీసులు ఉంటాయి. కొలంబోలో ఉదయం 7 గంటలకు విమానం బయలుదేరి ఉదయం 8.55కు హైదరాబాద్ చేరుకుంటుంది. ఉదయం 9.50కి తిరుగు ప్రయాణమై 11.45కు కొలంబోలో విమానం దిగుతుంది. జూలై 16 నుంచి కోయంబత్తూరు నుంచి కొలంబోకు సర్వీసు మొదలు పెడుతోంది. దీంతో భారత్లో 14 నగరాల్లో అడుగు పెట్టినట్టు అవుతుందని శ్రీలంకన్ ఎయిర్లైన్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శివ రామచంద్రన్ బుధవారం మీడియాకు తెలిపారు. దేశంలో వారానికి 126 సర్వీసులు నడిపిస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎమిరేట్స్ తర్వాత ఈ స్థాయిలో సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన కంపెనీ తమదేనని గుర్తు చేశారు. ప్రయాణికుల సంఖ్య అధికమైతే సర్వీసులు పెంచుతామన్నారు. ‘2016లో 20 లక్షల మంది విమాన ప్రయాణికులు శ్రీలంకలో అడుగుపెట్టారు. వీరిలో భారత్ నుంచి 18 శాతం మంది ఉన్నారు. సంస్థ విమానాల్లో 80 శాతం సీట్లు నిండుతున్నాయి’ అని వివరించారు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్, శ్రీలంక క్రికెటర్ మహేల జయవర్ధనే సైతం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. -
హైదరాబాద్ కు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విమానయాన రంగంలో ఉన్న శ్రీలంకన్ ఎయిర్లైన్స్ భారత్లో మరిన్ని నగరాలకు సర్వీసులను పరిచయం చేయనుంది. వీటిలో హైదరాబాద్తోసహా వైజాగ్, చండీగఢ్ నగరాలు సంస్థ పరిశీలనలో ఉన్నాయని శ్రీలంకన్ ఎయిర్లైన్స్కు చెందిన శ్రీలంకన్ హాలిడేస్ మేనేజర్ గయన్ పేరిస్ గురువారమిక్కడ తెలిపారు. ‘ప్రస్తుతం భారత్లో ఏడు నగరాలకు వారానికి 86 సర్వీసులను శ్రీలంక నుంచి నడుపుతున్నాం. భారత్లో కొత్త నగరాల్లో అడుగుపెట్టడం ద్వారా వీటి సంఖ్య పెంచుతాం’ అని చెప్పారు. కాగా భారత్ నుంచి 2014లో శ్రీలంకకు వెళ్లిన పర్యాటకుల సంఖ్య 2.4 లక్షలు. 2020 నాటికి ఈ సంఖ్య మూడింతలకుపైగా ఉంటుందని శ్రీలంక కన్వెన్షన్ బ్యూరో సీఈవో విపుల వానిగశేఖర తెలిపారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బరితెగించిన టీడీపీ నేతలు
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
జనస్వామ్యమా! జయీభవ!!
వరుసగా ఐదోసారి ‘అమ్మఒడి’
ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
రెండ్రోజులు వానలు
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
తప్పక చదవండి
- గోల్డ్ ఈటీఎఫ్లలో అమ్మకాలు..
- ఈసీ ద్వంద్వ వైఖరి
- ఇండోనేసియాలో వరదలు.. 37 మంది మృతి
- నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
- Lok Sabha Election 2024: పవార్ వర్సెస్ పాటిల్
- Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
- ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
- రెండ్రోజులు వానలు
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
Advertisement