

ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్రకు రథాల తయారీ ముగింపు దశకు చేరుకుంది. ఏటా కొత్తగా 3 రథాలు తయారు చేయడం ఆనవాయితీ. రథ సారథులు, అశ్వాలు, పార్శ్వ దేవతలకు రంగు పూసి పునర్వినియోగిస్తారు.

ఒక్కో రథానికి 4 చొప్పున గుర్రాలు, 9 వంతున పార్శ్వ దేవతల చిత్రపటాలను అమర్చుతారు. శ్రీజగన్నాథుని నందిఘోష రథంలో శంఖం, బలాహక, శ్వేత, హరిద్వార్ అనే 4 గుర్రాలు ఉంటాయి.










