‘సీమ ఎత్తిపోతల’తో ప్రయోజనం లేదు | Nimmala Ramanaidu Lies About Rayalaseema Lift Irrigation Project, Chandrababu And Revanth Reddy Deal, More Details Inside | Sakshi
Sakshi News home page

‘సీమ ఎత్తిపోతల’తో ప్రయోజనం లేదు

Jan 7 2026 6:12 AM | Updated on Jan 7 2026 12:03 PM

Nimmala Ramanaidu about Rayalaseema Lift Irrigation Project

మీడియా సాక్షిగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల వ్యాఖ్యలు

గత ప్రభుత్వం 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టి ఆ పనుల కోసం రూ.990 కోట్లు ఖర్చు కూడా చేసింది 

అయినా.. పర్యావరణ అనుమతి లేకుండానే సీమ ఎత్తిపోతలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది 

ఎన్‌జీటీ.. 2020 మే 20న పనులు నిలిపివేయమని ఆదేశించింది

సాక్షి, అమరావతి: రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని జల­వ­నరుల శాఖ మంత్రి నిమ్మల రామా­నాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం సచి­వా­లయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి ఇప్పటికే 841 అడుగుల స్థాయి వరకు గ్రావిటీ ద్వారా నీరు రాయలసీమకు వస్తోందని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో 2020లో ప్రతిపాదించిన రాయల­సీమ ఎత్తిపో­తల ద్వారా 800 అడుగుల స్థాయి నుంచి నీటిని తర­లించేలా చేపట్టారని వెల్లడించారు. 841 అడుగుల దిగువన శ్రీశైలంలో కేవలం 34 టీఎంసీలు మాత్రమే ఉంటాయని.. అందులో కృష్ణా బో­ర్డు కేటాయించిన వాటా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు దక్కేది 66 శాతం అంటే కేవలం 22 టీఎంసీలు మాత్రమేనన్నారు.

ఆ నీటిని కూడా ఇప్పటికే ఉన్న మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రాయ­ల­సీమకు తరలించవచ్చని అందువల్ల సీమ ఎత్తిపో­తల వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా రాయల­సీమ ఎత్తిపోతలను వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం చేపట్టిందన్నారు. దీనిపై విచారించిన ఎన్‌జీటీ.. 2020 మే 20న పనులు నిలిపివేయమని ఆదేÔ­>లు ఇచ్చిందన్నారు. 2024 మార్చిలో ఎన్‌జీ­టీ మళ్లీ విచారించి రూ.2.65 కోట్ల జరిమానా వి­ధించిందన్నారు. ఇదంతా గత ప్రభుత్వ హ­యాం­లోనే జరిగింద­న్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనుల పేరుతో రూ.990 కోట్లు ఖర్చు చేసి­నట్లు రికార్డులు ఉన్నాయని చెప్పారు. ఈ ఖ­ర్చు వృథాగా జరిగినట్లు భావిస్తున్నారా? అని విలేక­రులు ప్రశ్నించగా.. వృథా అని అనడం లేదని కానీ ప్రాజెక్టు నిరు­ప­యోగంగా ఉందన్నారు. 

వైఎస్సార్‌సీపీ హయాంలో 3 కొత్త రిజర్వాయర్లు..
గత ప్రభుత్వ హయాంలో  జీఎన్‌ఎస్‌ఎస్‌–హెచ్‌­ఎన్‌­ఎస్‌ఎస్‌  లింక్‌ ప్రాజెక్ట్‌ (అంచనా వ్యయం రూ.5,036 కోట్లు) పేరుతో భూసేకరణ లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా మట్టి పనులు మాత్రమే చేసి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని నిమ్మల ఆరోపించారు. గత ప్రభుత్వ హ­యాంలో ముదివేడు రిజర్వాయర్‌ (అంచనా రూ.­500 కోట్లు, ఖర్చు రూ.167.97 కోట్లు),  నేటిగుంటపల్లి రిజర్వాయర్‌ (అంచనా రూ.571 కోట్లు, ఖర్చు రూ.494 కోట్లు), ఆవులపల్లి రిజర్వా­యర్‌ (అంచనా రూ.482 కోట్లు, ఖర్చు రూ.28 కోట్లు) అనే 3 కొత్త రిజర్వాయర్ల నిర్మాణ పను­లను పర్యా­వరణ అనుమతులు లేకుండా చేప­ట్టారన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement