రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ పొందడంలో కోర్టుతో నిమిత్తం లేకుండా నేరుగా ఏకమొత్తంలో చెల్లించాలి. 2024 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు ఒకేసారి విడుదల చేయాలి. మూడేళ్లుగా ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించలేదు.
– మల్లారపు పురుషోత్తం, ఆర్ఈడబ్ల్యూఏ జిల్లా అధ్యక్షుడు
ఈహెచ్ఎస్లో తప్పులు సరిదిద్దాలి
విశ్రాంత ఉద్యోగులకు ఎంప్లాయి హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)లో తప్పులు సరిదిద్ది కార్పోరేట్ వైద్యం అందించాలి. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు, బకాయిల డబ్బులు ఖాతాల్లో జమచేయాలి. కొత్త పీఆర్సీ ప్రకటించాలి.
– ద్యావనపల్లి పరమేశ్, ఆర్ఈడబ్ల్యూఏ జిల్లా కార్యదర్శి


