సాక్షి, తిరుపతి: టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. బాలాజీనగర్ ఫ్లాట్ నంబర్ 2 రద్దు విషయంలో కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆయన రాజీనామా చేశారు.
ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనాలు.. మనస్తాపానికి గురిచేశాయన్న కృష్ణమూర్తి.. కనీసం తనను సంప్రదించకుండా కథనాలు రాయడం బాధాకరమన్నారు. స్వామి వారికి సేవ చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నందుకు ఆ భగవంతుని క్షమించమని కోరుకుంటున్నానంటూ జంగా కృష్ణమూర్తి లేఖలో పేర్కొన్నారు.


