‘ఇండిగో’ సర్వీసులతో ఇక్కట్లు | Airline passengers fire on staff in Tirupati | Sakshi
Sakshi News home page

‘ఇండిగో’ సర్వీసులతో ఇక్కట్లు

Dec 7 2025 5:38 AM | Updated on Dec 7 2025 5:38 AM

Airline passengers fire on staff in Tirupati

విశాఖ ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న ప్రయాణికులు

తిరుపతిలో సిబ్బందిపై విమాన ప్రయాణికుల ఫైర్‌

గన్నవరం, విశాఖ, రాజమండ్రి ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల పడిగాపులు

స్వదేశానికి వచ్చిన వారు వీసాలు రద్దవుతాయని గగ్గోలు

రేణిగుంట/గన్నవరం/గోపాలపట్నం/కోరు­కొండ: విమాన సర్వీసుల్లో అత్యధిక విమానాలు కలిగిన ఇండిగో సంస్థపై  ప్రయాణికులు తీవ్ర ఆగ్రç­ßæం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతి­(రేణిగుంట) అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ప్రతి­రోజు 12 ఇండిగో విమానాలు వివిధ ప్రాంతాలకు వెళ్తు­న్నాయి. ముందస్తు ప్రణాళికతో టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయా­ణికులు విమానా­శ్రయానికి చేరు­కున్న సమయంలో విమానాలు రద్దయ్యాయని ఇండిగో సిబ్బంది తాపీగా చెబు­తుండడంతో ప్రయా­ణికులు వారితో తీవ్ర వాగ్వా­దానికి దిగుతు­న్నారు. ఇక శనివారం రాత్రి 7.50కు హైదరా­బాద్‌కు వెళ్లాల్సిన ఇండిగో సర్వీస్‌ రద్దయింది. ఇదే అదునుగా ఇతర విమాన సర్వీసులు తమ టికెట్‌ ధరలను అమాంతం పెంచడంతో ప్రయాణికులు అవస్థలు అన్నీఇన్నీ కావు.

శ్రీవారి భక్తుల అగచాట్లు..
తిరుపతికి దేశవ్యాప్తంగా రాజకీయ నాయ­కులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు, బడా పారిశ్రామి­క­­వేత్తలు శ్రీవారి దర్శనానికి నిత్యం వస్తుంటారు. రావడానికి, తిరిగి వెళ్లడానికి వీరు ముందుగానే విమాన టికెట్లు బుక్‌ చేసుకుంటారు. అయితే, శ్రీవారి దర్శనానంతరం ఎయిర్‌­పోర్టుకు చేరు­కున్న వీరికి విమానం రద్దయిందని చెప్పడంతో ప్రత్యామ్నాయంలేక వారంతా నానా ఇబ్బందులు పడుతు­న్నారు. అలాగే, అత్యవసరంగా వేరే నగరా­లకు వెళ్లా­ల్సిన వారి అవస్థలూ చెప్పనలవి కావు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానా­శ్రయానికి చేరుకున్నాక సర్వీసు రద్దని చెప్పడంపై వారు మండిప­డుతు­న్నారు. పైగా.. వేరే విమాన సర్వీసుల ధరలను ఇదే అదనుగా పెంచేస్తుండడంతో ప్రయా­ణికుల పరిస్థితి అగ్గిమీద గుగ్గిలంలా తయారైంది.

వీసాలు రద్దవుతాయని గగ్గోలు..
మూడు రోజులుగా ఇండిగో విమా­నాలను రద్దవు­తుండడంతో ప్రయాణికులు విశాఖ విమా­నా­­శ్ర­యా­నికి వచ్చి నిరాశతో వెను­దిరుగు­తున్నారు. పలు దేశాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడిన వారు స్వదే­శానికి వచ్చి తిరిగి వెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేసు­కున్నారు. విమానాలు రద్దుకా­వడంతో ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల్లో తమ వీసా గడువు ముగుస్తుందని.. భవి­ష్యత్తు ఏమవుతుందో అంటూ వారు కంగారుపడుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికి పరి­ష్కారమవుతుందో తెలియడంలేదని వాపోతు­న్నారు. ఇదిలా ఉంటే.. శనివారం విశాఖలో తొమ్మిది ఇండిగో విమానాలు రద్ద­య్యాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా మధురపూ­డిలోని రాజ­మహేంద్రవరం ఎయిర్‌పోర్టులో కూడా ఇదే పరిస్థితి. ముంబై నుంచి రావాల్సిన విమానం శనివారం రద్దయింది. ఢిల్లీ నుంచి శుక్రవారం రావల్సిన సర్వీసు శనివారం చేరింది. హైదరా­బాద్, బెంగళూరు, చెన్నై విమాన సర్వీసులన్నీ ఆలస్యంగానే నడుస్తున్నాయి.

ఇండిగో సర్వీసులు ఆలస్యం..
పైలెట్ల కొరత, సాంకేతిక సమస్యల కారణంగా ఇండిగో విమాన సర్వీసులు శనివారం కూడా గన్నవరం విమానాశ్రయానికి అలస్యంగా నడి­చాయి. ఢిల్లీ–విజయవాడ మధ్య నడిచే సర్వీ­సును వరుసగా రెండోరోజూ రద్దుచేశారు. హైద­రాబాద్, బెంగళూరు, చెన్నై, కడప, విశాఖ­పట్నం సర్వీసులు గంట నుంచి రెండు గంటల వరకు అలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణి­కులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. విమాన టికెట్‌ ధరలు భారీగా పెరగడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గన్నవరం నుంచి హైదరాబాద్, బెంగళూరుకు సుమారు రూ.18 వేలు, న్యూఢిల్లీకి రూ.35 వేలు నుంచి రూ.42 వేలు వరకు టికెట్‌ ధర పెరిగిందని చెబుతున్నారు.

కనీస సమాచారం ఇవ్వలేదు..
ముంబై వెళ్లేందుకు 15 రోజులు ముందు­గా ఇండిగో సర్వీసులో టికెట్‌ బుక్‌­చేసు­కున్నా. ఇవాళ ముంబై వెళ్లేందుకు రేణు­గుంట ఎయిర్‌­పోర్టుకు చేరు­కున్నాక విమా­నం రద్దయిందని ఇండిగో సిబ్బంది చెప్పారు. ముందస్తు సమా­చారం ఇచ్చి ఉంటే వేరే ఏర్పాట్లు చేసు­కునే వాళ్లం. ఇప్పుడు మీ డబ్బులు తిరిగిస్తామంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.    – వెంకటేష్, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement