సైబరాబాద్‌లో.. ఏఐ ఆధారిత ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ | Arrive Alive A Campaign for Safer Roads in Telangana | Sakshi
Sakshi News home page

సైబరాబాద్‌లో.. ఏఐ ఆధారిత ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్

Jan 5 2026 7:12 PM | Updated on Jan 5 2026 8:38 PM

Arrive Alive A Campaign for Safer Roads in Telangana

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో రోడ్డు భద్రతను మిషన్ మోడ్‌లో ముందుకు తీసుకెళ్లే దిశగా ‘అరైవ్ అలైవ్–2026’ కార్యక్రమం మరో ముందడుగు వేసింది. ఈ సందర్భంగా అరైవ్ అలైవ్–2026 టేబుల్‌టాప్ క్యాలెండర్ను విడుదల చేసి, ఆలోచనల నుంచి అమలుకు మారుతున్న స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. ఈ కార్యక్రమం డీజీపీ బి. శివధర్ రెడ్డి నేతృత్వంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉన్నత పోలీసు అధికారుల సహకారంతో కొనసాగుతోంది.

ఈ ప్రచారంలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ ప్రతినిధులు మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేశ్‌ను కలిశారు. రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడంలో సాంకేతికత ఆధారిత చర్యలు, ప్రజల భాగస్వామ్యం కీలకమని ఈ సందర్భంగా చర్చించారు.

ఈ సమావేశంలో ముఖ్య ఆకర్షణగా ఏఐ ఆధారిత ట్రాఫిక్ లా కంప్లయన్స్ వాహనం (TLCV)ను కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వయంగా టెస్ట్ రైడ్ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు గుర్తించడం, ప్రజా భద్రతను మెరుగుపరచడంలో ఈ వాహనం కీలకంగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ‘అరైవ్ అలైవ్’ కేవలం ప్రచారం కాదని, ప్రతి కుటుంబం సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలన్న బాధ్యతగా రాష్ట్రం ముందుకు సాగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement