తెలంగాణలోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో హీరో అర్జున్ సర్జా ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్లు అంజన్న ఆలయాన్ని తన కూతురు ఐశ్వర్య అర్జున్తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తాను మొదటిసారి ఈ క్షేత్రానికి వచ్చానని అర్జున్ తెలిపారు. సీతాపయనం మూవీ రిలీజ్ తర్వాత కొండగట్టుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా అర్జున్ సర్జా మాట్లాడుతూ.. 'ఆంజనేయస్వామి ఆలయానికి రావడం అంటే నాకు చాలా ఇష్టం. కొండగట్టు చాలా సార్లు విన్నా. అందుకే మొదటిసారి ఇక్కడికి వచ్చా. ఈ ఆలయానికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. సీతాపయనం మూవీ రిలీజ్ సందర్భంగా కొండగట్టుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మంచి జరగాలి. సర్వేజనా సుఖినోభవంతు' అని అన్నారు.
కాగా.. అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ సీతాపయనం. ఈ చిత్రంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయన్గా మెప్పించింది. ఈ మూవీ ఇటీవలే వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా కీలక పాత్రలో మెప్పించారు.
Aanaadu #SriAnjaneyam lo Anjaneyudu laa manalni abhimanulu ga maluchukunna #Arjun garu Eroju #SeethaPayanam hit Aina Sandharbhamga #Kondagattu #SriAnjaneya Swamy vaarini dharsinchukunnaru...
pic.twitter.com/nOCrnrarH6— Prabhas Fan (@ivdsai) February 16, 2026


