సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు(బుధవారం) ఉదయం 10.30 గంటలకు వేంపల్లి మండలం నందిపల్లి నందీశ్వర ఆలయాన్ని వైఎస్ జగన్ సందర్శించనున్నారు.
వైఎస్ జగన్ నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక పూజలు, హొమంలో పాల్గొననున్నారు. కాగా, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆలయానికి రూ. 1.8 కోట్లు మంజూరు చేశారు. మొత్తం ఆరు కోట్లతో దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత.. వైఎస్ జగన్ మధ్యాహ్నం నుంచి క్యాంపు కార్యాలయంలో ప్రజదర్బార్ నిర్వహించనున్నారు.
రేపు (25.02.2026) వైయస్ జగన్ గారు ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు, అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.#YSJaganInPulivendula#YSRCPForTemples pic.twitter.com/zYLvjpIUPa
— YSR Congress Party (@YSRCParty) February 24, 2026


