
సాక్షి, తిరుపతి: తిరుపతిలో మరో చిరుత బోనులో చిక్కింది. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. ఈరోజు ఉదయం చిరుతను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అనంతరం, చిరుతను సమీపంలోని ఎస్వీ జూ పార్కుకు తరలించినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు.
అయితే, చిరుతలు సంచారం ఎక్కువగా ఉండటంతో ఫారెస్ట్ అధికారులు ఎస్వీ యూనివర్సీటీ వద్ద మూడు బోన్లు ఏర్పాటు చేశారు. ఇక, మూడు నెలలుగా చిరత.. అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. బోనలో చిక్కకుండా తరచుగా అక్కడ కనిపించడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. మరోవైపు.. అక్కడ మరిన్ని చిరుతలు ఉన్నాయన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి.. సీసీ టీవీలను పరిశీలిస్తున్నారు.