breaking news
Rajanna Sircilla District News
-
● కళాకారులుగా.. ఉద్యోగులుగా.. వివిధ రంగాల్లో రాణించి ● సర్పంచ్లుగా ఎన్నికై న యువత
వారు వివిధ వృతులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఊరికి సేవ చేయాలని భావించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీచేసి గెలుపొందారు. గ్రామానికి ప్రథమ పౌరులయ్యారు. ప్రజాసేవలో తరించాలి... పాలనలో ప్రత్యేకత చూపాలని భావిస్తున్నారు. మరో వైపు ఓటర్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి యువతకు పట్టం కట్టారు. అభిమానం, సామాజిక సేవ, గౌరవం, తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో అవకాశం కల్పించారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పలువురు సర్పంచ్ల ప్రత్యేకతపై ఈ వారం సండే స్పెషల్..!! -
రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: జిల్లాలోని డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో శనివారం మాట్లాడారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్బంగా రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. బ్లాక్స్పాట్స్ను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, జిల్లా రవాణా శాఖా అధికారి లక్ష్మణ్, జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, పీఆర్ ఈఈ సుదర్శన్రెడ్డి, ఆర్అండ్బీ డీఈఈ శాంతయ్య, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, అన్వేశ్, జిల్లా వైద్యాధికారి రజిత, ఆర్టీసీ డీఎం ప్రకాశ్రావు పాల్గొన్నారు. ఫెర్టిలైజర్ యాప్పై అవగాహన కల్పించాలి రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్పై అవగాహన కల్పించాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఫెర్టిలైజర్ యాప్పై అవగాహన, ఆయిల్పామ్ లక్ష్యం తదితర అంశాలపై శనివారం సమీక్షించారు. ఫెర్టిలైజర్ యాప్ ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలన్నారు. అన్ని షాపుల్లో హెల్ప్డెస్క్, ఒక సహాయకుడు ఉండాలని సూచించారు. ఆయిల్పామ్ లక్ష్యం చేరుకోవాలి వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు, పీఏసీ ఎస్ సీఈవోలు రైతులను కలిసి ఆయిల్పామ్ సాగు లక్ష్యం చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ సూచించారు. ఆయిల్పామ్ సాగుతో కలిగే లాభాలు వివరించాలని, సబ్సిడీలు, ప్రోత్సాహకా లు, పంట ఉత్పత్తులకు మద్దతు ధర, అందుబాటులో ఫ్యాక్టరీ ఉందని విషయాలు తెలపాలన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఉన్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ సందర్శనకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించాలి వేములవాడ, నాంపల్లి, గంభీరావుపేట, అల్మాస్ పూర్, సనుగుల, ఇల్లంతకుంట పీఏసీఎస్లు ఎఫ్పీవోలకు ఎంపిక కాగా, ఆయా పీఏసీఎస్ల బాధ్యులను అభినందించారు. రైతులకు ఉత్తమ సేవలు అందిస్తూ.. వ్యాపారంలోనూ వృద్ధి చెందాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, జిల్లా సహకార అధికారి రామకృష్ణ తదితరులున్నారు. ఇన్చార్జి కలెక్టర్కు శుభాకాంక్షలు పంచాయతీ ఎన్నికలు జిల్లాలో విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్కు ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ ఆఫీస్ సిబ్బంది శనివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కలెక్టర్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయమూర్తిని కలిసిన ఇన్చార్జి కలెక్టర్ సిరిసిల్లకల్చరల్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజను శనివారం ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కను బహూకరించారు. -
బంగారం అమ్మి ఇల్లు కట్టి !
గంభీరావుపేట(సిరిసిల్ల): ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని మంజూరుపత్రం ఇస్తే ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. పంచాయతీ కార్యదర్శి దగ్గర ఉండి ముగ్గుపోస్తే.. బంగారం విక్రయించి ఇంటి నిర్మాణం చేపట్టారు. తీరా బిల్లులు వచ్చే సమయంలో ఇల్లే మంజూరుకాలేదని సమాధానం ఇవ్వడంతో ఆ కుటుంబం వేదన అంతా.. ఇంతా కాదు. ఇద్దరి మహిళల పేర్లు ఒకేలా ఉండడంతోనే తప్పిదం జరిగినట్లు తెలుస్తుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్కు చెందిన బండ బాలమణికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని అధికారులు గ్రామసభలో ప్రకటించారు. ఆన్లైన్ పేరుతో ఫొటోలు తీసుకున్నారు. గత జూన్లో ప్రొసీడింగ్స్ అందించారు. ఇల్లు మంజూరైందనే ఆనందంలో తన వద్ద ఉన్న నగలను అమ్మి, మరికొంత అప్పు చేసి బేస్మెంట్, గోడల వరకు నిర్మించారు. బేస్మెంట్ బిల్లు కోసం అధికారుల వద్దకు వెళ్తే.. ఇల్లే మంజూరు కాలేదనడంతో ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. బండ బాలమణి భర్త బాలయ్య అనే మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, బేస్మెంట్ బిల్లు సైతం వారి బ్యాంక్ ఖాతాలో పడిందని అధికారులు గుర్తించారు. అనంతరం ఆరా తీయగా బండ బాలమణి భర్త బాలయ్య, బండ బాలమణి భర్త శ్రీనివాస్ వేర్వేరు కుటుంబాలు అని గుర్తించారు. వెంటనే వారి ఖాతాలో జమయిన అమౌంట్ను ఫ్రీజ్ చేశారు. దీంతో బాధిత కుటుంబం లబోదిబోమంటుంది. ఇల్లు నిర్మించుకున్నారు కదా.. బిల్లులు చెల్లిద్దామని అధికారులు ఆలోచిస్తుండగా.. వారు అనర్హులు అని తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు అప్పు చేసి ఇల్లు కట్టుకున్న తమ పరిస్థితి ఏంటని బాధిత కుటుంబం ప్రశ్నిస్తుంది. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని చెబుతున్న అధికారులు మంజూరుపత్రాల్లో భర్త పేరు నమోదు చేయకపోవడంతోనే ఈ తప్పిదం జరిగినట్లు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం నిరుపేద కుటుంబాన్ని అప్పుల్లోకి నెట్టేసింది. నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లుముగ్గుపోసే సమయంలో పక్కనే కార్యదర్శి(ఫైల్)ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఒకరికి బదులు మరొకరికి ఇంటి మంజూరు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఒకే పేరుతో ఇద్దరు మహిళలు ఉన్నారు. కానీ వారి భర్తల పేర్లు వేర్వేరుగా ఉన్నాయి. ఒకరికి ఇవ్వాల్సిన ప్రొసీడింగ్స్ కాపీని వేరొకరికి అందించారు. వారు ఇల్లు కట్టుకున్నారు. బిల్లు విషయానికి వచ్చేసరికి అసలు విషయం తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించాం. – శ్రీధర్, ఎంపీడీవో, గంభీరావుపేట -
కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజ్యాంగాన్ని అవమానిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేటలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ కుక్కలు, గాడిదలు, గుర్రాలతో పోల్చి న కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. జిల్లాలో బీజేపీ అభ్యర్థులు అనేక స్థానాల్లో సర్పంచులుగా గెలుపొందారని, ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీని సైతం కై వసం చేసుకున్నామన్నారు. ఎల్లారెడ్డిపేటలో నైతిక విజయం తమదేనని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో అనేక స్థానాలను బీజేపీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు చందుపట్ల లక్ష్మారెడ్డి, నాయకులు మద్దుల బుగ్గారెడ్డి, నంది నరేశ్, దాసరి గణేశ్, బోనాల సాయి, మద్దుల బుగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు కాంగ్రెస్ నిరసన సిరిసిల్లటౌన్: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ శనివారం ప్రకటనలో తెలిపారు. పేదల సంక్షేమ పథకం ఉపాఽధిహామీపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం గాంధీచౌక్లో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని మార్చివేయడాన్ని నిరసిస్తూ చేపట్టే కార్యక్రమానికి జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు తరలిరావాలని కోరారు. ఉపాధిహామీని నీరుగార్చొద్దు సిరిసిల్లటౌన్: ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చొద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం నిరసన తెలిపి మాట్లాడారు. ఈ సందర్భంగా జీరామ్జీ బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కోడం రమణ, సూరం పద్మ, శ్రీరాముల రమేశ్చంద్ర, మిట్టపల్లి రాజమల్లు, నక్క దేవదాస్, ఎలిగేటి శ్రీనివాస్, బింగి సంపత్, స్వర్గం శేఖర్, సూరం వీరేశం పాల్గొన్నారు. మహిళా హక్కులు వినియోగించుకోవాలి సిరిసిల్లటౌన్:మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని పురుషులకు సమానంగా రాణించాల ని ఐద్వా జిల్లా కార్యదర్శి జువ్వాజి విమల కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర 14వ జాతీయ మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం జెండా ఆవిష్కరించారు. హైదరాబాద్లో జరుగుతున్న జాతీయ మహాసభలకు తరలిరావాలని కోరారు. కోడం లలిత, ముద్రకోల విజయ, ఎల్లవ్వ, లావణ్య పాల్గొన్నారు. ప్రతీ ఆదివారం నిరంతర దర్శనంవేములవాడఅర్బన్: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నిరంతరం దర్శనాలు కొనసాగుతాయని ఈవో రమాదేవి తెలిపారు. జనవరిలో సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ముందుగా వేములవాడకు వచ్చి దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీ. వరుసగా నాలుగు ఆదివారాలు నిరంతరం దర్శనాలు ఉంటాయని స్పష్టం చేశారు. బద్ది పోచమ్మ ఆలయంలోనూ ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు నిరంతరంగా దర్శనాలు ఉంటాయని వివరించారు. -
ప్రతీ ఎకరాకు నీరు అందిస్తాం
● మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రాజెక్టుల కింద ఉన్న వ్యవసాయ భూములకు ప్రతీ ఎకరాకు నీరందిస్తామని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని మిడ్మానేరు కుడికాలువ ద్వారా, అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ ద్వారా శనివారం నీటిని విడుదల చేసి మాట్లాడారు. అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి 15వేల ఎకరాలకు నీరు అందిస్తున్నామని, భూ సేకరణ చేసి మరో 15 వేల ఎకరాలకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మిడ్మానేర్ కుడికాలువ ద్వారా 100 క్యూసెక్కులు, అన్నపూర్ణ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పర్యాటక కేంద్రంగా అనంతగిరి ప్రాజెక్టు అనంతగిరి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడుతానన్నారు. ఇంజినీరింగ్ అధికారులు సుధాకిరణ్, రమేశ్, ఉపేందర్, సమరసేన, వంశీ, నాగేందర్, అనంతగిరి సర్పంచ్ అరుకాల నవీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, ఐరెడ్డి మహేందర్రెడ్డి, గుడిసె ఐలయ్య, వెంకటరమణారెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ ఎలగందుల ప్రసాద్ పాల్గొన్నారు. -
వడివడిగా ఎస్ఐఆర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లాలోని ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/ ఎన్నికల జాబితా విస్తృత జాబితా సవరణ) ప్రక్రియ వడివడిగా ముందుకు సాగుతోంది. దేశంలో నిజమైన పౌరులను గుర్తింపే లక్ష్యంగా మొదలైన ఈ ప్రక్రియపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని వర్గాలు ఈ సర్వేను స్వాగతిస్తుండగా.. మరికొన్ని వర్గాలు సర్వేపై ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర భారతదేశంలోని పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించిన కేంద్రం.. తెలంగాణలోనూ ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సర్వేపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు నిజమైన ఓటరు.. ఎవరు కాదు? ఎవరు కొత్త ఓటరు.. ఎంతకాలం నుంచి నివసిస్తున్నారు అన్న అంశాలపై బీఎల్వోలు వివరాలు సేకరిస్తున్నారు. ఏమిటీ సర్వే? భారత పౌరుల ఓటరు నిర్ధరణకు ప్రారంభించిన సర్వే ఇది. ఇందులో 2002 ఓటరు జాబితా 2025 ఓటరు జాబితాను పక్కపక్కన పెట్టుకుని వివరాలు సరిపోలుస్తూ.. స్థానికంగా ఓటర్లు నివసిస్తున్నారా? లేదా.. ప్రస్తుత డేటాతో పాత డేటా మ్యాచ్అవుతుందా లేదా చూస్తున్నారు. దీన్ని మ్యాపింగ్ అని పిలుస్తున్నారు. 2002, 2025 ఓటర్ల జాబితాలో (రెండింటిలో) పేర్లు ఉన్నవారు మొదటి కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేకుండా 1987కు ముందు జన్మించిన వారు రెండో కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేని , 1987 నుంచి 2004కు మధ్యలో పుట్టిన వారు మూడో కేటగిరీగా, 2004 తరువాత జన్మించిన వారు నాలుగో కేటగిరీగా విభజించారు. ఉదాహరణకు 2002లో దంపతులకు ఓటు ఉందనుకోండి. వారికి పుట్టిన పిల్లలకు, వారి మనవలకు ఓటుపై ఎలాంటి వివాదం ఉండదు. ఇలాంటి ఓట్లను వివాదం లేని గ్రీన్ కేటగిరీలో వేస్తున్నారు. ఇందుకోసం పాత పోలింగ్ స్టేషన్, ఓటు నంబర్లను పోల్చి చూస్తున్నారు. వాటి ఆధారంగా పురుషులు, సీ్త్రలు, ట్రాన్స్జెండర్ల వివరాలను అప్డేట్ చేస్తున్నారు. ఆందోళన ఏమిటి? ఓటర్ల తనిఖీలో భాగంగా 2002లో ఉన్న ఇంటి పెద్దలు 2025లో ఉన్నారా? వారి పిల్లలు, మనవల పేర్లు చూస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, నేటి గ్లోబలైజేషన్ కాలంలో స్థిర నివాసాలు తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలీ పనులు, జీవనోపాధి, వలసలు, వివాహాలు తదితరతో పలు కుటుంబాలు రెండు, మూడు దశాబ్దాల్లో పలు చిరునామాలు మార్చాల్సి వస్తోంది. స్థానచలనంతో ఇళ్లు మారిన వారిలో ఆందోళన మొదలైంది. ఇలాంటి వారి ఓట్ల విషయంలో ఓటర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహాలు అయి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి పేర్లు 2002 జాబితాలో సరిపోల్చే సమయంలో తమ ఓటర్లు మిస్సవుతాయని ఆందోళన చెందుతున్నారు. చాలామంది కూలీలు తమ పాత పోలింగ్ స్టేషన్, ఇంటి నంబరు వివరాలు చెప్పలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాకు ఉన్న మరో ప్రత్యేకత సింగరేణి గనులు. ఇక్కడ పదవీ విరమణ పొందిన వేలాదిమంది కార్మికులు ఉన్నారు. వీరిలో పావు వంతు రెండు పేర్లు కలిగి ఉన్నారు. వీరి ఓట్ల విషయంలోనూ ఇపుడు గందరగోళం నెలకొంది. ఈ వివరాలపై అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నిచంగా అందుబాటులోకి రాలేదు. ఎస్ఐఆర్ సర్వే అనుకున్నంత వేగంగా కాకుండా వడివడిగానే సాగుతోంది. ఇప్పటివరకూ కరీంనగర్లో 20 శాతం, పెద్దపల్లిలో 18 శాతం, జగిత్యాలలో 19 శాతం, సిరిసిల్లలో 16శాతం మేర పూర్తయింది.ఉమ్మడి జిల్లా ఓటర్ల వివరాలు -
లెప్రసీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
బోయినపల్లి(చొప్పదండి): కుష్ఠువ్యాధి నిర్మూలనలో భాగంగా నిర్వహించే కుష్ఠి వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం ఇంటింటి సర్వేను ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర కుష్టు వ్యాధి నిర్మూలన అధికారి, రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ సుజాత పేర్కొన్నారు. మండలంలోని విలాసాగర్లో ఇంటింటి సర్వేను శుక్రవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఈనెల 31 వరకు జిల్లాలో స్పర్శ లేని రాగి రంగు గల మచ్చలను గుర్తించే సర్వే జరుగుతుందని తెలిపారు. ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, వైద్యాధికారులు సర్వేను పరిశీలించి రిపోర్టును జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి పంపించాలని సూచించారు. కుష్ఠురహిత జిల్లాను చేయాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, డీపీఎంవో సీహెచ్.శ్రీనివాస్, దేవుసింగ్, హెచ్ఈఓబీ మోహన్ పాల్గొన్నారు. -
బీజేపీతోనే ప్రజా సంక్షేమం
● పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ● నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులకు సన్మానంసిరిసిల్లటౌన్: ప్రజాసంక్షేమం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన బీజేపీ మద్దతుదారులను శుక్రవారం జిల్లా పార్టీ ఆఫీస్లో సన్మానించారు. 32 మంది సర్పంచులు, 30 మంది ఉపసర్పంచులు, 200 మంది వార్డు సభ్యులు విజయం సాధించారు. గోపి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీపై నమ్మకంతో బీజేపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారన్నారు. పార్టీ జిల్లా ఇన్చార్జి గంగిడి మోహన్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేశ్, మేర్గు హనుమంత్గౌడ్, పార్లమెంట్ కో–కన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, బండ మల్లేశం, బర్కం లక్ష్మి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ పాల్గొన్నారు. -
వెల్లివిరిసిన భక్తి పారవశ్యం
సిరిసిల్లటౌన్: శ్రీశాల క్షేత్రం భక్తి పారవశ్యంలో తేలియాడింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆండాళమ్మ సేవా నేత్రపర్వంగా జరిగింది. సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అశేష భక్తుల సమక్షంలో రాత్రి వేళలో ఆండాళమ్మ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, ప్రధాన అర్చకులు మాడంరాజు కృష్ణమాచార్యులు, జయవర్ధనాచార్యులు పాల్గొన్నారు. వేములవాడరూరల్: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం నుంచి డిప్యూటేషన్, ట్రాన్స్ఫర్పై వెళ్లిన ఉద్యోగులను తిరిగి మాతృసంస్థకు రప్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు ఆలయ ఉద్యోగుల యూనియన్ తరఫున శుక్రవారం విన్నవించారు. పెన్షన్ డిపాజిట్లను ప్రభుత్వం ద్వారా పెంచే విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): వృద్ధాప్యం శాపం కాదని..సహజమైన జీవన ప్రక్రియగా.. గౌరవంగా భావించాలని సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ పేర్కొన్నారు. మండేపల్లిలోని ప్రభు త్వ వృద్ధాశ్రమంలో హెల్పింగ్హార్ట్స్ వెల్ఫేర్ సొ సైటీ, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా శుక్రవారం వృద్ధులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పున్నంచందర్ మాట్లాడుతూలీ వయసులో సహజంగా కనిపించే ఒంటరితనం, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను సానుకూల దృక్పథంతో అధిగమించాలన్నారు. వృద్ధుల అనుభవాలు, మాటలకు తగిన విలువ ఇవ్వాలన్నారు. హెల్పింగ్హార్ట్స్ అధ్యక్షుడు అలువల ఈశ్వర్, అడ్వకేట్ దాసరి తిరుమల, ఏలగొండ ఆంజనేయులు, ఆశ్రమ కోఆర్డినేటర్ మమత పాల్గొన్నారు. వేములవాడరూరల్: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ సిబ్బందికి సీపీఆర్పై అవగాహన కల్పించారు. భీమేశ్వరసదన్లో ఎస్పీఎఫ్, హోంగార్డు, ఆలయ సిబ్బందికి.. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎలా చేయాలో చూపించారు. వైద్యులు నాగరాజన్, చీకోటి సంతోష్, దివ్య, రాకేశ్, లయన్స్ క్లబ్ సభ్యుడు చీకోటి శ్రీనివాస్, ఆలయ డీఈ రఘునందన్, ఏఈవో శ్రావణ్కుమార్, ఏఈ రామకృష్ణారావు, పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ తదితరులు పాల్గొన్నారు. వేములవాడరూరల్: మొబైల్యాప్లో యూరియా కొనుగోళ్లు చేయొచ్చని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్బేగం పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం హన్మాజిపేట, మర్రిపల్లి, వట్టెంల రైతువేదికల్లో శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. అఫ్జల్బేగం మాట్లాడుతూ మొబైల్ యాప్ ద్వారా యూ రియాను కొనుగోలు చేసే విధానాన్ని రైతులకు వివరించారు. బుకింగ్ పూర్తయిన వెంటనే బుకింగ్ ఐడీ లభిస్తుందని, దాన్ని చూపించి యూరియాను పొందవచ్చని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్బేగం, మండల వ్యవసాయ అధికారి వినీత, ఏఈవోలు దీపిక, అనూష, మసూద్ పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బీసీలవిజయబావుటా69749856120156224648212657జగిత్యాలకరీంనగర్పెద్దపల్లిసిరిసిల్లబీసీరిజర్వ్గెలిచినవి మొత్తంజనరల్లో బీసీలు -
తోడు కోసం..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మంచుదుప్పటి కమ్ముకుంటున్న వేళ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. చలి గజగజ వణికిస్తున్న సమయంలో పెద్దపులి వచ్చిందన్న వార్తలతో పల్లెల్లో వాతావరణం వేడెక్కింది. కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాంతంలో పెద్దపులి(టైగర్) పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు రాజన్నసిరిసిల్ల జిల్లా సరిహద్దులోని అడవిని ఆనుకుని ఉన్న గ్రామీణులను అప్రమత్తం చేస్తున్నారు. పెద్దపులి జిల్లాలోకి వచ్చిందన్న ప్రచారం నేపథ్యంలో పల్లెల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. వచ్చింది ఆడపులా.. మగపులా తెలియదు. అయితే తోడు కోసం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మేటింగ్ టైం.. శీతాకాలం ప్రధానంగా పెద్దపులులకు పునరుత్పత్తి సమయం కావడంతోనే తోడును వెతుక్కుంటూ జిల్లాలోకి ప్రవేశించి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. గతేడాది కూడా ఇదే సమయంలో ఈ ప్రాంతంలోకి పెద్దపులి వచ్చి వెళ్లింది. ఆ సమయంలోనూ అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మళ్లీ ఈ సంవత్సరం కూడా శీతాకాలంలోనే పులి వచ్చే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. జిల్లా సరిహద్దు మండలం దోమకొండ ప్రాంతంలో పొలాల వద్ద కట్టేసిన పశువులపై దా డిచేసిన సంఘటనలు దీనికి బలాన్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. పెద్దపులి నిత్యం 50 కిలోమీటర్లు సంచరిస్తుందని.. కాబట్టి జిల్లా సరిహద్దుల్లోని పల్లెప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అవగాహనతో అప్రమత్తం కామారెడ్డి–రాజన్నసిరిసిల్ల జిల్లాల సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాలు రత్నగిరిపల్లి, బంజేరుపల్లి, సోమారిపేట, గజసింగవరం, రాచర్లతిమ్మాపూర్, రాచర్లగుండారం, మద్దిమల్ల గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు పంట పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దంటున్నారు. అదే సమయంలో తమ పశువులను పొలాల వద్ద కాకుండా ఇంటి పరిసరాల్లోనే కట్టుకోవాలని సూచిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో చిరుతపులులు పొలాల వద్ద కట్టేసిన పశువులపై దాడిచేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు రైతులను, పల్లెప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పెద్దపులి మరింత ప్రమాదకారి కావడంతో రైతులు, పశువుల కాపరులు అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని సూచిస్తున్నారు. రాత్రి పూట పొలాల వద్దకు వెళ్లవద్దంటున్నారు. -
రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి
● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● వేములవాడ ఆలయాల విస్తరణ పనులపై సమీక్షసిరిసిల్ల: వేములవాడలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అ గ్రవాల్ ఆదేశించారు. శ్రీరాజరాజేశ్వరస్వామి, బద్ది పోచమ్మ ఆలయాల విస్తరణ పనులు, భీమేశ్వర ఆలయంలో భక్తులకు వసతుల కల్పనపై కలెక్టరేట్ నుంచి శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్లో సమీక్షించా రు. ఆర్అండ్బీ సీఈ రాజేశ్వరరెడ్డి, ఈఈ నరసింహాచారి, డీఈఈ శాంతయ్య, వీటీఏడీఏ సెక్రటరీ అన్సార్, డీఈఈ రఘునందన్ పాల్గొన్నారు. అప్రమత్తతోనే నష్ట నివారణ అప్రమత్తతతోనే విపత్తుల సమయంలో ప్రాణనష్టాన్ని నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణ, వైపరీత్యాల నివారణ నిర్వహణ చర్యలపై జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికారసంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ) అధికారులతో కలిసి మాట్లాడారు. ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు ప్రమాదబీమా సొమ్ము ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో గ్రూప్ ప్రమాద బీమా పత్రాలను ఇద్దరికి కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అందించారు. కోనరావుపేట మండలం కొలనూర్కు చెందిన కూన తిరుపతి ప్రమాదవశాత్తు మృతిచెందారు. అతడి భార్య కూన లావణ్యకు రూ.5 లక్షల బీమాపత్రాన్ని అందించారు. గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్కు చెందిన కుంట రమేశ్ ప్రమాదవశాత్తు మరణించగా.. అతడి తల్లి కుంట మల్లవ్వకు రూ.5లక్షల ప్రమాదబీమా చెక్కును పంపిణీ చేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య, చింతకింది పోచయ్య, కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు. -
ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవండి
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సిరిసిల్ల: ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు సూచించారు. మూడో విడత పంచాయతీ ఎ న్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ మద్దతుదారులైన సర్పంచ్లు, ఉపసర్పంచ్లను సిరిసిల్ల లోని తెలంగాణ భవన్లో శుక్రవారం సత్కరించా రు. కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెసోళ్లు ఎన్ని గెలిచారో గుర్తులేదన్నారు. నియోజకవర్గంలో 117 గ్రామాలుండగా.. 80 గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించడం గొప్ప విషయమన్నారు. కొన్ని గ్రామాల్లో మనోళ్లే ఇద్దరు, ముగ్గురు పోటీపడడంతో కొందరు ఓడిపోయారని.. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయని, అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. సిరిసిల్ల ప్రాంతంలో 57 ఎంపీటీసీ స్థానాలు, ఐదు జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయని.. క్లస్టర్ల వారీగా పార్టీ నాయకులు పనిచేసి విజయం సాధించాలన్నారు. ఎగిరింది గులాబీ జెండా సిరిసిల్ల గడ్డపై గులాబీ జెండా ఎగిరిందని, ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ మద్దతుదారులు అఖండ విజయం సాధించడం గర్వకారణమన్నారు. గంభీరావుపేట వంటి మండలాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని స్పష్టం చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ ‘పల్లెప్రగతి’ ద్వారా గ్రామాలను నందనవనాలుగా తీర్చిదిద్దారన్నారు. నేడు కాంగ్రెస్ పాలనలో ట్రాక్టర్లలో డీజిల్ పోయించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఈడీ బల్బులు మార్చే దిక్కు లేక పల్లెలు చీకటిగా మారాయని విమర్శించారు. బీఆర్ఎస్ సాధించిన విజయాన్ని చూసి భయపడి, ఇప్పుడు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కలిసికట్టుగా పనిచేయండి సర్పంచ్ ఎన్నికల సమయంలో వచ్చిన చిన్నపాటి విభేదాలను పక్కనపెట్టి, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ప్రతిష్ట కోసం పనిచేయాలని కేటీఆర్ కోరారు. 117 పంచాయతీల పరిధిలోని 57 ఎంపీటీసీ స్థానాలను క్లస్టర్ల వారీగా సమీక్షించుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గెలిచిన ప్రజాప్రతినిధులకు సంక్రాంతి తర్వాత శిక్షణ(వర్క్షాప్) ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’ చైర్మ న్ చిక్కాల రామారావు, రాజన్నసిరిసిల్ల జెడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ‘సెస్’ వైస్చైర్మన్ దేవరకొండ తిరుపతి, పార్టీ నాయకులు కల్వకుంట్ల గోపాల్రావు, వరుస కృష్ణహరి, రాజిరెడ్డి, సురేందర్రావు, వెంకటస్వామి, కుంబాల మల్లారెడ్డి పాల్గొన్నారు. -
మేడారం జాతరకు 700 బస్సులు
● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజుకరీంనగర్టౌన్: వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర కోసం రీజియన్ పరిధిలోని డిపోల నుంచి 700 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. శుక్రవారం బస్స్టేషన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీజియన్ పరిధిలో గోదావరిఖని, హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని డిపోల నుంచి జాతర బస్సులు ఉంటాయని తెలిపారు. ఆరు ఆపరేటింగ్ పాయింట్ల వద్ద అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు, ఎంపిక చేసిన బస్సులకు అవసరమైన మరమ్మతులు, జాతర విధులు నిర్వర్తించే సిబ్బంది ఎంపిక, భక్తుల సురక్షిత ప్రయాణం తదితర అంశాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్. భూపతి, పి.మల్లేశం, డిపో మేనేజర్లు నాగభూషణం, వెంకన్న, రవీంద్రనాథ్, విజయమాధురి, ఎం.శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, కె. కల్పన, ఎస్.మనోహర్, దేవరాజు, ప్రకాశ్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ, కాంగ్రెస్ మాటలయుద్ధం
సిరిసిల్ల అర్బన్: కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతలను దర్యాప్తు సంస్థలతో వేధించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ గురువారం జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసనదీక్షతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. బీజేపీ జిల్లా ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కార్యాలయంలోకి బీజేపీ నాయకులను వెళ్లనీయకపోవడంతో పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్పీ మహేశ్ బీ గీతేతోపాటు డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఇదే సమయంలో దీక్షా శిబిరానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేరుకొని పార్టీ శ్రేణులతో కలిసి నినాదాలు చేశారు. బీజేపీ నాయకులు ఆఫీస్లో నుంచి ప్రతినినాదాలు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మోదీ, అమిత్ షాలు దర్యాప్తు సంస్థలను తమ ప్రతీకార రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్నారు. జిల్లా గంథ్రాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ పాల్గొన్నారు. ధర్నా ఎందుకు చేస్తున్నారో వారికే తెలియదు నేషనల్ హెరాల్డ్ కేసు వేసిన సుబ్రహ్మణ్యస్వామికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా? అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ప్రశ్నించారు. బీజీపీ ఆఫీస్లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ కార్యాలయాల ముందు ధర్నా చేయాలని ఎందుకు పిలుపునిచ్చారో, ఎందుకు చేస్తున్నారో వారికే తెలి యదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తే, బీజేపీ నాయకులను పార్టీ ఆఫీస్లో బంధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. -
డ్రగ్స్తో భవిష్యత్ అంధకారం
● జిల్లా బాలల పరిరక్షణ అధికారి కవిత సిరిసిల్ల: డ్రగ్స్కు అలవాటుపడితే భవిష్యత్ అంధకారమవుతుందని జిల్లా బాలల పరిరక్షణ అధికారి కవిత పేర్కొన్నారు. అగ్రహారంలోని సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కో ఆర్డినేటర్ స్రవంతి మాట్లాడుతూ యువతులకు ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే చైల్డ్ హెల్ప్లైన 1098ను సంప్రదించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్చారి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్నకు ఎంపికతంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్ల వ్యవసాయ కళాశాల విద్యార్థి రమావత్ ఛత్రపతి జాతీయస్థాయి రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపికయ్యాడు. జిల్ల్లెల్లలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బాబు జగ్జీవన్ రామ్ అగ్రికల్చర్ కశాశాలలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇటీవల గుజరాత్లో నిర్వహించిన వెస్ట్జోన్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపులో ప్రతిభ కనబర్చి జాతీయ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపునకు ఎంపికయ్యాడు. స్వస్థలం నాగర్కర్నూలు జిల్లా. యూనివర్సిటీ వీసీ, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కేవీ సునీతాదేవి, కళాశాల ఎన్ఎస్ఎస్ ఇన్చార్జి డాక్టర్ ఆర్.సాయికుమార్, డాక్టర్ జి.ప్రియదర్శిని అభినందించారు. -
పనుల్లో నాణ్యత పాటించాలి
● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ● ఆలయ విస్తరణ పనులు పరిశీలనవేములవాడ: ఆలయ విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్న ప్రధాన ఆలయ రాజగోపురం నిర్మాణం, ఆలయ విస్తరణ పనులు, బద్ది పోచమ్మ ఆలయం, రాజగోపుర అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో గురువారం చర్చించారు. నిర్ణీత కాలంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నిత్య అన్నదానం భవనం, ఇతర అనుబంధ నిర్మాణాలపై పెట్టాలన్నారు. కొత్తగా నిర్మించబడుతున్న భవనాల వద్ద భక్తులకు సరిపడా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఇంజినీర్లు కె.రాము, వి.నరసింహాచారి, శ్రీధర్రెడ్డి, రవీందర్రెడ్డి, శాంతయ్య, ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్, డీఈలు రఘునందన్, మహిపాల్రెడ్డి, ఏఈవోలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు. -
కలిసొచ్చిన అదృష్టం
వీర్నపల్లి(సిరిసిల్ల): అదృష్టం వెంటే ఉంటుందనే దానికి ఇతనే నిదర్శనం. వీర్నపల్లి మండలం భూక్యతండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన రమావత్ శ్రీకాంత్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. శ్రీకాంత్తోపాటు మరో ఏడుగురు సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేయగా.. ఆరుగురు విత్డ్రా చేసుకున్నారు. మిగిలిన ఒకరు శ్రీకాంత్ సైతం తన నామినేషన్ను ఉపసంహరించుకునేందుకు కేంద్రానికి వెళ్లగా మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీలో నిలబడ్డారు. నామినేషన్ను విత్డ్రా చేసుకునేందుకు ఒప్పుకున్నాం కదా.. అని నామమాత్రంగా పోటీకాకుండా బరిగీచి నిలబడ్డారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో మొత్తం ఓట్లు 548 ఉండగా 447 పోలయ్యాయి. నాలుగు ఓట్లు చెల్లకపోగా, రెండు పోస్టల్బ్యాలెట్లు పడ్డాయి. రమావత్ శ్రీకాంత్కు 222 ఓట్లు రాగా, మాలోత్ మదన్లాల్కు 219 ఓట్లు వచ్చాయి. మూడు ఓట్ల మెజార్టీతో శ్రీకాంత్ విజయం సాధించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు కలిసొచ్చిన అదృష్టాన్ని గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. గ్రామస్తులను అందరిని కలుపుకుపోయి సమస్యలు పరిష్కరిస్తానని, అదృష్టంగా గెలిచామని కాకుండా కష్టాన్ని నమ్ముకొని గ్రామస్తుల నమ్మకాన్ని గెలుస్తానన్నారు. -
ఆయిల్పామ్ సాగు పెంచాలి
● ఫెర్టిలైజర్ యాప్పై అవగాహన కల్పించాలి ● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: జిల్లాలోని రైతులకు ఫర్టిలైజర్ యాప్పై అవగాహన కల్పించాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. చంద్రంపేట రైతువేదికలో గురువారం ఫెర్టిలైజర్ యాప్పై అవగాహన, ఆయిల్పామ్ సాగు విస్తీర్ణ లక్ష్యాల సాధనపై సంబంధిత అధికారులు, డీలర్లకు అవగాహన కల్పించారు. ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్తో కలిగే ఉపయోగాలను రైతులకు వివరించాలన్నారు. యాప్ వినియోగంతో ఎరువుల వివరాలు, ఎక్కడ అందుబాటులో ఉందోననే సమాచారం తెలుస్తుందన్నారు. యాప్పై రైతులకు అవగాహన కల్పించేందుకు షాపుల యజమానులు ఒకరిని నియమించాలని సూచించారు. జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, ఉద్యానవనశాఖ అధికారి శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. -
గజగజ..పదపదా!
ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ బడుగుజీవులు తమ బతుకుపోరాటం చేస్తున్నారు. స్వెట్టర్లు, కూరగాయలు, పాలవ్యాపారులు ఉదయం నుంచే తమ దినచర్యను ప్రారంభిస్తున్నారు. పాలవ్యాపారులు అయితే తెల్లవారుజాము నుంచే తమ వ్యాపారంలో భాగంగా పల్లెల నుంచి సిరిసిల్లకు వచ్చి వీధుల్లో పాలు విక్రయిస్తున్నారు. పలువురు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉదయం పూట వాకింగ్కు వెళ్తున్నారు. ఇలా పలు రకాల వారు చలిని సైతం లెక్కచేయకుండా ముందుకెళ్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల -
రూ.38.40 కోట్లు
ఎన్నికల కిక్కుసిరిసిల్ల: జిల్లాలో లిక్కర్ వ్యాపారులకు గ్రామపంచాయతీ ఎన్నికల కిక్కు లక్కులా మారింది. డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రావడంతో లక్కీ లాటరీల్లో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారులకు ఆరంభంలోనే పంచాయతీ ఎన్నికల సీజన్ తాకింది. అంతే.. మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబరు 1వ తేదీ నుంచి 17 వరకు జిల్లాలో భారీ ఎత్తు మద్యం విక్రయాలు సాగాయి. ఆబ్కారీ శాఖ అంచనాలకు మించి మద్యం అమ్మకాలు సాగాయి. గతేడాది డిసెంబరుతో పోల్చితే 70 శాతం అదనపు లిక్కర్ విక్రయాలు సాగినట్లు తెలుస్తోంది. బెల్ట్ షాపులు మూసినా.. వైన్స్లు బంద్ చేసినా.. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే నవంబరు 26వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా బెల్ట్షాపులపై పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. గ్రామాల్లో బెల్ట్షాపుల్లో లిక్కర్ విక్రయానికి వీలులేదని హెచ్చరిస్తూ.. నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈనేపథ్యంలో జిల్లాలో సుమారు 1,260 బెల్ట్షాపులు మూతపడ్డాయి. మరోవైపు ఎన్నికలకు 48 గంటల ముందే ఆయా ప్రాంతంలోని మద్యం దుకాణాలను మూసివేశారు. కానీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ముందే మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి రహస్య ప్రాంతాల్లో నిల్వచేశారు. అత్యవసరమైతే మద్యం షాపులు తెరిచి ఉన్న ప్రాంతాల నుంచి లిక్కర్ను తెచ్చుకున్నారు. దీంతో మద్యం అమ్మకాలకు లోటు లేకుండా పోయింది. పోలీసుల ఆంక్షలు, ఎక్సైజ్ శాఖ నిఘా మధ్య జిల్లాలో లిక్కర్ విక్రయాలు ఏమాత్రం తగ్గలేదు. సిరిసిల్లదే అగ్రస్థానం మద్యం విక్రయాల్లో సిరిసిల్ల సర్కిల్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 18 షాపులు, నాలుగు బార్లు ఉండగా.. 17 రోజుల్లో రూ.15.27 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. వేములవాడ ప్రాంతంలో 16 వైన్షాపులు, నాలుగు బార్లు ఉండగా.. రూ.13.21 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఎల్లారెడ్డిపేట సర్కిల్ పరిధిలో 14 మద్యం దుకాణాలు ఉండగా.. రూ.9.92కోట్ల విక్రయాలు సాగాయి. ఇలా జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది డిసెంబరులో.. ఏటా డిసెంబరులో కొత్త సంవత్సర సంబరాల సందర్భంగా విక్రయాలు జోరుగా సాగుతాయి. దసరా పండగతో పోటీపడుతూ డిసెంబరు 31వ తేదీ రాత్రి మందు, విందులకు భారీగా లిక్కర్ అమ్మకాలు సాగుతాయి. 2024 డిసెంబరులో జిల్లాలో రూ.53.22కోట్ల వ్యాపారం సాగింది. ఇందులో సిరిసిల్ల సర్కిల్లో రూ.19.65కోట్లు, ఎల్లారెడ్డిపేటలో రూ.16.80కోట్లు, వేములవాడ సర్కిల్లో రూ.16.78 కోట్ల విక్రయాలు జరిగాయి. డిసెంబరు ముగింపునకు ఇంకా 13 రోజులు బాకీ ఉండగానే.. 17 రోజుల్లోనే రూ.38.40 కోట్ల మద్యం అమ్మకాలు జరగడం విశేషం. ఎకై ్సజ్శాఖ అధికారుల అంచనాల ప్రచారం గతేడాదితో పోల్చితే.. డిసెంబరు 17వ తేదీ నాటికి 70 శాతం మేరకు మద్యం అమ్మకాలు అదనంగా సాగినట్లు భావిస్తున్నారు. డిసెంబరు 31వ తేదీ నాటికి అంచనాలకు మించి మద్యం అమ్మకాలు ఉంటాయని భావిస్తున్నారు. ఏది ఏమైనా కొత్తగా మద్యం షాపులను లక్కీ లాటరీల్లో దక్కించుకున్న వ్యాపారులకు మాత్రం గ్రామపంచాయతీ ఎన్నికలు వరంలా మారాయి. రానున్న రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీసీటీ సభ్యుల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయనే ఊహాగానాల మధ్య ఈ ఏడాది లిక్కర్ దందాకు అదనపు కిక్కు ఉంటుందని వ్యాపారులు భావిస్తున్నారు.సిరిసిల్లలోని వైన్షాపువైన్షాపులు : 48, బార్లు : 08 విక్రయాలు : 34,804 కేసులు బీర్ల అమ్మకాలు : 42,211 కేసులు మద్యం విక్రయాల విలువ : రూ.38.40 కోట్లు -
ఎన్నికల సిత్రాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): ఎన్నికల్లో ప్రతీ ఓటు ఎంతో కీలకం. స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన నాయకులు ఉన్నారు. తుర్కపల్లిలో కాశోల్ల పద్మ రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. రొడ్డ భాగ్యమ్మ సర్పంచ్గా గెలుపొందారు. పద్మ బంధువులు ముగ్గురు అనారోగ్యంతో ఉండడంతో ఓట్లు వేయలేకపోయారు. వారు వేసి ఉంటే ఒక్క ఓటుతోనైన పద్మ గెలిచేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. చీకోడులో బీఆర్ఎస్కు చెందిన పడిగె ఆంజనేయులు, బొమ్మెన ఆంజనేయులు తలపడ్డారు. పడిగె ఆంజనేయులపై 5 ఓట్ల మెజార్టీతో బొమ్మెన ఆంజనేయులు గెలుపొందారు. గూడెంలో కొమ్ము బాలయ్య 1,139 ఓట్లు సాధించినా 85 ఓట్లు వెనకపడ్డారు. రామలక్ష్మణపల్లెలో 36 ఓట్ల తేడాతో కోటగిరి ఎల్లవ్వ గెలుపోందారు. రామ్రెడ్డిపల్లెలో లక్ష్మి 27 ఓట్లతో గెలిచారు. మొర్రాయిపల్లెలో మెంగని శ్రీనివాస్ 338 ఓట్లు సాధించగా, ప్రత్యర్థి మల్లారం రాజు 328 ఓట్లు సాధించి 10 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.ముస్తాబాద్(సిరిసిల్ల): మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు.. ఇప్పుడు సర్పంచుగా ఎన్నికయ్యాడు. ముస్తాబాద్ మండలం గూడెం సర్పంచ్గా ఎన్నికై న తాటిపల్లి శంకర్ గతంలో ముస్తాబాద్ ఎంపీపీగా పనిచేశారు. 2004 ఆగస్టు 26 నుంచి 2006 జూలై 21 వరకు రెండేళ్లపాటు ఎంపీపీగా పనిచేశారు. గూడెం ఎంపీటీసీగా ఎన్నికై న శంకర్.. అప్పటి ఎంపీపీ మంత్రి రాజంపై పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో వైస్ ఎంపీపీగా ఉన్న కల్వకుంట్ల గోపాల్రావు ఐదు నెలలపాటు ఎంపీపీగా కొనసాగారు. అనంతరం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో గూడెం ఎంపీటీసీగా ఉన్న తాటిపల్లి శంకర్ను ఎంపీపీగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో శంకర్ 85 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వారు ముగ్గురు పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ముగ్గురు ఒక్కో పార్టీలో నాయకులుగా ఎదిగారు. బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు మిత్రులు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ అభ్యర్థులుగా వివిధ పార్టీల మద్దతుతో బరిలోకి దిగారు. 1991–92 పదోతరగతి బ్యాచ్కు చెందిన ఎలగందుల నర్సింలు, శనిగరపు బాల్రాజు, కొర్రి రమేశ్ ఎల్లారెడ్డిపేట మేజర్ పంచాయతీ పోరులో తలపడ్డారు. చివరికి 432 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎలగందుల నర్సింలు గెలుపొందారు. అలాగే వెంకటాపూర్లో ముగ్గురు క్లాస్మేట్స్ తలపడ్డారు. మామిండ్ల తిరుపతిబాబు తల్లి నర్సవ్వ, మేడిశెట్టి బాలయ్య భార్య పద్మ, రుద్రోజు వినీల పోటీపడ్డారు. వీరిలో మేడిశెట్టి పద్మ గెలుపొందారు. -
రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 20257వేములవాడ: రాజన్న ఆలయంలో గురువారం రాత్రి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. 365 మృతికలను లింగాకారంలో పేర్చి పూజలు నిర్వహించారు.సిరిసిల్లటౌన్: పీఎం జీవనజ్యోతి పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని పద్మశాలీ జాతీ య సేవాదళం కన్వీనర్ ఎల్ల పాండు కోరారు. సిరిసిల్లలో గురువారం అవగాహన కల్పించారు. పొద్దంతా ఎండగా ఉంటుంది. జిల్లాలో వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రివేళ ఈదురుగాలులు వీస్తాయి. -
నేడు సిరిసిల్లకు కేటీఆర్
సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు శుక్రవారం జిల్లాకు వస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ మద్దతుదారులైన సర్పంచ్లను సన్మానించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈమేరకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిరిసిల్లటౌన్/బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, లింగ నిర్ధారణ నేరమని డీఎంహెచ్వో డాక్టర్ రజిత అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గర్భస్థ పిండ లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 27 స్కానింగ్ కేంద్రాలు పనితీరుపై చర్చించారు. ఏడు స్కానింగ్ సెంటర్ల రెన్యూవల్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వైద్యులు నాగేంద్రబాబు, సంపత్కుమార్, ఎన్జీవో ప్రెసిడెంట్ చింతోజ్ భాస్కర్, డెమో రాజ్కుమార్, సీహెచ్వో బాలచంద్రం, మహేశ్ పాల్గొన్నారు. సాధారణ ప్రసవాలు పెంచాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని డీఎంహెచ్వో రజిత సూచించారు. మండలంలోని విలాసాగర్, బోయినపల్లి పీహెచ్సీ లను గురువారం తనిఖీ చేశారు. కేంద్ర ఆరోగ్య పథకాల పనితీరుపై సిబ్బందితో సమీక్షించారు. ఆడపిల్లల జననాలు(సెక్స్ రేషియో) తక్కువగా ఉండడానికి కారణాలపై సమీక్షించి, లక్ష్యాలు సాధించాలన్నారు. వైద్యులు నాగేంద్రబాబు, అనిత, నయీమా పాల్గొన్నారు. వేములవాడ: ప్రజలకు సేవ చేసి అభిమానం సంపాదించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం సూచించారు. వేములవాడ బార్ అసోసియేషన్కు చెందిన నలుగు రు అడ్వకేట్లు ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలు పొందడంతో వారిని గురువారం సన్మానించా రు. బోయినపల్లి మండలం దుండ్రపల్లి సర్పంచ్గా ఎన్నికై న జంగం అంజయ్య, నాగయ్యపల్లి వార్డుమెంబర్గా గెలిచిన తోట శేఖర్, మల్లారం వార్డు సభ్యుడిగా ఎన్నికై న మారుముఖం అనిల్, అనంతపల్లి వార్డు సభ్యుడిగా ఎన్నికై న అనిల్ను సన్మానించారు. ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు జనార్దన్ పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: ఆశవర్కర్లకు రావలసిన లెప్రసీ, పల్స్పోలియో, ఎలక్షన్ డ్యూటీలు, ఇతర స ర్వేలకు సంబంధించిన పెండింగ్ డబ్బులు అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. ఆశవర్కర్లతో కలిసి గురువా రం కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బదవేని మంజుల, కార్యదర్శి జయశ్రీల, గా యత్రి, జమున, లత, లావణ్య పాల్గొన్నారు. -
అసైన్మెంట్ భూములపై ఆరా
సిరిసిల్ల: జిల్లాలో అసైన్మెంట్ భూములపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లాలోని గ్రామాల వారీగా ఉన్న అసైన్డ్ భూములు, పట్టాభూములు, ప్రభుత్వ భూముల వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు. ధరణి పోర్టల్కు భూభారతి పోర్టల్ లెక్కలకు తేడాలు ఉండడంతో క్షేత్రస్థాయి సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డుల్లోనూ తేడాలు సవరించేందుకు మండలాలవారీగా రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆన్లైన్ రికార్డులను, మ్యానువల్ రికార్డులను సరిచూస్తున్నారు. మరోవైపు సర్వేనంబర్ల వారీగా పరిశీలిస్తే.. రికార్డుల్లో ఎక్కువ భూమి నమోదైనట్లు తేలింది. అదనపు భూమి విస్తీర్ణం ఎలా వచ్చిందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. భూములకు సంబంధించిన పాతరికార్డులనూ ఆరా తీస్తున్నారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఇదే పనిలో కలెక్టరేట్లో నిమగ్నమయ్యారు. గ్రామాలవారీగా, సర్వే నంబర్లవారీగా భూరికార్డులను, అసైన్మెంట్ భూముల వివరాలను సేకరిస్తూ.. సంస్కరించే పనిలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం బిజీగా ఉంది. -
కాంగ్రెస్, బీజేపీలు గ్రామాలను నిర్లక్ష్యం చేశాయి
● బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి ● పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యసిరిసిల్ల అర్బన్: కాంగ్రెస్, బీజేపీలే గ్రామాలను నిర్లక్ష్యం చేశాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. సిరిసిల్లోని తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలోని 117 గ్రామాలకు 80 గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కే దక్కిందన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కేవలం 24 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ 13 స్థానాలే గెలిచిందన్నారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని గొప్పలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో ఉంటాయి కాబట్టి ప్రజలు ఏకపక్షంగా బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మణ్రావు, పార్టీ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, ఎండీ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. -
బాహుబలిపై మీరేమంటారు?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రామగుండం కోల్మైన్ ఏర్పాటులో ముందడుగు పడింది. సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు లేదా బాహుబలి ఓపెన్కాస్ట్గా పిలుస్తోన్న రామగుండం కోల్మైన్ కోసం శుక్రవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. మంథని జేఎన్టీయూ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. ప్రాజెక్టు కోసం మొత్తం 4,326.08 హెక్టార్ల భూమి అవసరం అవనుంది. ప్రస్తుతం సింగరేణి వద్ద 3,266.88 హెక్టార్ల వరకు భూమి అందుబాటులో ఉంది. (అందులో 397.9 హెక్టార్ల అటవీ భూమి, 2,868 అటవీయేతర భూమి) అదనంగా 1,059.2 హెక్టార్ల భూమి (అందులో 305 హెక్టార్ల అటవీ భూమి, 753 హెక్టార్లు అటవీయేతర భూమి) అవసరం అవుతుంది. ఈ భూమి కూడా ఇప్పటికే సింగరేణి పరిధిలోనే ఉంది. రామగుండం కోల్మైన్ అనేది భారీ ప్రాజెక్టు. ఇందులో నాలుగు ఆపరేటివ్ మైన్స్ విలీనమవుతున్నాయి. అందులో రామగుండం ఓపెన్కాస్ట్ –1, ఎక్స్టెన్షన్ ఫేజ్–2, రామగుండం ఓపెన్కాస్ట్–2, అడ్రియాల షాప్ట్ అండర్గ్రౌండ్ కోల్మైనింగ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు, వకీల్పల్లి మైన్తోపాటు మూసివేసిన 10వ ఇంక్లైన్ గనులను కలిపి భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుగా ఆవిర్భవించనుంది. ఇలాంటి ప్రాజెక్టు సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా సరికొత్త రికార్డు సృష్టించనుంది. పర్యావరణ సమస్యలపైనే ప్రజాభిప్రాయం.. బాహుబలి గనినుంచి దాదాపు 600 మిలియన్ టన్నుల వరకు బొగ్గు నిక్షేపాలను తీయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు ఏటా 21 మిలియన్ టన్నులపాటు బొగ్గును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టులో భాగంగా మూసివేసిన 10 ఇంక్లైన్ భూగర్భ గనిని ఓపెన్కాస్ట్గా మార్చనున్నారు. అనంతరం ప్రస్తుతం భూగర్భగనిగా పనిచేస్తున్న వకీల్పల్లి మైన్ను కూడా ఓపెన్కాస్ట్గా మారుస్తారు. ఇంతటి భారీ గని కారణంగా చుట్టుపక్కల పల్లెల్లో ప్రజలు దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడతారని, వ్యవసాయం, పాడిపంటలు, సంప్రదాయల కులవృత్తులు, జీవనోపాధులు దెబ్బతింటాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లక్రితం ఈ ప్రాజెక్టు కోసం తమ గ్రామాల్లో భూసేకరణ చేసేటప్పుడు పునరావాసంతోపాటు, సింగరేణిలో కొలువులు కల్పిస్తామన్న అధికారులు ఇంతవరకూ మాట నిలబెట్టుకోలేదని ఆయా గ్రామాల ప్రజలు గుర్తుచేస్తున్నారు. పర్యారవణం మాట అటుంచితే.. తమకు బతుకుదెరువు కరువైందని వాపోతున్నారు. అదే సమయంలో సాధారణంగా విద్యుదుత్పత్తి కోసం టన్ను బొగ్గును కాల్చినప్పుడు దానిలోని కార్బన్, ఆక్సిజన్తో కలిసి సుమారు 2.2 నుంచి 2.9 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ను విడుదల చేస్తుంది. ఇదీకాక ఆమ్లవర్షాలకు కారణమైన సల్ఫర్ డైయాకై ్సడ్, నైట్రోజన్ ఆకై ్సడ్ ఉద్గారాలకు కూడా కారణమవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభావిత గ్రామాల ప్రజల ప్రధానమైన డిమాండ్లు ● దుమ్ముతో వస్తున్న శ్వాసకోశ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి ● ఓపెన్కాస్టు ప్రాజెక్టులో బ్లాస్టింగ్ల వల్ల ప్రభావిత గ్రామమైన జూలపల్లి, ముల్కలపల్లి గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు ● కిడ్నీల సమస్యలతోపాటు వివిధ రకాలుగా రోగాలకు గురవుతూ అనారోగ్యాల బారిన ప్రజలు పడుతున్నారు ● సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ముల్కలపల్లి గ్రామాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ రేడియేషన్ వల్ల కూడా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు ● భూసేకరణ వల్ల నిర్వాసితులైన గీత కార్మికులు, ఇతర నిరుద్యోగులకు జీవనోపాధి, వైద్యసదుపాయాలను కల్పించలేదు ● సింగరేణి విడుదల చేసే డీఎంఎఫ్టీ నిధులను కేవలం ప్రభావిత గ్రామాల అభివృద్ధికి మాత్రమే దోహదపడేలా చర్యలు తీసుకోవాలి. నేడు మంథని జేఎన్టీయూలో పీసీబీ ప్రజాభిప్రాయసేకరణ హాజరవుతున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తొమ్మిది గ్రామాల్లో భూమి వెయ్యి హెక్టార్లలో ప్రాజెక్టు ఏటా 21 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు, స్థానికుల ఆందోళన -
ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు
పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న మాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు వీలుగా వేడినీటిని కూడా అందుబాటులో ఉంచారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలయ్యేలోపే అల్పాహారం తిన్నాం. – మాధవి, ఉపాధ్యాయురాలు ఏర్పాట్లు బాగున్నాయ్ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఎలిగేడు మండలం నర్సాపూర్ వచ్చా. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చినం. మాకు రాత్రిబస చేసేందుకు అవసరమైన అన్నిఏర్పాట్లు చేశారు. ఇబ్బందులు కలుగకుండా స్థానిక అధికారులు, సిబ్బంది సహకారం అందించారు. – భాగ్యలక్ష్మి, జూనియర్ లెక్చరర్ సంతృప్తిగా ఉంది పంచాయతీ ఎన్నికల విధులను నిర్వహించడం సంతృప్తినిచ్చింది. పోలింగ్ సమయానికల్లా సిద్ధంగా ఉండేంలా సామాగ్రితో ముందురోజు మధ్యాహ్నం వరకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాం. ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బందులు కలెగకుండా స్థానిక అధికారులు తీసుకున్న చర్యలు ఎంతో సంతృప్తినిచ్చాయి. –సామ శిరీష, ఉప్పట్ల, మంథని -
తెలుగులో తీర్పుతో గుర్తింపు
1986 నుంచి కరీంనగర్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే 1992లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షలో విజయం సాధించారు గొట్టె రవీందర్. ఆదిలాబాద్, సిర్పూర్, వరంగల్లో విధులు నిర్వర్తించారు. పదోన్నతిపై సీనియర్ ఏపీపీగా నర్సంపేటలో బాధ్యతలు నిర్వహిస్తూ 2004లో తిరిగి జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. కర్నూలు, డోన్లో పనిచేశారు. సీనియర్ సివిల్ జడ్జిగా 2013లో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, నాంపెల్లి కోర్టులో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. తెలుగులో తీర్పునిచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. – గొట్టె రవీందర్, విశ్రాంత న్యాయమూర్తి సేవ చేయాలన్న సంకల్పంతో... విద్యార్థి దశ నుంచే నెహ్రూ యువకేంద్రం ద్వారా సామాజిక సేవలపై ఆసక్తి పెరిగింది ఆసాని జయశ్రీకి. టీచర్గా పనిచేసిన తండ్రి రాజారెడ్డి స్వచ్ఛంద సేవలే స్ఫూర్తిగా న్యాయవిద్యను పూర్తి చేశారు. 1996లో న్యాయవాదిగా నమోదై.. మెట్పల్లిలో నాలుగేళ్లపాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం కుటుంబంతోపాటు కరీంనగర్కు షిఫ్ట్ అయ్యారు. స్థానికసంస్థల్లో సర్పంచ్లు, వార్డుసభ్యులకు పలు మార్లు శిక్షణ ఇచ్చారు. జ్యుడీషియల్ శాఖలోకి 2015లో అడుగుపెట్టి పెద్దపల్లి, కరీంనగర్, ప్రస్తుతం సిరిసిల్లలో విధులు నిర్వహిస్తున్నారు. – ఆసాని జయశ్రీ, స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ -
గల్ఫ్లో గుండెపోటుతో ఎల్లారెడ్డిపేటవాసి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సొంతూరిలో ఉపాధిలేక బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన ఓ వలసజీవి గుండెపోటుకు గురై మృతిచెందాడు. ఈ సంఘటనతో ఎల్లారెడ్డిపేటలో విషాదం అలుముకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చెన్ని బాలనర్సు(40) గత 15 ఏళ్లుగా దుబాయ్ వెళ్తున్నాడు. గురువారం ఎప్పటిలాగే కంపెనీలో పనిచేస్తుండగా గుండెపోటు రావడంతో వెంటనే హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. బాలనర్సు మిత్రులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుని భార్య దేవ కన్నీటిపర్యంతమైంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులను ఆమె వేడుకుంటుంది. వలస కార్మికుడు ఆత్మహత్యరుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం రాత్రి వలస కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. ఉత్తరప్రదేశ్ నుంచి రుద్రంగికి వచ్చిన వలసకార్మికుడు సన్ని(25) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. రుద్రంగి పోలీసులు శవ పంచనామా చేసి మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటవీశాఖ అధికారిపై దాడిజగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ సెక్షన్ అధికారి సాంబయ్యపై దాడి జరిగినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజర్ రవికుమార్ తెలిపారు. రంగపేట అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా సాంబయ్య అడవిలోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి గొడ్డలితో కన్పించగా సాంబయ్య అతడిని మందలించాడు. దీంతో కోపంతో రాకేశ్ గొడ్డలితో సాంబయ్యపై దాడిచేశాడని, ఘటనలో సాంబయ్య చేతివేళ్లకు గాయాలయ్యాయని తెలిపారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులురాయికల్: రాయికల్ పట్టణంలో ఓ బాల్య వివాహాన్ని 1098 ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో పట్టణానికి చెందిన అబ్బాయి, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి వధూవరుల వయసును పరిశీలించారు. వధువు వయసు తక్కువగా ఉండటంతో మేజర్ అయ్యేంత వరకు వివాహం చేయొద్దని 1098 కౌన్సిలర్ శ్రీనివాస్, సోషల్ వర్కర్ రాణి, గంగాధర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వివాహం వాయిదా పడింది. -
వకీల్పల్లి
తంగళ్లపల్లి నుంచి అనేక మంది న్యాయవాదులుగా రాణిస్తున్నారు. దోర్నాల లక్ష్మారెడ్డి న్యాయవాద వృత్తిలో ఉంటూనే టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల్లో క్రియాశీల రాజకీయ నాయకుడిగా కొనసాగారు. పాతికేళ్ల క్రితమే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా సేవలందించారు. ప్రస్తుతం సబ్బని రవీందర్, కోడం సత్యనారాయణ, కోడం సురేశ్, దోర్నాల సంజీవ్రెడ్డి, దోర్నాల జనార్దన్రెడ్డి, కోడి లక్ష్మణ్, సబ్బని రమేశ్ (కరీంనగర్), బండి చైతన్యగౌడ్, ిసీనియర్ న్యాయవాదులుగా కొనసాగుతున్నారు. ఇటీవల పలువురు జూనియర్ న్యాయవాదులు తక్కళ్ల సారిక, సుహాసిని, వినీత, ఆకుల శ్రీనివాస్, బొల్లారం ప్రదీప్, గజభీంకార్ సృజన, పసుల వంశీ ఇటీవలనే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాణించిన న్యాయవాదులు -
60 ఏళ్ల ప్రాక్టీస్
వైద్య ఉమాశంకర్ ఊరిలో తొలి న్యాయవాది. 1965 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మక్తల్ తహసీల్దార్గా వ్యవహరించిన తండ్రి వీరప్ప తన ఆరేళ్ల వయసులో కన్నుమూశారు. ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు, పురిటిగడ్డను వీడకుండా న్యాయవాద వృత్తిని ఎంచుకుని సివిల్ కేసుల్లో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. నిరంతర శ్రమతో సామాన్యులకు న్యాయం చేయాలన్న సదుద్దేశంతో సాధన చేస్తే మంచి అడ్వకేట్గా మారొచ్చు అనేది ఈ తరానికి ఆయన ఇచ్చే సందేశం. – వైద్య ఉమాశంకర్ ఉద్యమస్ఫూర్తితో.. 1988లో న్యాయవాదిగా నమోదై.. ఆరేళ్లు ప్రాక్టీస్ చేశారు. 1994 మేలో పీపీగా, జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. నంద్యాలలో తొలి పోస్టింగ్. రాష్ట్రం విడిపోకముందే తెలంగాణ న్యాయమూర్తుల సంఘాన్ని స్థాపించి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉద్యమాలకు నేతృత్వం వహించారు. పదేళ్లపాటు హైకోర్టు ఉమ్మడిగా ఉండాలన్న నిర్ణయంపై.. న్యాయవ్యవస్థ కూడా వేరుపడాలని 2015లో సుప్రీంకోర్టులో రిట్వేశాం. 2016లో 250 మంది న్యాయమూర్తులు కలిసి మహాధర్నా నిర్వహించారు. దీంతో సస్పెన్షన్కు గురయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు, అప్పటి గవర్నర్ చొరవతో నెల రోజుల తరువాత సస్పెన్షన్ ఎత్తేశారు. తీవ్రమైన న్యాయ సంక్షోభాన్ని సృష్టించడంతో రెండు నెలల్లో న్యాయవ్యవస్థను విభజించాలంటూ 2018 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 2019లో అమలులోకి వచ్చింది. 2024 జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. – వైద్య వరప్రసాద్, విశ్రాంత న్యాయమూర్తి -
15ఏళ్ల బాలుడికి బ్లడ్ కేన్సర్ నుంచి విముక్తి
కరీంనగర్: కరీంనగర్కు చెందిన 15ఏళ్ల బాలుడు బ్లడ్ కేన్సర్తో బాధపడుతుండగా సోమాజిగూడ యశోద హాస్పిటల్స్లో అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా నిర్వహించినట్లు హెమటో– అంకాలజీ– బీఎంటీ వైద్యుడు కె.అశోక్కుమార్ తెలిపారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు. గురువారం కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్స్లోని హెమటాలజీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో లుకేమియా, లింఫోమాస్, మల్టీపుల్ మైలోమా, అప్లాస్టిక్ అనీమియా, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్ వంటి కేన్సర్, రక్త రుగ్మతలకు పెద్దలు, పిల్లలకు సమగ్ర చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో ఇప్పటివరకు 400కు పైగా విజయవంతమైన బీఎంటీలను నిర్వహించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి హెమటాలజీ సేవలను అందించడమే లక్ష్యంగా యశోద హాస్పిటల్స్ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. -
వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని బిర్లా ఓపెన్మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుంది. ఈమేరకు గురువారం స్కూల్ చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, యూనివర్సిటీ ప్రతినిధి వినోద్లు ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాధారిత విద్యతో పాటు భవిష్యత్ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో వాక్సెన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ద్వారా రెండు సంస్థలు కలిసి విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో విద్యాబోధన అందుబాటులోకి వస్తుందన్నారు. వాక్సెన్ యూనివర్సిటీ ప్రతినిధి వినోద్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. బిర్లా స్కూల్ అమలు చేస్తున్న విద్యాప్రమాణాలు, వినూత్న కార్యక్రమాలను అభినందించారు. -
వేడినీళ్లు.. నోరూరించే టిఫిన్లు
పెద్దపల్లిరూరల్: గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల సిబ్బంది వసతి, సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పక్కా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకున్నారు. పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విధులను నిర్వహించేందుకు వచ్చిన పోలింగ్ అధికారులు, ఓపీవోలు, మెడికల్, పోలీసు, తదితర సిబ్బందికి అవసరమైన వసతీసౌకర్యాలు మెరుగ్గా కల్పించారు. 85 పంచాయతీల్లో ఎన్నికలు.. జిల్లాలో ఆఖరువిడత పంచాయతీ ఎన్నికల్లో 85 సర్పంచ్, 636 వార్డు స్థానాల కోసం నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఇందులో 128 మంది పోలింగ్ అధికారులు, 166 మంది ఓపీవో తదితర సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను ఆయా కేంద్రాల సమీపంలో కల్పించారు. వణికిస్తున్న చలిలో ఉదయమే స్నానం చేసేందుకు వీలుగా వేడినీటిని కూడా అందించారు. నోరూరించే అల్పాహారం, రుచికరమైన భోజనం అందించినట్లు పలువురు ఎన్నికల సిబ్బంది చెప్పారు. ఏర్పాట్లపై కొందరిని పలుకరించగా.. కడుపునిండా రుచికరమైన భోజనం ఎన్నికల విధుల నిర్వహణ తృప్తినిచ్చింది పోలింగ్, లెక్కింపు కేంద్రాల్లో సౌకర్యాలు భేష్ స్థానిక అధికారుల సహకారంతో సమస్యలు దూరం ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల మనోగతం -
పల్లెల్లో గులాబీ జోష్
సిరిసిల్ల: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాలు సా ధించారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో 87 గ్రామాలు ఉండగా ఏడు ఏకగ్రీవమయ్యాయి. 80 సర్పంచ్ స్థానాలకు, 551 వార్డు సభ్యుల స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. రాత్రి వరకు కొనసాగిన ఎన్నికల ఫలితాల్లో గులాబీ జోష్ కనిపించింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ప్రాతినిథ్యం వహిస్తున్న నాలుగు మండలాల్లో ఆయన పట్టు మరోసారి రుజువైంది. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. అధికార కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండగా.. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. స్వతంత్రులు సైతం తమ సత్తాచాటుకున్నారు. చివరి విడత ఎన్నికలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అధికార కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు సీట్లు ఎక్కువ వచ్చాయి. మూడో విడతగా ఎన్నికలు జరిగిన నాలుగు మండలాల్లో 1,25,324 మంది ఓటర్లు ఉండగా.. 99,202 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. నాలుగు మండలాల్లో 79.16 పోలింగ్ శాతం నమోదైంది. మండలాల వారీగా ఓటింగ్ పర్వం ● వీర్నపల్లి మండలంలోని 17 గ్రామాలకు ఒక్క గ్రామం ఏకగ్రీవమైంది. 16 గ్రామాల్లో 73 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీపడ్డారు. 59 వార్డులకు 137 మంది పోటీలో ఉన్నారు. మండలంలో మొత్తం ఓట్లు 11,066 ఉండగా.. 9,065 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీర్నపల్లి మండలంలో 81.92 శాతం పోలింగ్ నమోదైంది. ● ముస్తాబాద్ మండలంలో 22 గ్రామాలకు ఒక్క గ్రామం ఏకగ్రీవమైంది. 21 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. 95 అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు, 152 వార్డు సభ్యుల స్థానాలకు 494 మంది పోటీపడ్డారు. మండలంలో మొత్తం ఓట్లు 37,711 ఉండగా.. 30,434 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ముస్తాబాద్ మండలంలో 80.70 శాతం పోలింగ్ నమోదైంది. ● గంభీరావుపేట మండలంలో 22 గ్రామాలకు మూడు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 19 గ్రామాల్లో ఎన్నికలు జరగ్గా 92 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి, 165 వార్డు సభ్యుల స్థానాలకు 491 మంది పోటీపడ్డారు. మండలంలో మొత్తం ఓట్లు 36,135 ఉండగా.. 28,816 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గంభీరావుపేట మండలంలో 79.75 శాతం పోలింగ్ నమోదైంది. ● ఎల్లారెడ్డిపేట మండలంలో 26 గ్రామాలకు రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 24 గ్రామాల్లో సర్పంచ్ స్థానానికి 120 మంది, 175 వార్డులకు 517 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మండలంలో మొత్తం ఓట్లు 40,412 ఉండగా.. 30,868 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డిపేటలో 76.38 శాతం పోలింగ్ నమోదైంది. వెనకబడిన మూడో విడత జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. మొదటి విడత వేములవాడ, వేములవాడరూరల్, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో ఎన్నికలు జరగ్గా.. 79.57 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడత ఎన్నికలు బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో జరగ్గా అత్యధికంగా 84.42 శాతం పోలింగ్ నమోదైంది. మూడో విడత బుధవారం నాలుగు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 79.16 శాతం నమోదైంది. పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి గ్రామపంచాయతీ ఎన్నికల తీరును జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముస్తాబాద్తోపాటు నామాపూర్, గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యాలయం, లింగన్నపేట, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఏఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్రచారి, డీఆర్డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్బేగం, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, పరిశ్రమలశాఖ మేనేజర్ హనుమంతు, తహసీల్దార్లు రాంచందర్, మారుతిరెడ్డి, సుజాత, ఎంపీడీవోలు లచ్చాలు, శ్రీధర్ పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు పరిశీలన వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో ఓట్ల లెక్కింపును ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ పరిశీలించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, మండల ప్రత్యేక అధికారులు క్రాంతికుమార్, ఎంపీడీవోలు లక్ష్మీనారాయణ, శ్రీలేఖ, నటరాజ్ పాల్గొన్నారు.మల్లారపు జ్యోత్స్న మట్ట వెంకటేశ్వర్రెడ్డి ఎలగందుల నర్సింలు మల్లుగారి పద్మ మండలం జీపీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇతరులు వీర్నపల్లి 17 06 05 01 05 ఎల్లారెడ్డిపేట 26 11 08 03 04 ముస్తాబాద్ 22 13 03 02 04 గంభీరావుపేట 22 11 01 03 07మేజర్ మెజారిటీమండలం ఓట్లు 9 గంటలు 11 గంటలు 1 గంట తుది పోలింగ్ గంభీరావుపేట 36,135 19.05 48.84 73.08 ముస్తాబాద్ 37,711 19.30 41.57 78.37 80.70 వీర్నపల్లి 11,066 20.0 56.17 81.89 81.93 ఎల్లారెడ్డిపేట 40,412 17.17 47.30 76.0 76.38 మొత్తం 1,25,324 18.60 49.80 76.39 79.16 -
ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు
● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● పోలింగ్ కేంద్రాలు పరిశీలనఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, గంభీరావుపేట మండలం లింగన్నపేట, కేజీ టు పీజీ విద్యాసంస్థ, ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు నామాపూర్ పోలింగ్ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖితరెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్రచారి, డీఆర్డీవో శేషాద్రి, జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, హనుమంతు, అఫ్జల్బేగం, తహసీల్దార్లు సుజాత, మారుతిరెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో సుధాకర్ పాల్గొన్నారు. వీర్నపల్లి: వీర్నపల్లిలోని జెడ్పీ హైస్కూల్లో ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఎన్నికల సరళిని పరిశీలించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, మండల ప్రత్యేక అధికారులు రాఘవేందర్, క్రాంతికుమార్, ఎంపీడీవో శ్రీలేఖ పాల్గొన్నారు. -
ప్రజలకు అందుబాటులో ఉండండి
● ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇల్లంతకుంట(మానకొండూర్): సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామాల నూతన సర్పంచులు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాభివృద్ధికి పాటుపడాలని నూతన సర్పంచులకు సూచించారు. సిరికొండ సర్పంచ్ గొడుగు విఠల్, అనంతారం సర్పంచ్ వొల్లాల వెంకటేశం, తాళ్లల్లపల్లి సర్పంచ్ మీసాల కనకరాజు, రామాజీపేట సర్పంచ్ చొప్పరి భూమయ్య, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు ఎమ్మెల్యేను కలిశారు. పార్టీ మండల అధ్యక్షుడు, ముస్కానిపేట సర్పంచ్ భాస్కర్రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: హమాలీ కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలు చేస్తామని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సంటి బాలరాజు పేర్కొన్నారు. సిరిసిల్లలో బుధవారం నిర్వహించిన కార్మికసంఘం ప్రథమ మహాసభలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాయకులు మంద సుదర్శన్, కిష్టాపురం లక్ష్మణ్, బచ్చుపల్లి శంకర్, అజ్జ వేణు, కడారి రాములు పాల్గొన్నారు. నూతన కమిటీ జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. ముఖ్య సలహాదారుగా అజ్జ వేణు, గౌరవ అధ్యక్షుడిగా కడారి రాములు, గంగాపురం పోచమల్లు, అధ్యక్షుడిగా పుప్పాల రాజేశ్, ప్రధాన కార్యదర్శిగా పుప్పాల దుర్గయ్య, కోశాధికారి, సహాయ కార్యదర్శిగా వేల్పుల కనకరాజు, రాగుల ఎల్లయ్య, ఉపాధ్యక్షుడిగా బోగి వెంకటేశం, కౌన్సిల్ సభ్యులుగా అనుముల లచ్చయ్య, బియ్య పెద్దసాయిలు, కొమ్మటి కిరణ్, రాగుల దుర్గయ్య, నక్క రాములు, బత్తుల మల్లయ్య, జంపల్లి వెంకటేశం, బొల్లి దేవయ్య, తోట మారుతిని ఎన్నుకున్నారు. సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనకు ఆకర్షితులై యువత పార్టీలో చేరుతున్నారని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన యువకులు పార్టీలో చేరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, బ్లాక్ అధ్యక్షుడు సూర దేవరాజు, రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ జిల్లా సభ్యులు సంగీతం శ్రీనాథ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిమల్ల భాను, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పోగుల దేవరాజు, పట్టణ యూత్ మాజీ అధ్యక్షుడు చిందం శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ ఆకేని సతీశ్, నాయకులు కలిం, ఆడెపు ప్రసాద్, కళ్యాణ్ పాల్గొన్నారు. కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిమ్మపల్లికి చెందిన ఉప్పర కులస్తులను పాతజాబితా బీసీ(డీ)లోనే కొనసాగించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన మాల, మాది గ సంఘాలు ఇన్చార్జి కలెక్టర్, ఆర్డీవో, డీపీవోలకు బుధవారం ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ నిమ్మపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కేటాయించినట్లు పేర్కొన్నారు. గ్రామంలోని ఉప్పర కులానికి చెందిన మహిళ, ఒకటోవార్డు ఎస్సీకి కేటాయించగా రాఘవేందర్ అనే వ్యక్తి ఎస్సీ సర్టిఫికెట్పై పోటీ చేశారని తెలిపారు. అధికారులను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో దప్పుల నరేశ్, సదానందం, దప్పుల స్వామి, మధుకర్, అనిల్, శ్రీకాంత్, మల్యాల నరేశ్, ప్రసాద్, మనోజ్కుమార్, శ్రీనివాస్ కోరారు. -
పటిష్ట భద్రత మధ్య ఎన్నికలు
● ఎస్పీ మహేశ్ బీ గీతే ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, రాచర్లగొల్లపల్లి, రాచర్లబొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లిలోని పోలింగ్ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. మూడో విడతలో 730 మంది పోలీస్ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఐలు శ్రీనివాస్గౌడ్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు వేముల లక్ష్మణ్, ఎల్లయ్యగౌడ్ ఉన్నారు.పోలింగ్ కేంద్రాలు పరిశీలనఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ బుధవారం పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, అల్మాస్పూర్, రాచర్లగొల్లపల్లి, వీర్నపల్లి మండలం కంచర్ల, వీర్నపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని అదనపు కలెక్టర్ పరిశీలించారు. అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ మూడోవిడత పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా పూర్తయినట్లు తెలిపారు. తహసీల్దార్లు సుజాత, ముక్తార్పాషా, ఎంపీడీవోలు సత్తయ్య, శ్రీలేఖ ఉన్నారు. సిట్టింగ్ సర్పంచ్ల పరాజయంముస్తాబాద్(సిరిసిల్ల): పంచాయతీ ఎన్నికలలో సిట్టింగ్ సర్పంచ్లు ఓటమి చవిచూశారు. తాజా, మాజీ సర్పంచ్లు ఈ ఎన్నికలలో రిజర్వేషన్లు అనుకూలించి బరిలో నిలిచారు. మొర్రాపూర్ భూక్య దేవేందర్, తుర్కపల్లి కాశోల్ల పద్మ, గూడూరు చాకలి రమేశ్లు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేశారు. వీరి సమీప ప్రత్యర్థుల చేతిలో ఓటమి చెందడంతో నిరాశకు గురయ్యారు. మొర్రాపూర్లో దేవేందర్పై భూక్య రాజు గెలుపొందగా, తుర్కపల్లిలో కాశోల్ల పద్మపై రొడ్డ భాగ్య, గూడూరులో రమేశ్పై చీటి సునీత విజయం సాధించారు. ఓట్లు అన్ని ఒక్కరికే..ఎల్లారెడ్డిపేట(సిరిసిల)్ల: ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్తండాలోని ఏడోవార్డులో ధరావత్ సురేష్నాయక్ వార్డు సభ్యుడిగా పోటీచేయగా మొత్తం 35 ఓట్లు అతనికే పడ్డాయి. ప్రత్యర్థికి ఒక్క ఓటు రాలేదు. సురేష్నాయక్ భార్య సైతం 8వ వార్డులో విజయం సాధించారు. ఒక్క ఓటూ రాలే.. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలో రెండో విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డు సభ్యుడికి ఒక్క ఓటు కూడా రాలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో 3వ వార్డులో పోటీచేసిన పెద్దమ్మల నర్సయ్యకు సున్నా ఓట్లు వచ్చాయి. 10వ వార్డులో బర్ల యెష్పాల్కు 3, నేరెళ్ల 8వ వార్డులో దరిపెల్లి శ్రీకాంత్కు 2, పద్మనగర్ 1వ వార్డులో మద్దవేని లింబాద్రికి 3, సారంపల్లి 8వ వార్డులో పాలకుర్తి రాములుకు 2, తంగళ్లపల్లిలో 3వ వార్డులో బొల్లారం చంద్రమౌళికి 2 ఓట్లు చొప్పున వచ్చాయి. -
సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ సత్తా
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయన గోపి సిరిసిల్లటౌన్: జిల్లాలో జరిగిన సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల సత్తాచాటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయన గోపి అన్నారు. ఓటర్లు ఇచ్చిన ఈ తీర్పు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెంపపెట్టుగా పేర్కొన్నారు. ఆ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజలు బీజేపీని ఆశీర్వదించడంపై కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని వెంకటాపూర్, పదిర, పోతిరెడ్డిపల్లి, జైసేవాలాల్తండా, కిష్టునాయక్తండా, పొన్నాలపల్లె, నాగంపేట, ముస్తాఫానగర్, ఆవునూరు, ముర్రాయిపల్లి, శాంతినగర్, అంకిరెడ్డిపల్లి, చింతల్ఠాణా, అంకుసాపూర్, దేశాయ్పల్లె గ్రామాల్లో తమ పార్టీ అఽభ్యర్థులు గెలుపొందారని పేర్కొంటూ వారికి అభినందనలు ప్రకటించారు. గెలిచిన సర్పంచ్ల సంబరాలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్, అగ్రహారం, రాజన్నపేట సర్పంచులుగా గెలుపొందిన మేడిశెట్టి కిషన్, మేడిశెట్టి పద్మ, కల్లూరి బాపిరెడ్డి బుధవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. ఈ ముగ్గురు సర్పంచులు భారీ మెజార్టీతో గెలవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద వారి మద్దతుదారులు గజమాలలు, శాలువాలతో సన్మానించారు. -
ఉద్యాన రైతుకు చేయూత
కరీంనగర్రూరల్: వ్యవసాయానికి అనుబంధంగా ఉద్యాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆధునిక పద్ధతులు, ఎక్కువ విస్తీర్ణంలో ఉద్యాన పంటలను రైతులు సాగు చేసేందుకు వీలుగా యాంత్రీకరణకు ప్రాధాన్యమిస్తోంది. రైతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తోంది. దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లాకు 86 యూనిట్లు మంజూరు చేసింది. దశాబ్దం తర్వాత.. గతంలో వ్యవసాయంతోపాటు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పంపిణీ చేస్తున్నారనే సాకుతో సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపేశారు. దీంతో పలువురు రైతులు ప్రైవేట్గా పరికరాలను కొనుగోలు చేయడంతో ఆర్థికంగా భారం పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాకు 86 యూనిట్లు మంజూరు కాగా.. అర్హులైన రైతుల నుంచి ఉద్యాన శాఖ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 49 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. యంత్ర పరికరాలకు సంబంధించి ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందాలను చేసుకుంది. పరికరాల కొనుగోలుపై 5 ఎకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం, 5 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు 40 శాతం సబ్సిడీని అందిస్తారు. ప్రభుత్వం సబ్సిడీపై ఉద్యాన రైతులకు యంత్ర పరికరాలను అందిస్తోంది. ప్రభుత్వం సబ్సిడీ నిధులను మంజూరు చేసింది. పరికరాలు అవసరమున్న రైతులు దరఖాస్తు చేసుకోవాలి. – అయిలయ్య, ఉద్యాన శాఖ అధికారి, ఉమ్మడి కరీంనగర్ మండలంపవర్ వీడర్లు: 18, బ్రష్ కట్టర్లు: 29 పవర్ స్ప్రేయర్లు: 27, పవర్ టిల్లర్లు: 9 మినీ ట్రాక్టర్లు: 3 -
వేతనం.. సతమతం
కరీంనగర్ అర్బన్: ఒక నెల వేతనం రాకుంటే అల్లాడే కుటుంబాలు ఎన్నో. అలాంటిది 2 నెలలుగా వేతనాల్లేక పడిగాపులు కాస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. ఓవైపు పిల్లల స్కూలు ఫీజులు.. మరోవైపు నిత్యావసరాలకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అవసరాలు తీర్చుకుంటుండగా.. వడ్డీ తడిసి మోపెడవుతోందని వాపోతున్నారు. సాంకేతిక కారణాలను బూచిగా చూపుతూ ప్రభుత్వం వేతనాలను మంజూరు చేయడకపోవడం ఆందోళనకర పరిణామం. జీతాలపై అధికారులను అడిగినా సరైన స్పందన లేకపోవడంతో ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రెండేళ్లుగా మూడు నెలలు, నాలుగు నెలలకోసారి వేతనమిస్తూ ఉద్యోగులను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. ఆపరేటర్ నుంచి ఏపీవో వరకు.. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ఏపీవో, ఈసీ(ఇంజనీరింగ్ కన్సల్టెంట్), టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లను ప్రభుత్వం అప్పట్లో నియమించుకుంది. జిల్లాలో ఏపీవోలు 15, ఆరుగురు ఈసీలు, 38 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 274 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లున్నారు. జిల్లాలో మొత్తంగా 350 మంది ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనం వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే రెండు నెలల నుంచి జీతం రావడం లేదు. వేతనాలకు సంబంధించి స్పర్స్ సాఫ్ట్వేర్లో తలెత్తిన లోపాల కారణంగా రావడం లేదని తెలుస్తోంది. వేతనాలు రాకున్నా ప్రభుత్వం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.కోటి పైనే.. ఉపాధిహామీలో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.18,000 నుంచి రూ.20వేలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.11,500, టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.25వేల నుంచి రూ.30వేలు, ఈసీలు, ఏపీవోలకు రూ.50వేల వరకు వేతనాలిస్తున్నారు. వీరికి నెలకు సుమారు రూ.50.25లక్షల చొప్పున 2 నెలలకు గాను రూ.1.05కోట్లు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. తగ్గని టార్గెట్లు.. వేతనాలు పెండింగ్లో ఉన్నా.. విధుల్లో మాత్రం తేడా రావొద్దంటూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు విధిస్తున్న టార్గెట్ ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ, ఏపీవోలను మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లదే కీలకపాత్ర. గ్రామాల్లో ఉపాధిహామీ కింద పనులు చేయించడం ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యత కాగా.. చేపట్టిన పనులను క్షేత్రస్థాయికి వెళ్లి కొలతలు వేయాల్సిన బాధ్యత టెక్నికల్ అసిసెంట్లపై ఉంటుంది. కొలతలకు సంబంధించి ఎంబీ రికార్డులు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేయాల్సిన బాధ్యత టీఏలపై ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్లు వేసిన కొలతల ఆధారంగానే కూలీలకు వేతనాలు వస్తాయి. పని తక్కువ చేసిన కూలీకి తక్కువ, పని ఎక్కువ చేసిన కూలీకి ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. కూలీలకు రూ.300 వేతనం కచ్చితంగా రావాలన్న అధికారుల ఆదేశాలు టీఏలకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన తండాలు, పంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించకపోవడంతో ఆ పని భారం టీఏలపై పడుతోంది. ఒక్కో గ్రామంలో కనీసం పది ప్రాంతాల్లో కూలీలు పనులు చేస్తున్నారు. ఆ ప్రదేశాలను సందర్శించాలంటే సమయం సరిపోని పరిస్థితి. 2 నెలలుగా అందని వైనం ఆందోళనలో ‘ఉపాధి’ ఉద్యోగులు -
ఎన్నికలు తెచ్చిన పంచాయితీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రశాంతంగా ఉండే ఆ పల్లెలోని ఓ వర్గంలో పంచాయతీ ఎన్నికలు కొత్త పంచాయితీని తెచ్చి పెట్టాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో ఇటీవల రెండో దశ స్థానిక ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. కాగా ఓ వర్గానికి సంబంధించిన అభ్యర్థి సర్పంచ్ బరిలో పోటీచేయగా ఆవర్గం వారు సదరు అభ్యర్థికే ఓటేయాలని తీర్మానించారు. సుమారు 500 ఓట్లు ఉన్న ఆ వర్గం వారి ఓట్లలో 150 వేరే అభ్యర్థికి పోల్ కావడంతో అతడు విజయం సాధించాడాని తేల్చారు. దీంతో బుధవారం గ్రామంలోని ఆలయం వద్ద పంచాయితీ నిర్వహించారు. తమ అభ్యర్థి రూ.లక్షలు ఖర్చుచేసి పోటీలో ఉంటే ఓట్లు వేరే వారికి ఎలా వేస్తారని చర్చించుకున్నారు. ఓ మహిళ దీనంతటికి కారణమని గుర్తించి ఆమెను కూడా నిలదీశారు. ప్రశాంతంగా ఉండే పచ్చని పల్లెలో ఎన్నికలు చిచ్చు రేపాయాని గ్రామస్తులు చర్చించుకుంటున్నా రు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్య
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విజయ్నగర్లో నివాసముంటూ మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టీపీపీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న ఆవుల రమేశ్(50) బుధవారం ఉరివేసుకుని మృతి చెందినట్లు వన్టౌన్ ఏఎస్సై వెంకటేశ్వరబాబు తెలిపారు. ఏడాదిన్నర క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోగా, తల్లితో కలిసి నివాసముంటున్నాడు. భార్య కాపురానికి రావడంలేదని తాగుడుకు బానిసై జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడినట్లు ఏఎస్సై వివరించారు. మృతుడి తల్లి ఆవుల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతిఇల్లంతకుంట(మానకొండూర్): స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. విద్యార్థి మృతితో రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గుర్రం శరత్రెడ్డి(20) కరీంనగర్లో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. కరీంనగర్లోని తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు రేపాక నుంచి సోమవారం బైక్పై మరో ఫ్రెండ్తో కలిసి వెళ్లాడు. కరీంనగర్లోని ఎల్ఎండీ వద్ద రాజీవ్ రహదారిపై స్కూటీ ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ శరత్రెడ్డిని హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ అదుపుతప్పి ఒకరి దుర్మరణం● మరొకరి పరిస్థితి విషమం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని వారసంత సమీపంలో బుధవారం రాత్రి బైక్ అదుపు తప్పిన ఘటనలో ఒకరు మృతి చెందారని, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. భూపాలపల్లి జిల్లా పెద్దతూండ్ల గ్రామానికి చెందిన పింగిలి బబ్బులు(25)తీవ్రగాయాలతో కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ఒజ్జం వినయ్(22) తీవ్రంగా గాయపడగా.. కరీనంగర్ తరలించారన్నారు. వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. బైక్ అదుపుతప్పి మోరీ గోడకు ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
కొట్టుకుపోయిందా.. కూలగొట్టారా?
మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్పల్లి మానేరుపై నిర్మించిన చెక్డ్యాం కొట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో మానేరుపై చెక్డ్యాం నిర్మించగా బుధవారం వేకువజామున సుమారు పది మీటర్ల పొడవున కొట్టుకుపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోయిందా? ఎవరైనా కావాలనే కూలగొట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపలు పట్టేందుకు గ్రామానికి చెందిన కొందరు వెళ్లి వచ్చిన కాసేపటికే చెక్డ్యాం కొట్టుకు పోయిందని చెబుతున్నారు. గత నవంబర్లో జిల్లాలోని గుంపుల వద్ద చెక్డ్యాం కొట్టుకుపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విదితమే. అదే తరహాలో ఇక్కడ కూడా జరిగి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో 16 చెక్డ్యాంలు.. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో మానేరు నదిపై వివిధ చోట్ల 16 చెక్డ్యాంలు నిర్మించింది. ఇందుకోసం రూ.128కోట్లు వెచ్చించింది. ఇందులో మంథని మండలం అడవిసోమన్పల్లి, చిన్నఓదాల, గోపాల్పూర్ ప్రాంతాల్లో చెక్డ్యాంలు ఉన్నాయి. అడవిసోమన్పల్లి వద్ద నిర్మించిన చెక్డ్యాం అవతలివైపు కొట్టుకుపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బుంగపడి.. కుంగిపోయిందా..? కొద్దిరోజుల క్రితం చెక్డ్యాం వద్ద పెద్దబుంగపడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రతీరోజు చేపలు పట్టేందుకు కొందరు అక్కడకు వెళ్తుంటారని, అక్కడక్కడా పగుళ్లతోపాటు బుంగ కూడా కనిపించిందని స్థానికులు తెలిపారు. మానేరులో ప్రస్తుతం వరద కూడా అధికంగానే ఉందని, ఈక్రమంలో బుంగతోనే కుంగిపోయి కొట్టుకుపోయిందని స్థానికులు అంటున్నారు. నాణ్యతపై ఆరోపణలు.. చెక్డ్యాంల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న చెక్డ్యాంలపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మించారనే వాదనలు వినిపించాయి. కానీ భారీవర్షాల సమయంలో కొట్టుకుపోకుండా ప్రస్తుతం నామమాత్రంగా వచ్చిన వరద తాకిడితో కొట్టుకుపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పరిశీలన.. చెక్డ్యాం కొట్టుకుపోయిందన్న సమాచారం మేరకు ఇరిగేషన్ ఏఈ నిఖిల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద తాకిడితో కొట్టుకుపోయిందా? లేక ఎవరైనా కూలగొట్టారా? అనే కోణంలో పరిశీలన చేశారు. అక్కడి పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని, వరద తాకిడితో కొట్టుకుపోయినట్లు కనిపించడం లేదని ఏఈఈ తెలిపారు. ఘటనపై అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. కూలిన అడవిసోమన్పల్లి చెక్డ్యాం నాసిరకమా?.. కావాలనే కూల్చారా? పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు చెక్డ్యాం కొట్టుకుపోవడంపై అనుమానాలు -
ఉపసర్పంచ్ పదవికి వేలం
● ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత ● రంగంలోకి దిగిన పోలీసులు ధర్మపురి: ధర్మపురి మండలం కమలాపూర్లో బుధవారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా కుమ్మరి తిరుపతి గెలుపొందారు. ఉపసర్పంచ్ పోటీలో ఉన్న కొందరు తనకంటే తనకు అంటూ రసాభాస చేశారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడిచి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఉపసర్పంచ్ పదవికి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తామంటూ వేలానికి దిగారు. విషయం తెలిసిన వెంటనే సీఐ రాంనర్సింహరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇరువర్గాలకు నచ్చజెప్పారు. రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ కార్మికుడికి గాయాలు జూలపల్లి (పెద్దపల్లి): అబ్బాపూర్ గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బొమ్మెనవేని చంద్రయ్య బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పనినిమిత్తం అబ్బాపూర్ నుంచి జూలపల్లికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో స్థానిక కొచ్చెరువుకు సమీపంలో ఆటోను తప్పించబోయి అదుపుతప్పి పడిపోయాడు. ఈఘటనలో కాలితీవ్రగాయమైంది. స్థానికుల సమాచారంతో 108 వాహనం సిబ్బంది ఆరె సతీశ్, ఈఎంటీ, పైలెట్ శ్రీనివాస్ వెంటనే ఘటనా స్థలానికి చేరకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు
● ఎస్పీ మహేశ్ బీ గీతే ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి మంగళవారం దిశానిర్దేశం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలని ఆదేశించారు. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా బందోబస్తు నిర్వహించాలన్నారు. ముస్తాబాద్, నామాపూర్, పోతుగల్ గ్రామాల్లో కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా వుండాలని, సెల్ఫోన్లు అనుమతించవద్దన్నారు. ఫలితాలు ప్రకటించే వరకు సోషల్ మీడియాలో ప్రచారంపై నిఘా పెట్టాలన్నారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్గౌడ్, మొగిలి, ఎస్సైలు రాహుల్రెడ్డి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె పోరు బహుముఖం
సిరిసిల్ల: జిల్లాలోని తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. పల్లెల్లో ఎన్నికల పోరు బహుముఖంగా సాగుతుంది. ఆఖరు విడత 80 గ్రామాల్లో సర్పంచు స్థానాలకు 380 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 551 వార్డుసభ్యుల స్థానాలకు 1,639 మంది బరిలో ఉన్నారు. తుదివిడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 87 గ్రామాలకు, 762 వార్డులకు ఎన్నికల షెడ్యూల్ జారీ కాగా.. నామినేషన్ల పర్వం ముగిసే నాటికి ఏడు సర్పంచులు, 211 వార్డుమెంబర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన గ్రామాల్లో బుధవారం జరిగే ఎన్నికలకు 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,244 మంది సిబ్బందిని నియమించారు. నాలుగు మండలాల్లోని 1,27,920 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహిళా ఓటర్లే అధికం జిల్లాలోని తుది విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గంభీరావుపేట మండలంలో 17,811 మంది పురుషులు, 18,996 మహిళలు, ముస్తాబాద్ మండలంలో 18,658 మంది పురుషులు, మహిళా ఓటర్లు 19,842 ఉన్నారు. వీర్నపల్లి మండలంలో 5,769 మంది పురుషులు, 5,958 మంది మహిళలు, ఎల్లారెడ్డిపేట మండలంలో 19,690 మంది పురుషులు, 21,196 మహిళా ఓటర్లు ఉన్నారు. పల్లెలకు తరలిన అధికారులు ఎన్నికలు జరిగే పల్లెలకు మంగళవారం సాయంత్రం ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు తరలివెళ్లారు. ఎన్నికల సామగ్రి, అధికారులు, సిబ్బందిని వాహనాల్లో తరలించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఏడు జోన్లు, పది రూట్లు ఏర్పాటు చేశారు. గంభీరావుపేట మండలంలో ఐదు జోన్లు, పది రూట్లు, ముస్తాబాద్ మండలంలో నాలుగు జోన్లు, ఎనిమిది రూట్లు, వీర్నపల్లి మండలంలో రెండు జోన్లు, ఐదు రూట్లతో ఎన్నికల ప్రణాళిక రూపొందించారు. సమస్యాత్మక పల్లెల్లో కట్టుదిట్టమైన భద్రత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 32 సమస్యాత్మక గ్రామాలు ఉండగా, వీటిలో 14 అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. గత ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో జరిగిన గొడవలను అంచనా వేస్తూ పోలీసులు పటిష్ట రక్షణ ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచే.. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలై మధ్యాహ్నం 1 గంటలోగా ముగుస్తుంది. భోజన విరామం తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు పూర్తి కాగానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఆఖరు విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అఽధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గంభీరావుపేట గ్రామాలు: 22 ఓటర్లు: 36,807 ఏకగ్రీవమైన గ్రామాలు: 03 ఎన్నికలు జరిగేవి: 19 బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 92 వార్డు సభ్యుల అభ్యర్థులు: 491 పోలింగ్ సిబ్బంది: 577 ముస్తాబాద్ గ్రామాలు: 22 ఓటర్లు: 38,500 ఏకగ్రీవమైన గ్రామాలు: 01 ఎన్నికలు జరిగేవి: 21 పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 95 వార్డు సభ్యుల అభ్యర్థులు: 494 పోలింగ్ సిబ్బంది: 603 వీర్నపల్లి గ్రామాలు: 17 ఓటర్లు: 11,727 ఏకగ్రీవమైన గ్రామాలు: 01 ఎన్నికలు జరిగే గ్రామాలు: 16 పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 73 వార్డు సభ్యుల అభ్యర్థులు: 137 పోలింగ్ సిబ్బంది: 318 ఎల్లారెడ్డిపేట గ్రామాలు: 26 ఓటర్లు: 40,886 ఏకగ్రీవమైన గ్రామాలు: 02 ఎన్నికలు జరిగే గ్రామాలు: 24 పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 120 వార్డు సభ్యుల అభ్యర్థులు: 517 పోలింగ్ సిబ్బంది: 660 -
శభాష్ అర్చన
అర్చనను సన్మానిస్తున్న జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిబ్బంది సిరిసిల్ల: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న దివ్యాంగ ఉద్యోగి మిట్టపల్లి అర్చన శ్రీలంకలో జరిగిన త్రోబాల్ పోటీల్లో బంగారు పతకం సాధించారు. దివ్యాంగుల పోటీల్లో దేశం తరఫున పాల్గొని బంగారు పతకం సాధించిన అర్చనను జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఇబ్బంది మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్చన ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి పట్టుదలతో దేశం తరఫున ఆడి విజయం సాధించిందన్నారు. చాలామంది సహ ఉద్యోగులు, ప్రభుత్వం ఇచ్చిన సహాయ సహకారంతో ఈ గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని మహిళా సాధికరికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా అన్నారు. అర్చన పట్టుదల, క్రమశిక్షణతో ఈ ఘనత సాధించిందని ఏసీడీపీవో సుచరిత అన్నారు. చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ స్రవంతి, సిబ్బంది శోభన, సంతోష్ కుమార్, శ్రీపాద పాల్గొన్నారు. స్వచ్ఛ పాఠశాల సందర్శనఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వెల్జిపురం హైస్కూల్ను మంగళవారం స్వచ్ఛ హరిత విద్యాలయ్ రాష్ట్ర పరిశీలకుడు రంగనాథ్ సందర్శించారు. పాఠశాలలోని పరిశుభ్రత, పచ్చదనం, కిచెన్ గార్డెన్, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల స్వచ్ఛ హరిత విద్యాలయంలో భాగంగా వెల్జిపురం హైస్కుల్ ఎంపికై ప్రశంసాపత్రం అందుకుంది. ఉపాధ్యాయులు స్వామిరెడ్డి, హరికృష్ణారెడ్డి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల మున్సిపల్ పరిధి ప దోవార్డు భూపతినగర్లో శ్మశానవాటిక స్థలాన్ని కబ్జాచేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజుగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం శ్మశానవాటిక స్థలం వద్ద స్థానికులతో కలిసి ని రసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా భూపతినగర్ గ్రామస్తులు ఈ స్థలాన్ని శ్మశానవాటిక కోసం ఉపయోగిస్తున్నారని, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కబ్జాచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇ టీవల మల్లేశం అనే వ్యక్తి మృతిచెందగా అత డి దినకర్మ కాకముందే అట్టి స్థలాన్ని ట్రాక్టర్తో చదును చేశారని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలని కోరారు. ఎన్నికల విధుల్లో తోబుట్టువులుముస్తాబాద్(సిరిసిల్ల): ఎన్నికల విధులను తోబుట్టువులు కలిసి పంచుకున్నారు. ఒకే మండలంలో అన్నా, చెల్లి, తమ్ముళ్లకు విధులు రావడంతో ఆనందంగా కలిసి హాజరయ్యా రు. ముస్తాబాద్ జూనియర్ కళాశాలలో ఏర్పా టు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద అన్న, చెల్లి, తమ్ముడు మంగళవారం కలుసుకున్నా రు. గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన మరాటి పోశవ్వ, రాజయ్య దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో మరాటి మల్లికార్జున్ గంభీరావుపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో, మారాటి వెంకటలక్ష్మి రుద్రంగి మండలం మానాల ప్రభుత్వ పాఠశాలలో, వీరి సోదరుడు మరాటి అజయ్ సిరిసిల్ల తుకారంనగర్ ప్రాథమిక పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నారు. ముగ్గురూ ముస్తాబాద్ మండలంలో జరుగుతున్న ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు వచ్చారు. మల్లికార్జున్కు గన్నెవారిపల్లి, వెంకటలక్ష్మికి రామలక్ష్మణపల్లె, అజయ్కు కొండాపూర్లో విధులు కేటాయించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద వీరిని చూసినవారు తోబుట్టువులు కలుసుకున్నారని సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టారు. -
పనులు పూర్తయ్యేదెప్పుడో?
ఈ చిత్రం ముస్తాబాద్ మండలంలోని ఎగువమానేరు ప్రాజెక్టు నుంచి వచ్చే నీటి కాల్వ. మొత్తం గుర్రపుడెక్కతో నిండిపోవడంతో ఇలా పచ్చగా కనిపిస్తుంది. నామాపూర్ నుంచి తెర్లుమద్ది వరకు ఇలా గుర్రపుడెక్క, తుంగతో నిండిపోవడంతో చుక్కనీరు పారే పరిస్థితి లేదు. తైబందీ అమలు చేసే సమయంలో కాల్వ ఇలా ఉంటే పొలాలకు నీరు ఎలా వచ్చేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): ఎగువ మానేరు ప్రాజెక్టు మెట్ట ప్రాంత రైతులకు వరప్రదాయిని. సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న ఎగువ మానేరు ప్రాజెక్టు కాల్వలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. యాసంగి సాగుకు రైతులు సమాయత్తం అవుతున్న వేళ.. ప్రాజెక్టు కుడి, ఎడమ కెనాల్స్పై చేపట్టిన మరమ్మతు పనులు పూర్తి కాలేదు. కెనాల్స్లో పేరుకుపోయిన తుంగ, గుర్రపుడెక్కతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు కింద 17వేల ఎకరాల ఆయకట్టు తైబందీకి సమయం ఆసన్నమవుతుండడంతో సాగునీటి సరఫరా సజావుగా సాగుతుందా అనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల్లో తైబందీ ఎగువ మానేరు ప్రాజెక్టు తైబందీకి నీటి పారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 22న తైబందీ.. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ఆయకట్టు సాగుకు నీటిని విడుదల చేసే విషయంపై తీర్మానం చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్ అధికారులు సైతం విధుల్లో ఉండడంతో తైబందీకి జాప్యమవుతోంది. దీంతోపాటు కెనాల్స్ మరమ్మతు పనులలో జాప్యం జరుగుతోంది. జరుగుతున్న పనులు.. ముస్తాబాద్ మండలం నామాపూర్, గూడూరు వద్ద డిస్ట్రిబ్యూటరీ 15, ముస్తాబాద్ వద్ద డీ–18 మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. రూ.12లక్షల వ్యయంతో చేసే పనులు జాప్యమయ్యాయి. నిధులు ఎప్పుడో మంజూరైనా త్వరగా మొదలు పెట్టలేదు. ఇటీవల పనులు ప్రారంభమైనా.. యాసంగి సీజన్ మొదలైంది. రైతులు ఇప్పటికే తుకాలు పోసుకున్నారు. గోపాల్పల్లె వద్ద కెనాల్పై కల్వర్టు పనులు పెండింగులో ఉన్నాయి. ముస్తాబాద్, తెర్లుమద్ది వద్ద ఆక్విడేటర్ల లీకేజీ మరమ్మతులు మొదలుపెట్టలేదు. మండలంలోని గూడూరు నుంచి తెర్లుమద్ది వరకు కెనాల్స్లో ఉన్న చెత్త, తుంగ, గుర్రపుడెక్కను తొలగించకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి లేదు.కెపాసిటీ : 2 టీఎంసీలు ఆయకట్టు : 17వేల ఎకరాలు డిస్ట్రిబ్యూటరీలు : 28 కుడి కాలువ : 32 కిలోమీటర్లు సబ్ కెనాల్స్: 110 కిలోమీటర్లు -
శాంతియుత వాతావరణంలో ఓటేయ్యాలి
ఎల్లారెడ్డిపేట( సిరిసిల్ల): పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు. మంగళవారం రాత్రి ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పోలింగ్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగు మండలాల్లో 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,244 మంది ఓపీవోలు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుందన్నారు. ఎన్నికల సిబ్బంది తమకు కేటా యించిన వాహనాల్లో సామగ్రితో తరలిపోయారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, మండల ప్రత్యేకాధికారులు క్రాంతికుమార్, అఫ్జల్బేగం, తహసీల్దార్లు సుజాత, ముక్తార్పాషా, ఎంపీడీవోలు సత్తయ్య, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు. ఫెర్టిలైజర్ యాప్పై అవగాహన కల్పించాలి సిరిసిల్ల: రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన శ్రీఫెర్టిలైజర్ యాప్శ్రీపై అవగాహన కల్పించాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల అధికారులతో మాట్లాడారు. శ్రీఫెర్టిలైజర్ యాప్శ్రీపై జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ఈ నెల 19న శిక్షణ ఇవ్వాలన్నారు. యాప్ ఉపయోగాలను రైతులకు వివరించాలని స్పష్టం చేశారు. యాప్తో రైతులకు ఎరువుల వివరాలు, ఎక్కడ అందుబాటులో ఉందో అనే సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. రైతులు ఎక్కడి నుంచి అయినా తమ పట్టాదారు పాస్ పుస్తకం వివరాలతో లాగిన్ అయితే వారికి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం పెంచాలని, లక్ష్యం మేరకు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. కాన్ఫరెన్స్లో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. -
ఆఖరి పోరాటం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: గ్రామపంచాయతీ తుది పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మమైన ఈ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఆదినుంచీ అధికార కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రతిపక్ష బీఆర్ఎస్పై ఆదినుంచీ తన పైచేయి సాధిస్తూ వస్తోంది. ఇప్పటివరకూ రెండువిడతల ఎన్నికల్లో ఇదే దృశ్యం కనిపించింది. కీలకమైన మూడోవిడతలోనూ అదే సీన్ రిపీట్ అయ్యేలా కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఇక ఆఖరి పోరాటంలో వీలైనన్ని ఎక్కు వ సీట్లు తెచ్చుకుని గట్టి పోటీ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భావిస్తుండగా.. ఇప్పటి వరకూ 64 సీట్లు గెలిచిన బీజేపీ.. 100 సీట్లకుపైగా గెలుపొంది సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మొత్తానికి మూడు ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డేందుకు ఆఖరి ఎన్నికల బరిలోకి దిగాయి. ఆగని డబ్బు, మద్యం పంపిణీ.. తొలి రెండువిడతల్లో మద్యం, డబ్బు పంపిణీతో అభ్యర్థులు చేతులు కాల్చుకున్నా.. మూడోవిడతలోనూ అవే దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. సర్పంచ్ బరిలో ఉన్నవారు ఎక్కడా తగ్గడం లేదు. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. ఓటర్లకు తాయిలాలిచ్చి ప్రలోభాలకు గురిచేయడంలో ఎక్కడా తగ్గడం లేదు. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లిలో అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీకే పరిమితమవగా.. జగిత్యాల జిల్లాలో ఒకడుగు ముందుకేసి ఓటర్లకు ఏకంగా వెండి నాణేలు పంచుతుండడం విశేషం. ఇంత పంపిణీ జరుగుతున్నా.. అభ్యర్థులు ఓటర్లను పెట్టే ప్రలోభాలను పోలీసులు పూర్తిస్థాయిలో నియంత్రించడం లేదన్న విమర్శలు ఆగడం లేదు.జిల్లా పంచాయతీలు ఏకగ్రీవాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు కరీంనగర్ 111 03 02 00 00 01 పెద్దపల్లి 91 06 06 00 00 00 జగిత్యాల 119 06 06 00 00 00 సిరిసిల్ల 87 07 02 02 00 03 మొత్తం 408 22 16 02 00 04 -
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖతం
● కేటీఆర్ ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖతమవుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రెండు విడతల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారని, మూడోవిడతలోనైనా గౌరవప్రదంగా గెలవాలని కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారని ఎద్దేవా చేశారు. జిల్లాలో 83 మంది గెలిచినట్లు కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 60 దగ్గరే బీఆర్ఎస్ ఆగిపోయిందన్నారు. ఎన్నికల్లో గెలువలేక తప్పుడు లెక్కలతో పరువు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తున్నారన్నారు. మీ సొంత చెల్లి కవిత కామెంట్స్కే సమాధానం చెప్పుకోలేకపోతున్నావని ఎద్దేవా చేశారు. వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సొంతూరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారని గుర్తు చేశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే పైచేయి అవుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, పార్టీ నాయకులు గడ్డం నర్సయ్య, ఆకునూరి బాలరాజు, బొప్ప దేవయ్య పాల్గొన్నారు. -
● అత్యధిక సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్వే ● డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధిముస్తాబాద్(సిరిసిల్ల): సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీ తం శ్రీనివాస్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా నియామకమై తొలిసారి ముస్తాబాద్కు వచ్చిన శ్రీని వాస్కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికా యి. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తొలి రెండు దశల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకుందన్నారు. మూడోదశలోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఉచిత బస్సు, ఉచిత కరెంట్, సన్నబియ్యం, రేషన్కార్డుల మంజూరుతో కాంగ్రెస్ పేదల ప్రభుత్వంగా ప్రజల గుండెల్లో నిలిచిందన్నారు. అనంతరం ముస్తాబాద్, పోతుగల్ గ్రామాల్లోని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు ఎల్ల బాల్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కో–కన్వీనర్ కనమేని చక్రధర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ అన్నం రాజేందర్రెడ్డి, పట్టణాధ్యక్షుడు గజ్జెల రాజు, దీటి నర్సింలు, పెద్దిగారి శ్రీను, తిరుపతి, గుండెల్లి శ్రీనివాస్, రాజేశం, ఎల్లాగౌడ్, మట్ట రాణి ఉన్నారు. -
గంభీరావుపేట ‘సెస్’ డైరెక్టర్ ఎన్నిక చెల్లదు
● సహకార ట్రిబ్యునల్ ఆదేశాలు ● మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టంసిరిసిల్ల: జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) గంభీరావుపేట డైరెక్టర్ గౌరినేని నారాయణరావు ఎన్నిక చెల్లదంటూ సహకార ట్రిబ్యునల్ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఆర్డర్ కాపీలను ‘సెస్’ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్యాదవ్ సోమవారం సిరిసిల్లలో విలేకరులకు అందించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం... సెస్ సంస్థలోని 15 డైరెక్టర్ స్థానాలకు 2022 డిసెంబరులో ఎన్నికలు నిర్వహించారు. గంభీరావుపేట డైరెక్టర్గా గౌరినేని నారాయణరావు గెలిచినట్లు అప్పటి ఎన్నికల అధికారి ప్రకటించారు. దీన్ని సవాల్ చేస్తూ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్యాదవ్ సహకార శాఖ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలతో ఎన్నికల ఫలితాలు తారుమారు చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ మద్దతుదారుడు గౌరీనేని నారాయణరావు గెలిచినట్టు 2022 డిసెంబరు 26న ఎన్నికల అధికారి ప్రకటించడాన్ని సవాల చేస్తూ వరంగల్లోని కో–ఆపరేటీవ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. సాక్ష్యాలు పరిశీలించిన సహకారశాఖ ట్రిబ్యునల్ ఆ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఈ విషయమై ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావును ‘సాక్షి’ వివరణ కోరగా సహకార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పెద్దపులి వచ్చింది.. అప్రమత్తంగా ఉండండి
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి పెద్దపులి వచ్చిందని.. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్బీవో కిరణ్ కోరారు. జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతం నుంచి పెద్దపులి వచ్చిందన్న సమాచారం నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు వీర్నపల్లి, గంభీరావుపేట, గొల్లపల్లి సెక్షన్ల పరిధిలోని గ్రామాల్లో సోమవారం అవగాహన కల్పించారు. పొలాల వద్దకు రైతులు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. అటవీ ప్రాంతంలోకి పశువులను పంపొద్దన్నారు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీహరిప్రసాద్, వీర్నపల్లి, గొల్లపల్లి అటవీ సెక్షన్ అధికారులు రంజిత్కుమార్, సకారాం, బీట్ అధికారులు శ్రీకాంత్, తిరుపతినాయక్, రజిత, కిరణ్ పాల్గొన్నారు. -
ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలు
● రూ.23,28,500 నగదు సీజ్ ● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల క్రైం: జిల్లాలో ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే సోమవారం తెలిపారు. రెండు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. 98 కేసులలో 1,525 లీటర్ల మద్యం, రూ.23,28,500 నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 11 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన, 224 కేసుల్లో 782 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా బందోబస్తు చేపట్టినట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు. ముస్తాబాద్ జెడ్పీ హైస్కూల్లోని పోలింగ్స్టేషన్లో ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. సీఐ మొగిలి, ఎస్సై గణేశ్ ఉన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అయితే కొందరు సర్పంచ్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే.. వారి పెట్టిన ఖర్చుకు పొంతన లేకుండా ఉంది. ఎంత ప్రచారం చేసినా ఇరువై ఓట్లు కూడా దాటకపోవడంతో అవాక్కయ్యారు. తంగళ్లపల్లి మండల వ్యాప్తంగా ఆదివారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బద్దెనపల్లిలో కొదాడి రిషితకు 8 ఓట్లు, బస్వాపూర్లో సర్కార్రెడ్డికి 9, పూర్మాణి రంగారెడ్డికి 14, చీర్లవంచలో మంజుల వరికి 13, గోపాల్రావుపల్లెలో పుర్సాని నాగరాజుకు 10, సగ్గుపాటి నరేశ్కు 19, ఎడ్ల మల్లయ్యకు 10, ఓబులాపూర్లో కొమ్మెట భాగ్యలతకు 15, పద్మనగర్లో ముడారి రాజమ్మకు 12, రాళ్లపేటలో బోయిని భానుచందర్కు 9, బోయిని కార్తీక్కు 17, రామచంద్రాపూర్లో తాళ్లపెల్లి పీతాంబరంగౌడ్కు 13, రేషం కనకయ్యకు 8 ఓట్లు మాత్రమే వచ్చాయి. తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలంలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ముగిశాయి. అయితే చాలా మంది ఓటర్లకు ఓటు వేయడం రాలేదు. దీంతో చాలా ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో 114 ఓట్లు, ఇందిరమ్మకాలనీలో 92, జిల్లెల్లలో 51 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. అంతేకాకుండా మండల వ్యాప్తంగా నోటాకు 99 ఓట్లు పోల్కావడం గమనార్హం. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్ల గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒకటో వార్డు సభ్యురాలిగా పోటీచేసిన ఉడుతల కవితను టాస్ రూపంలో అదృష్టం వరించింది. ఒకటోవార్డులో మొత్తం 297 ఓట్లు ఉండగా 250 ఓట్లు పోల్ కాగా.. 7 ఓట్లు చెల్లలేదు, 3 ఓట్లు నోటాకు వేశారు. దీంతో పోటీపడిన తాళ్లపెల్లి అంజవ్వ, ఉడుతల కవితలకు చెరో 120 ఓట్లు వచ్చాయి. దీంతో పోలింగ్ అధికారులు టాస్ వేయగా.. అదృష్టం కవితను వరించడంతో వార్డు సభ్యురాలిగా ఎన్నికై ంది. సిరిసిల్లటౌన్: సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు కోరారు. ఈమేరకు సిరిసిల్లలోని అమృత్లాల్శుక్లా కార్మికభవన్ వద్ద యూనియాన్ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే అఖిల భారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సూరం పద్మ, అన్నల్దాస్ గణేశ్, దాసరి రూప, బెజుగం సురేష్, జిందం కమలాకర్, సుల్తాన్ నర్సయ్య, గడ్డం రాజశేఖర్, బింగి సంపత్, సూరం వీరేశం పాల్గొన్నారు. -
భూముల వివరాలు పక్కాగా ఉండాలి
● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: భూభారతిలోని భూముల వివరాలు పక్కాగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం భూభారతిపై సమీక్షించారు. భూ భారతి, సాదాబైనామా, రెవె న్యూసదస్సుల దరఖాస్తులు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల స్థితిగతులపై ఇన్చార్జి కలెక్టర్ ఆరా తీశారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, పర్యవేక్షకులు వేణు, సురేశ్ పాల్గొన్నారు. అమృత్ పనులు పూర్తి చేయాలి జిల్లాలో అమృత్ 2.0లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్(ఎంఏ–యూడీ) సెక్రటరీ శ్రీదేవి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్), మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అమృత్ 2.0 పనులపై ప్రతీవారం సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో రూ.100కోట్లతో చేపట్టిన నీటి ట్యాంకులు, పైప్లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో రూ.13కోట్లతో చేపట్టిన పనుల పురోగతిపై అభినందించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, అన్వేశ్, పబ్లిక్ హెల్త్ డీఈ వరుణ్ పాల్గొన్నారు. -
పదవులకు వన్నె తెచ్చే పనులు చేయండి
● మూడో విడత ఎన్నికల్లో మనోళ్లకు సాయం చేయండి ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సిరిసిల్ల: గ్రామాల్లో సర్పంచ్ పదవీ ఎంతో కీలకమైందని, పదవులకు వన్నె తెచ్చేలా పనులు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు సూచించారు. జిల్లాలో తొలి, మలి విడతల్లో సర్పంచులుగా ఎన్నికై న బీఆర్ఎస్ మద్దతుదారులను సిరిసిల్ల తెలంగాణభవన్లో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశం స్థాయిలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఉంటారని, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా స్థాయిలో జెడ్పీ, మండల స్థాయిలో మండల పరిషత్, గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ పాలకవర్గాలు ఉంటాయని వివరించారు. ఎంపీటీసీ సభ్యులు గ్రామానికి, మండలానికి సంధానకర్తలని, జెడ్పీటీసీ సభ్యులు మండలానికి జెడ్పీకి సంధానకర్తలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం మనం పన్నుల రూపంలో కట్టే డబ్బులను ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామాలకు 70 శాతం నిధులు వస్తాయని, మండల పరిషత్లకు 20 శాతం, జెడ్పీలకు 10 శాతం నిధులు వస్తాయని వివరించారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయిలో వర్క్షాప్ నిర్వహిస్తామని కేటీఆర్ వివరించారు. రిటైర్డు డీపీవోలతోపాటు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉన్న వ్యక్తులతో వర్క్షాప్ ఏర్పాటు చేస్తామన్నారు. మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో మన బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచే విధంగా చూడాలన్నారు. మీ బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి మనోళ్లు గెలిచేలా అండగా నిలవాలని కోరారు. వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చలిమెడ లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ వేములవాడ ప్రాంతంలో అక్కడి ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్లను బెదిరింపుకు గురిచేసినా.. ప్రజలు మనోళ్లకే ఓట్లు వేసి గెలిపించారన్నారు. వీరసైనికుల్లా ఎన్నికల్లో పని చేసి గెలిచిన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పల్లెలు ఎంత అభివృద్ధి సాధించాయో మీ కళ్ల ముందే ఉందన్నారు. ఈ రెండేళ్ల పాలనలో ఏం జరుగుతుందో ప్రజలు చూస్తున్నారని వివరించారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల్లో సత్తా చాటాలని ఆయన కోరారు. జిల్లాలో బీఆర్ఎస్ మద్ధతుదారులైన సర్పంచ్లను ఈ సందర్భంగా సన్మానించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమా, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ‘సెస్’ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, పార్టీ నాయకులు గోక బాపురెడ్డి, సిద్దం వేణు, ఏనుగు మనోహర్రెడ్డి, గజభీంకార్ రాజన్న, మల్యాల దేవయ్య, రాఘవరెడ్డి పాల్గొన్నారు. -
నమ్మకు నమ్మకు ఈ రేయిని!
సిరిసిల్ల: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మూడో విడత నాలుగు మండలాల్లో బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో సోమవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ప్రచారం నిలిచిపోవడంతో అభ్యర్థులు ఓట్లను కొనేందుకు అనుచరులు, అనుయాయులను కలుపుకొని నోట్లకట్టలతో బయలుదేరారు. ఇప్పటికే గ్రామాల్లో మందు పొంగిపొర్లుతుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉండడంతో అభ్యర్థులు అప్రమత్తమయ్యారు. ఈ ఒక్క రాత్రి గడిస్తే.. రేపు సాయంత్రానికి గెలుపోటములు తేలిపోతాయి. నోట్ల పంపిణీకి ఓ లెక్కుంది.. జిల్లాలోని మూడో విడతలో ప్రధానంగా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బరిలో నిలిచిన అభ్యర్థులు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఓట్లు రాబట్టాలంటే నోట్లు పంపిణీ చేయాల్సిందేనన్న అభిప్రాయంలో అభ్యర్థులు ఉన్నారు. దానికో లెక్క పెట్టుకున్నారు. ప్రత్యర్థి ఎంత పంపిణీ చేస్తున్నాడో తెలుసుకొని.. అంతకుమించి పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా.. గుట్టుచప్పుడు కాకుండా చేయడం విశేషం. ఇప్పటికే కులసంఘాలను, యువజన సంఘాలను, మహిళా సంఘాలను మచ్చిక చేసుకుని ఓట్లు పొందేలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. నేడు పోలింగ్ కేంద్రాలకు తరలనున్న సిబ్బంది తుది విడత పంచాయతీ ఎన్నికలకు 914 మంది(పీవో) ప్రిసైడింగ్ అధికారులు, 1,244 మంది(ఓపీవోలు) విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల సామగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేదుకు ఆయా మండల కేంద్రాల్లో సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రంలోగా నాలుగు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది తరలివెళ్లనున్నారు. సమస్యాత్మక గ్రామాలు, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన పోలీస్ భద్రతను కల్పించేందుకు జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. పోలింగ్ సిబ్బందితో పాటే.. పోలీసులు ఆయా గ్రామాలకు చేరనున్నారు.గ్రామాలు 80, వార్డుస్థానాలు 380ఓటర్లు ఇలా.. మండలం ఓటర్లు గంభీరావుపేట 36,807 ముస్తాబాద్ 38,500 వీర్నపల్లి 11,727 ఎల్లారెడ్డిపేట 40,886ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సిబ్బంది మంగళవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 87 గ్రామపంచాయతీలు ఉండగా.. ఇప్పటికే 7 గ్రామాలు ఏకగీవ్రమయ్యాయి. మిగిలిన 80 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు, 551 వార్డుస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
కోడ్ ముగిసే వరకు ర్యాలీలు నిషేధం
● ఎస్పీ మహేశ్ బీ గీతేఇల్లంతకుంట(మానకొండూర్): జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, కందికట్కూర్, ఇల్లంతకుంట పోలింగ్ స్టేషన్లను ఆదివారం పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. ఇల్లంతకుంట పోలింగ్స్టేషన్కు ఓటు వేయడానికి వచ్చిన 95 ఏళ్ల వృద్ధురాలు భీమనాతిని లక్ష్మిని పలకరించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధమని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలు తనిఖీ బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక, నీలోజిపల్లి, బోయినపల్లి, విలాసాగర్ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ మహేశ్ బీ గీతే పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. డీఎస్పీ నాగేంద్రచారి, వేములవాడరూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై ఎన్.రమాకాంత్ ఉన్నారు. -
సచ్చినట్లే లెక్క
నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా ఓటేసి వస్తాను. ఊరిలో ఉండి ఓటేయకుంటే సచ్చినట్లే లెక్క కదా. పానం పోయేంత వరకు ఓటు వేసుడే. చాత కాకపోయినా బడికాడికి పోయి ఓటు సి వస్తే సంతోషం అనిపిస్తుంది. ఓట్లు ఊకే రావు కదా. ఎప్పుడో ఓసారి వచ్చే ఓటును కూడా వేయకుంటే ఎట్లా. అందుకే కష్టమైనా.. ఈడిదాకా వచ్చి ఓటేసిపోతున్నా. – ఆకునూరి మల్లవ్వ, తంగళ్లపల్లి 40 ఏళ్లుగా ఓటు వేస్తున్నా.. నాకు ఓటు పుట్టినప్పటి నుంచి ఎన్నడూ మరవలేదు. ఓటు వేయకుండా ఏనాడు ఇంట్లో ఉండలేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు 40 ఏళ్లకుపైగా ఓటు వేస్తున్న. ఎవరు ఏమనుకున్నా పానం మంచిగా లేకున్నా ఓటు వేసి వస్తా. ఎవరు గెలిసినా ఒక్కటే. నా ఓటు మాత్రం తప్పకుండా వేస్తా. నాకు బుద్ధి తెలిసిన నాటి నుంచి ఇంతే. – గుంటి మల్లయ్య, బోయినపల్లి ఎవరికీ చెప్పొద్దు నాకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి వేస్తూనే ఉన్నా. ఎవరో ఒక్కరు గెలుస్తారు. సంతోషం అనిపిస్తుంది. ఎవరికీ ఓటు వేశారని, ఏ గుర్తుకు వేశారని ఎవరూ అడిగినా నేను చెప్పను. ఎందుకంటే ఓటు రహస్యం. ఎవరికీ వేశామో బయటకు చెప్పాల్సిన పని లేదు. మనసులో ఉంటే చాలు. నేను ఓటు వేసిన వ్యక్తి గెలిచినా.. ఓడినా నాకు సంబంధం లేదు. ఓటుమాత్రం మరిచిపోకుండా వేస్తాను. – కొండ విఠల్, తంగళ్లపల్లి ఎట్ల మరిచిపోతా ఓటు వేసుడు ఎట్లా మరిచిపోతా. మొన్నటి దాకా ఓటు వేయమని పోటీ చేసినోళ్లు అందరూ ఇంటికొచ్చిపోయిరి. చేతులు జోడించి దండం పెట్టిరి. నేను ఓటు వేసినా.. వేయకున్నా.. ఎవరో ఒక్కరు గెలుస్తరు. అందరూ గెలువరు కదా. నేను ఇప్పటి వరకు ఏ ఎన్నికలు జరిగినా ఓటు వేసిన. పానం ఉన్నంత వరకు ఓటు వేస్తా. ఎవరూ గెలిచినా మనోళ్లే. చేతకాకున్నా బడిదాకా పోయి ఓటు వేసి వస్తున్న. – గోగు ఎల్లవ్వ, తాడూరు -
కాంగ్రెస్లో పలువురి చేరిక
వేములవాడ/చందుర్తి/వేములవాడరూరల్: చందుర్తి మండలం అనంతపల్లి సర్పంచ్గా గెలుపొందిన చిలుక బాబుతోపాటు పలువురు వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో ఆదివారం పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతపల్లి సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి చిలుక బాబు గెలుపొందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సర్పంచ్తోపాటు వార్డు సభ్యులు ఐతం లహరి, కంబాల లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు ఐతం శంకరయ్యలు పార్టీలో చేరారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చందనం శ్రీనివాస్, వార్డు సభ్యులుగా ఎన్నికైన నేరెళ్ల సరిత, గిరి ప్రసాద్, హరిదాసు, శ్రీనివాస్లతోపాటు సుమారు 50 మంది కాంగ్రెస్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయన్నారు. వీరికి విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
పల్లెపోరు ‘ప్రత్యక్షం’
● పంచాయతీ ఎన్నికల్లో వెబ్కాస్టింగ్ ● 195 పల్లె ఎన్నికలపై నిఘా నేత్రం ● కలెక్టరేట్లో పోలింగ్ కేంద్రాలు ప్రత్యక్షంసిరిసిల్ల/బోయినపల్లి/ఇల్లంతకుంట: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెబ్కాస్టింగ్ విధానాన్ని అమలు చేశారు. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అధికారులు నేరుగా పల్లెల్లో జరిగే ఎన్నికల పర్వాన్ని ప్రత్యక్షంగా చూశారు. జిల్లాలోని బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని 77 గ్రామాల్లో 530 వార్డుల్లో ఆదివారం ఎన్నికలు జరగ్గా.. 195 పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ కలెక్టరేట్ నుంచి వెబ్కాస్టింగ్ను పరిశీలించారు. ఎన్నికల సంఘం సూచన మేరకు జిల్లాలో వెబ్కాస్టింగ్ను ఏర్పాటు చేశారు. పల్లెల్లో జరిగే ఎన్నికలను లైవ్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తూ ఆన్లైన్లో జిల్లా కేంద్రానికి, అక్కడి నుంచి రాష్ట్ర రాజధానికి అనుసంధానించారు. డీపీవో షరీఫొ ద్దీన్, ఈడీఎం శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. లెక్కింపు కేంద్రాల పరిశీలన ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. రెండో విడత ఎన్నికలు జరిగిన ఇల్లంతకుంట మండల కేంద్రంతోపాటు వల్లంపట్ల, తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, తహసీల్దార్లు జయంత్, నారాయణరెడ్డి, ఎంపీడీవోలు శశికళ, లక్ష్మీనారాయణ, జయశీల ఉన్నారు. -
పల్లెపోరులో కాంగ్రెస్ హవా
● రెండో విడతలో 77 జీపీలకు ఎన్నికలు ● 40 స్థానాల్లో సత్తాచాటిన హస్తం పార్టీ ● తంగళ్లపల్లిలో బీఆర్ఎస్ జోరుసిరిసిల్ల: రెండో విడత పంచాయతీ పోరులో కాంగ్రెస్ పార్టీ హవా చాటింది. హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. జిల్లాలోని బోయినపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని 77 గ్రామపంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. నామినేషన్ల సమయంలోనే 11 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 40 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, 30 గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 6 గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు, 12 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని తంగళ్లపల్లి మండలంలో గులాబీ పార్టీ పట్టు నిలుపుకుంది. మండల వ్యాప్తంగా 30 గ్రామాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 15 మంది విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడుగురు, బీజేపీ అభ్యర్థులు నలుగురు, ఇతరులు నలుగురు గెలుపొందారు. బోయినపల్లి మండల వ్యాప్తంగా 23 గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ 13 గ్రామాలను హస్తగతం చేసుకోగా, ఆరు గ్రామాల్లో బీఆర్ఎస్, ఒక చోట బీజేపీ, ఇతరులు మూడు గ్రామాల్లో గెలుపొందారు. ఇల్లంతకుంట మండలంలోని 35 గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన 20 మంది విజయం సాధించగా, 9 గ్రామాల్లో బీఆర్ఎస్, ఒక స్థానాన్ని బీజేపీ కై వసం చేసుకోగా, ఐదు గ్రామాల్లో ఇతరులు విజయం సాధించారు. పల్లె ఓటరు చైతన్యం మొదటి విడతకంటే రెండో విడతలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని 77 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు, 530 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 84.41 శాతం పోలింగ్ నమోదైంది. యాసంగి(రబీ) సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులు, మహిళలు పొద్దున్నే ఓటేసి పనులకు వెళ్లడం కనిపించింది. క్షేత్రస్థాయిలో పోలింగ్ పరిశీలన బోయినపల్లి మండలం నీలోజిపల్లి, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. నీలోజిపల్లిలో వేములవాడ ఆర్డీవో రాధాబాయి, సీపీవో శ్రీనివాసాచార్యులు, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల ఉండగా.. తంగళ్లపల్లిలో అదనపు కలెక్టర్ నగేశ్, తహసీల్దార్ జయంత్కుమార్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ ఎంపీవోలు ఉన్నారు. ఇల్లంతకుంటలో అధిక పోలింగ్ మూడు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా ఇల్లంతకుంట మండలంలో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. మహిళా ఓటర్లే అధికం మూడు మండలాల్లో మొత్తం ఓటర్లు 1,04,905 మంది ఉండగా మహిళా ఓటర్లు 54,131, పురుషులు 50,773 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,358 మంది అధికంగా ఉన్నారు. పురుషులు 42,023 మంది ఓటుహక్కు వినియోగించుకుని ఓటింగ్ శాతం 82.77 నమోదు చేయగా.. మహిళలు 46,529 మంది ఓటుహక్కును వినియోగించుకుని 85.96 శాతం నమోదు చేశారు. మహిళా ఓటర్లలో చైతన్యం కనిపించింది. పటిష్ట పోలీసు భద్రత పోలింగ్కు పటిష్టమైన పోలీస్ భద్రతను ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి పర్యవేక్షణలో సాగింది. 722 మందితో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టడి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఓట్ల లెక్కింపు ముగిసే వరకు పోలీసులు భద్రత చర్యలు పర్యవేక్షించారు. పార్టీల వారీగా ఫలితాలు కాంగ్రెస్ 40 బీఆర్ఎస్ 30 బీజేపీ 06 ఇతరులు 12 -
శ్రీవారికి ఏకాంతసేవ
సిరిసిల్లటౌన్: శ్రీశాల క్షేత్రంలో శ్రీవారికి ఏకాంతసేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దేవదేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, అర్చకస్వాములు మాడంరాజు కృష్ణమాచారి, వర్ధనాచారి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి పాటించాలి ముస్తాబాద్(సిరిసిల్ల): ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించేలా పర్యవేక్షించాలని మోడల్ కోడ్ జిల్లా నోడల్ అధికారి శేషాద్రి ఆదేశించారు. ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి చెక్పోస్టును ఆదివారం పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల విధులను అధికారులు, ఉద్యోగులు పారదర్శకంగా చేయాలన్నారు. ఎంపీవో వాహిద్, ఏపీవో ఆనంద్మోహన్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు పరిశీలన తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదివారం పరిశీలించారు. పోలింగ్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సారంపల్లి, మండేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సీపీవో శ్రీనివాసాచారి, తహసీల్దార్ జయంత్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఓటేయడం ఆనందంగా ఉంది ఇల్లంతకుంట(మానకొండూర్): తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన బండారి రక్షిత తెలిపింది. మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపింది. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చదువుతుంది. దుబాయ్ నుంచి ఓటేసేందుకు..తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఓటు వేయాలని ఎన్నికల సంఘం ఎంత ప్రచారం కల్పించినా.. పోలింగ్ రోజు సెలవు ఇచ్చినా పట్టణ ప్రజలు బయటకు రావడం లేదు. కానీ దుబాయ్లో ఉంటున్న వ్యక్తి రూ.50వేలు వెచ్చించి సొంతూరికి వచ్చాడు. తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లెకు చెందిన యువకుడు గంభీరావుపేట వేణు ఉపాధి నిమిత్తం దుబాయ్లో ఉంటున్నాడు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నాడు. నేడు సిరిసిల్లకు కేటీఆర్ సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం సిరిసిల్ల కు వస్తున్నారు. తొలి, మలి విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులను సన్మానించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
‘ట్రినిటి’కి జాతీయస్థాయి అవార్డు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ట్రినిటి ఇంజినీరింగ్ కాలేజీ(అటానమస్)కు జాతీయస్థాయి ఫ్యూచర్ రెడీ ఇనిస్టిట్యూషన్ అవార్డు – 2025ను హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. బ్రెయిన్ ఫీడ్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి వేదికపై ఉన్నత విద్యామండలి సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫె సర్ బాలకృష్ణరెడ్డి ద్వారా విద్యాసంస్థ ప్రతినిధులు అవార్డు అందుకున్నారు. జిల్లాలో వ్యాప్తంగా తమ కాలేజీకే అవార్డు దక్కడం సంతోషకరమని ట్రినిటి ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, డైరెక్టర్ మమతారెడ్డి, కో ఆర్డినేటర్ అశోక్కుమార్, ప్రిన్సిపాల్ మణిగణేశన్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. సర్పంచ్ అభ్యర్థి కళ్లలో కారం చల్లి దాడిశంకరపట్నం: మండలంలోని మొలంగూర్ గ్రామపంచాయతీ అభ్యర్థి దండు కొమురయ్య కళ్లలో కారం చల్లి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ మద్దతుతో పోటీచేస్తున్న కొమురయ్య శుక్రవారం రాత్రి ఒంటరిగా వెళ్తున్న క్రమంలో ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు కళ్లలో కారంపొడి చల్లి దాడి చేసి పారిపోయినట్లు బాధితుడు తెలిపాడు. సృహతప్పి పడిపోయి తేరుకున్న తర్వాత 100కు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి బండి సంజయ్కుమార్ ఫోన్లో మాట్లాడారు. -
ఎన్నికల స్వరూపం మారింది
సిరిసిల్ల: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి పల్లెలు అభివృద్ధి చెంది పచ్చగా ఉన్నప్పుడే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం సాగుతోంది. ఆదివారం జరిగే రెండో విడత ఎన్నికలతో పల్లెలు సందడిగా మారాయి. నాలుగున్నర దశాబ్దాల కిందట తొలితరం సర్పంచులుగా పనిచేసిన వారెందరో ఉన్నారు. అప్పటి పల్లె వ్యవస్థ, ఎన్నికల విధానం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. నోటుస్వామ్యం వర్ధిల్లుతున్న నేటి రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. డబ్బులు, మద్యమే ఇప్పటి ఎన్నికలను శాసిస్తూ పల్లెల్లో అశాంతికి కారణమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు కులసంఘాలను కూడగడుతూ.. యువజన సంఘాలకు గాలం వేస్తూ.. మహిళా సంఘాలను మచ్చిక చేసుకుంటున్నారు. పార్టీ రహితంగా సాగాల్సిన గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీల రంగులను అద్ది అభ్యర్థులు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. నాటి ఎన్నికల తీరు.. నేటి ఎన్నికల పరిణామాలను గమనిస్తున్న వారెందరో ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో విలువ ఉంది. అలాంటి ఓటును అమ్ముకునే, కొనుగోలు చేసే సంస్కృతి తొలితరం సర్పంచులకు మనోవేదన కలిగిస్తోంది. నాటి సర్పంచుల మనో‘గతం’ఇదీ. నోటే ఓటైంది వ్యాపారంగా రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు తొలితరం సర్పంచుల మనో‘గతం’ -
ఆరు గంటలు పనిచేస్తున్నా
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటుతో ఉపాధి దొరుకుతుంది. ప్రింటర్స్ నుంచి ఫ్లెక్సీలు తీసుకొచ్చి ఫ్రేమ్లకు అతికించడం, గిరాకీ చెప్పిన చోట్లలో కట్టేస్తున్నాం. ఒక్క ఫ్లెక్సీ కడితే రూ.150 నుంచి రూ.200 ఇస్తారు. సాధారణ రోజుల్లో నెలలో 10 సార్లు పని దొరికేది. ఇప్పుడు పదిహేను రోజులుగా నిరంతరం పని ఉంటుంది. ప్రతీ రోజు 6గంటలకు పైగా ఫ్లెక్సీల ఏర్పాటులో బిజీగా ఉంటున్నాం. – యెల్లె లక్ష్మణ్, ఫ్లెక్సీ కార్మికుడు 300 పాటలు రికార్డు చేశాం ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ప్రచారానికి మూడు వందల పాటలను రికార్డు చేశాం. నాకు 30 ఏళ్లుగా రికార్డింగ్ రంగంలో అనుభవం ఉంది. ఇరవై ఏళ్ల క్రితం సిరిసిల్ల లో రికార్డింగ్ స్డూడియో ఏర్పాటు చేసిన. అభ్యర్థులు కేవలం తమ కరపత్రాలు, మేనిఫెస్టో అందిస్తే చాలు వారిపై పాటలు కట్టి రికార్డు చేసి పంపిస్తాం. మా స్డూడియోలో ఆరుగురు రచయితలు, ఆరుగురు సింగర్స్, ముగ్గురు కోరస్ కళాకారులు ఉన్నారు. పాటల రాయడం, ప్లేబ్యాక్, సంగీతం, రికార్డింగ్ అంతా మాదే. చాలా మంది అభ్యర్థులకు ప్రచార బాణీలు కూడా అందిస్తున్నాం. సర్పంచ్ ఎన్నికలు గతంలో కన్నా ఎక్కువ గిరాకీ వస్తుంది. – ఎండీ సత్తార్, రికార్డింగ్ స్డూడియో నిర్వాహకుడు -
అర్చనకు గోల్డ్ మెడల్
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగ క్రీడాకారిణి అంతర్జాతీయ పారా త్రో బాల్ చాంపియన్షిప్లో గోల్డ్మెడల్ సాధించింది. చంద్రంపేటకు చెందిన మిట్టపల్లి అర్చన శ్రీలంకలో ఈనెల 6, 7 తేదీలలో జరిగిన ఫస్ట్ సౌత్ ఆసియన్ పారా త్రో బాల్ చాంపియన్షిప్లో పాల్గొన్నారు. గోల్డ్మెడల్ సాధించి శనివారం స్వగ్రామానికి చేరుకోగా.. సిరిసిల్ల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సత్కరించారు. ప్రస్తుతం సీ్త్ర శిశు సంక్షేమ వయోవృద్ధులు, దివ్యాంగుల శాఖలో ‘మల్టీ టాస్క్’ విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారు. అర్చనను సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీలంకలో జరిగిన పోటీలకు ప్రభుత్వం పంపింది. వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది శాంతి ప్రకాశ్శుక్లా, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధాబాయి, విశ్రాంత ఉపన్యాసకులు ఝాన్సీశుక్లా, యెల్లె సువర్ణ, సీనియర్ పాత్రికేయులు తడుక విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో నకిలీనోటు కలకలం? వేములవాడ: మున్సిపల్ పరిధిలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీనోటు కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతీ నెల చెల్లించాల్సి ఉంటుంది. నగదు చెల్లించే క్రమంలో రూ.500 నకిలీ నోటు రావడంతో ఆందోళనకు గురయ్యారు. గతంలో ఓసారి రూ.500 నోటు నకిలీది వచ్చిందని, ఇది రెండోసారి కావడంతో మహిళా సంఘాల ప్రతినిధులకు భయాందోళన గురవుతున్నారు. -
కార్మికుల ప్రాణాలతో చెలగాటం
అర్హత లేని వ్యక్తులతో పరీక్షలు చేయించడం కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. సంస్థ ద్వారా కార్మికులకు అందించిన రిపోర్టులతో ఎక్కడ వైద్యం చేయించుకోవాలి. కార్మికులు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే అక్కడ మళ్లీ పరీక్షలు చేస్తున్నారు. సంస్థ ద్వారా సిరిసిల్లకు చెందిన ఓ డాక్టర్ను నియమించి ఏమి లాభం. శిబిరాలు నిర్వహించకుండా కేవలం రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అవి కూడా ఇతర రంగాలకు చెందిన వ్యక్తుల నమూనాలు తీస్తున్నారు. – బియ్యంకార్ శ్రీనివాస్, సంఘటిత, అసంఘటిత రంగాల ఎంప్లాయీస్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడుజిల్లాలో భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికుల సంక్షేమానికి ఆరోగ్య పరీక్షలు పారదర్శకంగా చేపడుతున్నాం. అర్హత లేని వ్యక్తులతో రక్త నమూనాలు తీయించడం లేదు. 2023 నుంచి ఇప్పటి వరకు సుమారు 35వేల మంది శాంపిల్స్ సేకరించి, రిపోర్టులు అందజేశాం. జిల్లాలో 7 బృందాల్లో పది మంది అర్హులైన సిబ్బందితో శాంపిల్స్ సేకరిస్తున్నాం. ఈసీజీ, పీఎఫ్టీ, ఆడియో విజన్ వంటి పరీక్షలకు చిన్నసైజు ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నాం. – భాస్కర తిరుపతి, డివిజనల్ మేనేజర్ -
పనిమంతులకు ఎన్నికళ!
సిరిసిల్లటౌన్: పల్లెపోరులో పనిమంతులకు చేతినిండా పని ఉంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులకు ఎన్నికల ఉపాధితో సంతోషంగా ఉంటున్నారు. సాధారణ రోజుల్లో తక్కువగా ఉండే పనులు ఇప్పుడు పొద్దస్తమానం ఉండడంతో నాలుగురాళ్లు సంపాదిస్తూ... ఉత్సాహంగా ఉంటున్నారు. ఎన్నికల ప్రచారంలో లైటింగ్, ప్రింటింగ్, ఫ్లెక్సీ ఏర్పాటు, ఆటో తదితర కార్మికులు, చిరువ్యాపారులకు సర్పంచ్ ఎన్నికల ఆర్డర్లు కలిసి వస్తున్నాయి. పక్షం రోజులు ఉండే సీజనల్ ఆర్డర్లు వస్తుండడంతో మూడు పూటలు కష్టపడుతూ.. మెరుగైన ఉపాధి పొందుతున్నారు. జిల్లా కేంద్రం సిరిసిల్లలో ఎన్నికలు ఉపాధి పొందుతున్న కష్టజీవులపై కథనం.. సిరిసిల్లలో ఎలక్షన్ జోష్ మార్కెట్కు సర్పంచ్ ఎన్నికల హోష్ ప్రచార కార్మికులకు సీజనల్ ఉపాధి పక్షం రోజులుగా ఎడతెరపి లేకుండా పనులు -
అప్పట్లో డబ్బుల ప్రభావం లేదు
నేను వేములవాడ పాతసమితి పరిధిలోని రుద్రవరం సర్పంచ్గా 1964లో ఏకగ్రీవమయ్యాను. అప్పటికే నేను నిజాం కాలేజీలో చదువుతున్నాను. మా నాన్న అనంతరావు సిరిసిల్లలో అడ్వకేట్గా ఉన్నారు. ఊరిలో సేవచేయాలని సర్పంచ్ను చేశారు. అప్పటి నుంచి 1980 వరకు మూడుసార్లు ఏకగ్రీవంగానే సర్పంచ్గా పనిచేశారు. రాష్ట్రస్థాయిలో రుద్రవరం ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికై ంది. అప్పట్లో డబ్బు ప్రభావం అంతగా లేదు. ఇప్పుడు డబ్బు లేనిదే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు. నేను 1980 నుంచి 1986 వరకు వేములవాడ సమితి అధ్యక్షుడిగా ఉన్నాను. 1987 నుంచి 1992 వరకు ఎంపీపీగా పనిచేశాను. కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్గా, 1999లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా పనిచేశాను. – రేగులపాటి పాపారావు, రుద్రవరం మాజీ సర్పంచ్, మాజీ ఎమ్మెల్యే -
వార్డుల్లో కుటుంబ సభ్యుల పోటీ
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలంలోని పలు పంచాయతీల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు వార్డుస్థానాలకు పోటీపడుతున్నారు. అందుగులపల్లి పంచాయతీలో మాజీ ఉపసర్పంచ్ తలారి స్వప్న మళ్లీ వార్డు సభ్యురాలిగా పోటీపడుతుండగా ఈసారి ఆమె భర్త తలారి సాగర్ కూడా వార్డు సభ్యుడిగా వేర్వేరు స్థానాల్లో పోటీచేస్తున్నారు. అలాగే గుర్రాంపల్లి పంచాయతీలో సుల్తాన్కుమార్ 6వ వార్డులో, ఆయన భార్య విజయ 7వ వార్డులో పోటీకి దిగారు. ఇక కాసులపల్లి పంచాయతీలో వెల్ది రాజ్యలక్ష్మి 3వ వార్డులో, ఆమె కొడుకు వెల్ది సాయిచంద్రావు 2వ వార్డులో పోటీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వ్యక్తిపై కేసుతంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల ప్రచారం సమయం ముగిసి 48 గంటల సైలెంట్ పీరియడ్లో కోడ్ ఉల్లంఘించి ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. తంగళ్లపల్లి మండలం కేసీఆర్నగర్లో సిరిసిల్లకు చెందిన సంపత్ శనివారం ప్రచారం చేస్తుండగా ఎఫ్ఎస్టీ టీమ్ గుర్తించి.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సంపత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.సుల్తాన్ కుమార్, విజయ తలారి సాగర్, స్వప్న -
పల్లెపోరు
ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 202577 గ్రామాల్లో● నేడు మలివిడత పంచాయతీ ఎన్నికలు ● మూడు మండలాలు.. 77 గ్రామాలు ● బ్యాలెట్ బాక్స్లతో పల్లెలకు వెళ్లిన సిబ్బందిసిరిసిల్ల: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఇల్లంతకుంట, బోయినపల్లి, తంగళ్లపల్లి మండలాల్లోని 88 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటికే 11 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 77 గ్రామాల్లోని సర్పంచ్ స్థానాలకు 279 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే 228 వార్డుస్థానాలు ఏకగ్రీవం కావడంతో 530 వార్డుస్థానాలకు 1323 మంది బరిలో నిలిచారు. ఈమేరకు ఆయా గ్రామాలకు 910 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,093 మంది ఓపీవోలు ఎన్నికల సామగ్రితో తరలివెళ్లారు. ఎన్నికల ఏర్పాట్లను, సామగ్రి పంపిణీని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పరిశీలించారు. మరో వైపు ఎన్నికలకు 722 మంది పోలీసులు బందోబస్తు చేపడుతున్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. పల్లెలకు వెళ్లిన ఎన్నికల సిబ్బంది ఇల్లంతకుంట, బోయినపల్లి, తంగళ్లపల్లి మండలాల్లో రెండో విడత జరిగే ఎన్నికల నిర్వహణకు 910 మంది(పీవో) ప్రిసైడింగ్ అధికారులు, 1,093 మంది (ఓపీవోలు) ఇతర ఎన్నికల అధికారులు పల్లెలకు శనివారం తరలివెళ్లారు. ఎన్నికల సామగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేదుకు బోయినపల్లి మండలంలో నాలుగు జోన్లు, 8 రూట్లు, ఇల్లంతకుంటలో ఐదు జోన్లు, 8 రూట్లు, తంగళ్లపల్లి మండలంలో ఐదు జోన్లు, 10 రూట్లను సిద్ధం చేశారు. మూడు మండలాల్లో 530 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఎలాంటి శిబిరాలు లేకుండా ముందుచూపుతో సరిహద్దులను ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల పరిశీలనఇల్లంతకుంట/తంగళ్లపల్లి/బోయినపల్లి: రెండో విడత ఎన్నికలు జరిగే ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, బోయినపల్లి మండలాల్లోని గ్రామాలకు పోలింగ్ సిబ్బంది తరలివెళ్లారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, బోయినపల్లి మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది సాయంత్రం తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బస్సుల్లో తరలివెళ్లారు. ఇల్లంతకుంట మండలంలో 245 పోలింగ్ స్టేషన్లు, బోయినపల్లి మండలంలో 212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీని అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రాధాభాయి, ఎంపీడీవోలు శశికళ, జయశీల పరిశీలించారు. మండలాలు: బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి గ్రామాలు : 77, ఓటర్లు: 1,11,130 రూట్లు: 26, జోన్లు: 14 పోలింగ్ సిబ్బంది: 2003 పోలీసు సిబ్బంది: 722 క్విక్ రియాక్షన్ టీమ్స్: 7 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు: 03 క్రిటికల్ కేంద్రాల: 14, సెన్సిటివ్ కేంద్రాలు: 26ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుండి... ఓటరు గుర్తింపుకార్డు(ఎపిక్ కార్డు) లేకున్నా ఓటు వేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు. 18 రకాల ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక్కటి ఉంటే చాలని స్పష్టం చేశారు. ఆధార్కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీచేసిన ఉద్యోగి గుర్తింపుకార్డులు, బ్యాంకు, తపాలా కార్యాలయం జారీచేసిన ఫొటోతో కూడిన పాస్బుక్, పాన్కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్ఏఐ) కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా(ఆర్జీఐ) జారీ చేసిన స్మార్ట్కార్డు, శాసనసభ, శాసనమండలి జారీచేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపు కార్డులు, ఫొటోతో కూడిన స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపుకార్డు, లోక్సభ, రాజ్యసభ జారీచేసిన ఎంపీ గుర్తింపుకార్డు, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు జారీచేసిన ఫొటోలతో కూడిన ఉపాధిహామీ జాబ్కార్డు, కేంద్ర కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్కార్డ్, రేషన్కార్డు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువీకరణపత్రాలు, పెన్షన్ పత్రాలు, ఆయుధాల లైసెన్స్, దివ్యాంగ ఽధ్రువీకరణపత్రం, పట్టాదారు పాస్బుక్ వంటి వాటిని ఓటు వేసేందుకు వినియోగించుకోవచ్చు.బోయినపల్లి గ్రామాలు: 23 ఓటర్లు: 30,505 ఏకగ్రీవ గ్రామాలు: 0 ఎన్నికలు జరిగే గ్రామాలు: 23 పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 90 ఎన్నికలు జరిగే వార్డులు: 166 పోటీలో ఉన్న వార్డు సభ్యుల అభ్యర్థులు: 391 ఎన్నికల సిబ్బంది: 548తంగళ్లపల్లి గ్రామాలు: 30 ఓటర్లు: 40,079 ఏకగ్రీవ గ్రామాలు: 03 ఎన్నికలు జరిగే గ్రామాలు: 27 పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 110 ఎన్నికలు జరిగే వార్డులు: 174 పోటీలో ఉన్న వార్డు సభ్యుల అభ్యర్థులు: 478 ఎన్నికల సిబ్బంది: 684ఇల్లంతకుంట గ్రామాలు: 35 ఓటర్లు: 40,546 ఏకగ్రీవ గ్రామాలు: 08 ఎన్నికలు జరిగే గ్రామాలు: 27 పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 79 ఎన్నికలు జరిగే వార్డులు: 190 పోటీలో ఉన్న వార్డు సభ్యుల అభ్యర్థులు: 454 ఎన్నికల సిబ్బంది: 771 -
మాట మీద ఉండే వారు
మాది కోనరావుపేట మండలం నాగారం. 1980లో సర్పంచ్గా పనిచేశాను. అప్పట్లో ప్రజలు మాట మీద ఉండే వారు. ఏదైనా చెబితే గౌరవించే వారు. సర్పంచ్గా గుర్తింపు, గౌరవం ఉండేది. నేను వేములవాడ సమితి ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. మా ఊరి అభివృద్ధికి అనేక పనులు చేశాను. ఇప్పుడు డబ్బుల ప్రభావం ఎక్కువైంది. విలువలు పతనమయ్యాయి. ఆనాటి గౌరవం, మర్యాద ఇప్పటితరంలో లేదు. రాజకీయం అర్థం మారిపోయింది. ఇప్పటి ఎన్నికల తీరు చూస్తే బాధగా ఉంది. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటే.. రేపు ఏదైనా పనిపడితే ప్రజాప్రతినిధిని అడిగే హక్కు ఓటర్లకు ఉంటుందా? అనే అనుమానం కలుగుతుంది.– మ్యాకల భూమయ్య, నాగారం మాజీ సర్పంచ్ -
అర్హులు ఓటుహక్కు వినియోగించుకోవాలి
● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఇల్లంతకుంట(మానకొండూర్)/తంగళ్లపల్లి(సిరిసిల్ల): గ్రామపంచాయతీ ఎన్నికల్లో అర్హులు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ కోరారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలం సారంపల్లిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను శనివారం సందర్శించి మాట్లాడారు. ఇల్లంతకుంట, బోయిన్పల్లి, తంగళ్లపల్లి మండలాల్లోని 77 జీపీలలో సర్పంచ్ స్థానాలకు, 530 వార్డు స్థానాలకు ఈనెల 14న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మూడు మండలాల్లో 910 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,093 మంది ఓపీవోలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. మూడో విడత ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం సిద్ధం చేసిన వీల్చైర్, ఇతర సౌకర్యాలు పరిశీలించారు. సీపీవో శ్రీనివాసాచారి, తహసీల్దార్ జయంత్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీసీవో రామకృష్ణ, నోడల్ అధికారి భారతి, ఇల్లంతకుంట తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీవో శశికళ పాల్గొన్నారు. -
మూడుసార్లు సర్పంచ్గా ఉన్నాను
మాది గంభీరావుపేట మండలం శ్రీగాధ. నేను 1981లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అప్పట్లో నేను చేసిన పనులకు ఎంతో గుర్తింపు, గౌరవం ఉండేది. వరుసగా మూడుసార్లు సర్పంచ్గా పనిచేశాను. ఎన్నికల్లో అప్పుడు రూ.130 మాత్రమే ఖర్చు అయింది. ఓటర్లు నమ్మకంగా ఉండేవారు. మాట మీదనే ఓటు వేసేవారు. గ్రామాభివృద్ధి జరిగేది. ఇప్పుడు రాజకీయాలు చూస్తే బాధ కలుగుతుంది. ఎన్నికల్లో ఖర్చుపెట్టడం, తిరిగి సంపాధించుకోవడమే లక్ష్యమైపోయింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికల ప్రచార ఆర్భాటాలు.. గెలుపు కోసం అభ్యర్థులు పడే పాట్లు చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది. ఓటర్ల తీరులోనూ మార్పు రావాలి. – గౌరినేని మాణిక్యారావు, శ్రీగాధ, మాజీ సర్పంచ్ -
ఆ రేషన్షాపులు రద్దు
సిరిసిల్ల: సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో 2024 సెప్టెంబరులో నియమించిన రేషన్డీలర్ల ఎంపికను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ నోటిఫికేషన్ జారీచేసి పారదర్శకంగా ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే రేషన్డీలర్లుగా ఎంపికై పనిచేస్తున్న వారు అయోమయానికి గురవుతున్నారు. కోర్టు ఆదేశాలను రద్దు చేయించేందుకు మళ్లీ అప్పీలుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఏం జరిగిందంటే ? సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడిన 58 రేషన్దుకాణాల డీలర్ల భర్తీకి 2024 ఆగస్టు 29న అప్పటి ఆర్డీవో ఎల్.రమేశ్ నోటిఫికేషన్ జారీ చేశారు. 52 రేషన్షాపులకు 830 మంది దరఖాస్తు చేశారు. ఆరు దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. సెప్టెంబరు 15న నిర్వహించిన రాతపరీక్షలకు 765 మంది హాజరయ్యారు. ఒక్కో రేషన్ షాపునకు అర్హత సాధించిన ఐదుగురిని మౌఖిక ఇంటర్వ్యూలకు పిలిచారు. కానీ పరీక్షల్లో మెరిట్ జాబితాను అధికారులు వెల్లడించలేదు. కేవలం ఎంపికై న అభ్యర్థులను ఇంటర్వ్యూలకు రావాల్సిందిగా సమాచారం అందించారు. ఇవీ రేషన్షాపుల ఖాళీలు ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ఆరెపల్లి, గొల్లపల్లి, పత్తికుంటపల్లి, గంభీరావుపేట మండలం దమ్మన్నపేట, లక్ష్మీపూర్, రాజుపేట, ఒడ్డెరకాలనీ, గంభీరావుపేట మండల కేంద్రంలో రెండు షాపులు, ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు పోతుగల్లో రెండు, గూడూరు, నామాపూర్, సేవాలాల్తండా, వెంకట్రావుపల్లె, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 11 రేషన్ షాపులు, రగుడు, సర్ధాపూర్, ముష్టిపల్లి, చిన్నబోనాల, చంద్రంపేట, పెద్దూరు, తంగళ్లపల్లి మండల కేంద్రంతోపాటు నేరెళ్ల, చిన్నలింగాపూర్, పద్మనగర్, ఇందిరానగర్, గండిలచ్చపేట, వేణుగోపాల్పూర్, కేసీఆర్ నగర్, దేశాయిపల్లి, ఇందిరానగర్(జిల్లెల్ల), బాలమల్లుపల్లె, పాపయ్యపల్లె, చీర్లవంచ, ఇందిరమ్మకాలనీ, నర్సింహులపల్లి, వీర్నపల్లి మండల కేంద్రం, గర్జనపల్లి, ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్, తిమ్మాపూర్, బొప్పాపూర్, హరిదాస్నగర్, దుమాల, రాగట్లపల్లి, పోతిరెడ్డిపల్లె గ్రామాల్లో రేషన్ డీలర్ పోస్టులు ఖాళీ ఉన్నట్లు ప్రకటించారు. నిబంధనలు గాలికి.. రేషన్షాపులకు రిజర్వేషన్లు ఉన్నాయని, పదోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల స్థానికులు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు అనర్హులని వెల్లడించారు. కానీ నిబంధనలను గాలికి వదిలేస్తూ రేషన్ డీలర్ల నియామకాలు పూర్తయ్యాయి. అధికార పార్టీ నేతల సిపార్సుల పేరిట మరోవైపు వసూళ్లపర్వం సాగినట్లు సమాచారం. రేషన్షాపుల కేటాయింపుల్లో రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆయా షాపులకు ఉన్న డిమాండ్ను బట్టీ ఆ పార్టీ ముఖ్యనాయకులు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ అధికారులు సైతం ఇదే అదనుగా సిపార్సుతోపాటు డబ్బులు వస్తున్నాయనే ధీమాతో ఇంటర్వ్యూల తర్వాత ఎంపిక అభ్యర్థుల జాబితాను వెల్లడించకుండా.. రాత్రి వేళల్లో డీలర్లకు నియామక పత్రాలను అందించారు. సిరిసిల్ల డివిజన్లో జరిగిన రేషన్ డీలర్ల అక్రమాలపై నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఓ వితంతు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయించిన బాధితులు రేషన్డీలర్ల ఎంపికలో జరిగిన అక్రమాలపై బాధితులు కొందరు కోర్టును ఆశ్రయించారు. పారదర్శకంగా నియామకాలు జరగలేదని, నిబంధనలను పాటించలేంటూ కోర్టుకు వెళ్లారు. వాదోపవాదనలు విన్న కోర్టు 14 నెలల తరువాత 44 పేజీల తీర్పును వెలువరిస్తూ.. ఆ నియామకాలు చెల్లవని, రేషన్ డీలర్ల ఎంపికకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలని పేర్కొంటూ తీర్పు వెలువరించింది. దీనిపై అప్పీలుకు వెళ్లాలని రేషన్ డీలర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా.. సిరిసిల్ల ప్రాంతంలో కొత్త రేషన్ డీలర్ల నియామకాల రద్దు చర్చనీయాంశమైంది. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఇల్లంతకుంట(మానకొండూర్): రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. ఇల్లంతకుంట పల్లె దవాఖానాను శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ, ఐపీ, డాగ్బైట్, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆస్పత్రి డాక్టర్ రసజ్ఞ, స్టాఫ్నర్స్ కవిత తదితరులు ఉన్నారు. బోయినపల్లి(చొప్పదండి): ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలని వేములవాడ ఆర్డీవో రాధాబాయి ఆదేశించారు. మండల కేంద్రంలోని హైస్కూల్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. బ్యాలెట్బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సక్రమంగా తరలి వెళ్లేలా చూడాలని ఆదేశించారు. ఎంపీడీవో జయశీల, ఎంఈవో శ్రవణ్కుమార్, టౌన్ సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎన్నికల్లో ఓటర్లకు మద్యం పంచేందుకు అక్రమంగా తరలిస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శనివారం పట్టుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారంతో మండలంలోని రాచర్లగొల్లపల్లి శివారులోని కిష్టంపల్లికి వెళ్లే దారిలో ఆటోలో రూ.లక్ష విలువైన మద్యంను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న గొల్లపల్లికి చెందిన చల్ల బాల్రెడ్డిపై కేసు నమోదు చేసి, ఆటోను చేశారు. దాడిలో ఆర్ఐ శ్రావణ్కుమార్, పోలీస్ సిబ్బది పాల్గొన్నారు. బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బ్యాలెట్ బాక్స్లు, ఎన్నికల సామగ్రిని తీసుకెళ్లేందుకు సిబ్బంది ఇబ్బంది పడ్డారు. స్థానిక హైస్కూల్ మైదానంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోకి బస్సులు వచ్చే అవకాశం లేకపోవడంతో దాదాపు అర కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల సామగ్రితో అంతదూరం నడిచివెళ్లేందుకు ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పడ్డారు. సిరిసిల్లకల్చరల్: సిరిసిల్లలో 1977 నుంచి న్యాయస్థానంగా ఉన్న భవనం స్థానంలో నూతన కోర్టు భవన నిర్మాణానికి అనుమతులు లభించడంతో పాత భవనాన్ని కూల్చివేశారు. సుమారు ఐదు దశాబ్దాలపాటు సేవ లందించిన ఈ భవనం ప్రస్తుతం ఓ శిథిల జ్ఞాపకం. మరో రెండేళ్లలో నూతన భవనం రూపొందనుంది. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్షవేములవాడఅర్బన్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. రెండు కేంద్రాలలో 261 మంది విద్యార్థులకు 57 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల సీఎస్లుగా రాజారత్నం, బన్నాజీలు వ్యవహరించారు. -
పన్నెండు గంటలు పనిచేస్తున్నాం
నేనే ప్రింటింగ్ రంగంలో ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నా. ఎనిమిదేళ్ల క్రితం సొంతంగా ఫ్లెక్సీలు, స్టిక్కర్లు ప్రింటింగ్ స్టూడియో నడిపిస్తున్నా. మామూలు రోజుల్లో ఆర్డర్లు కన్నా ఇప్పుడు మూడింతలు పెరిగాయి. పక్షం రోజులుగా సర్పంచ్ ఎన్నికలతో వచ్చే గిరాకీతో నేను, మరో నలుగురు సిబ్బందిమి పన్నెండు గంటలపాటు పనిచేయాల్సి వస్తుంది. ఆర్డర్లు చెప్పిన సమయానికి అందిస్తున్నాం. – నందగిరి మహేశ్, ఫ్లెక్సీ ప్రింటర్నలభై ఏళ్లుగా ప్రింటింగ్ రంగంలో.. మేము నలభై ఏళ్లుగా ప్రింటింగ్ప్రెస్ రంగంలో పనిచేస్తున్నాం. ఇద్దరం 20 ఏళ్ల క్రితం సొంతంగా ప్రెస్ నిర్వహిస్తున్నాం. బ్యాలెట్స్, పోస్టర్లు, కరపత్రాలు ప్రింటింగ్ చేస్తున్నాం. గుర్తులు కేటాయించిన రోజు, తెల్లవారి రోజు పని ఎక్కువగా ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ మొదలుకొని ప్రతిరోజు 30 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. ఇది మామూలు రోజుల కన్నా మూడింతలు ఎక్కువ. ఇద్దరం కలిసి రోజూ పన్నెండు గంటలు పనిచేయాల్సి వస్తుంది. – కట్కం ఉపేందర్ తీరిక లేకుండా పని ఉంటుంది ఎన్నికల రాకతో మాకు పని బాగా ఉంటుంది. ఆర్డర్లమీద ఆర్డర్లుతో క్షణం తీరిక లేకండా ఉంటుంది. మా దగ్గర కండువాలు, జెండాలు, బ్యానర్లు, బ్యాడ్జీలు, స్టిక్కర్లు, పోస్టర్లు, అన్ని రకాల ప్రింటింగ్ పనిచేస్తాం. పక్షం రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు 15 గంటలపాటు పనిచేస్తేనే ఆర్డర్లు సమయానికి ఇవ్వగలుగుతున్నాం. 23 ఏళ్లుగా స్క్రీన్ప్రింటింగ్ పనిచేస్తున్నా. నలుగురు వర్కర్లతో కలిసి గోదాంలో ప్రింట్ చేసి అందిస్తున్నాం. సర్పంచ్ ఎన్నికల గిరాకీ బాగా ఉంది. – మంచికట్ల శ్రీనివాస్, స్క్రీన్ ప్రింటర్ సౌండ్ సిస్టమ్కు డిమాండ్ సర్పంచ్ ఎన్నికల్లో మైక్లు, సౌండ్ సిస్టమ్కు డిమాండ్ ఉంది. మా తాత మొదలుకుని నాన్న నేను కలిసి 60 ఏళ్లుగా సిరిసిల్లలో మైక్సౌండ్, లైటింగ్, టెంట్హౌస్, సీలింగ్(ఈవెంట్స్), అనౌన్స్మెంట్ పనిచేస్తున్నాం. ఉదయం 7–30 గంటలు మొదలుకుని రాత్రి 10 గంటల వరకు పనిచేస్తున్నాం. మాతోపాటు ముగ్గురు వర్కర్లకు చేతినిండా పని ఉంటుంది. – షేక్ షరీఫ్, మైక్ సౌండ్స్ నిర్వాహకుడు -
ఆరోగ్య పరీక్షలు తూచ్!
మీరు చూస్తున్న ఈ ఫొటో సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్లో నిర్వహించిన భవన, ఇతర నిర్మాణరంగ కార్మికుల హెల్త్క్యాంప్. ఇక్కడ నిర్మాణ, అనుబంధ రంగానికి చెందిన కార్మికులు కాకుండా పవర్లూమ్ వర్కర్ నుంచి రక్తనమూనా సేకరిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. అడిగే వారు లేరని ఇష్టారీతిగా ఈ సంస్థ ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు.మీరు చూస్తున్న ఈ ఫొటో ముస్తాబాద్ మండలం దేశాయిపల్లి. భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్య పరీక్షలు చేసే బాధ్యతలను ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు వచ్చి ఓ కార్మికుడి నుంచి బ్లడ్ శాంపిల్ సేకరిస్తున్నారు. ఈ శాంపిల్ సేకరించే వ్యక్తి సాధారణ వ్యక్తి కావడం గమనార్హం.సిరిసిల్లటౌన్: భవన నిర్మాణరంగ కార్మికుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అభాసుపాలవుతోంది. కోట్లు వెచ్చించి చేపట్టిన ఈ హెల్త్ ప్రోగ్రామ్ భవన నిర్మాణరంగ కార్మికులకు ఉపయోగపడడం లేదు. ఆ కాంట్రాక్ట్ పొందిన ప్రైవేట్ సంస్థ జేబులు నింపేలా మారింది. అర్హత లేని వ్యక్తులు బ్లడ్శాంపిల్స్ సేకరించడం, భవన నిర్మాణ రంగానికి చెందిన వారి నుంచే కాకుండా ఇతరుల శాంపిల్స్ సేకరిస్తుండడం గమనార్హం. నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో సాగుతున్న కార్మిక ఆరోగ్య నిర్ధారణపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ లక్ష్యమిదీ.. భవన నిర్మాణం, ఇతర కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేసే కాంట్రాక్ట్ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ ప్రైవేట్ హెల్త్కేర్ సంస్థ కేంద్రం నుంచి అనుమతులు పొందింది. ఈ సంస్థ మూడేళ్లుగా తెలంగాణలోని కార్మికుల ఆరోగ్య పరీక్షలు చేస్తుంది. సంస్థకు చెందిన వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా టెస్టులు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో 12 బృందాలు నిజామాబాద్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు డివిజనల్ మేనేజర్గా వ్యవహరించే వ్యక్తి పెద్దపల్లిలో ఉంటున్నట్లు సమాచారం. రాజన్నసిరిసిల్ల జిల్లాలో కార్మికుల ఆరోగ్య పరీక్షలు చేసేందుకు 12 బృందాలను ఏర్పాటు చేశాారు. ఒక్కో టీమ్లో ఇద్దరు ఉంటారు. వీరిలో ఒకరు రిజిస్ట్రేషన్ పర్సన్(డిగ్రీ అర్హత), ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ సర్టిఫికెట్) గల వ్యక్తి ఉంటారు. ఒక్కో టీమ్ రోజుకు పది మంది కార్మికులకు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. 52 రకాల పరీక్షలు కార్మికుల ఆరోగ్య పరీక్షలు చేసేందుకు కార్మికుల వెల్ఫేర్బోర్డు నిధులను కేటాయించారు. ఒక్కో కార్మికుడికి పరీక్ష చేసినందుకు రూ.3,250 ప్రభుత్వం సదరు సంస్థకు చెల్లిస్తుంది. కార్మికుడి బరువు, ఎత్తు, బీపీ, షుగర్, కంటి విజన్, వినికిడి, ఈసీజీ, పీఎఫ్టీ, సీబీపీ, బ్లడ్గ్రూప్, లివర్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, కిడ్నీప్రొఫైల్ తదితర 52 రకాల పరీక్షలు నిర్వహించాలి. భవన, ఇతర నిర్మాణ రంగాల లేబర్కార్డు ఉన్న కార్మికులకు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 35వేల మందికి టెస్టులు చేశారు. అంటే దాదాపు రూ. 11.37కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఆరోగ్య పరీక్షల నిర్వహణపై ఆరోగ్య, కార్మికశాఖలతోపాటు ప్రభుత్వ అధికారుల అజమాయిషీ లేదు. భవన, ఇతర నిర్మాణరంగ కార్మికులకు ఉచితంగా టెస్టులు నిర్వహించే సంస్థ ప్రతినిధులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. ఎంబీబీఎస్ వైద్యుడి పర్యవేక్షణలో పరీక్షలు చేయాలి. సంస్థ సిబ్బంది ఎలాంటి మిషనరీ, సామగ్రి లేకుండా కార్మికుల రక్త, మూత్రం శాంపిళ్లను సేకరిస్తున్నారు. సేకరించిన శాంపిళ్లను కరీంనగర్లోని సంస్థ కు చెందిన ల్యాబ్లో పరీక్షలు చేస్తున్నట్లు చె బుతున్నారు. అక్కడి నుంచే శాంపిల్స్ ఇచ్చిన కార్మికులకు రిపోర్టులు పంపిస్తున్నారు. నిర్మాణ కార్మికుల ధ్రువీకరణకార్డులు లేని వారికి కూడా పరీక్షలు చేస్తున్నట్లు కార్మికసంఘాలు చెబుతున్నాయి. మరోవైపు రోడ్ల వెంట వెళ్లే వారి శాంపిళ్లను సైతం సేకరిస్తున్నట్లు సమాచారం. సేకరించిన ఒక్కో శాంపిల్కు కార్మికుడి వివరాలు, సెల్ఫోన్ నంబరు, లేబర్కార్డు వివరాలు పొందుపర్చాలి. కానీ ఆ సంస్థ సిబ్బంది ఆ వివరాలు సేకరించడం లేదు. ఒకరి శాంపిళ్లను ఇద్దరు కార్మికుల వద్ద సేకరించినట్లుగా ల్యాబ్కు పంపిస్తూ.. తమ టార్గెట్ను పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● 700 మందితో బందోబస్తు తంగళ్లపల్లి/బోయినపల్లి: ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. తంగళ్లపల్లి పోలీస్స్టేషన్ను, బోయినపల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను శనివారం సందర్శించి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సి బ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ 26 రూట్ మొబైల్స్, ఏడు జోనల్ టీమ్స్, మూడు క్విక్ రియాక్షన్ టీమ్స్, రెండు స్ట్రైకింగ్ఫోర్స్తో 700 మంది ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య ఉన్నారు. పలువురిపై కేసులు, నగదు సీజ్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లాలో 9 కేసులు నమోదు చేసి, రూ.23,28,500 నగదు సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. 93 కేసుల్లో 1,387 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. ఎన్నికలకు భంగం కలిగించే అవకాశం ఉన్న 782 మందిని గుర్తించి బైండోవర్ చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలపై నిఘా బోయినపల్లి మండలంలోని తడగొండ, కోరెం, విలాసాగర్, స్తంభంపల్లి, నీలోజిపల్లి, కొదురుపాక ఆరు గ్రామాల్లో సమస్మాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక భద్రత ఉంటుందని ఎస్పీ తెలిపారు. డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 12 మంది ఎస్సైలు, 200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్సై ఎన్.రమాకాంత్ తదితరులు ఉన్నారు. -
మా పైసలు మాకివ్వండి!
‘కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామంలో దాదాపు రూ.35 లక్షల వరకు ఖర్చు చేసిన ఓ సర్పంచ్ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడు. తమ నాయకుడు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను అతని అనుచరులు వేధిస్తున్నారు.’ ‘కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని ఓ రెవెన్యూ గ్రామ పంచాయతీలో రూ.80 లక్షల వరకు ఖర్చు చేసిన ఓ అభ్యర్థి దారుణంగా ఓడిపోవడంతో ఆస్తులు అమ్ముకునేందుకు సిద్ధం అయ్యాడు’. ‘మొదటి విడత రిజర్వేషన్లు వచ్చిన పలు గ్రామాల్లో కొందరు పెట్టుబడిదారులు సర్పంచ్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారు. సదరు అభ్యర్థులు ఓడిపోవడంతో తిరిగి డబ్బు వసూలు చేసే పనిలో పడ్డారు.’సాక్షిప్రతినిధి, కరీంనగర్: నోటుకు రాలవు ఓట్లు.. అనేది మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో తేలిపోయింది. తొలి విడత ఫలితాలు మూడో విడత అభ్యర్థులకు గుణపాఠమైంది. గ్రానైట్, రెవెన్యూ గ్రామాల్లో తొలివిడత ఎన్నికల్లో పోటాపోటీగా పంపకాలు చేసిన అభ్యర్థులు అప్పుల పాలయ్యారు. ఒక్కో గ్రామంలో రూ.30 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు పంపకాలు జరగడం గమనార్హం. రూ.లక్షలు ఖర్చుచేసినా ఓటమి తప్పకపోవడంతో తొలివిడత గ్రామాల్లోని పరాజితులు ఎక్కడ మిస్సయ్యిందని లెక్కలేసుకుంటున్నారు. కాగా.. ఎన్నికల్లో విజయం సాధించిన.. పరాజయం పొందిన ఇద్దరి జేబులు ఖాళీ అయ్యాయి. పైగా అప్పులపాలయ్యారు. విజయం సాధించిన అభ్యర్థి సంపాదించుకుంటాననే నమ్మకంతో ఉండగా పరాజయం పొందిన అభ్యర్థులు, వారి అనుచరులు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు చేశారో, ఏ ప్రాంతంలో ఓట్లు రాలేదో తెలుసుకుని ‘మా డబ్బులు వెనక్కియ్యండంటూ’ ఆయా ప్రాంతాల ఓటర్ల వద్దకు వెళ్లి జబర్దస్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు ఇంతని ఇచ్చినా కూడా ఓటర్లు ముఖం చూడకపోవడంతో అభ్యర్థుల ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ‘ఒక్కో ఇంటికి పెద్దమొత్తమే ఇచ్చినం.. అయినా అక్కడ నాలుగు ఓట్లు కూడా పడలేదంటూ’ తిట్లపురాణం మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. మూడో విడతకు గుణపాఠం తొలివిడత ఎన్నికల్లో ఓటర్లు నేర్పిన పాఠం మూడో విడత అభ్యర్థులకు గుణపాఠం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండోవిడతకు సంబంధించిన పంచాయతీల్లోనూ ప్రలోభాల పర్వం జోరుగానే సాగింది. చాలామంది ఓటర్లూ.. ఓటుకు నోటును ఆశిస్తుండటమూ కనిపించింది. ఓట్లు వేస్తారా.. లేదా.. తెలియదు కానీ.. పైసలైతే పంచా ల్సిందే అని అభ్యర్థులే చెబుతుండటం గమనార్హం. -
నేను 14 ఏళ్లు సర్పంచ్గా పనిచేశాను
మాది కోనరావుపేట మండలం మల్కపేట. నేను రాజేంద్రనగర్లో బీఎస్పీ అగ్రికల్చర్ పూర్తి చేశాను. మా ఊరిలో 1980లో తొలిసారి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి 1994 వరకు 14 ఏళ్లపాటు సర్పంచ్గా ఉన్నాను. ఎన్నికల్లో అప్పట్లో ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. పైసా ఖర్చు లేకుండానే ఎన్నికయ్యాను. నేను అంతే నిజాయితీగా ఉండి గ్రామాభివృద్ధికి పనిచేశాను. ఇప్పుడు కాలం మారిపోయింది. ఎన్నికల పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఎవరికి ఏ పని ఉన్నా నేను వెంట ఉండి చేయించేవాడిని. ఒక్క పైసా ఆశించేవాడిని కాదు. ప్రజలకు సేవ చేయడమే రాజకీయం. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా భిన్నమైంది. – చెలిమెడ రాజేశ్వర్రావు, మల్కపేట మాజీ సర్పంచ్, డెయిరీ చైర్మన్ -
అనారోగ్యంతో కూలి మృతి
చందుర్తి(వేములవాడ): నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే స్థితిలో ఓ నిరుపేద ప్రాణాలు వదిలాడు. చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మేడారం మురళి(58) కులవృత్తిని చేసుకుంటూ జీవించేవాడు. నెల రోజుల క్రితం సైకిల్పై నుంచి జారిపడ్డాడు. అప్పటి నుంచి మంచంపట్టి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. వైద్యం చేయించుకునే స్థోమత లేక శనివారం ప్రాణాలు కోల్పోయాడు. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో మై వేములవాడ చారిటబుట్ ట్రస్టు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య వనజ, ఇద్దరు కుమారులు నరేశ్, రాజశేఖర్ ఉన్నారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
ఆధిపత్య ఆరాటం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిఘట్టం ముగిసింది. తొలివిడతలో 397 గ్రామాలకు ఎన్నికలకు జరగ్గా 51శాతానికి పైగా (205) స్థానాలు కై వసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక 29శాతం (116) సీట్లు దక్కించుకుని బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలవగా, బీజేపీ 9శాతం (35) సీట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఉమ్మడి జిల్లాలో తొలివిడతలో 398 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పెద్దపల్లి జిల్లా పెద్దంపేట గ్రామం ఎన్నిక కోర్టు కేసు నేపథ్యంలో వాయిదా పడింది. మొత్తంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. బీఆర్ఎస్, బీజేపీలు చెప్పుకోదగ్గ సీట్లు సాధించాయి. నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఏయే గ్రామాల్లో ఎవరు ఎన్ని ఓట్లు సాధించారు? ఎంత వ్యత్యాసంతో ఓటమి చెందారు? ఏ కారణాలు విజయావకాశాలను ప్రభావితం చేశాయన్న విషయాలపై పార్టీలపరంగా ఆలోచనలు చేస్తున్నారు. బీజేపీ అనూహ్య ఫలితాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీజేపీ బలపరచిన దాదాపు 35 మంది సర్పంచులు గెలిచారు. మరో 35మంది వరకు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ ప్రభావం కనిపించలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కరీంనగర్లో 14, సిరిసిల్లలో 07 స్థానాలు గెలచుకుని సత్తా చాటింది. జగిత్యాలలోనూ 14 స్థానాలు కై వసం చేసుకుని మొత్తంగా 35 సర్పంచులను గెలిపించుకుంది. ఈ విజయానికి రెండో, మూడో విడతలను వేదికగా చేసుకోవాలని పథకాలు రచిస్తోంది. వాస్తవానికి ఒక్క కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లోనే తాము బలపరిచిన 50 మంది సర్పంచ్గా గెలిచారంటూ ప్రకటించడం విశేషం. మొత్తానిక బీజేపీ అనూహ్య ఫలితాలు ఆ పార్టీలో సరికొత్త జోష్ నింపింది. 10శాతం ఇతరులపై అధికార పార్టీ కన్ను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలివిడతలో 44 మంది అభ్యర్థులు ఇతరులు/ స్వతంత్రులు ఉన్నారు. వీరందరినీ ఇప్పటికే అధికార పార్టీ తమ వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమైంది. దాదాపుగా వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మిగిలిన బీఆర్ఎస్ నుంచి గెలిచిన 116 మంది సర్పంచుల్లో పలువురితో అధికార పార్టీ మంతనాలు మొదలుపెట్టింది. గెలిచిన వారంతా మనోళ్లే అన్న సిద్ధాంతంతో అధికార పార్టీ ముందుకు వెళ్తుండగా.. అప్పులు చేసి గెలిచిన వాళ్లు, అధికార పార్టీతో మనకెందుకు అన్న ఆందోళనలో ఉన్న వారంతా హస్తం తీర్థం పుచ్చుకునే ఆలోచిస్తున్నారు. వీరంతా తోడైతే అధికార పార్టీ మద్దతు ఉన్న సర్పంచుల సంఖ్య అమాంతం పెరగనుంది. తొలివిడతలో పెద్దపల్లిలో కాంగ్రెస్ 90 గ్రామాల సర్పంచ్ స్థానాలకుగాను 70 స్థానాలు గెలిచి పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. కరీంనగర్లో 92 స్థానాలకు కాంగ్రెస్ 44 గెలవగా, 24 చోట్ల కారు పార్టీ విజయం సాఽధించింది. జగిత్యాలలో 122కి 52 సర్పంచులను కాంగ్రెస్ గెలవగా.. 42 సర్పంచు సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుని గట్టిపోటీ ఇచ్చింది. సిరిసిల్లలోనూ 85 సర్పంచి స్థానాలలో 39 కాంగ్రెస్ దక్కించుకోగా.. 28 బీఆర్ఎస్ వశపరచుకుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా.. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీగా సర్పంచి స్థానాల కోసం పోటీ పడ్డాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్, కోరుట్లలో బీఆర్ఎస్ చక్కటి ఫలితాలు సాధించింది. 14వ తేదీన జరగనున్న రెండో విడత, 17వ తేదీన జరిగే మూడో విడతలో మరిన్ని సీట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రాధాన్యం
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోయినపల్లి(చొప్పదండి): సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ద్యేయంగా పనిచేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని కోరెం, దేశాయిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యరులకు మద్దతుగా శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్రెడ్డి, ధనుంజయ్, ఒంటెల గోపాల్రెడ్డి, పులి హన్మాండ్లు, సురేందర్రెడ్డి, కొంకటి మధు పాల్గొన్నారు. ఆరోగ్యసేవల సమాచారం కోసం హెల్ప్డెస్క్ సిరిసిల్లకల్చరల్: యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భాన్ని పురస్కరించుకుని రోగులకు అందించే వైద్యసేవల సమాచారాన్ని ఒకే చోటు నుంచి పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్డెస్క్ ప్రారంభిస్తున్నట్లు లోక్ అదాలత్ సభ్యుడు ఆడెపు వేణు తెలిపారు. ప్రభుత్వ ప్రధానాస్పత్రి ఆవరణలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రభుత్వరంగ ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రవీణ్కుమార్, సీఎస్ సుమన్మోహన్రావు, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ మల్లేశ్యాదవ్, ప్యానెల్ న్యాయవాది అరుణ, పీవో డాక్టర్ నయీం జా, జూనియర్ పారా లీగల్ వలంటీర్లు విక్రమ్, సింధూజ పాల్గొన్నారు. జాతీయస్థాయిలో రాణించాలి సిరిసిల్ల అర్బన్: జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జల రమేశ్ కోరారు. ఈనెల 16 నుంచి 21 వరకు రాజస్థాన్లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు బాల, బాలికల జట్లను శుక్రవారం ఎంపిక చేశారు. వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, ప్రధాన కార్యదర్శి రాందాస్, కోడం శ్రీనివాస్, శ్యామ్కుమార్ పాల్గొన్నారు. ముస్తాబాద్లో 20 పోస్టల్ బ్యాలెట్లుముస్తాబాద్: మండల పరిషత్లో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకుంటున్నారు. శుక్రవారం 20 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు వేశారని ఎంపీడీవో లచ్చాలు తెలిపారు. ఈనెల 17 వరకు పోస్టల్ బ్యాలెట్లు స్వీకరిస్తామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెటు ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. మండల పరిషత్లో హెల్ప్డెస్కును ఏర్పాటు చేశామన్నారు. 15న జిల్లా క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు సిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 16, 18, 20 క్రాస్కంట్రీ పోటీలు సిరిసిల్లలోని మినీస్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. ఈనెల 15న మున్సిపల్ పరిధిలోని రాజీవ్నగర్ మినీస్టేడియం దగ్గరలోని బైపాస్రోడ్డు వద్ద పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికై న 32 మంది క్రీడాకారులను హైదరాబాద్లో జరిగే పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. -
‘మాజీలు’ మళ్లీ గెలిచారు
సిరిసిల్ల: జిల్లాలో జరిగిన మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు మరోసారి విజయం సాధించారు. జిల్లాలో ని ఐదు మండలాల్లో గురువారం ఎన్నికలు జరగ్గా కొందరు మాజీ ప్రజాప్రతినిధులు మళ్లీ సర్పంచ్గా గెలుపొందారు. మరోవైపు జిల్లాలో పేరు గడించిన మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయాల్లో తలపండిన నేతలు సైతం పల్లెపోరులో బోల్తాపడ్డారు. మరోసారి చాన్స్ గ్రామసర్పంచ్లుగా రెండోసారి చాన్స్ దక్కించుకున్న వారిలో కోనరావుపేట మండలం మామిడిపల్లి సర్పంచ్ పన్యాల లక్ష్మారెడ్డి ఉన్నారు. ఆయన భార్య విజయ 2013–2018 మధ్య సర్పంచ్గా పనిచేశారు. రాజన్నగొల్లపల్లె(కొలనూర్) సర్పంచ్గా బొజ్జం మల్లేశ్ విజయం సాధించగా.. ఆయన భార్య వసంత 2019–2024 వరకు సర్పంచ్గా పనిచేశారు. ఎగ్లాస్పూర్ సర్పంచ్గా పసుల పోచయ్య గెలువగా.. ఆయన భార్య విజయ 2003–2008 మధ్య కాలంలో సర్పంచ్గా ఉన్నారు. బావుసాయిపేట ఎంపీటీసీ సభ్యురాలిగా 2019–2024 వరకు పనిచేసిన షేక్ యాస్మిన్పాషా ఈసారి సర్పంచ్గా ఎన్నికయ్యారు. వెంకట్రావుపేట సర్పంచ్గా ఎన్నికై న మంతెన గీతాంజలి భర్త సంతోష్ 2019–2024 ఇటీవల సర్పంచ్గా పనిచేశారు. పరాజితులైన ప్రముఖులు రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం గల ప్రముఖులు సైతం ఈసారి పంచాయతీ పోరులో బోల్తాపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ వైస్చైర్మన్గా, ఇన్చార్జి చైర్మన్గా పనిచేసిన తీగల రవీందర్గౌడ్ వేములవాడ మండలం హన్మాజిపేట సర్పంచ్గా ఓటమిపాలయ్యారు. గతంలో రవీందర్గౌడ్ తండ్రి, తల్లి, భార్య సర్పంచ్లుగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో రవీందర్గౌడ్ ఓడిపోయారు. చందుర్తి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య సర్పంచ్గా పరాజయం పాలయ్యారు. రుద్రంగి మాజీ ఎంపీపీ గంగం స్వరూపారాణి సర్పంచ్ ఎన్నికల బరిలో ఓడిపోయారు. వేములవాడ అర్బన్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మ్యాకల రవి భార్య అనుపురం సర్పంచ్ స్థానానికి పోటీ పడి ఓటమిపాలయ్యారు. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో ప్రముఖులు గ్రామపంచాయతీ ఎన్నికల్లో పరాజితులయ్యారు. -
టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమలు తెరిపించాలి
సిరిసిల్లటౌన్: రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఏర్పడిన టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమలు మూతబడడం శోచనీయమని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేశ్ పేర్కొన్నారు. టెక్స్టైల్ పార్కును శుక్రవారం సందర్శించి, కార్మికులతో మాట్లాడారు. వేలాది మంది పనిచేసిన టెక్స్టైల్పార్క్లో నేడు 200 మందికి కూడా ఉపాధి కల్పించకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ అందించకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు ఉపాధి కల్పించాలని, కనీస వేతనం నెలకు రూ.26వేలు వచ్చేలా నిర్ణయించాలని కోరారు. నాయకులు మూషం రమేశ్, కోడం రమణ, మిట్టపల్లి రాజమౌళి, టెక్స్టైల్ పార్క్ అధ్యక్షుడు కూచన శంకర్, నాయకులు గడ్డం రాజశేఖర్, కార్మికులు జెల్ల సదానందం, ఆకుబత్తిని శ్రీకాంత్, రాజమల్లు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
● వాహనాల వేగ నిర్ధారణకు స్పీడ్గన్స్ ● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు, వాహనాల అతి వేగాన్ని నిర్ధారించేందుకు స్పీడ్గన్స్ కొనుగోలు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించారు. ముందుగా ఇన్చార్జి కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరగడానికి గల కారణాలను తెలుసుకున్నారు. గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లను గుర్తించాలని ఆదేశించారు. అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను చెక్ చేసేందుకు స్పీడ్గన్స్ కొనుగోలు చేయాలన్నారు. రోడ్లను ఆనుకుని ఉన్న పాతబావులను పూడ్చివేయాలని సూచించారు. ఆర్అండ్బీ ఈఈ నరసింహాచారి, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, డీపీవో షరీఫొద్దీన్, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్రెడ్డి, ఆర్టీఏ నాన్ అఫిషియల్ మెంబర్ సంగీతం శ్రీనాథ్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో చేరికలు
వేములవాడ: వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ ఉపసర్పంచ్గా ఎన్నికై న వేముల నాగరా జు, మాజీ సర్పంచ్ పెద్ది నవీన్ శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు. వారికి ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాభివృద్ధికి పాడుపడాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను తనను కలిసిన నూతన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలని సూచించారు. అవినీతి లేని పాలన అందించాలని సూచించారు. ప్రభుత్వ విప్ను కలిసిన రుద్రంగి పాలకవర్గం రుద్రంగి(వేములవాడ): నూతనంగా ఎంపికై న రుద్రంగి పాలకవర్గం సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను కలిశారు. సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, పాలకవర్గ సభ్యులకు విప్ శుభాకాంక్షలు తెలిపారు. రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్రెడ్డి, తర్రె లింగం, రుద్రంగి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ చైర్మన్ కొమిరె శంకర్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, నాయకులు పల్లి గంగాధర్, ఎర్రం గంగనర్సయ్య, ధర్న మల్లేశం పాల్గొన్నారు. -
న్యాయ విజ్ఞాన సదస్సు
వేములవాడఅర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో సార్వత్రిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య సేవలు, హక్కులపై అవగాహన ఉండాలన్నారు. ఆసుపత్రిలో న్యాయ సహాయకేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్యులు అనిల్కుమార్, తిరుపతి, సంతోష్చారి, లోక్ అదాలత్ సభ్యుడు వేణు ఉన్నారు. హెచ్పీవీ టీకాపై అవగాహనసిరిసిల్లటౌన్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత ఆధ్వర్యంలో హెచ్పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాధి నిరోధక టీకాపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. డీఎంహెచ్వో ఆఫీసులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 14 ఏళ్లు నిండిన బాలికలకు గర్భాశయం, రొమ్ము, నోటి క్యాన్సర్లను నిరోధించగల టీకాపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి సంపత్కుమార్, వైద్యులు అనిత, డెమో రాజకుమార్, నవీన పాల్గొన్నారు. మద్యం అక్రమ రవాణాపై నిఘాసిరిసిల్ల క్రైం: గ్రామపంచాయతీ ఎన్నికలు సాగుతు న్న నేపథ్యంలో జిల్లాలో అక్రమ మద్యం రవాణా, విక్రయాలు, కొనుగోళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సందర్భంగా మద్యం హోల్సేల్ అమ్మకాలు పెరుగుతాయన్న సమాచారంతో తనిఖీలు విస్తృతంగా చేపట్టినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు 90 కేసులు నమోదు చేసి, 1,337 లీటర్ల మద్యంను సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
375 ఓట్లు.. ఆరుగురు అభ్యర్థులు
● కొత్త పంచాయతీలో పోటాపోటీ ● అందరి దృష్టి రాచర్ల బాకురుపల్లిపైనే ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రస్తుత స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబాకురుపల్లి గ్రామపంచాయతీపైనే అందరి దృష్టి ఉంది. తక్కువ ఓట్లు ఉన్న ఈ పంచాయతీ పోరులో ఆరుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొత్త పంచాయతీలో నూతన ఉత్సాహంతో పలువురు బరిలో ఉండి తమకు అవకాశం కల్పించాలని ఓటర్ దేవుళ్లను వేడుకుంటున్నారు. చిన్న గ్రామపంచాయతీలో పెద్ద పోరు జరుగుతుండడంతో విజయం ఎవరిని వర్తిస్తుందో వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే ఈ గ్రామపంచాయతీలో నలుగురు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ స్థానానికి మాత్రం తగ్గేదే లేదంటూ.. 375 ఓట్లకు ఆరుగురు అభ్యర్థులు కొట్లాడుతున్నారు. ఈ పోరు జిల్లాలోనే ఆసక్తికరంగా మారింది. -
కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి
● ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇల్లంతకుంట(మానకొండూర్): కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండలంలోని పొత్తూరు, కందికట్కూర్, గొల్లపల్లి, వెంకట్రావుపల్లి, ఓబులాపురం, వెల్జిపూర్, సోమారంపేట, రేపాక, వెంకట్రావుపల్లి గ్రామాల్లో గురువారం ప్రచారంలో పాల్గొన్నారు. దోచుకునే వారిని కాకుండా నిజాయితీగా గ్రామాభివృద్ధికి తోడ్పడే వారిని సర్పంచులుగా గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్రెడ్డి, మాజీ ఎంపీపీలు వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, నాయకులు ఆకుల సత్యం, యాస తిరుపతి, ఇరుమల్ల నర్సయ్య, కేశవరెడ్డి పాల్గొన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తంగళ్లపల్లి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 30 గ్రామపంచాయతీలకు మూడు జీపీ ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. ఆదివారం 27 గ్రామపంచాయతీలకు పోలింగ్ జరగనుంది. కాగా దానికి అనుగుణంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఎంపీడీవో, జిల్లా సహాయ ఎన్నికల అధికారి కె.లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సిద్ధం చేశారు. రిటర్నింగ్ అధికారులు, ప్రీసైడింగ్ అధికారులకు సంబంధించిన సరంజామా సిద్ధం చేశారు. ఓటర్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా రిజర్వ్ సిబ్బందితోపాటు రిజర్వ్ బ్యాలెట్ బాక్సులు కూడా సిద్ధంగా ఉంచామని ఎంపీడీవో లక్ష్మీనారాయణ తెలిపారు. ఉదయం బోసిపోయిన పోలింగ్ కేంద్రాలుకోనరావుపేట(వేములవాడ): మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 8 గంటలు దాటినా ఓటర్లు కేంద్రాలకు రాలేదు. మండలంలో 28 గ్రామాలుండగా రెండు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. కనగర్తి గ్రామంలోని పోలింగ్ కేంద్రం ఉదయం 8 గంటలకు కూడా ఓటర్లు లేక బోసిపోయి కనిపించింది. తొలిసారి ఓటేసినవేములవాడ: ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఉండే ఆనందం వేరు. అదే తొలిసారి ఓటు వేస్తే ఆ సంతోషం చెప్పలేనిదిగా ఉంటుంది. ఇలా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లికి చెందిన వెల్మకంటి హర్షిత మొదటిసారి ఓటువేసింది. ఓటు వేసి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటుతోనే మన ఊరి భవిష్యత్ను మార్చుకోగలమన్నారు. తొలిసారి ఓటేయడం చాలా అద్భుతంగా అనిపించిందని ఆనందంగా చెప్పారు. -
ఓటెత్తిన పల్లె
సిరిసిల్ల: కల్లోల పల్లెల్లో మహిళా ఓటర్ల చైతన్యం వెల్లువెత్తింది. తొలిదశ పంచాయతీ ఎన్నికలు చిన్న చిన్న ఘటనలు మినహా గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 76 గ్రామ సర్పంచులకు, 295 వార్డు సభ్యులకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని చందుర్తి, కోనరావుపేట, వేములవాడ అర్బన్, రుద్రంగి, వేములవాడ రూరల్ మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 79.57 శాతం పోలింగ్ జరిగింది. 2019 నాటి తొలిదశ ఎన్నికల్లో 82.60 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి కాస్త తగ్గింది. పల్లెల్లో ఓటర్లు ఉదయం 7 గంటలకే క్యూ కట్టి మరీ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగిన ఐదు మండలాల్లో మొత్తం ఓటర్లు 1,11,148 ఉండగా.. 88,442 మంది ఓటర్లు తమ ఓటును వేశారు. జిల్లాలో 79.57శాతం పోలింగ్ జరిగింది. వేములవాడ రూరల్లో అత్యధికం తొలిదశలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగిన ఐదు మండలాల్లో వేములవాడరూరల్ మండలంలో అత్యధికంగా 82.47శాతం పోలింగ్ నమోదైంది. వేములవాడరూరల్లో 18,825 మంది ఓటర్లు ఉండగా.. 15,525 మంది ఓటుహక్కు వినియోగించుకుని 82.47 శాతం పోలింగ్ను నమోదు చేశారు. ● కోనరావుపేట మండలంలో 34,641 మంది ఓ టర్లు ఉండగా.. 28,420 మంది ఓటుహక్కు విని యోగించుకున్నారు. 82.04 శాతం నమోదైంది. ● చందుర్తి మండలంలో 28,094 మంది ఓటర్లు ఉండగా.. 21,823 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 77.68శాతం నమోదైంది. ● వేములవాడ అర్బన్ మండలంలో 18,492 మంది ఓటర్లు ఉండగా.. 14,687 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 79.42 శాతం నమోదైంది. ● రుద్రంగి మండలంలో 11,096 మంది ఓటర్లు ఉండగా.. 7,987 మంది ఓటేశారు. 71.98 శాతం నమోదైంది. వెల్లువెత్తిన మహిళా చైతన్యం తొలి విడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో 1,11,148 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓటర్లు 57,638 మంది, పురుషులు 53,492, ఇతరులు 18 మంది ఉన్నారు. గురువారం జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్లు 48,739 మంది, 39,693 మంది పురుషులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఐదు మండలాల్లో మహిళా ఓటర్లు 84.56 శాతం ఓట్లు వేయగా.. పురుషులు 74.20 శాతం ఓటేశారు. ఇతరులు 55.56 శాతం ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవో రాధాబాయి, డీఎస్పీ నాగేంద్రచారి ఎన్నికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.మండలం 9 గంటలు 11 గంటలు 1 గంటకు.. చందుర్తి 14.75 41.06 77.68 కోనరావుపేట 17.81 52.19 82.04 రుద్రంగి 18.20 46.04 71.98 వేములవాడ అర్బన్ 19.88 53.23 79.42 వేములవాడ రూరల్ 18.03 49.55 82.47 మొత్తం 17.46 48.49 79.57 -
పెద్ద ఊరు.. చిన్న పల్లె!
గ్రామపంచాయతీ ఓట్లు పురుషులు మహిళలు గంభీరావుపేట 8,807 4,264 4,543 రుద్రంగి 8,633 4,016 4,615 ఎల్లారెడ్డిపేట 7,577 3,622 3,955 ముస్తాబాద్ 7,347 3,625 3,722 మైనర్ పంచాయతీలు ఇవీ.. గుంటుపల్లిచెరువుతండా 121 59 62 బోటిమీదిపల్లె 157 81 76 చిక్కుడువానిపల్లె 158 78 80 కొత్తపేట 163 78 85 సిరిసిల్ల: జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకాగా.. అత్యధిక ఓట్లు ఉన్న ఊరు.. అతి తక్కువ ఓటర్లు ఉన్న పల్లైపె చర్చ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా 260 జీపీలకు 27 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. గురువారం తొలివిడత ఎన్నికలు 76 గ్రామాల్లో ముగిశాయి. రెండో విడత 14న, మూడో విడత 17న జరగనున్నాయి. జిల్లాలో అతిపెద్ద మేజర్ గ్రామపంచాయతీగా గంభీరావుపేట 8,807 మంది ఓటర్లతో అగ్రస్థానంలో ఉంది. నాలుగు దశాబ్దాల కిందట టౌన్ మున్సిపాలిటీగా ఉండేది. కాలక్రమేన మేజర్ పంచాయతీగా అవతరించింది. అతి చిన్న గ్రామపంచాయతీగా ఎల్లారెడ్డిపేట మండలం గుంటుపల్లిచెరువు తండా 121 ఓట్లతో ఆఖరి స్థానంలో నిలిచింది. జనాభా ప్రాతిపదికన నిధులు గ్రామపంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్ల రూపంలో మంజూరు చేసే నిధులు జనాభా ప్రాతిపదికన వస్తాయి. ఆయా గ్రామాల్లో ఉన్న జనాభా లెక్కల ప్రచారం తలసరి ఆదాయాన్ని అందిస్తాయి. ఈ లెక్కన జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు భారీగా నిధులు మంజూరవుతాయి. జనాభా తక్కువగా ఉన్న గ్రామాలకు తక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు రుద్రంగి మండలం మానాల పెద్ద గ్రామపంచాయతీగా ఉండేది. కొత్త జిల్లాల ఆవిర్భావంతో మానాల శివారులోని ఏడు గిరిజన తండాలు కొత్త గ్రామాలుగా అవతరించడంతో మానాల మైనర్ గ్రామంగా మారిపోయింది. ఏడు గ్రామా లు.. పది గుట్టలతో మానాల విస్తరించి ఉంది. -
బోయినపల్లి.. సమస్యల లొల్లి
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల కేంద్రంలో సమస్యల లొల్లి తీరడం లేదు. ఏళ్లుగా పట్టించుకునే వారు లేక సమస్యలకు నిలయంగా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామంలో 3,222 మంది జనాభా ఉండగా.. 2,507 మంది ఓటర్లు ఉన్నారు. బోయినపల్లిలో ప్రధానంగా ఒకవైపు కోతుల మందలు ఇళ్ల పెంకులు పీకుతుంటే.. కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నాయి. కోతుల దాడిలోనూ పలువురు గాయపడ్డారు. గ్రామంలోని సీసీ రోడ్లు చిన్న వర్షం కురిసినా నీరు నిలుస్తోంది. మురుగుకాలువ వ్యవస్థ అధ్వానంగా ఉంది. బోయినపల్లి వేములవాడ, మర్లపేట వైపు బీటీ రహదారులన్ని బీటీ లేచిపోవడంతో దుమ్ము లేస్తున్నాయి. బస్టాండ్లో టాయిలెట్లు లేక ఇబ్బంది బోయినపల్లి బస్టాండ్ ప్రాంతంలో టాయిలెట్లు లేక పలు గ్రామాల ప్రజలు ఒంటికి, రెంటికి ఇబ్బంది పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే ప్రజలు అత్యవసర సమయంలో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు సమస్య ఎవరికి చెప్పుకోలేక పోతున్నారు. గతంలో మూత్రశాలలు నిర్మించాలని యువకులు ధర్నా చేసిన సంఘటనలు ఉన్నాయి. కోతులు.. కుక్కలతో తిప్పలు మండలకేంద్రంలోని ఏ వీధిలో చూసినా కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కోతుల బెదిరింపుతో దుంపెట శ్రీను అనే ఎలక్ట్రీషియన్ కిందపడగా కాలు విరిగిపోయింది. దీంతో ఆరు నెలలపాటు పని లేక ఇంటికే పరిమితమయ్యాడు. ఇలా చాలా మంది గాయపడ్డారు. వానాకాలంలో రాకపోకలు బంద్ బోయినపల్లి నుంచి వేములవాడ, కొదురుపాక వెళ్లే బీటీ రహదారుల్లో లో లెవల్ కల్వర్టులతో వానాకా లంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. కల్వర్టుపై వరద ప్రవాహంతో గంగాధర, వేములవాడ, కొదురుపాక వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. బోయినపల్లిలో సీసీ రోడ్లపై బురద గుంతలు (ఫైల్)సమస్యలు ఇవీ.. యువకులకు మినీస్టేడియం, ఓపెన్జిమ్ సైతం ఏర్పాటు చేయాలి. బోయినపల్లి మండలకేంద్రానికి మంజూరైన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం సొంత భవనం లేకపోవడంతో వేములవాడలో అద్దె భవనంలో నడుస్తోంది. గురుకుల విద్యాలయం బోయినపల్లికి వచ్చేలా చూడాలి. బీసీకాలనీలో నివసిస్తున్న ప్రజల ఇళ్ల స్థలాలు వారి పేరున వచ్చేలా చూడాలి. అంబేడ్కర్ కాలనీలో సీసీ రహదారులు, మురుగుకాలువలు నిర్మించాలి. మంగళవారం సంత రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. సంత ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక స్థలం చూపాలి. వసతులు కల్పించాలి. వర్షం కురిస్తే బోయినపల్లి రామాలయంలోకి వరద నీరు వెళ్లి నిత్యపూజలకు ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల పైపులైన్ లీకేజీలతో నీరు వృథాగా పోతోంది. నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మించాలి. -
రాజన్న సిరిసిల్ల
గురువారం శ్రీ 11 శ్రీ డిసెంబర్ శ్రీ 20257ఉద్యోగం, ఉపాధి రీత్య ఎక్కడెక్కడో స్థిరపడ్డ వాళ్లు గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లెలబాట పడుతున్నారు. వీరి రాకతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొననుంది. – 8లోu సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓటర్లను జాగరుకులను చేస్తూ పల్లె ప్రజలకు మొరపెట్టుకుంటున్న గోడు లేఖలో.. – 8లోu వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఈదురుగాలులు వీస్తాయి. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. -
ఈవీఎంల గోడౌన్ తనిఖీ
సిరిసిల్లఅర్బన్: సర్ధాపూర్ వద్ద ఉన్న ఈవీఎంల గోడౌన్ను ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతకుముందు కలెక్టరేట్లో పలు అంశాలపై చర్చించారు. సిరిసిల్ల అర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేశ్కుమార్, ఎలక్షన్ అధికారి రెహమాన్ పాల్గొన్నారు. అస్వస్థతకు గురైన జెడ్పీ సీఈవోవేములవాడ: సర్పంచ్ ఎన్నికల విధులకు హాజరైన జెడ్పీ సీఈవో వినోద్కుమార్ అస్వస్థతకు గురయ్యా రు. వేములవాడ మండల పరిషత్ ఆవరణలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు బుధవారం చేరుకున్నారు. ఈక్రమంలో అస్వస్థతకు గురై కిందపడిపోవడంతో తలకు గాయమైంది. అక్కడే ఉన్న వైద్యసిబ్బంది ప్ర థమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వై ద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లారు. ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. రుద్రంగి(వేములవాడ): ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రుద్రంగి పోలింగ్ కేంద్రాల్లోని వసతులను డీఆర్డీవో శేషాద్రితో కలిసి బుధవారం పరిశీలించారు. రుద్రంగి తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్ తదితరులు ఉన్నారు. -
కట్టుదిట్టమైన భద్రత
● ఎస్పీ మహేశ్ బీ గీతేకోనరావుపేట(వేములవాడ): మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. కోనరావుపేట పోలీస్స్టేషన్ను బుధవారం సందర్శించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలింగ్ జరిగే సమయం, ఓట్ల లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూట్ మొబైల్ పోలీస్ అధికారులు నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ, పోలింగ్ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్తపడాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. డీఎస్పీ నాగేంద్రచారి, ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్గౌడ్, ఆర్ఐ మధుకర్, ఎస్సై ప్రశాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చందుర్తి(వేములవాడ): చందుర్తి పోలీస్స్టేషన్లో ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల విధులు అంకితభావంతో న నిర్వర్తించాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలోని మూడపల్లి, నర్సింగపూర్, చందుర్తి, జోగాపూర్, సనుగుల, లింగంపేట గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు వెంకటేశ్వర్లు, మొగిలి, మధుకర్, నటేశ్, చందుర్తి ఎస్సై రమేశ్ ఉన్నారు. -
ఓటేసే ముందు ఆలోచించండి..
● పల్లె ప్రగతికి పాటుపడుతోంది.. పైసలిస్తోంది మోదీ ప్రభుత్వమే.. ● కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పల్లె ప్రగతికి పాటుపడుతోంది.. పైసలిస్తోంది మోదీ ప్రభుత్వమేనని, ఇప్పటివరకు గ్రామాల్లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో చేపట్టినవేనని స్పష్టం చేశారు. రైతు వేదిక నుంచి శ్మశాన వాటిక దాకా.. రోడ్ల నిర్మాణం మొదలు వీధి దీపాల దాకా.. ఆఖరికి గ్రామాల్లో జరిగే పారిశుధ్య పనులకు సైతం కేంద్ర నిధులే వెచ్చిస్తున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని విమర్శించారు. పచ్చని పల్లెలకు పైసా ఇయ్యకుండా, చేసిన పనులకు బిల్లులియ్యకుండా సర్పంచులు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తెచ్చింది బీఆర్ఎస్సేనని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి పైసలిస్తున్న బీజేపీ బలపర్చిన అభ్యర్థులకే ఓటేసి గెలిపించి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పచ్చని పల్లెలకు పైసా ఇయ్యకుండా చిచ్చుపెడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలంటే.. ఆ పార్టీలు బలపర్చిన అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు నయా పైసా ఇయ్యలేదు.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసల్లేవు.. నన్ను కోసినా నయా పైసా రాదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే చెబుతున్నడు.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోనూ పంచాయతీల అభివృద్ధికి పైసా ఇయ్యలేదు.. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్న నాకు మాత్రమే ఎంపీ లాడ్స్ నిధులున్నాయి.. సీఎస్సార్, ఎంపీ లాడ్స్ సహా అనేక రూపాల్లో పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న.. భవిష్యత్తులోనూ కేంద్రాన్ని ఒప్పించి అధిక నిధులు తెస్తానని తెలిపారు. -
ప్రమాద బీమా.. ఆరోగ్య ధీమా
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ● 5వేల మందికి రూ.5 లక్షల ప్రమాదబీమా పత్రాలు పంపిణీ ● ఉచిత వైద్యసేవలు అందిస్తామన్న చెలిమెడ లక్ష్మీనర్సింహారావుసిరిసిల్ల: అసంఘటిత రంగంలోని ఆటో డ్రైవర్లకు రూ.5లక్షల ప్రమాద బీమాతోపాటు చెలిమెడ ఆ నందరావు వైద్యవిజ్ఞాన సంస్థలో ఆరోగ్యధీమా కూడా లభించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పేర్కొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో బుధవారం 5వేల మంది ఆటోకార్మి కులకు ప్రమాదబీమా పత్రాలను కేటీఆర్ పంపిణీ చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ వీర్నపల్లికి చెందిన ఆటోడ్రైవర్ సతీశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సమయంలో పరామర్శించానని, అప్పుడే ఈ బీమా పథకానికి ఆలోచన వచ్చిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రభుత్వమే బీమా చేయించిందని, ఇప్పుడు ఆ పథకం లేక ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంక్రాంతిలోగా వ్యాన్లు, గూడ్స్ ఆటోలు, కార్లు, జీపుల డ్రైవర్లకు బీమా చేయిస్తానని హామీ ఇచ్చారు. ఉచిత వైద్యం జిల్లాలోని ఆటో డ్రైవర్లకు గుర్తింపుకార్డులు ఇచ్చి, కరీంనగర్లోని తమ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తామని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చెలిమెడ లక్ష్మీనర్సింహారావు ప్రకటించారు. ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ రెండేళ్ల కిందట నిత్యం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆటో నడిపితే రూ.వెయ్యి నుంచి రూ.1500 వచ్చేవని, ఇప్పుడు ఉచిత బస్సుతో రూ.300 రావడం కష్టంగా ఉందన్నారు. జిల్లాలో 12వేలు ఆటోలు ఉండేవని, ఇప్పుడు 5వేలకు తగ్గాయన్నారు. ఆటో డ్రైవర్ల సంఘం గౌరవాధ్యక్షుడు బొల్లి రామ్మోహన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ట్యాక్స్లు రద్దు చేస్తే.. కాంగ్రెస్ పాలనలో బీమా పథకాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. ఆటో యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ మాట్లాడుతూ రెండేళ్లలో 162 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఉమ్మడి కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, సిరిసిల్ల మాజీ జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మాజీ వైస్చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, ఆకునూరి శంకరయ్య, కుంబాల మల్లారెడ్డి, కార్మిక నాయకులు వెంగళ శ్రీనివాస్ పాల్గొన్నారు. శవాన్ని తెప్పించాలని కేటీఆర్కు వినతి ఎల్లారెడ్డిపేట మండలం గుంటుపల్లిచెరువుతండాకు చెందిన గుగులోత్ రవి ఇటీవల సౌదీఅరేబియాలో గుండెపోటుతో మరణించాడు. విజిటింగ్ వీసాపై వెళ్లిన రవి శవాన్ని ఇండియాకు తెప్పించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు మంజుల, చక్రీ, హరిసింగ్ ఎమ్మెల్యే కేటీఆర్ కాళ్లపై పడ్డారు. శవాన్ని తెప్పిస్తానని కేటీఆర్ చెప్పారు. కొడుకును స్వదేశానికి రప్పించండి -
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: రానున్న సమ్మక్క–సారక్క జాతర దృష్ట్యా.. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అధికా రులతో కలిసి పనులను బుధవారం పరిశీలించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉచిత దర్శనం, కోడె క్యూలైన్, రూ.100 క్యూలైన్, రూ.300 క్యూలైన్, కళ్యాణకట్ట, వీఐపీ రోడ్డు, క్యూలైన్లు పరిశీలించారు. జాతర రోజుల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయి సన్నాహాలు చేయాలని ఆదేశించారు. బెల్టుషాపులకు మద్యం సరఫరా అడ్డుకోవాలిసిరిసిల్లటౌన్: బెల్టుషాపులకు మద్యం సరఫరా కాకుండా అడ్డుకోవాలని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం కోరారు. ఈమేరకు బుధవారం సిరిసిల్ల ఎకై ్స జ్ ఆఫీసులో ఫిర్యాదు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీమీదనే ఆధారపడి పాలన సాగిస్తోందన్నారు. వైన్షాప్ టెండర్లు రూ.3 లక్షలకు పెంచి.. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్షాపులు నిర్వహణకు ఊతం ఇచ్చిందన్నారు. బెల్టుషాపులకు మద్యం సరఫరా చేస్తున్న వైన్స్లపై చర్యలు లేక జనం మద్యం మత్తులో తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారన్నారు. ఎర్రజెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య, పంతం సుజాత, గడదాస్ లత, రాజేశం, దేవదాస్, సత్తయ్య పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: మాఘ అమావాస్య రోజున సిరిసిల్ల శివారులోని మానేరునదిలో జరిగే గంగమ్మజాతర నిర్వహణపై బుధవారం ఇరిగేషన్ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఇరిగేషన్ అధికారిని రాధికరెడ్డి గంగపుత్ర సంఘం ప్రతినిధులతో కలిసి గంగాభవాని ఆలయ పరిసరాలు పరిశీలించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి జాతర ఏర్పాట్ల చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సంఘం ప్రతినిధులు డీసీసీ అధ్యకుడు సంగీతం శ్రీనివాస్ను కలిసి సమస్యను విన్నవించారు. గంగపుత్ర సంఘం అధ్యక్షుడు వంగల కనకయ్య, సొసైటీ అధ్యక్షుడు వంగల రాజనర్సు, మాజీ అధ్యక్షుడు మూడరీ చిన్న, గడప ప్రవీణ్, ప్రచార కార్యదర్శి కూర శ్రీధర్, మానుకోల నర్సయ్య, కూర రాజేందర్, మూడరీ నర్సింగ్, బలరాం, నర్సయ్య, దేవరాజు, భాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: ‘ఓటు చోర్ఙీపై జిల్లాలో కాంగ్రెస్ నేతలు సంతకాల సేకరణ చేపట్టారు. 27వేల సంతకాల సేకరించి బుధవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ హైదరాబాద్ గాంధీభవన్లో అప్పజెప్పారు. ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ ఈనెల 14న రామ్లీలా మైదాన్లో భారీ ర్యాలీతో ఈ ఓటు చోరీ కార్యక్రమాన్ని రాష్ట్రపతికి చేరవేస్తారని ఆయన తెలిపారు. ముస్తాబాద్(సిరిసిల్ల): పంచాయతీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు వెంటనే ప్రచార వ్యయాన్ని అధికారులకు సమర్పించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు గుగులోత్ రామచంద్రు పేర్కొన్నారు. ముస్తాబాద్ రైతువేదికలో బుధవారం సర్పంచ్, వార్డుసభ్యులకు ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు తమ రోజువారీ ఖర్చులను వెంటనే మండల పరిషత్లో సమర్పించాలని సూచించారు. పరిమితికి మించి వ్యయం చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీవో లచ్చాలు, ఎంపీవో వాహిద్ పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించాలి
● ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ చందుర్తి/కోనరావుపేట(వేములవాడ): ఎన్ని కల సిబ్బంది నిబంధనలు పాటించాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. చందుర్తి, కోనరావుపేటల్లోని ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతోపాటు ఇతర సామగ్రి సరిచూసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్లలోపల పీవోలకు తప్ప ఎవరికీ మొబైల్ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయన్నారు. మహిళలకు పూర్తి భద్రత కల్పించినట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీవీహెచ్వో రవీందర్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఆర్డీవో రాధాభాయి, తహసీల్దార్లు భూపతి, వరలక్ష్మి, ఎంపీడీవోలు రాధ, స్నిగ్ధ, సూపరింటెండెంట్ శంకర్రెడ్డి, ఎంపీవో అరిఫ్ పాషా, ఇతర అధికారులు ఉన్నారు. ఏకగ్రీవ సర్పంచులకు సన్మానంవేములవాడ: కోనరావుపేట మండలం జైసేవా లాల్తండా సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇస్లావత్ మంజుల, ఉపసర్పంచ్గా అజ్మీరా దేవాలాల్నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం సన్మానించారు. గ్రామాభివృద్ధికు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. విప్ ఆది శ్రీని వాస్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న తండావాసులను అభినందించారు. గురువారం జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
76 పల్లెల్లో పంచాయతీ
● నేడు తొలివిడత ఎన్నికలు● ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ● 76 గ్రామాల్లో 295 మంది సర్పంచ్ అభ్యర్థులు ● 521 వార్డుల్లో 1,377 మంది వేములవాడలో సామగ్రి సరిచూసుకుంటున్న సిబ్బందిగ్రామాలు: 10 ఓటర్లు: 13,665 ఏకగ్రీవ గ్రామాలు : 7 ఎన్నికలు జరిగే గ్రామాలు: 3 పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు : 10 పోటీలో ఉన్న వార్డుసభ్యుల అభ్యర్థులు : 91 పోలింగ్ సిబ్బంది : 246గ్రామాలు: 19 ఓటర్లు: 28,094 ఏకగ్రీవ గ్రామాలు: 0 ఎన్నికలు జరిగే గ్రామాలు: 19 పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 64 పోటీలో ఉన్న వార్డు సభ్యుల అభ్యర్థులు: 347 పోలింగ్ సిబ్బంది: 468గ్రామాలు: 11 ఓటర్లు: 18,492 ఏకగ్రీవ గ్రామాలు: 0 ఎన్నికలు జరిగే గ్రామాలు: 11 పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 47 పోటీలో ఉన్న వార్డు సభ్యుల అభ్యర్థులు: 218 పోలింగ్ సిబ్బంది: 304గ్రామాలు: 17 ఓటర్లు: 18,825 ఏకగ్రీవ గ్రామాలు : 0 ఎన్నికలు జరిగే గ్రామాలు : 17 పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు : 52 పోటీలో ఉన్న వార్డుసభ్యుల అభ్యర్థులు : 262 పోలింగ్ సిబ్బంది : 371గ్రామాలు : 28 ఓటర్లు : 35,225 ఏకగ్రీవమైన గ్రామాలు : 02 ఎన్నికలు జరిగే గ్రామాలు : 26 పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 122 పోటీలో ఉన్న వార్డుసభ్యుల అభ్యర్థులు: 459 పోలింగ్ సిబ్బంది: 646 సిరిసిల్ల: ప్రశాంత పల్లెల్లో ఎన్నికల సెగలు రేగాయి. జిల్లాలోని పల్లెల్లో ఎన్నికల పోరు బహుముఖంగా సాగుతోంది. తొలి విడత ఎన్నికలు ఐదు మండలాల్లో గురువారం జరుగుతున్నాయి. 85 గ్రామాల్లో సర్పంచు స్థానాలకు, 758 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ జారీ కాగా.. నామినేషన్ల పర్వం, నామినేషన్ల ఉపసంహరణ ముగిసేనాటికి 9 గ్రామాల్లో సర్పంచులు, 237 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 76 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు 295 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయా గ్రామాల్లోని 521 వార్డుసభ్యుల స్థానాలకు 1,377 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామాల్లో, వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు 2,035 మంది పోలింగ్ సిబ్బందితో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐదు మండలాల్లోని 1,14,301 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక పల్లెల్లో కట్టుదిట్టమైన భద్రత తొలివిడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో 25 సమస్యాత్మక గ్రామాలు ఉండగా ఇందులో నాలుగు అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. గత ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో జరిగిన గొడవలను అంచనా వేస్తూ పోలీసులు సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేశారు. అన్ని గ్రామాల్లోనూ పోలింగ్ కేంద్రాలకు వందమీటర్ల దూరంలో ఎవరినీ ప్రచారం చేయనీయకుండా కట్టడి చేయనున్నారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో మొబైల్ సాయుధ పోలీస్ బృందాలు, రిజర్వు బృందాలు, ఐదు అంచెల పోలీసు రక్షణను 722 మంది సిబ్బందితో నిర్వహిస్తున్నారు. నేడు ఎన్నికలు ఎన్నికలు జరిగే గ్రామాలకు బుధవారం పోలింగ్ సామాగ్రితో సిబ్బంది చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రితో పల్లెలకు చేరారు. గురువారం ఉదయం 7 నుంచే పోలింగ్ మొదలై, మధ్యాహ్నం ఒంటి గంటలోగా ముగుస్తుంది. భోజన విరామం తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే ఎన్నికై న అభ్యర్థులకు నోటీసులు జారీ చేసి ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పల్లెలకు తరలిన సిబ్బంది వేములవాడ: పంచాయతీ ఎన్నికల సామాగ్రితో సిబ్బంది బుధవారం పల్లెలకు తరలివెళ్లారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, మండల పరిషత్ ఆవరణ నుంచి వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట ఐదు మండలాలకు వెళ్లారు. సిబ్బంది ఇలా... మండలాలు : 05, రూట్లు : 25 పోలింగ్ సిబ్బంది : 2,250, పోలీసులు : 902 క్రిటికల్ కేంద్రాలు :61, సెన్సిటివ్ కేంద్రాలు: 51నిర్లక్ష్యంగా ఉండొద్దు – ఆర్డీవో రాధాభాయి ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆర్డీవో రాధాభాయి హెచ్చరించారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల, మండల పరిషత్ ఆవరణలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆమె బుధవారం నిర్వహించారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. తహసీల్దార్లు వెంకటప్రకాశ్రావు, అబూబాకర్ ఉన్నారు. మర్యాదపూర్వకంగా మెలగాలి – అడిషనల్ ఎస్పీ చంద్రయ్య ఓటర్లతో మర్యాదపూర్వకంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య పోలీస్ సిబ్బందికి సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సెల్ఫోన్ అనుమతి లేదని, తెలిసిన వారెవ్వరికీ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని స్పష్టం చేశారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలింగ్ బందోబస్తు సిబ్బందికి సూచనలిచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. -
మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
● ఎస్పీ మహేశ్ బీ గితే సిరిసిల్లక్రైం: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ మహేశ్ బీ గితే తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో 25 రూట్ మొబైల్స్, 7 జోనల్ టీమ్స్, 5 క్విక్ రియాక్షన్ టీమ్స్, 2 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాలను వదిలి వెళ్లవద్దని ఆదేశించారు. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే పైఅధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. చెక్పోస్ట్ తనిఖీ రుద్రంగి: చెక్పోస్ట్ల వద్ద అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని ఎస్పీ మహేశ్ బీ గితే ఆదేశించారు. మండలకేంద్రంలోని జిల్లా సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహన తనిఖీల రిజిస్టర్ను పరిశీలించారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. -
సబ్బండవర్గాలను ఏకం చేసిన కేసీఆర్
సిరిసిల్లటౌన్: అరవై ఏళ్లు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైన తెలంగాణ డిసెంబర్ 9న విజయం సాధించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ‘విజయ్ దివస్’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి, అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి పూలమాలలతో గౌరవ వందనం సమర్పించారు. జిల్లాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాడు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సబ్బండవర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, టీఎస్పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, దార్నం లక్ష్మీనారాయణ, ఆకునూరి శంకరయ్య, గజభీంకార్ రాజన్న, దార్ల సందీప్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ
సిరిసిల్లటౌన్: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను గాంధీచౌక్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తుందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, గోలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. విలీన గ్రామాల్లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. -
రెండేళ్ల పాలనలో హామీల అమలేది..?
సిరిసిల్లటౌన్: దేశ స్వాతంత్య్రోద్యమంలో పోరాడిన ఏకై క సంఘం ఏఐఎస్ఎఫ్ అని రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. సంఘం జిల్లా మహాసభలు మంగళవారం సిరిసిల్లలో నిర్వహించగా ఆయన మాట్లాడారు. దేశంలో విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న చరిత్ర ఏఐఎస్ఎఫ్కు ఉందన్నారు. మోదీ ప్రభుత్వం మతం పేరుతో రా జకీయం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగా టం ఆడుతుందని విమర్శించారు. రేవంత్రెడ్డి రెండేళ్ల పాలనలో విద్యార్థులకు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. అ లాగే విద్యార్థులు పట్టణంలోని బస్టాండ్ చౌరస్తా నుంచి వస్త్ర వ్యాపార సంఘం భవన్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం జెండాను జిల్లా అధ్యక్షుడు రాకేశ్ ఆవిష్కరించి సభకు అధ్యక్షత వహించారు. సీపీఐ కార్యదర్శి మంద సుదర్శన్, ఏఐ టీయూసీ జిల్లా కార్యదర్శి రాములు, కండె విజేత, జిల్లా అధ్యక్ష, కార్యదర్శి కుర్ర రాకేశ్, మంద అనిల్, అధిత్య, ముద్రకోల శశికుమార్, బండారి చందు, బండి ప్రణయ్, వంశీ, శ్రీహరి, శివసాయి పాల్గొన్నారు. -
ఇంటర్నల్స్ వాయిదా!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు రెండు రోజులుగా చేపట్టిన ఆందోళన ఎట్టకేలకు సద్దుమణిగింది. వర్సిటీ ఉన్నతాధికారుల తీరుతో తాము నష్టపోతున్నామంటున్న విద్యార్థుల డిమాండ్లపై వీసీ సానుకూలంగా స్పందించడంతో శాంతించారు. ఐదు డిమాండ్లతో మొదలైన ఆందోళనలో రెండు ప్రధానమైనవి ఆమోదించడం, మిగిలినవాటిపై హామీ దక్కకపోవడంతో విద్యార్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తమను ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా....ఇంటర్నల్స్, 3వ సెమిస్టర్ పరీక్షల తేదీలను మార్చాలని కోరుతూ చేస్తూ చేపట్టిన ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ శాతవాహన యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో తొలుత సైన్స్ కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. అక్కడ కాసేపు రిజిస్ట్రార్తో మాట్లాడారు. రిజిస్ట్రర్ నుంచి స్పందన లేకపోయే సరికి డప్పులు కొడుతూ అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట మరోసారి ధర్నాకు పూనుకున్నారు. వీసీ, రిజిస్ట్రార్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ విద్యార్థులను కళాశాలల ప్రిన్సిపాల్స్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. వీసీ వచ్చి సమస్యను పరిష్కరించేంత వరకు కదిలేది లేదంటూ బైఠాయించడంతో వీసీ ఉమేశ్ కుమార్ విద్యార్థులను చర్చలకు ఆహ్వానించారు. సంక్రాంతి ముందు కొన్ని... తరువాత కొన్ని విద్యార్థుల ఆందోళనతో చర్చల దిగొచ్చిన వీసీ సుమారు గంటన్నర సేపు వారితో చర్చలు జరిపారు. వీసీతోపాటు రిజిస్ట్రార్ రవికుమార్, ఓఎస్డీ హరికాంత్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత చర్చల్లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇంటర్నల్ పరీక్షలు వాయిదా వేసేందుకు అంగీకారం తెలిపారు. 3వ సెమిస్టర్ పరీక్షలను సంక్రాంతి పండుగకు ముందు కొన్ని, తరువాత కొన్ని నిర్వహించేలా షెడ్యూల్లో మార్పులు జరిపేందుకు సరే అన్నారు. నెట్, సెట్కు సన్నద్ధమవుతున్న వారికి సెమిస్టర్ పరీక్షలు అవే తేదీల్లో వస్తుండటాన్ని విద్యార్థులు వీసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నెట్, సెట్ రాసే విద్యార్థులకు వీలుగా షెడ్యుల్లో మార్పులు చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. లైబ్రరీపై పట్టు యూనివర్సిటీలో 24 గంటల లైబ్రరీ సదుపాయంపై వీసీ పట్టు వీడలేదు. మధ్యాహ్నం తరువాతే లైబ్రరీలోకి అనుమతిస్తామని, కావాల్సిన వారు ఎన్ని పుస్తకాలైనా తీసుకెళ్లి చదువుకోవచ్చని స్పష్టంచేశారు. అంతకుముందు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో 24 గంటలు లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని అలాంటి వెసులుబాటును శాతవాహన కల్పించాలని కోరారు. యూనివర్సిటీలోని మెస్ విషయంలో కేర్ టేకర్స్ పట్టించుకోవడం లేదని, మెస్లో సరిపడా సిబ్బంది లేరన్న విద్యార్థుల వాదనను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఎల్ఎల్బీ విద్యార్థులకు వెంటనే హాస్టల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేసినా దానిని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విద్యార్థులు లైబ్రరీ, లా విద్యార్థులకు హాస్టల్ విషయంలో తీవ్ర నిరాశకు గురయ్యారు.యుజీసీ నెట్, సెట్ పరీక్షలకు శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. అందుకే పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 5 నుంచి నిర్వహించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. – వీసీ ఉమేశ్ కుమార్ -
రేపు 76 గ్రామాలు.. 521 వార్డుల్లో ఎన్నికలు
సిరిసిల్ల: జిల్లాలోని చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, వేములవాడఅర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లో 76 గ్రామాల్లో 521 వార్డుల్లో గురువారం(11వ తేదీ) ఎన్నికలు జరుగనున్నాయి. చందుర్తి మండలంలో 13,445 మంది పురుషులు, 14,649 మహిళలు, కోనరావుపేట పరిధిలో 17,180 మంది పురుషులు, 18,045 మహిళలు, రుద్రంగి మండలంలో 6,454 మంది పురుషులు, 7,208 మహిళలు, ఇతరులు 3, వేములవాడఅర్బన్ మండలంలో 8,953 మంది పురుషులు, 9,523 మహిళలు, ఇతరులు 16, వేములవాడ రూరల్ మండలంలో 9,020 మంది పురుషులు, 9,805 మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల విధుల్లో 898 మంది పీవోలు, 1,135 మంది ఓపీవోలు ఉంటారు. వీర్నపల్లి: మండలంలోని భూక్యతండా పంచాయతీలో సర్పంచ్ పదవికి 8 మంది నామినేషన్ వేయగా, గ్రామ పెద్దలు, గిరిజన యువకులు ఏకగ్రీవానికి కృషి చేశారు. వారి పిలుపుతో ఆరుగురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మరో అభ్యర్థి ఉపసంహరణకు సిద్ధమైనా మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ ఉపసంహరణను అంగీకరించలేదు. దీంతో తండాలో పోటీ తప్పలేదు. మరో వైపు 8మంది వార్డుమెంబర్ స్థానాలు ఏకగ్రీవంగా ఖరారయ్యాయి. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
సిరిసిల్ల: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం సాయంత్రం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్హెచ్ఓలతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని, గ్రామంలో ఓటు లేని వ్యక్తి ఉండకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల పీవోకు తప్ప ఎవరికీ మొబైల్ ఫోన్లు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎస్పీ మహేశ్ బీ గితే మాట్లాడుతూ, ఎక్కడైనా సమస్యలు ఉంటే అధికారులు వెంటనే తెలియజేయాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, జిల్లా ఎన్నికల వ్యయ, సాధారణ పరిశీలకులు రాజ్కుమార్, రవికుమార్, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, నోడల్ అధికారులు శేషాద్రి, లక్ష్మీరాజం, డీపీవో షరీషోద్దీన్, నవీన్, భారతి, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమీక్షించారు. సకాలంలో పన్ను వసూలు చేయండి సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఇంటి పన్ను సకాలంలో వసూలు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఇంటి, నీటి పన్ను వసూలు, ట్రేడ్ లైసెన్స్, తడి, పొడి చెత్త సేకరణ తదితర అంశాలపై మంగళవారం సమీక్షించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్ను ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఏసీబీ సీఐ పున్నం చందర్, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, పర్యవేక్షకులు శ్రావణ్ పాల్గొన్నారు. -
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సిద్ధం
వేములవాడ/వేములవాడఅర్బన్: పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొదటి విడత ఈనెల 11న పోలింగ్ జరిగే గ్రామాలకు ఎన్నికల సామగ్రి తరలించేందుకు మంగళవారం వేములవాడ మండల పరిషత్ ఆవరణలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సిద్ధం చేశారు. వేములవాడ, వేములవాడ రూరల్ మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ నగేశ్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. తహసీల్దార్లు విజయ్ప్రకాశ్రావు, అబూబాకర్, ఎంపీడీవోలు శ్రీనివాస్, కీర్తన తదితరులు పాల్గొన్నారు. వేములవాడ: స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉందంటూ ఆలయ ఈవో రమాదేవి భక్తులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం రాజన్న ను దర్శించుకుని స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భోజనాలు చేస్తున్న పలువురిని శ్రీవంటలు ఎలా ఉన్నాయి, ఉద్యోగులు, సిబ్బంది పని తీరు ఎలా ఉంది’ అని తెలుసుకున్నారు. భోజనాలు రుచిగా ఉన్నాయని, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారని భక్తులు చెప్పడంతో సత్రం నిర్వాహకులు భాస్కర్, సిబ్బందిని ఈవో అభినందించారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రజిత అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు జ్వరాలతో బాధపడుతుండగా మంగళవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 92 మందికి పరీక్షలు నిర్వహించారు. 15 మందికి రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ, చలి తీవ్రత నుంచి కాపాడుకునేందుకు విద్యార్థులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాచి వడబోసిన నీటిని తాగాలని, పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో జ్వరాలు ప్రబలితే తమకు సమాచారం అందించాలని కోరారు. మండల వైద్యాధికారి సరియా అంజుమ్, వైద్యులు సాయిచంద్ర, సంధ్యారాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలిసిరిసిల్ల: గర్భిణులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించి మందులు అందించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో మంగళవారం ఆశా నోడల్ సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. గర్భిణుల నమోదు సరిగా నిర్వహించి, హై రిస్క్ ఉన్నవారిని గుర్తించాలన్నారు. సకాలంలో ప్రభుత్వ లక్ష్యాలు సాధించాలన్నారు. ఎంహెచ్ఎన్ డాక్టర్ నాగేంద్రబాబు, వైద్యులు అనిత, నహిమాజహా, డెమో రాజకుమార్, సీహెచ్వో శాంత, బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
పంచింగ్ స్టార్ట్
జిల్లా మొదటి ఏకగ్రీవం ఎన్నికలు కరీంనగర్ 92 03 89 పెద్దపల్లి 99 04 95 సిరిసిల్ల 76 09 67 జగిత్యాల 122 04 118 మొత్తం 389 20 369సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పంచాయతీ ఎన్నికలు రసవత్తరస్థాయికి చేరుకున్నాయి. తొలి విడత పోలింగ్ ప్రచార గడువు ముగియడంతో ప్రలోభాలు ఊపందుకున్నాయి. మైకులు బంద్ కావడంతో నిన్న మొన్నటి వరకు హోరెత్తిన ప్రచారం మూగబోయింది. మందు.. విందుతో ఓటర్లను ఖుషీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 389 గ్రామాల్లో తొలివిడత ఎన్నికలు జరగాల్సి ఉండగా... వీటిలో 20 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడతలో 369గ్రామాల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. చాలా చోట్ల అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుల మధ్య పోటీ కనిపిస్తుండగా కొన్ని గ్రామాల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఎంత ఖర్చయినా సరే అనే రీతిలో ముందుకు సాగుతున్నారు. డబ్బులు లేకున్నా మిత్రులు, బంధువుల వద్ద తీసుకోవడమో.. లేదా అప్పు చేసేందుకు వెనకాడటం లేదు. ఆరున్నరేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా ప్రతి అభ్యర్థి ఏదో ఒక పార్టీకి అనుబంధంగానే బరిలోకి దిగుతున్నారు. తొలి విడతలో 369 జీపీలకు ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 389 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... వీటిలో 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 369 పంచాయితీలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిత్యం మందు, విందుతో దావతుల్లో ముంచెత్తారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విందులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దావత్లకు వ్యవసాయ క్షేత్రాలు, పంట పొలాలు, రహస్య ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. మద్దతుదారులు చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. కొందరైతే ఓటుకు ఇంతని లెక్కలేసి డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో ఇళ్లకు నేరుగా మద్యాన్ని చేరవేస్తున్నట్లు సమాచారం. కొరవడిన నిఘా ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను నిఘా విభాగం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపిండం లేదు. ఇదే అదనుగా భావించిన అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పరిశీలకులను నియమించినా పోటీదారులు ఖాతరు చేయడంలేదు. బహిరంగంగానే మద్యం, మందు పంపిణీ చేస్తూ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గ్రామాల్లో పోలీసుల నిఘా కనిపించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరీంనగర్, రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. తెరవెనక పంపిణీని పూర్తిస్థాయిలో ఆపలేకపోతున్నారన్న విమర్శలున్నాయి.మూడుదశల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. పోటీ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వారం పది రోజుల నుంచే మందు, విందుతో ముంచెత్తుతున్నారు. మహిళా సంఘాల వారీగా డబ్బులు, చీరలు పంచుతున్నారు. మొదటి విడత పోలింగ్కు ఒక రోజే గడువు ఉండడంతో ప్రలోభాల పర్వం కీలక దశకు చేరుకుంది. ఇంటింటికీ డబ్బులు పంచుతూ... మద్యం ఏరులై పారించేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్లో అందుబాటులో లేని వారికి యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తూ ఓట్లు రాబట్టుకునేందుకు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. -
పోలింగ్ నాడు సెలవు
● జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకోవాలిసిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే రోజు పబ్లిక్ హాలిడే(సెలవు దినం)గా ప్రకటించామని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం తెలిపారు. జిల్లాలో పంచాయితీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్నాయని, పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆయా కేంద్రాల్లో ఎన్నికలకు ముందు రోజు, ఎన్నికల రోజున విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు వివరించారు. ఈనెల 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున సెలవు ప్రకటించినట్లు తెలిపారు. టీబీని ముందే గుర్తించాలి టీబీ(క్షయ)ని ముందుగా గుర్తిస్తే చికిత్స అందించి, నయం చేయవచ్చని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. టీబీని విస్మరిస్తే మరొకరికి సోకే ప్రమాదం ఉందన్నారు. గర్భిణీలలో పోషక లోపాలను నివారించేందుకు ఐరన్ మందులు, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యసిబ్బంది పనిచేయాలన్నారు. జిల్లా వైద్యాధికారి రజిత, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్కుమార్, ఇన్చార్జి డీసీహెచ్ఎస్ రవీందర్ పాల్గొన్నారు. వేములవాడఅర్బన్/వేములవాడరూరల్: వేములవాడఅర్బన్ మండల పరిషత్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ పరిశీలించారు. కేంద్రంలో సౌకర్యాలపై ఆరా తీశారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్చార్జి కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం నిలువలు పరిశీలించి, సేకరణ, తరలింపు గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ విజయప్రకాశ్రావు, ఎంపీడీవోలు శ్రీనివాస్, కీర్తన తదితరులు ఉన్నారు. -
పరీక్షలు వాయిదా వేయాలె
● కదం తొక్కిన ఎస్యూ విద్యార్థులు ● భారీ ర్యాలీ, ఆరుగంటల పాటు బైఠాయింపు ● అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎదుట ఆందోళనసప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు కదం తొక్కారు. ఈనెల 24 నుంచి నిర్వహించతలపెట్టిన పీజీ 3వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఎదుట సుమారు ఆరు గంటలపాటు బైఠాయించారు. సోమవారం వర్సిటీలోని ఆర్ట్స్, సైన్స్, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు సుమారు 600 మంది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ.. త్వరలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. యూనివర్సిటీ పరిధిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతున్నారని, ఎన్నికలకు ఓటు వేసి రావాలంటే ఇబ్బంది అవుతుందని, ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ఈనెల 23 నుంచి జనవరి 7వ తేదీ వరకు సెట్, నెట్ పరీక్షలు ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తే.. సెట్, నెట్కు సన్నద్ధం అవడం ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 15, 16న నిర్వహించే ఫస్టియర్ విద్యార్థుల ఇంటర్నల్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీలోని లైబ్రరీని ఉదయం 9 గంటల వరకే మూసేస్తున్నారని, సాయంత్రం తక్కువ సమయం ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ఏ వర్సిటీలోనూ లైబ్రరీలు మూసివేసిన దాఖలాలు లేవని కేవలం శాతవాహనలోనే మూసివేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే బైటాయించిన విద్యార్థులు మధ్యాహ్న సమయంలో అక్కడికే భోజనం తెప్పించుకుని తిన్నారు. వీసీ, రిజిస్ట్రార్ అందుబాటులో లేకపోగా... విషయం తెలుసుకున్న సీఐ బిల్లా కోటేశ్వర్ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. మంగళవారం మాట్లాడుదామని వర్సిటీ రిజిస్ట్రార్ ఓఎస్డీ ద్వారా ఫోన్లో చెప్పడంతో ఆందోళన వాయిదా వేశామని శాతవాహన స్టూడెంట్ జేఏసీ నాయకులు తెలిపారు. -
ప్రలోభాల పర్వం!
సిరిసిల్ల: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. తొలి విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి విడతలో ఎన్నికలు జరిగే వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. అధికారులు బ్యాలెట్ బ్యాక్స్లు, పత్రాలను సిద్ధం చేస్తున్నారు. 11న ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీసు బలగాలు సిద్ధమయ్యాయి. 76 గ్రామాల్లో ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలోని 85 గ్రామాలు.. 748 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రుద్రంగి మండలంలోని ఏడు, కోనరావుపేట మండలంలోని రెండు గ్రామాలు ఏకగీవ్రమైన విషయం తెలిసిందే. నేటితో ప్రచారం బంద్ తొలివిడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ఆపేయాల్సి ఉంటుంది. ఈమేరకు ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాల పర్వం మొదలుకానుంది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు గుట్టుచప్పుడు కాకుండా మందు పంపిణీ, డబ్బుల పంపిణీకి సిద్ధం చేసుకున్నారు. మహిళా సంఘాలను ఆకట్టుకునేందుకు, యువకుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండో విడత ప్రచార జోరు రెండోవిడతలో ఈనెల 14న ఎన్నికలు జరిగే బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. తమకు వచ్చిన గుర్తులను ప్రజలకు వివరిస్తున్నారు. బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థులు పేర్లు ఉండకపోవడంలో నమూనా బ్యాలెట్తో ప్రచారం చేస్తున్నారు. కులసంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలను కూడగడుతున్నారు. నేడు మూడోవిడత నామినేషన్ల ఉపసంహరణ మూడో విడత ఎన్నికలు జరిగే ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. సాయంత్రం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ద్విముఖ పోటీ ఉన్న స్థానాల్లో బుజ్జగింపుల పర్వం సాగుతోంది. పకడ్బందీగా బందోబస్తు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసులు పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో కవాతు నిర్వహిస్తున్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా బందోబస్తు చేపడుతున్నారు.మండలం పీవోలు ఓపీవోలు చందుర్తి 209 259 కోనరావుపేట 286 360 రుద్రంగి 103 143 వేములవాడ అర్బన్ 125 179 వేములవాడ రూరల్ 175 196 -
మేలుకొలుపు!
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025యువతరంకరపత్రాలు పట్టుకొని ఉన్న వీరు ఎల్లారెడ్డిపేట మండలం సింగారం యువకులు. ఓటర్లు తమ ఓటును డబ్బు, మద్యానికి అమ్ముకోవద్దంటూ రెండు రోజులుగా ర్యాలీ తీస్తున్నారు. దాదాపు 30 మంది యువకులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అమ్ముకోవద్దంటూ చైతన్యవంతులను చేస్తున్నారు. సర్పంచ్, వార్డుసభ్యులలో ఎవరు పనిచేస్తారో.. ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నారు. బుద్ధిజీవులు ప్రశ్నించి పనులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. సింగారం గ్రామ యువతను ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని పలు గ్రామాల్లోనూ యువకులు ఇదే బాటలో నడుస్తున్నారు. గ్రామానికి ఏం చేస్తారని అభ్యర్థులను నిలదీస్తున్నారు..సింగారంలో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న యువకులుముస్తాబాద్(సిరిసిల్ల): పల్లెపోరులో యువతరం కీలకంగా మారనుంది. ఓటర్లుగా నమోదుకావడమే కాదు.. బరిలో నిలుస్తామంటూ ముందుకొస్తున్నారు. మరికొంత మంది యువత సామాజిక బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటున్నారు. ఓటును మద్యం, మనీ కోసం అమ్ముకోవద్దని.. నిజాయితీగా ఓటేసి పనిచేయించుకుందామని అవగాహన కల్పిస్తున్నారు. ఓటును అమ్ముకుంటే పనిచేయించుకోలేమని.. అప్రమత్తంగా ఉండాలంటూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. 260 గ్రామాలు.. 62,178 యువ ఓటర్లు జిల్లాలో 260 గ్రామాల్లో 1,75,772 పురుషులు, 1,82,559 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 20 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. వీరిలో 18 నుంచి 25 ఏళ్లలోపు వారు 62,178 మంది ఉన్నారు. ప్రశ్నించేతత్వం పెంపు చదువుకున్న యువతలో కొందరు సోషల్మీడియా వేదికగా, మరికొందరు ప్రత్యక్షంగా గ్రామాల్లోని ఓటర్లలో ప్రశ్నించేతత్వాన్ని పెంపొందిస్తున్నారు. మా ఓటు వేస్తాం.. గ్రామానికి మీరేం చేస్తారంటూ ప్రశ్నించేతత్వం ఇటీవల పెరిగింది. గ్రామాల్లో యువకులు ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో వేదికగా పల్లె ప్రజలను జాగరుకులను చేస్తున్నారు. ఒక్క ఓటు ఊరి తలరాతను మారుస్తుందంటున్నారు. ఊరి అభివృద్ధి కోసం విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకుందామంటూ అవగాహన కల్పిస్తున్నారు. -
ఓటర్లు 207.. బరిలో ముగ్గురు !
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలం చిన్న గ్రామపంచాయతీ పొన్నాలపల్లె. ఈ గ్రామంలో 102 మంది పురుషులు, 105 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయినా పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఐదేళ్ల క్రితం గ్రామపంచాయతీ ఏర్పడిన పొన్నాలపల్లెలో అప్పుడు ఏకగ్రీవంగానే ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి మాత్రం సర్పంచ్ స్థానానికి ముగ్గురు నామినేషన్లు వేశారు. నాలుగు వార్డు స్థానాల్లో రెండు ఏకగ్రీవం కానున్నాయి. మరో రెండు స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మరో విశేషమేమిటంటే.. ఈ గ్రామంలో అందరూ బీసీలే. అందులోనూ అందరూ మున్నూరుకాపులు. -
బాధితులకు సత్వర న్యాయం
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల క్రైం: బాధితులకు సత్వరమే న్యాయం చేసేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్సెల్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్డే వివిధ సమస్యలపై 18 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. పోలీస్ సేవలను ప్రజ లకు చేరువ చేయడమే తమ లక్ష్యమన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని, రబీ సీజన్కు సరిపడ యూరియా అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం పేర్కొన్నారు. మండలంలోని అల్మాస్పూర్లో యూరియా పంపిణీని సోమవారం పరిశీలించారు. ముందు జాగ్రత్తగా అన్ని మండలాల్లోనూ యూరియాను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. అనంతరం రాచర్లగొల్లపల్లి, బండలింగంపల్లి, వెంకటాపూర్, రాజన్నపేట, అల్మాస్పూర్లోని పోలింగ్కేంద్రాలను పరిశీలించారు. ఎంపీడీవో సత్తయ్య, మండల వ్యవసాయాధికారి రాజశేఖర్ ఉన్నారు. కంట్రోల్ రూమ్ తనిఖీసిరిసిల్ల: కలెక్టరేట్లో కంట్రోల్రూమ్, మీడియా సెంటర్ను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికుమార్ సోమవారం తనిఖీ చేశారు. మీడియా సెంటర్లో సంబంధిత రిజిస్టర్లు పరిశీలించారు. అనంతరం కంట్రోల్ రూమ్లో ఫిర్యాదుల రిజిస్టర్ పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. వేములవాడ: బద్దిపోచమ్మ ఆలయం రాజగోపురాల మార్కింగ్ పనులకు ఈవో రమాదేవి, రాష్ట్ర దేవాదాయశాఖ స్థపతి వల్లినాయగం, ఈఈఎస్ దుర్గాప్రసాద్ సోమవారం భూమిపూజ చేశారు. రాజగోపుర నిర్మాణానికి సంబంధించిన మార్కింగ్, నిర్మాణ పద్ధతులు, శిల్పకళా ప్రమాణాలపై అధికారులు సమీక్షించారు. ఆలయ ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్ పాల్గొన్నారు. కోనరావుపేట(వేములవాడ): ఎన్నికల విధులు సమర్థంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. మండలకేంద్రంతోపాటు నిజామాబాద్లో పోలింగ్ కేంద్రాలను సోమవారం తనిఖీ చేశారు. కోనరావుపేట జూనియర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. తహసీల్ ఆఫీస్లో భూభారతి, సాదాబైనామా దరఖాస్తులపై ఆరా తీశారు. అనంతరం మల్కపేట, కోనరావుపేట, నిజామాబాద్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తహసీల్దార్ వరలక్ష్మి, ఎస్సై ప్రశాంత్రెడ్డి, ఎంపీడీవో స్నిగ్ధ, ఏఈ అంజయ్య, కుమార్, ఆర్ఐ సంతోష్, ఎంపీవో ఆరిఫ్పాషా, కార్యదర్శి సాయి పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పెడుతున్న ఖర్చుపై అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా వ్యయ పరిశీలకులు రాజ్కుమార్ సూచించారు. మండల పరిషత్, వెంకటాపూర్ పంచాయతీలను సోమవారం తనిఖీ చేసిన సందర్భంగా అధికారులతో మాట్లాడారు. అభ్యర్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండంలో ఎన్ని నామినేషన్లు వచ్చాయని, ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలుసుకున్నారు. నోడల్ అధికారి నవీన్, భారతి, ఎంపీడీవో సత్తయ్య ఉన్నారు. -
పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్తో కలిసి రండి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: పల్లెల అభివృద్ధికి అధికార పార్టీ కాంగ్రెస్లో చేరి కలిసి పనిచేసేందుకు ముందుకురావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన పలువురు నాయకులు, ఇటీవల ఏకగీవ్రంగా ఎన్నికై న వార్డు సభ్యులు మహేశ్, సంపత్ మరో 25 మందితో కలిసి సోమవారం కాంగ్రెస్లో చేరారు. వీరందరికి విప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
‘కవ్వంపల్లి’ని కలిసిన ఏకగ్రీవ సర్పంచులు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 8 మంది సర్పంచులలో ఏడుగురు సోమవారం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిశారు. ముస్కాన్పేట సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్రెడ్డి, తిప్పాపురం సర్పంచ్ బొల్లవేణి మంజుల, కేసన్నపల్లి సర్పంచ్ పోతరాజు చంటి, కృష్ణరావుపల్లి సర్పంచ్ జక్కుల మల్లవ్వ, గాలిపల్లి సర్పంచ్ బద్దం శేఖర్రెడ్డి, పత్తికుంటపల్లి సర్పంచ్ జుట్టు శేఖర్, జంగారెడ్డిపల్లి సర్పంచ్ పండుగ సునీత ఉన్నారు. ఏకగ్రీవ వార్డుమెంబర్లు, కాంగ్రెస్ నాయకులు గుడిసె ఐలయ్య, వెంకట రమణారెడ్డి, బాల్రెడ్డి, భాస్కరరావు, రమేశ్, రాజేందర్రెడ్డి ఉన్నారు. -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
వేములవాడ: చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. క్రీడలతో మానసికోల్లాసంతోపాటు శారీరక ద్రుఢత్వం లభిస్తుందన్నారు. పట్టణంలో రాష్ట్రస్థాయి ఓపెన్ కుంగ్ఫూ చాంపియన్షిప్ పోటీలను ఆదివారం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. కరాటే, కుంగ్ఫూ పోటీల్లో విద్యార్థులు రాణించాలన్నారు. జీవితంలో వచ్చే ఆటుపోట్లను ఎదిరించేలా క్రీడలు మానసిక ధ్రుఢత్వాన్ని కల్గిస్తాయన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు నేరెళ్ల శ్రీధర్ పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పరిశీలన రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీ లించారు. భీమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. సీసీ రోడ్డు, క్యూలైన్, ఫ్లైఓవర్, ఉచిత దర్శనం క్యూలైన్, రూ. 300 ప్రత్యేక దర్శనం క్యూలైన్, వీఐపీ రోడ్డు, పార్వతీపురం ధర్మశాల రోడ్డు, లడ్డూ కౌంటర్, కొత్తగా ఏర్పాటు చేస్తున్న షాపుల పనులు పరిశీలించారు. -
పస్తులతో పాఠాలు
● అర్ధాకలితో పదోతరగతి విద్యార్థులు ● ప్రత్యేక తరగతులకు స్నాక్స్ అందక ఇబ్బందులు ● జిల్లాలో 3,411 మంది ‘పది’ విద్యార్థులుముస్తాబాద్(సిరిసిల్ల): పదో తరగతి విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. బాగా చదువుకోవా లన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆశయం అర్ధాకలి మధ్య సాగుతోంది. సాయంత్రం అల్పాహారం అందక నీరసించి పాఠాలు సరిగా వినలేకపోతున్నారు. పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అల్పాహారం అందించేందుకు గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో 3,411 మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. వీరికి సాయంత్రం వేళ స్నాక్స్ అందించాల్సి ఉంది. సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు నిత్యం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం చేసిన విద్యార్థులు సాయంత్రం వరకు ఆకలితో అల్లాడుతున్నారు. నెలరోజుల క్రితమే ప్రారంభించాల్సింది.. నవంబర్ 1 నుంచి పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ, నెల రోజులుగా విద్యార్థులకు ఎలాంటి అల్పాహారం అందించడం లేదు. గోరుముద్ద పథకం జాడ లేకపోవడంతో విద్యార్థులు సరిగా తరగతులు వినలేకపోతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ప్రభుత్వ ఆశయం ఏ మేరకు నెరవేరుతుందని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రోజూ సాయంత్రం స్నాక్స్లో ఉడకబెట్టిన పల్లీలు, బబ్బెర్లు, శనగలు, మెత్తటి అటుకులు ఇస్తారు. పొరుగూరి విద్యార్థులకు ఇబ్బంది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్న గ్రామాల విద్యార్థులు పదో తరగతి కోసం సమీప గ్రామాల్లోని హైస్కూళ్లకు వస్తున్నారు. వీరంతా ఉదయమే పాఠశాలకు వచ్చి, ఇక్కడే మధ్యాహ్న భో జనం చేస్తారు. ప్రత్యేక తరగతుల తర్వాత పొద్దుపోయాక ఇంటికి చేరుకుంటున్నారు. ఆకలితోనే ఇళ్లకు చేరుతున్న విద్యార్థులు నీరసించిపోతున్నారు. జెడ్పీ హైస్కూళ్లు 109 ఎంపీహెచ్ఎస్ స్కూళ్లు 03 ప్రభుత్వ హైస్కూల్స్ 02 పదో తరగతి విద్యార్థులు 3,411 ‘ఈ ఫొటోలోని విద్యార్థినులు బత్తుల సంజన, నిమ్మల వైష్ణవి. వీరిది ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది. వారి ఊరిలో ఏడో తరగతి వరకు మాత్రమే ఉండడంతో ముస్తాబాద్లోని హైస్కూల్కు వస్తున్నారు. పదో తరగతి చదువుతున్న వీరికి ప్రత్యేక తరగతులు సాయంత్రం 5.30 వరకు సాగుతున్నాయి. ఇంటికెళ్లే సరికి రాత్రి 7.30 గంటలు అవుతోంది. మధ్యాహ్నం స్కూల్లో చేసిన భోజనంతో రాత్రి వరకు ఆకలితో ఉంటున్నామని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకలితో క్లాసులను సరిగా వినలేకపోతున్నామంటున్నారు. ఇలా వీరుమాత్రమే కాదు.. జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు అందరూ ఎదుర్కొంటున్నారు’. -
అప్రమత్తంగా ఉండాలి
వేములవాడరూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదివారం పరిశీలించారు. వేములవాడ రూరల్ మండలంలోని జిల్లా సరిహద్దు ఫాజుల్నగర్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్ట్ను తనిఖీ చేశారు. ఎన్నికల నియమావళి పాటించాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల ప్రవర్తన నియామవళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ఎంసీసీని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎంసీసీ అధికారి, సిరిసిల్ల డీఆర్డీవో శేషాద్రి పేర్కొన్నారు. తంగళ్లపల్లిలోని రైతువేదికలో జిల్లా సహాయ ఎన్నికల అధికారి తంగళ్లపల్లి ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డుసభ్యుల అభ్యర్థులకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్పై ఆదివారం అవగాహన కల్పించారు. డీఆర్డీవో శేషాద్రి మాట్లాడుతూ బడులు, గుడులు, ప్రార్థన మందిరాల్లో ప్రచారం చేయొద్దని సూచించారు. కులాలు, మతాలు, వర్గాల పేరుతో ఓట్లు అడగకూడదని స్పష్టం చేశారు. ఖర్చుచేసే ప్రతీ రూపాయికి లెక్క చూపించాలన్నారు. రూ.50 వేలకు మించి నగదు కలిగి ఉండొద్దని, మద్యం ఆరు ఫుల్బాటిళ్లు, 12 బీరుసీసాలకు మించి ఇంటిలో ఉంటే సీజ్చేసి కేసు నమోదు చేస్తారని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదవుతాయన్నారు. ఏవో సంజీవ్, ఏపీవో నాగరాజు, టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణ్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పో టీలకు ఎంపికయ్యారు. సాకేత్, ఉమేశ్ కబడ్డీ స్టేట్ లెవెల్కు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ వీర ప్రభాకర్ తెలిపారు. ఈనెల 6, 7, 8 తేదీలలో మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగుల నిరీక్షణ కోనరావుపేట(వేములవాడ): మండల పరిషత్ అధికారుల నిర్లక్ష్యంతో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. తమ ఓటుహక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేందుకు పలువురు ఉద్యోగులు ఆదివారం ఉదయం 10 గంటల వరకు కోనరావుపేట మండల పరిషత్కు చేరుకున్నారు. అయితే అధికారులు ఎవరూ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ నిర్వహించిన సమావేశానికి వెళ్లిన మండల పరిషత్ అధికారులు మధ్యాహ్నం 12.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల అధికారి కల్పన, ఇతర సిబ్బంది ఉద్యోగుల నుంచి పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించారు. మొత్తం 11 మంది ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. ఆత్మహత్యలు సరికాదుసిరిసిల్లటౌన్: ఆత్మహత్యలు సరికాదని బీసీ రిజర్వేషన్లు పోరాడి సాఽధించుకుందామని పలువురు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్చౌరస్తాలో ఆదివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో సాయి ఈశ్వరాచారి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. ఇప్పటికై నా కేంద్రం స్పందించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో 42 శాతం బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పంతం రవి, బొజ్జ కనకయ్య, బుర్ర మల్లేశం, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుంటి వేణు, సోమ నాగరాజు, రజని, సాగర్, రాకేశ్, రాజు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
చలి.. గుండె అలజడి
కరీంనగర్: జిల్లాను చలి వణికిస్తోంది. గజగజ వణికే చలితో శ్వాసకోశ, చర్మవ్యాధులతో పాటు హార్ట్ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్లు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అధిక చలితో రక్తనాళాలు కుచించుకుపోయి రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడడంతో హార్ట్ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మారిన జీవనశైలిలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. షుగర్, బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు, కేన్సర్, టీబీ తదితర వ్యాధులతో బాధపడే వారు మరింత జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. గుండెపోటుకు చలి ఒక కారణమైనప్పటికీ ఇతర కారణాలు ఉన్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్, హైబీపీ, అదుపులో లేని షుగర్, చిన్నప్పటి నుంచే గుండె సంబంధ సమస్యలు ఉండే వారు హార్ట్ఎటాక్కు గురవుతారు. మామూలు రోజుల్లో కన్నా చలికాలంలో హార్ట్ ఎటాక్లు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో గుండె సమస్యలు చలి ఎక్కువగా ఉన్నప్పుడు రక్త నాళాలు కుచించుకుంటాయి. దీంతో బీపీ పెరుగుతుంది. గుండె మరింత శక్తిగా పనిచేయాల్సి వస్తుంది. ఇది గుండె వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. చలిలో రక్తం కొంచెం మందంగా మారి రక్త గడ్డలు (క్లాట్స్) ఏర్పడే అవకాశం పెరుగుతుంది. దీంతో హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చలితో శరీరం వేడిగా ఉంచేందుకు ఎక్కువ కేలరీలు, ఎక్కువ ఆక్సిజన్ అవసరం పడుతుంది. దీంతో గుండైపె భారం పెరుగుతుంది. జలుబు, ఫ్లూ, శ్వాస సమస్యలు పెరిగి గుండె సంబంధిత సమస్యల్ని మరింత తీవ్రతరం చేస్తాయి. చలికాలంలో వ్యాయామం తగ్గిపోవడం, బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చలికాలంలో రక్తపోటు సాధారణంగా పెరుగుతుంది. హై బీపీతో హార్ట్ ఎటాక్ ప్రమాదం ఉంటుంది. గుండెపోటు ఇలా గుండెకు ప్రధానంగా మూడు దమనుల ద్వారా రక్తసరఫరా జరుగుతుంది. వీటిలో ఏ రక్తనాళం మూసుకుపోయినా గుండె కండరాలకు అందాల్సిన రక్తం అందక గుండె పోటు వస్తుంది. ఇలాంటప్పుడు సమయానికి హాస్పిటల్కు తీసుకెళ్తే బాధితులను బతికించేందుకు అవకాశముంటుంది. కార్డియాక్ అరెస్ట్ జరిగిన తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో... సీపీఆర్ ప్రక్రియపై అవగాహన ఉన్నవారు సీపీఆర్ చేయడం కూడా అంతే ముఖ్యం. ‘చొప్పదండి ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి ఈనెల 3న వేకువజామున హఠాత్తుగా గుండెల్లో నొప్పి వచ్చింది. కు టుంబసభ్యులు హుటాహుటిన కరీంనగర్లో ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలు నిలిచాయి.’ ‘నగరంలోని కిసాన్నగర్కు చెందిన 42 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి అర్ధరాత్రి ఎడమచేయి లాగ డం, చాతిలో నుంచి వీపులోకి నొప్పి రావడంతో కుటుంబసభ్యులు మొదటి ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో కోలుకున్నాడు.’ -
ఫోన్లోనే వ్యూహం
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలు తుదిదశకు చేరుకున్నాయి. అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో ఎన్నికలు జరిగే గ్రామాల్లోని అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. మూడో విడతలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అయితే ఈసారి ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూరంగా ఉంటున్నారు. ద్వితీయశ్రేణి నాయకులతో మంతనాలు జరుపుతూ ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్నారు. పోటీలో నుంచి ఉపసంహరించుకుంటే భవిష్యత్ రాజకీయ జీవితంపై భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 27 గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. కానీ బడా నేతలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కనిపించని బడా నేతలు వేములవాడ నియోజకవర్గంలో మొదటి విడత ఎన్నికలు ఈనెల 9న జరగనున్నాయి. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రచారంలో కనిపించడం లేదు. కానీ పార్టీ శ్రేణులతో ఫోన్లో మాట్లాడుతూ దిశ, నిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చలిమెడ లక్ష్మీనరసింహారావు కేరళలో ఉన్నారు. నిత్యం పార్టీ నాయకులతో ఫోన్లోనే సమాలోచనలు చేస్తున్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ప్రచారానికి తెరలేపారు. ఈ ప్రాంతంలోని ప్రధాన పార్టీల నాయకులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పంచాయతీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో పార్టీ ముఖ్యనాయకులతో వ్యూహాలు రూపొందిస్తున్నారు. సిరిసిల్ల ప్రాంత కాంగ్రెస్ నేత కె.కె.మహేందర్రెడ్డి సైతం పార్టీ శ్రేణులతో టచ్లో ఉంటూ అభ్యర్థులను ఖరారు చేశారు. ఏకగ్రీవాలపై నజర్ మూడో విడత ఎన్నికలు జరిగే ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉంది. ఆయా మండలాల్లోని జీపీలను ఏకగ్రీవం చేసేందుకు బడా నేతలు పావులు కదుపుతున్నారు. ద్విముఖ, త్రిముఖ పోటీ ఉన్న స్థానాల్లో ఏకగ్రీవం చేసేందుకు నామినేషన్ల ఉపసంహరణ పర్వాన్ని వేదిక చేసుకోవాలని భావిస్తున్నారు. ఈమేరకు ఆయా మండలాల్లోని ప్రధాన పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు పోటీలో ఉన్న అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులతో ముఖ్యనేతలతో ఫోన్లో మాట్లాడిస్తూ భవిష్యత్లో పదవులు ఇస్తామని, కాంట్రాక్టు పనులు ఇప్పిస్తామని హామీలు ఇప్పిస్తున్నారు. ఆర్థికపరమైన భేరాలు చేస్తున్నారు. ఏకగ్రీవమైన 27 గ్రామాలు జిల్లా వ్యాప్తంగా 260 గ్రామాలకు 27 పంచాయతీల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 295 వార్డుస్థానాల్లోనూ ఒక్కో నామినేషన్ రావడంతో ఆ వార్డు సభ్యులు ఏకగీవ్రమయ్యారు. జిల్లాలో 233 సర్పంచ్ స్థానాలకు, 1973 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మూడో విడత గ్రామాల్లో ఉపసంహరణకు మంగళవారం వరకు గడవు ఉండడంతో మరిన్న ఏకగీవ్రమయ్యేలా కనిపిస్తున్నాయి. జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో ఎనిమిది గ్రామాలు, రుద్రంగిలో ఏడు, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేటల్లో రెండు, గంభీరావుపేట, తంగళ్లపల్లిల్లో మూడు, ముస్తాబాద్, వీర్నపల్లిల్లో ఒక్కో గ్రామం ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో వార్డు సభ్యుల స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి. నాలుగు మండలాల్లో ఆఖరు ప్రయత్నాలు నామినేషన్ల ఉపసంహరణకు రేపటి వరకు గడువు ఉండడంతో వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో ప్రధాన పార్టీల నేతలు ఆఖరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకగ్రీవ ఎన్నికలపై నజర్ పెట్టి, ఆయా పల్లెల్లో రాజకీయంగా పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు చివరి ప్రయత్నాలు ప్రారంభించాయి. ద్వితీయ శ్రేణి నాయకులను రంగంలోకి దింపాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్లె పోరు రసవత్తరంగా సాగుతుంది. ప్రచారంలో దూరం.. -
ఆకలితో వినలేకపోతున్నం
ఉదయం స్కూల్కు వచ్చి మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తున్నాం. నెల క్రిత నుంచి స్నాక్స్ ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆకలితో క్లాసులు సరిగా వినలేకపోతున్నాం. ఇంటికి వెళ్లే సరికి ఆలస్యమవుతోంది. – రుచిత, పదో తరగతి సాయంత్రం తరగతులు పూర్తయి బస్సులో ఇంటికెళ్లే సరికి రాత్రి అవుతుంది. అప్పటికే అలసిపోతున్నాం. సాయంత్రం పూట స్నాక్స్ ఇస్తే బాగుండేది. ఆకలితో క్లాసులు అర్థం కావడం లేదు. – భరత్, వెంకయ్యకుంట నవంబర్ 1 నుంచే గోరుముద్ద ప్రారంభం కావాల్సి ఉంది. ఇంకా బడ్జెట్రాలేదు. పిల్లలు ఆకలి అంటున్నారు. కొందరు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. నిధులు రాగానే పిల్లలందరికీ స్నాక్స్ ఇస్తాం. – నిమ్మ రాజిరెడ్డి, ఎంఈవో, ముస్తాబాద్ -
21న లోక్ అదాలత్
● జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి బి.పుష్పలత సిరిసిల్లకల్చరల్: ఈనెల 21న జరిగే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షురాలు బి.పుష్పలత కోరారు. సిరిసిల్ల కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. చిన్నపాటి తగాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలతో కోర్టుల చుట్టూ తిరగొద్దన్నారు. సిరిసిల్ల, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జీలు పి.లక్ష్మణాచారి, అజయ్కుమార్జాదవ్, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ కె.నాగేంద్రచారి, మేజిస్ట్రేట్స్ ప్రవీణ్, జ్యోతిర్మయి, కావేటి సృజన, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. చందుర్తి/రుద్రంగి/వేములవాడరూరల్: ఎన్నికల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రుద్రంగి, చందుర్తి మండలం మల్యాల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను శనివారం పరిశీలించారు. రుద్రంగి తహసీల్ ఆఫీస్లో భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులపై ఆరా తీశారు. రుద్రంగి ఎస్ఎస్టీ చెక్పోస్ట్ను తనిఖీ చేశారు. రుద్రంగి తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్, ఎంపీవో బండి ప్రదీప్కుమార్, పంచాయతీ కార్యదర్శి నరేందర్ ఉన్నారు. వెంటనే అన్లోడ్ చేయాలి కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన లారీల్లో నుంచి ధాన్యం బస్తాలను వెంటనే అన్లోడ్ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలోని మహాలక్ష్మీ రైస్మిల్లును తనిఖీ చేశారు. వేములవాడఅర్బన్/కోనరావుపేట(వేములవాడ): ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికుమార్ కోరారు. వేములవాడ మండలంలోని చీర్లవంచ, మారుపాక, చింతాల్ఠాణా, కోనరావుపేట మండలంలోని కొలనూర్, మర్తనపేటల్లోని పోలింగ్ కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఇంకా ఏమైనా వసతులు కల్పించాలా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో స్నిగ్ధ, అధికారులు ఉన్నారు. వేములవాడ: మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్కు న్యాయవాదుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి పుష్పలత శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడేళ్ల సీనియార్టీ గల న్యాయవాదులు తమ ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 24లోపు వేములవాడ సబ్కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజన్న గుడి వద్ద పటిష్ట భద్రతరాజన్న గుడి పార్కింగ్ స్థలంలో తనిఖీ చేస్తున్న పోలీసులు వేములవాడ: రాజన్న ఆలయ పరిసరాలు, గుడి చెరువు పార్కింగ్ ఏరియాలో పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గుడి చెరువు ఖాళీ స్థలంలోని పార్కింగ్ ప్రదేశంలో డాగ్స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. -
హోంగార్డ్ల పనితీరు ప్రశంసనీయం
సిరిసిల్ల క్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పనితీరు ప్రశంసనీయమని, విధినిర్వహణలో హోంగార్డుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ మైదానంలో శనివారం 63వ హోంగార్డు రైజింగ్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. హోంగార్డులు పోలీస్శాఖలో అంతర్భాగమన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ బందోబస్తు విధుల్లో సమర్థంగా పనిచేస్తున్నారన్నారు. హోమ్గార్డ్స్ అధికారులు, సిబ్బంది ఎవరికి సమస్య వచ్చినా నేరుగా సంప్రదించాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు కృష్ణ, మొగిలి, నాగేశ్వరరావు, రవి, ఆర్ఐలు మధుకర్, యాదగిరి, రమేశ్ పాల్గొన్నారు. -
ఇళ్ల మధ్యే పర్మిట్ !
ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలోని సినిమా థియేటర్ వద్ద కొత్తగా వచ్చిన వైన్స్ పర్మిట్రూమ్తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు హైదరాబాద్ ఎకై ్సజ్ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు వారు మాట్లాడుతూ థియేటర్ పక్క దారి నుంచి నడిచే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. పర్మిట్రూమ్ ఎదుట వాహనాల పార్కింగ్తో రోడ్డు మూసుకుపోతుందన్నారు. పర్మిట్రూమ్లో మద్యం తాగి అక్కడే ఆరుబయట మూత్రవిసర్జన చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించి ఆ ప్రాంతం నుంచి పర్మిట్రూమ్ను తొలగించాలని కోరుతున్నారు. దీనిపై ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన వైన్స్కు అనుమతులు ఇచ్చామన్నారు. పర్మిట్ రూమ్ వద్ద ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు. మద్యం, నగదు రవాణా అరికట్టాలిబోయినపల్లి: చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అక్రమంగా మద్యం, నగదు రవాణాను అరికట్టాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి సూచించారు. మండలంలోని నర్సింగాపూర్ చెక్పోస్ట్ను తనిఖీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్య చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. -
పల్లెల్లో మందుపాతర్లు!
ఇది కోనరావుపేట మండలం బావుసాయిపేట. ఈ ఊరిలో అనధికారికంగా తొమ్మిది బెల్ట్షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్షాపుల్లో సగటున నిత్యం రూ.2లక్షల మద్యం విక్రయాలు సాగుతాయి. ఇప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిత్యం రూ.3లక్షలకు చేరాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో బెల్ట్షాపుల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉంది. సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో మద్యం విక్రయాలు రెట్టింపయ్యాయి. బెల్ట్షాపుల్లో వ్యాపారం జోరందుకోగా.. గల్లీల్లో మద్యం పారుతోంది. సాయంత్రం అయిందంటే చాలు సర్పంచ్ అభ్యర్థులు తన అనుయాయుల ద్వారా ఓటర్లకు మద్యం అందజేస్తున్నారు. దీంతో ఇటీవల జిల్లాలో మద్యం వ్యాపారం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 48 వైన్స్షాపులకు, ఏడు బార్లకు అనుమతి ఉండగా.. 1025 బెల్ట్షాపులు నడుస్తున్నాయి. నిత్యం రూ.1.50కోట్ల మద్యం విక్రయాలు సాగుతాయి. ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు మరో రూ.50 లక్షలు పెరిగింది. అంటే నిత్యం రూ.2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. లైసెన్స్ ఉన్నట్లుగానే బెల్ట్షాపుల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. పుణ్యక్షేత్రం వేములవాడలోని బెల్ట్షాపుల నిర్వాహకులు మద్యం బాటిళ్లను డోర్ డెలివరీ చేయడం దారుణం. ఫోన్చేస్తే చాలు కోరిన మద్యం.. చెప్పిన చోటికి నిమిషాల్లో చేరుతుంది. ధరలు పెంచి దోపిడీ సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు అన్ని పల్లెల్లోనూ హోటళ్లు, కిరాణషాపుల కేంద్రంగా బెల్ట్షాపులు నడుస్తున్నాయి. ఈ బెల్ట్షాపుల్లో మద్యం ధరలు పెంచి అమ్ముతుంటారు. క్వార్టర్ నుంచి ఫుల్బాటిళ్ల వరకు లిక్కర్ ధరలు ఇష్టానుసారంగా పెంచారు. ప్రతీ బాటిల్పై రూ.30 నుంచి రూ.200 వరకు బ్రాండ్ను బట్టి ధరలు పెంచి అమ్ముతున్నారు. బెల్ట్షాపుల నిర్వాహకుల వద్ద వైన్స్షాపుల నిర్వాహకులు నెలకు రూ.2వేల చొప్పున వసూలు చేసి ప్రతీ వైన్షాపు నుంచి స్థానిక పోలీస్స్టేషన్లలో రూ.15వేల నుంచి రూ.20వేలు, ఎకై ్సజ్ అధికారులకు రూ.15వేల చొప్పున మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎకై ్సజ్ అధికారులు అప్పుడప్పుడూ బెల్ట్షాపులపై దాడులు చేస్తున్నా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే సాకుతో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. బెల్ట్షాపులు పల్లెల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. మద్యం వ్యాపారులకు లక్కు ! కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చిన వారికి పంచాయతీ ఎన్నికలు అదృష్టంగా మారాయి. మద్యం విక్రయాలు పెరగడంతో పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కులసంఘాల పెద్దలకు, తమకు అనుకూలంగా ఉన్న వారికి విందులు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు బెల్ట్షాపులపై దాడులు చేస్తూ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా గుట్టుచప్పుడు కాకుండా బెల్ట్షాపుల్లో లిక్కర్ విక్రయాలు సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో భారీ ఎత్తున మద్యం నిల్వలు ఉన్నాయి. పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు నిఘా పెట్టి మద్యం కట్టడి చేస్తే ఎన్నికల వేళ గొడవల జరగకుండా అడ్డుకోవచ్చు. -
ముగిసిన ఉపసంహరణల పర్వం
● రెండో విడతలో గుర్తుల కేటాయింపు ● మూడో విడతలో పరిశీలన ● తారాస్థాయికి పంచాయతీ పోరుబోయినపల్లి(చొప్పదండి): జిల్లాలో పంచాయతీ పోరు ఊపందుకుంది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తుండగా, రెండో విడత జీపీల్లో గుర్తుల కేటాయింపు పూర్తయింది. మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో వచ్చిన నామినేషన్ల పరిశీలన పూర్తయింది. బోయినపల్లి మండలంలోని 23 జీపీలకు 90 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎంపీడీవో భీమా జయశీల శనివారం రాత్రి తెలిపారు. 212 వార్డుస్థానాలకు 46 మంది ఏకగ్రీవం కాగా, మిగతా 166 వార్డుల్లో 437 మంది బరిలో ఉన్నారు. మండలంలోని కొత్తపేటలో 8 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. గుర్తుల కేటాయింపు ఇల్లంతకుంట: మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల ఎన్నికల ఆర్వో కేంద్రాలలో అభ్యర్థుల ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న సర్పంచ్, వార్డ్మెంబర్లకు గుర్తులు కేటాయించారు. మండలంలోని 11 ఆర్వో కేంద్రాలు ఉన్నాయి. మండలంలోని 35 గ్రామపంచాయతీలకు 8 ఏకగ్రీవంకాగా.. 27 గ్రామపంచాయతీలకు 79 మంది పోటీలో ఉన్నట్లు ఎంపీడీవో శశికళ తెలిపారు. 294 వార్డులకు 104 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 190 వార్డులకు 454 మంది బరిలో మిగిలారని వివరించారు. గుర్తుల కేటాయింపులో గందరగోళం తంగళ్లపల్లి: మండల కేంద్రం మేజర్ గ్రామపంచాయతీలో గుర్తులు కేటాయింపులో గందరగోళం నెలకొంది. సర్పంచ్ పోటీకి మొదటి స్థానంలో ఉన్న అంకారపు రవీందర్, రెండో స్థానంలో ఉన్న ఇటికాల మహేందర్కు కేటాయించిన గుర్తులు మార్చాలని మరో సర్పంచ్ అభ్యర్థి మోర లక్ష్మీరాజం ఫిర్యాదు చేశారు. తెలగు వర్ణమాల ప్రకారం ‘అ’ కాకుండా ‘అం’ ప్రకారం కేటాయించాలని వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం కలెక్టర్ వరకు వెళ్లింది. బరిలో 142 మంది ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని 26 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలకు 204 మంది నామినేషన్లు వేయగా, పరిశీలన అనంతరం 142 నామినేషన్లను అధికారులు ఓకే చేశారు. 226 వార్డులకు 571 మంది నామినేషన్ వేశారు. పరిశీలన అనంతరం 542 నామినేషన్లను అధికారులు ఓకే చేశారు. గుంటపల్లిచెరువు తండా నుంచి భూక్య తిరుపతినాయక్ ఒక్కరే నామినేషన్ దాఖరు చేశారు. 26 వార్డులకు ఒకే నామినేషన్ పడడంతో ఏకగ్రీవం కానున్నాయి. ఒక నామినేషన్ తిరస్కరణ ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని 22 గ్రామాల సర్పంచ్ ఎన్నికలలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు ఎంపీడీవో లచ్చాలు తెలిపారు. 22 సర్పంచ్ స్థానాలకు 171 నామినేషన్లు రగా.. ముస్తాబాద్ మేజర్ పంచాయతీలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. 105 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 202 వార్డులకు 545 నామినేషన్లు వచ్చాయి. ముస్తాబాద్ మేజర్ పంచాయతీలోని ఒకటో వార్డులో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఏకగ్రీవాలు పోను 518 మంది వార్డు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
ఎన్నికల సరళిని పరిశీలించాలి
సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఓ టింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమ ని, ఎన్నికల సరళిని నిషితంగా పరిశీలించాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో శనివారం మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు పోలింగ్కు ముందు, తర్వాత నిశితంగా పర్యవేక్షించి నివేదికను అందించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా ఎన్ని కల సాధారణ పరిశీలకులు రవికుమార్, డీఆర్డీవో శేషాద్రి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, డీపీవో షరీఫొద్దీన్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఎల్డీఎం మల్లికార్జునరావు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు మొదటి విడత ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు నియామకపత్రం, ఫామ్–14, ఎపిక్ కార్డుతో తమ సొంత మండల పరిషత్ అభివృద్ధి అధికారి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి సమర్పించాలని సూచించారు. అక్కడే ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటుహక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. -
575 మందిపై అనర్హత వేటు !
● 2019లో ఎన్నికల ఖర్చు చూపకపోవడమే కారణం ● ఎన్నికల వాయిదాతో కలిసి వచ్చిన అవకాశం సిరిసిల్ల అర్బన్: జిల్లాలో 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి ఖర్చుల వివరాలు చూపని 575 మందిపై ఎన్నికల సంఘం 2021లో అనర్హత వేటువేసింది. ఫలితంగా మీరు మూడేళ్లపాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులే. సాధారణంగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఖర్చు చేసిన ప్రతీ పైసాకు విధిగా లెక్కలు చెప్పాలి. లేదంటే తర్వాత అనర్హత వేటు పడుతుంది. ఇదీ ఎన్నికల సంఘం విధించిన నిబంధన. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు ఇవేమి పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో 2019లో గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసి లేక్కలు చూపని వారు జిల్లాలో 575 మందిపై వేటుపడింది. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన వారిలో 45 మంది ఎన్నికల ఖర్చులు చూపలేదు. వార్డు సభ్యులుగా జిల్లాలో 34 మంది ఎన్నికై లెక్కలు చూపకపోవడంతో వీరిపై అనర్హత వేటుపడింది. వార్డు సభ్యులుగా పోటీచేసి ఓడిపోయిన వారిలో 446 మంది ఖర్చులు చూపలేదు. వీరందరిపై ఎన్నికల సంఘం అనర్హత వేటువేసింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ముగ్గురు, ఎంపీటీసీలుగా పోటీచేసి ఓడిపోయిన 47 మంది ఎన్నికలు పూర్తయినా ఇచ్చిన గడువులోపు లెక్కలు చూపకపోవడంతో వీరిపై అనర్హత వేటు వేసింది. ఎన్నికలు వాయిదాతో కలిసివచ్చిన అవకాశం పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1వ తేదీన ముగియగా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం గతేడాది జూలైలో ముగిసింది. సకాలంలో ఎన్నికలు జరిగితే వేటుపడిన అభ్యర్థులు పోటీచేసే అవకాశం కోల్పోయేవారు. కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో జిల్లాలో 575 మంది అనర్హత పొందిన అభ్యర్థులకు మళ్లీ పదవులకు పోటీచేసే అవకాశం లభించింది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 11 నుంచి మూడు విడతలుగా గ్రామపంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో 2019లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో అనర్హత పొందిన అభ్యర్థుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. స్థానికసంస్థల ఎన్నికలు వాయిదాతో ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలిసి వచ్చింది. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
● రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవికుమార్ ముస్తాబాద్(సిరిసిల్ల): పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవికుమార్ పేర్కొన్నారు. ముస్తాబాద్, నామాపూర్, గూడెంలోని ఎన్నికల క్లస్టర్లను శుక్రవారం పరిశీలించారు. అభ్యర్థులకు కావాల్సిన సహాయాన్ని హెల్పింగ్డెస్క్ ఎలా అందిస్తుందో తెలుసుకున్నారు. ఎంపీడీవో లచ్చాలు, ఎంపీవో వాహిద్ ఉన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నామినేషన్ల ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అధికారులకు సూచించారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట, హరిదాస్నగర్, వెంకటాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. తహసీల్దార్ సుజాత, మండల అసిస్టెంట్ ఎన్నికల అధికారి సత్తయ్య తదితరులు ఉన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం కోరారు. మండలంలోని రాళ్లపేటలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ మృత్తికా దినోత్సవంలో మాట్లాడారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ కేబీ సునీతాదేవి మాట్లాడుతూ అర్బన్ ఫార్మింగ్, నేల ఆరోగ్యం గురించి వివరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రొఫెసర్లు డాక్టర్ ఆర్.సాయికుమార్, డాక్టర్ పి.మాధవి, డాక్టర్ ఎం.సంపత్కుమార్, డాక్టర్ టి.అరుణ్బాబు, యశశ్విని, మండల వ్యవసాయాధికారి కనవేని సంజీవ్, సాయికిరణ్, ఏఈవో అనూష పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: పనిప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరగకుండా చూడాలని జిల్లా సంక్షేమాధికారి పి.లక్ష్మీరాజం సూచించారు. సిరిసిల్ల పరిధిలోని అపరెల్ పార్క్లోని పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో శుక్రవారం సమావేశమయ్యారు. లక్ష్మీరాజం మాట్లాడుతూ పనిప్రదేశాల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్మికుల మానసికోల్లాసానికి చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లల డేకేర్ సెంటర్లో అందుతున్న సేవలు పరిశీలించారు. పంచాయతీ బరిలో అంగన్వాడీ ఆయాఇల్లంతకుంట(మానకొండూర్): పంచాయతీ పోరులో అంగన్వాడీ ఆయా నిల్చున్నారు. మండలంలోని గొల్లపల్లికి చెందిన అంగన్వాడీ ఆయా కడగండ్ల శిరీష బీఎస్సీ చదివారు. 2017 నుంచి గ్రామంలో అంగన్వాడీ ఆయాగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు 2014లో సోమారంపేట ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి 23 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గొల్లపల్లి గ్రామం ప్రస్తుతం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో భర్త తిరుపతి ప్రోత్సాహంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అంగన్వాడీ ఆయా ఉద్యోగానికి రాజీనామా చేశారు. -
అప్పుడే సర్పంచ్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇల్లు అలకగానే పండగ కాదు.. నామినేషన్ వేయగానే సర్పంచ్ అయిపోరు.. రాజకీయ రణరంగంలోకి దిగగానే సరిపోదు.. తెరవెనక ఎంతో శ్రమించాల్సి ఉంటుంది అనేది సత్యం. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో పరిస్థితులు ఒకప్పటిలా లేవు. ఊరికి ఏదో చేయాలని పోటీ చేసేందుకు వస్తున్న వారంతా రూ.లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. మార్కెట్లో నగదు చలామణి తగ్గిపోయింది. సర్పంచ్ పదవి కోసం బరిలోకి దిగుతున్న వారికి ఇదో సవాల్గా మారింది. నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు వారం రోజుల సమయం ఉంది. నిత్యం ప్రచారానికి రూ.వేలల్లో ఖర్చవుతుంది. ఫ్లెక్సీలు, టీవీలు, పేపర్లలో ప్రచారానికి రూ.లక్షల్లో ఖర్చు పెట్టాలి. ఇదికాక నిత్యం అనుచరులకు మందు, విందు సరేసరి. వీటన్నింటికీ నగదు కావాలి. అందుకోసం అభ్యర్థులు అప్పుల వేటలో పడ్డారు. ‘అప్పు’డే సర్పంచ్ కాగలరు అన్న ఆశయంతో ఖర్చు కోసం వెనకాడకపోవడం గమనార్హం. గెలవకపోతే అప్పుల ఊబిలో.. వాస్తవానికి అప్పులు చేసి పోటీచేస్తున్న అభ్యర్థులలో నూటికి 90 శాతం మంది సాహసం చేస్తున్నారు. రూ.లక్షల్లో ఖర్చు పెడుతూ.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. బరిలో ఉన్న వారు గెలుస్తారన్న గ్యారెంటీ లేకపోయినా నామినేషన్ వేశాక ఇవేమీ ఆలోచించే పరిస్థితిలో లేరు. గెలుస్తారన్న నమ్మకంతో ఖర్చు చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు ఏకగ్రీవం కోసం ఇప్పటికే రూ.లక్షలు పెట్టినవారు, పెట్టబోతున్న వారికి అప్పుల ముప్పు పొంచి ఉంది. గెలిచినా, గెలవకపోయినా.. ఖర్చు మాత్రం పెట్టక తప్పని పరిస్థితి. అందుకే, ఈ యువ నాయకులు తమ డాబు, దర్పం ప్రదర్శించుకోవడానికి భూములు, నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. గెలిచినా, గెలవకపోయినా రుణం తీర్చడం మాత్రం అనివార్యం. ఈ నేపథ్యంలో వీరంతా ఈ అప్పులను ఎలా తీరుస్తారో చూడాలి మరి!కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇంకా రెండో, మూడో విడతల్లో పలు గ్రామాలు ఏకగ్రీవానికి మొగ్గుచూపుతున్నాయి. అయితే ఏకగ్రీవాలు అనుకున్నంత సులువుగా కొలిక్కి రావడం లేదు. దాని వెనక చాలా తతంగం నడుస్తోంది. చిన్నగ్రామాలు, వెయ్యి లోపు ఓట్లు ఉన్న గ్రామాల్లోనే పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. ఇక 3వేలు.. ఆపై ఓట్లు ఉన్న గ్రామాల్లో పరిస్థితి హోరాహోరీగా సాగుతోంది. ఏకగ్రీవమవుతున్న గ్రామాల్లో ముందు నామినేషన్లు వేసే వారిని, వేసిన వారిని నయానో, భయానో దారికి తెచ్చుకుంటున్నారు. దీనికి నామినేషన్ వేసిన అభ్యర్థులకు చాలా ఖర్చు చేస్తున్నారు. ఇక ఊరికి ఏం చేస్తారో? ఆ పనికి అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఎంతలేదన్నా.. ఓ మోస్తరు గ్రామ పంచాయతీల్లో రూ.30లక్షల నుంచి రూ.50 లక్షల వరకు భరించాల్సిన పరిస్థితి. ఇంత నగదు కోసం అభ్యర్థులు అప్పులబాట పడుతున్నారు. తాము సంపాదించుకున్న ఆస్తులు, ఇంట్లో ఆడవాళ్ల నగలు తీసుకుని తాకట్టుపెట్టి మరీ నగదు తెస్తున్నారు. వీటిని తమను నమ్మేలా నామినేషన్ వేసిన వారికి, ఊర్లో పెద్ద మనుషులకు సమర్పిస్తేనే విత్డ్రాయల్స్ సజావుగా సాగుతున్నాయి.జిల్లా పంచాయతీలు అభ్యర్థులు కరీంనగర్ 89 388 జగిత్యాల 118 461 పెద్దపల్లి 95 376 రాజన్నసిరిసిల్ల 76 295 -
రగుడు జంక్షన్ పనులు ప్రారంభం
సిరిసిల్ల: రగుడు కలెక్టరేట్ జంక్షన్ వద్ద అభివృద్ధి పనులను శుక్రవారం ప్రారంభించారు. రూ.3.50 కోట్లతో చేపట్టిన కూడలి పనులు పెండింగ్లో ఉన్నాయని, ప్రమాదకరంగా మారిందంటూ ‘సాక్షి’లో ‘డేంజర్ జంక్షన్స్’ శీర్షికన నవంబరు 27న ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. కాంట్రాక్టర్ను పిలిచి పనులను ప్రారంభించారు. మున్సిపల్ డీఈఈ వాణి, వర్క్ఇన్స్పెక్టర్ అంజాగౌడ్ పనులను పర్యవేక్షించారు. రడుగు వైపు, కలెక్టరేట్ ఎదుట రెండు వేర్వేరుగా బస్ షెల్టర్లను రూ.12.50 లక్షలతో నిర్మించనున్నారు. ఇప్పటికే రిటర్నింగ్ వాల్ పూర్తి చేశారు. -
తుది అంకానికి పల్లె పోరు
మూడో విడత నామినేషన్లు మండలం సర్పంచ్ నామినేషన్లు వార్డు నామినేషన్లు స్థానాలు స్థానాలు ఎల్లారెడ్డిపేట 26 204 226 571 వీర్నపల్లి 17 98 132 219 ముస్తాబాద్ 22 – 202 – గంభీరావుపేట 22 161 202 582సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 9 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా.. మరిన్ని ఏకగ్రీమయ్యే అవకాశం ఉంది. అనేక గ్రామాల్లో సర్పంచ్ స్థానానికి బహుముఖ పోటీ నెలకొంది. తొలి విడత ఎన్నికలు 11వ తేదీన జరుగుతుండగా.. ఇప్పటికే అభ్యర్థులకు కేటాయించిన గుర్తులతో పోటాపోటీగా ప్రచా రం చేస్తున్నారు. చందుర్తి, వేములవాడరూరల్, కోనరావుపేట, రుద్రంగి, వేములవాడ మండలాల్లో మైకుల మోతలు మోగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు బుజ్జగింపులు బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో రెండో విడత ఎన్నికలు ఈనెల 14న జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు శనివారం వరకు ఉండడంతో పోటీలో ఉన్న రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకునేలా బుజ్జగిస్తున్నారు. మరోవైప రాయ‘భేరాలు’ సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో ఫోన్లు చేయిస్తూ ప్రధాన అభ్యర్థులను తప్పించే పనిలో పడ్డారు. మూడో విడత ముమ్మరంగా నామినేషన్లు మూడో విడత ఎన్నికలు ఈనెల 17న జరగనుండగా.. నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లో సాయంత్రం 5 గంటల లోపు క్లస్టర్ ఆఫీస్లకు చేరిన వారికి టోకెన్లు ఇచ్చారు. రాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. మొదటి విడత నామినేషన్ల పర్వంలో దొర్లిన అపశ్రుతితో నామినేషన్ల దాఖలు ఫొటోలను మీడియాకు అనుమతించ లేదు. అభ్యర్థితోపాటు ఇద్దరిని మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు అనుమతించారు. ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్/గంభీరావుపేట: మూడో విడత ఎన్నికలు జరిగే ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో చివరి రోజు శుక్రవారం నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. ముస్తాబాద్, నామాపూర్, పోతుగల్, గూడెం, బందనకల్, చీకోడు క్లస్టర్లలో సాయంత్రం దాటినా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు క్యూలో ఉన్నారు. గంభీరావుపేట మండలంలోని 9 నామినేషన్ కేంద్రాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసే అభ్యర్థుల సందడి నెలకొంది. ఎల్లారెడ్డిపేట మండలంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా అభ్యర్థులు క్యూలో ఉన్నారు. మండలంలోని రాచర్ల తిమ్మాపూర్లో అభ్యర్థులు రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్లు దాఖలు చేశారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ సత్యేంద్రనాథ్ సిరిసిల్ల: డయాబెటీస్, రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆన్లైన్ డేటాతో ఆధార్ను లింకుచేయాలని ఎన్సీడీ స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ సత్యేంద్రనాథ్ కోరారు. కలెక్టరేట్లోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో ఎన్సీడీ స్టాప్ నర్సులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్హెచ్పీ)లకు శుక్రవారం అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి రజిత, ప్రోగ్రాం ఆఫీసర్లు వైద్యులు రామకృష్ణ, సంపత్కుమార్, అనిత, నయీమాజహా, డీడీఎం కార్తీక్ పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం
బోయినపల్లి(చొప్పదండి): రాష్ట్రంలో రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మండలంలోని వరదవెల్లి దత్తాత్రేయస్వామి ఆలయంలో కొనసాగుతున్న దత్త జయంతి ఉత్సవాల్లో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి పూజలు చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దత్త జయంతి నాడే కాకుండా శాశ్వతంగా బోటు ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ఫైల్ ఇరిగేషన్ శాఖ వద్ద పెండింగ్లో ఉందన్నారు. డీసీఎమ్మెస్ డైరెక్టర్ ఎం.సురేందర్రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడి పూజలు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ దత్తాత్రేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ టౌన్, రూరల్ ఎస్సైలు ఎల్లాగౌడ్, రామ్మోహన్ తదితరులు పూజలు చేశారు. -
నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి
● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, ముస్తాబాద్లోని రైతువేదికల్లో శుక్రవారం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ సరఫరా, నీటి వసతి కల్పించాలని, ఎంపీడీవోలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి వసతులు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. మండల ప్రత్యేకాధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవోలు సత్తయ్య, లచ్చాలు, ఎంపీవో వాహిద్ పాల్గొన్నారు. బోయినపల్లి(చొప్పదండి): ఆర్వో, పీవోలు పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని జెడ్పీ సీఈవో వినోద్ సూచించారు. కొదురుపాక రైతువేదికలో శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతేముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. ముస్తాబాద్ మేజర్ పంచాయతీ, ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్లోని నామినేషన్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. జిల్లా సరిహద్దులోని వెంకట్రావుపల్లి, పెద్దమ్మస్టేజీ వద్ద చెక్పోస్టులను పరిశీలించి మాట్లాడారు. జిల్లా సరిహద్దుల్లోని చెక్పోస్ట్ల వద్ద 24 గంటలు తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. ఎవరూ నిబంధనలు అతిక్రమించొద్దని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో బందోబస్తును పెంచినట్లు తెలిపారు. జిల్లాలోని 20 కేసుల్లో 209 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని, 158 కేసుల్లో 657 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. సీఐలు మొగిలి, శ్రీనివాస్గౌడ్, ఎస్సైలు గణేశ్, రాహుల్రెడ్డి, అనిల్కుమార్ ఉన్నారు. -
మాజీ సీఎం రోశయ్యకు ఘనంగా నివాళి
● పూలమాల వేసి నివాళి అర్పించిన ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వర్ధంతిని కలెక్టరేట్లో జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి అజ్మీరా రాందాస్, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, పరిశ్రమలశాఖ జీఎం హన్మంతు, డీటీసీపీవో అన్సార్ అలీ, డీఏవో అఫ్జల్బేగం, డీఎంహెచ్వో రజిత, మైనార్టీ సంక్షేమాధికారి భారతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి, మత్య్సశాఖ అధికారి సౌజన్య, పౌరసరఫరాలశాఖ మేనేజర్ రజిత తదితరులు పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలి నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏకగ్రీవ స్థానాల్లో ఉపసర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులపై ఎన్నికల కమిషనర్ సమీక్షించారు. టీ–పోల్లో పెండింగ్ లేకుండా నమోదు చేయాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ నగదు, మద్యం, ఆభరణాలను ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలించే పక్షంలో నిబంధనల ప్రకారం సీజ్ చేయాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫోద్దీన్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించని ఆస్పత్రులను సీజ్ చేస్తాం
● జిల్లా వైద్యాధికారి రజిత సిరిసిల్ల: జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, లేకుంటే ఆస్పత్రి రిజిస్ట్రేషన్ రద్దు చేసి సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి రజిత హెచ్చరించారు. సిరిసిల్లలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను గురువారం తనిఖీ చేశారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ ప్రతీ ఆస్పత్రి రిసెప్షన్ కౌంటర్ వద్ద ధరల పట్టిక వివరాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, వైద్యుల వివరాలు ప్రదర్శించాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సమర్థంగా నిర్వహించాలన్నారు. డాక్టర్ రామకృష్ణ, మహేశ్గౌడ్ పాల్గొన్నారు. -
● ఆలయ పరిసరాల్లోకి వాహనాలకు నో ఎంట్రీ ● భక్తుల కోసమే రోడ్లు కేటాయింపు
భక్తుల తిప్పలు తప్పేలా..వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు ఊ పందుకోవడంతో ప్రధాన ఆలయంలో దర్శనాలు తాత్కాళికంగా నిలిపివేశారు. భీమన్నగుడిలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ పెరుగుతుండడం.. సమ్మక్క భక్తుల రాక మొదలు కావడంతో ఆలయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా వసతుల కల్పనపై దృష్టి సారించారు. భీమన్నగుడి చుట్టూ ప్రాంతాలను ఫ్రీ జోన్గా ఏర్పాటు చేశారు. భీమన్నగుడి మార్గంలో భక్తులు నడిచే ప్రాంతంలో వాహనాలను అనుమతించడం లేదు. అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే భక్తులకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యం కోసమే.. వేములవాడకు వచ్చే భక్తులు ఆలయ అభివృద్ధి పనులతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో భీమన్నగుడి చుట్టూ ప్రాంతాలను ఫ్రీజోన్గా ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల వాహనాలు భీమన్నగుడి ఏరియాలోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. భీమన్నగుడి ఏరియాలోకి భక్తులు కాలినడకనే వచ్చి, తిరిగి వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలకు అనుమతించకపోవడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు ఉత్పన్నం కావు. దీంతో భక్తులు ప్రశాంతంగా వచ్చి మొక్కులు చెల్లించుకునే అవకాశం చిక్కుతుంది.ఇది వేములవాడలోని అంబేడ్కర్చౌరస్తా నుంచి పార్వతీపురం వెళ్లే ప్రధాన రోడ్డు. గుడి విస్తరణ పనుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో కల్యాణకట్టను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇటు ఆటోలు, కార్లు వెళ్లకుండా రోడ్డుపై తాత్కాళికంగా పిల్లర్లను బిగించారు. దీంతో ఈ ప్రాంతం ఫ్రీజోన్గా మారింది. భక్తులు కాలినడకన భీమన్న గుడికి చేరుకునే అవకాశం మెరుగుపడింది. -
రెండో రోజు నామినేషన్ల జోరు
నామినేషన్ వేసేందుకు వెళ్తున్న నర్సయ్యమద్దతుదారులతో కనకరాజుఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్/వీర్నపల్లి(సిరిసిల్ల): జిల్లాలోని రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో రెండో రోజు గురువారం నామినేషన్లు జోరుగా పడ్డాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని 26 గ్రామపంచాయతీలకు 47 మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానాలకు 191 నామినేషన్లు దాఖలైనట్లు మండల అసిస్టెంట్ ఎన్నికల అధికారి సత్తయ్య తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని సర్పంచ్ స్థానాలకు 43, వార్డు సభ్యుల స్థానాలకు 178 నామినేషను్ల్ దాఖలు చేశారని ఎంపీడీవో లచ్చాలు తెలిపారు. రెండు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 87, వార్డు సభ్యుల స్థానాలకు 278 నామినేషన్లు వచ్చాయని వివరించారు. వీర్నపల్లి మండలంలోని 17 గ్రామపంచాయతీలకు 44 సర్పంచ్ నామినేషన్లు, వార్డ్ సభ్యులకు 51 నామినేషన్లు వచ్చాయని ఎంపీడీవో శ్రీలత తెలిపారు. ఆస్పత్రి నుంచి నామినేషన్ కేంద్రానికి.. బీపీతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ బలపరచిన ఎల్లారెడ్డిపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అంతర్పుల కనకరాజు.. చికిత్స అనంతరం నేరుగా నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. రెండు రోజులపాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందిన కనకరాజు పార్టీ నాయకులు, తన అనునాయులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. -
పరీక్షల శాఖ ఖాళీ !
● ఒకరు రిటైర్డ్.. మరొకర సస్పెన్షన్ ● ఖాళీగా డీసీఈబీ, ఏసీజీఈ పోస్టులు సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలో పరీక్షల నిర్వహణశాఖ లో ప్రధాన పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. నిర్ణయాధికారం తీసుకునే స్థాయి పోస్టులు ఖాళీగా ఉండడంతో జిల్లాలో పలు పరీక్షల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. డీసీఈబీ కార్యదర్శి శ్రీనివాస్ రిటైర్డ్ కాగా.. ఇటీవల ఏసీజీఈగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు ఎన్నికల విధుల్లో నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. దీంతో విద్యాశాఖలో కీలకమైన పరీక్షబోర్డులోని కీలకమైన డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ, అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. దీని ప్రభావం పలు పరీక్షల నిర్వహణపై పడనుందని ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. ఎవరూ లేని పరీక్షల విభాగం ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపులు, ప్రీ–ఫైనల్ ప్రశ్నాపత్రాల ముద్రణ, ఎస్ఏ పరీక్ష పేపర్ల సంసిద్ధత, ఈ ఆదివారం నవోదయ పరీక్ష నిర్వహణపై ఆందోళన నెలకొంది. ఆశావహుల పోటీ రెండు పోస్టుల ఖాళీల నేపథ్యంలో పలువురు ప్రధానోపాధ్యాయులు పరీక్షల విభాగంలో బాధ్యతలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరీక్షల విభాగ నియంత్రణ సహాయాధికారి పోస్ట్ కోసం బొల్గం శ్రీనివాస్(విలాసాగర్ హెచ్ఎం), మనోహర్రెడ్డి(గోరంటాల హెచ్ఎం), మోతీలాల్(శివనగర్ హెచ్ఎం) ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పరీక్షల విభాగంలోని రెండు ప్రధాన పోస్టుల్లో ఏదో ఒకదాని బాధ్యతలు తీసుకునేందుకు నారాయణపూర్ హెచ్ఎం ఆకునూరి చంద్రశేఖర్ ఉత్సాహంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకటి భర్తీ చేస్తే మరొకటి ఖాళీ డీఈవో పోస్టును రెగ్యులరైజ్ చేసేందుకు చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. డీఈవోగా అదనపు బాధ్యతలతో ఉన్న జెడ్పీ సీఈవో వినోద్ ఇప్పుడిప్పుడే విద్యాశాఖపై పట్టు సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. విద్యాశాఖను అర్థం చేసుకునేలోపే ప్రధానమైన రెండు పోస్టులు ఖాళీ కావడం పరీక్షల విభాగంలో గందరగోళాన్ని సృష్టించింది. ఈ ఖాళీలను ఎలా భర్తీ చేస్తారోననే చర్చ సాగుతోంది.


