breaking news
Rajanna Sircilla District News
-
ఇక విత్తనోత్పత్తి బాటలో..
వేములవాడరూరల్: రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంతోపాటు పండించిన ధాన్యం కొంటున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లు ఇక విత్తనోత్పత్తిని చేపట్టనున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 సొసైటీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ప్రణాళిక రూపొందించి నాబార్డు సహకారంతో విత్తనాలను తయారు చేసి సొసైటీల ద్వారా రైతులకు చేరవేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈనెల 20న కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక సమావేశమయ్యారు. మొదటగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 12 సొసైటీల్లో విత్తనోత్పత్తి చేయాలని నిర్ణయించారు. 12 సొసైటీల్లో పైలట్ ప్రాజెక్టుగా.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఒక్కో జిల్లా నుంచి మూడే సొసైటీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. రాజన్నసిరిసిల్లలో వేములవాడ, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కరీంనగర్ జిల్లాలో గట్టుదుద్దెనపల్లి, ఊటూరు, జమ్మికుంట, జగిత్యాల జిల్లాలో రాయికల్, జైన, బీర్పూర్, పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్, నందిమేడారం, ఎలిగేడు ప్రాథమిక సహకార కేంద్రాలను ఎంపిక చేశారు. పీఏసీఎస్ పరిధిలో 5 నుంచి 10 ఎకరాల వరకు నాణ్యమైన విత్తనోత్పత్తి చేయనున్నారు. విత్తనోత్పత్తిపై రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ద్వారా శాస్త్రవేత్తలు అవగాహన కల్పించనున్నారు. సీడ్ ఉత్పత్తి తర్వాత రైతుల నుంచి పీఏసీఎస్ కొనుగోలు చేసే సొంత బ్రాండ్తో రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాల సరఫరా ధాన్యం కొనుగోళ్లతో తోడ్పాటు రైతుల అభివృద్ధిలో సహకార సంఘాలు ఉమ్మడి జిల్లాలో 12 సొసైటీలు ఎంపిక -
పీఎంజే కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్ట్
కరీంనగర్క్రైం: పీఎంజే జ్యువెలరీ షోరూంలో జరిగిన దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 8కి చేరింది. ఈ నెల 17న కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురు నిందితులు సుబోధ్సింగ్, రఘునాథ్, రావిష్, అమర్సింగ్, జైనుల్లాబ్దీన్ కస్టడీ రేపటితో ముగియనుంది. కస్టడీ విచారణలో భాగంగా నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం మేరకు నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ బైక్ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షోరూంలో దోపిడీకి పాల్పడిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా, తాజాగా మూడో వ్యక్తి సూర్యమణి అలియాస్ సనోజ్ కుమార్ను కరీంనగర్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామడుగు మండల శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గల తాత్కాలిక నిర్మాణ షెడ్ల సమీపంలో కీలక ఆధారాలు సేకరించారు. నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన 5 జతల దుస్తులు, 3 జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్సీ కార్డులు, మొబైల్ ఫోన్, అక్కడే దాచి ఉంచిన పిస్టల్, మ్యాగజైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నిందితుడు ఎండీ ఆదిల్ఖాన్ను బిహార్ రాష్ట్రం పాట్నాలోని పుల్వారి షరీఫ్ వద్ద కరీంనగర్ ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. ఇతడిని తెలంగాణకు తరలించేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన క్రెటాకార్ డ్రైవర్ జైనులబ్దీన్కు ఆదిల్ఖానే కారు, నిందితులకు తుపాకులను సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. మహమ్మద్ మెహతాబ్ఖాన్ నిందితులకు సిమ్ కార్డులు అందించినందుకు అరెస్టయి జైలులో ఉన్నాడు. ఈ నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకోలేదు. ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు సృజన్రెడ్డి, రమేశ్, శ్రీనివాస్, తిరుమల్, ప్రకాష్, ఎస్సై శేఖర్ సిబ్బందిని సీపీ అభినందించారు. -
బైక్ దొంగ పట్టివేత
● వాహనం స్వాధీనం పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని తమ్మిశెట్టి రవీందర్కు చెందిన బైక్ను ఈనెల 19న అపహరించిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మర్తిడి గ్రామానికి చెందిన బోర్తుడి సంజీవ్ వాహన దొంగతనాలు చేస్తూ గతంలోనూ బెజ్జూరు, కాగజ్నగర్, సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో చోరీచేసి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లొచ్చాడు. పెద్దపల్లికి చెందిన రవీందర్ ఇంటి ఎదుట నిలిపి ఉంచిన బైక్ను సైతం అపహరించాడు. మంగళవారం శాంతినగర్ శివారు రైల్వే ఓవర్బ్రిడ్జి వద్ద వాహనతనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా అప్రమత్తమై అదుపులోకి తీసుకుని విచారించడంతో దొంగతనం విషయం తెలుసుకుంది. నేరాన్ని అంగీకరించడంతో బైక్ను స్వాధీనం చేసుకుని, సంజీవ్ను అరెస్ట్ చేసినట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. భూపాల్పల్లి డీటీవో వెంకన్న మృతికి నివాళి జగిత్యాలక్రైం: జిల్లాలో 27నెలలు ఎంవీఐగా పనిచేసి.. పదోన్నతిపై భూపాల్పల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా వెళ్లిన వెంకన్న సోమవారం ఉదయం టిప్పర్ ఢీకొని మృతిచెందడంతో స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన వెంకన్న 2003లో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్గా ఉద్యోగం పొందారు. కేటీపీఎస్లో బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ఏడీఏగా పదోన్నతి పొందారు. ఏపీపీఎస్సీలో పరీక్ష రాసి రవాణా శాఖలో ఎంవీఐగా ఉద్యోగం పొందారు. 15 రోజుల క్రితమే భూపాల్పల్లి డీటీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మృతిపై జిల్లా రవాణా శాఖ అధికారి మహ్మద్ సందాని, ఎంవీఐ రామారావు, అసిస్టెంట్ ఎంవీఐలు సాయిచరణ్, రియాజ్లు సంతాపం వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు: ముగ్గురికి గాయాలుమల్యాల: మండలంలోని ముత్యంపేట శివారు.. జగిత్యాల–కరీంనగర్ రహదారిపై సోమవారం వేకువజామున ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ముగ్గురు గాయపడ్డారు. కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారు కొండగట్టు సమీపంలో అదుపు తప్పి, విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో కోరుట్లకు చెందిన నాగరాజు, అనిల్, మహమ్మద్ గాయపడ్డారు. బాధితులను 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు ట్రాక్టర్ ఢీ.. ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాచర్ల గొల్లపల్లి శివారులో సోమవారం రాత్రి కారు ట్రాక్టర్ ఢీకొంది. వివరాల్లోకి వెళ్తే.. రాచర్ల గొల్లపల్లి శివారు జక్కుల చెరువు నుంచి మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ మెయిన్ రోడ్డు పైకి వస్తున్న క్రమంలో కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాగ్పూర్ టు అల్గునూర్
● గంజాయి తరలిస్తూ పట్టుబడిన ముగ్గురు యువకులు తిమ్మాపూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్లో గంజాయి కొనుగోలు చేసి తిమ్మాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో యువకులకు అమ్ముతున్న అల్గునూర్కు చెందిన అందె అజయ్, సిల్ల పరశురామ్, ముసాపురి అరవింద్ను ఎల్ఎండీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై అన్వర్ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం ముగ్గురు యువకులు గంజాయితో బైక్పై అల్గునూర్వైపు వెళ్తున్నారని ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మధ్యాహ్నం సమయంలో వారిని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. అల్గూనూర్ చౌరస్తాలో గంజాయితో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు ప్రశ్నించారు. వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఛేజ్ పట్టుకున్న పోలీసులు.. వారిని తనిఖీ చేయగా, పాలిథిన్ కవర్లో 235 గ్రాముల గంజాయి లభ్యమైంది. దీంతో వారిని అదుపులోకి తీసున్నారు. యువకుల నుంచి బైక్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు ఎస్సై అన్వర్ తెలిపారు. -
వడదెబ్బతో రైతు మృతి
చిగురుమామిడి: మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన రైతు కుందేళ్ళ వెంకటయ్య (48) వడదెబ్బతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. వెంకటయ్య ఆదివారం తన పొలంలో పనులు చేస్తుండగా ఎండ వేడి తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే వెంకటయ్య ఆదివారం మృతిచెందినట్లు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గౌరయ్య తెలిపారు. సోమవారం మృతుడి కొడుకు మల్లికార్జున్ ఫిర్యాదు మేరకు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించినట్లు వివరించారు. కరీంనగర్క్రైం: కరీంనగర్ నగరంలో ఓ వృద్ధురాలు బావిలో పడి మృతిచెందింది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. శర్మనగర్కు చెందిన నలుమాచు సుగుణమ్మ (80) వయసు మీద పడడంతో కళ్లు, చెవులు సరిగా పనిచేయడం లేదు. సోమవారం వేకువజామున ఇంట్లో వాళ్లు నిద్రలేచి చూసేసరికి సుగుణమ్మ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఇంట్లోని బావిలో చూసేసరికి కనిపించింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమారుడు రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పుల బాధ తో వ్యక్తి ఆత్మహత్య ముస్తాబాద్(సిరిసిల్ల): అప్పుల బాధలు తాళలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై జ్యోతి తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన బాలసాని బాలరాజు(40) ఆదివా రం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగేళ్ల క్రితం బాలరాజు భార్య క్యాన్సర్ వ్యాధికి గురై మృతిచెందింది. ఆమె చికిత్స కోసం బాలరాజు రూ.10లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీరే మార్గం లేక మనోవేదనకు గురైన బాలరాజు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వీరి కుమారుడు, కూతురు అనాథలుగా మిగిలారు. నాలుగేళ్ల క్రితం తల్లి, ఇప్పుడు తండ్రి మృతిచెందడంతో చిన్నారులు దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం, మానవతవాదులు చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతుని బంధువు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జ్యోతి తెలిపారు. -
ప్రయాణికులను కాపాడిన డ్రైవర్కు సన్మానం
కరీంనగర్టౌన్: కరీంనగర్–2 డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు ఆదివారం నగర శివారులోని అల్గునూరులో దగ్ధమైన విషయం తెలిసిందే. కాగా అగ్నిప్రమాద సమయంలో బస్సులోని 39 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి వారి ప్రాణాలను కాపాడిన డ్రై వర్ బోయిని ప్రశాంత్ను సోమవారం జేబీఎం, చక్రా ఈ –ట్రాన్స్ యాజమాన్యాలు సన్మానించాయి. డ్రైవర్ సమయస్ఫూర్తి, ధైర్యం, బాధ్యతాయుతమైన చర్యల ద్వారా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడటమే కాకుండా, టీజీఎస్ఆర్టీసీ ప్రతిష్టను నిలబెట్టినందుకు గుర్తింపుగా ప్రాంతీయ రీజినల్ మేనేజర్ రాజు చేతుల మీదుగా ప్రత్యేక షీల్డ్, ప్రశంసాపత్రం, రూ.5వేల నగదు బహుమతిని అందజేశారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్ భూపతిరె డ్డి, డిప్యూటీ ఆర్ఎం మల్లేశం, 2 డిపో మేనేజర్ శ్రీనివా స్, జేబీఎం ఆపరేషన్స్ మేనేజర్ అభిచరణ్, చక్రా ఈ –ట్రాన్స్ ఆపరేషన్స్ మేనేజర్ ఖాన్, అన్వర్, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. -
సొసైటీ బ్రాండ్తోనే..
ఇప్పటి వరకు సొసైటీల ద్వారా ఎరువులు, రుణాలు, ధాన్యం కొనుగోళ్లు మాత్రమే చేపట్టాం. ఇక నుంచి విత్తనోత్పత్తి చేసి ఆ విత్తనాలను రైతులకు సొసైటీ బ్రాండ్తో ఇవ్వనున్నాం. ఇలా ఇవ్వడం ద్వారా నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి పొందవచ్చు. – జిల్లా రైతు విజ్ఞాన కోఆర్డినేటర్ డా.ఆర్.సాయికుమార్ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తుంది. సొసైటీ ద్వారానే విత్తనోత్పత్తి చేపట్టి సొసైటీ బ్రాండ్పై రైతులకు అందిస్తాం. పైలట్ ప్రాజెక్టు కింద వేములవాడ సొసైటీని ఎంపిక చేశారు. మా సొసైటీకి విత్తనోత్పత్తి చేసేందుకు సొంత స్థలాలు కూడా ఉన్నాయి. – ఏనుగు తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, వేములవాడ -
బెల్టుషాపుల బంద్కు జీపీ తీర్మానం
జమ్మికుంట: మద్యం అమ్మకాల కట్టడికి మండలంలోని మడిపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్నంగా ఆలోచన చేసింది. సోమవారం సర్పంచ్ పసుల తిరుమల అధ్యక్షతన పాలకవర్గం సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా గ్రామంలో బెల్ట్షాపుల నిర్వహణ బంద్ చేయాలని తీర్మానం చేశారు. జీపీ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం విక్రయాలు జరిపితే రూ.10వేలు జరిమానా విధించడం జరుగుతుందని, మద్యం విక్రయాలకు సంబంధించి సమాచారం అందించిన వారికి రూ.2వేల బహుమతి అందజేస్తామని పాలకవర్గం తీర్మానం చేసింది. కార్యదర్శి అంజిరెడ్డి, ఉప సర్పంచ్ కస్తూరి శ్రీనాథ్, వార్డు సభ్యులు సురేశ్, సాయిరాం, హసీనా, శ్రీనివాస్, కళ్యాణి, శేషివాదన, ఆంజనేయులు, చెన్నబోయిన చంద్రమౌళి, రాణి తదితరులు పాల్గొన్నారు. కాగా బెల్ట్షాపుల బంద్పై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసున్నారు. -
ఆవునూర్లో అపురూప పురాతన విగ్రహాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని ఆవునూర్లో ప్రాచీన శివాలయం పరిసరాల్లో వందల ఏళ్ల నాటి శిల్పాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు కరిపే రాజ్కుమార్ తెలిపారు. సోమవారం గ్రామాన్ని సందర్శించారు. ఆవునూర్కు ప్రాచీన చరిత్ర ఉందని, చెరువుకట్ట సమీపంలోని శివాలయ ప్రాంగణంలో చాముండేశ్వరీ విగ్రహం ఉందని, ఇది 14వ శతాబ్దానికి చెందిందని తెలిపారు. పూర్వహస్తాల్లో త్రిశూలం, ఢమరుకం, పరహస్తాల్లో కత్తి, రక్తపాత్రలతో సుఖాసీనస్థితిలో విగ్రహం ఉందని, కరండ మకుటాన్ని ధరించి ఉందని పేర్కొన్నారు. 15వ శతాబ్దానికి చెందిన కాలభైరవుడు జ్వాలాకేశాలతో పూర్వహస్తాల్లో త్రిశూలం, ఢమరుకం కలిగి ఉన్నాడని, పరహస్తాల్లో ఖడ్గం, ఖండిత శిరస్సును కలిగి ఉన్నాడని, నగ్నమొలతో, నడుముకు కపాల మేఖలను ధరించి ఉన్నాడని తెలిపారు. ఖండిత శిరస్సు రక్తపు చుక్కల కోసం కుక్కపైకి దుముకుతున్న దృశ్యాలను శిల్పులు కళ్లకు కట్టినట్లు వివరించారన్నారు. గుడి ప్రాంగణంలో చాళుక్యశైలి పోలిన నంది 12వ శతాబ్దానికి చెందిందన్నారు. సంతానం కోసం ఆరాధించే నాగశిల కూడా ప్రాచీనమైందని తెలిపారు. అమూల్యమైన ప్రాచీనశిల్ప సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చాముండేశ్వరీ విగ్రహం కాలభైరవుడి విగ్రహం చరిత్ర పరిశోధకుడు రాజ్కుమార్ -
దశాబ్దం తర్వాత బడికి ఊపిరి
చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న ఎంఈవో తదితరులు పాఠశాలను ప్రారంభిస్తున్న ఎంఈవో కనకతార, సర్పంచ్, ఉపాధ్యాయులు మెట్పల్లిరూరల్: దశాబ్దాల తరబడి పిల్లలకు అక్షరాలు నేర్పి.. వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన పాఠశాల మూతబడడంతో ఆ గ్రామ సర్పంచ్ దంపతులు చలించిపోయారు. మూతబడిన ఆ పాఠశాలను ఎలాగైనా తెరిపించాలని కంకణం కట్టుకున్నారు. ముందుగా తమ ఇద్దరు పిల్లలను పాఠఽశాలలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఇంటింటికీ వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం చేశారు. ఇందుకు అంగీకరించిన తల్లిదండ్రులు పాఠశాలను తెరిపించాలని కోరారు. విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో చర్యలు చేపట్టిన అధికారులు మూతబడిన పాఠశాలను తెరిపించారు. మెట్పల్లి మండలం కేసీఆర్తండాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో పదేళ్ల కిందట మూతబడింది. అప్పటి నుంచి ఆ పాఠశాలను తిరిగి తెరిపించాలని ఎవరూ దృష్టి సారించలేదు. ఇటీవల సర్పంచ్గా ఎన్నికై న మంజుల, గణేశ్ దంపతులు పాఠశాలకు పూర్వవైభవం తేవాలని వారి పిల్లలను పాఠశాలలో చేర్పిస్తున్నామని ఊరంతా తెలిపారు. దీంతో మిగతా వారు కూడా తమ పిల్లలను చేర్పిస్తామని చెప్పడంతో విద్యాశాఖ అధికారులు పాఠశాలను పునఃప్రారంభించారు. మెట్పల్లి ఎంఈవో కనకతార సోమవారం పాఠశాలను ప్రారంభించి విద్యార్థులతో సాముహిక అక్షరాభ్యాసం చేయించారు. పుస్తకాలు, నోట్బుక్కులు ఇతర సామగ్రి అందించారు. మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 25 ఉండగా.. ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ మదన్లాల్, విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్థులు పాల్గొన్నారు. పదేళ్ల తర్వాత తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాల సర్పంచ్ తన పిల్లలను చేర్పించడంతో పూర్వవైభవం 25మందికి చేరిన విద్యార్థుల సంఖ్య -
ఒద్యారం స్కూల్కు జాతీయ పురస్కారం
కరీంనగర్టౌన్: జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఉమ్మడి జిల్లా నుంచి నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయి. కరీంనగర్ జిల్లా నుంచి ఒద్యారం ప్రభుత్వ హైస్కూల్, పెద్దపల్లి జిల్లా నుంచి ఎల్కపల్లి పాఠశాల, జగిత్యాల జిల్లా నుంచి బీర్పూర్ పాఠశాల, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నెహ్రూనగర్ హైస్కూల్ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వి.నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీజేశారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్(ఎస్హెచ్వీఆర్)ను రెండేళ్లుగా ప్రకటిస్తుంది. పాఠశాల ఆవరణ, పరిశుభ్రతతో పాటు స్వచ్ఛమైన నీరు, పచ్చదనం తదితర అంశాలను పరిశీలించి గ్రేడ్ నిర్ణయిస్తారు. కరీంనగర్ జిల్లాలోని ఒద్యారం పాఠశాలలో 300 రకాల చెట్లను విద్యార్థులు సంరక్షిస్తూ, ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తూ, సేంద్రియ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇందుకు గానూ రాష్ట్ర స్థాయిలో ఎంపికై న 10 పాఠశాలల్లో ఉమ్మడి జిల్లాలో నాలుగు స్కూళ్లు ఎంపికవగా, కరీంనగర్లో ఒద్యారం జడ్పీహెచ్ఎస్ను ఎంపిక చేశారు. మెరిట్ సర్టిఫికెట్తో పాటు రూ.1లక్ష ప్రోత్సాహక నిధి, పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక విద్యా అధ్యాయన పర్యటనకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రూ.14.56 కోట్లతో హాస్టళ్ల నిర్మాణం
కరీంనగర్సిటీ: హుస్నాబాద్లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల వసతి గృహాల సౌకర్యాల కల్పనకు కీలక అడుగు పడింది. శాతవాహన విశ్వవిద్యాలయం 86వ కార్యనిర్వాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇంజినీరింగ్ కళాశాలలో బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణ పనులు అధికారికంగా మొదలుకానున్నాయని సోమవారం వీసీ ఉమేశ్కుమార్ తెలిపారు. రూ.14.56 కోట్ల అంచనాతో రెండు హాస్టళ్ల నిర్మాణ బాధ్యతలను తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించారని పేర్కొన్నారు. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నం.132/1లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో వసతి గృహాలను నిర్మించనున్నారు. పనులు వేగవంతంగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను వీసీ ఆదేశించారు. నిర్మాణాలకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా విడుదల చేయనుందని, 2027 జూన్ 30 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హాస్టళ్ల నిర్మాణం పూర్తయితే హుస్నాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన వసతి, సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం మరింత సులభతరం కానుందని పేర్కొన్నారు. వసతి గృహ నిర్మాణాలకు నిధులు మంజూరు కావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్కు ధన్యవాదాలు తెలిపారు. -
పోలీస్ గ్రీవెన్స్ డేలో 23 ఫిర్యాదులు
సిరిసిల్ల: జిల్లా పోలీస్ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 23 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదేశాలతో అదనపు ఎస్పీ చంద్రయ్య గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల ఫిర్యాదులపై ఆయా ఠాణాల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాధితుల సమస్యలపై చట్టపరంగా ముందుకెళ్లాలని సూచించారు.సర్పంచ్ జీతం సర్కారు బడికిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లి సర్పంచ్ కొండ రమేశ్గౌడ్ తన ఐదు నెలల వేతనం రూ.32,500 ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం విరాళంగా ప్రకటించారు. తన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు తన వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలో పేతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. కాగా ప్రైవేట్ పాఠశాలల నుంచి నలుగురు విద్యార్థులు ప్రభుత్వ బడిలో చేరారు. విద్యార్థుల తల్లిదండ్రులను సర్పంచ్, ఉపాధ్యాయులు అభినందించారు. ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రారంభంవేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా 302 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు స్లాట్స్ బుక్ చేసుకున్న వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుక్ చేసుకున్న తేదీ నాడు, సమయానికి కాలేజీలో హాజరుకావాలని సూచించారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్(ఐఐఐడీ) హైదరాబాద్ రీజినల్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్థపత్య ఉత్సవ్ 2.0’ డిజైన్ అండ్ క్రాఫ్ట్లో సిరిసిల్ల తెలంగాణ గిరిజన సంక్షేమ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. చేరియల్ పెయింటింగ్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, పేపర్ క్రాఫ్ట్, వుడ్ క్రాఫ్ట్ వర్క్షాప్లలో విద్యార్థినులు పాల్గొన్నారు. అధ్యాపక బృందాన్ని అకాడమీ ప్రిన్సిపాల్ జయ, వైస్ ప్రిన్సిపాల్ రెహానా ఇఫ్ఫత్ అభినందించారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్సీ) డిప్యూటీ డీఎంహెచ్వో పవిత్ర సోమవారం సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో అమలవుతున్న మాతా శిశు సంక్షేమం, జాతీయ ఆరోగ్య, వ్యాధి నియంత్రణ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఆస్పత్రిలోని వివిధ రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేశారు. మెడికల్ అధికారి చంద్రికారెడ్డి పాల్గొన్నారు. సిరిసిల్ల: జిల్లాలో సోమవారం చిరు జల్లులు కురిశాయి. అత్యధికంగా బోయినపల్లిలో 25.8 మిల్లీమీటర్లు, తంగళ్లపల్లిలో 12.0, సిరిసిల్లలో 11.0, కోనరావుపేటలో 10.8, వేములవాడలో 3.8, వేములవాడ రూరల్లో 1.3, చందుర్తిలో 0.8, ఇల్లంతకుంటలో 0.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. -
మోదీని ప్రపంచం మెచ్చింది
● బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు గుజ్జల ప్రేమ్చందర్రెడ్డిసిరిసిల్లటౌన్: పుష్కరాకాలంగా దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదర్శ పాలనను చూసి ప్రపంచం గర్వించిందని బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ గు జ్జల ప్రేమ్చందర్రెడ్డి కొనియాడారు. మోదీ సుపరి పాలనకు 12 సంవత్సరాలు పూర్తి సందర్భంగా సి రిసిల్లలోని కే కన్వెన్షన్ హాలులో సోమవారం రాత్రి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన నిర్వహించిన మేధావుల సమావేశంలో మాట్లాడారు. గుజరాత్ సీఎంగా 13 ఏళ్లు, ప్రధానిగా 12 ఏళ్లు మొత్తంగా పాతికేళ్లపాటు ప్రజానేతగా వెలు గొందడం అసాధారణ విషయమన్నారు. దేశం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల యోజన, బేటీ బచావో–బేటీ పడావో వంటి పథకాల ద్వారా కోట్లాది మంది లబ్ధి పొందారన్నారు. కేంద్రం పథకాల లబ్ధిదారులను సన్మానించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతి, సిరికొండ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గరిపెల్లి ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారపు సంతోష్రెడ్డి, బర్కం లక్ష్మీనవీన్ యాదవ్, రాజాసింగ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, అయ్యప్ప ఆలయ చైర్మన్ రాచర్ల విద్యాసాగర్, టెక్స్టైల్ పార్క్ అధ్యక్షుడు అన్నల్దాసు అనిల్, ప్రైవేట్ విద్యాసంస్థల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సెన్సార్ బోర్డు సభ్యురాలు వేముల వైశాలి పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల
గరిష్టం/కనిష్టం34.0/26.0మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 20267తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని పాపయ్యపల్లి, రామన్నపల్లిల్లో నిర్మించే విద్యుత్ ఉపకేంద్రాల స్థలాలను జిల్లా ఎస్ఈ టి.వేణుమాధవ్ సోమవారం పరిశీలించారు. డివిజనల్ ఇంజినీర్ ఎన్.అంజయ్య, ఏడీఈ గోపీనాథ్ ఉన్నారు.జిల్లాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలులు వేగంగా వీస్తాయి.వేములవాడ: భీమన్నకు భక్తులు సోమవారం అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం అనుబంధ ఆలయాలను సందర్శించారు. -
విద్యార్థులు సృజనాత్మకతపై దృష్టి పెట్టాలి
● డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి ● సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారిసిరిసిల్ల: విద్యార్థులు సృజనాత్మకతపై దృష్టిసారించాలని, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా గడపాలని సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి కోరారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్లో సోమవారం తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించి అవగాహన సదస్సులో డీఎస్పీ పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్, గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగంతో వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా.. కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి డీఎస్పీ డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలో ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్లైన్ నంబర్ 87126 71111కు లేదా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై నాగరాజు, హెచ్ఎం శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆలకించండి.. ఆదుకోండి
● ప్రజావాణికి తరలివచ్చిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల అర్బన్: జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ బాట పట్టారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తమ అర్జీలు అందించి ఆదుకోండని వేడుకున్నారు. వివిధ సమస్యలపై 159 అర్జీలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో పెట్టవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. -
ధాన్యం స్కాం బట్టబయలు చేయాలి
సిరిసిల్లటౌన్: జిల్లాలో పెద్ద ఎత్తున సాగి ధాన్యం కొనుగోలు స్కాంలో అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మజీద్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండిస్తే కొందరు సిబ్బంది భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఈ ధాన్యం కుంభకోణంలో ఎంత పెద్ద వ్యక్తుల పాత్ర ఉన్నా వదిలిపెట్టొద్దని కోరారు. నాయకులు కదిరే భాస్కర్, సయ్యద్ జావిద్, ఒర్సు అశోక్, బైరి రాజే శ్, సయ్యద్ మౌలా, తోట కనకయ్య, అంతర్పుల బాబు, బండి శ్రీహరి, మండేపల్లి రవి పాల్గొన్నారు. -
రైతులకు పట్టాలు పంపిణీ చేయాలి
● ఆర్డీవో శ్రీధర్బాబుకు సర్పంచుల విన్నపం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గ్రామాలలో ఏళ్ల తరబడిగా రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్బాబును సర్పంచులు కోరారు. ఎల్లారెడ్డిపేట మండల పరిషత్లో సోమవారం మండలంలోని వివిధ గ్రామాలకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ప్రజాప్రతినిధులతో కలిసి ఆర్డీవో లబ్ధిదారులకు అందజేశారు. తిమ్మాపూర్ సర్పంచ్ అందె సుభాష్ మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా సాగుచేసుకుంటున్న వారికి సైతం పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆర్డీవో స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులను గుర్తించి భూములకు హక్కుపత్రాలు ఇస్తామన్నారు. తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, మండల సర్పంచ్ల ఫోరం కన్వీనర్ దొమ్మాటి నర్సయ్య పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో వెలుగుచూసిన వరి ధాన్యం కుంభకోణంపై విచారణ చేపట్టాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు మారవేణి రంజిత్కుమార్ కోరారు. ఈమేరకు మండల కేంద్రంలోని కిషన్దాస్పేట పోస్టాఫీస్ ద్వారా సోమవారం ఫిర్యాదు చేశారు. రంజిత్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఏళ్లుగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోరారు. ధాన్యం అక్రమాలపై విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ శాఖ, సివిల్ సప్లయీస్ సంయుక్తంగా ప్రత్యేక విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
వంతెన పూర్తి చేయండి
● అడవిపదిర గ్రామస్తుల ఆందోళనవీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని అడవిపదిరలో నిలిచిన వంతెన పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడవిపదిరకు రూ.2.36కోట్లు మంజూరు చేయగా.. పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. రెండేళ్లుగా పనులు ముందుకుసాగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోతే లాల్సింగ్తండా మీదుగా మూడు కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఉందన్నారు. ఎస్సై లక్ష్మణ్ గ్రామస్తులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. నాయకులు జాలపెల్లి మనోజ్ కుమార్, భాస్కర్, తిరుపతి, శంకర్, రవి, బాలకిషన్, రాజు, కార్తీక్, వినోద్, జాషువా, అజిత్ పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, ఆహార నాణ్యత పరిశీలించారు. కలెక్టర్ డైనింగ్హాల్లోకి వెళ్లగా విద్యార్థినులు భోజనం చేస్తుండడంతో వారి వద్దకు మెనూ గురించి ఆరా తీశారు. బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. హాస్టల్, విద్యాలయ ఆవరణ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. జనగణనలో జిల్లాకు మొదటి స్థానంజిల్లా జనగణన –2027 మొదటి దశలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ను జిల్లా అధికారుల ప్రతినిధులు సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జనగణన తొలి దశగృహ జాబితా, గృహాల లెక్కింపు 2026 మే 11న ప్రారంభమై జూన్ 9తో ముగిసింది. రాష్ట్రస్థాయిలో కచ్చితత్వ వివరాల నమోదు, ప్రక్రియను పూర్తి చేయడంతో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల(డోర్స్) అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అఫ్జల్ బేగం, సీపీవో శ్రీనివాసాచారి తదితరులు కలెక్టర్ను కలిశారు. కలెక్టర్ను కలిసిన జిల్లా వైద్యాధికారి అంజలా ఆల్ఫ్రెడ్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అంజలా ఆల్ఫ్రెడ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ను కలిశారు. జిల్లా వైద్యాధికారిగా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. -
పెద్దమ్మ–పెద్దిరాజు కల్యాణానికి రండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్లో ఈనెల 24న నిర్వహించే పెద్దమ్మ–పెద్దిరాజుల కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని కోరుతూ ఎమ్మెల్యే కేటీఆర్కు ఆదివారం నాయకులు ఆహ్వానపత్రిక అందజేశారు. కల్యాణ వేడుకలకు తప్పకుండా హాజరవుతానని కేటీఆర్ తెలిపారని మాజీ సర్పంచ్ కోల నరసయ్య, మాజీ ఎంపీటీసీ మామిండ్ల తిరుపతిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు. ముదిరాజ్ సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిసిరిసిల్ల: తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ సారధి ప్రొఫెసర్ జయశంకర్ 15వ వర్ధంతిని ఆదివారం జిల్లా కేంద్రంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ముందుగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాసం రత్నాకర్ పటేల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్న తెలంగాణ జాతిపితగా మనకు స్ఫూర్తినిస్తారని వివరించారు. కార్యక్రమంలో కనపర్తి జగదీశ్వర్, చౌటపల్లి రాజ్కుమార్, కోడం నరహరి, కొండ శేఖర్, అఖిల, సంధ్య పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషిముస్తాబాద్(సిరిసిల్ల): సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని నామాపూర్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య, వైద్యం, రహదారుల వంటి పనులను విరివిగా చేపట్టి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రైతులకు ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ, పెన్షన్, జీవిత బీమా, రైతు భరోసా వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, వైస్చైర్మన్ వెల్ముల రాంరెడ్డి, డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి, సర్పంచ్ అనిల్, ఉపసర్పంచ్ కొమురయ్య, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించండికోనరావుపేట(వేములవాడ): మండలంలోని నాగారం గ్రామంలో గల శ్రీకోదండరామస్వామి ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్రావును కోరారు. ప్రస్తుతం ఆలయ పరిస్థితులు, అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న హనుమాన్ విగ్రహానికి సంబంధించి వివరాలు వివరించారు. కాగా, ఆలయ అభివృద్ధికి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు విద్యాసాగర్రావు తెలిపారు. అనంతరం విద్యాసాగర్రావును ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. -
కనెక్షన్.. కలెక్షన్
వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి.. సమయానికి సిలిండర్ బుడ్డీ అందక ఎల్పీజీ వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటే.. ఆదివారం సెలవు రోజు గ్యాస్ కనెక్షన్ తనిఖీ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో యువకులు ఓ గ్యాస్ కంపెనీ పేరిట ‘మీ సిలిండర్ కనెక్షన్ను తనిఖీ చేయాలి’ అంటూ.. సిలిండర్ను పరిశీలించి రూ.240 చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేం అని వినియోగదారులు అడిగితే.. ఐదేళ్ల కోసారి మ్యాన్డేటర్ చెకప్ అంటూ.. డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఎల్పీజీ వినియోగదారులు పెరిగిన గ్యాస్ ధరలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. కనెక్షన్ తనిఖీల పేరిట కలెక్షన్ ఏంటని వినియోగదారులు ప్రశ్నించారు. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. ఆదివారం సెలవు దినం కావడంతో అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. ఏది ఏమైనా ‘సందింట్లో సడే మియా’ అన్నట్లుగా ఆర్థిక అవసరాలు అధికంగా ఉండే జూన్ నెలలో ఈ కొత్త వసూళ్లతో వినియోగదారులు అసహానికి గురవుతున్నారు. ఇది చట్టబద్ధమైన తనిఖీలా లేక కాసుల కోసం ఉత్తుత్తి తనిఖీలా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తేల్చాల్సి ఉంది. – సిరిసిల్ల -
