సాక్షి, తిరుపతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద అర్చకులు ఇస్తీకఫల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున రాష్ట్రపతికి చిత్రపటాన్ని అందించారు.
భక్తులకు చాక్లెట్లు పంచిన ముర్ము
తిరుమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనూహ్య చర్యకు దిగారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుగు పయనంలో ఆమె రాంభకిచా వద్ద తన కాన్వాయ్ను ఆపారు. వాహనం దిగిన ఆమె కరచలనం చేస్తూ స్వయంగా భక్తులకు చాక్లెట్లు పంచారు. ఈ క్రమంలో.. ఆమె కాన్వాయ్ దిగడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురవారమే తిరుమల చేరుకున్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బస చేసిన ఆమె.. అంతకు ముందు తిరుచానూరు వెళ్లి శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి కాసేపట్లో హైదరాబాద్కు చేరుకోనున్నారు.