అంతర్గత శక్తిని మేల్కొల్పే సాధనం
యోగాసనం వేస్తున్న ఎస్పీ మహేశ్ బి గితే పోలీస్ అధికారులు, సిబ్బంది యోగాసనాలు సిరిసిల్ల: అంతర్గత శక్తిని మేల్కొల్పి మానవ చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అమూల్య సాధనం యోగా అని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. ఆదివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించాలన్నారు. యోగాకు సమయం కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు కె.నాగేంద్రచా రి, జి.వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరా వు, మొగిలి, నటేశ్, మధుకర్, ఆర్ఐలు మధుకర్, సురేశ్, రమేశ్, ఎస్సైలు కిరణ్కుమార్, ఉపేందర్చారి, రంజిత్, ఆర్ఎస్సైలు రాజు, శ్రావణ్యాదవ్, శ్రీనివాస్, సాయికిరణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్రహిత జిల్లాగా మార్చుదాం జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చుదామని, అందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఎస్పీ మహేశ్ బి గితే కోరారు. తెలంగాణ ఈగల్ టీమ్ రూపొందించిన పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు, ప్రజలకు వారం రోజుల పాటు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ అధికారులకు అభినందనలు జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కే సుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ మహేశ్ బి గితే ఆదివారం అ భినందించారు. సైబర్ క్రైం కేసుల్లో బాధితులకు రూ.22.31 లక్షలకుపైగా రీఫండ్ అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, కోర్టు విచారణలో ఉన్న 265 కేసులు, 23 పెట్టి, 1,043 డ్రంకెన్ డ్రైవ్, 2,419 ట్రాఫిక్ చలాన్, 75 సైబర్ క్రైం కేసులను లో క్అదాలత్ ద్వారా పరిష్కరించడం విశేషమన్నారు. -
యోగా జీవితంలో భాగం కావాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ సిరిసిల్లటౌన్: యోగాతో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారని జిల్లా జడ్జి పి.నీరజ అన్నారు. ఆదివారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో మాట్లాడారు. రోజూ యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగి, ఆరోగ్యవంతమైన జీవన విధానం అలవడుతుందన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అదనపు జిల్లా జడ్జి బి.పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మణాచారి, జూనియర్ సివిల్ జడ్జికుమారి మేఘన, సిరిసిల్ల బా ర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంతరావు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆస్తుల లెక్క పక్కా
వేములవాడ: పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివరాలను శాసీ్త్రయంగా నమోదు చేసి, యజమానులకు పూర్తి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ మ్యాపింగ్ (నక్ష– నేషనల్ జియాస్పిటకల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేటేషన్స్) కార్యక్రమం వేములవాడలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీల్లో పదింటిని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టులో వేములవాడ ఉండడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. 16 వేల ఎల్పీఎఫ్ల గుర్తింపు వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు సుమారు 16 వేల ఎల్పీఎఫ్లు (ల్యాండ్ పార్సెల్ ఫైళ్లు) గుర్తించారు. డ్రోన్ సర్వే, జియోస్పేషియల్ మ్యాపింగ్, భూరికార్డుల సమన్వయంతో ప్రతి ఆస్తికి ప్రత్యేక గుర్తింపు కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. సర్వేలో భాగంగా ఆస్తి యజమానుల పేరు, ఆధార్, ఇంటి నంబర్, డోర్ నంబర్, ప్లాట్ లేదా సర్వే నంబర్, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వే పూర్తయ్యాక అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం ఫైనల్ పబ్లికేషన్ విడుదల చేయనున్నారు. తర్వాత ప్రతి ఆస్తికి యూపీసీ (అర్బన్ ప్రాపర్టీ కార్డ్) జారీ చేస్తారు. ఈ కార్డు ద్వారా ఆస్తి యాజమాన్యానికి స్పష్టమైన గుర్తింపు లభించడంతోపాటు భూ వివాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆస్తి కొనుగోలు, విక్రయాలు, బ్యాంకు రుణాలు, వారసత్వ హక్కుల నిర్ధారణ వంటి అంశాల్లో యూపీసీ కీలక పత్రంగా ఉపయోగపడనుంది. ప్రజల సహకారం అవసరం నక్ష సర్వే విజయవంతం కావాలంటే ప్రజలు సరైన పత్రాలు, వివరాలు అందించి సిబ్బందికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. వేములవాడలో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 10 మున్సిపాలిటీల ఎంపిక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 116 మున్సిపాలిటీల్లో 10 మున్సిపాలిటీలను పైలెట్ ప్రాజెక్టులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో వేములవాడ, జగిత్యాల, హుస్నాబాద్, జాచెర్ల, కొత్తగూడెం–ములుగు, వర్ధన్నపేట, యాదగిరిగుట్ట, మహబూబాబాద్, మిర్యాలగూడ, కొడంగల్ ఉన్నాయి. వేములవాడ పట్టణంలో డి జిటల్ మ్యాపింగ్కు ఇంటి యజమానులు సహకరించాలి. తమ సిబ్బంది అడుగుతున్న రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇంటి పన్ను రశీదు, కరెంటు బిల్లు, యజమాని ఆధార్కార్డులు చూపించాలి. దీంతో యజ మాని కచ్చితమైన ఆస్తి రికార్డు, స్పష్టమైన ఆస్తి సరిహద్దులు, భూవివాదాల తగ్గింపు, మెరుగైన సేవలు, సమగ్ర ప్రణాళిక, అభివృద్ధిలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి. – గుండ్లూరి లోకేశ్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ -
రైతులను తరిగేస్తున్నారు
సిరిసిల్ల: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలని రైతులు భావిస్తుండగా.. ఇదే అదనుగా అక్రమాలకు కొందరు తెరలేపుతున్నారు. రైతులు అమ్మిన ధాన్యం బస్తాల్లో రాళ్లు, తాలు ఉందని పేర్కొంటూ.. రైస్ మిల్లర్లు ‘తరుగు’తీస్తున్నారు. మిల్లుకు చేరిన బస్తాల్లో భారీగా కోత విధించడంతో ఆ మేరకు రైతులకు నష్టం జరుగుతుంది. కానీ, ఆ శ్రీతరుగుశ్రీలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కాసుల పంట పండిస్తున్నారు. రైతులతో నమ్మకంగా ఉంటూనే తరగు వచ్చింది.. ఏం చేస్తామంటూ నమ్మబలుకుతూ.. రైస్ మిల్లర్తో లోపాయికారి ఒప్పందం చేసుకుంటూ డబ్బులు దండుకుంటున్నారు. మరోవైపు గోదాముల్లో నిల్వ చేస్తున్న ధాన్యంలోనూ కోతలు పెడుతూ కాసుల పంటలు పండించుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో ధాన్యం బస్తాను 40.600 కిలోల బరువుతో తూకం వేయాల్సి ఉండగా, అంతకు రెండు నుంచి ఐదు కిలోల వరకు అదనంగా తూకం వేస్తూ.. 45 కిలోల బరువున్న బస్తాకు 40 కిలోలే లెక్క గడుతున్నారు. ఇలా అదనంగా వచ్చిన వడ్లను సైతం లారీ లోడ్తో సహా లెక్కిస్తూ.. అదనపు వడ్ల సొమ్ములను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నొక్కేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల చేతుల్లో కీలక బాధ్యతలు జిల్లాలో నకిలీ ట్రక్షీట్లను సృష్టించి 13 లారీల వడ్లను దారి మళ్లించి రూ.91లక్షలను నొక్కేసిన ఘటనలో ఆరుగురిని సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేయగా, మరి కొందరు పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే రూ.14.16 లక్షలు రికవరీ చేయగా, మరో రూ.46.21లక్షలను బ్యాంకు ఖాతాల్లోనే ఫ్రీజ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కాంట్రాక్టు ఉద్యోగుల చేతుల్లో కీలక బాధ్యతలు ఉండడంతో అక్రమాలకు తెరలేపినట్లు భావిస్తున్నారు. ఉద్యోగ భద్రత లేక పోవడంతో భయం లేకుండా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. అపెరల్ పార్క్ గోదాము నుంచి 86 బస్తాల వడ్లను తరలిస్తూ పట్టుబడిన లారీ కేసు పెండింగ్లో ఉండగా, కోనరావుపేట మండలం మల్కపేట కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. రుద్రంగికి చెందిన కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు గడ్డం స్వామి సైతం పరారీలోనే ఉన్నాడు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరుగుతుందని, బాధ్యులు ఎవరినీ వదిలిపెట్టమని ఎస్పీ మహేశ్ బి గితే వెల్లడించారు. లోతుగా విచారిస్తే.. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి సింగిల్ విండోల చైర్మన్లు, బుక్ కీపర్లు, ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్లపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ట్రక్షీట్ బుక్ వివరాలను నిషితంగా పరిశీలిస్తే ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు బయటపడనున్నాయి. గతంలోనూ అపెరల్ పార్క్, సర్ధాపూర్ ఏఎంసీ గోదాముల్లోని ధాన్యం బస్తాలు మాయమయ్యాయి. వ్యాన్లు, లారీల్లో అక్రమంగా వడ్ల బస్తాలను రాత్రి వేళ తరలించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. జిల్లా అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమార్కులను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో ఈ సీజన్ ధాన్యం కొనుగోళ్లు.. కొనుగోలు కేంద్రాలు 236 కొనుగోలు చేసిన ధాన్యం 3,66,963 మెట్రిక్ టన్నులు కొన్న ధాన్యం విలువ రూ.876.57 కోట్లు వడ్లు అమ్మిన రైతుల సంఖ్య 46,812 రైతుల ఖాతాల్లో జమయిన డబ్బు రూ.753.28 కోట్లు డబ్బులు పొందిన రైతులు 45,225 -
గురుకుల విద్యార్థినికి సీఎం అభినందనలు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని మాందాడి హనీ శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా రూ.25వేల చెక్కును అందుకుంది. హనీ 10వ తరగతిలో 586 మార్కులు సాధించి రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సొసైటీలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థినిని సీఎం అభినందించారని ప్రిన్సిపాల్ సంధ్యారాణి తెలిపారు. వేములవాడరూరల్: మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలని చేపట్టిన దీక్ష శుక్రవారం 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్మికులకు సంఘీభావం తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్ర తాప రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే కా ర్మికులు అడుగుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్ర భుత్వం స్పందించాలని కోరారు. యూనియన్ రాష్ట్ర నాయకుడు గుర్రం అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, నాయకులు వంగల శ్రీనివాస్, కొండ్లెపు ముత్యం, నామాల శేఖర్, యూనియన్ పట్టణ అధ్యక్షుడు సరిపెల్లి నరేశ్, దుబ్బల లచ్చయ్య, బొట్టు శ్రీనివాస్, సావనపల్లి శ్రీనివాస్, గుడిసె రాజయ్య, గాజుల వజ్రమ్మ, వావిలాల లక్ష్మి, పెంట భారతి, రాధ, మమత పాల్గొన్నారు. బోయినపల్లి(చొప్పదండి): గ్రామాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసిందని డీఈవో జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొదురుపాక, బోయినపల్లి, గుండన్నపల్లి, కోరెం గ్రామాల్లో శుక్రవారం ప్రీ ప్రైమరీ స్కూళ్లను స్థానిక హైస్కూళ్లలో ప్రారంభించారు. ఎంఈవో శ్రవణ్కుమార్, సర్పంచులు నల్లమోహన్, కొప్పుల లావణ్య, జంపుక మాధవి, కత్తెరపాక మంజుల పాల్గొన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని నామాపూర్ సర్పంచ్ మాదాసు అనిల్ తన కూతురు అభిజ్ఞను స్థానిక జెడ్పీ హైస్కూల్లో శుక్రవా రం చేర్పించారు. ఏడో తరగతి వరకు ముస్తాబాద్లోని ప్రైవేటు స్కూల్లో చదువుకోగా.. ఎనిమిదో తరగతికి గ్రామంలోని హైస్కూల్లో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసం, నమ్మకంతో తన కూతురును చేర్పించిన అనిల్ను ఉపాధ్యాయులు అభినందించారు. అప్రమత్తంగా ఉండాలిసిరిసిల్ల అర్బన్: అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ సూచించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు శుక్రవారం ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. స్కూల్ బస్సుల్లో ఏర్పాటు చేసే ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం, అత్యవసర ద్వారాల ద్వారా సురక్షితంగా బయటకు వెళ్లే పద్ధతులపై ప్రదర్శన నిర్వహించారు. మోటారు వాహనాల తనిఖీ అధికారి గంధం వంశీధర్, సహాయ అధికారి పృథ్వీరాజ్వర్మ, ఫైర్ సబ్ ఇన్స్పెక్టర్ నర్మెట నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పానిపూరి విక్రయాలు నిలిపివేయాలి
● అధికారుల తనిఖీలు ● వ్యాపారులకు నోటీస్లుసిరిసిల్లటౌన్/సిరిసిల్ల అర్బన్ /చందుర్తి/ఇల్లంతకుంట/ఎల్లారెడ్డిపేట/వేములవాడఅర్బన్: ముక్కపట్టిన పానీపూరీలు.. బూజుపట్టిన ఆలుగడ్డలు.. అపరిశుభ్రంగా తయారీప్రాంతం.. ఇదీ పానీపూరి విక్రయ కేంద్రాల్లో పరిస్థితులు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని కేసీఆర్కాలనీలో పానిపూరి తిని 25 మంది అస్వస్థతకు గురికావడంతో జిల్లా అధికారులు చర్యలకు దిగారు. జిల్లా వ్యాప్తంగా పానీపూరి వ్యాపారుల ఇళ్లను, బండ్లను శుక్రవారం తనిఖీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్పాషా, డీఎంహెచ్వో డాక్టర్ ఏంజెల ఆల్ప్రైడ్, ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం చాట్భండార్లపై ఆకస్మిక దాడులు చేశారు. కొన్ని కేంద్రాలలో నిల్వ ఉంచిన పానిపూరీలు, ఫంగస్ పట్టిన ఉల్లిగడ్డలు, బంగాళ దుంపలు గుర్తించినట్లు కమిషనర్ తెలిపారు. వెంటనే వాటిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆఫ్రాన్లు, క్యాప్స్ ధరించాలి చాట్భండార్లు, హోటల్స్ నిర్వాహకులు ఆఫ్రాన్లు, హెయిర్ క్యాప్స్ ధరించాలని ట్రెయినీ కలెక్టర్ నిఖితారెడ్డి, వేములవాడ ఆర్డీవో కే.ఎస్.బి.కుమారి సూచించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని పానిపూరి దుకాణాల్లో తనిఖీ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న వాటిని వెంటనే తొలగింపజేయించారు. నమూనాలు సేకరించారు. తనిఖీలో మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, లోకేశ్, ఇన్చార్జి డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఉన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలి పానిపూరి సెంటర్లు, హోటళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని డీఎల్పీవో వీరభద్రయ్య సూచించారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో పానీపూరి సెంటర్, నివాసాలను ఎంపీడీవో రమేశ్తో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. తంగళ్లపల్లిలో కార్యదర్శి సమీర్ హోటళ్లను తనిఖీ చేసి నోటీసులు అందజేశారు. ఎంపీవో మీర్జా, కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు. ఆహార పదార్థాలు సీజ్ వేములవాడలో పానిపూరీ విక్రయిస్తున్న స్టాల్ను ఆర్డీవో కేఎస్బీ కుమారి, కమిషనర్ లోకేశ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనూష తనిఖీ చేశారు. అపరిశుభ్రమైన పరిసరాల మధ్య తినుబండారాలు విక్రయిస్తున్నారని గుర్తించిన అధికారులు ఆహార పదార్థాలను సీజ్ చేసి తరలించారు. వానకాలం వెళ్లే వరకు ఎలాంటి విక్రయాలు చేయొద్దని హెచ్చరించారు. పానిపూరి బండ్లు సీజ్ చందుర్తి మండలం మర్రిగడ్డలో పానిపూరి విక్రయాలు నిలిపివేయాలని వ్యాపారి రమేశ్ను ఇన్చార్జి ఎంపీవో రాజేశ్వర్, సర్పంచ్ మనిషా ఆదేశాలు జారీ చేశారు. ఇల్లంతకుంటలో రాజస్థాన్కు చెందిన ఓ కుటుంబంతోపాటు నాగరాజు, ఓరగంటి పరశురాం పానిపూరి విక్రయిస్తారు. వారి ఇళ్లల్లో ఎంపీడీవో శశికళ తనిఖీ చేశారు. ఓరగంటి పరుశురాం వద్ద పానీపూరి పదార్థాలు అపరిశుభ్రంగా ఉండడంతో బండిని సీజ్ చేశారు. ఎంపీవో మహమ్మద్ వజీర్, కార్యదర్శి చంద్రశేఖర్ తనిఖీలు చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పానిపూరి బండ్ల నిర్వాహకులకు గ్రామపంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజులపాటు పానీపూరి విక్రయించొద్దని ఆదేశించారు. సర్పంచ్ ఎలగందుల నర్సింలు, ఉపసర్పంచ్ బందారపు బాల్రెడ్డి తదితరులు ఉన్నారు. -
మండుతున్న ఎండలు
● అత్యధికంగా మల్లారంలో 41.5 డిగ్రీలు ● అత్యల్పంగా చందుర్తిలో 38.6 డిగ్రీలు సిరిసిల్ల: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వర్షాకాలం ప్రవేశించి పక్షం రోజులు గడుస్తున్నా వర్షాల జాడలేక మృగశిర కార్తెలో ఎండలు దంచికొడుతున్నాయి. జిల్లాలో శుక్రవారం వేములవాడ మండలం మల్లారం వద్ద అత్యధికంగా 41.5 డిగ్రీలు నమోదు కాగా.. అత్యల్పంగా చందుర్తిలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి వద్ద 41.1, కలెక్టరేట్ వద్ద 40.5, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ వద్ద 40.4, ఇల్లంతకుంటలో 40.6, కోనరావుపేట మండలం మర్తనపేటలో 40.1, సిరిసిల్ల శివారులోని పెద్దూరు వద్ద 40.4, వట్టెంలలో 41.2, నామాపూర్లో 41.1, రుద్రంగిలో 41.3, మరిగడ్డలో 38.6, వీర్నపల్లిలో 38.8, నేరెళ్లలో 39.9, ఎల్లారెడ్డిపేటలో 39.1, గంభీరావుపేటలో 39.0, మానాలలో 39.1, నిజామాబాద్ 39.6, గజసింగవరం 39.2, ఆవునూర్ 39.8, పెద్దలింగాపూర్లో 40.0 డిగ్రీలు నమోదయ్యాయి. ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలివేములవాడరూరల్: రైతులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం కోరారు. వేములవాడ మార్కెట్యార్డులోని ఏడీఏ కార్యాలయంలో శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని, రైతులు కంది, పెసరతోపాటు చిరుధాన్యాల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ఆర్.సాయికుమార్, వేములవాడ మండల ఏవోలు వినీతరెడ్డి, సాయికృష్ణ పాల్గొన్నారు. -
● రోజురోజుకు పడిపోతున్న నీటిమట్టం ● కనిష్టస్థాయిలో ఎగువ, లోయర్, మిడ్మానేరు డ్యాంలు ● ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ తగ్గుతున్న నీరు ● ఈసారి ఉమ్మడి జిల్లాలో సాగునీటికి చిక్కులే
ఉమ్మడి జిల్లా వ్యవసాయానికి గోదావరి, మానేరు నదులు ప్రాణాధారం. రెండు నదులపై నిర్మించిన ప్రాజెక్టులే ఇటు ఉమ్మడి జిల్లాకు, అటు ఇతర జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తున్నాయి. అలాంటి ఈ రెండు నదులు ఈ వేసవిలో దాదాపుగా ఎండిపోతున్నాయి. ఈ పరిణామం రైతులను, వ్యవసాయాధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. అప్పర్ మానేరు 1 టీఎంసీ పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 19 అడుగులకు చేరుకుంది. ఇక 27 టీఎంసీల సామర్థ్యమున్న మిడ్మానేరు డ్యామ్ (ఎంఎండీ)లో ప్రస్తుతం 7.4 టీంఎసీలకే పరిమితమైంది. లోయర్మానేర్ డ్యాం (ఎల్ఎండీ) 24 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 6 టీఎంసీలే నమోదు చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దరిమిలా జలాశయాల్లో నీటి ఆవిరి ఇంకా కొనసాగుతుందని నీటిపారుదల అధికారులు వాపోతున్నారు. ఇక జగిత్యాల జిల్లా పంటలకు కీలకమైన ఎస్సారెస్పీ వరద కాలువలో సాధారణంగా ఆరు మీటర్ల వరకు ఉంటే నీరు ప్రస్తుతం రెండు మీటర్లకు పరిమితమైంది. దీని ఆధారంగా జిల్లాలో 30వేల ఎకరాల పంటలు సాగవుతాయి. -
చేనేత సహకార సంఘాలు ఏకగ్రీవం
● ప్రశాంతంగా ఏడు చేనేత, నాలుగు పవర్లూమ్ సహకార సంఘాల ఎన్నికలు ● చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు ఎస్.సంతోష్కుమార్సిరిసిల్ల: జిల్లాలోని ఏడు చేనేత, నాలుగు పవర్లూమ్ సహకార సంఘాలకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. పరిమిత ఓట్లు ఉండడంతో అధ్యక్ష, పదవితోపాటు కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చివరి సారిగా 2013 ఫిబ్రవరిలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 2018లో ఆ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రతీ ఆరు నెలలకోసారి పదవీ కాలాన్ని పొడగిస్తూ వచ్చారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. ఒక్కో సంఘంలో తొమ్మిది మందితో కూడిన కార్యవర్గం ఎన్నికల కాగా.. అందులో ఒక్కరు అధ్యక్షుడు, ఒక్కరు ఉపాధ్యక్షుడు, మరొకరు కార్యదర్శి, ఇంకొకరు కోశాధికారి, మరో ఐదుగురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అన్ని సంఘాలూ ఏకగ్రీవం : జిల్లాలో 11 సంఘాల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎన్నికలు ముగిశాయి. చేనేత సహకార సంఘాల్లో 234 మంది, పవర్లూమ్ సహకార సంఘాల్లో 87 మంది సభ్యులు ఉన్నారు. – సంతోష్కుమార్, చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు -
చేనేత కార్మికులకు అండగా ప్రజా ప్రభుత్వం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: చేనేత కార్మికులకు అండగా ప్రజాప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలో జరిగిన చేనేత పారిశ్రామిక సహకార సంఘ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు తాటికొండ రాజయ్య, కార్యదర్శి పారవెల్లి రాజేశం, కోశాధికారి రాపెల్లి దేవదాసు, కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్లో శుక్రవారం చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్చైర్మన్ నరాల శేఖర్, పట్టణ అధ్యక్షుడు తూం మధు, కౌన్సిలర్లు కొక్కుల బాలకృష్ణ, ఇప్పపూల అజయ్, చేనేత కార్యవర్గ సభ్యులు దూస రాజేశం, పులి సత్యనారాయణ, తాటికొండ రామస్వామి పాల్గొన్నారు. -
‘గుట్ట’కాయ స్వాహా
జిల్లాలోని వేములవాడ మండలం చంద్రగిరి గుట్టల్లో ఓ స్టోన్ క్రషర్కు ఐదు ఎకరాల్లో బండ తవ్వకాలు జరిపేందుకు, బండను కొట్టి కంకర తయారు చేసేందుకు అనుమతి పొందారు. కానీ అనుమతికి మించి పది ఎకరాల్లో గుట్టను పగులగొట్టి బండలు తీసి స్టోన్ క్రషర్కు వాడుకున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో అక్రమ దందా సాగించారు. క్రషర్లో ఉత్పత్తి చేసిన కంకరకు సీనరేజీ ఫీజు కూడా చెల్లించకుండా లక్షల క్యూబిక్ మీటర్ల కంకరను కాంట్రాక్టు పనులకు అప్పగించారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ హద్దులు దాటి గుట్టలను గుల్ల చేశారు.కలర్ గ్రానైట్ లీజులు 24 రాయి (కంకర) లీజులు 16 పట్టా భూములు 40.14 హెక్టార్లు ప్రభుత్వం భూములు 103.43 హెక్టార్లు ఖనిజం ద్వారా 2023–24 ఆదాయం రూ.16.72 కోట్లు 2024–25లో ఆదాయం లక్ష్యం రూ.18.77 కోట్లు 2025–26లో ఆదాయం లక్ష్యం రూ.20.50 కోట్లు -
వాస్తు రూపకంగా అన్ని విధాలా బాగుంది
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్ల బొప్పాపూర్ శివారులోని శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని ఎంతో ప్రతిష్టతతో నిర్మించారని, ఆలయ నిర్మాణం వాస్తురూపకంగా అన్ని విధాలా బాగుందని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్స్వామి అన్నారు. రూ.2కోట్లతో ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకొని విగ్రహ ప్రతిష్ట వేడుకలు వైభవంగా నిర్వహించుకున్న ఆలయాన్ని గురువారం సందర్శించారు. ఇక్కడ కొలువుదీరిన తిరుమలేశులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. అనంతరం వేద పండితులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులకు ప్రవచనాలు వినిపించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, ఉప సర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, శివ, ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అశ్విన్రావుకు నివాళి
సిరిసిల్ల: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు అశ్విన్రావు ఇటీవల మరణించగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్హాల్లో అశ్విన్రావు చిత్రపటం వద్ద నివాళి అర్పించిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు చిక్కాల రామారావును ఓదార్చారు. అంతకు ముందు ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ రామారావును కలిసి ఓదార్చారు. మాజీ మంత్రుల వెంట మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, నాయకులు చీటి నర్సింగరావు, సిద్ధం వే ణు, లక్ష్మణ్రావు, శ్రీనివాస్, బొల్లి రామ్మోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. చందుర్తి: బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కేడీసీసీ బ్యాంకు ఏజీఎం నర్సింహరెడ్డి కోరారు. మర్రిగడ్డకు చెందిన దారం రాజు మృతిచెందగా భార్య మౌనినకు పీఎం జీవన్జ్యోతి బీమా యోజన పథకం కింద మంజూరైన రూ.2లక్షల బీమా చెక్కును చందుర్తి కేడీసీసీ బ్రాంచ్లో గురువారం అందజేశారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
ఎల్లారెడ్డిపేట: గంభీరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఫోరం చైర్పర్సన్ జేఆర్ చవాన్, ఎస్ఈ టి.వేణుమాధవ్, డీఈ అంజ య్య, ఏవో అరవింద్ తెలిపారు. గురువారం ఎల్లారెడ్డిపేటలోని సాధు వెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లో నా లుగు మండలాల రైతులు, వినియోగదారులు, ప్ర జాప్రతినిధులతో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. సదస్సులో వచ్చిన 22 వినతులతో పాటు ఇతర సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఫైనాన్స్ మెంబర్ సత్యనారాయణ, ఏడీఈ శ్రీనివాస్, ఏఈలు రాకేష్ రెడ్డి, విష్ణు, రమేశ్, ఆనంద్, పలువురు సర్పంచులు, రైతులు, విద్యుత్ వినియోగదారులు, సిబ్బంది పాల్గొన్నారు. సబ్స్టేషన్ పనులు పరిశీలన చందుర్తి: ఎన్గర్లో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్స్టేషన్ పనులను విద్యుత్ ఎస్ఈ టి.వేణుమాధవ్, డీఈ వెంకటరాములు గురువారం పరిశీలించారు. సబ్స్టేషన్ విద్యుత్ లైన్ వర్క్ ఎక్కడి వరకు పూర్తి చేశారో అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వర్షాలు కురిస్తే పనులు చేయడం కష్టమవుతోందన్నారు. వీరి వెంట విద్యుత్ సిబ్బంది ఉన్నారు. -
అభయ యాప్తో ప్రయాణికుల భద్రత
● ఎస్పీ మహేశ్ బి గితేసిరిసిల్ల: ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభయ యాప్(మై ఆటో ఈస్ సేఫ్) ఫేజ్–3లో 100 ఆటోలకు అభయ క్యూఆర్ కోడ్ అనుసంధానం చేశామని ఎస్పీ మహేశ్ బి గితే తెలిపారు. గురువారం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అభయ యాప్తో వాహనాల డ్రైవర్లకు రూ.50తో రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలు పంపిణీ చేశారు. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణంపై మరింత నమ్మకం కల్పించడంతో పాటు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రాధ్యాన్యత ఇస్తున్నామని వివరించారు. అభయ యాప్ ద్వారా ఆటోలకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులు ఆటో వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆర్ఐ సురేశ్, ఆర్ఎస్ఐ శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీనివాస్, అభిచరణ్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట లో ఏర్పాటు చేసిన 11 సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కమెరాల ప్రామఖ్యత, డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపడుతూ, యువతను మత్తు పదార్థాల దుష్ప్రభా వాల నుంచి రక్షించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేశ్, ఎస్సై రాహుల్రెడ్డి, సర్పంచ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధే ప్రధాన లక్ష్యం
● ఎమ్మెల్సీ మల్క కొమురయ్యసిరిసిల్లటౌన్: దేశాభివృద్ధి లక్ష్యంగా 12ఏళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ మచ్చ లేని పాలన చేశారని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. గురువారం సిరిసిల్లలోని వాసవి కల్యాణ మండటంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014లో భారతదేశం ఆర్థికంగా వరల్డ్లో 18వ స్థానంలో ఉండగా మోదీ విజన్తో 3వ స్థానానికి తీసుకొచ్చారని కొనియాడారు. 2047 కల్లా వికసిత్ ప్రపంచంలోనే మన దేశాన్ని ఆర్థికంగా మొదటి స్థానంలోకి తీసుకు రావాలని మోదీ సంకల్పించారని, ఇందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. విదేశీ సంబంధాల్లో అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గౌరవం తెచ్చారని, ఒకప్పుడు అమెరికా చెప్పిన షరతులకు లోబడే పరిస్థితి ఇప్పుడు ఇండియా కండిషన్స్ పెట్టె పరిస్థితికి వచ్చామన్నారు. నూతన ఎడ్యుకేషన్ పాలసీతో విద్యా వ్యవస్థలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని కోరారు. పాఠశాలల సందర్శన సిరిసిల్లలోని అంబేడ్కర్నగర్, గోపాల్నగర్, కుసుమ రామయ్య పాఠశాలలను గురువారం ఎమ్మెల్యే మల్క కొమురయ్య సందర్శించారు. పిల్లలకు అక్షరాభ్యాసం, పుస్తకాలు పంపిణీ చేయించారు. కుసుమ రామయ్య పాఠశాలలో పిల్లలతో భోజనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహకరిస్తామని అన్నారు. ఎమ్మెల్సీ వెంట కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి వికాస్రావు, జిల్లా ఇన్చార్జి మోహన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్చందుర్తి(వేములవాడ): పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటి కాపాడాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా గురువా రం సనుగుల శ్రీగోవిందరాజు స్వామి ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని సీఎం రేవంత్రెడ్డి సంకల్పించారని అన్నారు. గిరిజనులు గతంలో సా గు చేసిన భూములకు పట్టాలిస్తామని, కొత్తగా అడవులను మాత్రం నరికి వేయవద్దని కోరారు. అటవీ ప్రాంతం 33 శాతం ఉండాల్సి ఉండగా, జిల్లావ్యాప్తంగా 19 శాతం మాత్రమే ఉందని తెలిపారు. వే ములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల కోసం చందుర్తి శివారులోని 176 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఏకో పార్క్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఇదే విషయమై అటవీ శాఖ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. వానాకాలంలో రైతులు ప్రభుత్వం ప్రకటించిన సన్నాలను సాగు చేసి బోనస్ పొందాలని కోరారు. డీఎఫ్వో సత్యనారాయణ మాట్లాడుతూ అటవీ శా ఖ అధికారులు ప్రజలకు శత్రువులుగా కనిపిస్తున్నారని, పర్యావరణ పరిరక్షణ చెట్లతో సాధ్యమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి ఆఫ్జల్ బేగం, అదనపు ట్రైనీ కలెక్టర్ నిఖిత, ఆర్డీవో కుమారి, ఎఫ్ఆర్వోలు నాగేశ్వర్రావు, ఖలీలొద్దీన్, గ్రామ సర్పంచ్ లావణ్య అనిల్గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొట్టే ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ కుమార్, అటవీ శాఖ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచులు, స్వశక్తి సంఘాల మహిళలు, వివిధ శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం సిరిసిల్లటౌన్: అధైర్యపడొద్దు.. మీకు ఆరోగ్యం కుదుట పడేవరకు అండగా ఉంటాం.. ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పానీపూరి తిని అస్వస్థతకు గురై జిల్లాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు, పెద్దలను గురువారం రాత్రి కలిసి మాట్లాడారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, ఆర్డీవో శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డాక్టర్లు తదితరులున్నారు. -
రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 20267మైదానాల్లో క్రీడల జాతర రాష్ట్రంలోని పాఠశాల మైదానాలు త్వరలోనే సరికొత్త క్రీడా ఉత్సాహంతో ఉరకలెత్తనుండగా.. ఉమ్మడి జిల్లా సైతం సిద్ధమవుతోంది.వాతావరణం జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటుంది. వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. కోనరావుపేట: కొలనూర్లో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ బోనాలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించారు -
మహిళల భద్రతపై అవగాహన
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని ముచ్చర్ల, లింగన్నపేట గ్రామాల్లో గురువారం ఉపాధి హామీ పనులకు హాజరైన మహిళలకు జిల్లా షీటీం అధికారులు అవగాహన కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ, పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు, మహిళా చట్టాలు, హక్కుల గురించి వివరించారు. కార్యక్రమంలో షీటీం ఎస్సైలు ప్రమీల, రవి, సిబ్బంది శ్రీనివాస్, ప్రియాంక, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలిసిరిసిల్లటౌన్: మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి గురువారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు ఎదుట చేపట్టిన రిలేదీక్షల్లో మాట్లాడారు. కార్మికులకు కనీ స వేతనాలు రూ.26వేలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. అరవై ఏళ్లు దాటిన, అనారో గ్యం పాలైన కార్మికులు, మృతిచెందిన కార్మికు ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరాలని తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ యూ నియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: డీఆర్సీసీలో జరిగిన అక్రమాలపై మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు. గురువారం సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపల్లోని శానిటేషన్ విభాగంలోని తడి పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ నిర్వహించే టెండర్లలో రూ.18.50 లక్షల టెండర్ నిర్వహించగా కేవలం రూ.8లక్షలకే టెండర్ ఎలా దక్కించుకుంటారని ప్రశ్నించారు. ఐటీసీ సంస్థ నిర్వాహకుడే బినామీ కంపెనీతో టెండర్ దక్కించుకొని మున్సిపల్కు రూ.10లక్షలకు పైగా నష్టం చేశారని తెలిపారు. సదరు కాంట్రాక్టర్ టెండర్లను రద్దుచేసి ఓపెన్ టెండర్ నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గుజ్జే దాసు, తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకులు సెలంద్రి ఎల్లయ్య, తెలంగాణ వంట కార్మికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేశం, లక్ష్మణ్, రాజు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
యూరియా యాప్ రద్దు చేయకుంటే యుద్ధమే
● టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత సిరిసిల్ల: కొత్తగా తెచ్చిన యూరియా యాప్ను రద్దు చేయకుంటే ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ని ర్వహించిన జెండా పండుగలో పాల్గొని మాట్లాడా రు. తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దక్కాల్సిన రాజ్యాంగ ఫలాలు దరి చేరలేదన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు వీకెండ్ ఎమ్మెల్యే అ య్యారని ఆరోపించారు. నేరెళ్ల బాధితులను త్వరలోనే అందరూ ఆశ్చర్యపోయేలా ఆదుకుంటామన్నారు. నేతన్నకు దండ వేసి.. అమరవీరులకు నివాళి సిరిసిల్ల కొత్త చెరువు కట్ట వద్ద కవితకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. అక్కడి నుంచి ర్యాలీగా సిరిసిల్ల పాత బస్టాండ్ నేతన్న చౌక్కు చేరుకుని నేతన్న విగ్రహానికి పూల మాల వేసి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అంబేడ్కర్ చౌరస్తా వరకు కాలినడకన వచ్చి అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలు పూల మాలలు వేశారు. అనంతరం గ్రంథాలయం ముందున్న టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. జిల్లా ఇన్చార్జి ఎండీ మాజిద్ అబ్దుల్, నాయకులు సంకెపల్లి సుమలత, సుధాకర్శర్మ, ధరణి, సంపత్, బుస్సా వేణు, కుసుమ విష్ణు, వరద సతీశ్, నూనె మల్లేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులను పరామర్శించిన కవిత సిరిసిల్లటౌన్: పానీపూరి తిని అస్వస్థతకు గురై జిల్లాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యంతో ఆదుకోవాల్సినోళ్లు బాధ్యతారాహిత్యంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆహారకల్తీ అనేక విధాలుగా జరుగుతున్నా సర్కారు దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నత్తకే నవ్వొచ్చేలా!
వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం.. దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలో రోడ్డు విస్తరణ పనులు నత్తకే నవ్వొచ్చేలా సా..గుతున్నాయి. ఏడాది క్రితం మొదలుపెట్టిన పనులు ఇంకా కొసముట్టడం లేదు. రూ.6కోట్లతో 80 ఫీట్ల వెడల్పుతో తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి రాజన్న ప్రధాన ఆలయం వరకు పనులు చేస్తున్నారు. పనులు పూర్తికాకపోవడంతో రోడ్డుపై వాహనాలు వెళ్తున్నప్పుడు లేస్తున్న దుమ్ముదూళితో దుకాణదారులు, నివాసితులు ఇబ్బందిపడుతున్నారు. రూ.6కోట్లు 80 ఫీట్లు రాజన్న ప్రధాన ఆలయం నుంచి బ్రిడ్జి వరకు 80 ఫీట్ల వెడల్పుతో రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు ప్రభుత్వం రూ.6కోట్లు మంజూరు చేసింది. ముందుగా రూ.47 కోట్లతో పనులు చేపట్టాలని సంకల్పించారు. ఇందుకు 750 మీటర్ల మేర స్థలం అవసరం ఏర్పడింది. 254 మంది లబ్ధిదారులు ఉండగా.. 322 నిర్మాణాలు కూల్చి వేయాల్సి ఉంది. ఒకటి, రెండు మినహా నిర్మాణాల కూల్చివేతలు పూర్తి చేశారు. ఆ తర్వాత సుమారు రూ.6కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ ప్రక్రియకు నిధులు విడుదల అంశంలో ఏర్పడిన చిన్నపాటి జాప్యంతో ఏడాదిగా ముందుకు సాగడం లేదు. మొదట నిధుల కొరతతో పనులు కొంతకాలం నిలిచిపోయాయి. అనంతరం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో మళ్లీ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. విద్యుత్ స్తంభాల తొలగింపు, డ్రెయినేజీ నిర్మాణం, భవనాల సర్దుబాటు వంటి కారణాలతో పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పనులు కొనసాగుతుండడంతో మట్టి, కంకరతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము కారణంగా రోడ్డు పక్కన ఉన్న వ్యాపారసంస్థలకూ నష్టం జరుగుతోంది. భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతంలో ఈ పరిస్థితి ఇబ్బందిగా మారింది. శాఖల మధ్య సమన్వయ లోపం రోడ్ల విస్తరణ పనుల్లో శాఖల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిధులు విడుదలై పనులు ప్రారంభమైనప్పటికీ విద్యుత్, ఆర్అండ్బీ, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపంతో పనులకు బ్రేక్ పడింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని సమన్వయపరచి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. -
గ్రామాలకు బస్సు సౌకర్యం
బోయినపల్లి(చొప్పదండి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మారుమూల గ్రామాలకూ ఆర్టీసీ బస్సులతో రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి వయా మల్కాపూర్, గంగాధర మీదుగా వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సును బుధవారం ప్రారంభించి, అందులో ప్రయాణించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్యాదవ్, వేములవాడ ఆర్టీసీ డీఎం బోనాల శ్రీనివాస్, సర్పంచులు మడ్లపల్లి తులసి గంగయ్య, మహేశ్రెడ్డి, నల్ల మోహన్, ఏనుగుల కనకయ్య పాల్గొన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను జిల్లా వ్యవసాయ అ ధికారి అఫ్జల్బేగం బుధవారం తనిఖీ చేశా రు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, నిల్వలను పరిశీలించారు. మరో రెండు రోజుల్లో ‘యూరియా యాప్’ ద్వారా అమ్మకాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా షాపుల్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చే యాలని సూచించారు. యాప్ వినియోగం, ఎరువుల కొనుగోలుపై రైతులకు సందేహా లుంటే 18001237157 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. మండల వ్యవసాయాధికారి సంజీవ్ పాల్గొన్నారు. అర్హులకు డబుల్ ఇళ్లు అందించాలి సిరిసిల్లటౌన్: ఇప్పటికే నిర్మించిన డబుల్బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ కోరారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్లో బుధవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. ప దేళ్ల క్రితం గత ప్రభుత్వం పేదల కోసం డ బుల్ బెడ్రూమ్ పథకం ప్రవేశపెట్టిందన్నా రు. కానీ అనర్హులకు అందించారని ఆరోపించారు. ఈ విషయంపై గత ప్రభుత్వ హ యాంలో అనేకసార్లు పోరాటాలు చేసినా ప ట్టించుకోలేదన్నారు. శాంతినగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. మిట్టపల్లి రాజమల్లు, దాసరి రూప, బిజిగం సురేశ్, జిందం కమలాకర్, నాగుల సత్యం, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు. అనర్హులను తొలగించాలిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించాలని సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్బాబు సూచించారు. మండలంలోని రాచర్లబొప్పాపూర్లోని రైతువేదికలో బుధవారం ప్రత్యేక సమగ్ర సవరణపై బీఎల్వోలు, సూపర్వైజర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈనెల 25 నుంచి అనర్హుల తొలగింపుపై సర్వే చేయనున్నట్లు తెలిపారు. తహసీల్దార్లు సుజాత, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ సర్వేను పకడ్బందీగా చేపట్టాలిచందుర్తి(వేములవాడ): ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను పకడ్బందీగా చేపట్టాలని వేములవాడ ఆర్డీవో కుమారి కోరారు. చందుర్తి రైతువేదికలో బుధవారం బీఎల్వోలకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. అర్హుల పేరును ఓటరు జాబితాలో చేర్చాలని, మృతులు, శాశ్వత వలసదారులు, ఒకటికి మించి ఎక్కువ ఓట్లు ఉన్నవారిని తొలగించాలని సూచించారు. బూత్ఈ్థయి అధికారులు చేపట్టే ఈ ఇంటింటీ సర్వే పారదర్శకంగా చేయాలన్నారు. చందుర్తి, రుద్రంగి తహసీల్దార్లు భూపతి, పుష్పలత, ఆర్ఐ శ్రీనివాస్ ఉన్నారు. -
కలుషిత నీటిపై కదిలిన యంత్రాంగం
● మధ్యమానేరులో ఇన్టెక్ వెల్ పరిశీలన ● పంప్హౌస్లో వాటర్ శాంపిళ్ల సేకరణ ● నల్లా పైపులైన్ లీకేజీల గుర్తింపుసిరిసిల్ల: జిల్లాలో రంగుమారిన కలుషిత నీరు నల్లాల్లో సరఫరా అవుతోందని, మిషన్ భగీరథ నీరు మురికిగా రావడంతో జనం తాగేందుకు జంకుతున్న తీరుపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ‘జలమా.. హాలాహలమా’ కథనానికి అధికారులు కదిలారు. మిషన్ భగీరథ ఇన్చార్జి సీఈ అమరేంద్ర, ఈఈ ఎం.డీ.ముజాహిద్ అన్వర్ మధ్యమానేరు జలాశయంలోని వాటర్సోర్స్ కెనాల్ను, ఇన్టెక్వెల్ను పరిశీలించారు. మిషన్ భగీరథకు లభిస్తున్న నీటిని అంచనా వేశారు. అగ్రహారం నీటిశుద్ధి ప్లాంటులో శుద్ధిచేసిన నీటిని పరిశీలించి, ట్రీటెడ్ వాటర్ శ్యాంపిళ్లను సేకరించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పంపుహౌస్ల్లోనూ నల్లాలకు సరఫరా అయ్యే నీటి శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపించనున్నారు. సిరిసిల్ల విద్యానగర్ నెహ్రుపార్క్ వద్ద పైపులైన్ లీకేజీని గుర్తించారు. లోపాలను సవరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మిషన్ భగీరథ ఈఈ ఎం.డి.ముజాహిద్ అన్వర్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలో మిషన్భగీరథ డీఈఈ రాము, ఏఈఈ మధు సిబ్బంది ఉన్నారు. -
ధాన్యం కొనుగోళ్ల రికార్డులు సరిచూసుకోండి
సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల రికార్డులు సరిచూసుకోవాలని, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్శాఖ అధికారులు తనిఖీలు చేపట్టనున్నట్లు అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం పౌరసరఫరాలశాఖ అధికారులతో సమావేశమయ్యారు. నగేశ్ మాట్లాడుతూ ఈ ఏడాది రబీలో జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3.65 లక్షల టన్నుల ధాన్యాన్ని 46,378 మంది రైతుల వద్ద కొనుగోలు చేశామన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్మిల్లులకు, గోదాములకు ట్రక్షీట్ ప్రకారం పంపించారా? లేదా? అనే వివరాలు సరిచూసుకోవాలన్నారు. తప్పులు జరిగితే సంబంధిత కేంద్రాల ఇన్చార్జీలు, ఏపీఎంలు, సీఈవో, సీసీలు బాధ్యులని హెచ్చరించారు. వేములవాడ ఆర్టీవో కుమారి, డీసీఎస్వో బుచ్చిబాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నర్సింహ, టాస్క్ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం బస్తాలు అపహరణ
● కాంగ్రెస్ నేత నిర్వాకం ! సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం శివారులోని అపెరల్పార్కు గోదాంలో నిల్వచేసిన 200 బస్తాలు రెండు రోజుల క్రితం అపహరణకు గురికాగా బుధవారం అధికారులు రికవరీ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు. ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి లారీలో ధాన్యం బస్తాలు దొంగిలించారని సెక్యూరిటీ గార్డు తెలపడంతో ఎస్డబ్ల్యూసీ విజయ్ పోలీసులకు ఈనెల 16న ఫిర్యాదు చేశారు. ఈమేరకు బుధవారం రాత్రి పోలీసులు ధాన్యం లోడ్తో ఉన్న లారీని రికవరీ చేశారు. ఈ లారీని సిరిసిల్ల పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. దొంగిలించింది కోనరావుపేట మండలంలోని అధికార పార్టీకి చెందిన ఓ గ్రామాధ్యక్షుడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతుండ్రు
రోడ్డు విస్తరణ పనులు ఏడాది గడుస్తున్నా పూర్తి కావడం లేదు. చాలా మంది నాలాంటి చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని పనులు వేగవంతంగా పూర్తి చేయించాలి. – పాషా, టీస్టాల్, వేములవాడ ఏడాది గడిచింది విస్తరణ పనులు ఆలస్యమవుతున్నాయి. ఈ రోడ్డు పూర్తయి తే వేములవాడ రూపురేఖలు మారిపోతాయి. రూ.6కోట్లతో చేస్తున్న పనులు ఎప్పుడు పూ ర్తవుతుందో తెలియడం లేదు. ఏడాదిగా దు మ్ము,ధూళితోవ్యాపారాలుదెబ్బతింటున్నాయి. – గంప గౌరీశంకర్, వ్యాపారి, వేములవాడ పనులు వేగవంతం చేయిస్తాం రోడ్డు విస్తరణ పనుల్లో మిషన్ భగీరథ పైప్లైన్ పనులతో ప్రస్తుతం పనులు ఆగాయి. భగీరథ పైప్లైన్ పనులు, సైడ్ లైటింగ్కు సంబంధించిన పోల్స్ పనులు పూర్తి చేసి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేస్తాం. – పుల్కం రాజు, వేములవాడ, మున్సిపల్ చైర్మన్ -
సమస్యలు పరిష్కరించండి
వేములవాడ: పంచాయతీ కార్మికుల సమస్యలు ప రిష్కరించాలని కోరుతూ వేములవాడలోని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం ఎదుట కార్మికులు బుధవారం ఆందోళన చేపట్టారు. ముందుగా తెలంగాణచౌక్ నుంచి ఊరేగింపుగా ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని బైఠాయించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుర్ర శ్రీనివాస్, అన్నల్దాస్ గణేశ్ మాడుతూ మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
చదువు ఒక్కటే నిలబెడుతుంది
● కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ ● నారాయణపూర్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సన్మానంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జీవితాలను చదువు ఒక్కటే నిలబెడుతుందని.. చదువు ఉంటే డబ్బు..పేరు.. అన్నీ వస్తాయని కేంద్ర సాహిత్య అకాడమీ, కాళోజీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్ పేర్కొన్నారు. 1 నుంచి 9వ తరగతి వరకు ప్రతిభ చూపిన విద్యార్థులకు నారాయణపూర్ సేవ సమితి ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహకాలు అందించారు. పదో తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున ప్రోత్సాహకాన్ని నలిమెల భాస్కర్ సొంతంగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఇక్కడి మట్టికి మహత్తు ఉందని.. మేధావుల పుట్టినిల్లు ఈ ఊరు అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి నారాయణపూర్కు వచ్చి ఈ ఊరికి చెందిన ముగ్గురి కవులతో ఆ కాలంలోనే పద్యాలు రాయించుకొని, గోల్కొండ పత్రికలో అచ్చు వేశారని గుర్తు చేశారు. ఊరు పేరును నిలబెట్టేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. అకుంఠిత దీక్ష.. అవిరళ కృషితోనే విజయాలు సాధిస్తామన్నారు. గ్రామ సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ గ్రామానికి చెందిన లింగాలు, దుబ్బ విశ్వనాథంతోపాటు పలువురు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డప్పటికీ గ్రామం మీద మమకారంతో సహకరిస్తున్నారన్నారు. నారాయణపూర్ సేవ సంస్థ సేవలు అమోఘమన్నారు. ఎంఈవో కృష్ణహరి మాట్లాడుతూ తాను హెచ్ఎంగా ఈ స్కూల్కు వచ్చినప్పుడు జిల్లాలోనే చిట్టచివరి స్థానంలో ఉండేదని.. అప్పటి నుంచి చేసిన శ్రమకు ఈనాటి ఫలితాలే నిదర్శనమన్నారు. ఐఏఎస్ రమణాచారి ఫోన్లో తన సందేశాన్ని అందించారు. 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను తిరుమల, తిరుపతి దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. -
మూత‘బడి’ తెరుచుకున్నాయి
ఇల్లంతకుంట(మానకొండూర్): విద్యార్థులు రావ డం లేదన్న నెపంతో మూతపడిన పాఠశాలలు తిరి గి తెరుచుకున్నాయి. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట ప్రాథమిక పాఠశాల మూడేళ్ల క్రితం మూతబడింది. ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని ‘సాక్షి’లో ఇటీవల ప్రచురించిన కథనానికి వి ద్యాశాఖ అధికారులు స్పందించారు. డిప్యూటేషన్పై వేరే పాఠశాలలకు కేటాయించిన టీచర్లకు తిరిగి రహీంఖాన్పేటలో పోస్టింగ్ ఇచ్చారు. బడిబాటలో భాగంగా ఇంటింటికి వెళ్లి విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకున్నారు. మూతపడిన పాఠశాల తిరిగి ప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎంఈవో శ్రీనివాస్గౌడ్, స ర్పంచ్ కమటం లావణ్య, ఉపసర్పంచ్ గడ్డమీది పద్మ,హెచ్ఎం సురేందర్ పాల్గొన్నారు. పదేళ్ల తర్వాత ఓపెన్ గంభీరావుపేట(సిరిసిల్ల): పదేళ్ల క్రితం విద్యార్థులు లేక మండలంలోని పొన్నాలపల్లి పాఠశాల మూతబడింది. గ్రామస్తులు ఒక్కటై.. 15 మంది విద్యార్థులను చేర్పించడంతో పాఠశాలను బుధవారం పునర్ ప్రారంభించుకున్నారు. తాత్కాలిక సర్దుబాటు ద్వారా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా ఉమేరా సుల్తానా నియమితులయ్యారు. ఎంఈవో గంగారాం, సర్పంచ్ మహేశ్ పాల్గొన్నారు. -
హాలాహలమా!
జలమా..● రంగుమారిన నల్లా నీరు ● తాగేందుకు జంకుతున్న జనం ● అడుగంటిన మధ్యమానేరు ● మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యంమధ్యమానేరులో రుద్రవరం వద్ద ఇన్టేక్ వెల్ఇవీ మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయిన నీరు. తాగేందుకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతుండగా.. ఇలా రంగుమారిన మురికినీరు వస్తుంది. ఫలితంగా జనం తాగకుండా ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. తాగేందుకు మాత్రం బబుల్తో ఫిల్టర్వాటర్ను తెచ్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా రంగుమారిన నీరు సరఫరా అవుతోంది. ఇది జిల్లా కేంద్రంలోని గీతానగర్ బీసీ బాలికల హాస్టల్ ఎదుట మిషన్ భగీరథ నల్లా పైపు. రంగుమారి నీరు రావడంతో హాస్టల్లో పట్టుకోకుండా ఇలా వృథాగా వదిలేశారు. ఫలితంగా తాగునీరు నేల పాలవుతుంది. ఒక్కటి, రెండు చోట్ల కాదు జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ నీటిని జనం తాగేందుకు జంకుతున్నారు. ఇది వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం మిషన్ భగీరథ పథకానికి నీటిని అందించే మధ్యమానేరు జలాశయంలోని కెనాల్. మధ్యమానేరులో ప్రస్తుతం 7.443 టీఎంసీల నీరు ఉండగా.. కెనాల్ ద్వారా ఇన్టేక్ వెల్కు నీరు వస్తోంది. ఈ నీటిని పంపింగ్ చేసి అగ్రహారంలోని ప్లాంటులో శుద్ధి చేసి జిల్లాలోని నీళ్ల ట్యాంకులకు సరఫరా చేస్తున్నారు. ఇటీవల శుద్ధిచేసిన నీరు సైతం రంగు మారి వస్తోంది. దీంతో ఆ నీటిని తాగేందుకు, ఇతర అవసరాలకు సైతం వినియోగించేందుకు జనం జంకుతున్నారు.సిరిసిల్ల: జిల్లాలో మిషన్ భగీరథ నీరు రంగుమారి సరఫరా అవుతోంది. పచ్చగా మారడంతో ఆ నీటిని తాగేందుకు జనం జంకుతున్నారు. బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర) జలాశయంలో నీటి నిల్వలు బాగా తగ్గిపోయాయి. 26 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల మిడ్మానేరులో ప్రసుత్తం 7.443 టీఎంసీల నీరు ఉంది. దీంతో నీటిని పంపింగ్ చేసే ఇన్టేక్ వెల్ వద్దకు వచ్చే కెనాల్లో నీటి ప్రవాహ వేగం తగ్గింది. నీటి నిల్వలు తక్కువగా ఉండి కెనాల్లో వేగం తగ్గి ఇన్టేక్ వెల్కు ఫ్లో తగ్గింది. దీని ప్రభావంతో నీటిశుద్ధి పంపులకు పూర్తి స్థాయిలో నీరు రావడం లేదు. ఫలితంగా నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల వర్షాలకు కొద్దిగా కొత్త నీరు చేరడంతో నిల్వ ఉన్న నీరు రంగు మారింది. ఆ నీటిని శుద్ధి చేసినా పూర్తి స్థాయిలో తేటగా కావడం లేదు. ఫలితంగా రంగుమారిన నీరే నల్లాల్లో వస్తుంది. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఉంటుందని, ఉపరితలం(చెరువులు, కుంటలు)లోని నీరు తాగేందుకు మంచివి అని మిషన్ భగీరథను ప్రారంభించారు. కానీ మధ్యమానేరులోకి గంభీరావుపేట ఎగువమానేరు, వేములవాడ మూలవాగు ద్వారా వచ్చే వరదనీరు చేరుతోంది. ఆ వాగుల్లో పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల వారు శవాలను దహనం చేయడం, చనిపోయిన జంతువులను వేస్తుంటారు. వర్షాలు పడి వచ్చే వరదలతో వాగులోని మలినాలు కొట్టుకుపోయి మధ్యమానేరులోకి చేరుతున్నాయి. ఆ నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తుండగా జనం తాగేందుకు వినియోగించడం లేదు. ఫలితంగా మిషన్ భగీరథ లక్ష్యం గాడి తప్పుతోంది. జిల్లాలో ప్రస్తుతానికి నీటి కొరత లేదు. కానీ, తాగునీరు రంగుమారి రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పైపుల లీకేజీ, అంతర్గతంగా నల్లాల పైపుల లీకేజీ సమస్యలతో నీరు కలుషితం అవుతుందనే అనుమానాలు ఉన్నాయి. రంగుమారి వస్తున్న నల్లానీటి సరఫరాను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. మండలాలు: 12(తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి, సిరిసిల్ల అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి, బోయినపల్లి, రుద్రంగి) మున్సిపాలిటీలు: సిరిసిల్ల, వేములవాడ ఆవాస ప్రాంతాలు: 359 తాగునీరు పొందే జనాభా: 6 లక్షలు నల్లాలు : 1,36,766 నిర్మాణ వ్యయం : రూ.1,085 కోట్లు పైపులైన్ పొడవు : 1,263.77 కిలోమీటర్లు నీళ్ల ట్యాంకులు : 625 పాత నీళ్ల ట్యాంకులు : 378 కొత్తగా నిర్మించిన ట్యాంకులు: 247 రోజుకు అవసరమైన నీరు : 10 కోట్ల లీటర్లు వినియోగించే మోటార్లు : 20 అవసరమయ్యే విద్యుత్ : 5.976 మెగా వాట్స్ ఆధారం: మధ్యమానేరు జలాశయం (26 టీఎంసీలు) మధ్యమానేరులో ప్రస్తుతం ఉన్న నీరు: 7.433 టీఎంసీలు -
వరిసాగుకు ఎల్నినో!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సాధారణంగా వానా కాలం ప్రారంభమైందంటే ఉమ్మడి కరీంనగర్లో రైతులు వరి నారుమడులు సిద్ధం చేయడంలో బిజీగా ఉంటారు. ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎల్నినో కారణంగా ఈ ఏడాది సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు నమోదవుతాయన్న వాతావరణశాఖ అంచనాలు రైతుల్లో ఆందోళన పెంచుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, సాగునీటి లభ్యతపై సందేహాలు వ్యక్తమవుతుండడంతో వ్యవసాయశాఖ అధికారులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచిస్తున్నారు. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి ప్రధాన పంటగా మారింది. యాసంగి సీజన్లో రాష్ట్రం రికార్డుస్థాయిలో వరి ఉత్పత్తి సాధించగా, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అధికంగా సాగైంది. ప్రస్తుత వానాకాలంలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు ఆలస్యమైతే లేదా తక్కువగా కురిస్తే వరిసాగు ప్రమాదంలో పడే అవకాశం ఉండటంతో, నారుమడులు వేయడంపై రైతులు సందిగ్ధంలో ఉన్నారు. స్వల్పకాలిక వరి రకాలపై కానరాని ఆసక్తి వర్షాభావ సూచనలు, నీటి లభ్యతపై అనిశ్చితి, సాగు ఖర్చుల పెరుగుదలతో ఈసారి వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, వరిపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొక్కజొన్న, పత్తి, కంది, పెసర, నువ్వులు వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయడం మేలని చెబుతున్నారు. వరివేస్తే 120రోజుల్లోపు పండే స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని వ్యవసాయశాఖ ప్రచారం చేస్తున్నప్పటికీ రైతుల్లో ఆశించిన స్పందన కనిపించడం లేదు. అధిక దిగుబడి ఆశతో చాలా మంది దీర్ఘకాలిక వరి రకాలకే మొగ్గుచూపుతున్నారు. దీంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాల్లో క్షీణత అధికారులు ఆందోళన చెందుతున్నట్లుగా లోటు వర్షపాతం నమోదైతే.. ఆ ప్రభావం తప్పకుండా భూగర్భ జలాలపై ఉంటుంది. అదే సమయంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి ఇప్పట్లో నీరు అందించే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ, ఉమ్మడి జిల్లాకు సాగు, తాగు నీటికి ప్రాణాధారంగా భావించే ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ కాలువల నుంచి వచ్చే వరదపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. రాష్ట్రంతోపాటు ఎగువన కూడా లోటు వర్షపాతం నమోదైతే కాలువల ద్వారా వచ్చే నీరు కూడా తగ్గిపోయే ప్రమాదముంది. వరద కాలువలు, ఎస్సారెస్పీ కాలువలు నిండుగా ఉన్నప్పుడు చుట్టుపక్కల భూగర్భ జలాలు సంతృప్తస్థాయిలో ఉంటాయి. కాలువల్లో నీరు తగ్గితే.. వీటి పరివాహక ప్రాంతాలతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ భూగర్భజలాలు పడిపోతాయని వ్యవసాయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వానాకాలంలో సాగు వివరాలు జిల్లా గతేడాది(లక్షల ఎకరాల్లో) కరీంనగర్ 2.75 పెద్దపల్లి 2.12 సిరిసిల్ల 1.84 జగిత్యాల 2.98 వర్షపాతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలి. స్వల్పకాలిక వరి రకాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుపై దృష్టి పెట్టాలి. ఎల్నినో ప్రభావం ఎంత మేరకు ఉంటుందో, జూలై నెలలో వర్షాలు ఎలా కురుస్తాయో అన్నదానిపైనే ఈ ఏడాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవసాయ పరిస్థితి ఆధారపడి ఉండనుంది. – శ్రీనివాస్, డీఏవో పెద్దపల్లి -
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి
● ఎస్పీ మహేశ్ బి గితే ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రజా ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. మంగళవారం ఇల్లంతకుంట పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు పరిశీలించారు. ప్రజలకు పోలీస్ సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది, సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని వివరించారు. రాత్రి వేళ పెట్రోలింగ్ ముమ్మరం చేసి చోరీలు, గంజాయి రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా గ్రామాల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సీఐ నాగేశ్వరరావు, ఎస్సై అశోక్ తదితరులు పాల్గొన్నారు. పర్మినెంట్ చేయాలని వినతిసిరిసిల్లటౌన్: మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ ముందు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలుపగా ఆయన మాట్లాడారు. రూ.26 వేలు కనీస వేతనాలివ్వాలని, మృతిచెందిన, 60ఏళ్లు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 18,19వ తేదీల్లో మున్సిపల్ ముందు, 22న కలెక్టరేట్ వద్ద దీక్షలు చేపడుతామని పేర్కొన్నారు. అనంతరం కమిషనర్ ఎంఏ ఖదీర్పాషాకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బాలయ్య, బాలకిషన్, మమత, శంకర్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. వయోధికుల కేసులు సత్వరం పరిష్కరిస్తావేములవాడ/వేములవాడఅర్బన్: పెండింగ్లో ఉన్న వయోవృద్ధుల కేసులు సత్వరం పరిష్కారిస్తానని ఆర్డీవో కుమారి పేర్కొన్నారు. వేములవాడ ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన ఆమెను సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యవర్గం నాయకులు మంగళవారం సన్మానించారు. ఈసందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కేసుల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జనపాల శంకరయ్య, జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి రామరాజు, కోశాధికారి దొంత దేవదాసు, ధ్యావనపెళ్లి శ్రీహరి తెలిపారు. ‘పేదలకందని బ్లడ్ బ్యాంక్ సేవలు’సిరిసిల్లటౌన్: జిల్లాసుపత్రిలోని ప్రభుత్వ బ్లడ్బ్యాంకులో పేదలకు సేవలు అందడం లేదని సీపీఎం పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆరోపించారు. మంగళవారం స్థానిక కార్మిక భవన్లో మాట్లాడారు. బ్లడ్ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అత్యవసర పరిస్థితులలో బ్లడ్ కోసం ఆసుపత్రిలో ఆశ్రయిస్తే వేరే వ్యక్తి బ్లడ్ ఇస్తేనే బ్లడ్ ఇస్తామని కండిషన్ పెట్టడం సరికాదన్నారు. పైగా ఫ్రెష్ బ్లడ్ ఇక్కడ ఉండదని పేషంట్ను సిబ్బంది భయభ్రాంతులకు గురిచేసి ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు వెళ్లమని సలహాలు ఇస్తున్నారన్నారు. నాయకులు శ్రీరాముల రమేశ్చంద్ర, అలువాల లక్ష్మణ్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు. -
రాజీ మార్గాన్ని ప్రోత్సహించాలి
సిరిసిల్లటౌన్: కక్షిదారుల్లో రాజీమార్గాన్ని పెంపొందించి లోక్ అదాలత్లో కే సులు పరిష్కరించుకునేలా చూడాల ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ అన్నా రు. మంగళవారం జిల్లా కోర్టు సముదాయంలో సిరి సిల్ల, వేములవాడ బార్ అసోసియేషన్ న్యాయవా దులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కారమవడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందుతారన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులు లోక్ అదాలత్లో మరిన్ని కేసుల పరి ష్కారానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. మొద టి అదనపు జిల్లా న్యాయమూర్తి బి.పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీని యర్ సివిల్ జడ్జి పి.లక్ష్మణాచారి, జూనియర్ సివిల్ జడ్జి మేఘన, సిరిసిల్ల, వేములవాడ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు ఆవునూరి రమాకాంతరావు, పిట్టల మనోహర్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
రోజూ పరీక్షలు చేస్తున్నాం
భగీరథ నీటి సరఫరాకు ఇబ్బందులు లేవు. నిత్యం నీటిని శుద్ధిచేసి, క్లోరినేషన్ చేసి సరఫరా చేస్తున్నాం. శుద్ధిచేసిన నీటిని రోజూ ల్యాబ్లో పరీక్షలు చేస్తున్నాం. మధ్యమానేరులో కొద్దిగా నీటి నిల్వలు తగ్గినా సరఫరాకు ఇబ్బంది లేదు. నల్లా నీరు రంగుమారి రావడానికి ఆయా ప్రాంతాల్లో ఏమైనా పైపులైన్ లీకేజీలు కారణం కావచ్చు. ఇటీవల రంగు మారి నీరు వస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. నీటిని శుద్ధి చేయడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – ఎండీ ముజాహిద్ అన్వర్, మిషన్ భగీరథ ఈఈ, సిరిసిల్ల -
హైరిస్క్ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: వర్షాకాలంలో డయేరియాపై అప్రమత్తంగా ఉండాలని, హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి జి.అంజెల అల్ఫ్రడ్ కోరారు. మంగళవారం పట్టణంలోని సుందరయ్యనగర్ అర్బన్ హెల్త్ సెంటర్, చీర్లవంచ పీహెచ్సీ, రాజీవ్నగర్ బస్తీ దవాఖానాను సందర్శించి మాట్లాడారు. ఈనెల 16 నుంచి జూలై 31 వరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో వైద్య సిబ్బంది ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఓఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీస్లో పీహెచ్సీ వైద్యాధికారులతో ఆమె సమీక్షించారు. స్టాప్ డయేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కోరా రు. జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ పవిత్ర, డాక్టర్ ఎల్.నాగేందేర్బాబు, డీఐవో డాక్టర్ సంపత్కుమార్, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ, పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, జిల్లాలోని అన్ని పీహెచ్సీల డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
చే‘నేత’ ఎన్నికల సందడి
● 19న ఎన్నికల నిర్వహణ ● జిల్లాలో 7 చేనేత, 4 పవర్లూమ్ సహకార సంఘాలు ● 321 మంది సభ్యులు ● ఓటర్ల జాబితా సిద్ధం చేసిన అధికారులు సిరిసిల్ల: రాష్ట్రంలోని చేనేత, పవర్లూమ్ సహకార సంఘాల పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో 7 చేనేత, 4 పవర్లూమ్ సహకార సంఘాలు ఉన్నాయి. 11 సంఘాల ఎన్నికలను ఈ నెల 19న నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్ను సహకార శాఖ అధికారులు మంగళవారం విడుదల చేశారు. పరిమిత ఓట్లు ఉండడంతో ఒకే రోజు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలలోగా.. నామినేషన్ల దాఖలు, పరిశీలన, చేతులెత్తే విధానంలో ఎన్నికలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. 13 ఏళ్ల తర్వాత.. జిల్లాలో చివరిసారిగా 2013 ఫిబ్రవరిలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 2018లో ఆ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఆరునెలలకోసారి పాలకవర్గాల పదవీకాలాన్ని పొడగిస్తూ వచ్చిన ప్రభుత్వం తాజాగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. 11 సహకార సంఘాల ఫొటో గుర్తింపు కార్డులతో కూడిన ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేసి రాష్ట్ర సహకార శాఖ అధికారులకు పంపించారు. సహకార శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ పర్యవేక్షణలో ఎన్నికలు జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ అయిన సంఘాలకే.. సహకార చట్టం 1964 ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన చేనేత సహకార సంఘాలను ప్రభుత్వం గుర్తించింది. జిల్లాలో 7 సంఘాలు ఆ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ కాగా, నాలుగు పవర్లూమ్ సంఘాలు సదరు చట్టం పరిధిలో ఉన్నాయి. చేనేత సహకార సంఘాల్లో 234, పవర్లూమ్ సహకార సంఘాల్లో 87 మంది సభ్యులు ఉన్నారు. ఒకప్పుడు వందలాది మంది సభ్యులు ఉండడంతో ఒక వెలుగు వెలిగిన సంఘాలు ఇప్పుడు పెద్దగా సభ్యులు లేక ఉన్నాయి. చేనేత వృత్తిని ఎవరూ చేయకపోవడంతో అంతా పవర్లూమ్కు మారడంతో చేనేత సంఘాలు, మగ్గాలు మూలనపడ్డాయి. ప్రస్తుతం ఉన్న సంఘాల్లోని సభ్యులు సైతం వృద్ధాప్యంలో ఉన్నారు. చేతులు ఎత్తే విధానంలో.. జిల్లాలో 19న జరిగే ఎన్నికల్లో సంఘాల సభ్యులు చేతులు ఎత్తే విధానంలో పాలకవర్గాలను ఎన్నుకుంటారు. ఒక్కో సంఘంలో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. అదే రోజు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, పాలకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. జిల్లా స్థాయిలో అధ్యక్షులు అంతా కలిసి రాష్ట్ర చేనేత, సహకార సంఘం(టెస్కో) అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సంఘం సభ్యుల సంఖ్య చేనేత కార్మిక సహకార సంఘం, వేములవాడ 36 చేనేత కార్మిక సహకార సంఘం, సిరిసిల్ల 37 మహేశ్వర చేనేత కార్మిక సహకార సంఘం, సిరిసిల్ల 36 భద్రవతి చేనేత కార్మిక సహకార సంఘం, సిరిసిల్ల 28 చేనేత కార్మిక సహకార సంఘం, మామిడిపల్లి 47 జగదాంబ చేనేత కార్మిక సంఘం, సిరిసిల్ల 18 చేనేత కార్మిక సహకార సంఘం, హన్మాజిపేట 32 సరస్వతి పవర్లూమ్ కార్మిక సంఘం, సిరిసిల్ల 22 అశోక పవర్లూమ్ కార్మిక సంఘం, సిరిసిల్ల 23 భాగ్యలక్ష్మీ పవర్లూమ్ సహకార సంఘం, సిరిసిల్ల 21 శ్రీలక్ష్మీ పవర్లూమ్ సహకార సంఘం, సిరిసిల్ల 21 -
అనారోగ్యంతో వృద్ధురాలు ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): వృద్ధాప్య భారం, నడుము నొప్పితో బాధపడుతూ ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్లపల్లి మండలంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని చింతలఠాన గ్రామానికి చెందిన బొడ్డు ముత్తవ్వ (79) కొంతకాలంగా తీవ్ర నడుము నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కుమార్తె బొడ్డు రాజమ్మ గమనించి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్లో సిరిసిల్ల ఆసుపత్రికి రాత్రి తరలించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేన్సర్ బాధ భరించలేక.. తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు భరించలేక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని అంకుసాపూర్ గ్రామానికి చెందిన ముదాం భాగ్యవ్వ (59) కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం వేకువజామున తన ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇరుగు పొరుగువారు గమనించి సిద్దిపేట జిల్లా చిన్న కోడూరులో ఉంటున్న ఆమె కుమార్తె విజయకు సమాచారం అందించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సెల్ కొనివ్వలేదని యువకుడు..
చొప్పదండి: సెల్ఫోన్ కొనివ్వలేదని బిహార్కు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చొప్పదండిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బిహార్ రాష్ట్రం అరలియా జిల్లాకు చెందిన నితీశ్ కుమార్కు నలుగురు అన్నలు ఉండగా పెద్దన్న కామారెడ్డిలో రైస్మిల్లులో పని చేస్తుండగా, అతనితో కామారెడ్డికి వచ్చాడు. స్మార్ట్ఫోన్ కొనివ్వాలని, రూ.10వేల నుంచి రూ.15 వేలు అవుతాయని చెప్పగా, నితీశ్ అన్న అంత డబ్బు లేదని, డబ్బు సర్దుబాటు అవ్వగానే కొనిస్తానని చెప్పి బిహార్ పంపించేందుకు చొప్పదండిలోని హరిప్రియ రైస్మిల్లులో పని చేసే మరో సోదరుడి దగ్గరకు పంపించాడు. చొప్పదండి నుంచి బిహార్ వెళ్లేవారు ఉండటంతో ఈ నెల 13న రైస్మిల్లుకు వచ్చాడు. మంగళవారం ఉదయం ఉరి వేసుకుని కనిపించాడు. స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని సోమవారం రాత్రి నితీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ రెడ్డి తెలిపారు. -
ప్రైవేటుకు టాటా.. సర్కార్ బాట
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని చిక్కుడువానిపల్లి గ్రామంలో కొన్నేళ్ల క్రితం ప్రాథమిక పాఠశాలను మూసివేశారు. దీంతో గ్రామంలోని విద్యార్థులు తంగళ్ళపల్లిలోని ప్రైవేటు స్కూలుకు బస్సులో వెళ్తుండేవారు. ఈనేపథ్యంలో సర్పంచ్ చింతమడక కళ్యాణ్, ఉపసర్పంచ్ చిక్కుడు సత్యం, గ్రామస్తులు కలిసి ప్రైవేట్ స్కూల్ బస్సులను గ్రామంలోకి రానివ్వలేదు. మంగళవారం తమ గ్రామంలోని 12 మంది విద్యార్థులను తమ ఊరు పక్కనే ఉన్న రామాజీపేట ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పించారు. తమ గ్రామంలోని పాఠశాలను తెరిపించాలని జిల్లా విద్యాధికారిని సర్పంచ్ కోరగా, కొంత సమయం తర్వాత ప్రారంభిస్తామని తెలిపినట్లు సర్పంచ్ వివరించా రు. తమ గ్రామం నుంచి విద్యార్థులను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాజీపేటకు తీసుకెళ్లేందుకు వ్యాన్ పంపిస్తామని, ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హెచ్ఎం తెలిపారని సర్పంచ్ వెల్లడించారు. -
చెరువులో జారిపడి యువతి మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల ): మండలంలోని మల్లారెడ్డిపేటకు చెందిన బంటు జ్యోతి(25) ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందింది. బట్టలు ఉతికేందుకు కుటుంబసభ్యులతో చెరువు వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడింది. స్థానికులు చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. గాయపడిన ఎలక్ట్రీషియన్..ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కట్ట అశోక్(32) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కరెంట్ షాక్తో సోమవారం తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. అశోక్ను హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగానే సోమవారం రాత్రి మరణించినట్లు కటుంబ సభ్యులు తెలిపారు. లైన్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంతోనే అశోక్ మరణించాడని ఆరోపిస్తూ మేడారం గ్రాస్తుస్తులు మంగళవారం ధర్మారంలోని విద్యుత్ సబ్స్టేషన్కు చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వపరంగా పరిహారం అందించడంతోపాటు మరికొంత ఆర్థిక సాయం అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణంశంకరపట్నం: మండలంలోని కేశవపట్నం– మక్త రోడ్డుపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మక్త గ్రామానికి చెందిన నెలవేని రాంచరణ్(18) మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మక్త గ్రామానికి చెందిన నెలవేని కరుణాకర్–రజిత దంపతులుకు కూతురు, కొడుకు రాంచరణ్ ఉన్నారు. రాంచరణ్ సాంఘీక సంక్షేమ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. డిగ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంటానని కేశవపట్నంలోని ఆన్లైన్ సెంటర్కు స్నేహితుడు అంజన్కుమార్తో కలిసి బైక్పై బయల్దేరాడు. మక్త– కేశవపట్నం రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రామచరణ్ అక్కడికక్కడే మరణించగా, అంజన్కుమార్కు గాయాలయ్యాయి. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి 7రోజుల జైలు● రూ.45వేలు జరిమానా విధించిన మేజిస్ట్రేట్ కోల్సిటీ(రామగుండం): మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని గోదావరిఖని ప్రిన్సిపల్ కోర్టు మేజిస్ట్రేల్ వెంకట్ సచిన్ రెడ్డి ఎదుట మంగళవారం హాజరుపరిచారు. విచారణ అనంతరం నలుగురికి మొత్తం రూ.45వేలు జరిమానా విధించారు. ముగ్గురికి రూ.10వేల చొప్పున జరిమానా, మరొకరికి రూ.15వేల జరిమానా విధించారు. మరో వ్యక్తికి ఏడురోజుల జైలు శిక్ష విధించగా కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, హెల్మెట్ పెట్టుకోకపోయినా, ధ్రువపత్రాలు లేకపోయినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. -
రూ.6.04 లక్షలకు ఇసుక వేలం
జమ్మికుంట(హుజూరాబాద్): అక్రమార్కులు మానేరువాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించి మండలంలోని విలాసాగర్ గ్రామంలో డంపులు ఏ ర్పాటు చేసుకోగా, కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం పట్టుకున్న విషయం తెలిసిందే. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలను మంగళవారం ఇన్చార్జి తహసీల్దార్ భాస్కర్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. విలాసాగర్ గ్రామానికి చెందిన 15 మంది వేలంలో పాల్గొనగా ముంజల చక్రపాణి 120 ట్రాక్టర్ టిప్పులకు రూ.6,04,000 పాటతో దక్కించుకున్నారు. ఆర్ఐ శంకర్, సిబ్బంది తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట ఎరువులే భూమికి ప్రాణం
జగిత్యాలఅగ్రికల్చర్: పంటలు అధిక దిగుబడి సాధించాలనే తపనతో రైతులు అవసరమున్నా.. లేకున్నా భూమిలో రసాయనాలు కుమ్మరిస్తున్నారు. తద్వారా భూసారం దెబ్బతినడంతోపాటు సూక్ష్మ, స్థూల పోషక లోపాలు ఏర్పడి చీడపీడల ఉధృతికి కారణమవుతున్నాయి. ఈ క్రమంలో భూమికి సత్తువ కల్పించడంతోపాటు రసాయన ఎరువులు తగ్గించడంలో పచ్చిరొట్ట ఎరువులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రైతులను ప్రోత్సహించేందుకు జనుము, జీలుగ పచ్చిరొట్ట విత్తనాలను ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై అందిస్తోంది. జగిత్యాల జిల్లాకు 12,500 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు రాగా.. 11,674 క్వింటాళ్ల జీలుగ, 827 క్వింటాళ్ల జనుము ఉంది. పచ్చిరొట్ట ఎరువులంటే.. పచ్చిరొట్ట ఎరువులను పంట భూమికి రెండు రకాలుగా అందించవచ్చు. మొదటి పద్ధతిలో.. జనుము, జీలుగ, పిల్లి పెసర, ఉలవ, పెసర, అలసంద, గోరు చిక్కుడు, మినుము, కంది, వేరుశెనగ, సెస్భెనియా, వెంపలి విత్తనాలను పొలంలో వెదజల్లి, అవి పెరిగిన తర్వాత 50శాతం పూత దశలో(45 నుంచి 60 రోజుల సమయంలో) అదే పొలంలో కలియదున్ని, కుళ్లిన తర్వాత ప్రధాన పంట వేసుకోవాలి. రెండో పద్ధతిలో.. వేప, తంగెడు, కానుగ, గ్లైరిసిడియా, సుబాబుల్, గుల్మొహర్, పొంగామియా చెట్ల ఆకులు, కొమ్మలను పొలంలో వేసి కలియదున్నాలి. వరి సాగు చేసే రైతులు తొలకరి వర్షాలు పడగానే పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుంటే పొలం సిద్ధం చేసే సమయానికి పూతకు వస్తుంది. ఆ సమయంలో కలియదున్ని నాట్లు వేసుకోవచ్చు. పండ్ల తోటల రైతులు జనుము, జీలుగ చల్లుకుంటే రసాయన ఎరువులు పెద్దగా వేయాల్సిన అవసరం ఉండదు. జీలుగ చౌడుభూములతో పాటు వరి పండించే భూముల్లో ఎకరాకు 20 కిలోల జీలుగ విత్తనాలను పొలమంతా చల్లుకోవాలి. పెరిగిన జీలుగ పంటను పూత దశలో కలియదున్నడం వల్ల ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఎకరం పచ్చిరొట్టలో 30 నుంచి 32 కిలోల నత్రజని లభిస్తుంది. జీలుగలో 3.5 శాతం నత్రజని, 0.6 శాతం భాస్వరం, 1.2 శాతం పొటాష్ లభిస్తుంది. నీరు నిలిచినా పంట తట్టుకుంటుంది. జనుము అన్ని రకాల పంట భూముల్లో సాగు చేసుకోవచ్చు. పచ్చిరొట్టగా.. పశువుల మేతగానూ ఉపయోగపడుతుంది. ఎకరానికి 9.2 నుంచి 14 కిలోల విత్తనం చల్లుకోవాలి. ఈ పంట ద్వారా ఎకరానికి 5.2 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట వస్తుంది. ఇందులో 2.3 శాతం నత్రజని, 0.5 శాతం భాస్వరం, 1.8 శాతం పోటాష్లు ఉంటాయి. త్వరగా పెరుగుతుంది. నీటి ఎద్దడి, మురుగునీటిని తట్టుకోలేదు. పెసర తేలిక, బరువైన నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఆహారంగా, పచ్చిరొట్ట ఎరువుగా.. పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. చౌడు భూముల్లో సాగుకు పనికి రాదు. ఎకరానికి 12 కిలోల విత్తనం అవసరం. ఎకరానికి 15.2 కిలోల నత్రజనిని అందిస్తుంది. ఎకరాకు అలసంద ద్వారా 4–5 టన్నులు, పిల్లి పెసర ద్వారా 4–6 టన్నుల పచ్చిరొట్ట వస్తుంది. బావులు, గట్ల వెంబడి ఉండే చెట్ల కొమ్మలు, ఆకులను పొలంలో వేసి కలియదున్నితే ఎంతో లాభం. ఉపయోగాలివీ.. పచ్చిరొట్ట పంటల్లో సేంద్రియ పదార్థం ఉంటుంది. దీనివల్ల సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. భూమిని గుల్లపరిచి నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది. పంట భూమిలో వృథాగా ఉండే పోషకాలను ఉపయోగంలోకి తేస్తాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారిస్తుంది. ఈ జాతి పంటలకు వేర్లు లోతుగా ఉండి భూమి లోపలి పొరలను కూడా ఉపయోగంలోకి తేస్తాయి. నులి పురుగుల ఉధృతిని తగ్గిస్తాయి. రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకుంటున్న రైతులు తొలకరిలో జనుము, జీలుగకు అధిక ప్రాధాన్యం వరి సాగు చేసే పొలంలో ఏటా జనుము వేస్తాను. రెండు పంటల సీజన్కు ఉపయోగపడుతుంది. పంటకు వేసే రసాయన ఎరువులు తగ్గిస్తాను. ఖర్చు తగ్గుతుంది. భూమి సారవంతంగా మారి, దిగుబడి పెరుగుతోంది. – స్వామిరెడ్డి, శ్రీరాములపల్లె, గొల్లపల్లి మండలం వరి వంటి ప్రధాన పంటలకు ముందు జనుము, జీలుగ, పప్పుధాన్యాల పంటలు సాగు చేయడం వల్ల భూమికి సత్తువ వస్తుంది. రసాయన ఎరువులు పెద్దగా వేయాల్సిన అవసరం ఉండదు. రైతులు పచ్చిరొట్ట సాగు చేసి కలియదున్నితే చాలా లాభం. – సురేష్, అసోసియేట్ డీన్, వ్యవసాయ కళాశాల, పొలాస -
ఏసీబీ పూర్తయ్యాకే ‘కారుణ్యం’?
గోదావరిఖని: సింగరేణిలో కారుణ్య నియామకాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శ్రీరాంపూర్లో ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై బాధితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న 335 మంది కార్మిక వారసులకు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ఇటీవల జరిగిన సభలో కారుణ్య నియామకపత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం.. మెడికల్ ఇన్వాలిడేషన్ పూర్తయి, శిక్షణ పూర్తిచేసుకున్న మరో 200 మందికిపైనే ఉన్నారు. 16 నెలల క్రితం మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో అప్పటినుంచి వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత ప్రభుత్వం చేపట్టిన కారుణ్య నియామకాలపై ఏసీబీ విచారణ చేపడతున్నామని శాసన మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడంతో ఇక ఇప్పట్లో కారుణ్య నియమకాలు ఉండవనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడు మెడికల్ బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పి ఉన్నఉద్యోగాలు ఊడపీకే ప్రయత్నం చేస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థలో ఇప్పటివరకు సుమారు 17వేల మంది కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందారు. 18 ఏళ్ల క్రితం కారుణ్యం సింగరేణిలో 18ఏళ్ల క్రితం కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం 2018 మార్చి 09న మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల కాగా ఏప్రిల్లో మెడికల్బోర్డు ఏర్పాటు చేశారు. ఎనిమిదేళ్లపాటు రెగ్యులర్గా మెడికల్ బోర్డు కొనసాగింది. గతేడాది మార్చిలో ఈప్రక్రియ నిలిచిపోయింది. చిక్కులన్నీ అధిగమిస్తామని మంత్రులు అయినా, బాధితుల్లో తొలగని అనుమానాలు -
స్పీడ్ పెంచిన ‘టాస్క్ఫోర్స్’
కొత్తపల్లి మండలంలోని రాములపల్లి 50 ట్రాక్టర్ల డంపును, శాంతినగర్లోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ ప్రాంతంలో మరో 30 ట్రాక్టర్లు ఇసుక డంపును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9న కరీంనగర్ మార్కెట్ పరిధిలో కల్తీ కారం పొడి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 50 బస్తాల కారంపొడి, పసుపు, దనియాల పొడిని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఫుడ్సేఫ్టీ అధికారులకు పంపించారు.● అక్రమ దందాలపై ఉక్కుపాదం ● అప్పట్లో ఆరోపణలతో సింహభాగం సిబ్బంది అటాచ్ ● తిరిగి పుంజుకుంటున్న వైనం కరీంనగర్క్రైం: గతంలో అక్రమ వ్యాపారాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కరీంనగర్ టా స్క్ఫోర్స్ విభాగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇసుక అక్రమ రవాణా, రేషన్ బియ్యం అక్రమ తరలింపు, గంజా యి విక్రయాలు తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై వరుస దాడులు నిర్వహించి గుర్తింపు పొందిన ఈ విభాగం, కొంతకాలంగా వివాదాలు, అవినీతి ఆరోపణలతో ప్రతిష్ట దెబ్బతిన్నప్పటికీ తిరిగి చురుకుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆరోపణలతో దెబ్బతిన్న ప్రతిష్ట ఇటీవల కాలంలో టాస్క్ఫోర్స్లో పనిచేసిన కొందరు సిబ్బందిపై అక్రమ వ్యవహారాల ఆరోపణలు రావడంతో విభాగం ప్రతిష్ట మసకబారింది. పరిస్థితి తీవ్రతరమవడంతో ఒకేసారి సిబ్బందిని వివిధ విభాగాలకు అచాచ్ చేసి చర్యలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్రమార్కులకు ముందుగానే దాడుల సమాచారం అందిస్తున్నారనే ఆరోపణ ప్రధానంగా రావడంతో పోలీస్ బాస్ వారిపై చర్యలు చేపట్టారు. రద్దు నుంచి పునరుజ్జీవం దిశగా.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ఫోర్స్ విభాగాన్ని రద్దు చేసిన నేపథ్యంలో, కరీంనగర్లో కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశాలపై చర్చ జరిగింది. అయితే, విభాగాన్ని పూర్తిగా మూసివేయడం కన్నా దానిని ప్రక్షాళన చేసి మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేయాలనే అభిప్రాయం పోలీసు ఉన్నతాధికారుల్లో వ్యక్తం కావడంతో టాస్క్ఫోర్స్కు కొత్త దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ దాడుల జోరు ఇటీవల టాస్క్ఫోర్స్ బృందాలు అక్రమ ఇసుక రవాణా, పేకాట స్థావరాలు, గంజాయి విక్రయాలు, అక్రమ మద్యం, కల్తీ ఆహార పదార్థాల తయారీపై వరుసగా దాడులు నిర్వహిస్తున్నాయి. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న కల్తీ వ్యాపారాలపై చర్యలు తీసుకోవడం ద్వారా మళ్లీ ప్రజల్లో విశ్వాసం సంపాదించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్ఫోర్స్ను కేవలం దాడుల విభాగంగా కాకుండా, నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించే ప్రత్యేక యూనిట్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నతాధికారులు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు అక్రమ వ్యాపారాలకు కేరాఫ్గా ఉన్న ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ దాడులతో పరిస్థితులు మారిన సందర్భాలు ఉన్నాయి. అక్రమ దందాలు చేస్తే టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు చేస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. కరీంనగర్ టాస్క్ఫోర్స్లో అధికారులు, సిబ్బంది ఏసీపీ 1 ఎస్సైలు 2 హెడ్కానిస్టేబుళ్లు 3 కానిస్టేబుళ్లు 7జమ్మికుంట మండలం విలాసాగర్లో సోమవారం టాస్క్ఫోర్స్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో దాడి చేసి 150 ట్రాక్టర్ల ఇసుక డంపులను సీజ్ చేసి జమ్మికుంట పోలీసుస్టేషన్కు అప్పగించారు. -
భీమన్న సేవలో ప్రముఖులు
వేములవాడ: భీమేశ్వరస్వామిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వ ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారు హర్కర వేణుగోపాలరావు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయంలు సోమవారం దర్శించుకున్నారు. అతిథులకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం కావడంతో 20 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈవో రమాదేవి అతిథులకు స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, ఆర్డీవో కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ జయంత్ పాల్గొన్నారు. -
మొహరం ఏర్పాట్లు చేయండి
సిరిసిల్ల: జిల్లాలో మొహరం సందర్భంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పో లీసు అధికారులను కోరారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అయేషా తలత్, జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాస్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖధీర్పాషా పాల్గొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ప్రవేశాలు జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. 1వ తరగతి (నాన్ రెసిడెన్షియల్) ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 109 దరఖాస్తులు రాగా బాలికలకు 33 శాతం రిజర్వేషన్ ప్రకారం 15 సీట్లు, జనరల్ కేటగిరీలో 31 సీట్లను ఎంపిక చేశారు. డీఎస్సీడీవో రవీందర్రెడ్డి, డీఈవో జగన్మోహన్రెడ్డి, గురుకులాల కో–ఆర్డినేటర్ జాస్మిన్ థెరిస్సా, సహాయ సంక్షేమాధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.పేదల సంక్షేమానికి పెద్దపీటసిరిసిల్లటౌన్: ప్రధాని నరేంద్రమోదీ పన్నెండేళ్ల పాలనలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాల సన్నాహక సమావేశాన్ని సిరిసిల్లలో సోమవారం నిర్వహించారు. గోపి మాట్లాడుతూ ఈనెల 20 వరకు వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాల ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, ఆడెపు రవీందర్, రాంప్రసాద్, రాజు, రాజాసింగ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లు నెరవేర్చాలని ఐక్యవేదిక జిల్లాశాఖ ప్రతినిధులు కోరారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన తెలిపి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచిన ఉద్యమకారులను పట్టించుకోవడం లేదన్నారు. ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గరిపెల్లి ప్రభాకర్, కో కన్వీనర్ ఆడెపు రవీందర్, బియ్యంకార్ శ్రీనివాస్, కుసుమ విష్ణు ప్రసాద్, సభ్యులు చిప్ప దేవదాస్, కుసుమ గణేశ్, వెంగళ వెంకటేశం పాల్గొన్నారు. -
తొలి రోజు అంతంతే !
● విద్యార్థుల హాజరుపై అమావాస్య ఎఫెక్ట్ ● పావు వంతే వచ్చిన స్టూడెంట్స్సిరిసిల్లటౌన్: జిల్లాలో పాఠశాలలు సోమవారం పునర్ ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. బడుల ప్రారంభంతో పట్టణంలోని స్టేషనరీ షాపులు, బుక్స్ సెల్లర్ దుకాణాలు కిటకిటలాడాయి. అమావాస్య కావడంతో తక్కువ సంఖ్యలోనే విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 25.16శాతం మాత్రమే హాజరు నమోదైనట్లు జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి తెలిపారు. అంగన్వాడీలో ఒక్కరే.. ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ఒకే విద్యార్థి హాజరయ్యారు. ఇల్లంతకుంటకు చెందిన ఓ మహిళ తన కొడుకు మెరుగు ధీరజ్ను 1వ తరగతిలో చేర్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆగయ్య విద్యార్థిని పాఠశాలలో చేర్చుకున్నారు. కోనరావుపేటలో ముగ్గురే.. కోనరావుపేట: మండలంలోని కనగర్తి ప్రాథమిక పాఠశాలకు ముగ్గురు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరైనా విద్యార్థులు మాత్రం రాలేదు. గర్జనపల్లిలో పూలవర్షంతో స్వాగతం వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని గర్జనపల్లి పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు పూలవర్షంతో స్వాగతం పలికారు. తరగతి గదులను రంగురంగుల బెలూన్లతో అలంకరించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం సెల్ఫీ పాయింట్ వద్ద విద్యార్థులు ఫొటోలు దిగారు. హెచ్ఎంలు కులేరి ప్రేమ్సాగర్, గజన్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ శ్రావణి, సెక్రెటరీ పర్శురామ్, ఉపాధ్యాయులు బలరాం, మంజుల, శ్రీనివాస్, కవిత, రవి, కార్తీక్, శేఖర్ పాల్గొన్నారు. అరకొరే.. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్ల జెడ్పీహెచ్ఎస్లో సుమారు 130 మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. ప్రాథమిక పాఠశాలకి ఒక్కరూ రాలేదు. మొదటి రోజు ఇద్దరే.. వేములవాడరూరల్: మండలంలోని కోనాయపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇద్దరే పిల్లలు హాజరయ్యారు. విద్యార్థులు లేకపోవడంతో ఉపాధ్యాయులు గదిలో కాలక్షేపం చేశారు. వేములవాడఅర్బన్: వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రోజు అంతంతే విద్యార్థులు హాజరయ్యారు. పట్టణంలోని అన్ని పాఠశాలల్లో అదే పరిస్థితి నెలకొంది. -
మురుగుతున్న నిర్లక్ష్యం
మీరు చూస్తున్న ఈ ఫొటో సిరిసిల్ల నడిబొడ్డున గల పాతబస్టాండ్ ప్రాంతం. ఇక్కడ చిన్నపాటి జల్లు పడితే చాలు రోడ్డుపై ఇలా మురుగునీరు ప్రవహిస్తుంది. ఇక్కడ రూ.45లక్షలు వెచ్చించి కట్టించిన డ్రైనేజీ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటంతోనే ఈ సమస్య తలెత్తుతుందని స్థానికులు చెబుతున్నారు.సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో పారిశుధ్య నిర్వహణ పడకేసింది. మోరీల్లోంచి మురుగునీరు రోడ్డుపై పొంగి పొర్లుతోంది. ప్రధాన డ్రెయినేజీలు సిల్టుతో నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయి. సిల్టు తీయడంలో బల్దియా నిర్లిప్తత.. పారిశుధ్యం పనుల్లో నిర్లక్ష్యం వెరసి సిరిసిల్ల స్వచ్ఛకీర్తి మసకబారుతోంది. ప్రధాన రోడ్లు, కూడళ్లలో పారిశుధ్య పనులు పడకేయడం అధికారుల పనితనానికి నిదర్శనం. కనిపించని స్వచ్ఛ బాధ్యత పట్టణ ప్రధాన వీధుల్లోనే స్వచ్ఛత లోపించింది. పారిశుధ్య నిర్వహణపై బల్దియా బాధ్యతను మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడింది. జాతీయస్థాయిలో వంద శాతం పారిశుధ్య నిర్వహణ అవార్డులు సాధించిన పట్టణంలో కొద్ది రోజులుగా శానిటేషన్ లోపాలు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు పాతబస్టాండు, చంద్రంపేట క్రాసింగ్ వద్ద రోడ్డుపై మురుగునీరు నిలుస్తుంది. డ్రెయినేజీ వ్యవస్థను గాడిలో పెట్టడంలో జాప్యం సిరిసిల్ల స్వచ్ఛకీర్తికి మచ్చగా నిలుస్తోంది. విలీన గ్రామాలు చంద్రంపేట, రగుడు, రాజీవ్నగర్, పెద్దబోనాల, చిన్నబోనాల, పెద్దూరు, సర్దాపూర్లలో డ్రెయినేజీలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏళ్లుగా పాతబస్టాండు ప్రాంతం వరదలు, మురుగునీటి ప్రవాహంతో కొట్టుమిట్టాడుతోంది. అధికారులు ఎన్సిసార్లు నిర్మాణాలు చేపట్టినా సమస్య తీరడం లేదు. చిన్న వర్షానికే పెద్ద డ్రెయినేజీ నిండి రోడ్డుపైకి పారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. – మాగంటి భానుకిరణ్, చిరు వ్యాపారి -
హైడ్రాలిక్ బూమర్తో చకచక పనులు
● రాజన్న మహామండపం స్లాబ్ వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చకచక సాగుతున్నాయి. మహామండపం నిర్మాణ పనులను హైడ్రాలిక్ కాంక్రిట్ బూమర్తో చేపడుతున్నారు. 6,080 చదరపు అడుగుల వైశాల్యంతో మూడు స్లాబ్లు రెండు రోజుల్లో పూర్తవుతాయని ఆలయ అధికారులు తెలిపారు. 100 మీటర్ల ఎత్తు వరకు స్లాబ్లు పోసే హైడ్రాలిక్ కాంక్రిట్ బూమర్తో పనులు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం యూ షేప్లో మూడు మహామండపం స్లాబ్లు, తర్వాత మరో స్లాబ్ మొత్తంగా 8వేల పైచిలుకు చదరపు అడుగుల వైశాల్యంతో స్లాబ్ పూర్తవుతుందని వివరించారు. ఆగమశాస్త్రం, శృంగేరి పీఠాధిపతుల సూచనలతో ఆలయ పనులు చేస్తున్నట్లు తెలిపారు. మహామండపంలో అనిమిటి మండపం, బ్రాహ్మణసత్రం, కోటిలింగాలు, దేవ ధర్మగుండం, తూర్పు–పడమర రాజగోపురాల నిర్మాణాలు ఏక కాలంలో జరుగుతున్నాయని వివరించారు. ఈవో రమాదేవి, ఆర్అండ్బీ ఈఈ శాంతయ్య, కాంట్రాక్టర్లు ఉన్నారు. -
లోక్ అదాలత్లో సత్వర న్యాయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజసిరిసిల్లటౌన్: లోక్ అదాలత్లో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ పేర్కొన్నారు. కోర్టు ప్రాంగణంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు అధికారులతో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈనెల 20న జరిగే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసుల పరిష్కారమయ్యేలా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి.పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, జిల్లా అదనపు ఎస్పీ డి.చంద్రయ్య, సీనియర్ సివిల్ జడ్జి, పి.లక్ష్మణాచారి, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్జాదవ్, సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, జూనియర్ సివిల్ జడ్జి మేఘన పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించండయ్యా
సిరిసిల్ల: జిల్లాలోని నలుమూలల నుంచి కలెక్టరేట్కు పలువురు కదిలివచ్చారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రాలను అందించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా రెవెన్యూ అధికారి గొట్టె జయశ్రీ, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటమాధవరావు ప్రజల విజ్ఞాపలు స్వీకరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 205 మంది వివిధ సమస్యలపై దరఖాస్తులు అందించారు. మాది చందుర్తి మండలం జోగాపూర్. నేను కష్టపడి పది ఎకరాల భూమి సంపాదించాను. నా మొదటి భార్య దురదృష్టవశాత్తు మరణించింది. ఆమెకు ఒక్క కొడుకు. బంధువులు మళ్లీ నాకు బలవంతంగా పెళ్లి చేయగా ఆమెకు ఒక్క కూతురు. నా మొదటి భార్య కొడుకు మొత్తం భూమి పట్టా చేయించుకున్నాడు. రెండో భార్య కూతురుకు సగం భూమి ఇవ్వాలంటే ఒప్పుకోకుండా చంపుతానని బెదిరిస్తున్నాడు. సగం భూమి నా బిడ్డకు ఇప్పించండి. – మ్యాకల మల్లయ్య దంపతులు, జోగాపూర్నాది ఇల్లంతకుంట మండలం కందికట్కూర్. నా పేరిట, మా తమ్ముడి పేరిట ఉన్న భూమిని పక్కవాళ్లకు 19 గుంటలు రెవెన్యూ అధికారులు పట్టా చేశారు. కబ్జాలో మేమే ఉన్నా పట్టించుకోలేదు. మా పాస్బుక్కులో తక్కువ భూమిని నమోదు చేశారు. ఎన్ని సార్లు ఇల్లంతకుంట తహసీల్దార్ ఆఫీస్కు వెళ్లినా పట్టించుకోవడం లేదు. – ఎగుర్ల బీరయ్య, కందికట్కూర్మాది వేములవాడ అర్బన్ మండలం చింతలఠాణా ఆర్అండ్ఆర్ కాలనీ. మా కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి జీపీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా సొంత ఖాతాలో వేసుకుని దుర్వినియోగానికి పాల్పడ్డాడు. సుమరు రూ.5 లక్షలు 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకున్నాడు. అతనిపై విచారణ చేపట్టాలి. – పార్వతి మహేశ్, చింతలఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీకోనరావుపేట మండలం మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలను 2025లో అప్పటి కలెక్టర్ సందీప్కుమార్ ఝా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు నీళ్ల సరిపోవడం లేదని పిల్లలు చెప్పగా వెంటనే బోర్లు వేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రెండు బోర్లు వేసి, మోటార్లు పెట్టి నీటి వసతి కల్పించాను. కానీ ఆ బోర్లు, మోటార్ల బిల్లులు ఇప్పటికీ ఇవ్వడం లేదు. బిల్లులు ఇప్పించండి. – మాట్ల అశోక్, మాజీ సర్పంచ్, మరిమడ్లనాది వీర్నపల్లి మండలం సీతారాంనాయక్తండా. మాకు ఇల్లు లేదు. మా ఆయన లింగం వ్యవసాయ కూలీ. మాకు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరు చేశారు. ఇల్లు మంజూరైందని రూ.10లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే బిల్లు ఇవ్వడం లేదు. మూడు సార్లు అధికారులు వచ్చి ఇల్లు కొలతలు తీశారు. కానీ ఒక్క పైసా రాలేదు. ఇంకా ఇల్లు పూర్తి కాలేదు. బిల్లు ఇస్తే ఇల్లు పని పూర్తి అవుతుంది. – భానోత్ అనూష, సీతారాంనాయక్ తండామాది ముస్తాబాద్ మండలం నామాపూర్. మా ఊరిలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లేదు. మా ఊరిలో 22 మంది మత్స్యకార్మికులు ఉన్నారు. మా ఊరి మత్స్యకార్మికుల ఉపాధి కోసం చెరువుల్లో చేపలు వేసేందుకు, పట్టుకునేందుకు వీలుగా సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలి. మా ఊరి చెరువులో వేరే ఊరి వారికి చేపలు పట్టుకునే హక్కు కల్పించొద్దు. – నామాపూర్ వాసులు -
మెరుగైన వైద్యం అందిస్తాం
బోయినపల్లి(చొప్పదండి): క్యాన్సర్తో బాధపడుతున్న మండలంలోని బూర్గుపల్లికి చెందిన తాళ్లపల్లి లతకు ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే సత్యం బాధితురాలి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. రూ.10వేలు ఆర్థికసాయం అందించారు. ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్యాదవ్, ఉపసర్పంచ్ కల్లెపెల్లి చంద్రయ్య, వీసీ వినోద్రెడ్డి, నాయకులు లక్ష్మీరాజం, నగేశ్, ప్రవీణ్, వంశీ ఉన్నారు. సిరిసిల్ల: జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా గొట్టె జయశ్రీ విధుల్లో చేరారు. భువనగిరి యాదాద్రి జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ)గా పనిచేసిన ఆమె ఇటీవల డీఆర్వోగా బదిలీ అయ్యారు. జిల్లాలో డీఆర్వో పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉండగా.. అదనపు కలెక్టర్లు, జిల్లా కలెక్టరే ఇన్చార్జీలుగా ఉన్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో జయశ్రీ డీఆర్వోగా బాధ్యతలు స్వీకరించారు. జయశ్రీ తంగళ్లపల్లికి చెందిన నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే గొట్టె భూపతి కొడుకు, ఇల్లంతకుంట మాజీ జెడ్పీటీసీ గొట్టె సుమన్బాబు సతీమణి. సిరిసిల్ల: బాధితులు ఎవరైనా సరే పోలీసులను ఆశ్రయిస్తే భరోసా కల్పించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. ఎస్పీ ఆఫీస్లో సోమవారం గ్రీవెన్స్ డేకు 24 మంది ఫిర్యాదులు అందించారు. దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి బాధితులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగితే పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. ఫిర్యాదులను పరిష్కరించాలని జిల్లాలోని ఠాణా అధికారులకు ఎస్పీ సూచించారు. సిరిసిల్లటౌన్: ప్రైవేటు బడి బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ కలిగి ఉండాలని జిల్లా రవాణాధికారి దేవునూరి శ్రీనివాస్ సూచించారు. జిల్లా కేంద్రంలో సోమవారం బడి బస్సులను తనిఖీ చేసి మాట్లాడారు. ఫిట్నెస్ లేకుండా బస్సులను తింపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎంవీఐ వంశీధర్, ఏఎంవీఐ పృథ్వీరాజ్వర్మ, కానిస్టేబుల్ రమ్య, ప్రశాంత్, హోమ్గార్డు ఎల్లయ్య పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు ఉన్నాయని, తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి కోరారు. మండలంలోని గాలిపెల్లి, ఇల్లంతకుంట పాఠశాలలను పరిశీలించారు. డీఈవో మాట్లాడుతూ జిల్లాలో 65 వరకు పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. నూతనంగా ఏర్పాటైన ప్రీప్రైమరీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులకు ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పురుషులు కూడా అర్హులేనని తెలిపారు. వంట సామాగ్రిని పరిశీలించి, ఎర్రపప్పు వాడొద్దని సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిపై కాకుండా గ్యాస్ సిలిండర్పై వండాలన్నారు. హెచ్ఎంలు పావని, ఆగయ్య, ఎంఈవో శ్రీనివాస్గౌడ్, అంగన్వాడీ టీచర్ ఒగ్గు విజయ పాల్గొన్నారు. -
పాఠశాల పిలుస్తోంది..
సిరిసిల్లటౌన్: రెండు నెలల వేసవి సెలవుల అనంతరం సోమవారం బడిగంట మోగింది. ఇన్నాళ్లు ఆటపాటలతో గడిపిన చిన్నారులు ఇక పుస్తకాలు సర్దుకున్నారు. యూనిఫామ్స్, షూస్, వాటర్బాటిల్స్ సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ అందించనుండగా..ప్రైవేటు విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే కొ నుగోలు చేశారు. అమ్మ ఆదర్శ కమిటీలతో ప్రభుత్వ బడుల్లో వసతులు దరిచేరాయి. పాఠాలకు సిద్ధం ప్రభుత్వ బడులకు ఇప్పటికే పుస్తకాలు వచ్చాయి. జిల్లాలో గతేడాది ప్రభుత్వ బడుల్లో 39,043 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈఏడాది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 2,59,720 పుస్తకాలు ప్రభుత్వం పంపించింది. జిల్లాలో ప్రైమరీ స్కూళ్లు 314, యూపీఎస్ 38, హైస్కూల్స్ 111, కేజీబీవీ 13, మోడల్ స్కూల్స్ 7 మొత్తం 483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇక 13 మండలాలకు ఎంఈవోలు 13 మంది ఇన్చార్జీలు(ఎఫ్ఏసీ)గా పనిచేస్తున్నారు. 483 హెచ్ఎంలు, 13 కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, ఏడుగురు మోడల్స్కూల్ ప్రిన్సిపాల్స్ పనిచేసున్నారు. అన్ని పాఠశాలల్లో 39,043 మంది విద్యార్థులకు 2,282 టీచింగ్, 149 నాన్టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. 131 హైస్కూళ్లలో డిజిటల్ పాఠాల బోధనకు ఏర్పాట్లు చేశారు. ఆరు నుంచి తొమ్మిది తరగతుల వారికి ఖాన్ అకాడమీ ద్యారా ప్రభుత్వం ఫౌండేషన్ డిజిటల్ కోర్సు అందిస్తున్నారు. కేజీబీ వీల్లో ఫిజిక్స్వాలా యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. జిల్లా సమాచారం ప్రభుత్వ బడులు 483 గతేడాది విద్యార్థులు 39,043 గురుకులాలు 20 కేంద్రీయ విద్యాలయం 01 మదర్సా 01 కేజీబీవీలు 13 మోడల్స్కూల్స్ 07 ప్రైవేటు స్కూల్స్ 130 బడిబాట ప్రవేశాలు 2,870 -
పెద్దలింగాపూర్లో తాళం
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పెద్దలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళం వేసి ఉంది. స్థానికులను ఆరా తీయగా ఆదివారం తీయరని తెలిపారు. ఇక్కడ ఒక డాక్టర్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు. పెద్దలింగాపూర్తోపాటు రామాజీపేట, చిక్కుడువానిపల్లి, దాచారం, సిరికొండ, తెనుగువారిపల్లి గ్రామాల నుంచి రోగులు వస్తుంటారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో కాంట్రాక్టు ఏఎన్ఎం ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఆదివారం హాఫ్ డే వరకే తెరిచి ఉంటుందని, డాక్టర్ రారని తెలిసింది. జవారిపేట సబ్ హెల్త్సెంటర్లో కాంట్రాక్టు ఏఎన్ఎం సుమతి ఒక్కరే విధుల్లో ఉన్నారు. -
ప్రభుత్వ వైద్యం..పేదలకు దూరం
● ఆదివారం వైద్యులకు సెలవు ● ఫోన్లోనే సూచనలు ఇస్తున్న డాక్టర్లు ● ఏఎన్ఎంలతోనే సేవలు ● వసతుల లేమితో ఇబ్బందిసిరిసిల్లటౌన్: జిల్లాలో సర్కారు వైద్యం పేదలకు అందనంత దూరంలో ఉంది. అర్బన్హెల్త్ సెంటర్లు, పీహెచ్సీలు, బస్తీ దవాఖానాలలో పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. పేదలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందించాలన్న సర్కారు లక్ష్యం సిబ్బంది నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. మౌలిక వసతుల లేమి, సిబ్బంది, మందుల కొరత రోగుల పాలిట శాపంగా మారాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆదివారం అందుతున్న వైద్యసేవలపై ‘సాక్షి’ విజిట్లో పలు విషయాలు వెలుగుచూశాయి. కొన్ని ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, సహాయక సిబ్బంది గైర్హాజరయ్యారు. కొన్నింటికి తాళం వేసి ఉండగా.. మరికొన్నింటిలో ఒకరిద్దరు మాత్రమే విధులు నిర్వర్తించారు. కొన్నింటిలో సహాయక వైద్యసిబ్బంది కూడా రాకపోవడంతో ఆఫీస్ సబార్డినేట్లు కేంద్రాలను మూసివేసి వెళ్లిపోయారు.మీరు చూస్తున్న ఈ ఫొటో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్నగర్ అర్బన్హెల్త్ సెంటర్. ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు తెరవాల్సిన దవాఖానా ఆదివారం ఉదయం 10 గంటలు దాటినా తాళం తీయలేదు. అప్పటికే పలువురు రోగులు వచ్చి తాళం వేసి ఉండడంతో తిరిగివెళ్లిపోయారు. సిరిసిల్లలోని రెండు అర్బన్హెల్త్ సెంటర్లలో నిత్యం 200 మంది రోగులు వస్తుంటారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. జిల్లాలో ఆరోగ్య సేవల ప్రొఫైల్అర్బన్హెల్త్ సెంటర్లు 02 బస్తీ దవాఖానాలు 02 పీహెచ్సీలు 13 యూపీఎస్సీలు 03 ఏరియా ఆస్పత్రి 01 జనరల్ ఆస్పత్రి 01 -
ఆదివారం ఆస్పత్రికి సెలవు
కోనరావుపేట(వేములవాడ): మండల కేంద్రంలోని పీహెచ్సీలో వైద్యులు రాలేదు. ఫోన్లోనే వైద్యసేవలు అందిస్తున్నారు. సిబ్బంది వంతులవారీగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఏఎన్ఎం సునంద ఒక్కరే హాజరయ్యారు. నిమ్మపల్లికి చెందిన రాపెల్లి సాయికుమార్ కోతి కరిచిందని, మరిమడ్లకు చెందిన కడకుంట్ల లక్ష్మి కుక్క కరిచిందని ఆస్పత్రికి రాగా వైధ్యాధికారి అందుబాటులో లేకపోవడంతో ఏఎన్ఎం డాక్టర్కు ఫోన్ చేసి ఆయన సూచనల మేరకు వైద్యం చేసింది. వీరితోపాటు మరో 9 మందిరాగా ఫోన్లో డాక్టర్ సూచనలతో మందులు అందజేశారు. ప్రతీ ఆదివారం వైద్యులు అందుబాటులో ఉండడం లేదని రోగులు తెలిపారు. -
రాజన్న ఆలయానికి రూ.లక్ష విరాళం
వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం భోగంపాడుకు చెందిన కల్లం రాధిక– రాజారెడ్డి దంపతులు రూ.లక్ష విరాళాన్ని ఆదివారం ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాసశర్మకు అందజేశారు. ఆలయ వేదపండితులు ఆశీర్వచనాలు, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందించారు. సాహితీవేత్తల సేవలు అద్వితీయం సిరిసిల్లటౌన్: ప్రజల్లో సామాజిక చైతన్యం రగిలించడంలో సాహితీవేత్తల సేవలు అద్వితీయమని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి కొని యాడారు. గాంధీనగర్ హనుమాన్ ఆలయంలో ఆదివారం ‘ఆదర్శ మార్గదర్శకులు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పుస్తక రచయిత జనపాల శంకరయ్యను అభినందించారు. కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ, జూకంటి జగన్నాథం, సబ్బని లక్ష్మీనారాయణ, కరుణాల భద్రాచలం, పోరండ్ల మురళీధర్, నీరోజు రమేశ్, చేపూరు బుచ్చయ్య, దొంత దేవదాసు, కోడం నారాయణ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించండి వేములవాడ: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటినా మున్సిపల్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించడం లేదని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు గుర్రం అశోక్ అన్నారు. వేములవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అధికా రంలోకి వస్తే మున్సిపల్ కార్మికులకు రూ.26వేలు ఇస్తామని, పర్మినెంట్ చేస్తామని చెప్పి పట్టించుకోవడంలేదన్నారు. ఈనెల 4 నుంచి 15 వరకు ముఖ్యమంత్రికి రాస్తున్న లేఖలపై కార్మికులందరూ సంతకాలు చేయాలని కోరారు. యూనియన్ అధ్యక్షు డు సరిపెల్లి నరేశ్, ప్రధాన కార్యదర్శి దొబ్బల లచ్చయ్య, కోశాధికారి సావనపల్లి శ్రీనివాస్, నాయకులు సత్తయ్య, రమేశ్ పాల్గొన్నారు. -
బడి బస్.. ఫిట్నెస్ లెస్
సిరిసిల్ల: జిల్లాలోని స్కూల్ బస్సులు ఫిట్నెస్గా లేవు. ఆదివారంతో పాఠశాలలకు వేసవి సెలవులు ముగిసి సోమవారం నుంచి పునర్ ప్రారంభమవుతున్నాయి. ఈనేపథ్యంలో కండీషన్ లేని బస్సుల్లోనే విద్యార్థులను తరలించేందుకు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. అయితే ర వాణాశాఖ నుంచి ఫిట్నెట్ సర్టిఫికెట్ పొందకుండా.. రోడ్డు ఎక్కితే బస్సులను సీజ్ చేస్తామని రవా ణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. స్కూళ్లు తెరుచుకుంటున్న సందర్భంగా జిల్లాలో బడి బస్సుల భద్రతపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అడ్మిషన్లపైనే ఆసక్తి జిల్లాలో ప్రైవేటు స్కూళ్ల యజమానులు పిల్లలను బడికి తరలించేందుకు పాత బస్సులను, కాలం చెల్లిన వ్యాన్లను కొనుగోలు చేస్తున్నారు. యజమానులకు విద్యార్థులను బడిలో చేర్చుకోవడంపై ఉన్న ఆసక్తి బస్సు కండీషన్పై ఉండడం లేదు. జిల్లా వ్యాప్తంగా 173 స్కూల్ బస్సులు ఉండగా 138 వాహనాలను ఫిట్నెస్ పరీక్షలకు తీసుకొచ్చారు. ఇంకా 35 బస్సులు ఫిట్నెస్ పరీక్షలకు దూరంగా ఉన్నాయి. ఆ బస్సులను గుట్టుచప్పుడు కాకుండా పిల్లలను తరలించేందు సిద్ధమైనట్లు ఆరోపణలు న్నాయి. గతంలో ముస్తాబాద్లో బడి బస్సు ప్రమాదంలో ఓ బాబు మరణించగా, వేములవాడ పట్టణ సమీపంలోనూ ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. జిల్లాలో బడి బస్ ప్రమాదాలన్నీ కండీషన్ లేని బస్సులతోనే జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బస్సులు రిజిస్ట్రేషన్ చేసిన 15 ఏళ్ల వరకే రోడ్డుపై తిప్పాలన్న నిబంధనలు పాటించడం లేదు. పదిహేనేళ్లు దాటిన బస్సులు జిల్లాలో పది వరకు ఉన్నట్లు రవాణాశాఖ అధి కారుల అంచనా. ఇలాంటి ఐదు బస్సులను ఇప్పటికే గుర్తించారు. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ స్కూల్ బస్ ఫిట్నెస్ కోసం రవాణాశాఖ సైట్లో స్లాట్బుకింగ్ చేసుకోవాలి. పెద్ద వాహనాలకు రూ.1,100, చిన్న బస్సులకు(సీట్ల ఆధారంగా) రూ.800 ఆన్లైన్లో చెల్లించాలి. పాత వాహనాలకు గ్రీన్ట్యాక్స్ అదనంగా చెల్లించాలి. స్లాట్ బుకింగ్ రోజు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని రవా ణాశాఖ మైదానంలో అధికారులు వాహనం కండీషన్ను తనిఖీ చేస్తారు. బస్సులో ప్రథమ చికిత్స బాక్స్, ఫైర్ ఎగ్జాస్టర్, ౖఅత్యవసర ద్వారం, ఫుట్బోర్డు, లైట్లు, రేడియం, ఇంజిన్ కండీషన్, బ్రేకులు, హ్యాండ్బ్రేక్, హారన్, స్టీరింగ్ బాగుండాలి. వీటిని పరిశీలించిన తరువాతే రవాణాశాఖ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ను ఆన్లైన్లో జారీ చేస్తారు. డ్రైవర్కు శిక్షణ తప్పనిసరి జిల్లాలో బడి బస్సులు నడిపే డ్రైవర్లు కనీసం మూడు రోజులపాటు మండెపల్లిలోని టీఐడీఈఎస్ లో శిక్షణ పొందాలి. ఈ శిక్షణ సర్టిఫికెట్ పొందిన డ్రైవర్లనే నియమించుకోవాలనే నిబంధనలు ఉన్నా యి. కానీ కొన్ని విద్యాసంస్థల నిర్వాహకులు ఈ నిబంధనలు పాటించడం లేదు. ఫిట్నెస్ సమయంలో సర్టిఫికెట్ ఉన్న డ్రైవర్ను చూపుతూ.. ఇతరులను నియమించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
ఎన్నికలప్పుడే రాజకీయాలు
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ వేములవాడరూరల్: ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలి.. అభివృద్ధిలో పార్టీలకతీతంగా కలిసి రా వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. వేములవాడరూరల్ మండలం బొల్లారంలో విప్ ఆది శ్రీనివాస్తో కలిసి బొల్లారం–సిరికొండ రోడ్డు విస్తరణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నందునే కేంద్రం నుంచి నిధులొస్తున్నాయన్నారు. ఏడేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.22వేల కోట్లు తీసుకొచ్చానని తెలిపారు. ఈరోడ్డు విస్తరణకు రూ.23 కోట్లు మంజూరయ్యాయని, ఆరు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో సైనిక్స్కూల్, నవోదయ స్కూళ్లకు కేంద్రం నుంచి నిధులు వచ్చేలా కృషి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ని కోరారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, బీజేపీ నేతలు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్రావు, గోపాడి సురేందర్రావు, ఎర్రం మహేశ్, అల్లాడి రమేశ్, రాపెల్లి శ్రీధర్ ఉన్నారు. -
చందుర్తిలో ఖాళీ కుర్చీలే
చందుర్తి(వేములవాడ): చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9.10 గంటలకు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. 24 గంటలు సేవలందించాల్సిన ఆస్పత్రిలో సిబ్బంది కనిపించడం లేదు. కొద్ది రోజులు సమయపాలన పాటించడం లేదని స్థానికులు ఆరోపించారు. పీహెచ్సీకి ‘సాక్షి’ వెళ్లి వచ్చిందన్న విషయం తెలుసుకున్న సిబ్బంది ఉదయం 10.20 గంటలకు చేరుకున్నారు. వైద్యాధికారి వేణుమాధవ్ను వివరణ కోరగా ఆదివారం అత్యవసర కేసులు ఉన్నాయని సిబ్బంది ఫోన్ చేస్తేనే ఆస్పత్రికి వస్తామని తెలిపారు. లేకుంటే ఆదివారం రావాల్సిన అవసరం లేదన్నారు. ఉదయం 9.10 గంటలకు సిబ్బంది ఎవరూ లేరనగా.. షిప్టింగ్ సమయంలో వెళ్లారని, అందుకే కనిపించక పోవచ్చన్నారు. -
‘మా ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు’
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: ప్రజా ప్రభుత్వం ఫస్ట్ హాఫ్ ఫెయిలైందంటూ కేటీఆర్ మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలో ఆదివారం నిర్వహించిన ఇందిరమ్మ కమిటీల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఫెయిలైనందునే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లకు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఫస్ట్ హాఫ్లో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యిందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇళ్లు అందజేయాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. వైఎస్ హయాంలోనే ఎల్లంపల్లి నిర్మాణం వేములవాడరూరల్: ఎల్లంపల్లి ప్రాజెక్టును వైఎస్సార్ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా మొదటి ఆరు నెలల్లోనే విఫలమైందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు ఏ పార్టీ నుంచి పోటీ ఉండబోదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ హయాంలోనే వరద కాలువ వచ్చిందని, అప్పుడు కేటీఆర్ రాజకీయాల్లోకి కూడా రాలేదన్నారు. 14 ఏళ్ల క్రితమే ఎస్సారెస్పీ నుంచి నీరు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వకుళాభరణం శ్రీని వాస్, ఆత్మ కమిటీ సభ్యులు శ్యామల, గోవర్ధన్, ఎల్లాగౌడ్, రవి, రాంరెడ్డి, ఫిరోజ్పాషా ఉన్నారు. -
చీపురు పట్టి ఊడ్చి... పైపుతో నీళ్లు కొట్టి
సిరిసిల్ల: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ శనివారం ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యకర్తగా మారారు. ప్రధాని నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్లో ‘స్వచ్ఛ పాఠశాల’ పేరుతో తరగతిగదులను శుభ్రం చేశారు. చీపురు పట్టి తరగతిగదులను ఊడ్చారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘స్వచ్ఛ పాఠశాల’ పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని పాఠశాలలను పరిశుభ్రం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థులకు సైకిళ్లు ఇస్తా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చించాలని కోరుతూ రేపు గ్రామాలు, మండలాల వారీగా ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు కేంద్రం మంత్రి సంజయ్ తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులకు ఈసారి కూడా సైకిళ్లు అందించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే వారి పరీక్ష ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కుసుమ రామయ్య స్కూల్లోని ఎన్సీసీ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మంత్రి ఫొటోలు దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్రెడ్డి, పార్టీ నాయకులు బర్కం లక్ష్మి, నవీన్యాదవ్, అన్నల్దాస్ వేణు తదితరులు పాల్గొన్నారు. -
రామాలయంలో జిల్లా జడ్జి
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలకేంద్రంలోని సీతారామస్వామి ఆలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ శనివారం సందర్శించారు. సిరిసిల్ల రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ ఉన్నారు. ఆలయ ప్రాముఖ్యాన్ని తెలుసుకుని, ప్రత్యేక పూజలు చేశారు. సిరిసిల్ల: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి పేర్కొన్నారు. పట్టణ శివారులోని రగుడు వద్ద ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదేశాలతో శనివారం తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ సరైన పత్రాలు లేని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నంబర్ ప్లేట్లు గల వాహనాలను సీజ్ చేయాలని విధుల్లో ఉన్న సిబ్బందికి సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటుబెల్ట్ వినియోగించాలని సూచించారు. ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. బోయినపల్లి(చొప్పదండి): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు గసికంటి శ్రీనివాస్ కోరారు. మండల కేంద్రంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. 2028 ఆగస్టు 31లోపు ఇన్సర్వీస్ టీచర్స్ టెట్ క్వాలిఫై అయ్యేందుకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చిందని, రాష్ట్రంలో 30 వేల మంది టీచర్లు టెట్ పాస్ కావాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు లెంకల జయకృష్ణారెడ్డి, ఒడ్నాల జగన్మోహన్, కటకం శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్, గోశికొండ శ్రీనివాస్, కనుకుంట్ల మధు, బాలసంకుల ప్రవీణ్, అరిశేనపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సిరిసిల్లటౌన్: బీడీ పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీ.వై.నగర్లోని అమృత్లాల్ శుక్లా కార్మికభవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీడీ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సెస్ వెల్ఫేర్ బోర్డును కేంద్రం రద్దు చేసిందన్నారు. బీడీ కార్మికులకు రూ.4,016 జీవనభృతి అమలు చేయాలని, రిటర్మెంట్ పెన్షన్ను నెలకు రూ.6వేలు చెల్లించాలని కోరుతూ జూలై 29న కలెక్టరేట్ల ముందు ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేశ్చంద్ర, నాయకులు మూషం రమేశ్, సూరం పద్మ, దాసరి రూప, జిందం కమలాకర్, బోనాల లక్ష్మి, గురజాల మమత పాల్గొన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఏడుగురు విద్యార్థినులు ‘అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్’ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. ఏటా రూ.30 వేలు చొప్పున మూడేళ్లపాటు ఉపకారవేతనం అందనుంది. కళాశాల ప్రిన్సిపాల్ జి.జయ మాట్లాడుతూ ఇప్పటికే బీఎస్సీ లైఫ్ సైన్సెస్ నుంచి జి.వైష్ణవి రూ.30వేలు, ఎం.సంగీత, ఎం.కావేరి, ఎం.శ్రావణ్య రూ.15వేలు, బీఎస్సీ ఎంపీసీఎస్ నుంచి బి.ఆర్తి, కె.సానియా రూ.15వేలు, బీఏ విద్యార్థిని బి.స్వప్న రూ.15వేల స్కాలర్షిప్ అందుకున్నారని తెలిపారు. -
జీవన్రెడ్డి వ్యాఖ్యలతో వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తుంది
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: వరదకాలువ కేసీఆర్ ఆలోచనగా జీవన్రెడ్డి చెప్పడంపై వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వే ములవాడలో కేటీఆర్, జీవన్రెడ్డి మాట్లాడిన తీరుపై విప్ ఆది శ్రీనివాస్ శనివారం కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్లో చేరిన జీవన్రెడ్డి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతోనే వరదకాలువ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలను ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘ఎస్ఐఆర్’ పేరుతో నిర్వహించిన సభను బీఆర్ఎస్ నాయకులు అబద్ధాల ప్రచార వేదికగా మార్చారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తాను రాసిచ్చిన బాండ్ పేపర్పై ఉన్న హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ(ఎన్డీఎస్ఏ) సూచనల మేరకే కాళేశ్వరం మరమ్మతుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజన్న ఆలయ అభివృద్ధి, పట్టణంలో రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం జరుగుతున్నాయని వివరించారు. బీఆర్ఎస్ సభలో చేసిన అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
వంటింటిపై గుదిబండ
నెత్తిన కట్టెల మోపులతో వస్తున్న ఈ మహిళలు లక్ష్మి, మణెమ్మ. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్నగర్కు చెందిన వీరికి ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)లో ఉచితంగానే సిలిండర్ కనెక్షన్ ఇచ్చారు. కానీ సిలిండర్ రీఫిల్లింగ్ ధర రూ.1,042.50కు చేరడంతో గ్యాస్తో వంటలు చేయలేక.. ఇలా పొయ్యిల కట్టెలను తెచ్చుకుంటున్నారు. సిలిండర్ బండ మూలన పడేసి కట్టెల పొయ్యిపైనే వంటలు చేసుకుంటున్నారు. ఇలా ఒక్కరు.. ఇద్దరు కాదు.. జిల్లా వ్యాప్తంగా వందలాది కుటుంబాలకు చెందిన పేదలు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో రీఫిల్లింగ్ చేయించకుండా.. స్టౌవ్ను పక్కన పెట్టి.. కట్టెల పొయ్యి ఊదుతున్నారు. సిరిసిల్ల: గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతుండడం మధ్యతరగతి జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత మూడు నెలల్లో ఒక్క సిలిండర్పై రూ.89 పెరగడం ఆందోళనను కల్గిస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా జిల్లాలో దిగువ మధ్యతరగతి వారు కట్టెలపొయ్యి, కరెంట్ పొయ్యిలపై వంట చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మూడు నెలల్లో రెండు సార్లు గత మార్చిలో 14.2 కిలోల సిలిండర్ రీఫిల్లింగ్ ధర రూ.923.50 ఉంది. అదే నెలలో హఠాత్తుగా ఒక్క సిలిండర్పై రూ.60 పెంచడంతో రూ.983.50కు చేరింది. తాజాగా మరో రూ.29 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1,012.50కు చేరింది. సిలిండర్ డెలివరీ బాయ్ అదనంగా మరో రూ.30 తీసుకుంటుండడంతో అది కాస్త రూ.1042.50కు చేరింది. జిల్లాలో కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో హోటళ్ల నిర్వాహకులు డీజిల్తో నడిచే ప్రత్యేక పొయ్యిలను వినియోగిస్తున్నారు. సబ్సిడీ సిలిండర్లు పక్కదారి వంట గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం నేరం. అయినా చాలా మంది గృహ అవసరాలకు సిలిండర్లను తెప్పించుకుంటూ వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. మార్కెట్లో కమర్షియల్ సిలిండర్లు లభించకపోవడంతో సబ్సిడీ సిలిండర్లను గుట్టుగా వినియోగిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,200 ఉండగా.. సబ్సిడీ సిలిండర్లను వినియోగిస్తూ వ్యాపారాలు చేస్తున్నారు. జిల్లాలో పౌరసరఫరాల అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించి 34 సిలిండర్లను పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినా సబ్సిడీ సిలిండర్ల వినియోగం తగ్గడం లేదు. మరోవైపు ఆన్లైన్లో సిలిండర్లను బుక్ చేసుకోడానికి గతంలో మాదిరిగా లేదు. ఒక్కసారి బుక్ చేసుకుంటే 45 రోజుల వరకు మళ్లీ సిలిండర్ రీఫిల్లింగ్ బుక్ కావడం లేదు. జిల్లాలో 41,717 మంది గృహ వినియోగదారులు కేవైసీ బయోమెట్రిక్ను ఆధార్తో అనుసంధానం చేయలేదు. ఫలితంగా ఈ నెలాఖరిలోగా కేవైసీ ఇవ్వకుంటే సిలిండర్ల రీఫిల్లింగ్ నిలిచిపోనుంది. ఉజ్వల యోజన పథకంలోని 3,075 మంది లబ్ధిదారులు కేవైసీ ఇవ్వలేదు. ఏటా రూ.5.15 కోట్ల భారం పెరిగిన ధరలతో జిల్లాలోని వినియోగదారులు ఏటా రూ.5.15 భారం మోయాల్సి వస్తుంది. మార్చిలో రూ.60, జూన్లో రూ.29 పెంపుతో ఏకంగా ఒక్కో సిలిండర్పై రూ.89 భారంగా పడుతుంది. నెలకు రూ.42.94 లక్షలు, ఏడాదికి రూ.5.15 కోట్ల భారమవుతుంది. ఇది సామాన్యులు, మధ్యతరగతి వారికి పెనుభారంగా మారింది. జిల్లాలో 90 శాతం వంటలకు గ్యాస్పైనే ఆధారపడ్డారు. -
గులాబీ సైనికులకు గుర్తింపుకార్డులు
సిరిసిల్ల: బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు పొందిన గులాబీ సైనికులకు మంచి డిజిటల్ గుర్తింపుకార్డులు ఇస్తామని, రేపు అధికారంలోకి రాగానే.. ఆ కార్డుకు ఉండే ఖదరే వేరుగా ఉంటదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో శనివారం బూత్ లెవల్ ఏజెంట్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) పేరుతో ప్రభుత్వం ఓటర్ల జాబితాను జల్లెడ పడుతుందన్నారు. అర్హులైన ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బూత్ లెవల్ ఏజెంట్లపై ఉందన్నారు. చనిపోయిన వారి పేర్లు, రెండు చోట్ల ఓట్లు ఉంటే ఒక్క చోట తొలగించాలన్నారు. కొత్తగా 18 ఏళ్ల ఓటర్లను నమోదు చేయించాలన్నారు. ఎస్ఐఆర్పై పవర్ పాయింట్ ప్రదర్శన ఇస్తూ... సమగ్ర వివరాలను వివరించిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలను డిజిటల్ విధానంలో ఆన్లైన్ చేపట్టాలన్నారు. కార్యకర్తల సంక్షేమమే మా ప్రాధాన్యం అధికారం పోయినా కేసీఆర్పై మమకారం పోలేదని, ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికారంలోకి రాగానే కార్యకర్తల సంక్షేమమే మొదటి ప్రాధాన్యమని పేర్కొన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనదని స్పష్టం చేశారు. బూత్ లెవల్ ఏజెంట్లు ఎవరికి వారి ‘నా బూత్ నా బాధ్యత’ అనుకోవాలని, నా బూత్లో నేను ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకున్నా.. కేసీఆర్ సీఎం అయినట్లే అనే ధీమాతో పనిచేయాలన్నారు. ఎవరికి వారు క్షేత్రస్థాయిలో కథానాయకులు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందన్నారు. జూన్ 25 తరువాత మళ్లీ మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సభ్యత్వాల నమోదు మొక్కుబడిగా కాకుండా డిజిటల్ విధానంలో శాసీ్త్రయంగా ఉండాలన్నారు. ఎస్ఐఆర్ ఓటర్ల సవరణలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. మాజీ మంత్రి జీవన్రెడ్డి, పార్టీ నాయకులు కొండూరి రవీందర్రావు, తుల ఉమా, తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, న్యాలకొండ అరుణ, చీటి నర్సింగరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్లు, మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
● గంభీరావుపేటలో 91 మిల్లీమీటర్లు ● కందికట్కూర్లో 0.5 మి.మీ. వర్షంసిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ముసురువర్షం కురి సింది. గంభీరావుపేట మండలంలో అత్యధికంగా 91 మిల్లీమీటర్లు, అత్యల్పంగా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లో 0.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చల్లని గాలులతో కూడిన వర్షం జల్లులు కురిశాయి. రుద్రంగిలో 45.3 మిల్లీమీటర్లు, నామాపూర్లో 41.5, వీర్నపల్లిలో 33.5, గజసింగవరంలో 25.0, నిజామాబాద్లో 23.0, ఎల్లారెడ్డిపేటలో 22.3, మానాలలో 19.0, వట్టెంలలో 18.3, బోయినపల్లిలో 15.5, మర్తనపేటలో 13.5, మర్రిగడ్డలో 13.0, నాంపల్లిలో 12.8, ఇల్లంతకుంటలో 11.5, ఆవునూర్లో 8.8, కలెక్టరేట్ వద్ద 7.5, మల్లారంలో 6.0, పెద్దలింగాపూర్లో 3.8, నేరెళ్లలో 2.5, పెద్దూరులో 1.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. నేల కూలిన వృక్షాలు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లో ఈదురుగాలులతో మహావృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఓ ఇంటిపై విద్యుత్ స్తంభం పడడంతో పాక్షికంగా దెబ్బతింది. మండలంలో శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రాచర్లబొప్పాపూర్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మండలకేంద్రంతోపాటు నారాయణపూర్, బండలింగంపల్లి, రాచర్లబొప్పాపూర్, గొల్లపల్లి, పదిర, హరిదాస్నగర్లలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుత్సరఫరా నిలిచిపోయింది. బొప్పా పూర్లో జంగం రాజు ఇల్లు కొంత భాగం కూలింది. గాలివాన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ గీతాంజలి కోరారు. గంభీరావుపేట మండలంలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి రోడ్ల వెంబడి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. మండలకేంద్రంతోపాటు నర్మాల, లింగన్నపేట, ముస్తఫానగర్గ్రామాల్లో వర్షం కురిసింది. ఎన్పీడీసీఎల్ సీఈ వేణుగోపాల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్వహణ పనులు చేశారు.బొప్పాపూర్లో ధ్వంసమైన ఇల్లుబొప్పాపూర్లో విరిగిపడ్డ వృక్షం -
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ చందుర్తి(వేములవాడ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లె అనుబంధ గ్రామం గొల్లపల్లిలో రెండేళ్ల క్రితం మూతపడిన ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ శుక్రవారం పునర్ ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. కిష్టంపేటలో పూర్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల గరించి తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. సర్పంచ్ బొజ్జ మల్లేశం, మండల ప్రత్యేకాధికారి రవీందర్రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ భూపతి, ఎంపీడీవో రాధ, ఎంఈవో వినయ్కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ శంకరమ్మ పాల్గొన్నారు. నేడు సిరిసిల్లకు కేటీఆర్సిరిసిల్లటౌన్: జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పర్యటిస్తున్నారు. తెలంగాణ భవన్ వర్గీయులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావును పరామర్శిస్తారు. 10.30 గంటలకు వేములవాడలోని మహారాజ ఫంక్షన్హాలులో బీఆర్ఎస్ నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల తెలంగాణ భవన్లో నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. -
నేడు కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన
సిరిసిల్లటౌన్: కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ శనివారం సిరిసిల్లలో పర్యటించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కుసుమ రామయ్య స్కూల్లో నిర్వహించే ‘మన బడి – మన బాధ్యత’(స్వచ్ఛ పాఠశాల) కార్యక్రమానికి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలివేములవాడ: రానున్న వర్షాకాలం నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేయాలని రాజన్న ఆలయ ఈవో రమాదేవి సూచించారు. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయంతోపాటు పరిసరాలు, అతిథిగృహాలను పరిశుభ్రంగా ఉంచారని శానిటేషన్ సిబ్బందిని అభినందించారు. శుక్రవారం అధికారులు, శానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవో మాట్లాడుతూ నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమలు, క్రిమికీటకాల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు. శానిటేషన్ సిబ్బందికి ప్రతీ నెల నాలుగు సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. డీఈవో భాస్కర్శర్మ, ఏఈవో అశోక్, పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ, పూజిత పాల్గొన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని నామాపూర్లోని పల్లగుట్టను పరిరక్షించాలని కోరుతూ బీజేపీ మండలాధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్ శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ముస్తాబాద్ మేజర్ పంచాయతీ కార్యాలయం దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంజాగౌడ్ మాట్లాడుతూ ముస్తాబాద్ మండలానికి ప్రాణాధారమైన, వన్యప్రాణులకు నిలయమైన పల్లగుట్ట ఆక్రమణలకు గురవుతుందన్నారు. 116 ఎకరాల్లో విస్తరించిన పల్లగుట్టతో నామాపూర్, గూడూరు, ముస్తాబాద్, గూడెంలకు ఉపయోగకరంగా ఉందన్నారు. గతంలో లీజుకు ఇచ్చే ప్రయత్నాలను మండల ప్రజలు అడ్డుకున్నారని, ఇప్పుడు గుట్ట ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తహసీల్దార్ ఫారూఖ్ హామీ మేరకు అంజాగౌడ్ దీక్షలను విరమించారు. దీక్షకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి, ఆవునూర్ సర్పంచ్ రవీందర్, మాజీ సర్పంచులు వొరగంటి తిరుపతి, చాకలి రమేశ్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొమ్మెట రాజు, నాయకులు సంజీవ్, శ్రీనివాస్రావు, నరేశ్, గోపి, చంద్రం, వెంకన్న, వేణు పాల్గొన్నారు. -
బీజేపీది ఓట్ల రాజకీయం
● దేశ సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం ● ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ● సిరిసిల్ల, వేములవాడల్లో బీఎల్ఏలకు అవగాహనసిరిసిల్లటౌన్/వేములవాడ: పన్నేండేళ్లుగా దేశాభివృద్ధిని గాలికొదిలేసి బీజేఫీ ఫక్తు ఓట్ల రాజకీయం చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ విమర్శించారు. సిరిసిల్ల, వేములవాడల్లోని ఫంక్షన్హాళ్లలో శుక్రవారం నిర్వహించిన బీఏల్ఏల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంగ్లేయుల నుంచి దేశాన్ని కాపాడేందుకు ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోరాడిందని, నేడు ఓట్ల చోర్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ చెర నుంచి దేశాన్ని కాపాడేందుకు మరో స్వాతంత్య్ర ఉద్యమం చేయాల్సి తరుణం ఆసన్నమైందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు నెహ్రూతో మోదీ పోల్చుకోవడం విడ్డూరమని పేర్కొన్నారు. పన్నెండేళ్లుగా దేశానికి బీజేపీ చేసిందేమి లేదని విమర్శించారు. మోదీ ఈడీ, సీబీఐలను నమ్ముకొని పాలన చేస్తున్నారన్నారు. బీఎల్ఏల శక్తి ఎవరికీ లేదు – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఎల్ఏలకున్న శక్తి ఎవరికీ లేదని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. అందరూ కలిసి పనిచేస్తే సిరిసిల్లలో ఎమ్మెల్యేగా గెలవడం తేలికని పేర్కొన్నారు. బీజేపీ ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్ష ఓట్లను తొలగించే ప్రయత్నం మానుకోవాలని సూచించా రు. మీనాక్షి నటరాజన్పై కేసు లేకున్నా నామినేషన్ రిజెక్టు చేసి ఆమె సీటును బీజేపీ చోరీ చేసిందన్నారు. రాహుల్గాంధీని ప్రధాని చేసేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. దశాబ్దకాలం అధికారంలో ఉన్నా కేటీఆర్ సిరిసిల్ల ప్రాంతాన్ని వెనక్కి నెట్టారని ఆరోపించారు. నేతన్నలకు వారు పెట్టిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. పీసీసీ పరిశీలకులు ఫక్రుద్దీన్, గోపిశెట్టి రాఘవేందర్, జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్మన్ రాజు పాల్గొన్నారు. -
పునాదులు దాటని గ్రామైఖ్యం
● నత్త నడకన గ్రామైఖ్య సంఘాల భవనాలు ● స్థల సమస్య, పెరిగిన ధరలతో సాగని పనులు ● జిల్లాలో 150 గ్రామైఖ్య భవనాలుజిల్లాలో మహిళాశక్తి స్వరూపం ఇలా..ముస్తాబాద్(సిరిసిల్ల): మహిళా సంఘాల బలోపేతానికి.. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామైఖ్య భవనాల నిర్మాణం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. వేలాది మంది మహిళలు సభ్యులుగా ఉన్న సంఘాల బలోపేతానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు క్షేత్రస్థాయిలో సాగుతున్న పనులకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మహిళల సమావేశానికి అవసరమై న భవనాలు తక్కువగానే ఉన్నాయి. సమావేశాలే కాదు.. ఇతర అవగాహన సదస్సులకు భవనాలు అవసరం. కానీ జిల్లాలో 150 గ్రామైఖ్య సంఘాల భవనాల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే ఇందులో సగం భవనాలు కూడా పనులు మొదలు పెట్టకపోవడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునాదుల్లోనే.. జిల్లాలో చేపట్టిన మహిళాసంఘాల భవనాల నిర్మాణాలకు అడుగడుగున ఆటంకాలే ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఒక్కో భవన నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేసింది. అయితే జిల్లాలో చాలా చోట్ల స్థలం సమస్యగా మారింది. ప్రభుత్వ భూములు లేకపోవడం, కొన్ని చోట్ల ఉన్నా అధి కారుల మధ్య సమన్వయం కుదరకపోవడంతో పనులు ప్రారంభించలేదని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల బేస్మెంట్, పిల్లర్ల వరకు పనులు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో భవనాలు పూర్తి కాలేదు. మ రోవైపు నిధులు సరిపోవడం లేదని పనులు గుత్తా పట్టుకున్న కాంట్రాక్టర్లు చెబుతున్నారు. పెరిగిన స్టీల్, ఇసుక, ఇటుక, మేసీ్త్ర బిల్లులతో భవనాలు నిర్మించలేమని చేతులెత్తేస్తున్నారు. జిల్లా అధికారులు మహిళా భవనాలు త్వరగా నిర్మించాలని ఒత్తిడి తీసుకొస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం పనులు వేగవంతం కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కుటుంబాలకు పెద్ద దిక్కు సంఘాలే.. జిల్లాలో మహిళా స్వశక్తి సంఘాలు మన సమాజంలో పెనవేసుకుపోయాయి. పొదుపుతో మొదలై.. భారీ రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు వేలల్లో ఉన్నారు. కుటుంబాలకు పెద్ద దిక్కుగా అత్యవసర వేళల్లో ఐకేపీ సంఘాలే అండగా నిలుస్తున్నాయి. ఎరువులు అమ్మడం, ధాన్యం కొనడం, ప్రభుత్వ శాఖలకు బట్టలు కుట్టించడం, పెట్రోల్బంకుల నిర్వహణ వంటి వాటివి సంఘాలు చేస్తున్నాయి. స్వశక్తి మహిళా సంఘాలు : 10,017గ్రామైఖ్య సంఘాలు : 411సభ్యులు: 1,09,929భవనాల నిర్మాణానికి నివేదించాం ముస్తాబాద్ మండలానికి 12 వీవో భవనాలు మంజూరయ్యాయి. సగం వరకు భవనాలు బేస్మెంట్ వరకు వచ్చాయి. కొన్ని ప్రారంభించలేదు. రానున్న ఆరు నెలల్లో అన్ని భవనాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కోరుతున్నాం. అధికారులకు నివేదించాం. – రాజనర్సు, ఏపీఎం, ముస్తాబాద్ మహిళా భవనం నిర్మించాలి ముస్తాబాద్లో ఇప్పటి వరకు వీవో భవనం పనులు ప్రారంభించలేదు. వందలాది మహిళల కోసం చేపట్టిన భవన నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలి. మహిళల సమావేశాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. అధికారులు వీవో భవన నిర్మాణం పనులు మొదలయ్యేలా చొరవ చూపాలి. – గాండ్ల సుమతి, ముస్తాబాద్ -
వడ్లు పోకపాయే!
వానాకాలం వచ్చే..ఇది వేములవాడ మండలం లింగంపల్లిలో జూన్ 8వ తేదీ సాయంత్రం 4.30 గంటలు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఇతర జిల్లా అధికారులతో కలిసి లింగంపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. జూన్ 7వ తేదీ రాత్రి వర్షం పడడంతో వడ్లకుప్పలు తడిసిపోయాయని తెలియగానే కలెక్టర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తడిసిన వడ్లబస్తాలను పరిశీలించారు. వెంటనే లారీలను సరఫరా చేసే కాంట్రాక్టర్తో రైతు సమక్షంలోనే ఫోన్లో మాట్లాడి లారీలను సమకూర్చాలని కోరారు. రెండు రోజుల్లో లింగంపల్లిలో ధాన్యాన్ని తూకం వేయాలని, తడిసిన వడ్లను సైతం కొనాలని, పూర్తి స్థాయిలో వడ్లను తరలించి, ఇక్కడ కొనుగోళ్లను ముగించాలని అధికారులను ఆదేశించారు. ఇతను కటుకం రవి. వేములవాడ మండలం లింగంపల్లికి చెందిన రవికి మూడెకరాల పొలం ఉంది. నెల రోజుల కిందటే పొలాన్ని కోసి వడ్లను ఎండబెట్టి.. తూకం వేసేందుకు కొనుగోలు కేంద్రంలో పోశారు. వర్షాలు పడినా వడ్లు తడవకుండా టార్పాలిన్ కప్పారు. తేమ శాతం వచ్చినా లారీలు రాక తూకం వేయడం లేదు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ లింగంపల్లికి వచ్చి స్వయంగా వడ్లను పరిశీలించి తూకం వేయాలని అధికారులను ఆదేశించి నాలుగు రోజులైనా ఇప్పటికీ వడ్లు కదలలేదు.సిరిసిల్ల: జిల్లాలో యాభై రోజులుగా వడ్ల కొనుగోళ్లు సాగుతూ..నే ఉన్నాయి. వానకాలం వచ్చినా ధాన్యం కొనుగోళ్లు పూర్తికాలేదు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ధాన్యం కొనుగోళ్లపై ఫోకస్ పెట్టారు. కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరుతుండగా, అదనపు కలెక్టర్ రైస్ మిల్లులను, కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రావడంతో 50 రోజులుగా కొనుగోళ్లు కొనసా..గుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 23న కొనుగోళ్లు ప్రారంభించగా వర్షాకాలం(మృగశిరకార్తె ప్రవేవించినా) ప్రారంభమైనా ముగించలేదు. గతేడాది యాసంగి(రబీ)లో జూన్ 8న పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేశారు. 243 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,73,639.604 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.724.84 కోట్లను రైతుల ఖాతాల్లో జమవేశారు. ఈ ఏడాది ఇంకా కొనుగోళ్లు పూర్తి కాలేదు. ఈ ఏడాది యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు ప్రణాళికను అమలు చేయడంలో జాప్యమైంది. ఏప్రిల్ మొదటి వారంలోనే వరి కోతలు మొదలైనా.. 23వ తేదీన కొనుగోళ్లు ప్రారంభించారు. తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో రైస్మిల్లులకు, గోదాములకు తరలించేందుకు జీపీఎస్ విధానం అమలు చేయాలని పౌరసరఫరాల అధికారుల నిబంధనలు ఉన్నాయి. దీంతో లారీలు దొరక్క.. జీపీఎస్ అమలు కాకపోవడంతో పది రోజులు ఆలస్యమైంది. మే మొదటి వారంలో ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి పెరగడంతో జిల్లా అధికారుల ఉరుకులు పరుగులతో ట్రాక్టర్లు, వ్యాన్లలోనూ వడ్లను తరలించారు. ఆరంభంలో జరిగిన జాప్యం ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. గన్నీ బ్యాగులు, హమాలీలు లేక.. లారీలు రాక.. రైతులు ఆగమవుతున్నారు. బస్తా ధాన్యం బరువు 40 కిలోలు కాగా.. గన్నీ సంచి బరువు 600 గ్రాములు. 40.600 కిలోలు తూకం వేయాల్సి ఉండగా.. తరుగు పేరిట 43 నుంచి 44 కిలోల వరకు తూకం వేస్తున్నారు. మరోవైపు లారీల డ్రైవర్లు ఒక్కో బస్తాకు రూ.3 అదనంగా రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హమాలీ చార్జీల పేరిట క్వింటాలుకు రూ.10 వసూలు చేస్తున్నారు. చివరికి తరుగు పేరిట కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ‘కటింగ్’ పేరిట దోచుకుంటున్నారు. -
ఉపాధికి ఫొటో కష్టాలు
● నెట్ రాదు.. సిగ్నల్ అందదు ● గంటల కొద్దీ నిరీక్షణ ● ఇబ్బంది పడుతున్న కూలీలుగంభీరావుపేట(సిరిసిల్ల): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును వీబీజీరామ్జీగా మార్పు చేసి అమలులో పారదర్శకత పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. పనుల్లో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ముఖం ఆధారిత హాజరు(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) కూలీలతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్లకు శాపంగా మారింది. సాంకేతిక సమస్యలతో కూలీల హాజరు నమోదు తలనొప్పిగా మారింది. పలుమార్లు ఫొటో తీసినా అప్లోడ్ కాకపోవడంతో కూలీలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాలో 97,880 జాబ్కార్డులు ఉండగా.. ప్రస్తుతం 83,390 మంది కూలీలు పని చేస్తున్నారు. రోజుకు రెండుసార్లు హాజరు ఉపాధిహామీ పథకం పనులకు వచ్చే కూలీల హాజరును రోజుకు రెండు సార్లు నమోదు చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఉదయం పనికి వచ్చిన వెంటనే కూలీల ఫొటో తీసి ఆన్లైన్లో అప్ లోడ్ చేయాలి. పని ముగిసిన తర్వాత రెండో సారి ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. రెండు హాజర్ల మధ్య కాల వ్యవధి కనీసం నాలుగు గంటలు ఉండాలి. త్వరగా పని ముగించుకొని వెళ్లాలనుకుంటే కుదరదు. నాలుగు గంటల వ్యవధిలోపల ఫొటో తీసుకోదు. అంతవరకు కూలీలు వేచి ఉండాల్సిందే. ఏ మాత్రం తేడా ఉన్నా అంతే.. మూడేళ్ల క్రితం వరకు కూలీల హాజరును మస్టర్లలో నమోదు చేసే వారు. పని ప్రారంభించిన కొద్దిసేపటి తరువాత మేట్లు కూలీలతో మస్టర్ల సంతకాలు చేసేవారు. రెండేళ్ల క్రితం హాజరు విధానాన్ని మార్చారు. పనికి హాజరైన కూలీల గ్రూప్ ఫొటో తీస్తే సరిపోయేది. ఇటీవల ప్రతి కూలీ ఫొటోను పని ప్రారంభం, ముగింపు సమయంలో తీయాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. కూలీల ఆధార్కార్డును అనుసంధానం చేసి కేవైసీ పూర్తి చేశారు. కూలీల ఫొటో, కనుపాపలను స్కాన్ చేశారు. పని హాజరు నమోదు సమయంలో ఫొటోలో చిన్నమార్పు ఉన్నా.. మిస్ మ్యాచ్ అంటూ తిరస్కరణకు గురవుతుంది. వెలుతురు సరిగా లేకపోయినా ఇంటర్నెట్ రాకున్నా.. ఫీల్డ్ అసిస్టెంట్ల మొబైల్ క్లారిటీ లేకున్నా.. హాజరు నమోదు కావడం లేదు. పనిప్రదేశంలో కూలీలు ఫొటో నమోదుకు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని, లేకుంటే ఆ రోజు హాజరుపడక వేతనం కోల్పోవాల్సి వస్తోందనే ఆవేదన కూలీల్లో వ్యక్తమవుతోంది. -
జనగణనలో మొదటి స్థానం
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జనగణన–2027 మొదటి దశలో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ గురువారం తెలిపారు. తొలిదశ గృహాల జాబితా, గృహాల లెక్కింపు, మే 11న ప్రారంభమై జూన్ 9న ముగిసిందన్నారు. 12 మండలాలతోపాటు రెండు మున్సిపాలిటీల్లో జనగణన నిర్వహించామని తెలిపారు. 1,126 హౌస్ లిస్టింగ్ బ్లాకులు, 1,025 మంది ఎన్యూమరేటర్లు, 173 మంది సూపర్వైజర్లు పాల్గొని 2 లక్షలకు పైగా జనగణన గృహాలు లెక్కించారని వివరించారు. 2027 ఫిబ్రవరిలో నిర్వహించే జనగణనకు ఇవి ప్రాథమిక ఆధారంగా ఉపయోగపడుతుందన్నారు. జిల్లా జనగణన హ్యాండ్ బుక్ తయారీకి అవసరమైన రెవె న్యూ గ్రామాల వారీగా సదుపాయాలకు సంబంధించిన సమాచారం గ్రామస్థాయి అధికారుల ద్వారా జూలైలో సేకరిస్తామన్నారు. జనగణనను ని ర్ధేశిత గడువులో పూర్తి చేయడంలో సహకరించిన చార్జ్ అధికారులు, ఎన్యూమరేటర్లు, సూపర్వైజ ర్లను అభినందించారు. సీపీవో శ్రీనివాసాచారి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా పాల్గొన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలి వైద్యులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సుందరయ్యనగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ముందుగా ఓపీ, వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. ఎన్సీడీ స్క్రీనింగ్ టెస్టులపై ఆరా తీశారు. కలెక్టర్ మా ట్లాడుతూ సమయపాలన పాటించాలని, ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవాలు, చికిత్స పొందేలా అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు వివరించాలన్నారు. సబ్సెంటర్లలో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎన్సీడీ స్క్రీనింగ్ టెస్టులు చేయాలని కలెక్టర్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. -
శిక్షణ భవితకు నిచ్చెన
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో క్రికెట్ క్రీడాకా రులకు అందించిన ఉచిత శిక్షణ.. భవిష్యత్లో ఉన్నతంగా రాణించేలా దోహద పడు తుందని చైర్పర్సన్ జిందం కళ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో గు రువారం శిక్షణ ముగింపులో హాజరై మాట్లాడారు. 120 మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, స్థానిక రైజింగ్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ క్లబ్ ని ర్వాహకులను అభినందించారు. నెలపాటు జరిగిన శిక్షణను క్రీడాకారులు సద్వినియో గం చేసుకున్నారన్నారు. క్రీడాకారులకు సర్టి ఫికెట్లు అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు సంగీ తం శ్రీనివాస్, కోచ్లు వంగ సాయితేజ, దొబ్బల ప్రేమ్కుమార్, సమ్మర్ క్యాంపు ఇన్చార్జి వంకాయల కార్తీక్ పాల్గొన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో ‘దోస్త్’ మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 15తో ముగియనుందని కళాశాల ప్రిన్సిపాల్ జయ గురువారం ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ప్రవేశాల దరఖాస్తుకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 99856 07074, 80083 74874లో సంప్రదించాలని తెలిపారు. -
ఇంటలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల: సీఐ, ఎస్సైలు స్థానిక ఇంటలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, ముందస్తు సమాచారం సేకరణకు ప్రాధాన్యతనివ్వాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా పోలీస్ ఆఫీస్లో గురువారం వేములవాడ సబ్–డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో సమీక్షించారు. పారదర్శకంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న పాత కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతే న్యాయ సలహాలు తీసుకోవాలని సూచించారు. నిందితుల అరెస్టులో నిర్లక్ష్యానికి తావివ్వవద్దని స్పష్టం చేశారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీసుశాఖపై విశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నారు. డీఎస్పీలు శ్రీనివాసులు, జి.వెంకటేశ్వర్లు, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, మధుకర్, మొగిలి, ఎస్సైలు కిరణ్కుమార్, వెంకట్రాజం, రమాకాంత్, రమేశ్, రామ్మోహన్, ప్రేమానందం, మోతిరాం తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ సమావేశం వాయిదా
సిరిసిల్లటౌన్: మున్సిపల్ సాధారణ సమావేశాన్ని మరోసారి వాయిదా వేశారు. ఈమేరకు గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. గత నెలలో నిర్వహించాల్సిన మున్సిపల్ సమావేశం స్థానిక కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతిచెందగా సంతాప సూచకంగా వాయిదా వేశారు. గురువారం ఉదయం 11 గంటలకు చైర్పర్సన్ జిందం కళ అధ్యక్షతన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా చైర్పర్సన్ జిందం కళ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో సమావేశానికి రాలేని పరిస్థితిలో వాయిదా వేసినట్లు కమిషనర్ వివరించారు. ఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో లక్ష్మీనారాయణ సూచించారు. మండలంలోని పెద్దలింగాపూర్, దాచారం కేంద్రాలను గురువారం అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. స్థానికంగా ఉండే మహిళా కూలీలను ఉపయోగించుకోవాలని తెలిపారు. అనంతరం మండల పరిషత్లో మండల అభివృద్ధి అధికారి శశికలతో మాట్లాడారు. ఐకేపీ ఏపీఎం కుమారస్వామి, ఏపీవో చంద్రయ్య, సీసీలు రామచంద్రం, విఠల్, వీవో కరుణ, గన్నారం నర్సయ్య పాల్గొన్నారు. చందుర్తి(వేములవాడ): మహిళలు ఉచిత కుట్టు మిషన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డు జిల్లా మేనేజర్ దిలీప్ కోరారు. మండలంలోని ఎన్గల్లో ప్రతిమ ఫౌండేషన్, జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు నెలలపాటు నిర్వహించిన శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా నాబార్డ్ జిల్లా మేనేజర్ దిలీప్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు. సర్పంచ్ అసనిపర్తి శోభారాణి–సుధాకర్, ఉపసర్పంచ్ మ్యాకల జలంధర్, వార్డు సభ్యులు మోకిలే లహరి, జీఎంఆర్ ప్రిన్సిపాల్ మహేశ్, ప్రతిమ ఫౌండేషన్ ప్రోగ్రాం హెడ్ కౌశిక్, మేనేజర్ గీతారెడ్డి, శ్రీలత, పరమేశ్, రాజిరెడ్డి పాల్గొన్నారు. జీపీ తాళం తీయించిన అధికారులుకోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తిలో నూతన గ్రామపంచాయతీ భవనానికి కాంట్రాక్టర్ వేసిన తాళాన్ని అధికారులు గురువారం తీయించారు. తనకు రూ.1.50 లక్షల బిల్లు రావాలంటూ పనులు చేసిన అండెం మల్లారెడ్డి బుధవారం తాళం వేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పత్రికల్లో రావడంతో జిల్లా అధికారుల ఆదేశాలతో పంచాయతీరాజ్ ఏఈ అంజయ్య, ఎంపీవో ఆరిఫ్పాషా గ్రామానికి చేరుకుని కాంట్రాక్టర్ మల్లారెడ్డితో మాట్లాడారు. అతనికి రావాల్సిన బిల్లులను తనిఖీ చేశారు. బిల్లు చెల్లిస్తామని హామీ ఇచ్చి.. అతనితోనే తాళం తీయించారు. సర్పంచ్ మల్యాల స్వామిదాస్, ఉపసర్పంచ్ వంగపెల్లి శేఖర్, కార్యదర్శి వెంకటేశ్ ఉన్నారు. చోరీ సొత్తు కొన్నా, అమ్మినా చర్యలుసిరిసిల్ల: చోరీ సొత్తును కొన్నా.. అమ్మినా చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్ బీ గీతే హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా తొలిసారి స్క్రాప్ దుకాణాల్లో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణ, చోరీ సొత్తు కొనుగోలు, విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించామన్నారు. స్క్రాప్ దుకాణాల యజమానులు అనుమానాస్పదంగా కనిపించే వస్తువులు, చోరీ సొత్తు కొనుగోలు చేయొద్దని సూచించారు. తంగళ్లపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బైక్, సర్వీస్ వైర్ కట్టలు, గంభీరావుపేట ఠాణా పరిధిలో 10 మోటార్లు, మూడు కాపర్వైర్ బెండలు దొరికినట్లు తెలిపారు. సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
తెలంగాణ దేశానికి రోల్ మోడల్
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్చందుర్తి(వేములవాడ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి రైతువేదికలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 37 మందికి సీఎమ్మార్ఎఫ్ చెక్కులను గురువారం అందజేశారు. అలాగే పలు కమ్యూనిటీ భవనాలకు, ప్రహరీ నిర్మాణాలకు ప్రొసీడింగ్స్ అందించారు. విప్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో జాప్యం లేదని, గతంలో జిల్లాలో 2.69 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రాగా, ఈసారి ఇప్పటికే 3.39 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. మరో 20వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. పార్టీ మండల అధ్యక్షుడు గొట్టే ప్రభాకర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామి, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, రుద్రంగి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, సర్పంచులు కటకం మల్లేశం, చిలుక బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఈసరి శ్రీనివాస్, ఏనుగు లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తూకం వేసిన ధాన్యం వెంటనే తరలించాలి
వేములవాడరూరల్: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, నమిలిగొండపల్లి గ్రామాల్లో మంగళవారం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వర్షాల నేపథ్యంలో అందుబాటులో ఉన్న టార్ఫాలిన్ల వివరాలపై ఆరా తీశారు. తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించేందుకు వాహనాలను సమకూర్చాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించి లాభదాయకమైన పంటలను సాగు చేయాలని తెలిపారు. గర్భిణులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యంతంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓఎంసీహెచ్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ నాగేంద్ర బాబు, వైద్యాధికారి డాక్టర్ స్నేహ మాట్లాడుతూ, గర్భిణులకు అందుతున్న సేవలపై అవగాహన కల్పించారు. గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, అధిక ప్రమాదం ఉన్నవారిని ముందుగానే గుర్తించి తల్లి, శిశు మరణాలను తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి గర్భిణి కనీసం ఒక్కసారైనా నిపుణులైన వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు అయ్యేలా చూసుకోవాలని కోరారు. అలాగే గర్భధారణ సమయంలో నాణ్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల 9న ఈ కార్యక్రమాన్ని పీహెచ్సీతో పాటు అన్ని సబ్ సెంటర్లలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. హెల్త్ సూపర్వైజర్లు అరవింద్, ప్రమీల, సతీశ్కుమార్, ప్రమీల, సుల్తానమ్మ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ గురుకులం సమస్యలు పరిష్కరించాలిసిరిసిల్లటౌన్: ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీజీఎస్డబ్ల్యూఆర్ఈటీఎల్ఏ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏనుగుల సంతోష్ కోరారు. మంగళవారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఓఎస్డీ విజయ్కుమార్కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న పదోన్నతులు, డిగ్రీ కళాశాల టైం టేబుల్ మార్పు, పీజీటీ ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, హిందీ పోస్టులు మంజూరు చేయాలన్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, వ్యాయామ ఉపాధ్యాయులకు క్రాస్ ప్రమోషన్స్ చేపట్టాలని, మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న డీఏ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆవుల సైదులు, కంది సంపత్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్వో రజిత బదిలీసిరిసిల్లటౌన్: జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ రజిత బదిలీ అయ్యారు. మంగళవారం వైద్యారోగ్య శాఖ రాష్ట్రంలోని డెప్యూటీ డీఎంహెచ్వోలను బదిలీలను చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో డెప్యూటీ డీఎంహెచ్వో(ఇన్చార్జి డీఎంహెచ్వో)గా పనిచేస్తున్న రజితను హనుమకొండ జిల్లాకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో వికారాబాద్ జిల్లా డెప్యూటీ డీఎంహెచ్వోగా పనిచేస్తున్న డాక్టర్ పవిత్రను నియమించారు. రెండు రోజుల్లో ఆమె సిరిసిల్లలో పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. -
బడి.. సమస్యలు రెడీ!
‘ఇది వీర్నపల్లి మండలం భావుసింగ్నాయక్ తండాలోని ప్రభుత్వ బడి. ఇటీవల కురిసిన జల్లులకు పాఠశాల ప్రాంగణం వర్షం నీటితో ఇలా నిండింది. వానాకాలం ఆరంభమైతే పిల్లలు మోకాల్లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే’.జిల్లాలో..అంబేడ్కర్నగర్ జెడ్పీ స్కూల్ ఆవరణలో విరిగిన చెట్టు‘చెట్ల కింద చదువులు సాగిస్తున్న ఈ విద్యార్థుల ఫొటో ఎక్కడో మారుమూల ప్రాంతం అనుకుంటే పొరపడినట్లే. జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రాథమిక పాఠశాలలోనిది. ఇందులో గత విద్యా సంవత్సరం 108 మంది విద్యార్థులు చదివారు. 1 నుంచి 5వ తరగతి వరకు రెండే గదులు ఉండడంతో సరిపోక ఇలా చెట్ల కింద చదువులు సాగించారు’.ప్రైమరీ స్కూళ్లు 333యూపీఎస్ 39హైస్కూల్స్ 111విద్యార్థులు 31,426 -
సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
● ఎస్పీ మహేశ్ బి గితే సిరిసిల్ల: జిల్లాలో బహిరంగంగా మద్యం సేవించడంపై నిత్యం తనిఖీలు నిర్వహించాలని, నేరాల నియంత్రణ, నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం అందించేలా పనిచేయాలని ఎస్పీ మహేశ్ బి గితే ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ ఆఫీస్లో సిరిసిల్ల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు, కేసుల నిర్వహణలో వేగం, పారదర్శకత పెంచాలని సూచించారు. గంజాయి, ఇసుక, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్పై ఆకస్మిక తనిఖీలు చేపడుతూ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో రోజూ సాయంత్రం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమీక్షలో డీఎస్పీ కె.నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేశ్, మొగిలి, ఎస్సైలు, ఐటీ కోర్, డీసీఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు. నిత్యం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ మహేశ్ బి గితే ఆదేశించారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ వద్ద పోలీస్ తనిఖీలను పరిశీలించారు. నంబరు ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. మైనర్ల డ్రైవింగ్ను పట్టుకోవాలని, అసాంఘిక శక్తులను నిషితంగా పరిశీలించాలన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
స్వచ్ఛ సిరిసిల్లకు ప్రాధాన్యం
సిరిసిల్లటౌన్: స్వచ్ఛ సిరిసిల్లకు తమ పాలకవర్గం ప్రాధాన్యత ఇస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. మంగళవారం 6వ వార్డులోని ప్రధాన మురికికాలువలో పూడిక తీత పనులను ప్రారంభించి మాట్లాడారు. వచ్చే వర్షాకాలం దృష్ట్యా ప్రధాన మురికికాలువలలో పూడిక తీయుటకు ప్రత్యేకంగా రూ.5లక్షల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈక్రమంలోనే నెహ్రునగర్ నుంచి గాంధీనగర్, అంబేద్కర్నగర్ మీదుగా శాంతినగర్ వరకు ప్రవహిస్తున్న ప్రధాన కాలువలో పూడికతీత పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. కొంతమంది నిర్లక్ష్యంగా కాలువల్లో చెత్త పడవేయడంతో నీటి ప్రవాహనాకి అడ్డు ఏర్పడి దోమలు, క్రిమి కీటకాలతో వృవొకశచెంది ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదీర్పాషా, కౌన్సిలర్ దూడం రజిని శ్రీనివాస్, ఏఈ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్ ముస్తాబాద్: మండల వనరుల కేంద్రంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు పాఠ్య పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం వరకు పుస్తకాలు, నోట్ బుక్స్ సరఫరా పూర్తి చేస్తామని ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి తెలిపారు. ఇప్పటికే బడిబాట కార్యక్రమం జరుగుతుందని, విద్యార్థుల చేరికలు జరుగుతున్నాయన్నారు. హెచ్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. -
అన్లోడింగ్ వేగవంతం చేయండి
సిరిసిల్లఅర్బన్: ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్ధాపూర్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాముల్లో ధాన్యం ఆన్లోడింగ్ తీరును అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి పరిశీలించారు. హమాలీల సంఖ్యను మరింత పెంచి అన్లోడింగ్ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని, అన్లోడింగ్ అయిన వాహనాలను ధాన్యం లోడింగ్ కోసం ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. గోదాముల్లో ధాన్యం నిల్వ చేస్తున్న తీరు, వాటి సామర్థ్యం వివరాలపై ఆరా తీశారు. వెనువెంటనే కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లోడ్ చేసి తరలించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పౌర సరఫరాలశాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, సిరిసిల్ల, వేములవాడ తహసీల్దార్లు మహేశ్, జయంత్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించడమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. ఎస్పీ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 26 ఫిర్యాదులు రాగా.. ఆయా పోలీస్స్టేషన్ల ఎస్హెచ్వోలకు ఎస్పీ నేరుగా ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల సేవలను ప్రజలకు మరింత దరి చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. బోయినపల్లి(వేములవాడ): గ్రామసభలతో సమస్యలు పరిష్కారమవుతాయని వేములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి పేర్కొన్నారు. మండలంలోని నీలోజిపల్లి, రామన్నపేట, కొదురుపాక, వరదవెల్లి, జగ్గారావుపల్లిల్లో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు నిర్వహించారు. తహసీల్దార్ చిందం శ్రీనివాస్, ఎంపీడీవో జయశీల, ఎంపీవో శ్రీధర్, ఎంఏవో ప్రణిత పాల్గొన్నారు. సిరిసిల్ల: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 15 మంది సిబ్బందికి ఉద్యోగ విరమణ కల్పిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తూ 65 ఏళ్లు నిండిన వారికి ఉద్యోగ విరమణ కల్పిస్తున్నట్లు వివరించారు. వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి నుంచి ఇద్దరు, సిరిసిల్ల పరిధిలో 13 మందికి ఉద్యోగ విరమణ కల్పించామన్నారు. ఎనిమిది మంది అంగన్వాడీ టీచర్లు, ఏడుగురు ఆయాలు ఉన్నారని తెలిపారు. ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో జిల్లా సంక్షేమాధికారి ఆఫీస్లో సంప్రదించాలన్నారు. ఉద్యోగ విరమణ పొందే వారు వయసు నిర్ధారణ పత్రాలతో జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రావాలని సూచించారు. సిరిసిల్ల: మృగశిరకార్తె ప్రవేశించిన తొలిరోజు సోమవారం జిల్లాలో వర్షం కురిసింది. ఇన్నాళ్లు వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనం చిరుజల్లులతో ఊపిరిపీల్చుకున్నారు. చిరుజల్లులకే జిల్లా కేంద్రం చిత్తడయింది. పాతబస్టాండులోని నేతన్నచౌక్ వద్ద రోడ్డుపైకి వరదతో కలిసిన మురికినీరు చేరింది. కరీంనగర్–కామారెడ్డి ప్రధాన రహదారి మురికినీటితో నిండింది. వేములవాడ రూరల్ మండలం మల్లారం వద్ద అత్యధికంగా 32.0 మిల్లీమీటర్లు, అత్యల్పంగా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల వద్ద 0.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఇల్లంతకుంటలో అత్యధికంగా 36.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా... అత్యల్పంగా ముస్తాబాద్ మండలం ఆవునూర్ వద్ద 33.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తడిసిన ధాన్యం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలో ఆదివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి తిమ్మాపూర్ కేంద్రంలోని వడ్లు తడిసిపోయాయి. దాదాపు 60 నుంచి 70 వడ్ల కుప్పలు నీటిలోనే మునిగిపోయాయి. వారం క్రితం రైతులు రోడ్డెక్కినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రోడ్లపై చెత్త వేయొద్దువేములవాడ: వేములవాడలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 5, 6, 7, 8, 9, 10, 20 వార్డుల్లో సోమవారం సభలు నిర్వహించారు. ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఆడపడుచుకు ఇందిరమ్మ చీరలను అందిస్తోందని మున్సిపల్ చైర్మన్ రాజు తెలిపారు. ఇళ్ల నుంచి వచ్చే చెత్తను ఇష్టానుసారంగా రోడ్లు, ఖాళీ స్థలాలు, మురుగు కాలువల్లో వేయొద్దన్నారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, కౌన్సిలర్లు, మేనేజర్ సంపత్రెడ్డి, మున్సిపల్ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. -
పైసలు ఉన్నా పరేషానే!
● ఖాతాల్లోనే యాసంగి వడ్ల డబ్బులు ● రోజుకు రూ.10వేలు ఇస్తున్న బ్యాంక్ అధికారులు ● మొదలైన వానాకాలం సాగు పనులు ● పెట్టుబడి కోసం రైతుల తిప్పలు ● ఆన్లైన్ చెల్లింపులు తెలియక అయోమయండబ్బులు లెక్కపెట్టుకుంటున్న ఇతను ముస్తాబాద్ మండలం మద్దికుంటకు చెందిన రైతు కొరివి చంద్రయ్య. ఇతనికి ఐదెకరాల భూమి ఉంది. యాసంగిలో వచ్చిన ధాన్యం డబ్బులు ఖాతాలో జమకాగా.. ఐదు రోజులుగా రోజూ వస్తూ రూ.10వేల చొప్పున తీసుకుంటున్నాడు. ఈ డబ్బులతో గత పంట హార్వెస్టింగ్, హమాలీ ఖర్చులు పోను ఇప్పుడు విత్తనాలు, ఎరువులు, దున్నకాలకు సరిపోతాయంటున్నాడు. ముస్తాబాద్(సిరిసిల్ల): వానాకాలం సాగుకు రైతులకు నగదు కష్టాలు మొదలయ్యాయి. యాసంగి ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమకాగా.. చేతిలో నగదు లేక వానాకాలం పెట్టుబడి కోసం తిప్పలు పడుతున్నారు. బ్యాంకులో రోజుకు రూ.10వేలకు మించి ఇవ్వకపోవడంతో నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, దుక్కి దున్నించడం వంటి వాటికి ఇప్పుడు డబ్బులు అవసరం. కానీ బ్యాంకులో సరైన నగదు లేక రైతులకు మొత్తం ఇవ్వడం లేదు. ఆన్లైన్ చెల్లింపులు తెలియక పలువురు రైతులు రోజూ బ్యాంక్కు వచ్చి గంటల తరబడి క్యూలైన్లో నిల్చొని రోజుకు రూ.10వేల చొప్పున తీసుకెళ్తున్నారు. బ్యాంక్లకు చేరని నగదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి ఆర్బీఐ ఆదేశాలతో ‘చెస్ట్’ కరెన్సీ నుంచి అన్ని బ్యాంక్లకు నగదు సరఫరా చేస్తారు. ఆర్బీఐ నుంచి నగదు సరఫరా లేకపోవడంతో బ్యాంక్లకూ రావడం లేదు. స్థానికంగా జరిగిన లావాదేవీలతోనే పక్షం రోజులుగా నెట్టుకొస్తున్నామని బ్యాంక్ అధికారి ఒ కరు తెలిపారు. ఇరువై అయిదు రోజులుగా కరీంనగర్ నుంచి నగదు సరఫరా కాలేదని సమాచారం. వైన్స్, పెట్రోల్బంకులు, గ్యాస్ కంపెనీలు జమచేస్తున్న నగదుతోనే ఖాతాదారులకు బ్యాంకర్లు సర్దుబాటు చేస్తున్నారు. జిల్లాలోని చాలా బ్యాంక్ల్లో నగదు లేదని బోర్డులు ఏర్పాటు చేశారు. -
విన్నపాలు వినవలె..
● కలెక్టరేట్ బాట పట్టిన అర్జీదారులు ● దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● పెండింగ్ పెట్టొద్దని ఆదేశాలుసిరిసిల్ల అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్కు సోమవారం తరలివచ్చారు. ప్రజావాణిలో తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 154 మంది నుంచి అర్జీలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. దరఖాస్తులు పెండింగ్లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. -
న్యాయం చేయండి
తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లికి చెందిన 30 మందికి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసింది. అందులో పది మంది మాత్రమే ఇండ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఇందులో ఇండ్లు కట్టని వారి పేర్లను గ్రామపంచాయతీ తీర్మానించింది. వారితో ఇండ్లు కట్టుకున్నవారికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇండ్లు కట్టుకున్నవారికి న్యాయం చేయండి. – గోపాల్రావుపల్లి గ్రామస్తులు -
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2026
ఆర్టీసీ బస్సు ఎదుట ఆందోళన తెలుపుతున్న దేవునితండా వాసులుమృగశిర వచ్చింది.. మీనం మెరిసింది !మృగశిర కార్తె సోమవారం ప్రవేశించింది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో ముదిరాజ్ కులస్తులు 230 కుటుంబాలు గ్రామచెరువులో చేపలు పట్టాయి. కులస్తులతోపాటు చేపలు కొనేందుకు వచ్చిన గ్రామస్తులతో చెరువు పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉబ్బసం వ్యాధి నివారణకు సంప్రదాయంగా వస్తున్న చేపమందును సిరిసిల్ల మార్కెట్లో చంద్రంపేటకు చెందిన రామచంద్రం పంపిణీ చేశారు. కిలో రవు చేపలు రూ.200, బొమ్మెలు రూ.400, రొయ్యలు రూ.400 ధర పలికాయి. – సిరిసిల్లటౌన్/సాక్షి ఫొటోగ్రాఫర్ -
నక్ష ప్రకారం సర్వే పూర్తి చేయండి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: నక్ష(నేషనల్ జియో స్పాషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేషన్స్) ప్రకారం సర్వే ప్రణాళిక పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్ అధికారులతో సోమవారం సమీక్షించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో నక్ష కింద ఐదు విలీన గ్రామాల్లో కలిపి మొత్తం 307 బ్లాక్స్ ఉన్నాయని, ఇప్పటి వరకు 49 పూర్తి చేశామన్నారు. 14,984 ఇండ్లు ఉండగా.. 6,707 ఇండ్ల సర్వే పూర్తయిందని వివరించారు. ప్రతీ ఇంటి సరిహద్దులు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఇతర ఖాళీ స్థలాల విస్తీర్ణం వివరాలు పకడ్బందీగా సర్వే చేయాలని ఆదేశించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాస్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేశ్, టీపీవో అన్సార్ పాల్గొన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి ఇదే అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దివ్యాంగులకు ట్రై సైకిల్, వీల్చైర్ అందజేత దివ్యాంగులైన ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన చింతకింది లస్మయ్య, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన ముద్రకోల దీనలకు ట్రై సైకిళ్లు అందించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై టెలీకాన్ఫరెన్స్ ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. -
నీరుంటే నారు పోసుకోవచ్చు
● పత్తిని ఇప్పుడే విత్తుకోవద్దు ● భూమిలో తేమ ఉంటేనే విత్తుకోవాలి ● యాజమాన్య పద్ధతులు పాటిస్తే సన్నాల్లోనూ దిగుబడి ● విత్తనాలు, ఎరువుల రశీదులు దాచుకోవాలి ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగంసిరిసిల్ల: జిల్లాలో మంచి వర్షాలు ఇంకా పడలేదు.. భూమి బాగా నానాలి.. వేడి తగ్గాలి.. భూమిలో తేమ ఉంటేనే ఏ విత్తనమైనా మొలకెత్తుతుంది.. నీరుంటే నారు పోసుకోవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ ఆఫీస్లో సోమవారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ‘సాక్షి’ నిర్వహించిన ‘ఫోన్ఇన్’లో రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఎప్పుడూ ఒకే పంటను వేయొద్దని, పంట మార్పిడితో భూసారం పెరుగుతుందన్నారు. దొడ్డు వడ్లకు బదులు సన్నవడ్లు వేసుకుంటే మంచిదన్నారు. జిల్లాలోని నలుమూలల నుంచి అనేక మంది రైతులు ఫోన్ చేసి సాగులో సందేహాలకు సమాధానాలు పొందారు. ఆ విశేషాలు ఇవీ..ప్రశ్న: డీఏపీ దొరకడం లేదు. ఎరువుల కోసం షాపులకు వెళ్తే ఆన్లైన్ అంటున్నారు.. ఎలా? – శ్రీనివాస్–వేములవాడ, కట్ట తిరుపతి–తడగొండ, వినయ్–రుద్రంగి, బాలరాజు–ముస్తాబాద్.డీఏవో: ఇప్పుడే వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. డీఏపీ అవసరం ఇప్పుడే ఉండదు. అయినా ముందుచూపుతో రైతులు ఆలోచించడం మంచిదే. యూరియా, డీఏపీ ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. గాలిలో భాస్వరం ఉంటుంది. సహజంగా నేలలో లభించే పోషకాలతోనే పంటలు పండాలి. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. పొలంలో పెంటతోపాటు బయో ఫెర్టిలైజర్ వేసుకుంటే భూమిని గుల్ల చేస్తుంది. రైతులు ఎరువుల వాడకంపై జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నాం.ప్రశ్న: సన్న వరి విత్తనాలు, కంది విత్తనాలు ఏమైనా వ్యవసాయశాఖ సబ్సిడీపై సరఫరా చేస్తుందా? – ఎగుమామిడి వెంకటరమణారెడ్డి–తంగళ్లపల్లి, దేవేందర్–బావుసాయిపేట, వామన్రెడ్డి–వంతడ్పుల, యాదగిరిరెడ్డి–ఆవునూర్, నరేందర్రెడ్డి–వేములవాడ అర్బన్. డీఏవో: వ్యవసాయశాఖ ద్వారా సబ్సిడీపై ఏ విత్తనాలు సరఫరా కావడం లేదు. కంది వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. మార్కెట్లో విక్రయించుకోవచ్చు. మార్కెట్లో చాలా రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఏది వేసుకున్నా మంచి దిగుబడి వస్తుంది. దొడ్డు వడ్ల కంటే సన్నాలు వేసుకుంటేనే డిమాండ్ ఉంటుంది. ప్రశ్న: ఆరుతడిగా కంది, మొక్కజొన్న వేసుకోవచ్చా? – రవి–తంగళ్లపల్లి, తిరుపతిరెడ్డి–బండపల్లి, యామ తిరుపతి–వేములవాడడీఏవో: ఆరుతడిగా మొక్కజొన్న, కంది వేసుకోవచ్చు. మార్కెట్లో మంచి దిగుబడిని ఇచ్చే రకాలు ఉన్నాయి. ఎక్కువ రైతులు సాగు చేస్తే పంటకు కోతుల బెడద కూడా ఉండదు. పెసర్లు, బబ్బర, అలసంద వంటివి సాగు చేయవచ్చు.ప్రశ్న: మా మండలంలో వ్యవసాయాధికారులు లేరు. రైతులకు సలహాలు సూచనలు ఇచ్చే వారు కరువయ్యారు? – బోయిని రవి–వీర్నపల్లి.డీఏవో: నిజమే వ్యవసాయాధికారి లీవులో వెళ్లారు. ఏఈవోను కేటాయించాం కానీ విధుల్లో చేరలేదు. జిల్లాలో వ్యవసాయాధికారుల కొరత ఉంది. రెండు రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.ప్రశ్న: ఈ సీజన్లో సన్నవడ్లు వేసుకోవాలా.. దొడ్డు వడ్లు వేసుకోవాలా? – రాజవీర్–గంభీరావుపేట, దొంతరవేణి శ్రీనివాస్గౌడ్–నిమ్మపల్లి, మహేశ్–బోయినపల్లి, ఎ.రవి–రుద్రంగి, గాంతుల మహేశ్–ముస్తాబాద్, వెంకటేశ్–లింగంపల్లి, నర్సింహారెడ్డి–ఆవునూర్, లక్ష్మారెడ్డి–పదిర, పర్శరాంరెడ్డి–నారాయణపూర్, భూపతిరెడ్డి–వంతడ్పుల, ఎం.రాజు–చందుర్తి, సత్యంరెడ్డి–ఆవునూర్డీఏవో: ఈ వర్షాకాలంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడి డ్రై స్పెల్ మూలంగా నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. 120 రోజుల్లో కోతకు వచ్చే స్వల్పకాలిక రకాలు వేసుకుంటే మంచిది. సన్నవడ్లు వేసుకోవాలని చెబుతున్నాం. రైతులు తమకున్న పొలంలో 75 శాతం సన్నాలు, 25 శాతం దొడ్డు వడ్లు పెట్టుకున్నా ఫరవాలేదు. నీరు ఉంటే నారు పోసుకోవచ్చు. సన్నరకాలైన కేఎన్ఎం 1836, జేజీఎల్, జైశ్రీరాం వేసుకుంటే ప్రభుత్వం బోనస్ ఇస్తుంది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకొని, పంట పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలి.ప్రశ్న: ఈ వర్షాలకు పత్తిని విత్తుకోవచ్చా? పత్తిలో స్వల్పకాలిక రకాలేమిటి? – కట్ట తిరుపతిరెడ్డి–తడగొండ, మోతె మధుసూదన్రెడ్డి–నారాయణపూర్, పోగుల రాజిరెడ్డి–కనగర్తి.డీఏవో: పత్తిని ఇప్పుడే విత్తుకోవద్దు. పూర్తి స్థాయిలో వర్షాలు పడలేదు. భూమి ఇంకా నానలేదు. భూమిలో వేడి ఉంటే విత్తనాలు వట్టిపోతాయి. 50 నుంచి 60 శాతం భూమి తడిసిన తరువాత, తేమ ఉన్నప్పుడే పత్తిని విత్తుకోవాలి. బీటీ కాటన్ విత్తుకోవాలి. పత్తిలో స్వల్పకాలిక రకాలు లేవు. ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.ప్రశ్న: వరిలో దోమపోటును తట్టుకునే రకాలేమైనా ఉన్నాయా? మేలైన యాజమాన్య పద్ధతులు ఏమిటి? – బండారి శ్రీనివాస్–ఇల్లంతకుంట, రమేశ్–గంభీరావుపేట, గంగాధర్–రుద్రంగి, వంతడ్పుల రమేశ్–ఇల్లంతకుంట, మల్లేశం–మరిమడ్ల.డీఏవో: వరి పంటలో దోమపోటు రాకుండా వంగడాలు లేవు. కానీ ముందుగా థైరం, కార్బడిజంతో విత్తనశుద్ధి చేసుకోవాలి. నారు కొసలను కత్తిరించి వేరే చోట పూడ్చిపెట్టాలి. నాట్లు వేసే సమయంలో కాలిబాటలు వదిలిపెట్టాలి. ఎండ బాగా సోకి, గాలి బాగా ఆడి వరి పంటకు దోమపోటు రాకుండా ఉంటుంది.ప్రశ్న: కలుపుమందులు షాపుల్లో ఇవ్వడం లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు? – గంగారెడ్డి–కనగర్తిడీఏవో: కలుపు మందులను కొన్నింటిని ప్రభుత్వం నిషేధించింది. ఒక్కో పంటకు ఒక్కో కలుపు నివారణ మందు అవసరం ఉంటుంది. అవసరమైన వాటిని ఇవ్వాలని చెప్పాం. ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తేవాలి. -
చెత్తశుద్ధిపై చిత్తశుద్ధి ఉండాలి
● చెత్తను నాలుగు రకాలుగా వేరుచేయాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ’ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భా గంగా శనివారం తంగళ్లపల్లి మండలం రామన్నపల్లి లోని ప్రగతి ప్రాంగణంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మా ట్లాడుతూ వర్షాకాల సన్నద్ధత, ఘన వ్యర్థాల నిర్వహణ, బడిబాట, పంటల మార్పిడి, ఓటరు జాబి తా సవరణ తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చెత్తను ఇంట్లోనే నాలుగు రకాలుగా తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక చెత్తగా వేరుచేసి అందించాలన్నారు. జీపీ ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి నాలుగు చెత్త బుట్టలు, బట్ట సంచులు పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. ‘బడిబాట’ ద్వారా ప్ర భుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని సూచించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు వ్యవసాయాధికారుల సలహాలతో సాగుచేయాలని తెలిపారు. ఆయిల్పామ్, సన్నవడ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు సాగుచేయాలని వివరించారు. వర్షపు నీటిని నిల్వ ఉంచి భూ గర్భ జలాల పెంపునకు ఇంకుడుగుంతలు, చెరువులు, పామ్పాండ్లను సిద్ధం చేసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇంటికి వచ్చే బీఎల్వోలకు గుర్తింపుకార్డులు చూపించి మ్యాపింగ్ ప్రక్రియకు సహకరించాలని కోరారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్, నయాబ్ తహసీల్దార్ మురళీకృష్ణ, సర్పంచ్ ఆత్మకూరి జ్యోతి పాల్గొన్నారు. వడ్ల కొనుగోళ్లను పూర్తి చేయండి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. కొనుగోలు చేసిన ధాన్యం రైస్మిల్లులు, గోదాములు, అపెరల్ పార్క్కు తరలించాలని ఆదేశించారు. ఈనెల 9న మహిళా సంఘాల మండల సమాఖ్యలకు బస్సుల పంపిణీని హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీసీఎస్వో బుచ్చిబాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నరసింహ, డీసీవో రామకృష్ణ, డీఏవో అఫ్జల్బేగం, డీటీవో శ్రీనివాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, కార్మికశాఖ అధికారి నజీర్ అహ్మద్, తహసీల్దార్ మహేశ్ పాల్గొన్నారు. ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
జాడలేని నూలు!
అందిన ఆర్డర్లు..సిరిసిల్ల: రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు చిలుకపచ్చ రంగు, ఎర్రని డిజైన్ బార్డర్తో ఇందిరా మహిళాశక్తి చీరలను కానుకగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రంలోని పవర్లూమ్స్(మరమగ్గాల)పై చీరల బట్టను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇచ్చింది. చీరల డిజైన్లను రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్లో వస్త్రోత్పత్తిదారుల సమక్షంలో మే 6న చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రదర్శించారు. సిరిసిల్లలో 10,056 పవర్లూమ్స్కు(130 మ్యాక్స్ సంఘాలకు) ఉత్పత్తి ఆర్డర్లను చేనేత, జౌళిశాఖ అధికారులు ఇచ్చారు. జూలై 31లోగా చీరల బట్ట ఉత్పత్తి చేసి ఇవ్వాలని గడువు విధించారు. కానీ నూలు డిపో ద్వారా ఇప్పటికీ నూలు(ధారం)ను సరఫరా చేయలేదు. కొందరు వస్త్రోత్పత్తిదారులు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తే మార్కెట్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. కానీ ఆ మేరకు ప్రభుత్వం మీటరు బట్టకు చెల్లించే ధరను పెంచకుండా.. పాత ధర మీటరుకు రూ.34 చెల్లిస్తామని చెప్పడంతో చీరల ఉత్పత్తి సాగడం లేదు. స్కూల్ యూనిఫామ్స్ బట్ట కొనుగోలులో జాప్యం స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్ దుస్తుల కోసం సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు 60 లక్షల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. 20 లక్షల మీటర్ల బట్ట మే 31 నాటికి సిద్ధమైనా ఆ బట్టను అధికారులు కొనుగోలు చేయడం లేదు. జూన్ రెండో వారంలో పాఠశాలలు తెరిచే నాటిని పిల్లలకు యూనిఫామ్స్ అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. ఆర్వీఎం(రాజీవ్ విద్యా మిషన్), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల సేకరణ సాగడం లేదు. సిరిసిల్లలోని 25 వేల మరమగ్గాలు(పవర్లూమ్స్)పై షూటింగ్, షర్టింగ్, ఓనీ వస్త్రాలు ఉత్పత్తి చేయాల్సి ఉండగా నూలు(దారం) అందించడంలో జాప్యమవుతుంది.చీరల బట్టకు సంబంధించిన వెప్ట్ నూలు(అడ్డం పోగులు) వచ్చింది. వార్పు(నిలువు పోగులు) ఇంకా రావాలి. జరీ నూలు కూడా రావాలి. నూలు రాగానే డీడీలు చెల్లించిన మ్యాక్స్లకు సరఫరా అవుతుంది. ఇప్పటికే డీడీలు చెల్లించిన 16 మ్యాక్స్ సంఘాలకు వెప్ట్ నూలును సరఫరా చేశారు. ఇందిరా మహిళా శక్తి చీరల బట్టకు ధరల నిర్ణయం, వస్త్రోత్పత్తిదారులకు రావాల్సిన బకాయిల విడుదల అంశం మా పరిధిలో లేదు. – ఎస్.సంతోష్కుమార్, చేనేత, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్లసిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ప్రభుత్వం నుంచి రూ.200 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో వెల్ఫేర్ డిపార్టుమెంట్, ఆర్వీఎం, బతుకమ్మ చీరలు, పోచంపల్లిలో నిల్వ చేసి వినియోగించిన వస్త్రాలకు సంబంధించి రూ.200కోట్ల మేరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పోచంపల్లిలో నిల్వ చేసిన బట్టకు సంబంధించి వంద శాతం పేమెంట్లు రావాలి. కొన్ని వస్త్రాలకు 10 శాతం, కొన్నింటికి 30 శాతం, మరికొన్నింటికి 40 శాతం పేమెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు రూ.200 కోట్లు పెండింగ్లో ఉండడంతో మళ్లీ బట్ట ఉత్పత్తికి పెట్టుబడి లేక దిక్కులు చూస్తున్నారు. -
రాజన్నపై లడ్డూ భారం
తేదీ: జూన్ 8 (సోమవారం) సమయం : మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలు ఫోన్ నంబరు : 89777 55264సిరిసిల్ల: వర్షాకాలం ప్రవేశించింది. రోహిణీ కార్తె ముగింపు దశకు చేరింది. మృగశిర కార్తె సోమవారం ప్రవేశిస్తుంది. వానాకాలం ప్రారంభంలో కొద్దిపాటి తొలకరి జల్లులు పలకరించాయి. జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. మరోసారి మంచి వానలు పడితే విత్తనాలు వేసుకునేందుకు, నారు పోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రైతులు ఇప్పటికే పచ్చిరొట్ట ఎరువుగా జీలుగ విత్తనాలు వేసుకున్నారు. రేగడి భూముల్లో పత్తి విత్తుకునేందుకు సిద్ధమయ్యారు.ఈ వానాకాలం సీజన్లో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి విత్తనాలను ఎంచుకోవాలి. వర్షాలు ఆలస్యమైతే.. ఏయే పంటలు వేసుకోవాలి. సకాలంలో వర్షాలు పడితే ఎలాంటి పద్ధతులు పాటించాలి.. సాగులో ఉన్న సందేహాలు? జిల్లాలో ఎరువులు, విత్తనాల సరఫరా ఎలా ఉంది? అనే అంశాలతోపాటు రైతులకు వచ్చే అన్ని రకాల సందేహాలకు సమాధానం ఇచ్చేందుకు జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగంతో ఈనెల 8న ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తుంది. రైతుల సందేహాలకు జిల్లా వ్యవసాయాధికారి సమాధానాలు ఇస్తారు. రైతులు సద్వినియోగం చేసుకుని అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. అఫ్జల్ బేగం, జిల్లా వ్యవసాయాధికారివేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం పెరిగిన ముడిసరుల ధరలతో తయారీ వ్యయం పెరిగిందని ఆలయ అధికారులు లెక్కలు వేస్తున్నారు. 2016లో నిర్ణయించిన రూ.20లకే ఒక లడ్డూ చొప్పున ఇప్పటికీ విక్రయిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నెయ్యి, పంచదార, శనగపిండి, డ్రైఫ్రూట్స్ ధరలు పెరిగిపోయాయి. దీంతో లడ్డూ తయారీ వ్యయం పెరిగిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లడ్డూ ధర పెంచాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరల ప్రభావం రాజన్న ప్రసాదాలపై పడింది. ప్రస్తుతం భద్రాచలం, బాసర, ధర్మపురి, కొండగట్టు ఆలయాల్లో ఒక్కో లడ్డూ ధర రూ.25గా ఉండగా, యాదాద్రి ఆలయంలో రూ.30కు విక్రయిస్తున్నారు. వేములవాడలో మాత్రం రూ.20కే విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో రమాదేవి ఆలయ అధికారులతోపాటు అర్చకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి లడ్డూ తయారీ ఖర్చు, నాణ్యత ప్రమాణాలు, ప్రస్తుత ధరల పరిస్థితులపై సమీక్షించనున్నారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించడంతోపాటు దేవస్థానానికి నష్టం లేకుండా ఉండేందుకు లడ్డూ ధర పెంపు అవసరమనే యోచనకు వచ్చినట్లు సమాచారం. త్వరలో ఉన్నతాధికారుల ఆమోదంతో లడ్డూ ధర పెంపుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని స్వల్పంగా ధర పెంచే ప్రతిపాదనపై అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. లడ్డూతోపాటు పులిహోర ధర సైతం పెంచాలని ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. -
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు!
● ఏడు చేనేత, నాలుగు పవర్లూమ్ సహకార సంఘాలు ● సంఘాల్లో 321 మంది సభ్యులు ● ఓటర్ల జాబితా సిద్ధం ● ఎన్నికల నోటిఫికేషన్పై సందిగ్ధంసిరిసిల్ల: రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఏడు చేనేత, నాలుగు పవర్లూమ్ సహకార సంఘాలు ఉన్నాయి. 2013లో ఫిబ్రవరిలో చివరిగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగ్గా.. 2018లో ఆ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. 2018 నుంచి ఆరు నెలలకోసారి పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం పొడగిస్తూ వచ్చింది. జిల్లాలోని 11 సహకార సంఘాల ఫొటో గుర్తింపుకార్డులతో కూడిన ఓటర్ల జాబితాను చేనేత, జౌళిశాఖ అధికారులు సిద్ధం చేసి రాష్ట్ర సహకార శాఖ అధికారులకు పంపించారు. తొలి విడతగా 50 మంది కంటే తక్కువ సభ్యులు ఉన్న సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సహకార సంఘాల్లోనూ 50 మందిలోపే సభ్యులు ఉండడంతో తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 12న ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ జారీ అయినట్లు సమాచారం ఉన్నా సందిగ్ధత నెలకొంది. 1964 సహకార చట్టంలో రిజిస్ట్రేషన్ అయిన సంఘాలకే.. సహకార చట్టం 1964 ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన చేనేత సహకార సంఘాలను ప్రభుత్వం గుర్తించింది. జిల్లాలో 7 సంఘాలు ఆ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ కాగా.. నాలుగు పవర్లూమ్ సంఘాలు 1964 సహకారచట్టం పరిధిలో ఉన్నాయి. దీంతో జిల్లాలో 11 సంఘాల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. చేనేత సహకార సంఘాల్లో 234 మంది సభ్యులు, పవర్లూమ్ సహకార సంఘాల్లో 87 మంది సభ్యులు ఉన్నారు. ఒకప్పుడు ఈ సంఘాల్లో వందలాది మంది సభ్యులు ఉండడంతో ఒక్క వెలుగు వెలిగిన ఆ చేనేత సహకార సంఘాలు ఇప్పుడు పెద్దగా సభ్యులు లేక ఉన్నాయి. చేనేత వృత్తిని ఎవరూ చేయకపోవడంతో అంతా పవర్లూమ్కు మారడంతో చేనేత సంఘాలు, మగ్గాలు మూలనపడ్డాయి. ప్రస్తుతం ఉన్న సంఘాల్లోని సభ్యులు సైతం వృద్ధాప్యంలో ఉన్నారు. -
పట్టుదలతో చదివి.. ఉన్నత శిఖరాలు చేరాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● టెన్త్, ఇంటర్ టాపర్లకు ప్రశంసలుసిరిసిల్ల: పట్టుదల, క్రమశిక్షణ, కృషి ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్(డీపీవో)లో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బంది పిల్లలకు శనివారం కాలేజీ బ్యాగ్, మెమోంటో అందించారు. ఎస్పీ మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని, తన తల్లిదండ్రులు ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారన్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని నిరాశ చెందకుండా, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. పోలీస్శాఖలో అహర్నిశలు ప్రజలకు సేవలందిస్తూ తమ పిల్లల భవిష్యత్ కోసం తాపత్రయ పడుతున్న తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని పిల్లలకు సూచించారు. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నారు. మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు కె.నాగేంద్రచారి, శ్రీనివాసులు, జి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సొంత ఖర్చులతో రోడ్డు పనులు
ఇల్లంతకుంట(మానకొండూర్): సొంత నిధులతో గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు సర్పంచ్, ఉపసర్పంచులు. ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లికి రోడ్డు లేకపోవడంతో సర్పంచ్ చింతమడక కళ్యాణ్, ఉపసర్పంచ్ చిక్కుడు సత్యం తమ సొంత ఖర్చులతో గ్రామం నుంచి రామాజీపేట బీటీ రోడ్డు వరకు రోడ్డు పనులు శనివారం ప్రారంభించారు. రెండు కిలోమీటర్లు, 25 ఫీట్లతో మట్టి రోడ్డు నిర్మించనున్నట్లు సర్పంచ్, ఉపసర్పంచులు తెలిపారు. రోడ్డు నిర్మాణానికి రూ.2లక్షల వరకు అవుతున్నాయి. సిరిసిల్లటౌన్: చెత్తను తడి, పొడిగా వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్పాషా కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భా గంగా శనివారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(టీజీపీసీబీ) ఆధ్వర్యంలో స్థాని క పాత బస్టాండ్ ప్రాంతంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించొద్దని ప్రజలకు వివరించారు. ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు టీచర్లు సోషల్మీడియాను వినియోగించుకుంటున్నారు. ఏఐ టెక్నాలజీ సహాయంతో ఆడియో క్లిప్పింగ్ను గ్రామ సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు. ‘గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు విన్నపం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి. ఒత్తిడి లేని విద్య. మీ డబ్బులు మీ దగ్గరే.. పిల్లల భవిష్యత్ మా వద్ద. ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫామ్. ఉచితంగా పాఠ్యపుస్తకాలు. క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణింపు. అడ్మిషన్ ఫీజు లేదు. అమ్మలు పిల్లలకు క్యారేజ్ పెట్టనవసరం లేదు. మధ్యాహ్న భోజన వసతి..’ అంటూ ఏఐతో చెప్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. దోపిడీ ఉన్నంతకాలం పోరాటాలుంటాయివేములవాడఅర్బన్: సమాజంలో దోపిడీ ఉ న్నంత కాలం కమ్యూనిస్టు పోరాటాలు ఉంటాయని జనగాం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజారెడ్డి అన్నారు. వేములవాడలో సీపీఐ శిక్షణ శిబిరం రెండో రోజు శనివారం కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. చెన్న విశ్వనాథం, గోషిక మోహన్, జమ్ముల జితేందర్రెడ్డి, ఉమా మహేశ్, పంజాల శ్రీనివాస్, సదానందం, మంద సుదర్శన్, కడారి రాములు ఉన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలిసిరిసిల్లటౌన్: విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో రాణించాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ కోరారు. స్థానిక బతుకమ్మ ఘాట్లో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించేలా, క్రీడాకారులలో నైపుణ్యాన్ని పెంపొందించేలా బతుకమ్మ ఘాట్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు కృషి చేశారన్నారు. బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, గోక శ్రీనివాస్, బండారి శివ, సుష్మ తదితరులు పాల్గొన్నారు. -
సేవకులు కావలెను!
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026‘రాజన్న’కుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: దక్షిణ కాశీగా పేరొందిన ఎములాడ రాజన్నను సేవకు ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో సిబ్బంది కొర త పనిభారానికి కారణమవుతోంది. కనీసం వారాంతంలో సెలవు దొరికే అవకాశం కూడా కొన్నిసార్లు దక్కకపోవడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయంలో క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మొత్తం 320 రెగ్యులర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం కేవలం 185 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు 135 పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతున్నట్లు తెలుస్తోంది. అర్చకుల విభాగంలోనే సుమారు 35 పోస్టులు ఖాళీగా ఉండగా, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (ఎల్జీఎస్) విభాగంలో దాదాపు 60 పోస్టులు భర్తీ కాలేదు. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ విభాగాల్లో 10 పోస్టులు, డ్రైవర్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఔట్ సోర్సింగ్లోనూ ఇదేతీరు ఇక ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదని అంటున్నారు. మొత్తం 290 ఔట్సోర్సింగ్ పోస్టులకు గాను ప్రస్తుతం 250 మంది మాత్రమే పనిచేస్తుండగా, మరో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించడమే కాకుండా, నిత్య కై ంకర్యాలు, పరిపాలనా కార్యక్రమాలను నిర్వహించడం ఉద్యోగులకు సవాలుగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. మరోవైపు పదవీ విరమణ పొందిన ఒక ఏఈవోను అకౌంట్స్ అధికారిగా కొనసాగిస్తుండగా, సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం రెగ్యులరైజేషన్ లేదా పదోన్నతుల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు వారానికి ఒక రోజు సెలవు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొన్నదని, అనేక మంది నిరంతర విధుల వల్ల మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవులు మంజూరు చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ జీవితం కూడా ప్రభావితమవుతోందని వారు పేర్కొంటున్నారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయకపోతే భవిష్యత్తులో ఆలయ సేవల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు వెంటనే స్పందించి ఖాళీల భర్తీపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఆలయ ఆస్తులను కాపాడాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని పోతుగల్లో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు తోట ధర్మేందర్ శువ్రారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ధర్మేందర్ మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన భూములను సర్వే చేసి హద్దులను నిర్ణయించాలని కోరారు. దేవుడి బంగారు ఆభరణాల వివరాలు, ఆదాయ, వ్యయాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఎస్సై జ్యోతి మాట్లాడుతూ దీక్షలు చేయవద్దని, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూస్తామన్నారు. దీక్ష చేపట్టిన ధర్మేందర్ను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఎస్సై హామీ మేరకు దీక్షను విరమించినట్లు ధర్మేందర్ తెలిపారు. -
ఆధునికీకరణతో మెరుగైన విద్యుత్ సేవలు
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డిసిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయమైన సేవలు అందించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడమే టీజీఎన్పీడీసీఎల్ ప్ర ధాన లక్ష్యమని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి పే ర్కొన్నారు. పెద్దూరు బైపాస్రోడ్డులోని విద్యుత్ సంస్థ స్టోర్స్, తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్లోని సబ్స్టేషన్లను శుక్రవారం తనిఖీ చేశారు. స్టోర్స్లో వర్షాకాలంలో సామగ్రి పాడవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరం మేరకు ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాలన్నారు. సిరిసిల్ల విద్యుత్ సంస్థ ఆఫీస్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా, నిర్వహణ, వినియోగదారుల సేవలు, భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్షించారు. కాలిపోయిన, పనిచేయని మీటర్లను మార్చాలన్నారు. వ్యవసాయ సర్వీసులు, టీజీఐ–పాస్లో సర్వీసులు యుద్ధప్రాతిపదికన రిలీజ్ చేయాలన్నారు. డిజిటల్ సేవలను విస్తరించేందుకు రూపొందించిన ఎల్టీఎంటీ యాప్ను ప్రారంభించారు. వేములవాడ మండలం రుద్రవరం 33/11 కేవీ ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సేవల పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(ఈఆర్టీ) వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ టి.వేణుమాధవ్, డీఈఈలు అంజయ్య, వెంకటరమణ, ఏడీఈలు, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాజకీయ అవగాహన కోసమే శిబిరాలు
● సీపీఐ రాష్ట్ర నాయకుడు చాడ వెంకట్రెడ్డి వేములవాడఅర్బన్: సీపీఐ శిక్షణ శిబిరాలు రాజకీయ అవగాహన, సామాజిక న్యాయం కోసం నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర నాయకుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. వేములవాడలోని మహాలింగేశ్వర ఫంక్షన్హాల్లో శుక్రవారం సీపీఐ శిబిరాలను ప్రారంభించారు. చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కొరవడిందన్నారు. ధరల పెరుగుదలకు హద్దులు లేవన్నారు. దేశ సంపద పది మంది కుబేరుల చేతుల్లోనే ఉందన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జాగిరే తెలంగాణ రాష్ట్రమని పవన్ కళ్యాన్ తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఆవేశానికి కేరాఫ్గా నిలిచిన పవన్ కళ్యాన్ ప్రొఫెసర్ నాగేశ్వరావు లాంటి మేధావులపై కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు సుదర్శన్, శ్రీనివాస్, సదానందం, విశ్వనాథం, శ్రీనివాస్, శంకర్ తదితరులు ఉన్నారు.నంబర్ ప్లేట్లు సరిగ్గా ఉంచుకోవాలిసిరిసిల్ల: వాహనదారులు నంబర్ ప్లేట్లు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ సూచించారు. ఇటీవల చేపట్టిన స్పెషల్ డ్రైవ్ తనిఖీలలో 20 వాహనాలు నంబరు ప్లేట్లు సరిగ్గా లేకుండా పట్టుబడ్డాయి. ఆ వాహనాలకు శుక్రవారం నంబరు ప్లేట్లు వేయించి వాహనదారులతో మాట్లాడారు. నంబర్ ప్లేట్ తొలగించినా, నంబర్లు స్పష్టంగా కనిపించకుండా మార్ఫింగ్ చేసినా చట్టవిరుద్ధమన్నారు. నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఆర్ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. వర్షాకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిసిరిసిల్ల: వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో శుక్రవారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. రజిత మాట్లాడుతూ వర్షాకాల ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రతీ మంగళ, శుక్రవారాలలో డ్రైడే పాటించాలని ఆదేశించారు. ఇంట్లోకి దోమలు రాకుండా జాలీలు, మెష్డోర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డ్రెయినేజీల్లో ఆంటీ లార్వా మందులను పంచాయతీ సిబ్బందితో స్ప్రే చేయించాలన్నారు. ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటీ సర్వే ద్వారా గుర్తించిన జ్వరబాధితులను పీహెచ్సీలకు తరలించి, చికిత్స అందేలా చూడాలన్నారు. మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేంద్రబాబు, వ్యాధి నిరోధక టీకాల ప్రోగ్రాం అధికారి డాక్టర్ సంపత్కుమార్, డీడీఎం కార్తీక్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలిఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ ఆదేశించారు. మండలంలోని కందికట్కూర్, వంతడుపుల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. వేగంగా లోడింగ్, అన్లోడింగ్ చేయాలని సూచించారు. ఐకేపీ ఏపీఎం కుమారస్వామి, సీసీలు వెంకటేశం, రామచంద్రారెడ్డి, రామచంద్రం, విఠల్రెడ్డి పాల్గొన్నారు. -
సీసీ కెమెరాలకు మరమ్మతు
సిరిసిల్ల అర్బన్: ‘నిద్రపోతున్న నిఘా’ శీర్షికన ఆర్టీసీ బస్సుల్లో పనిచేయని సీసీ కెమెరాలపై ఈనెల 4న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సిరిసిల్ల ఆర్టీసీ డీపో మేనేజర్ ప్రకాశ్రావు మాట్లాడుతూ బస్సుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీసుశాఖ ఆధీనంలో ఉన్నాయని, వాటి పరిశీలనకు పోలీసు అధికారులను సంప్రదించినట్లు తెలిపారు. టెక్నీషియన్ను పంపించి మరమ్మతు చేయించేందుకు పోలీస్ అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషిచేస్తామని డీఎం హామీ ఇచ్చారు. -
అనుమతులు గోరంతా... తవ్వకాలు చెరువంతా!
● ఇష్టారాజ్యంగా చెరువు మట్టి తరలింపు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సరఫరా‘వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన రైతు మ్యాకల కరుణాకర్ తన ఇంటి కోసం మట్టి తరలిస్తుంటే అనుమతులు లేవంటూ రూ.60వేలు జరిమానా విధించారు అధికారులు. సొంత పొలం నుంచి మట్టిని తరలిస్తే జరిమానా విధించిన అధికారులే.. చెరువు నుంచి అనుమతికి మించి టిప్పర్లలో మట్టిని తరలిస్తుంటే పట్టించుకోవడం లేదు. దీనిపై ఆ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.’వేములవాడరూరల్: చెరువు నుంచి మట్టిని తరలించేందుకు వెయ్యి క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకున్నా కాంట్రాక్టర్ ఇష్టారీతిగా తవ్వుతున్నా పట్టించుకోవడం లేదు. టిప్పర్లు, జేసీబీలు పెట్టి ఇతర ప్రాంతాలకు ట్రిప్పులకొద్దీ తీసుకెళ్తున్నా ‘మామూలు’గా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి ఊర చెరువు నుంచి మట్టి తరలించేందుకు కొందరు కాంట్రాక్టర్లు వెయ్యి క్యూబిక్ మీటర్లు తవ్వుకునేందుకు అనుమతి తీసుకున్నారు. అనుమతికి మించి భారీ స్థాయిలో మట్టిని తరలించారని గ్రామస్తులు, రైతులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. అయినా వారి ఆగడాలు ఆగకపోవడంతో రైతులు అందరూ ఏకమై శుక్రవారం తవ్వకాలను అడ్డుకున్నారు. వేములవాడ మండలంతోపాటు బోయినపల్లి మండలంలోని కొంతమంది బడా కాంట్రాక్టర్లు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టారు. ఇక్కడి మట్టిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెత్తి చూడని అధికారులు అనుమతులు ఇస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం మట్టిని తరలించకుండా ఇష్టారాజ్యంగా తరలిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కొంత మంది ప్రజాప్రతినిధు ల అండతోనే కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా తవ్వకాలు చేపడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.మొదట వెయ్యి క్యూబిక్ మీటర్లకు చలాన్ చెల్లించారు. అదనంగా మరో రెండు వేల క్యూబిక్ మీటర్లకు చలాన్ కట్టారు. మరో 2 వేల క్యూబిక్ మీటర్లకు మట్టి తీశారని మా దృష్టికొచ్చింది. ఆ మేరకు చలాన్ కట్టించుకుంటాం. – అరవింద్, ఇరిగేషన్ ఏఈ -
మొక్కలు నాటాలి.. పర్యావరణాన్ని రక్షించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. మొక్కలు నాటిన అనంతరం గ్రామంలోని మహిళలు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు సహకరించాలని కోరారు. మండలంలోని అన్ని గ్రామాల్లో స్టీల్బ్యాంకులు ఏర్పాటు చేయాలని.. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. హరిదాస్నగర్లో స్టీల్బ్యాంకు ఏర్పాటుకు ముందుకొచ్చిన సర్పంచ్ను కలెక్టర్ అభినందించారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పేపర్ ప్లేటు, గ్లాసుల వినియోగంపై ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శించారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్లో పచ్చదనం, సందర్శకుల సౌకర్యార్థం కల్పించిన మౌలిక సదుపాయాలు, అటవీ సంపదపై ప్రచారం కల్పించాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా రీల్స్ పోటీలు నిర్వహించి విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. అత్యుత్తమంగా రీల్స్ రూపొందించిన వారికి నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరా బేగం, డీఎస్పీ నాగేంద్రచారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్బేగం, హార్టికల్చర్ అధికారి శరత్, డీవైఎస్వో రాందాస్, ఏడీ మైన్స్ క్రాంతి, ఎఫ్ఆర్వో నాగేశ్వర్రావు, హరిదాస్నగర్, పదిర సర్పంచులు నాగరాజు, మణెమ్మ, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య పాల్గొన్నారు. విద్యార్థుల నమోదు పెంపునకు కృషి చేయాలి సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో కల్పిస్తున్న వసతులు, సదుపాయాలపై ప్రచారం చేయాలన్నారు. కలెక్టరేట్ శుక్రవారం విద్యాశాఖ, వివిధ సంక్షేమ శాఖ అధికారులు, కో–ఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్తో సమీక్షించారు. జనగణన–2027లో భాగంగా తొలి దశ ప్రక్రియను నిర్ధేశిత గడువులోగా విజయవంతంగా పూర్తి చేయడంలో జిల్లా ముందంజలో నిలిపిన ఉపాధ్యాయులను అభినందించారు. జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, ఎస్సీ సంక్షేమాధికారి రవీందర్రెడ్డి, మైనారిటీ అధికారి ఆయేషా తలత్ పాల్గొన్నారు.– కలెక్టర్ గరీమా అగ్రవాల్ -
పునాది లేని చోట శిఖరాలు ఎలా సాధ్యం?
మనం 2036 ఒలింపిక్స్లో పతకాలు సాధించాలని కలలు కంటున్నాం. కానీ ఒలింపియన్లను తయారు చేసే ప్రాథమిక కేంద్రాలైన పాఠశాలల్లోనే పీఈటీలు లేకపోవడం దారుణం. పాఠశాల స్థాయిలోనే ప్రతిభను గుర్తించకపోతే అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు ఎలా వస్తారు. బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు పూర్వ వైభవం రావాలంటే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి. – దూడం రమేశ్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలకు పెద్దపీట వేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో స్కూళ్లలో పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ డీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు రాకపోవడం వల్లే విద్యార్థులు బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల వైపు రావడానికి భయపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, మోడల్, గురుకుల పాఠశాలల్లో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. – కంకటి అనూప్ కుమార్, కరీంనగర్ జిల్లా ప్రైవేట్ పీఈటీల సంఘం ప్రతినిధి -
బన్నీ వేసవి యాత్ర–25
‘చిప్స్ వద్దు – నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు ముద్దు’ ఇంటి బయట బండి: బన్నీ, రామ్ చిప్స్ ప్యాకెట్ కోసం గొడవ. తాతయ్య వాళ్లని దగ్గరకు పిలిచాడు. చుక్క, స్వప్న కూడా వచ్చారు. ‘రోజూ చిప్స్ తింటే పొట్ట నొప్పి, దగ్గు వస్తుంది. బలం ఉండదు’ అన్నాడు తాతయ్య. జేబులో నుంచి నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు తీసి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చాడు. స్వప్న కొరికింది: ‘అబ్బా తాతయ్య , ఇది చాలా తియ్యగా ఉంది.’ తాతయ్య చెప్పాడు: ‘నువ్వులు ఎముకలకు బలం. బెల్లం రక్తానికి మంచిది. జలుబు రాదు.’ చుక్క అడిగింది: ‘మరి చిప్స్లో ఏముంది?’ తాతయ్య నవ్వాడు: ‘ఉప్పు, నూనె, జబ్బు.’ రామ్ అన్నాడు: ‘ఇక చిప్స్ వద్దు. నానమ్మతో లడ్డు చేయించుకుంటాను.’ తాతయ్య: ‘మన పాత తిండే మనకు మెడిసిన్. ప్యాకెట్ ఫుడ్ కాదు.’ బన్నీ అరిచాడు: ‘చిప్స్ బై బై, నువ్వుల ముద్ద హాయ్ హాయ్!’ పిల్లలకి మాట : ప్యాకెట్ తిండి రుచి కొద్దిసేపు. నానమ్మ చేతి లడ్డు జీవితాంతం ఆరోగ్యం. డాక్టర్ కోట లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామం: కాకర్లపల్లి, మంథని జిల్లా: పెద్దపల్లి -
కనిపించని గాయం
మనసులో మిగిలిన మాటలే కనిపించని గాయాలవుతాయి నవ్వుల వెనుక దాగిన బాధ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తుంది ఎవరూ చూడని ఆ వేదన హృదయంలో అలలై ఎగసిపడుతుంది ఒక మాట గుచ్చినప్పుడు గుండె లోతుల్లో ముద్రపడుతుంది కాలం గడిచినా కొన్ని జ్ఞాపకాలు గాయాన్ని మళ్లీ మేల్కొలుపుతాయి బయటకు బలంగా కనిపించినా లోపల మనసు విరిగిపోతుంది ఆత్మీయుల నిర్లక్ష్యం ఆ గాయానికి మరింత నొప్పి ఇస్తుంది ఆశలు చినిగిన ప్రతిసారి మనసు మౌనంగా రోదిస్తుంది కన్నీటి చుక్కలకే తెలుసు ఆ బాధ ఎంత లోతైనదో చెప్పలేని క్షణాలన్నీ గుండెలో గుహలై నిలిచిపోతాయి అయినా జీవితం ముందుకు నడుస్తుంది కొత్త వెలుగులను వెతుకుతూ కనిపించని గాయాలకూ ఒక రోజు మాన్పు అనే ఉదయం వస్తుంది ఆశ అనే చిన్న దీపమే మనసుకు మళ్లీ బలం ఇస్తుంది – నక్క శ్రీకర్ ఊరు: ఊటూరు మానకొండూర్ కరీంనగర్ -
గాలి ఓ మా చిరుగాలి
గాలి గాలి ఓ చిరుగాలి పవనాలుగా నీవిక తేలి నీవస్తావులే మా ఇంటికి నచ్చావులే మా కంటికి ! నీ వల్లే మాకు ఊపిరి ఉంది నీవు లేకుంటే కలుగు ఇబ్బంది మమ్ము అంటిపెట్టుకొని ఉంటావు అవునా కాదా ఇక ఏమంటావు ? నీ సమాధానం ఇక ఏదైనా నీవు లేకుండా పోదు పొద్దైనా ఓ గాలితల్లి మా చిరుగాలి మళ్లీ నీవు లేక ప్రాణం ఉండదులే మళ్లీ చెట్లు ఊగితే నీ ఉనికి తెలుసు అట్లనే చేయకు నీవిక అలుసు బొగ్గు పులుసు గాలి నీలో ఉంది దానితో మాకు కలుగు ఇబ్బంది ! గాలి తల్లి మా చిరుగాలి మల్లి మమ్ము విడిచి ఉండకు నీ వెళ్లి నీవు లేకుండా ఉండదు ఏ గల్లి నీవు వస్తేనే బాగుంటుంది మళ్లీ! గాలి తల్లి ఓ చిరుగాలి మల్లి హోరుగాలితో చేయకు లొల్లి చల్లగా తగిలితే కలుగు హాయి మెల్లెగ మది ఉప్పొంగు నోయి ! – గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత కల్వకుర్తి, నాగర్ కర్నూల్ -
వ్యాయామ వృత్తి విద్య కోర్సులకు తగ్గుతున్న క్రేజ్
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో నాలుగు రోజుల పాటు జరిగిన రాష్ట్ర వ్యాయామ విద్యా ప్రవేశ శారీరక దారుఢ్య (టీజీపీఈసెట్ 2026) పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్షల హాజరుశాతం, సీట్ల లభ్యతను పరిశీలిస్తే వ్యాయామ ఉపాధ్యాయ కోర్సులకు క్రేజ్ పడిపోతోందని స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లే ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టుల భర్తీతో పాటు ప్రతి పాఠశాలలో పీఈటీ ఉండేలా చేయాలని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గైర్హాజరుల పరంపర ఈ ఏడాది బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు 3,362 మంది దరఖాస్తు చేసుకోగా 2,435మంది (72.42 శాతం) పరీక్షలకు హాజరయ్యారు. 927 మంది అభ్యర్థులు శారీరక దారుఢ్య పరీక్షలకు రాకపోవడం గమనార్హం. బీపీఈడీ కోర్సుకు మొత్తం 2,386 మంది దరఖాస్తు చేయగా 1,788 మంది హాజరయ్యారు. 598 మంది గైర్హాజరయ్యారు. డీపీఈడీ కోర్సుకు 976 మంది దరఖాస్తు చేయగా 647 మంది హాజరయ్యారు. 329 మంది గైర్హాజరయ్యారు. బీపీఈడీ సీటుకు 1.15 మంది, డీపీఈడీ సీటుకు 2.16 మంది పోటీ ప్రతివంద మందిలో 87 మందికి బీపీఈడీ సీటు ఖాయం కావడం విశేషం. బీపీఈడీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు 1,788 మంది కాగా, సీట్లు 1,560 ఉన్నాయి. ప్రతి సీటుకు కేవలం 1.15 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. శారీరక దారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయితే చాలు సీటు ఖాయమనే పరిస్థితి కనిపిస్తోంది. డీపీఈడీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు 647 మంది కాగా, సీట్లు 300 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సీట్లు హాజరైన అభ్యర్థులలో 46.37 శాతం మందికి సరిపోతాయి. ప్రతి సీటుకు 2.16 మంది పోటీ పడుతున్నారు. వ్యాయామ విద్యపై క్రేజ్ తగ్గడానికి అభ్యర్థుల లోపం కాదు, రాష్ట్రంలో నెలకొన్న విద్యా, క్రీడా విధానాలే కారణమని నిపుణులు తేల్చి చెబుతున్నారు స్కూళ్లలో పీఈటీ పోస్టుల కొరత తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల సుమారు 1,800 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినా యువతలో నమ్మకం కలగక పోవడం విశేషం. తెలంగాణలో ఒ కవైపు యూత్ అండ్ స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ యూని వర్సిటీ ఏర్పాటు వంటి చర్చలు జరుగుతున్నా పీఈ టీ కోర్సులకు ప్రాధాన్యత లేకపోవడం విడ్డూరం.కోర్సు అభ్యర్థులు హాజరైనవారు గైర్హాజరు బీపీఈడీ 2,386 1,788 598 డీపీఈడీ 976 647 329 కోర్సు కళాశాలలు అందుబాటులో ఉన్న సీట్లు బీపీఈడీ 15 1,560 డీపీఈడీ 03 300 బీపీఈడీలో హాజరైన 87 శాతం మందికి సీటు వచ్చే అవకాశం -
దోహా ఖతర్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
సిరిసిల్ల: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను దోహా ఖతర్లో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైభవాన్ని చాటిచెబుతూ.. తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో భారతీయ సాంస్కృతిక కేంద్రం(ఐసీసీ) వేదికగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరిపారు. దోహా ఖతర్లోని తెలుగు ప్రజలకు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ గల్ఫ్ సమితి స్వచ్చంద సేవలు అందిస్తుంది. ఆపదలో ఉన్న కార్మికులకు అండగా నిలుస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలతో భారత రాయబార(ఎంబసీ) కార్యాలయం, ఖతర్ కార్మిక మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, కార్మిక సంక్షేమ సంస్థలతో సమన్వయంగా పని చేస్తూ సమాజ సేవలో ముందుంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసి నివాళి అర్పించారు. రాష్ట్ర గీతంతో పాటు, ఇతర ఆటా, పాటలతో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకుంది. తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదా మధు, ప్రధాన కార్యదర్శి సంధ్య వినయ్, కార్యవర్గ ప్రతినిధులు భవానిసాగర్, దుర్గం రాజేశ్వర్, గడ్డి రాజు, శంకర్గౌడ్, ఎల్లయ్య తాళ్లపల్లి, యువజన విభాగ సభ్యులు ముకుందం, రాజేశ్, ప్రవీణ్, అరుణ్, ప్రసాద్, సుధాకర్, బొల్లె రాజ, గంగారం, దీపక్, మధు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణకు దాతలుగా సహకరించిన హరీశ్రెడ్డి, సాగర్, రాథోడ్లకు తెలంగాణ గల్ఫ్ సమితి కృతజ్ఞతలు తెలిపింది. -
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని జవహర్లాల్నాయక్ తండాకు చెందిన భూక్య లలిత తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు ఎస్సై లక్ష్మణ్ గురువారం తెలిపారు. వివరాలు.. జవహర్లాల్నాయక్ తండాకు చెందిన భూక్య రమేశ్, తన భార్య లలిత మధ్య బుధవారం సాయంత్రం స్వల్పంగా గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన లలిత, తన ఇద్దరు పిల్లలు వర్షిత్, నిహాన్ను వెంటబెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా వారి ఆచూకీ లభించకపోవడంతో రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఎవరికై నా వీరి ఆచూకీ తెలిస్తే వెంటనే వీర్నపల్లి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రుద్రంగి(వేములవాడ): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్లేశం అనే వ్యక్తి రుద్రంగి నుంచి కోనరావుపేట మండలం వట్టిమల్లకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రుద్రంగి–లింగంపేట అటవీ ప్రాంతంలో అదుపుతప్పి కిందపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్లో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బైక్ అదుపుతప్పి యువకుడికి.. ముస్తాబాద్: మండలంలోని ఆవునూర్ మానేరు వంతెనపై బైక్ అదుపుతప్పి యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. ముస్తాబాద్కు చెందిన డొక్క ప్రవీణ్ గురువారం రాత్రి సిరిసిల్ల నుంచి ముస్తాబాద్కు బైక్పై వస్తున్నాడు. ఆవునూర్ మానేరు వంతెనపైకి రాగానే బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కాగా, 108 అంబులెన్స్లో సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
ప్రతీ ఇంటికి యోగా
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరు ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ద్వారా మేము ప్రతీ ఇంటికి యోగాను తీసుకెళ్లాలని సంకల్పించాం. ప్రతీ ఒక్కరు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలి. కరీంనగర్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 ఏళ్లుగా ఎందరో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయడం మాకు గర్వకారణం. – నాగిరెడ్డి సిద్దారెడ్డి, యోగా సంఘం జిల్లా అధ్యక్షులు యోగా అనేది అంతర్గత శక్తిని మేల్కొలిపే సాధనం. శరీరానికే కాదు.. మనస్సుకు కూడా వ్యాయామం. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు యోగా ఎంతో అవసరం. వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. సరైన పద్ధతిలో నిత్యం ప్రాణాయామం, ధ్యానం చేస్తే ఒత్తిడి దూరమై సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. – మల్లిక, యోగా కోచ్ -
తెలుగు అంకెల దండ
1=1 ఒకటి 10¹ = 10 పది 10² = 100 వంద 10³ = 1000 వేయి 104 = 10000 పదివేలు 105 = 100000 లక్ష 106 = 1000000 పది లక్షలు 107 = 10000000 కోటి 108 = 100000000 పది కోట్లు 109 = 1000000000 వంద కోట్లు 1010 = 10000000000 అర్భుదం 10¹¹ = 100000000000 న్యర్భుదం 10¹² = 1000000000000 ఖర్వం 10¹³ = 10000000000000 మహా ఖర్వం 1014 = 100000000000000 పద్మం 1015 = 1000000000000000 మహాపద్మం 1016 = 10000000000000000 క్షోని 1017 = 100000000000000000 మహాక్షోనీ 1018 = 1000000000000000000 శంఖం 1019 = 10000000000000000000 మహా శంఖం 1020 = 100000000000000000000 క్షితి 10²¹ = 1000000000000000000000 మహా క్షితి 10²² = 10000000000000000000000 క్షోభం 10²³ = 100000000000000000000000 మహాక్షోభం ఇలా సున్నాలు చేర్చుతూ పోతే 1024 = నిధి 1025 = మహానిధి 1026 = పరకం 1027 = పరార్థం 1028 = అనంతం 1029 = సాగరం 1030 = అవ్యయం 10³¹ = అమృతం 10³² = ఆచింత్యం 10³³ = అమేయం 1034 = భూరి 1035 = మహాభూరి 10366 = పద్మం 1037 = మహాపద్మం 1038 = ఖర్వం 1039 = మహాఖర్వం 1040= శంఖంఇలా పేర్లు ఉన్నాయి.ఒక సారి రాసి గుర్తుంచుకోండి పిల్లలు.గడప రఘుపతిరావు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు. గ్రా: మర్రిగడ్డ, మండలం: చందుర్తి, జిల్లా: రాజన్న సిరిసిల్ల, 9963499282 -
బాలల కథ : అక్షర సేద్యం
రామాపురంలో సోమయ్య అనే మధ్య తరగతి రైతు ఉన్నాడు. అతని కుమారుడు రాజు అదే ఊరిలో ఏడోతరగతి చదువుచున్నాడు. రాజుకు చదువు అంటే చాలా ఇష్టం. శ్రద్ధగా చదువుకుని, ఏదైనా ఉద్యోగం సాధించాలని ఆశ. సోమయ్య కు మూడు ఎకరాల పొలం ఉంది. రాజుని తనతో పాటు పొలం పనులకు తీసుకెళ్లి, ఇద్దరం పనిచేస్తూ మరో మూడు ఎకరాల పొలం కొనుగోలు చేసి ఊరిలో మంచి రైతు గా పేరు సంపాదించి, పెద్ద ఇల్లు నిర్మించుకోవాలని సోమయ్య ఆలోచన. చదువుపై ఉన్న మమకారంతో రాజు పొలం పనులు చేయడానికి ఇష్టపడలేదు. అతన్ని ఎలాగైనా చదువు మాన్పించాలని సోమయ్య ప్రయత్నాలు చేసాడు. చదువుకోవాలనే పట్టుదలను రాజు వదిలిపెట్టలేదు.సోమయ్య కూడా పంతం వీడలేదు. తోటి విద్యార్థులు బడికి వెళ్తుంటే రాజు మనసు గాయపడింది.అమ్మానాన్నలను ఒప్పించడానికి అన్నాహారాలు మాని నిరాహారదీక్ష చేసాడు . తల్లి దండ్రుల మనసు కరిగింది కాని ఒక షరతు పెట్టారు. శ్రీప్రతి రోజూ ఉదయం రెండు గంటలు పొలం పనులు చేయాలి. సాయంత్రం ఇంటి పనులు చేయాలి.సెలవు రోజుల్లో సేద్యపు పనులు చేయాలిశ్రీ. ఇదే మంచి అవకాశమనుకుని రాజు పొలం పనులు చేసుకుంటూ, కష్ట పడి చదవడం మొదలెట్టాడు.పరీక్షల సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా,చదువు పై ఉన్న మక్కువతో సంతోషంగా స్వీకరించాడు. తన తోటి పిల్లలు సెలవు రోజుల్లో సరదా ఆటలు ఆడుతున్నా,తను బాధపడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాజు చదువు పూర్తి చేసి, ఉద్యోగం సాధించాడు. నీతి: సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే.. – దుర్గమ్ భైతి రామునిపట్ల, సిద్దిపేట జిల్లా -
మేము గీసిన బొమ్మలు
పేరు: చిందం విహాన్ తరగతి: యూకేజీ గ్రామం: అలుగునూర్, కరీంనగర్ పేరు: బెల్లంకొండ సహస్త్ర రెడ్డి తరగతి: 7వ తరగతి గ్రామం: నాగారం, మంథని జిల్లా: పెద్దపల్లి -
ఆరోగ్య ప్రదాయిని
యోగాకరీంనగర్స్పోర్ట్స్: సంస్కృత పదం యుజ్ నుంచి పుట్టిన యోగా గురించిన ప్రస్తావనలు ఋగ్వేదంలోనే ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పతంజలి మహర్షి 196 సూత్రాలతో యోగా సూత్రాలు గ్రంథాన్ని అందించి యోగాను ఒక క్రమ పద్ధతిలోకి తెచ్చారు. అందుకే ఆయన్ను యోగా పితామహుడు అంటారు. ఆ తర్వాత స్వామి వివేకానంద చికాగో ప్రసంగం ద్వారా దీనిని ప్రపంచానికి పరిచయం చేయగా.. నేడు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా మన యోగా విశ్వవ్యాప్తమైంది. ప్రయోజనాలు.. నిత్యం క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉదయాన్నే కనీసం అరగంటపాటు ఆసనాలు, ప్రాణాయామం చేస్తే శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. రక్తపోటు అదుపులోకి వచ్చి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు, ఎముకలను దృఢంగా మార్చి శరీరానికి మంచి ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది, దీర్ఘకాలిక నడుము నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మానసిక కోణంలో చూస్తే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసి మనస్సుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. విద్యార్థులు, యువతలో మెదడు పనితీరును చురుగ్గా మార్చి మానసిక ఏకాగ్రత, మేధస్సు, జ్ఞాపకశక్తిని విపరీతంగా పెంచుతుంది. శ్వాస క్రియల(ప్రాణాయామం) ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి శరీరంలో రోగ నిరోధకశక్తి పెంపొంది సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. కరీంనగర్లో యోగా ప్రస్థానం ప్రస్తుతం మన కరీంనగర్ జిల్లాలో కూడా యోగా ప్రస్థానం అద్భుతంగా సాగుతోంది. యోగా రాష్ట్ర పోటీల్లో దశాబ్దకాలానికి పైగా జరుగుతున్న రాష్ట్ర పోటీల్లో జిల్లా జట్టే చాంపియన్. నగరంలోని ఉద్యానవనాలు, సామాజిక కేంద్రాల్లో వయసుతో నిమిత్తం లేకుండా వందలాది మంది ఉదయాన్నే యోగాసనాలతో తమ రోజును ప్రారంభిస్తుండడం విశేషం. ఉమ్మడి కరీంనగర్ ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేస్తూ.. యోగాను ఒక ప్రజాఉద్యమంగా మారుస్తుండడం శుభపరిణామం కరీంనగర్ జనజీవనంలో నూతన చైతన్యం విశ్వ వేదికపై మన యోగా ఏకాగ్రత.. మేధస్సు.. సంపూర్ణ ఆరోగ్యం భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక యోగా సాధన. నేడు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధంగా మారి గ్లోబల్ వేదికపై జగద్గురువుగా నిలిచింది. నిత్యం యోగా చేస్తే మానసిక ఏకాగ్రత పెరగడమే కాకుండా.. మేధస్సు వికసించి ఒత్తిడి లేని ప్రశాంత జీవనం సాధ్యమవుతుంది. కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా అంతర్గత ప్రశాంతతకు యోగా ఎంతగానో తోడ్పడుతుంది. -
తేలు బుద్ధి
అడవిలో ఒకతేలు ఆకలితో పడుకున్నది కదలలేక మెదలలేక కన్నీరును ఒలుకుతుండే అది చూసిన ఓ కోడి ఆహారం దొరికిందని పరుగు పరుగున అచటి కొచ్చి ముక్కుతోని పొడవ చూసే ప్రాణ భయంతో తేలు కోడి బావ కోడి బావ ఒక్కమాట చెబుతాను ఆలకించుమని కోరే నాకు ఆరోగ్యం బాగులేదు ఆహారం అసలు దొరకలేదు నాతో స్నేహంగా ఉండి చూడు హాని చేయబోను ఎవరికెపుడు తేలు మాట నమ్మి కోడి తన ఇంటికి తీసుకెళ్లి ఆహారం తెచ్చి ఇచ్చి ఆతిథ్యం మంచి గిచ్చి చెలిమి తోడ వుండమంటూ సలహాలను మెండు గిచ్చే తనకు దోస్తు దొరికాడని సంబరపడి పోయే కోడి పొద్దు పొద్దు గాలనే కొక్కోర కో అంటూ లేచి తన పిల్లలను చూడ మంటూ బయటకు పోయే తల్లి కోడి బలం పుంజుకున్న తేలు కపట బుద్ధి దాచుకుంటూ కత్తెర చేతులు చాచి కస్సు బుస్సుమని లేచే అమ్మదోస్తు ఈ తేలని ప్రేమగ దరి చేరినాయి పిల్ల కోళ్లు తన తోక కొండి లేపి మరీ చిటుకు చిటుకున కుట్టే తేలు లబో దిబోమంటూ బుజ్జి బుజ్జి పిల్ల కోళ్లు తల్లి చెంతకు పరుగు తీసి బోరుమంటూ ఏడ్వసాగే తేలు బుద్ధి తెలుసుకున్న తల్లికోడి కోపంతో రయ్యిన ఉరుకురికి వచ్చి తెలుపైన ఎగిరి దూకే తన ముక్కుతో తేలును ముక్కలు ముక్కలుగ చీల్చి స్నేహ ద్రోహి దేహాన్ని కసితీరా ఆరగించే... ఎప్పుడైనా ఈ జగాన బుద్ధిలేని ప్రబుద్ధులతో జాగ్రత్తగా మెదలమంటూ తల్లికోడి హితము చెప్పే..! డా.కటుకోఝ్వల రమేశ్ కవి, రచయిత ఖమ్మం జిల్లా -
ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్కోనరావుపేట(వేములవాడ): ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించవచ్చని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని మరిమడ్లలో నిర్వహించిన గ్రామసభకు హాజరై మాట్లాడారు. వర్షాకాల సన్నద్ధతపై అధికారులు సూచించిన విషయాలను ప్రజలు పాటించాలన్నారు. డ్రైనేజీల్లో ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దని కోరారు. గ్రామాల్లో నీటి సరఫరా సక్రమంగా లేకుంటే అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఆయిల్పాం, కూరగాయలు తదితర లాభదాయక పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. ద్విచక్రవాహనం నడిపే ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, మద్యం తాగి వాహనాలు నడపవద్దన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించే బీఎల్వోలకు ప్రజలు సహకరించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పంపించాలని కోరారు. వేములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి, గ్రామీణాభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ అన్వర్, ఇంట్రా ఈఈ సుమలత, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ధ, సర్పంచ్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై దృష్టి పెట్టాలిసిరిసిల్ల: జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై దృష్టి పెట్టి ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్లో అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, హమాలీల సంఖ్య, గన్ని సంచులు, ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు మూసి వేశారు అని అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లు తుది దశకు చేరిన కేంద్రాల నుంచి హమాలీలు, వాహనాలను ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా చేయాలని, అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. -
● మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ
సిరిసిల్ల స్వచ్ఛ కీర్తిని కాపాడాలి సిరిసిల్లటౌన్: స్వచ్ఛ పట్టణ సిరిసిల్ల కీర్తిని కాపాడుకోవడానికి పౌరులు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ కోరారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం 3,16,27వ వార్డుల్లో నిర్వహించిన వార్డు సభలో మాట్లాడారు. ముందుగా ఇటీవల 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతిచెందగా, సంతాపాన్ని తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈసందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలకు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో పట్టణాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదిర్ ఫాషా, డీఈ వాణి, ఏఈ నరసింహస్వామి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తాం
చందుర్తి(వేములవాడ): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తామని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. గురువారం మండలంలోని మల్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నాయని, కొన్ని కేంద్రాల్లో పూర్తి కావడంతో లారీల కొరత తీరుతుందన్నారు. గన్నీ సంచులు పంపించి కొనుగోళ్లు మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్త పడాలని సూచించారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం కళ్యాణి, ఆర్ఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సన్నవడ్ల సాగుపై దృష్టిపెట్టాలి వేములవాడరూరల్: రైతులు ఆయిల్పాం, సన్నవడ్ల సాగుపై దృష్టి పెట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. గురువారం వేములవాడ పరిధిలోని బాలనగర్, వేములవాడ రూరల్ మండలం వట్టెంల, ఫాజుల్నగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. లాభదాయక పంటల సాగుకు ప్రోత్సాహం తదితర అంశాలపై రైతులతో చర్చించారు. సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేసేలా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. -
పల్లెల్లో చెత్త బాధ
● పాలకులకు భారంగా చెత్త సేకరణ ● ఆదాయ వనరులు కరువు ● ప్రభుత్వం నుంచి రాని నిధులు ● పెరిగిన డీజిల్ ధరలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పల్లెల్లో పాలకవర్గాలను కదిలిస్తే కష్టాల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఆదాయ వనరులు లేక.. ప్రభుత్వం నుంచి నిధులు రాక నిర్వహణ భారంగా మారింది. పల్లె పాలనపగ్గాలు చేపట్టామన్న సంతోషం కూడా వారిలో కనిపించడం లేదు. చెత్త సేకరణ నుంచి మల్టీపర్పస్ కార్మికుల వేతనాల వరకు ఎలా చెల్లించేది అని ప్రతీ నెల మదనపడుతున్నారు. చిన్న పల్లెలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఏటా రూ.40వేలు చెల్లిస్తున్నా అవి ఎటూ సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోవడంతో పల్లెపాలనతో సర్పంచులు ఆర్థికబాధలు అన్నీ..ఇన్నీ కావు. చిన్న పల్లెలకు చిక్కులే.. జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 13 మండల కేంద్రాలతోపాటు మరో 20 వరకు మేజర్ గ్రామపంచాయతీలు ఉంటాయి. మిగతావి చిన్న పల్లెలు, తండా గ్రామపంచాయతీలు ఉన్నాయి. చిన్నపల్లెల నిర్వహణకు ప్రతీ నెల రూ.50వేల వరకు ఖర్చు అవుతున్నాయి. కేంద్రం నిధులు రూ.40వేలు ఇస్తుండడంతో అవి ఎటూ సరిపోవడం లేదు. వీటితోపాటు వీధిదీపాల నిర్వహణ, చెత్తసేకరణ, మల్టీపర్పస్ వర్కర్ల వేతనాలు, ఇతరత్ర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ ఫొటోలో చెత్త ట్రాక్టర్ నడుపుతున్నది బుగ్గరాజేశ్వరతండా సర్పంచ్ అజ్మీర తిరుపతినాయక్. గ్రామపంచాయతీలో ఇంటింటికీ వెళ్లి చెత్తసేకరించేందుకు గతంలో ట్రాక్టర్ కొనుగోలు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ వ్యక్తిగత కారణాలతో విధులకు హాజరుకాలేదు. తానే డ్రైవర్గా అవతారం ఎత్తి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాడు. చిన్న పల్లెటూరు కావడంతో ఆదాయం అంతంతే వస్తుందని.. మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు, చెత్తట్రాక్టర్ నిర్వహణ, డీజిల్ ఖర్చు తడిసి మోపెడవుతుందని తెలిపారు. ప్రతి నెలా రూ.70 వేల వరకు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం నిధులు రాలేవని తెలిపారు. తండా పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పెంచాలని కోరారు.పంచాయతీలకు 2025–26 ఆర్థిక సంవత్సరం నిధులు మంజూరు కాలేదు. త్వరలోనే నిధులు వస్తాయి. నిధులు రాగానే పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తాం. – సత్తయ్య, ఎంపీడీవో, ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచులుగా గెలుపొంది ఆరు నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు నిధులు రాలేదు. ఇన్నాళ్లు గ్రామ నిర్వహణ ఖర్చు మా సొంత డబ్బులు వెచ్చించాం. గ్రామంలో కూడా ఆదాయం అంతంతే ఉంది. ప్రతీ నెల రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎటూ సరిపోవడం లేదు. నిధులు మంజూరు చేయాలి. అంతేకాకుండా మల్టీపర్పస్ వర్కర్ల కొరత ఉంది. – బోనాల మణెమ్మ, పదిర సర్పంచ్ -
సొంతింటి కల.. నెరవేర్చేలా..
అర్హులైన లబ్ధిదారుల ఎంపికతోపాటు పనులు ప్రారంభమైన నాటినుంచి ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తూ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి నిర్మాణం మొదలైన స్వల్పవ్యవధిలోనే నిధులు మంజూరై, గృహ ప్రవేశాలు చేస్తుండడం విశేషం. దీనికితోడు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయి, పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్బెడ్రూమ్ ఇళ్లను సైతం పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్బెడ్రూమ్ ఇళ్లను పూర్తిచేసి, విద్యుత్, మంచినీటి, డ్రైనేజీ, రోడ్లు వంటి వసతులు కల్పించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. గతంలో కేటాయించిన వాటిల్లో అనర్హులు ఉంటే తొలగించి, అర్హులకు కేటాయించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అనేకఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల ఫలించనుంది.సాక్షి పెద్దపల్లి: పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. తొలివిడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు కేటాయించింది. వివిధ కారణాలతో అప్పుడు పదుల సంఖ్యలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపలేదు. వాటిని రద్దు చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. రద్దుచేసిన వాటిని మిగతా పేదలకు కేటాయించేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికితోడు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ప్రతీ నియోజకవర్గానికి మరోరెండు వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ నిర్ణయించింది.జిల్లా కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల మంజూరైనవి 10,779 6,452 10,860 7,826 నిర్మాణదశలోనివి 9,320 2,066 7,740 5,585 పూర్తయినవి 1,459 1,012 1,247 2,241 జిల్లా కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల మంజూరైనవి 9,021 3,394 8,360 6,886 పంపిణీ చేసినవి 4,129 1,630 5,292 3,610 పంపిణీకి సిద్ధంగా ఉన్నవి 4,892 245 2,449 250 -
మూడేళ్లుగా మూత‘బడి’
ఇల్లంతకుంట(మానకొండూర్): ఒకప్పుడు 150 మందితో కళకళలాడిన సర్కారు బడి.. మూతపడి మూడేళ్లైనా ప్రారంభానికి నోచుకోవడం లేదు. అధికారులు, నాయకులు పట్టించుకోకపోవడంతో గ్రామంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు వ్యయప్రయాసాలకోర్చి తమ పిల్లలను మండలకేంద్రంలోని ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. విద్యార్థులు రావడం లేదని.. మండలంలోని రహీంఖాన్పేట పెద్ద గ్రామపంచాయతీ. 2,300 జనాభా ఉంటారు. విద్యార్థులు రావడం లేదనే నెపంతో పాఠశాలను మూసివేసి, ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై ఇతర స్కూళ్లకు కేటాయించారు. కాగా, రహీంఖాన్పేట అనుబంధ గ్రామం ఎర్రనర్సుపల్లె ప్రాథమిక పాఠశాల మూతపడగా, గతేడాది తిరిగి ప్రారంభించి 20 మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతుంది. కానీ, మేజర్ గ్రామమైన రహీంఖాన్పేట బడిని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆయా గ్రామాల్లో కూడా.. ఇల్లంతకుంట మండలంలో విద్యార్థులు రావడంలేదని నారెడ్డిపల్లి, చిక్కుడువానిపల్లి, కిష్టారావుపల్లి, గూడెపుపల్లి, కేశన్నపల్లి, తెనుగువాండ్లపల్లి, తెనుగువారిపల్లి గ్రామాల్లో ప్రభుత్వ బడులను మూసివేశారు. మూతపడిన ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల భవనాలు నిరుపయోగంగా మారాయి. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు మండలకేంద్రంలోని ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్నారు. మేజర్ గ్రామాల్లో మూతపడిన సర్కార్ బడులను తిరిగి ప్రారంభించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
● ఎస్పీ మహేశ్ బి గితే తంగళ్లపల్లి: ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత, శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం మండలంలోని తాడూర్ గ్రామంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. గ్రామాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను రోడ్డు సేఫ్టీ కమిటీలు గుర్తించి సంబంధిత అధికారుల సమన్వయంతో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, పనిచేసే ప్రదేశాల్లో మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీటీమ్ నం. 87126 56425లో సంప్రదించాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీస్శాఖకు సహకరించాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, రూరల్ సీఐ నాగేశ్వరరావు, ఎస్సై ఉపేంద్రచారి, ఇన్చార్జి ఎంపీడీవో రమేశ్, ఏవో సంజీవ్, ఎంపీవో మీర్జాఅఫ్జల్అహ్మద్బేగ్, ఎంఈవో రాజు తదితరులు పాల్గొన్నారు.వార్డులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక డ్రైవ్లువేములవాడ: పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపల్లోని 14,15,25వ వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో పట్టణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ఆవరణలో ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ లోకేశ్, మేనేజర్ సంపత్రెడ్డి, ఎస్సై రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలుసిరిసిల్ల: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్ బి గితే గురువారం తెలిపారు. బుధవారం అర్ధరాత్రి వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ తనిఖీలు చేపట్టామని, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 55 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. నంబరు ప్లేట్లు కనిపించకుండా మార్ఫింగ్ చేసిన 24 వాహనాలను గుర్తించామని వివరించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిత్యం విస్తృతంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరోధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నంబర్ ప్లేట్ ఏర్పడకుండా ఏదైనా అడ్డుపెట్టిన, సగం నంబర్లు తొలగించి వాహనం నడిపితే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరిసిరిసిల్ల: నిబంధనల మేరకు కండిషన్ లేని బస్సులు రోడ్డు ఎక్కడానికి వీలు లేదని, స్కూల్ బస్సులకు విధిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని జిల్లా రవాణా శాఖ అధికారి డి.శ్రీనివాస్ కోరారు. జిల్లాలోని వివిధ ప్రైవేటు స్కూళ్లకు చెందిన బస్సులను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 160 స్కూల్ బస్సులు ఉన్నాయని, యజమానులు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు. ఎవరైనా ఫిట్నెస్ లేకుండా అక్రమంగా రోడ్డుపై నడిపితే నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎంవీఐ వంశీధర్, ఏఎంవీఐ పృథ్వీధర్వర్మ, సిబ్బంది ఉన్నారు. -
ఏమో.. తెలియదు సార్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు మాస్టర్మైండ్ సుబోధ్ సింగ్ కస్టడీలో నోరు మెదపడం లేదు. మే 3వ తేదీన కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీస్లో దోపిడీకి పాల్పడిన సుబోధ్ గ్యాంగ్.. అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో సూత్రధారి సుబోధ్సింగ్గా తేల్చారు. దేశవ్యాప్తంగా బంగారం దుకాణాల్లో ఆరితేరిన సుబోధ్ ముఠాసభ్యులు ఇప్పటివరకు బిహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో దోపిడీ చేశారు. ఈ గ్యాంగ్కు దక్షిణాదిన ఇదే తొలినేరం కావడం గమనార్హం. మే 28న బిహార్ నుంచి సుబోధ్ను తెలంగాణకు తీసుకొచ్చిన పోలీసులు అదే రోజురాత్రి కరీంనగర్కు తరలించారు. బుధవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి కస్టడీకి తరలించిన పోలీసులు వేసిన పలు పశ్నలకు సుబోధ్ మౌనం వహించినట్లు సమాచారం. అదే సమయంలో తన పాత కేసులకు సంబంధించి విషయాలను మాత్రం వెల్లడించినట్లు తెలిసింది. పోలీసు కస్టడీలో సుబోధ్సింగ్ ఏమాత్రం బెరుకు లేకుండా నవ్వుతూ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం పలు సాంకేతిక వివరాలు అతని ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది. సుబోద్తో పాటు రఘునాథ్ కర్మాకర్, రావేశ్కుమార్లను కలిపి విచారించారు. ఇప్పటికే పోలీసులు పట్టుకున్న మరో నిందితుడు మేహతాబ్(సిమ్ కార్డులు సరఫరా చేసిన వ్యక్తి)ని కస్టడీకి దూరంగా ఉంచారు. పోలీసులకు సవాల్.. వాస్తవానికి దోపిడీ జరిగిన విధానం పోలీసులకు సవాల్గా మారింది. అయినప్పటికీ కరీంనగర్ పోలీసులు కేసును తక్కువ వ్యవధిలో ఛేదించారు. ఇప్పటికే బంగారం దేశందాటి నేపాల్కు వెళ్లినా సరే దోపిడీలో పాల్గొన్న దాదాపు అందరి వివరాలు సేకరించగలిగారు. ఇటీవల పోలీసులు పట్టుకొచ్చిన రఘునాథ్ కర్మాకర్, రావిశ్కుమార్, మెహతాబ్ఖాన్ను అరెస్టు చేయగలిగారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా సుబోధ్ సింగ్ను మాస్టర్మైండ్గా తేల్చిన పోలీసులు అతని కోసం ఇటీవల బిహార్ వెళ్లారు. అక్కడ సుబోధ్ కోసం న్యాయపోరాటమే చేయాల్సి వచ్చింది. ఆరు కోర్టులు.. అనేక సవాళ్లు.. సుబోధ్సింగ్ నెట్వర్క్లో లాయర్లు కూడా ఉన్నారు. అతడిని రాష్ట్రానికి తరలించాలని కరీంనగర్ పోలీసులు వేసిన ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్ను సవాలు చేస్తూ సుబోద్ లాయర్లు అడుగడుగునా అడ్డుపడ్డారు. మొత్త ఆరు కోర్టుల్లో అతడిని లాయర్లు తమ వాదనలతో పోలీసులకు చుక్కలు చూపించారు. అయినప్పటికీ పోలీసులు చూపిన ఆధారాలకు న్యాయస్థానాలు సమ్మతించి సుబోధ్సింగ్ను అప్పగించడం అనివార్యంగా మారింది. సుబోధ్ను తరలించడంలో సీపీ గౌస్ ఆలం అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. న్యాయనిపుణులు, బిహార్కు చెందిన పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను సంప్రదిస్తూ.. పోలీసులకు ఎప్పటికపుడు సూచనలు చేశారు. బిహార్లో గడ్డాలు పెంచుకుని.. మాసినబట్టలతో పోలీసులు పూర్తిగా ఆహార్యం మార్చుకుని సంచరించారు. పలువురు అధికారులు సుబోధ్ తరలింపునకు అనేక అడ్డుపుల్లలు వేశారు. బేడీలు తీసి విమానంలోకి.. సుబోధ్ తరలింపునకు మార్గం సుగమం అయిన తరువాత అతడిని విమానాశ్రయానికి తరలించడం పోలీసులకు సవాలుగా మారింది. దారి వెంట అతడి అనుచరులు దాడిచేస్తారన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకురావాల్సి వచ్చింది. అతడికి బేడీలు వేయకుండా విమానం ఎక్కించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మే 28న సుబోధ్ని తరలిస్తున్నారన్న సమాచారం ముందుగా ఏవియేషన్ అధికారులకు తెలిపి వారి సాయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రయాణికులకంటే ముందే సుబోధ్కు బేడీలు తీసివేసి విమానం ఎక్కించారు. అతడికి ఎస్క్రా్ట్గా సీఐ తిరుమల్, ఎస్సై రాజన్న కూర్చున్నారు. విమానం శంషాబాద్లో దిగాక సీపీ గౌస్ ఆలంతో సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
80 ఫీట్ల రోడ్డుకు మోక్షం
నాడు ఇరుగ్గా ఉన్న వేములవాడ రాజన్న గుడి నుంచి బ్రిడ్జి వరకున్న ప్రధాన రహదారి(ఫైల్), రూ.6కోట్ల నిధులతో ప్రారంభమైన డబుల్ రోడ్డు పనులువేములవాడ: రాజన్న ఆలయం నుంచి బ్రిడ్జి వరకు చేపట్టిన 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుమారు రూ.6కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు నిధుల కొరత కారణంగా కొంతకాలంగా నిలిచిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు, వ్యాపారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. సైడ్ డ్రైనేజీలు, విద్యుత్ లైన్, రోడ్డు వెడల్పు పనులు, మట్టి తొలగింపు, నిర్మాణానికి సంబంధించిన యంత్రాల పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. రోడ్డు విస్తరణ పూర్తయితే రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు రాకపోకలు సులభతరం కావడంతోపాటు పట్టణ ట్రాఫిక్ సమస్యలకు కూడా కొంతమేర పరిష్కారం లభించనుంది. ప్రస్తుతం రోడ్డు పనుల కారణంగా దుమ్ము, ట్రాఫిక్ ఇబ్బందులున్నా.. పనులు పూర్తయిన తర్వాత వేములవాడ ప్రధాన రహదారికి కొత్త రూపు రానుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి, పట్టణ సుందరీకరణలో భాగంగా ఈ రోడ్డు కీలకంగా మారనుంది. 60 ఏళ్ల కల సాకారం గతంలో ఎన్నో చర్చలు జరిగినా.. కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజల్లో నిరాశానిస్పృహలు నెలకొన్నాయి. సీఎం రేవంత్, ఎమ్మెల్యే ఆది పట్టుదలతో చేపట్టిన కార్యాచరణ ఇప్పుడు ఆ కలకు ఆకారాన్నిచ్చాయి. ఇప్పటికే పాత భవనాల కూల్చివేత పూర్తయ్యింది. చుట్టుపక్కల గోడలు, నిర్మాణాలు ధ్వంసమవుతున్నా.. ప్రజల మనస్సుల్లో ఆశల పునాది పడింది. కోర్టు స్టేలు, ఇంటి యజమానుల ఆవేదనలు ఇలా అన్నింటిని అధిగమించుకొని పనులు మొదలయ్యాయి. 60 ఏళ్ల కల సాకారం కానుందని జనం సంబరపడిపోతున్నారు.నిర్వాసితులు: 254 మంది నిర్మాణాలు: 322 కావాల్సిన భూసేకరణ: 750 మీటర్లు చేపట్టాల్సిన వెడల్పు: 80 ఫీట్లు -
పేదల కల నిజం చేయడమే లక్ష్యం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోనరావుపేట(వేములవాడ): పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మర్తనపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతీ కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎంపీడీవో స్నిగ్ధ, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, సర్పంచులు బోయిని దేవరాజు, దీపిక, ఉప సర్పంచ్ బోనాల పునీత్, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, డీసీసీ కార్యదర్శి షేక్ ఫిరోజ్పాషా, మండలాధ్యక్షుడు సత్యం, సింగిల్విండో చైర్మన్ బండ నర్సయ్య, నాయకులు ఐదరి శ్రీనివాస్, రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట(సిరిసిల్ల): లింగన్నపేట పీహెచ్సీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రజిత తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వ్యాధి నిరోధక టీకాల మందులను పరిశీలించి సరైన మోతా దు, నిర్దేశిత కాలంలో వేయడంతోపాటు టీకా తీసుకున్న తర్వాత స్వల్పంగా జ్వరం రావడం, తీసుకున్న ప్రాంతంలో చర్మం ఎర్రబడడం, వాపు లాంటివి సంభవిస్తాయని, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల ఆధికారి సంపత్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో రాజ్కుమార్, వైద్యాధికారి వినయ్కుమార్, సీహెచ్వో రమేశ్ తదితరులున్నారు.చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలి ముస్తాబాద్: చీకొడు, గూడెం, ఆవునూర్ ఆరోగ్య ఉప కేంద్రాలను జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సంపత్కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల రికార్డులను పరిశీలించారు. 0 నుంచి 5 సంవత్సరాల చిన్నారులకు సకాలంలో టీకాలు వేయాలని సూచించారు. టీకా తీసుకున్నాక చిన్నారుల్లో వచ్చే సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రభుత్వ వైద్య పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ రాజ్కుమార్, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలున్నారు. ప్రజా సంక్షేమమే బీజేపీ లక్ష్యంసిరిసిల్లటౌన్: ప్రజా సంక్షేమ పాలనే భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యమని జాతీయ నాయకుడు మురళీధర్రావు పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్లలోని వాసవి కల్యాణ మంటపంలో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై విశిష్ట స్థానాన్ని సంపాదించిందన్నారు. 2 రోజుల శిక్షణ శిబిరం సిరిసిల్లలో ప్రశిక్షణ శిబిరం 2 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. పార్టీ సిద్ధాంతం, పార్టీ చరిత్ర, వికాసం, భారత రాజకీయ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల బాధ్యతలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సోషల్ మీడియా వినియోగం, సమర్థవంతమైన ప్రజా సంబంధాలు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై వివిధ రంగాల నిపుణులు, పార్టీ సీనియర్ నాయకులు శిక్షణ అందిస్తారన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చెన్నమనేని వికాస్రావు, కరీంనగర్ పార్లమెంటు కోకన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ఇన్చార్జి గంగాడి మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
‘రాజన్న’ పనుల్లో వేగం పెంచాలి
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. వీటీఏడీఏ(వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఆధ్వర్యంలో రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులు, రాజన్న గుడి నుంచి బ్రిడ్జి వరకు ప్రధాన రోడ్డు విస్తరణ పనులను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని ఆర్అండ్బీ అధికారులనడిగి తెలుసుకున్నారు. రాజన్న ప్రధాన ఆలయ విస్తరణ, ప్రతీ అభివృద్ధి పనికి సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. రాజన్న ఆలయం నుంచి మూల వాగు బ్రిడ్జి వరకు కొనసాగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి.. పురోగతి, పూర్తి చేయడంపై మున్సిపల్ అధికారులను ఆరా తీశారు. ఆర్అండ్బీ ఈఈ నరసింహాచారి, వేములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్శర్మ, ఆర్అండ్బీ డీఈ శాంతయ్య, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేశ్, తహసీల్దార్ జయంత్, టీపీవో అన్సార్ పాల్గొన్నారు. వార్డు సభలు నిర్వహించాలిసిరిసిల్ల: గ్రామాల్లో వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 4, 6, 8, 10ల్లో నిర్వహించనున్న ప్రత్యేక గ్రామ, వార్డు సభలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల వ్యవసాయ అధికారులు, ఎంపీవోలతో బుధవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతీ గ్రామం, వార్డులో సభలు నిర్వహించి ప్రజలతో ప్రత్యక్షంగా చర్చించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను ముందుగానే గుర్తించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రచారం చేయాలి గ్రామ, వార్డు సభల్లో బడిబాట కార్యక్రమంపై విస్తత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మండల, ఇంటర్ విద్యాధికారులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్ ప్రకారం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వేములవాడ ఆర్డీవో కె.ఎస్.బి.కుమారి, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అన్ లోడింగ్ వేగం పెంచాలి జిల్లాలో ధాన్యం అన్ లోడింగ్లో వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. అపరెల్ పార్క్, రైస్ మిల్లులు, గోదాముల్లో ధాన్యం అన్లోడింగ్, జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణపై జిల్లాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. అపరెల్ పార్క్, రైస్ మిల్లులు, గోదాముల్లో అన్లోడింగ్ వేగవంతం చేయడం.. ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు మూసేశారు.. తదితర అంశాలపై ఆమె ఆరా తీశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్కారు బడుల్లో ప్రవేశాలు పెంచాలి సిరిసిల్లటౌన్: జిల్లాలో ప్రభుత్వ బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రతీ పాఠశాలలో కనీసం 10 శాతం మేర విద్యార్థుల నమోదును పెంచాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణా సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల విద్యాశాఖ పనితీరును సమీక్షించి మాట్లాడారు. బడిబాట కార్యక్రమాన్ని గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్త్తతంగా నిర్వహించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదును పెంచాలని సూచించారు. కలెక్టర్ గరిమా అగ్రవాల్, జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి శరత్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరచారి, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ పాల్గొన్నారు.


