breaking news
Rajanna Sircilla District News
-
575 మందిపై అనర్హత వేటు !
● 2019లో ఎన్నికల ఖర్చు చూపకపోవడమే కారణం ● ఎన్నికల వాయిదాతో కలిసి వచ్చిన అవకాశం సిరిసిల్ల అర్బన్: జిల్లాలో 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి ఖర్చుల వివరాలు చూపని 575 మందిపై ఎన్నికల సంఘం 2021లో అనర్హత వేటువేసింది. ఫలితంగా మీరు మూడేళ్లపాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులే. సాధారణంగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఖర్చు చేసిన ప్రతీ పైసాకు విధిగా లెక్కలు చెప్పాలి. లేదంటే తర్వాత అనర్హత వేటు పడుతుంది. ఇదీ ఎన్నికల సంఘం విధించిన నిబంధన. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు ఇవేమి పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో 2019లో గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసి లేక్కలు చూపని వారు జిల్లాలో 575 మందిపై వేటుపడింది. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన వారిలో 45 మంది ఎన్నికల ఖర్చులు చూపలేదు. వార్డు సభ్యులుగా జిల్లాలో 34 మంది ఎన్నికై లెక్కలు చూపకపోవడంతో వీరిపై అనర్హత వేటుపడింది. వార్డు సభ్యులుగా పోటీచేసి ఓడిపోయిన వారిలో 446 మంది ఖర్చులు చూపలేదు. వీరందరిపై ఎన్నికల సంఘం అనర్హత వేటువేసింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ముగ్గురు, ఎంపీటీసీలుగా పోటీచేసి ఓడిపోయిన 47 మంది ఎన్నికలు పూర్తయినా ఇచ్చిన గడువులోపు లెక్కలు చూపకపోవడంతో వీరిపై అనర్హత వేటు వేసింది. ఎన్నికలు వాయిదాతో కలిసివచ్చిన అవకాశం పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1వ తేదీన ముగియగా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం గతేడాది జూలైలో ముగిసింది. సకాలంలో ఎన్నికలు జరిగితే వేటుపడిన అభ్యర్థులు పోటీచేసే అవకాశం కోల్పోయేవారు. కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో జిల్లాలో 575 మంది అనర్హత పొందిన అభ్యర్థులకు మళ్లీ పదవులకు పోటీచేసే అవకాశం లభించింది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 11 నుంచి మూడు విడతలుగా గ్రామపంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో 2019లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో అనర్హత పొందిన అభ్యర్థుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. స్థానికసంస్థల ఎన్నికలు వాయిదాతో ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలిసి వచ్చింది. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
● రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవికుమార్ ముస్తాబాద్(సిరిసిల్ల): పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవికుమార్ పేర్కొన్నారు. ముస్తాబాద్, నామాపూర్, గూడెంలోని ఎన్నికల క్లస్టర్లను శుక్రవారం పరిశీలించారు. అభ్యర్థులకు కావాల్సిన సహాయాన్ని హెల్పింగ్డెస్క్ ఎలా అందిస్తుందో తెలుసుకున్నారు. ఎంపీడీవో లచ్చాలు, ఎంపీవో వాహిద్ ఉన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నామినేషన్ల ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అధికారులకు సూచించారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట, హరిదాస్నగర్, వెంకటాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. తహసీల్దార్ సుజాత, మండల అసిస్టెంట్ ఎన్నికల అధికారి సత్తయ్య తదితరులు ఉన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం కోరారు. మండలంలోని రాళ్లపేటలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ మృత్తికా దినోత్సవంలో మాట్లాడారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ కేబీ సునీతాదేవి మాట్లాడుతూ అర్బన్ ఫార్మింగ్, నేల ఆరోగ్యం గురించి వివరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రొఫెసర్లు డాక్టర్ ఆర్.సాయికుమార్, డాక్టర్ పి.మాధవి, డాక్టర్ ఎం.సంపత్కుమార్, డాక్టర్ టి.అరుణ్బాబు, యశశ్విని, మండల వ్యవసాయాధికారి కనవేని సంజీవ్, సాయికిరణ్, ఏఈవో అనూష పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: పనిప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరగకుండా చూడాలని జిల్లా సంక్షేమాధికారి పి.లక్ష్మీరాజం సూచించారు. సిరిసిల్ల పరిధిలోని అపరెల్ పార్క్లోని పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో శుక్రవారం సమావేశమయ్యారు. లక్ష్మీరాజం మాట్లాడుతూ పనిప్రదేశాల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్మికుల మానసికోల్లాసానికి చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లల డేకేర్ సెంటర్లో అందుతున్న సేవలు పరిశీలించారు. పంచాయతీ బరిలో అంగన్వాడీ ఆయాఇల్లంతకుంట(మానకొండూర్): పంచాయతీ పోరులో అంగన్వాడీ ఆయా నిల్చున్నారు. మండలంలోని గొల్లపల్లికి చెందిన అంగన్వాడీ ఆయా కడగండ్ల శిరీష బీఎస్సీ చదివారు. 2017 నుంచి గ్రామంలో అంగన్వాడీ ఆయాగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు 2014లో సోమారంపేట ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి 23 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గొల్లపల్లి గ్రామం ప్రస్తుతం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో భర్త తిరుపతి ప్రోత్సాహంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అంగన్వాడీ ఆయా ఉద్యోగానికి రాజీనామా చేశారు. -
అప్పుడే సర్పంచ్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇల్లు అలకగానే పండగ కాదు.. నామినేషన్ వేయగానే సర్పంచ్ అయిపోరు.. రాజకీయ రణరంగంలోకి దిగగానే సరిపోదు.. తెరవెనక ఎంతో శ్రమించాల్సి ఉంటుంది అనేది సత్యం. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో పరిస్థితులు ఒకప్పటిలా లేవు. ఊరికి ఏదో చేయాలని పోటీ చేసేందుకు వస్తున్న వారంతా రూ.లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. మార్కెట్లో నగదు చలామణి తగ్గిపోయింది. సర్పంచ్ పదవి కోసం బరిలోకి దిగుతున్న వారికి ఇదో సవాల్గా మారింది. నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు వారం రోజుల సమయం ఉంది. నిత్యం ప్రచారానికి రూ.వేలల్లో ఖర్చవుతుంది. ఫ్లెక్సీలు, టీవీలు, పేపర్లలో ప్రచారానికి రూ.లక్షల్లో ఖర్చు పెట్టాలి. ఇదికాక నిత్యం అనుచరులకు మందు, విందు సరేసరి. వీటన్నింటికీ నగదు కావాలి. అందుకోసం అభ్యర్థులు అప్పుల వేటలో పడ్డారు. ‘అప్పు’డే సర్పంచ్ కాగలరు అన్న ఆశయంతో ఖర్చు కోసం వెనకాడకపోవడం గమనార్హం. గెలవకపోతే అప్పుల ఊబిలో.. వాస్తవానికి అప్పులు చేసి పోటీచేస్తున్న అభ్యర్థులలో నూటికి 90 శాతం మంది సాహసం చేస్తున్నారు. రూ.లక్షల్లో ఖర్చు పెడుతూ.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. బరిలో ఉన్న వారు గెలుస్తారన్న గ్యారెంటీ లేకపోయినా నామినేషన్ వేశాక ఇవేమీ ఆలోచించే పరిస్థితిలో లేరు. గెలుస్తారన్న నమ్మకంతో ఖర్చు చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు ఏకగ్రీవం కోసం ఇప్పటికే రూ.లక్షలు పెట్టినవారు, పెట్టబోతున్న వారికి అప్పుల ముప్పు పొంచి ఉంది. గెలిచినా, గెలవకపోయినా.. ఖర్చు మాత్రం పెట్టక తప్పని పరిస్థితి. అందుకే, ఈ యువ నాయకులు తమ డాబు, దర్పం ప్రదర్శించుకోవడానికి భూములు, నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. గెలిచినా, గెలవకపోయినా రుణం తీర్చడం మాత్రం అనివార్యం. ఈ నేపథ్యంలో వీరంతా ఈ అప్పులను ఎలా తీరుస్తారో చూడాలి మరి!కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇంకా రెండో, మూడో విడతల్లో పలు గ్రామాలు ఏకగ్రీవానికి మొగ్గుచూపుతున్నాయి. అయితే ఏకగ్రీవాలు అనుకున్నంత సులువుగా కొలిక్కి రావడం లేదు. దాని వెనక చాలా తతంగం నడుస్తోంది. చిన్నగ్రామాలు, వెయ్యి లోపు ఓట్లు ఉన్న గ్రామాల్లోనే పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. ఇక 3వేలు.. ఆపై ఓట్లు ఉన్న గ్రామాల్లో పరిస్థితి హోరాహోరీగా సాగుతోంది. ఏకగ్రీవమవుతున్న గ్రామాల్లో ముందు నామినేషన్లు వేసే వారిని, వేసిన వారిని నయానో, భయానో దారికి తెచ్చుకుంటున్నారు. దీనికి నామినేషన్ వేసిన అభ్యర్థులకు చాలా ఖర్చు చేస్తున్నారు. ఇక ఊరికి ఏం చేస్తారో? ఆ పనికి అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఎంతలేదన్నా.. ఓ మోస్తరు గ్రామ పంచాయతీల్లో రూ.30లక్షల నుంచి రూ.50 లక్షల వరకు భరించాల్సిన పరిస్థితి. ఇంత నగదు కోసం అభ్యర్థులు అప్పులబాట పడుతున్నారు. తాము సంపాదించుకున్న ఆస్తులు, ఇంట్లో ఆడవాళ్ల నగలు తీసుకుని తాకట్టుపెట్టి మరీ నగదు తెస్తున్నారు. వీటిని తమను నమ్మేలా నామినేషన్ వేసిన వారికి, ఊర్లో పెద్ద మనుషులకు సమర్పిస్తేనే విత్డ్రాయల్స్ సజావుగా సాగుతున్నాయి.జిల్లా పంచాయతీలు అభ్యర్థులు కరీంనగర్ 89 388 జగిత్యాల 118 461 పెద్దపల్లి 95 376 రాజన్నసిరిసిల్ల 76 295 -
రగుడు జంక్షన్ పనులు ప్రారంభం
సిరిసిల్ల: రగుడు కలెక్టరేట్ జంక్షన్ వద్ద అభివృద్ధి పనులను శుక్రవారం ప్రారంభించారు. రూ.3.50 కోట్లతో చేపట్టిన కూడలి పనులు పెండింగ్లో ఉన్నాయని, ప్రమాదకరంగా మారిందంటూ ‘సాక్షి’లో ‘డేంజర్ జంక్షన్స్’ శీర్షికన నవంబరు 27న ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. కాంట్రాక్టర్ను పిలిచి పనులను ప్రారంభించారు. మున్సిపల్ డీఈఈ వాణి, వర్క్ఇన్స్పెక్టర్ అంజాగౌడ్ పనులను పర్యవేక్షించారు. రడుగు వైపు, కలెక్టరేట్ ఎదుట రెండు వేర్వేరుగా బస్ షెల్టర్లను రూ.12.50 లక్షలతో నిర్మించనున్నారు. ఇప్పటికే రిటర్నింగ్ వాల్ పూర్తి చేశారు. -
తుది అంకానికి పల్లె పోరు
మూడో విడత నామినేషన్లు మండలం సర్పంచ్ నామినేషన్లు వార్డు నామినేషన్లు స్థానాలు స్థానాలు ఎల్లారెడ్డిపేట 26 204 226 571 వీర్నపల్లి 17 98 132 219 ముస్తాబాద్ 22 – 202 – గంభీరావుపేట 22 161 202 582సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 9 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా.. మరిన్ని ఏకగ్రీమయ్యే అవకాశం ఉంది. అనేక గ్రామాల్లో సర్పంచ్ స్థానానికి బహుముఖ పోటీ నెలకొంది. తొలి విడత ఎన్నికలు 11వ తేదీన జరుగుతుండగా.. ఇప్పటికే అభ్యర్థులకు కేటాయించిన గుర్తులతో పోటాపోటీగా ప్రచా రం చేస్తున్నారు. చందుర్తి, వేములవాడరూరల్, కోనరావుపేట, రుద్రంగి, వేములవాడ మండలాల్లో మైకుల మోతలు మోగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు బుజ్జగింపులు బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో రెండో విడత ఎన్నికలు ఈనెల 14న జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు శనివారం వరకు ఉండడంతో పోటీలో ఉన్న రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకునేలా బుజ్జగిస్తున్నారు. మరోవైప రాయ‘భేరాలు’ సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో ఫోన్లు చేయిస్తూ ప్రధాన అభ్యర్థులను తప్పించే పనిలో పడ్డారు. మూడో విడత ముమ్మరంగా నామినేషన్లు మూడో విడత ఎన్నికలు ఈనెల 17న జరగనుండగా.. నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లో సాయంత్రం 5 గంటల లోపు క్లస్టర్ ఆఫీస్లకు చేరిన వారికి టోకెన్లు ఇచ్చారు. రాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. మొదటి విడత నామినేషన్ల పర్వంలో దొర్లిన అపశ్రుతితో నామినేషన్ల దాఖలు ఫొటోలను మీడియాకు అనుమతించ లేదు. అభ్యర్థితోపాటు ఇద్దరిని మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు అనుమతించారు. ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్/గంభీరావుపేట: మూడో విడత ఎన్నికలు జరిగే ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో చివరి రోజు శుక్రవారం నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. ముస్తాబాద్, నామాపూర్, పోతుగల్, గూడెం, బందనకల్, చీకోడు క్లస్టర్లలో సాయంత్రం దాటినా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు క్యూలో ఉన్నారు. గంభీరావుపేట మండలంలోని 9 నామినేషన్ కేంద్రాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసే అభ్యర్థుల సందడి నెలకొంది. ఎల్లారెడ్డిపేట మండలంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా అభ్యర్థులు క్యూలో ఉన్నారు. మండలంలోని రాచర్ల తిమ్మాపూర్లో అభ్యర్థులు రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్లు దాఖలు చేశారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ సత్యేంద్రనాథ్ సిరిసిల్ల: డయాబెటీస్, రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆన్లైన్ డేటాతో ఆధార్ను లింకుచేయాలని ఎన్సీడీ స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ సత్యేంద్రనాథ్ కోరారు. కలెక్టరేట్లోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో ఎన్సీడీ స్టాప్ నర్సులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్హెచ్పీ)లకు శుక్రవారం అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి రజిత, ప్రోగ్రాం ఆఫీసర్లు వైద్యులు రామకృష్ణ, సంపత్కుమార్, అనిత, నయీమాజహా, డీడీఎం కార్తీక్ పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం
బోయినపల్లి(చొప్పదండి): రాష్ట్రంలో రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మండలంలోని వరదవెల్లి దత్తాత్రేయస్వామి ఆలయంలో కొనసాగుతున్న దత్త జయంతి ఉత్సవాల్లో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి పూజలు చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దత్త జయంతి నాడే కాకుండా శాశ్వతంగా బోటు ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ఫైల్ ఇరిగేషన్ శాఖ వద్ద పెండింగ్లో ఉందన్నారు. డీసీఎమ్మెస్ డైరెక్టర్ ఎం.సురేందర్రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడి పూజలు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ దత్తాత్రేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ టౌన్, రూరల్ ఎస్సైలు ఎల్లాగౌడ్, రామ్మోహన్ తదితరులు పూజలు చేశారు. -
నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి
● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, ముస్తాబాద్లోని రైతువేదికల్లో శుక్రవారం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ సరఫరా, నీటి వసతి కల్పించాలని, ఎంపీడీవోలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి వసతులు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. మండల ప్రత్యేకాధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవోలు సత్తయ్య, లచ్చాలు, ఎంపీవో వాహిద్ పాల్గొన్నారు. బోయినపల్లి(చొప్పదండి): ఆర్వో, పీవోలు పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని జెడ్పీ సీఈవో వినోద్ సూచించారు. కొదురుపాక రైతువేదికలో శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతేముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. ముస్తాబాద్ మేజర్ పంచాయతీ, ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్లోని నామినేషన్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. జిల్లా సరిహద్దులోని వెంకట్రావుపల్లి, పెద్దమ్మస్టేజీ వద్ద చెక్పోస్టులను పరిశీలించి మాట్లాడారు. జిల్లా సరిహద్దుల్లోని చెక్పోస్ట్ల వద్ద 24 గంటలు తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. ఎవరూ నిబంధనలు అతిక్రమించొద్దని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో బందోబస్తును పెంచినట్లు తెలిపారు. జిల్లాలోని 20 కేసుల్లో 209 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని, 158 కేసుల్లో 657 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. సీఐలు మొగిలి, శ్రీనివాస్గౌడ్, ఎస్సైలు గణేశ్, రాహుల్రెడ్డి, అనిల్కుమార్ ఉన్నారు. -
మాజీ సీఎం రోశయ్యకు ఘనంగా నివాళి
● పూలమాల వేసి నివాళి అర్పించిన ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వర్ధంతిని కలెక్టరేట్లో జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి అజ్మీరా రాందాస్, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, పరిశ్రమలశాఖ జీఎం హన్మంతు, డీటీసీపీవో అన్సార్ అలీ, డీఏవో అఫ్జల్బేగం, డీఎంహెచ్వో రజిత, మైనార్టీ సంక్షేమాధికారి భారతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి, మత్య్సశాఖ అధికారి సౌజన్య, పౌరసరఫరాలశాఖ మేనేజర్ రజిత తదితరులు పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలి నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏకగ్రీవ స్థానాల్లో ఉపసర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులపై ఎన్నికల కమిషనర్ సమీక్షించారు. టీ–పోల్లో పెండింగ్ లేకుండా నమోదు చేయాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ నగదు, మద్యం, ఆభరణాలను ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలించే పక్షంలో నిబంధనల ప్రకారం సీజ్ చేయాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫోద్దీన్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించని ఆస్పత్రులను సీజ్ చేస్తాం
● జిల్లా వైద్యాధికారి రజిత సిరిసిల్ల: జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, లేకుంటే ఆస్పత్రి రిజిస్ట్రేషన్ రద్దు చేసి సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి రజిత హెచ్చరించారు. సిరిసిల్లలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను గురువారం తనిఖీ చేశారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ ప్రతీ ఆస్పత్రి రిసెప్షన్ కౌంటర్ వద్ద ధరల పట్టిక వివరాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, వైద్యుల వివరాలు ప్రదర్శించాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సమర్థంగా నిర్వహించాలన్నారు. డాక్టర్ రామకృష్ణ, మహేశ్గౌడ్ పాల్గొన్నారు. -
● ఆలయ పరిసరాల్లోకి వాహనాలకు నో ఎంట్రీ ● భక్తుల కోసమే రోడ్లు కేటాయింపు
భక్తుల తిప్పలు తప్పేలా..వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు ఊ పందుకోవడంతో ప్రధాన ఆలయంలో దర్శనాలు తాత్కాళికంగా నిలిపివేశారు. భీమన్నగుడిలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ పెరుగుతుండడం.. సమ్మక్క భక్తుల రాక మొదలు కావడంతో ఆలయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా వసతుల కల్పనపై దృష్టి సారించారు. భీమన్నగుడి చుట్టూ ప్రాంతాలను ఫ్రీ జోన్గా ఏర్పాటు చేశారు. భీమన్నగుడి మార్గంలో భక్తులు నడిచే ప్రాంతంలో వాహనాలను అనుమతించడం లేదు. అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే భక్తులకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యం కోసమే.. వేములవాడకు వచ్చే భక్తులు ఆలయ అభివృద్ధి పనులతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో భీమన్నగుడి చుట్టూ ప్రాంతాలను ఫ్రీజోన్గా ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల వాహనాలు భీమన్నగుడి ఏరియాలోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. భీమన్నగుడి ఏరియాలోకి భక్తులు కాలినడకనే వచ్చి, తిరిగి వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలకు అనుమతించకపోవడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు ఉత్పన్నం కావు. దీంతో భక్తులు ప్రశాంతంగా వచ్చి మొక్కులు చెల్లించుకునే అవకాశం చిక్కుతుంది.ఇది వేములవాడలోని అంబేడ్కర్చౌరస్తా నుంచి పార్వతీపురం వెళ్లే ప్రధాన రోడ్డు. గుడి విస్తరణ పనుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో కల్యాణకట్టను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇటు ఆటోలు, కార్లు వెళ్లకుండా రోడ్డుపై తాత్కాళికంగా పిల్లర్లను బిగించారు. దీంతో ఈ ప్రాంతం ఫ్రీజోన్గా మారింది. భక్తులు కాలినడకన భీమన్న గుడికి చేరుకునే అవకాశం మెరుగుపడింది. -
రెండో రోజు నామినేషన్ల జోరు
నామినేషన్ వేసేందుకు వెళ్తున్న నర్సయ్యమద్దతుదారులతో కనకరాజుఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్/వీర్నపల్లి(సిరిసిల్ల): జిల్లాలోని రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో రెండో రోజు గురువారం నామినేషన్లు జోరుగా పడ్డాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని 26 గ్రామపంచాయతీలకు 47 మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానాలకు 191 నామినేషన్లు దాఖలైనట్లు మండల అసిస్టెంట్ ఎన్నికల అధికారి సత్తయ్య తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని సర్పంచ్ స్థానాలకు 43, వార్డు సభ్యుల స్థానాలకు 178 నామినేషను్ల్ దాఖలు చేశారని ఎంపీడీవో లచ్చాలు తెలిపారు. రెండు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 87, వార్డు సభ్యుల స్థానాలకు 278 నామినేషన్లు వచ్చాయని వివరించారు. వీర్నపల్లి మండలంలోని 17 గ్రామపంచాయతీలకు 44 సర్పంచ్ నామినేషన్లు, వార్డ్ సభ్యులకు 51 నామినేషన్లు వచ్చాయని ఎంపీడీవో శ్రీలత తెలిపారు. ఆస్పత్రి నుంచి నామినేషన్ కేంద్రానికి.. బీపీతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ బలపరచిన ఎల్లారెడ్డిపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అంతర్పుల కనకరాజు.. చికిత్స అనంతరం నేరుగా నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. రెండు రోజులపాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందిన కనకరాజు పార్టీ నాయకులు, తన అనునాయులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. -
పరీక్షల శాఖ ఖాళీ !
● ఒకరు రిటైర్డ్.. మరొకర సస్పెన్షన్ ● ఖాళీగా డీసీఈబీ, ఏసీజీఈ పోస్టులు సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలో పరీక్షల నిర్వహణశాఖ లో ప్రధాన పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. నిర్ణయాధికారం తీసుకునే స్థాయి పోస్టులు ఖాళీగా ఉండడంతో జిల్లాలో పలు పరీక్షల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. డీసీఈబీ కార్యదర్శి శ్రీనివాస్ రిటైర్డ్ కాగా.. ఇటీవల ఏసీజీఈగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు ఎన్నికల విధుల్లో నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. దీంతో విద్యాశాఖలో కీలకమైన పరీక్షబోర్డులోని కీలకమైన డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ, అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. దీని ప్రభావం పలు పరీక్షల నిర్వహణపై పడనుందని ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. ఎవరూ లేని పరీక్షల విభాగం ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపులు, ప్రీ–ఫైనల్ ప్రశ్నాపత్రాల ముద్రణ, ఎస్ఏ పరీక్ష పేపర్ల సంసిద్ధత, ఈ ఆదివారం నవోదయ పరీక్ష నిర్వహణపై ఆందోళన నెలకొంది. ఆశావహుల పోటీ రెండు పోస్టుల ఖాళీల నేపథ్యంలో పలువురు ప్రధానోపాధ్యాయులు పరీక్షల విభాగంలో బాధ్యతలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరీక్షల విభాగ నియంత్రణ సహాయాధికారి పోస్ట్ కోసం బొల్గం శ్రీనివాస్(విలాసాగర్ హెచ్ఎం), మనోహర్రెడ్డి(గోరంటాల హెచ్ఎం), మోతీలాల్(శివనగర్ హెచ్ఎం) ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పరీక్షల విభాగంలోని రెండు ప్రధాన పోస్టుల్లో ఏదో ఒకదాని బాధ్యతలు తీసుకునేందుకు నారాయణపూర్ హెచ్ఎం ఆకునూరి చంద్రశేఖర్ ఉత్సాహంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకటి భర్తీ చేస్తే మరొకటి ఖాళీ డీఈవో పోస్టును రెగ్యులరైజ్ చేసేందుకు చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. డీఈవోగా అదనపు బాధ్యతలతో ఉన్న జెడ్పీ సీఈవో వినోద్ ఇప్పుడిప్పుడే విద్యాశాఖపై పట్టు సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. విద్యాశాఖను అర్థం చేసుకునేలోపే ప్రధానమైన రెండు పోస్టులు ఖాళీ కావడం పరీక్షల విభాగంలో గందరగోళాన్ని సృష్టించింది. ఈ ఖాళీలను ఎలా భర్తీ చేస్తారోననే చర్చ సాగుతోంది. -
సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
● మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా సిరిసిల్ల: మున్సిపాలిటీలోని పారిశుధ్య సిబ్బంది విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కమిషనర్ ఖదీర్పాషా కోరారు. సినారె కళామందిరంలో నమస్తే స్కీంలో భాగంగా మున్సిపల్ సెప్టిక్ ట్యాంక్ కార్మికులు, శానిటేషన్, నాన్ శానిటరీ సిబ్బందికి గురువారం వైద్యశిబిరం నిర్వహించారు. కార్మికులకు పరీక్షలు చేసి, అవసరమైన మందులు అందించారు. బోయినపల్లి/వేములవాడఅర్బన్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం మాన్వాడ, వేములవాడఅర్బన్ మండలం అనుపురం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, కేటాయించిన రైస్మిల్లులకు తరలించాలని సూచించారు. తహసీల్దార్ నారాయణరెడ్డి ఉన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వంతడుపుల, ఇల్లంతకుంట, పొత్తూరు, పెద్దలింగాపురం, గాలిపల్లి, అనంతారం గ్రామపంచాయతీల ఆర్వో కేంద్రాలను గురువారం అడిషనల్ ఎస్పీ చంద్రయ్య పరిశీలించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. ఏఎస్సై పసియొద్దీన్, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ ఉన్నారు.సిరిసిల్ల అర్బన్: కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని పార్టీ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీలను లొంగిపోండి లేదా చంపుతామనే రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు, కౌన్సిల్ సభ్యులు వడ్డెపెల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు రవికుమార్ సూచించారు. మండలంలోని రాచర్లబొప్పాపూర్, రాచర్లగొల్లపల్లి గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. రవికుమార్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా అభ్యర్థులకు అవగాహన కల్పించాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద మద్దతుదారులు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల అసిస్టెంట్ ఎన్నికల అధికారి సత్తయ్య, కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు. ఇల్లంతకుంట/బోయినపల్లి: సర్పంచ్, వార్డుసభ్యుల అభ్యర్థుల వ్యయ వివరాలు పారదర్శకంగా ఉండాలని ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు రాజ్కుమార్ సూచించారు. బోయినపల్లి, ఇల్లంతకుంట మండల పరిషత్లను గురువారం తనిఖీ చేశారు. ఎంపీడీవో శశికళ, నోడల్ అధికారి నవీన్, భారతి పాల్గొన్నారు. -
గుర్తుంచుకోండి!
సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలకు పోటీచేసిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. చాలా గుర్తులు ఒకే పోలికతో ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, వృద్ధులు వాటిని ‘గుర్తు’ంచుకోవడం కష్టంగానే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉండవు. కేవలం గుర్తు మాత్రమే ఉంటుంది. పరిమిత ఓట్లు కావడంతో ప్రతీ ఓటు కీలకమే. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో గుబులు రేపుతున్న గుర్తులపై కథనం. ప్రతిష్టాత్మకంగా పల్లెపోరు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా సాగుతున్నాయి. తొలివిడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జిల్లాలో ఇప్పటికే 9 గ్రామాలు, 209 వార్డుల్లో సింగిల్ నామినేషన్తో ఏకగ్రీవమయ్యాయి. తొలివిడత 76 గ్రామాల్లో ఎన్నికలకు 295 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 539 వార్డుల్లో 1,377 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈనెల 11న తొలివిడత ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రెండోవిడత నామినేషన్ల పర్వం ముగిసింది. మూడో విడతకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలివిడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు అధికారులు బుధవారం గుర్తులు కేటాయించారు. ఈ గుర్తులతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తమకు వచ్చిన గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. సామాన్యులు గుర్తుంచుకోవడం కష్టంకావడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు పెద్ద సమస్యగా మారింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డుసభ్యులకు 20 గుర్తులను ఎన్నికల సంఘం నిర్ధేశించింది. సర్పంచ్ అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, బ్యాట్, కప్సాసర్, విమానం, బంతి, షెటిల్, కుర్చీ, వంకాయ, నల్లబోర్డు, కొబ్బరికాయ, లేడీపర్సు, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండ్లు, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైటు, బ్రష్, క్యారెట్, గొడ్డలి, గాలిబుడగ, బిస్కెట్, పిల్లనగ్రోవి, చెంచాగుర్తులను కేటాయించారు. వార్డుసభ్యులుగా పోటీచేసే వారికి జెగ్గు, గౌను, గ్యాస్స్టౌవ్, స్టూలు, సిలిండర్, గాజుగ్లాస్, బీరువా, ఈల, కుండ, డిష్యాంటీనా, గరిటె, ముకుడు, విల్లుబాణం, పోస్టుకవర్, హాకీ, నెక్ టై, కటింగ్ప్లేయర్, పోస్టుడబ్బా, విద్యుత్ స్తంభం, క్యాండిల్ గుర్తులను కేటాయించారు.పోలికలున్న గుర్తులెన్నో.. ఒకే పోలికతో పలు గుర్తులు ఓటర్లను తికమక చేసే అవకాశముంది. పలక, బ్లాక్బోర్డు, మంచం ఒకేలాగా ఉండడంతో ఓటర్లు ఇబ్బందిపడే అవకాశముంది. దువ్వెన, అరటిపండు గుర్తులు ఒకేలా ఉన్నాయి. ఇలాంటి గుర్తులతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుర్తులు కొన్నింటిని ఎవరూ గుర్తుపట్టలేకపోతారు. ఫోర్క్, చెంచా ఒకేలా ఉండడం, నెక్టై వంటి వస్తువులు కొత్తగా కనిపించడంతో గుర్తుపట్టడం ఇబ్బందిగా మారనుంది. పరిమిత ఓట్లతో సాగే పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు ఓటర్లు గుర్తుంచుకునేలా చెప్పడం అభ్యర్థులకు కష్టంగా మారింది.నోటాతో తిప్పలు గుర్తును గుర్తుంచుకొని ఓటు వేయాల్సి ఉండడం, బ్యాలెట్పత్రంలో నోటాను చేర్చడం ప్రతికూలంగా మారింది. ప్రతీ ఓటు కీలకమైన పల్లెఎన్నికల్లో నోటాకు ఓట్లు పడితే గెలుపోటములను నోటా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. జిల్లా వ్యాప్తంగా 3,53,351 మంది ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో భాగస్వాములవుతున్నారు. ఓటర్ల మదిలో గుర్తులు బలంగా నిలిపేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏకగ్రీవమైన గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించకపోగా పోటీ ఉన్న గ్రామాల్లో మాత్రం పంచాయతీ ఎన్నికలు చలికాలంలోనూ వేడి పుట్టిస్తున్నాయి. -
పరిశీలించి.. ఆరా తీసి
● అంతర్గాం ఎయిర్పోర్టు ఏర్పాటుపై ఏఏఐ బృందం పరిశీలన ● వివిధశాఖల ఉన్నతాధికారులతో సూక్ష్మ సమాచార సేకరణ ● సాంకేతికపరమైన అంశాలపై అధికారుల క్షేత్రస్థాయి పర్యటన ● రోడ్డు, రైల్వే కనెక్టివిటీపై ఆరా ● ప్రాజెక్టు, పంపుహౌస్, రైల్వేస్టేషన్, గోదావరితీరం సందర్శనఉత్తర తెలంగాణకు ఎయిర్ కనెక్టివిటీ చేసే అంతర్గాం ఎయిర్పోర్టు ఏర్పాటుకు గురువారం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధికారులు క్షేత్ర పరిశీలన చేపట్టారు. ఎయిర్పోర్టుకు ఉన్న అనుకూలతలు, అడ్డంకులను పరిశీలిస్తూ.. వివిధ అంశాలపై ఆరా తీశారు. పాలకుర్తిలో ఎయిర్పోర్టు నిర్మాణానికి పలు సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో.. ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఎయిర్పోర్టు నిర్మించాలని భావించింది. ఇప్పటికే ప్రీ ఫిజిబిలిటీ సర్వే కోసం రూ.50 లక్షలు విడుదల చేసింది. విమానాశ్రయం ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సర్వే నిర్వహించేందుకు ఏఏఐ అధికారుల బృందం రాగా, వారికి వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారుల బృందం సాంకేతికపరమైన అంశాలను వివరించారు. ఎయిర్పోర్టు ప్రతిపాదిత ప్రభుత్వ స్థలం, గోలివాడ గోదావరినది తీరం, పెద్దంపేట రైల్వేస్టేషన్, గోలివాడ పంపుహౌస్, ఎల్లంపల్లి ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో ఏఏఐ బృందం క్షేత్ర పరిశీలన చేశారు. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
మేజర్ పంచాయతీపైనే నజర్
● అత్యంత సమస్యాత్మక పంచాయతీగా ముస్తాబాద్ ● దృష్టి సారించిన పోలీస్ అధికారులు ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో సర్పంచ్ ఎన్నికలంటేనే ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ గుర్తుకొస్తుంది. ఆరేళ్ల క్రితం ముస్తాబాద్ మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికకు జరిగిన ఘర్షణలు, ఆందోళనలు అధికారులను కంటిమీద కునుకు లేకుండా చేశాయి. నాటి ఘటనలు ఉమ్మడి జిల్లాలో సంచలనం కల్గించాయి. గత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ మహేశ్ బీ గీతే దృష్టి సారించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ముస్తాబాద్ మేజర్ పంచాయతీ సర్పంచ్ జనరల్ అభ్యర్థులకు కేటాయించడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. మూడో విడతలో జరుగనుండడంతో బుధవారం నుంచి నామినేషన్లు మొదలయ్యాయి. బైండోవర్లు.. కేసులు ముస్తాబాద్ మేజర్ పంచాయతీ గత ఎన్నికల్లో పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. ఇందులో 65 మందిపై కేసులు పెట్టారు. ఇప్పటి వరకు 15 మందిని బైండోవర్ చేయగా, మరో 50 మందిని బైండోవర్ చేయనున్నారు. 40 మంది బెల్ట్షాపు నిర్వాహకులను బైండోవర్ చేసి, ఒకరిపై కేసు నమోదు చేశారు. 30 యాక్ట్ అమలు చేస్తూ.. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాపై నిఘా సోషల్ మీడియాపై పోలీస్ అధికారులు దృష్టి సా రించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లపై నిఘా పెట్టారు. అసత్య ప్రచారాలు చేస్తే వెంటనే అ దుపులోకి తీసుకునేలా పోలీసులు నిఘా తీవ్రం చేశారు. నామినేషన్ కేంద్రం చుట్టూ వంద మీటర్ల పరిధిలో దుకాణాలు మూసివేస్తున్నారు. ముఖ్యంగా పీపుల్స్ రిప్రజంటెంటీవ్ యాక్ట్ను అమలు చేస్తున్నారు. కేంద్రం వద్ద ఏఎస్సైతోపాటు పది మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అప్రమత్తంగా ఉంది. ముస్తాబాద్లో 14 వార్డులు ఉండగా, 7,347 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ నాగేంద్రచా రి తెలిపారు. కౌంటింగ్ నుంచి విజేతను ప్రకటించే వరకు అధికార బృందం అప్రమత్తంగా ఉందని వి వరించారు. ఎవరైన అవాంఛనీయ ఘటనలకు పా ల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అయ్యప్పా.. ఒకటే ట్రిప్పా?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లా అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైలు విషయంలో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. నాందేడ్ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైలు ఒక ట్రిప్ అది కూడా దిగువమార్గంలో వయా కరీంనగర్– పెద్దపల్లి మార్గంలో ఏటా నడిపిస్తున్నారు. ఈ రైలు ఉమ్మడి జిల్లాలోని అయ్యప్ప స్వాములకు, భక్తులకు సరిపోవడం లేదు. ముఖ్యంగా మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట నుంచి శబరిమలకి వెళ్లే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం ఈ నెల మొత్తం, వచ్చే నెల 15 (సంక్రాంతి ) మకరజ్యోతి వరకు శబరిమల సన్నిధానం తెరచి ఉంటుంది. ఈ మాసంలో ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు, అయ్యప్ప మాలధారులు శబరిమల దర్శనానికి వెళ్తుంటారు. వీరికి అందుబాటులో ఉండేది రైలుమార్గమే. ఇందుకు తగినన్ని రైళ్లు మన ఉమ్మడి జిల్లా నుంచి లేవు. రామగుండంలో ప్రతి రోజు నిలిచే 12626 కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రెండు నెలల ముందు రిజర్వేషన్ చేసుకున్న కూడా కన్ఫర్మ్ కానీ పరిస్థితి ఉంటుంది. ఇది దేశంలో అత్యంత దూరం నడిచే రైళ్లలో ఒకటి. 16318 హిమసాగర్ వీక్లీ ఎక్స్ ప్రెస్, 22647 కోర్బా బై వీక్లీ సూపర్ ఫాస్ట్ రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల నుంచి కొల్లాం లేక కొట్టాయం వరకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలోని కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, విశాఖపట్నం, చర్లపల్లి, కాజీపేట, వికారాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ మార్గాల్లో 10 ట్రిప్పులు ఎగువ, దిగువ మార్గాల్లో నడిపిస్తుంటే, కరీంనగర్ నుంచి ప్రతి ఏటా తూతూ మంత్రంగా ఒకట్రిప్ వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. సిర్పూర్ కాగజ్నగర్ నుంచి ఒక ట్రిప్ కూడా వెళ్లడం లేదు. ఈ నిర్లక్ష్య వైఖరిపై శబరిమల వెళ్లే ఉమ్మడి జిల్లాలోని అయ్యప్ప భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు ఎంపీలు చొరవ తీసుకోవాలి ఏటా వేలాదిమంది భక్తులు ఉమ్మడి జిల్లా నుంచి శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో నాందేడ్ నుండి కొల్లాం శబరిమల ప్రత్యేక రైలులో దిగువ మార్గంలోనే అవకాశం కల్పించడంపై భక్తులు మండిపడుతున్నారు. తక్షణమే కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవ తీసుకొని నాందేడ్ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైళ్ల సర్వీసులను కనీసం ఎగువతోపాటు దిగువ మార్గాల్లో మొత్తంగా 8 ట్రిప్పులు నడపాలని ఈ ప్రాంత భక్తులు కోరుతున్నారు. -
ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి
● త్వరలో యూడీఐడీ కేంద్రం సేవలు ● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంసిరిసిల్లటౌన్: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ పే ర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన దివ్యాంగుల క్రీడాపోటీలను ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం సిరిసిల్లకు చెందిన శ్రీలక్ష్మీ వికలాంగుల సంఘానికి ఎస్బీఐ ఆధ్వర్యంలో రూ.8లక్షల బ్యాంక్ లింకేజ్ రుణపత్రాన్ని అందజేశారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు. సిరిసిల్లకల్చరల్: పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ రాణీ కుముదిని హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ ఎన్నికల అవసరాల మేరకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు తగినన్ని ఉన్నాయన్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే స్పందిస్తూ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తున్నామన్నారు. డీఆర్వో శేషాద్రి, డీపీవో షరీఫొద్దీన్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, జెడ్పీ డెప్యూటీ సీఈవో గీత, నోడల్ అధికారి నవీన్, ఏవో రాంరెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ కేంద్రం తనిఖీ గంభీరావుపేట(సిరిసిల్ల): గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమ అగ్రవాల్ బుధవారం పరిశీలించారు. గంభీరావుపేటలోని ఆర్వో కేంద్రంలో నామినేషన్ల స్వీకరణను, కేజీ టు పీజీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం మెనూపై ఆరా తీశారు. తహసీల్దార్ మారుతిరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీధర్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో జోష్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: హుస్నాబాద్లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ బలపరుస్తున్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో ఉత్సాహం నింపింది. పల్లెల్లో పట్టు సాధిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని సీఎం రేవంత్రెడ్డి అభ్యర్థుల్లో నింపే ప్రయత్నం చేశారు. ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చామంటూ సీఎం సభలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్త్రెడ్డి మొదట హుస్నాబాద్కు మంజూరైన ఇంజినీర్ కళాశాలకు రూ.45 కోట్లు మంజూరు చేస్తూ పనులకు శంకుస్థాపన చేశారు. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్ కుమార్ ఇటీవల అమెరికాలో పర్యటించగా, అక్కడ ఓ ఎన్నారై అందించిన 70 సైకిళ్లను సీఎం చేతిలో మీదుగా ఇంజినీరింగ్ విద్యార్థినులకు అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. గత పదేళ్లు పాలించిన పార్టీ లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే కూలేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మాణం చేసిన ఎస్సారెస్పీతోనే కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగునీరందుతుందని తెలిపారు. సిద్దిపేట, మెదక్, గజ్వేల్లను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వం హుస్నాబాద్ను నిర్లక్ష్యం చేసిందన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన గౌరవెళ్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాగా.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఎలాంటి వరాలు ఇవ్వకుండా సీఎం నిరాశపరిచారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్కుమార్, గడ్డం వివేక్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పాల్గొన్నారు. -
రూ.60 లక్షల విలువైన ఫోన్లు రికవరీ
సిరిసిల్ల క్రైం: జిల్లా ప్రజలు వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న, చోరీకి గురైన దాదాపు రూ.60లక్షల విలువైన సెల్ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. 60 మందికి వారి మొబైల్స్ను ఎస్పీ మహే శ్ బీ గీతే చేతుల మీదుగా బుధవారం అందజేశా రు. పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఫోన్ పోయి న వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయడం ద్వారా ఫోన్లను రికవరీ చేయవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,183 మొబైల్ ఫోన్లను గుర్తించి య జమానులకు అందజేసినట్లు వివరించారు. సెకండ్హ్యాండ్ సెల్ఫోన్లు కొంటే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 83 శాతం రికవరీని సాధించడంలో కృషిచేసిన ఐటీ కోర్ ఎస్సై కిరణ్కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేశ్, సిబ్బందిని ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. దత్త ఆలయంలో ఎస్పీ పూజలు బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు బ్యాక్ వాటర్లో మండలంలోని వరదవెల్లి గుట్టపై వెలసిన గురు దత్తాత్రేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దత్త జయంతి ఉత్సవాలకు ఎస్పీ మహేశ్ బీ గీతే హాజరయ్యారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై ఎన్.రమాకాంత్ ఉన్నారు. -
వేడెక్కిన పంచాయతీ
● మొదటి విడత అభ్యర్థుల ఖరారు ● గుర్తుల కేటాయింపుతో ఊపందుకున్న ప్రచారం ● రెండో విడతలో ముగిసిన స్క్రుటినీ ● మూడో విడత గ్రామాల్లో మొదలైన నామినేషన్లు వేములవాడ/సిరిసిల్లటౌన్: గ్రామాల్లో రాజకీయ ‘పంచా యతీ’ వేడెక్కింది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లోని అభ్యర్థుల జాబితా ఖరారైంది. బరిలో నిలిచిన వారికి అధికారులు గుర్తులు సైతం కేటాయించా రు. దీంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నా రు. సర్పంచ్గా ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కు లసంఘాలను, యువజన సంఘాలను కలుపుకొని ముందుకెళ్తున్నారు. పలు కులసంఘాలకు ఇది చే స్తాం.. అది చేస్తామంటూ తాయిలాలు ఇస్తూ వారి ని కలుపుకొని వెళ్తున్నారు. ఈనెల 11న జరిగే ఎన్ని కల్లో భారీ పోలింగ్ జరిగేలా ప్రణాళికలు వేస్తున్నా రు. ఉద్యోగరీత్య ఇతర గ్రామాల్లో ఉంటున్న తమ బంధువులు, అనుచరులను గ్రామాలకు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వేకువజాము నుంచే ఇండ్ల వద్దకు.. గ్రామాల్లో జనం ఉదయం 9 గంటలు దాటిందంటే ఇళ్ల వద్ద కనిపించరు. ఉదయం సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే ప్రచారం మొదలుపెట్టారు. అక్కా, బావ, మామ, చెల్లె.. అంటూ వరుసలు కలిపి ముందుకెళ్తున్నారు. ఈసారి ఎలైగానా తమకే ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటున్నారు. బుజ్జగింపులతో విత్డ్రాలు వేములవాడ ప్రాంతంలోని మొదటిదఫా జరిగే సర్పంచ్ ఎన్నికలకు బుధవారం విత్డ్రా చేయించేందుకు రాజకీయ పార్టీల పెద్దలు రంగంలోకి దిగారు. పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా నిలిస్తే భవిష్యత్లో మంచి పదవుల్లో అవకాశం ఇస్తామంటూ హామీ ఇచ్చి విత్డ్రా చేయించారు. ఇలా చాలా గ్రామాల్లో రెబెల్స్గా ఉన్న పలువురు పార్టీ నాయకులను ఎన్నికల బరిలో నుంచి తప్పించి పార్టీ బలపరిచిన అభ్యర్థికి పోటీలేకుండా చూసుకున్నారు. పల్లెల్లో పంచాయితీలు తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లోని అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తికాగా.. రెండో విడతలో బుధవారం నామినేషన్ల స్క్రుటినీ ముగిసింది. మూడో విడత పంచాయతీలకు నామినేషన్లపర్వం మొదలైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. కులాలు, వర్గాల వారీగా తమ వారినే గెలిపించుకుందామనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఈమేరకే నామినేషన్లు వేస్తున్నారు. రుద్రంగిలో ఏడు గ్రామాలు ఏకగ్రీవం చందుర్తి/రుద్రంగి/వేములవాడఅర్బన్/కోనరావుపేట: రుద్రంగి మండలంలోని పది గ్రామాలకు ఏడు 7 గ్రామాలు ఏకగ్రీవం కాగా.. మూడు గ్రామాలకు మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. గైదిగుట్టతండా, అడ్డబోర్తండా, వీరునితండా, చింతామణితండా, బడితండా, రూప్లానాయక్తండా, సర్పంచ్తండా గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన మూడు గ్రామాల్లో పది మంది సర్పంచ్ అభ్యర్థులు, మండలంలోని 86 వార్డులకు 52 వార్డులు ఏకగ్రీవం అవ్వగా మిగిలిన 34 వార్డులకు 91 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కోనరావుపేట మండలంలో రెండు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చందుర్తి బరిలో 64 మంది చందుర్తి మండలంలోని 19 జీపీల్లో 113 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో 27 నామినేషన్లు తొలగించగా 86 మంది మిగిలారు. వీరిలో బుధవారం 22 మంది విత్డ్రా చేసుకోవడంతో 64 మంది బరిలో నిలిచారు. 174 వార్డుస్థానాలకు 399 నామినేషన్లు వచ్చాయి. 25 వార్డులకు సింగిల్ నామినేషన్లు వేయడంతో 24 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం మరో వార్డు ఏకగ్రీవమైంది. 149 వార్డులకు 373 మంది అభ్యర్థులు వార్డు సభ్యులుగా పొటీలో ఉన్నారని చందుర్తి ఎంపీడీవో రాధ తెలిపారు. వేములవాడ అర్బన్ మండలంలో 11 గ్రామపంచాయతీల్లో 47 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉండగా.. 104 వార్డు స్థానాలకు 12 ఏకగ్రీవం కాగా.. 218 మంది పోటీ చేస్తున్నారు. మండలం జీపీలు ఏకగ్రీవ సర్పంచ్ వార్డుసభ్యుల జీపీలు అభ్యర్థులు అభ్యర్థులు వేములవాడఅర్బన్ 11 –– 47 218 వేములవాడరూరల్ 17 –– 52 262 కోనరావుపేట 28 02 122 459 చందుర్తి 19 –– 64 373 రుద్రంగి 10 07 10 91 -
ముగిసిన స్క్రుటినీ
● రెండో విడత అభ్యర్థుల జాబితా ● నేడు విత్డ్రాలకు అవకాశం ఇల్లంతకుంట/తంగళ్లపల్లి: జిల్లాలోని రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో వేసిన నామినేషన్ల స్క్రుటినీ బుధవారం రాత్రి పూర్తయింది. అభ్యర్థుల జాబితాను ఆర్వో కేంద్రాల్లో ప్రదర్శించారు. ఇల్లంతకుంట మండలంలో 35 గ్రామపంచాయతీల్లో పడ్డ నామినేషన్ల స్క్రుటినీ అనంతరం మిగిలిన అభ్యర్థుల జాబితా ఎంపీడీవో శశికళ ప్రకటించారు. 35 గ్రామపంచాయతీలకు 112 మంది సర్పంచ్ అభ్యర్థులు, 294 వార్డులకు 597 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలిపారు. నో రిజెక్షన్ తంగళ్లపల్లి మండలంలో నామినేషన్ల స్క్రుటినీలో ఒక్కటి కూడా రిజెక్ట్ కాలేదు. మండలంలోని 30 సర్పంచ్ స్థానాలకు 219 నామినేషన్లు, 252 వార్డు సభ్యుల స్థానాలకు 622 నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని నామినేషన్లు నిబంధనల మేరకే ఉన్నాయని ఎంపీడీవో లక్ష్మీనారాయణ తెలిపారు. సిరిసిల్లక్రైం: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు. సైబర్ ఎస్ఐ జునైద్ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
శాంతియుత ఎన్నికలకు సహకరించాలి
● నోడల్ అధికారి శేషాద్రి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో స్థానికసంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలని నోడల్ అధికారి శేషాద్రి కోరారు. మండలంలోని వెంకటాపూర్, హరిదాస్నగర్, రాచర్లగొల్లపల్లి గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ఎలాంటి తప్పులు లేకుండా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవాలని సూచించారు. సమయం దాటిన తర్వాత నామినేషన్ల స్వీకరణ ఉండదని స్పష్టం చేశారు. ఎంపీడీవో సత్తయ్య, ఎన్నికల అధికారులు ఉన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): వికలాంగుల సాధికారతను ప్రోత్సహించాలని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జ్యోతి కోరారు. జిల్లా న్యాయ సేవాధికరసంస్థ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. తంగళ్లపల్లి మండలంలోని భవిత కేంద్రంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. జ్యోతి మాట్లాడుతూ వికలాంగుల హక్కులు, ప్రభుత్వ పథకాలు, న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. అనంతరం భవిత కేంద్రంలోని చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. తంగళ్లపల్లి ఎంపీపీఎస్ హెచ్ఎం వెంకటేశ్వరస్వామి, భవిత కేంద్రం ఐఈఆర్పీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లఅర్బన్: ఇందిరా మహిళా శక్తి వస్త్రోత్పత్తి ఆర్డర్లు, స్కూల్ యూనిఫాం వస్త్రం ఆర్డర్లను అన్ని మ్యాక్స్ సంఘాలకు సమానంగా ఇవ్వాలని జిల్లా పవర్లూమ్ మ్యాక్స్ సంఘాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిమ్మని ప్రకాశ్ కోరారు. ఈమేరకు జిల్లా సహాయ సంచాలకుడికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈనెల 2న కొన్ని మ్యాక్స్ సంఘాలకు ఎక్కువ, మరికొన్నింటికి తక్కువ ఆర్డర్లు ఇచ్చారన్నారు. ఇలా ఇవ్వడం ద్వారా చిన్న తరగతి సంఘాల సభ్యులు, కార్మికులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. భీమని రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికగంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని లింగన్నపేట జెడ్పీ హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థి గుగులోత్ రాఘవ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన ఉమ్మడి కరీంనగర్ జోనల్ స్థాయి అండర్ 14 క్రికెట్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. ఈనెల 5 నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో రాఘవ పాల్గొంటాడని పీఈటీ నరేశ్ తెలిపారు. విద్యార్థిని స్కూల్ హెచ్ఎం గంగారాం తదితరులు అభినందించారు. 7 నుంచి రాష్ట్ర మహాసభలు సిరిసిల్లటౌన్: రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి కోరారు. ఈనెల 7, 8, 9వ తేదీలలో మెదక్లో జరిగే సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభల పోస్టర్ను బుధవారం స్థానిక పార్టీ ఆఫీస్లో ఆవిష్కరించారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కోడం రమణ తదితరులు పాల్గొన్నారు. -
గీతా పఠనం.. మోక్ష సాధన మార్గం
సిరిసిల్లకల్చరల్: ముక్తి మార్గ సాధనకు, వ్యక్తిత్వ నిర్మాణానికి భగవద్గీత పారాయణం దోహదం చేస్తుందని రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గీతానగర్లోని మళయాల సద్గురు గీతాశ్రమంలో ఐదురోజులుగా గీతా జ్ఞానయజ్ఞం సాగుతుండగా మంగళవారం ముగింపు సమావేశానికి హాజరై మాట్లాడారు. గీతా సారాంశాన్ని జీర్ణించుకుని జీవితాన్ని ధర్మ మార్గంలో కొనసాగించాలని సూచించారు. గీత ప్రచార సమితి ఆవిర్భావ పూర్వాపరాలను సమితి కార్యదర్శి కోడం నారాయణ వెల్లడించారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించిన బ్రహ్మచారి అక్షయ చైతన్యను సమితి ప్రతినిధులు సత్కరించారు. గీతా పఠన పోటీల్లో విజేతలైన విద్యార్థులు జి.శివన్, వాత్సల్య, కె.తేజశ్రీ, ఎం.మేధస్వి, సీహెచ్.లాత్విక, ఎం.హాసినిలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. డాక్టర్ జనపాల శంకరయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ, ఏనుగుల ఎల్లయ్య దాసరి రాజేశ్, చిన్మయ మిషన్ కార్యదర్శి నల్ల సత్యనారాయణ, మేరుగు మల్లేశం, గోశికొండ దామోదర్, జయమ్మ, గడ్డం కౌసల్య, శారదా సారంగం తదితరులు పాల్గొన్నారు. -
పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి
● ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ బోయినపల్లి(చొప్పదండి): ప్రభుత్వ పాఠశాలల్లో ఫిబ్రవరిలోగా సిలబస్ పూర్తి చేసి, విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం మండలకేంద్రంలోని మోడల్స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. ఏడో తరగతి గదిలో ఇంగ్లిష్ పాఠం జరుగుతుండగా.. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని, ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడేలా సిద్ధం కావాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్డీవో రాధాబాయి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాశ్, డీఏవో అఫ్జల్బేగం, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్పై శిక్షణ సిరిసిల్లటౌన్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్పై తహసీల్దార్లు, ఎంపీవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లకు కలెక్టరేట్లో మంగళవారం ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో పాల్గొనేవారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుందన్నారు. వారికి సంబంధిత అప్లికేషన్లు ఎంపీడీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని, నిబంధనల ప్రకారం నింపి అందజేయాలని సూచించారు. నోడల్ అధికారులు శేషాద్రి, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. -
చివరిరోజు జోరుగా నామినేషన్లు
తంగళ్లపల్లి/ఇల్లంతకుంట: పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల దాఖలుకు మంగళవారం మండలంలోని పలు కేంద్రాలకు సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు పోటెత్తారు. నామినేషన్కు చివరిరోజు కావడం సాయంత్రం 5 గంటల వరకే సమయం ఉండగా, కేంద్రాల వద్ద హడావుడి నెలకొంది. ఎక్కువ మంది మంగళవారం మంచిరోజని సెంటిమెంట్తో నామినేషన్లు వేయడం విశేషం. రాత్రివరకు నామినేషన్ల స్వీకరణ ఇల్లంతకుంట మండలంలో 35 గ్రామపంచాయతీలకు గాను 11 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించారు. పెద్దలింగాపురం కేంద్రంలో రాత్రి 9.40 గంటలవరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతూనే ఉంది. ముస్కాన్పేటలో రాత్రి 9 గంటల వరకు స్వీ కరించారు. గొల్లపల్లి పంచాయతీ వార్డుసభ్యులు, సర్పంచు ఏకగ్రీవానికి ప్రయత్నాలు కుదరకపోవడంతో సాయంత్రం 4 గంటలకు నామినేషన్లు వే సేందుకు వచ్చారని తెలిసింది. దీంతో ఆ కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. -
శివా.. పార్వతులకు నీడేది?
● ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో శివపార్వతుల కాలనీ ● అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం ● ఉన్నవారికి కనీస సౌకర్యాలు కరువు ‘ఈ ఫొటోలోని భవనం శివపార్వతుల కాలనీలో ఓ బడా వ్యాపారికి చెందినది. ఈ కాలనీలో శివపార్వతుల నివాసాలను ఎంతకో కొంతకు కొని పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. అద్దెకు కూడా ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి’. వేములవాడరూరల్: వేములవాడ రాజన్నకు అతి ప్రీతి అయిన భక్తులు శివపార్వతులు. వీరు శివుని పేరిట భిక్షాటన చేస్తూ తిరుగుతుంటారు. రాజన్న గుడి మెట్ల వద్ద భక్తుల నుంచి భిక్షం తీసుకుంటూ ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నారు. 1986లో 112 మంది శివపార్వతులకు ప్రత్యేకంగా కాలనీ నిర్మించారు. వేములవాడ నుంచి సిరిసిల్లకు వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన నిర్మించిన ఈ కాలనీలో శివపార్వతులు ఉండేవారు. అక్కడి నుంచి రోజూ ఉదయం దాదాపు ఆలయానికి వచ్చి మెట్ల వద్ద భక్తులు ఇచ్చిన ముడుపులు తీసుకునేవారు. కాగా, సదరు కాలనీలో ప్రస్తుతం కొంత మంది ప్రైవేటు వ్యక్తులు పాగా వేస్తున్నారు. కాలనీలో ఉన్న శివపార్వతులు కొంత మంది అనారోగ్యం, ఇతర కారణాలతో మృతిచెందగా, వారి వారసులు నివాసం ఉంటున్నారు. బడా వ్యాపారుల చేత్తుల్లోకి కాలనీ..? కొందరు బడా వ్యాపారులు శివపార్వతులకు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో కొంత ఇచ్చి వారి పేరిట పట్టా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ వ్యక్తి పది మంది వద్ద నివాసాలు కొనుగోలు చేసి వాటికి మరమ్మతు చేపట్టి అదే శివపార్వతుల కాలనీలో ఉన్న కొంత మందికి అద్దెకు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ కాలనీలో కొంతమందికి ఉపాధి కల్పించాలని గత ప్రభుత్వం కుట్టుమిషన్ శిక్షణ కోసం షెడ్డు ఏర్పాటు చేశారు. అది ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ప్రస్తుతం కాలనీలో ఉంటున్నవారు తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల సమయంలోనే కాలనీకి ప్రజాప్రతినిధులు వస్తారని, తర్వాత పట్టించుకునే వారే లేరని శివపార్వతుల వారసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
సిరిసిల్లఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడలకు పెద్దపీట వేస్తుందని రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణం రాజీవ్నగర్ మినీ స్టేడియంలో 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. సీఎం సహాయంతో రాష్ట్రంలోనే సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషిచేస్తామన్నారు. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. వాలీబాల్ బాలికల విభాగంలో మహబూబ్నగర్ ప్రథమ, వరంగల్ ద్వితీయ, బాలుర విభాగంలో వరంగల్ ప్రథమ, ఖమ్మం ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల రమేశ్బాబు, ప్రధాన కార్యదర్శి హన్మంతరెడ్డి, కృష్ణప్రసాద్, జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, అజ్మీరా రాందాస్, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూప, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ప్రభాకర్, శ్యాం, బొడ్డు నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీ
వేములవాడఅర్బన్: వేములవాడ పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత మంగళవారం తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం వైద్యుల పేర్లు, ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్, ధరలు తదితర వివరాలు రిసెప్షన్ కౌంటర్ వద్ద ప్రదర్శించాలన్నారు. అనుమతి లేని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రోగ్రాం ఆఫిసర్ డాక్టర్ సంపత్కుమార్, మహేశ్ తదితరులు ఉన్నారు. పదిహేను రోజుల్లోగా కూలి పెంచాలిసిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రోత్పత్తి, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములకు కూలి పెంచాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పాలిస్టర్ యజమానుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అడేపు భాస్కర్, అంకారపు రవి, కమిటీ సభ్యులకు వినతిపత్రాలు అందజేశారు. 15 రోజుల వరకు కూలి పెంచకుంటే సమ్మెకు వెళ్తామన్నారు. సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, ఉడుత రవి, వైపని వర్కర్స్ యూనియన్ నాయకులు ఎలిగేటి శ్రీనివాస్, గడ్డం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించాలిసిరిసిల్లఅర్బన్: మద్యం అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణ విధించాలని, నిబంధనలు అతిక్రమిస్తున్న పర్మిట్ రూములపై చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు. మంగళవారం సిరిసిల్లలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత సర్కార్ మాదిరిగానే మద్యం ఆదాయంపై ఆధారపడి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తుందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వైన్స్పై చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు గుజ్జ దేవదాస్, సత్తయ్య, ఎల్లయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ సిరిసిల్లకల్చరల్: బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించిన సాహిత్య సృజన పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తాడూరు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థిని గడప లక్ష్మి ప్రణవిక, అంకిరెడ్డిపల్లె జెడ్పీహెచ్ఎస్లో ఏడో తరగతి విద్యార్థి కె.అక్షయ, పద్య కవితల విభాగంలో ఎల్లారెడ్డిపేట జెడ్పీహెచ్ఎస్ 8వ తరగతి విద్యార్థి పసునూరి దివ్యజ్యోతి, పదో తరగతి విద్యార్థి నేవూరి మీనాక్షి బహుమతులు అర్హత సాధించినట్లు అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, ఒద్దిరాజు ప్రవీణ్కుమార్ తెలిపారు. -
జోష్ పెరిగేనా?
హస్తంలోసాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘పల్లెల్లో’ పాగా వేసేందుకు ‘పట్టణం’లో పెట్టిన సీఎం సభపై కాంగ్రెస్ పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. మూడు దశల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీస్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేందుకు, తద్వారా రాష్ట్రంలో పార్టీకి ఢోకా లేదని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్లో జరిగే సీఎంసభను ప్రచార అస్త్రంగా భావిస్తున్నారు. పల్లెలను ప్రభావితం చేసేలా పెడుతున్న పట్టణ సభద్వారా మరింత జోష్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. కానీ.. ఉమ్మడి జిల్లా మంత్రుల నడుమ ఆధిపత్యపోరు, కరీంనగర్ కేంద్రంగా పార్టీ అనాథలా మారడం, నేతల మధ్య సమన్వయ లోపం, గ్రూప్పోరు.. శ్రేణులను కలవరపరుస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి సభతో ముగ్గురు మంత్రులు, విప్లు, అంతా ఏకమై సభ విజయవంతానికి తమ వంతుగా పనిచేసుకుంటూ పోతుండటం పార్టీలో పెరిగిన సహకారానికి నిదర్శనమని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం ప్రసంగంలో ఉమ్మడి జిల్లాకు ప్రకటించే వరాల జల్లుతో స్థానికసంస్థల్లో మెజారిటీ స్థానాలు హస్తగతం చేసుకునేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. మూడు ముక్కలాటకు సీఎం సభతో చెక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల నడుమ అంతర్గత ఆధిపత్యపోరు తారాస్థాయిలో ఉంది. ముఖ్యంగా హుస్నాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్కు మరో ఇద్దరు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ నడుమ ఏ విషయంలోనూ పొసగదనేది బహిరంగరహస్యమే. నామినేటెడ్ పదవుల్లో శ్రీధర్బాబుది పైచేయి కావడం, కరీంనగర్కు సంబంధించిన నియామకాల్లోనూ ఆయనే కీలకం కావడంపై అప్పట్లో పొన్నం కినుక వహించారు. ఒక దశలో సుడా చైర్మన్ నియామకాన్ని అంగీకరించేది లేదని భీష్మించుకొని ఉన్నా, ఇటీవల కాస్త మెత్తపడి, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డిని చేరువ చేసుకున్నారు. ఇక అడ్లూరి లక్ష్మణ్కుమార్పై చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు పెనుదుమారం లేపడం తెలిసిందే. పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల విషయంలో ముగ్గురి నడుమ అధికారులు నలిగిపోతూనే ఉన్నారు. సీఎంసభ నేపథ్యంలో విభేదాలన్నీ పక్కనబెట్టి అంతా కలిసి పనిచేస్తుండటం శుభసూచకం. ఈ మైత్రి మునుముందు కూడా కొనసాగి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని క్యాడర్ ఆశాజనకంగా ఉంది.దుద్దిళ్ల శ్రీధర్బాబుపొన్నం ప్రభాకర్ఉమ్మడి జిల్లా ‘హెడ్’ క్వార్టర్ అయిన కరీంనగర్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనాథలా మారింది. ఇటీవల డీసీసీ, కార్పొరేషన్ అధ్యక్షుల నియామకంతో కాసింత గాడినపడినట్టుగా కనిపిస్తున్నా, ఇప్పటికీ కరీంనగర్ ఎవరిదనే సమస్య కొనసాగుతోంది. కరీంనగర్కు చెందిన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి పోటీచేసి గెలుపొందడం, శ్రీధర్బాబు పెద్దపల్లి, లక్ష్మణ్కుమార్ జగిత్యాల జిల్లాలకు ప్రాతినిథ్యం వహించడంతో కరీంనగర్లో పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోయింది. పైగా కరీంనగర్ ప్రతిపక్ష పార్టీ చేతిలో ఉండడంతో, ఆ స్థాయిలో కాంగ్రెస్కు నాయకుడు కనిపించడం లేదు. తాను కరీంనగర్ వాసినని పొన్నం ప్రభాకర్ అప్పుడప్పుడు జోక్యం చేసుకొంటున్నా, పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో పార్టీ నాయకులు ఎవరికి వారే అన్న తీరుగా మారారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్కుమార్ను నియమించిన తరువాత పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఖాళీగానే ఉంది. దీంతో నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు ఎవరికీ లేకుండా పోయాయి. ఉమ్మడి జిల్లాలో పార్టీ అసంపూర్తి సంస్థాగత నిర్మాణం సమస్యగా మారుతోంది. పూర్తిస్థాయిలో డీసీసీ, సిటీ, మండల కమిటీలను నియమిస్తే పార్టీలో కొత్త జోష్కు అవకాశముంది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలతో పాటు, పార్టీ గుర్తులపై త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే పార్టీలో సమన్వయం ముఖ్యం. ప్రస్తుతం కాంగ్రెస్లో అదే కరువైంది. -
బెదిరింపుల పర్వం !
● హద్దులు దాటుతున్న కులసంఘాలుతంగళ్లపల్లి(సిరిసిల్ల): పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో వింత పోకడలు కనిపిస్తున్నాయి. గ్రామపంచాయతీ ఎలక్షన్స్ అంటేనే కులసంఘాల ఆధిపత్యం స్పష్టంగా ఉంటుంది. కులపెద్దలు చెప్పిందే వేదంలా ప్రవర్తిస్తుంటారు. రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును సైతం వారు శాసిస్తుంటారు. ఈక్రమంలోనే తాము చెప్పిందే వినాలంటూ కులస్తులకు హుకూం జారీ చేశారు. ఎన్నికల బరిలో తాము చెప్పినవారే ఉండాలని.. కాదు కూడదు అంటే ఆంక్షలు తప్పవంటూ హెచ్చరికలు రాజీ చేస్తున్నారు. తాము నిర్ణయించిన అభ్యర్థే సర్పంచ్గా పోటీలో ఉండాలని స్పష్టం చేస్తున్నారు. కాదు కూడదని వేరొకరు ముందుకొస్తే కులబహష్కిరణ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి, మండెపల్లి గ్రామాల్లో ఇటీవల జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. కులసంఘాలకు రూ.లక్షలు ఇచ్చిన వాడికి మద్దతు ఇవ్వడం, కులసంఘం నిర్ణయించినవారే పోటీలో ఉండాలని హుకూం జారీ చేయడంతో సర్పంచ్గా పోటీ చేద్దామని సిద్ధంగా ఉన్న ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. పోటీకి దిగితే ఎక్కడ కులబహిష్కరణ చేస్తారోనని భయపడుతున్నారు. ఓటుహక్కు కలిగిన ఏ పౌరుడైనా ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హుడే. పోటీ చేయకుండా అడ్డుకోవడం, ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధం. ఇలాంటి ఘటనలు జరిగితే కేసులు నమోదు చేస్తాం. – ఉపేంద్రచారి, ఎస్సై తంగళ్లపల్లి -
తమ్ముడూ.. తప్పుకో!
రాజన్న సిరిసిల్లమంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025రుద్రంగి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని సోమవారం జిల్లా సరిహద్దు చెక్పోస్టు వద్ద తనిఖీ చేశారు. రుద్రంగి నుంచి కథలాపూర్ వెళ్తుండగా విప్ వాహనాన్ని తనిఖీ చేశారు. సాక్షిప్రతినిధి,కరీంనగర్: తొలిదశ నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఒకటే టెన్షన్ పట్టుకుంది. అదేంటంటే.. ప్రతీ పార్టీ నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామ స్థాయి కార్యకర్తలు ఏళ్లుగా స్థానిక సంస్థల్లో పోటీ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా ఆ అవకాశం రాగానే ఎగిరి గంతేసి బరిలోకి దూకారు. స్వతంత్ర అభ్యర్థులతో ఎలాంటి ఇబ్బందులు లేవుగానీ, తీరా పార్టీ అభ్యర్థులతోనే చిక్కులన్నీ. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలన్నీ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. అన్ని పార్టీల నుంచి అధిక సంఖ్యలో పోటీ ఉండడం మంచిది కాదని తలచి.. మధ్యవర్తిత్వానికి జిల్లా నాయకులను పార్టీలు రంగంలోకి దించుతున్నాయి. ఈ మేరకు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. రిజర్వ్డ్ స్థానాల కంటే జనరల్ స్థానాల్లో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో బరిలో ఉన్నారు. ఈనెల 3వ తేదీతో తొలిదశ నామినేషన్ల పర్వం ముగుస్తున్న నేపథ్యంలో సీనియర్లు బుజ్జగింపుల పర్వాన్ని ముమ్మరం చేశారు. కులం ఓట్లే ప్రామాణికం ప్రతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరికి వారు పోటీలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుజ్జగింపుల పర్వరంలోకి దిగిన సీనియర్లు అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తున్నారు. అయితే, అభ్యర్థుల సామాజిక స్థితిగతులు, అతని సామాజికవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంత ఖర్చు పెట్టగలుగుతారు? తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాంటి వారిని గుర్తించి తగిన హామీలు ఇచ్చి, పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతివ్వాలని కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో సామాజికవర్గం ఓట్లు దండిగా ఉన్న అభ్యర్థులు మెట్టుదిగేది లేదని, పోటీ చేసి తీరుతామని భీష్మించుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో పార్టీ సీనియర్లు కూడా ఏమీ చేయలేని అయోమయంలో ఉన్నారు. అందుకే, గెలిచిన వాడే మనవాడు అవుతాడని, అప్పటి వరకూ వేచి చూసే ధోరణి అవలంబించేందుకు మొగ్గుచూపుతున్నారు.దాదాపు రెండేళ్లుగా జాప్యమైన స్థానిక ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలై.. ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ.. ఆశావహులంతా నామినేషన్లు వేసి ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇదే అన్ని పార్టీలకు మింగుడు పడని అంశంగా మారింది. అందుకే, సీనియర్లను రంగంలోకి దింపారు. దీంతో వారంతా నామినేషన్ వేసిన వారితో భేటీ అవుతున్నారు. పార్టీలో పదవుల పరంగా ప్రాధాన్యం కల్పిస్తామంటూ, భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కుతాయని హామీలిస్తున్నారు. అంతేకాకుండా త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్ కల్పించేందుక సిద్ధంగా ఉన్నామంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం పార్టీలో పదవులు, స్థానిక సంస్థల్లో టికెట్ల అవకాశంతో పాటు అధికార పార్టీ మరో అడుగు ముందుకు వేస్తోంది. స్థానికంగా జరిగే వర్క్స్, టెండర్లలోనూ ప్రాధాన్యం కల్పిస్తామంటూ వారిలో నమ్మకం కలిగించే ప్రయత్నాలు ప్రారంభించారు.రాజన్న సిరిసిల్ల గ్రామాలు 85 నామినేషన్లు 572 వార్డులు 748 నామినేషన్లు 1,767 -
రెండో రోజు నామినేషన్ల జోరు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు రెండో రోజు సోమవారం ఊపందుకున్నాయి. తంగళ్లపల్లిలో తొలిరోజు సర్పంచ్కు 26, వార్డు సభ్యులకు 38 నామినేషన్లు రాగా.. సోమవారం సర్పంచ్కు 80, వార్డు సభ్యులకు 161 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని 11 నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో మొదటిరోజు సర్పంచుల కోసం 38, రెండో రోజు 67 మంది నామినేషన్లు వేశారు. వార్డుస్థానాలకు మొదటి రోజు 46, రెండో రోజు 235 నామినేషన్లు వేశారు. మొత్తంగా సర్పంచ్ కోసం 105, వార్డు స్థానాల కోసం 281 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో శశికళ తెలిపారు. తప్పుడు ధ్రువపత్రాల నామినేషన్లు తొలగించాలికోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిమ్మపల్లిలో తప్పుడు కులధ్రువీకరణ పత్రాలతో సర్పంచ్, వార్డుస్థానాలకు పోటీచేసిన వారి నామినేషన్లు రద్దు చేయాలని నిమ్మపల్లిలో గ్రామస్తులు సోమవారం నిరసన తెలిపారు. ఈ విషయమై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ నిమ్మపల్లిలో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించగా బీసీ వర్గానికి చెందిన మహిళ ఎస్సీ సర్టిఫికెట్తో వేసిన నామినేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మ ల్యాల మోజెస్, లింగంపల్లి శంకర్, గొర్రె శ్రీనివాస్, మల్యాల స్వప్న, గొర్రె జ్యోతి, లింగంపల్లి సుశీల, బందెల సదానందం, అంజవ్వ, దప్పుల సంతోష్, భాస్కర్, బందెల ప్రభాకర్, దప్పుల కాంతవ్వ, మల్యాల కీర్తన, దప్పుల శ్రీకాంత్, గొర్రె సుజాత, దప్పుల స్వామి, లింగంపల్లి జాన్ పాల్గొన్నారు. భగవద్గీత శ్లోకాల పఠనంలో ప్రతిభముస్తాబాద్(సిరిసిల్ల): భగవద్గీత శ్లోకాల పఠనంలో ఇద్దరు మహిళలు బంగారు పతకాలు సాధించారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్కు చెందిన కటుకం లావణ్య, ఏనుగు జ్యోతి ఏడాదిపాటు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేశారు. తప్పులు లేకుండా లయబద్ధంగా ఆలపిస్తున్నారు. కర్నాటకలోని మైసూరు దత్తాశ్రమంలో భగవద్గీత శ్లోకాలపై నిర్వహించిన పోటీల్లో 700 శ్లోకాలు కంఠస్తంగా ఆలపించి బంగారు పతకాలు సాధించారు. -
నిబంధనలు పాటించాలి
● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్లటౌన్: రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు(ఆర్వో)లకు కలెక్టరేట్లో సోమవారం ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించారు. ఆర్వోలు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని సూచించారు. వసతులు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సరిచూసుకునేలా పీవోలు, ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికుమార్, డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, డీపీవో షరీఫొద్దీన్, నోడల్ అధికారి భారతి పాల్గొన్నారు. రైతుల ఖాతాల్లో రూ.338 కోట్లుసిరిసిల్లకల్చరల్: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా సోమవారం మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.338కోట్లు మంజూరయ్యాయని.. వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని సూచించారు. 32,085 మంది నుంచి 1,98,426 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. మిగిలిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్లో ఎంట్రీ చేయాలని సూచించారు. -
పైసల చుట్టే ‘పంచాయతీ’!
అదో మారుమూల గిరిజనతండా. గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డుసభ్యులతో సర్పంచ్ స్థానానికి ఒక్కో నామినేషన్ వేశారు. దీంతో ఆ ఊరిలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవమైనట్లు ప్రకటించాల్సి ఉంది. కానీ తెరవెనుక ఏం జరిగిందంటే.. ఆ ఊరి సర్పంచ్ అభ్యర్థి రూ.11లక్షలు, ఉపసర్పంచ్ అభ్యర్థి రూ.1.60 లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తానని అంగీకరించడంతో ఏకగ్రీవానికి ఆ గిరిజనతండా జనం అంగీకరించారు. జిల్లాలో మరో మారుమూల గిరిజనతండాలోనూ గ్రామ సర్పంచ్తో సహా వార్డుసభ్యుల స్థానాలు ఒక్కో నామినేషన్ వేశారు. అధికారికంగా ఏకగ్రీవమైనట్లు ప్రకటించాల్సి ఉంది. కానీ తెరవెనుక గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.10లక్షల విలువైన తన సొంత భూమిని ఇస్తానని సర్పంచ్గా ఎన్నికై న వ్యక్తి బాండ్పేపర్ రాసిచ్చారు. ఉప సర్పంచ్ అభ్యర్థి రూ.లక్ష ముందే డిపాజిట్ చేశారు. అంతే.. ఆ గిరిజన తండాలో ఒక్కో నామినేషన్ వేశారు. -
గ్రీవెన్స్ డేకు 27 ఫిర్యాదులు
సిరిసిల్ల క్రైం: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతీ వారం గ్రీవెన్స్డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం 27 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిష్కరించాల్సిందిగా ఠాణాల అధికారులను ఆదేశించారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఈనెల 31 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యంసిరిసిల్లటౌన్: ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పౌరులు బాధ్యతగా వ్యవహరించా లని జిల్లా వైద్యాధికారి రజిత కోరారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అసురక్షిత లైంగిక చర్యలు, స్టెరిలైజ్ చేయని సిరంజీలను వాడడం, రక్తమార్పిడి ద్వారా హెచ్ఐవీ సోకుతుందని తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 25 నుంచి నవంబర్ 25 వరకు 2,521 మంది గర్భిణీలను పరీక్ష చేయగా ఒకరికి పాజిటివ్, అనుమానిత హెచ్ఐవీ 4,118 కేసుల్లో 26 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఎన్జీవో ప్రెసిడెంట్ చింతోజు భాస్కర్, ప్రోగ్రాం ఆఫీసర్ అనిత, ఏవో శ్రీనివాస్, దేవిసింగ్, డిప్యూటీ డెమో రాజకుమార్, ఎయిడ్స్ కౌన్సెలర్ గంగయ్య పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: జిల్లాలోని స్వచ్ఛహరిత విద్యాలయాలుగా ఎంపికైన హెచ్ఎంలు, బాధ్యులను ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అభినందించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రాలు అందజేశారు. సర్వేలో అత్యధిక స్కోర్ పొందిన 8 పాఠశాలలు ఎంపికైనట్లు పేర్కొన్నారు. కేటగిరీ–1లో (1 నుంచి 8వ తరగతి) ఎంపీపీఎస్ నేరేళ్ల, మర్రిగడ్డ, సిరిసిల్ల–నెహ్రూనగర్, యూపీఎస్ పోతుగల్, కేటగిరీ–2లో(9 నుంచి 12వ తరగతి) జెడ్పీ హైస్కూళ్లు జిల్లెల్ల, వెల్జీపూర్, కేజీబీవీ ముస్తాబాద్, వేములవాడ వివేకానంద హైస్కూల్ ఎంపికయ్యాయి. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఈవో వినోద్కుమార్, సతీశ్ పాల్గొన్నారు. గుంటపల్లిచెరువు తండా ఏకగ్రీవంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని గుంటపల్లిచెరువుతండా సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవమైనట్లు గ్రామస్తులు ప్రకటించారు. సోమవారం ఏకగ్రీవమైన సర్పంచ్ అభ్యర్థి తిరుపతినాయక్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉపసర్పంచ్గా గుగులోత్ మోహన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో బీఆర్ఎస్ ఖాతాలో తొలి ఏకగ్రీవం నమోదైంది. సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, మాజీ ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, మాజీ సర్పంచ్ పూణ్యానాయక్, నాయకులు పిల్లి కిషన్, ములిగె ప్రమోద్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సిరిసిల్లటౌన్: పురపాలక సంఘం ఉద్యోగుల పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందని సిరిసిల్ల మున్సి పల్ కమిషనర్ ఎంఏ ఖదీర్పాషా సోమవారం ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని కమర్షి యల్ షాపులలో ట్రేడ్లైసెన్స్ల పేరుతో వివిధ నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ షాప్ యజమానుల నుంచి పన్నుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. షాపుల యజమానులు ఎవరూ అలాంటి కాల్స్కు స్పందించొద్దని కోరారు. అధికారిక వెబ్సైట్ ద్వారానే పన్నులు చెల్లించాలని సూచించారు. -
సరిహద్దు చెక్పోస్టు తనిఖీ
గంభీరావుపేట(సిరిసిల్ల): గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా గంభీరావుపేట పోలీస్స్టేషన్ పరిధిలోని కామారెడ్డి, సిరిసిల్ల జిల్లా సరిహద్దు పెద్దమ్మ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సోమవారం తనిఖీ చేశారు. వాహనాల నమోదు రిజిస్టర్ను పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. -
నేతన్నలకు చేతినిండా పని
సిరిసిల్ల: నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం మరో 35 లక్షల చీరల ఉత్పత్తి ఆర్డర్లను అందిస్తోంది. ఇప్పటికే 65 లక్షల చీరలను తయారు చేశారు. వీటిని గ్రామపంచాయతీలకు తరలించారు. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు రాగా.. టెస్కో ఆదేశాలతో 4.34 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేశారు. ఇందులో 4.29 కోట్ల మీటర్ల బట్టను అందించారు. కేవలం 5 లక్షల మీటర్ల బట్ట ఉత్పత్తి కావాల్సి ఉంది. మొదటి ఆర్డర్లు ముగింపు దశకు చేరుకోవడంతో రెండో దఫాగా మరో 35 లక్షల చీరలకు 2.10 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి ఆర్డర్లను ఇస్తున్నారు. ఈ ఆర్డర్ల విలువ రూ.77 కోట్లు. మొదటి దశ ఆర్డర్లు పూర్తి చేసిన నేతన్నలు పని లేదని దిక్కులు చూస్తున్న సమయంలో రెండో దఫా ఆర్డర్లు రావడంతో మరో మూడు నెలలపాటు ఉపాధి లభించనుంది. కోటి మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో.. రాష్ట్ర ప్రభుత్వం తొలుత 65 లక్షల మంది స్వశక్తి సంఘాల సభ్యులకు చీరల అందించాలని భావించి ఆర్డర్లు ఇచ్చింది. ఈ చీరలు నాణ్యతగా ఉండడంతో మహిళలు మెచ్చారు. దీంతో రాష్ట్రంలోని ప్రతీ మహిళకు ‘తెలంగాణ సారె’ పేరుతో చీరను అందించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. తొలి విడతగా గ్రామీణ ప్రాంతాల్లోని 65 లక్షల మందికి, రెండో విడతగా.. రానున్న మార్చిలో పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు అందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19న హైదరాబాద్లో చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ సాగుతుండగా.. పంచాయతీ ఎన్నికలు రావడంతో చీరల పంపిణీ నిలిచిపోయింది. రెండు రకాల చీరలు మహిళలకు అందించే చీరలను డిజైన్ చేసి సిరిసిల్ల నేతన్నలతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని వస్త్రోత్పత్తిదారులకు ఆర్డర్లు అందించారు. ఇందులో జరీ అంచు బార్డర్తో 6.30 మీటర్ల పొడవు ఉండే చీరలను 55 లక్షల మేరకు ఆర్డర్లు ఇవ్వగా.. మరో 12 లక్షల మేరకు 9 మీటర్ల గోచీ చీరల ఆర్డర్లు ఇచ్చారు. 58 ఏళ్లు పైబడిన మహిళా సంఘాల్లోని వృద్ధులకు గోచీ చీరలను అందించేందుకు సిరిసిల్లలో 9 మీటర్ల పొడవు ఉండే చీరల ఆర్డర్లు ఇచ్చారు. ఈ చీరలు ఇక్కడే ఉత్పత్తి, ప్రాసెసింగ్ చేశారు. జరీ అంచుతో కూడిన పాలిస్టర్, కాటన్ మిక్స్ చీరలను సూరత్లో ప్రాసెసింగ్ చేశారు. నూలు అందిస్తూ.. బట్ట ఉత్పత్తి సిరిసిల్లలోని 131 మ్యాక్స్ సంఘాలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లతోపాటు కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోనూ చీరల ఉత్పత్తి ఆర్డర్లను అందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇవ్వగా.. రెండో విడతగా ఏప్రిల్లోనూ మరో 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. ఈ బట్ట ఉత్పత్తికి వేములవాడలో ప్రభుత్వమే యారన్(నూలు) డిపో ఏర్పాటు చేసింది. నూలును నేరుగా కొనుగోలు చేసి బఫర్ స్టాక్గా ఉంచడానికి రూ.50కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేసింది. వస్త్రోత్పత్తిదారులకు నూలును 90 శాతం అరువుపై సరఫరా చేయడంతో చీరల ఉత్పత్తిలో వేగం పెరగడంతోపాటు నాణ్యతగా ఉన్నాయి. ఖరీదు పెంచి ఉత్పత్తి గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా.. ఇందిరా మహిళాశక్తి చీర ఖరీదు రూ.480 నిర్ధారించారు. ఈమేరకు నాణ్యమైన నూలును ప్రభుత్వమే సరఫరా చేస్తూ చీరల బట్టను ఉత్పత్తి చేయిస్తుంది. బతుకమ్మ చీరల కంటే నాణ్యతతో చీరలను అందించడంతో మహిళలు ఈ చీరలను ఇష్టపడుతున్నారు. పాలపిట్ట కలర్లో చీరను డిజైన్ చేశారు. రెండో ఆర్డర్ రావడంతో సిరిసిల్లలోని 10వేల మంది కార్మికులకు ఏడాది పొడవునా చేతినిండా పని లభించే అవకాశం దక్కింది.పవర్లూమ్ పరిశ్రమ స్వరూపంపవర్లూమ్స్: 26,302మ్యాక్స్ సంఘాలు: 131మహిళా శక్తి చీరల బట్టను నడుపుతున్న సాంచాలు: 9,600ఇప్పటి వరకు పొందిన చీరల బట్ట ఆర్డర్లు : 4.24 కోట్ల మీటర్లు ఇప్పటి వరకు సేకరించిన చీరల బట్ట : 4.29 కోట్ల మీటర్లు పవర్లూమ్స్పై ఉత్పత్తి అవుతున్న బట్ట : 5 లక్షల మీటర్లు కొత్తగా వస్త్రోత్పత్తి ఆర్డర్లు : 2.10 కోట్ల మీటర్లు ఈ ఆర్డర్ విలువ : రూ.77 కోట్లు -
కమ్మరిపేటతండా ఏకగ్రీవం
కోనరావుపేట: మండలంలోని కమ్మరిపేటతండా గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవమైంది. సర్పంచుగా భూక్య మంజుల, ఉపసర్పంచ్గా మాలోత్ ప్రకాశ్, వార్డుసభ్యులుగా మాలోత్ లక్ష్మి, మాలోత్ తిరుపతి, భుక్య చంద్రకళలు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. బావుసాయిపేటలో 7వ వార్డులో బైరగోని నందూగౌడ్, 10వ వార్డులో గంట మల్లయ్య, కనగర్తిలో 7వ వార్డులో పురుసాని భూలక్ష్మి, 10వ వార్డులో ఊరడి లావణ్య, ధర్మారంలో 1వ వార్డులో వెలిశాల శ్రీనివాస్, 3వ వార్డులో కీసరి కావేరి, మామిడిపల్లి 6వ వార్డులో మధునాల స్వరూప, 7వ వార్డులో కాసర్ల పవిత్ర దాదాపు ఏకగ్రీవమయ్యారు. -
ప్రజావాణి రద్దు
సిరిసిల్ల: కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదివారం తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భీమన్న సేవలో ఎన్నికల పరిశీలకులు వేములవాడ: భీమేశ్వరస్వామి ఆలయంలో సిద్దిపేట ఎన్నికల అబ్జర్వర్ హరిత (ఐఏఎస్), జగిత్యాల ఎన్నికల అబ్జర్వర్ బి.శ్రీరమేశ్ ఆదివారం దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. సంగీత సాహిత్యాల సమ్మేళనం యక్షగానం సిరిసిల్లకల్చరల్: యక్షగాన ప్రక్రియ సంగీత, సాహిత్యాల సమ్మేళనం అని పలువురు సాహితీవేత్తలు పేర్కొన్నారు. గూడూరి రాజు వెలువరించిన బాలమతి చరిత్ర యక్షగాన పుస్తకాన్ని జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనంలో ఆదివారం సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సమితి అధ్యక్షుడు డాక్టర్ జనపాల శంకరయ్య, సాహితీవేత్తలు సబ్బని లక్ష్మీనారాయణ, సంకెపెల్లి నాగేంద్రశర్మ అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ డిజిటల్ మాధ్యమాల కాలంలో నాటి సాంస్కృతిక రూపాలను నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నించిన రచయితను అభినందించారు. సమితి ప్రతినిధులు కోడం నారాయణ, కొక్కుల రాజేశం, కొలిపాక శోభారాణి, మాదిరెడ్డి అంజనీదేవి, ముడారి సాయిమహేశ్, బూర దేవానందం, వంశీకృష్ణ, సింగిరెడ్డి రాజిరెడ్డి, పని లక్ష్మన్, గణేశ్, రాజప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ కేంద్రాలు పరిశీలన బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదివారం పరిశీలించారు. మండలంలోని కొదురుపాక, బోయినపల్లి, కోరెం, స్తంభంపల్లిలోని ఆర్వో కేంద్రాల్లో సిద్ధంగా ఉంచిన నామినేషన్ పత్రాలు, హెల్ప్డెస్క్ను పరిశీలించారు. తహసీల్దార్ కాలె నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. చెక్పోస్టు తనిఖీ మండలంలోని నర్సింగాపూర్లో ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు చెక్పోస్టును జనరల్ అబ్జర్వర్ రవికుమార్ పరిశీలించారు. చెక్పోస్టు సిబ్బందికి పలు సూచనలు చేశారు. మండలంలోని కొదురుపాక, వెంకట్రావుపల్లి, బోయినపల్లి, కోరెం నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఆర్డీవో రాధాభాయి స్తంభంపల్లి, బోయినపల్లి గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లెల్ల చెక్పోస్ట్ తనిఖీతంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లెల్ల చెక్పోస్ట్ను ఆదివారం రాత్రి సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచా రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సూచించారు. -
సరిహద్దు చెక్పోస్టులు తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాలు, జిల్లెల్ల చెక్పోస్ట్ను ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదివారం పరిశీలించారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ఎస్ఎస్టీ చెక్పోస్ట్ను తనిఖీ చేశారు. జిల్లెల్ల జీపీ కార్యాలయంలోని ఆర్వో కేంద్రం, తంగళ్లపల్లి మండల పరిషత్లోని పోస్టల్ బ్యా లెట్ హెల్ప్డెస్క్, ఆర్వో కేంద్రాన్ని పరిశీలించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కె.లక్ష్మీనా రాయణ, తహసీల్దార్ జయంత్కుమార్ ఉన్నారు. ప్రలోభాలకు గురిచేస్తే చర్యలుసిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు. సిరిసిల్లలో ఆదివా రం విలేకరులతో మాట్లాడారు. సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల సమయంలో గ్రామాల్లో అభ్యర్థులు, వారి అనుచరులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, కులసంఘాలకు డబ్బు పంచడం, గ్రామాభివృద్ధి పేరుతో డబ్బులు ఆశ చూపితే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. -
ఎన్నికల్లో కలిసి పనిచేయాలి
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు కూర్చుని మాట్లాడుకుని అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం కేటీఆర్ పర్యటించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యకు ఇటీవల భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స జరగగా.. ఇంటికెళ్లి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ప్రతీ గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలన్నారు. భేషజాలకు పోకుండా ప్రజలతో పట్టున్న వారిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణహరి, సింగల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు అందె సుభాష్, గుల్లపల్లి నరసింహారెడ్డి, కొండ రమేశ్, మండలంలోని వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. పేదలను ఆదుకోవడమే కులసంఘాల లక్ష్యం కావాలి పేదలను, ఆర్థికంగా ఇబ్బందుల్లో వారిని ఆదుకునే ఔదార్యం కులసంఘాల లక్ష్యం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో వెలమ సంక్షేమ మండలి(పద్మనాయక) అదనపు వసతిగృహ భవనానికి ఆదివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. జిల్లాలోని వెలమ సంక్షేమ మండలికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. కులంలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరారు. సంక్షేమ మండలి జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావును సన్మానించారు. మండలి ప్రధాన కార్యదర్శి గుజ్జునేని వేణుగోపాల్రావు, ఉపాధ్యక్షులు సురభి దశరథరావు, చీటి నర్సింగరావు, బి.వేఘమాల, కోశాధికారి బొంత వేణుగోపాల్రావు, సంయుక్త కార్యదర్శి కడపత్రి అనిల్రావు, జూపల్లి శ్రీలత, ఆర్గనైజింగ్ కార్యదర్శి అయిల్నేని పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో నైపుణ్యం వెలికితీత
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సిరిసిల్ల అర్బన్: గ్రామీణ యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడాపోటీలు దోహదపడతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని రాజీవ్నగర్ మినీస్టేడియంలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక మానసికోల్లాసానికి దోహదపడతాయన్నారు. రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీహరితో మాట్లాడి వేములవాడలో రాష్ట్ర, జాతీయస్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తాన్నారు. క్రీడా మైదానాల కోసం సిరిసిల్ల, వేములవాడ, కోరుట్లలో ఐదెకరాల చొప్పున కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జెల రమేశ్బాబు, జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్వీ హన్మంతరెడ్డి, కృష్ణప్రసాద్, కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, నాయకులు గడ్డం నర్సయ్య, బొప్ప దేవయ్య, అసోసియేషన్ నాయకులు చిలుక శ్యామ్, అజ్మీరా రాందాస్, గణపతి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అవగాహనే ఔషధం
● జిల్లాలో తగ్గుతున్న ఎయిడ్స్ బాధితులు ● విస్తృతంగా అవగాహన కలిగి ఉండటమే కారణం ● నేడు ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సిరిసిల్ల/కరీంనగర్: ఎయిడ్స్ అంటే భయం. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు శరీరాన్ని వదిలివెళ్లదు. మందులు వాడితే నియంత్రణలో ఉంటుంది. కానీ ఆదమరిస్తే తిరగబెట్టి కబళించేస్తుంది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరిగి క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటుచేసింది. ఫలితంగా జిల్లాలో కొన్నేళ్లుగా ఎయిడ్స్ తగ్గుముఖం పడుతోంది. గతంలో కన్నా ప్రస్తుతం కేసులు తక్కువగా కనిపిస్తున్నా జిల్లాలో అధికారికంగానే ప్రతీ నెల 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా చాలా మంది వ్యాధిబారిన పడుతున్నట్లు తెలుస్తోంది. జి ల్లాలో ప్రస్తుతం 1,385 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అవగాహన ముఖ్యం హెచ్ఐవీ అని తెలియగానే సీడీ–4 కణాల సంఖ్య తగ్గేంత వరకూ అశ్రద్ధ చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో ఆధునిక వైద్యసేవలు పొందితే 75 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవనం సాగించొచ్చు. ఎయిడ్స్ రోగులూ మధుమేహం, బీపీ, ఆస్తమా రోగుల మాదిరిగానే ఔషధాల వాడకం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చు. హెచ్ఐవీ ఉన్న దంపతులు తగిన సమయంలో ఏఆర్టీ మందులు వాడి ఆ రోగం లేని పిల్లలకు జన్మనివ్వొచ్చు. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి హెచ్ఐవీ బాధితులు ఉదయం 3 కిలోమీటర్లు నడి చి, 15 నిమిషాలపాటు ధ్యానం చేయాలి. గ్లాస్ పా లు, బ్రెడ్, ఉడికించిన గుడ్డు తీసుకోవాలి. రోజు రా గిజావా, అంబలి తాగాలి. మధ్యాహ్నం భోజనంలో తాజా కూరగాయలు, ఆలుదుంపలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, నాన్వెజ్ తీసుకోవాలి. సాయంత్రం ఆపిల్, దానిమ్మ, అంగూర, అరటిపండ్లు, ఫైనాపిల్, సపోట తినాలి. గోధుమ రవ్వ పాలలో కలిపి ఉడికించి ఆరగించాలి. రాత్రి భోజనంలో తాజా కూరగాయలు, రెండు చపాతీలు, నిద్రించే సమయంలో వేడి చేసి చల్లార్చిన నీరు తాగాలి. ఎయిడ్స్ బారిన యువత హెఐవీ కేసుల్లో యువత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే 70 శాతం వరకు హెఐవీ వ్యాధి బారిన పడుతున్నారు. మద్యానికి బానిస కావడం, మత్తు పదార్థాలు సేవించడం, సురక్షితం లేని శృంగారంలో పాల్గొనడం, తగు జాగ్రత్తలు పాటించకపోవడవమేనని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో హైరిస్క్ ప్రవర్తన గల వ్యక్తులు, ఫీమేల్ సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జెండర్ల తరఫున స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ వారి ప్రవర్తనలో మార్పునకు యత్నిస్తున్నాయి. మంచి మందులు అందుబాటులో ఉండడంతో మరణాల సంఖ్య తగ్గింది. గతేడాది స్టేట్ అవార్డు ఎయిడ్స్ నిర్మూలనకు విస్తృతంగా చేపడుతున్న కార్యక్రమాలతో కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడంతో గతేడాది స్టేట్ అవార్డు వచ్చింది. వ్యాధి నియంత్రణలో ఉంచేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలను గుర్తించి అవార్డు అందజేశారు. హెచ్ఐవీ బాధితులకు ఏఆర్టీ సెంటర్ ద్వారా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. వారికి కావాల్సిన మందులు ఇవ్వడంతో పాటు సీడీ–4, వైరల్ లోడ్ పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తున్నాం. హెచ్ఐవీ నియంత్రణ మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. – సదానందాచారి, ఐసీటీసీ కౌన్సెలర్, కరీంనగర్ -
గ్రామాల్లో గల్లా ఎగిరేసి చెప్పండి
సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లో గల్లా ఎగిరేసి చెప్పాలని రాష్ట్ర రవా ణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్ప ష్టం చేశారు. జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచి త విద్యుత్, రేషన్కార్డులు, రూ.10లక్షల ఆరోగ్యశ్రీ వైద్యసేవలు, రైతు రుణమాఫీ, రైతులకు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించినట్లు వివరించారు. చేనేత కార్మి కులకు ఉపాధి కల్పిస్తూ.. గత ప్రభుత్వం బకాయి పెట్టిన డబ్బులను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కండువాతో గుండెల నిండా ధైర్యంతో గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా ప్రతీ కార్యకర్త పనిచేయాలని సూచించారు. మాజీ ఎంపీ హన్మంతరావు మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. దీక్షా దివస్ అంటూ బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే.. కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్ద బిచ్చం ఎత్తుకునే వారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీని వాస్ మాట్లాడుతూ.. 1982 నుంచి ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని, ఏఎంసీ చైర్మన్గా ఐదేళ్లు పనిచేసినట్లు గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఏఎంసీ చైర్మన్ స్వరూపారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం, పార్టీ నాయకులు ఉమేశ్రావు, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, ఆకునూరి బాలరాజు, గోలి వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు. నేతన్నచౌక్ నుంచి ర్యాలీ సిరిసిల్ల పాతబస్టాండులోని నేతన్న విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి స్థానిక నాయకులు పూలమాల వేశారు. గజమాలతో సత్కరించి ర్యాలీగా విద్యానగర్లోని లహరి ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు. -
హత్యకేసులో ప్రధాన నిందితుడి రిమాండ్
వేములవాడఅర్బన్: వేములవాడ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో మావోయిస్టు మాజీ డిప్యూటీ దళ కమాండర్ బల్లెపు నర్సయ్య, అలియాస్ సిద్ధన్న అలియాస్ బాపురెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు జక్కుల సంతోష్ను శనివారం రిమాండ్కు తరలించినట్లు వేములవాడ ఇన్చార్జి డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధన్న గతంలో మావోయిస్టు మాజీ డిప్యూటీ దళ కమాండర్గా పనిచేసేవాడు. 1999లో వీర్నపల్లి బస్టాండ్ వద్ద అదే గ్రామానికి చెందిన అంజయ్యను పోలీస్ ఇన్ఫార్మర్గా భావించి కాల్చివేశారు. దీనిపై ఎల్లారెడ్డిపేట ఠాణాలో కేసు నమోదైంది. ఈ ఘటనపై అంజయ్య కుమారుడు జక్కుల సంతోష్ తన తండ్రిని చంపిన వ్యక్తిపై కక్ష పెంచుకున్నాడు. ఇటీవల బల్లెపు నర్సయ్య ఒక యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన సంతోష్ మరింత పగతో రగలిపోయాడు. బల్లెపు నర్సయ్యతో తాను ఒక రిపోర్టర్గా పరిచయం పెంచుకున్నాడు. మూడు నెలలుగా ఇంటర్వ్యూ చేస్తానని నమ్మించి వేములవాడ మండలం ఆగ్రహరం గ్రామానికి రావాలని నర్సయ్యకు చెప్పాడు. గురువారం మధ్యాహ్నం ఇద్దరు అగ్రహారం చేరుకున్నారు. సంతోష్ ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం ఆ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న సమయంలో రాళ్లతో దాడి చేసి నర్సయ్యను హత్య చేశాడు. ఈ ఘటనపై వేములవాడ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితుడు జక్కుల సంతోష్ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సై రామ్మోహన్, పోలీసు సిబ్బందిని అభినందించారు. -
ఖర్చులేకుండానే గెలిచిన
కథలాపూర్(వేములవాడ): అప్పుడు పురుషాధిక్యంలో గ్రామాలుండేవి. ఎన్నికల్లో ఎవరైనా బరిలో ఉండాలంటే ఏదో అన్నట్లుగా భావించేవారని కథలాపూర్ తొలి ఎంపీపీ, జెడ్పీటీసీ అంబల్ల భాగ్యవతి పేర్కొన్నారు. మండలంలోని భూషణరావుపేట గ్రామానికి చెందిన భాగ్యవతి సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. అప్పుడు, ఇప్పుడు ఎన్నికల పరిస్థితులపై ఆమె మాటల్లోనే.. 1981లో భూషణరావుపేట సర్పంచ్గా గెలిచిన. ఆ సమయంలో 8 మంది బరిలో ఉండగా నేను ఒక్కదానినే మహిళను. మిగతావారు పురుషులు. ఓటు కోసం ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేస్తే మహిళలకు రాజకీయాలెందుకని ప్రశ్నించారు. గెలిచాక వాహ్... అని విస్తుపోయారు. ఖర్చు అసలే లేదు. అప్పట్లో బరిలో ఉన్న అభ్యర్థి గురించి పూర్తిస్థాయిలో ప్రజలు సమాచారం సేకరించి స్వచ్ఛందంగా ఓటు వేసేవారు. అప్పట్లో ప్రజాప్రతినిధులకు జవాబుదారీతనం ఎక్కువ. 1987లో కథలాపూర్ ఎంపీపీ, 1995లో జెడ్పీటీసీ సేవలందించా. ఎన్నికల ప్రచారం కోసం జీపులో నలుగురం కలసిపోయేవాళ్లం. గ్రామాల్లోకి పోతే ప్రజలే ఆప్యాయంగా పలకరించి తిండి పెట్టేవారు. కాలం మారింది.. ఓట్ల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. -
పంచాయతీ ఎన్నికల్లో సోషల్ మీడియా హవా
జగిత్యాలజోన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు సోషల్ మీడియా ప్రచారాన్ని విస్త్రృతంగా వాడుకుంటున్నారు. వివిధ రకాల యాప్లు అందుబాటులోకి రావడంతో తమకు ఉన్న పరిజ్ఞానంతో ఫొటోలు, వీడియోలతో ఎన్నికల పాటలు చిత్రీకరించి, ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ పాటలన్నీ కూడా యువతను ఉత్తేజపరిచేలా, మహిళలను గౌరవించే విధంగా, గ్రామాభివృద్ధికి పాటు పడేలా, పోటీ చేస్తున్న నాయకుడిని పొగిడేలా.. ఇప్పటికే ట్రెండ్లో ఉన్న రాజకీయ, సినిమా, జానపద పాటలను వాడుకుంటున్నారు. ఇందుకోసం, గ్రామంలో కులాల వారీగా, యువజన సంఘల వారీగా, మహిళల గ్రూపుల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి పోస్ట్ చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. తాము గెలిస్తే గ్రామాభివృద్ధికి చేయబోయే పనులను కూడా ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ఇది చాలదన్నట్టూ తమ బంధువులు, అనుయాయుల సెల్ఫోన్లలో స్టేటస్లుగాను, ఫేస్బుక్, ఇన్స్ర్ట్రాగామ్ల్లో సైతం పోస్టులు పెడుతున్నారు. కొందరు అభ్యర్థులు తమ ఫొటోలతో డిజైన్ చేయించి, గ్రూపుల్లో పెడుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. వాయిస్ మేసేజ్లను కూడా జత చేస్తున్నారు. -
సర్పంచ్ బరిలో విద్యావంతుడు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం సర్పంచ్ స్థానంలో పోటీ చేసేందుకు విద్యావంతుడు, న్యాయ వాది మార తేజ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తేజ తండ్రి బమార కిశోర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయవాది. తేజ ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివారు. తండ్రి మార కిశోర్ మాజీ ఎంపిటిసిగా కూనారంలో సేవ లు అందించారు. తేజ వయసు 26 ఏళ్లు. చిన్నవయసులో సర్పంచ్ స్థానాని కి నామినేషన్ వేసిన వ్యక్తిగా గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు పేర్కొన్నారు. -
నిబంధనలు పాటించని ఆర్వో సస్పెన్షన్
● నామినేషన్ గదిలోకి నలుగురిని అనుమతించిన వైనం ● తీవ్రంగా పరిగణించిన ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ఎంపీడీవో నివేదిక ఆధారంగా సస్పెన్షన్ సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల పర్వం ముగింపు దశలోనే రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఆర్వో) సస్పెన్షన్కు గురయ్యారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు కోనరావుపేట మండల కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్రావును జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ శుక్రవారం రాత్రి సస్పెండ్ చేశారు. కోనరావుపేట క్లస్టర్ పరిధిలోని శివంగాళపల్లెకు చెందిన మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క శుక్రవారం గ్రామసర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి గదిలోకి నామినేషన్ వేసే వ్యక్తితోపాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలని నిబంధన. కానీ నామినేషన్ వేసే జ్యోతితోపాటు ఆమె భర్త షరీఫ్, వేముల రత్నాకర్, ముత్యంరాజు నామినేషన్ గదిలోకి వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారితో ఫొటో దిగారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించిన కోనరావుపేట ఎంపీడీవో స్నిగ్ధ దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. స్పందించిన ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆర్వో వెంకటేశ్వర్రావును శుక్రవారం రాత్రి సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో వికాస్ లడీవార్(జూనియర్ లెక్చరల్)ను నియమించారు. కోనరావుపేటలో శనివారం నామినేషన్ల స్వీకరణను వికాస్ లడీవార్ నిర్వహించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న గెజిటెడ్ హెచ్ఎం అయిన రిటర్నింగ్ అధికారి(ఆర్వో) వెంకటేశ్వర్రావు సస్పెండ్ కావడం జిల్లా అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
సర్కారు విద్యార్థులు జాతీయంగా రాణిస్తున్నారు
● జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య ● ముగిసిన జిల్లాస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శన సిరిసిల్లటౌన్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ చాటుతున్నారని జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య పేర్కొన్నారు. సిరిసిల్లలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన శనివారం ముగిసింది. ఆర్ఎస్బీవీబీ, ఇన్స్పైర్కు జిల్లా వ్యాప్తంగా 500 పైగా వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రదర్శించారు. 25 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్స్ వి.శైలజ, పద్మజ, సిరిసిల్ల మండల విద్యాధికారి దూస రఘుపతి తదితరులు పాల్గొన్నారు. అట్టహాసంగా వాలీబాల్ పోటీలు ప్రారంభంసిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణ పరిదిలోని రాజీవ్నగర్ మినీస్టేడియంలో 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకుమార్ తెలిపారు. మినీస్టేడియంలో నాలుగు కోర్టులు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభాకర్, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. వెయ్యి బీడీలకు రూ.300 ఇవ్వాలి● మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి వేములవాడఅర్బన్: బీడీ కార్మికులకు దేశవ్యాప్తంగా ఒకే వేతనం ప్రతీ వెయ్యి బీడీలకు రూ.300 చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. వేములవాడలో ఆలిండియా బీడీ, సిగార్, టోబాకో వర్కర్స్ ఫెడరేషన్(ఏఐటీయూసీ) జాతీయ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించారు. మాట్లాడుతూ కార్మికులకు పదవీవిరమణ అనంతరం గ్రాట్యూటీ డబ్బులు ఇవ్వాలని కోరారు. ఈపీఎఫ్వో ద్వారా విరమణ పొందిన బీడీ కార్మికులకు కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.5 వేలకు పెంచి అమలు చేయాలని కోరారు. నాయకులు కాశీ విశ్వనాథం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంటి బాలరాజు, సుతారి రాములు, మంద సుదర్శన్, కడారి రాములు తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ గిరి.. ‘నల్లకోటు’ గురి
జగిత్యాలజోన్: ఉమ్మడి జిల్లాలో వివిధ కోర్టుల్లో దాదాపు 3,000 మంది న్యాయవాదులు ఉంటారు. ఎప్పుడు కోర్టుల్లో నల్లకోటు వేసుకుని, నాలుగు గోడల మధ్య ఉండే న్యాయవాదులు పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. దాదాపు 90 శాతం న్యాయవాదులు గ్రామాల నుంచి వచ్చి ఆయా కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నవారే. ప్రజలతో ఉన్న సంబంధాలతో పాటు రిజర్వేషన్లు కూడా అనుకూలించడంతో పోటీకి సై అంటున్నారు. వివిధ కోర్టుల నుంచి ఐదారుగురు న్యాయవాదులు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జగిత్యాల జిల్లాలో పోటీ చేసే న్యాయవాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. గత పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది న్యాయవాదులు సర్పంచ్లుగా గెలుపొందగా, ఇప్పుడు వారిని చూసి మరికొందరు పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఆయా సామాజిక వర్గాల్లో పెద్దగా చదువుకున్న వారు లేకపోవడం, ఏదైనా సమస్య వస్తే గట్టిగా మాట్లాడేవారు కరువవడంతో న్యాయవాదులుగా ఉన్నవారిని పోటీ చేయాలని కులసంఘాలే డిమాండ్ చేస్తూ గ్రామాలకు పిలుస్తున్నాయి. -
కన్నీటి సంద్రమైన తంగళ్లపల్లి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తల్లీకొడుకుల మృతితో కన్నీటి సంద్రమైంది తంగళ్లపల్లి. ఇద్దరి మృతదేహాలకు అంతిమయాత్రను ఒకేసారి నిర్వహించారు. తల్లి మంచికట్ల లలిత, కొడుకు అభిలాష్ మృతదేహాలను ఒకే ట్రాక్టర్పై తీసుకెళ్లారు. బెటా లియన్ కానిస్టేబుల్ అయిన అభిలాష్ సహ ఉద్యోగులు పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. తల్లి లలిత చితికి పెద్దకూతురు మౌనిక, అభిలాష్ చితికి చిన్నకూతురు మానస నిప్పుపెట్టారు. అభిలాష్ సోదరీలను ఓదార్చడం ఎవరీ తరం కాలేదు. 7వ బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించే అభిలాష్ మృతదేహానికి బెటా లియన్ కమాండెంట్ సురేష్ నివాళి అర్పించారు. తల్లి, అన్న చితికి నిప్పుపెట్టిన చెల్లెళ్లు -
ఇసుక రీచ్ వద్ద ట్రాక్టర్ల క్యూ !
శ్రీ శ్రీనివాసం.. శిరసా నమామిసిరిసిల్లటౌన్: శ్రీశాల శ్రీనివాసుడు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చాడు. శనివారం శ్రీవారికి ఏకాంతసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని మల్లెలతో అలంకరించారు. శ్రీవారి దివ్యరూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ఈవో మారుతీరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, అర్చకస్వాములు మాడంరాజు కృష్ణమాచారి, మాడంరాజు సుకుమారచారి పాల్గొన్నారు.తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండెపల్లి ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలించేందుకు వే బిల్లులు ఇచ్చిన రెవెన్యూ అధికారులు మధ్యలోనే క్యాన్సిల్ చేశారని ట్రాక్టర్ యజమానులు శనివారం తెలిపారు. 50 ట్రాక్టర్లను మండెపల్లి రీచ్ వద్ద నిలిపి ధర్నా చేశారు. ఈ విషయంపై తంగళ్లపల్లి తహసీల్దార్ జయంత్కుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా వేబిల్లులు ఇచ్చింది వా స్తవమేనని, డ్రైవర్లు ఇష్టానుసారంగా నడిపి వ్యవసాయ పైప్లైన్లు పాడుచేసినట్లు ఫిర్యాదు వచ్చి నట్లు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లను పిలిచి సమస్యరాకుండా నడపాలని సూచించినట్లు పేర్కొన్నారు. -
ఇదీ పల్లె.. పంచాయతీ కథ
సిరిసిల్ల: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అని పాలకులు పదే పదే చెబుతుంటారు. ఇప్పుడు పల్లెల్లోనే ఎన్నికల సందడి మొదలైంది. అసలు గ్రామపంచాయతీ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది.. ఆ చరిత్ర ఏమిటో..? ఇప్పటి తరానికి తెలియదు. పల్లెల్లో పాలన ఆరు దశాబ్దాల కిందటే మొదలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్థానిక పాలన ఉండాలని భావించిన అప్పటి పాలకులు పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు 1957లో భారత ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మూడు అంచెల స్థానిక సంస్థల వ్యవస్థ ఉండాలని భావించింది. ఈమేరకు గ్రామపంచాయతీ, పంచాయతీ సమితి(తాలూకా), జిల్లా పరిషత్ మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని బల్వంతరాయ్ కమిటీ సిపార్సు చేసింది. ఈమేరకు జాతీయ అభివృద్ధి సంస్థ 1958లో ఆమోదించడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. ఈ చట్టాన్ని తొలిసారి రాజస్థాన్ అమలు చేసింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1959 అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా అమలు చేశారు. అప్పటి నుంచి అనేక మార్పులతో పంచాయతీరాజ్ చట్టం రూపాంతరం చెందింది. పరోక్ష పద్ధతిలో ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో 1964లో సమగ్ర గ్రామపంచాయతీల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం 500లకు పైగా జనాభా ఉన్న గ్రామాలను గుర్తించి గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. జనాభా ప్రాతిపదికన ఒక్కో గ్రామపంచాయతీలో ఐదు నుంచి 17 వరకు వార్డు సభ్యులు ఉండవచ్చని నిర్ధేశించారు. 1964లో జరిగిన ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. ఎన్నికల్లో వార్డు సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటే.. ఎన్నికై న వార్డు సభ్యుల్లో ఒక్కరిని మెజార్టీ సభ్యుల ఆమోదంతో సర్పంచ్గా ఎన్నుకునేవారు. ఇలా ఎన్నికై న గ్రామ సర్పంచ్లు అందరూ కలిసి సమితి ప్రెసిడెంట్ను ఎన్నుకునే వారు. ఎన్నికై న సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునే పరోక్ష విధానం ఉండేది. 1976 వరకు అంటే 12 ఏళ్ల పాటు ఇదే విధానం కొనసాగింది. ప్రత్యక్ష పద్ధతికి 1978లో శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. గ్రామసర్పంచ్ ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనే అంశంపై అధ్యయనం చేసింది. నరసింహం కమిటీ ప్రత్యక్ష పద్ధతిలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సిపార్సు చేయడంతో అప్పటి నుంచి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మండల వ్యవస్థతో సమూల మార్పులు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి సీఎం ఎన్టీఆర్ తాలూకాలను రద్దు చేశారు. 1987లో మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టి ఎన్నికలు నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఓటర్లు ఓట్లు వేసి ఎన్నుకునే విధానాన్ని అమలు చేశారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ల్లో ఒక్కరిని మెజారీ సభ్యుల ఆమోదంతో ఎన్నుకునే విధానం అమలు చేశారు. ఎంపీపీలుగా ఎన్నికై న వారు జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకునేవారు. 1994లో ఏపీ పంచాయతీరాజ్ చట్టం అమలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 ద్వారా అదే ఏడాది నుంచి గ్రామాల్లో గ్రామపంచాయతీ సర్పంచ్లతోపాటు మండల పరిషత్ సభ్యులు(ఎంపీటీసీ), జిల్లా పరిషత్(జెడ్పీటీసీ) సభ్యుల ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఎంపీటీసీ సభ్యులు మెజార్టీ ఆమోదంతో ఎంపీపీల ఎన్నిక, జెడ్పీటీసీ సభ్యుల మెజార్టీ ఆమోదంతో జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి. 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. గ్రామపంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లను నియమించడం, ప్రతీ ఊరిలోనూ వైకుంఠధామాలు, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతివనాలు, ట్రాక్టర్లు, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్యార్డుల ఏర్పాటు వంటి సమూలమైన మార్పులకు 2018 చట్టం శ్రీకారం చుట్టింది. గ్రామపంచాయతీలకు విశేష అధికారాలు కల్పిస్తూ చట్టం రూపుదిద్దుకుంది. ఈ చట్టం ప్రకారమే ఇప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరు దశాబ్దాల గ్రామ‘పంచాయతీ’ తొలిసారి 1964లో ఎన్నికలు పంచాయతీరాజ్ చట్టాల రూపకల్పన -
గంభీరావుపేట యువకునికి నేవీలో ఉద్యోగం
గంభీరావుపేట(సిరిిసిల్ల): గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన బి.నిహాంత్గౌడ్ నేవీలో సబ్ లెఫ్టినెంట్ ఉద్యోగం సాధించాడు. స్వప్న కుమారుడు నిహాంత్గౌడ్ శనివారం ఉద్యోగంలో చేరాడు. కోరుకొండ సైనిక్ స్కూల్లో ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. స్కూల్లోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యాడు. పూణెలో మూడేళ్లపాటు కోర్సు పూర్తి చేసుకున్నాడు. ఏడాదిగా నేవీ ఉద్యోగం కోసం శిక్షణ పొందాడు. ఉద్యోగం సాధించిన నిహాంత్గౌడ్ను గ్రామస్తులు అభినందిస్తున్నారు. రాజన్న గోశాల తనిఖీవేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లోని రాజన్న గోశాలను ఈవో రమాదేవి శనివారం తనిఖీ చేశారు. గోశాలలోని గోవులకు, కోడెలకు అందిస్తున్న గ్రాసం, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. చలికాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. వేములవాడ: భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనులు చేపట్టాలని ఈవో రమాదేవి సూచించారు. భక్తుల ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఆలయ ఇన్స్పెక్టర్ ఎడ్ల శివసాయి, ఎస్పీఎఫ్ ఏఎస్సై మహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
కొత్త కొత్తగా ఉన్నదీ!
ఇది ఇల్లంతకుంట మండలం బోటుమీదిపల్లి. ఇన్నాళ్లు దాచారం గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. ఇప్పుడు కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. ఈ గ్రామంలో 400 వరకు జనాభా ఉండగా, ఓటర్లు 157 మంది ఉన్నారు. ఈసారి వీరి ఊరిలోని వ్యక్తినే సర్పంచ్గా ఎన్నుకునే అవకాశం దక్కుతుంది. బోటుమీదిపల్లిలో ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.ఇది గంభీరావుపేట మండలం హీరాలాల్తండా. ముచ్చర్ల గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. రెండేళ్ల క్రితం కొత్త జీపీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్నికలు లేకపోవడంతో స్థానిక పాలన లేదు. ఇప్పుడే తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జనాభా 500 కాగా ఓటర్లు 279 మంది ఉన్నారు. -
● కొత్త గ్రామపంచాయతీల్లో ఎన్ని‘కళ’ ● ఐదు గ్రామాల్లో తొలిసారి ఎలక్షన్ ● రెండు గ్రామాల్లో ఏడేళ్లకు..
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన ఐదు గ్రామపంచాయతీలు బాకూర్పల్లితండా, తాళ్లల్లపల్లి, బోటుమీదిపల్లి, హీరాలాల్తండా, జైసేవాలాల్తండాలలో తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. రెండేళ్ల క్రితం ఏర్పడ్డ జీపీలు ప్రత్యేకాధికారుల పాలనలోనే మగ్గాయి. తమ గ్రామంలోని వ్యక్తినే సర్పంచ్గా ఎన్నుకునే అవకాశం వారికి ఈసారి దక్కుతుంది. జిల్లాఓ మరో రెండు గ్రామాలు బద్దెనపల్లి, గొల్లపల్లిల్లో ఏడేళ్లకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. స్వయంపాలన దిశగా అడుగులు వేస్తున్న గ్రామాల్లో పరిస్థితిపై ప్రత్యేక కథనం. ఏడేళ్లుగా ఎన్నికలకు దూరం 2019లో జిల్లాలోని అన్ని గ్రామాలకు ఎన్నికలు జ రగ్గా.. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి, ఇల్లంతకుంట మండలం గొల్లపల్లిలో ఎన్నికలు జరగలేదు. బద్దెనపల్లి జనాభాలో సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యార్థులను లెక్కించారు. దీంతో ఎస్సీల సంఖ్య పెరిగిపోయి గ్రామ సర్పంచ్ పదవి ఆ సామాజి కవర్గానికి రిజర్వు అయింది. దీంతో ఆ గ్రామానికి చెందిన వారు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నిక ఆగిపోయింది. ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామస్తులు 2019లో గ్రామంలోని భూసమస్యలు పరిష్కారం కాలేదని, తమ ఊరు వారిని పక్క ఊరి ఓటర్ల జాబితాలో చేర్చారంటూ ఎన్నికలు బహిష్కరించారు. ఆ సమయంలో ఒక్కరు కూడా నామినేషన్ వేయకపోవడంతో ఎన్నికలు జరగలేదు. జిల్లాలో ని ఈ రెండు గ్రామాల్లో ఐదేళ్లు స్థానిక పాలన లేకపోగా.. మరో రెండేళ్లు ప్రత్యేకాధికారి పాలన సాగింది. గిరి‘జన’ తండాలు పంచాయతీలుగా.. అటవీ ప్రాంతాల్లో నివసించే ‘గిరి’జనులకు 2019లో పాలనా పగ్గాలు దరిచేరాయి. అడవిని నమ్ముకుని జీవించే గిరిపుత్రులు తొలిసారిగా సర్పంచులు, వార్డు సభ్యులు.. ఉపసర్పంచ్గా పదవులు పొందారు. జిల్లాలో కొత్తగా 25 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుతూ 2018 ఆగస్టు 2న ప్రభుత్వం జీవో జారీ చేయగా.. 2019లో ఎన్నికలు జరిగాయి. రుద్రంగి మండలం మానాలలోనే 8 గిరిజన తండాలు గ్రామపంచాయతీలుగా అవతరించాయి.ఇది ఎల్లారెడ్డిపేట మండలంలోని జైసేవాలాల్ తండా గ్రామపంచాయతీ తాత్కాలిక భవనం. ఈ గ్రామంలో 450 వరకు జనాభా.. 236 మంది ఓటర్లు ఉన్నారు. ఇంతకాలం గుండారం పరిధిలో ఉండగా.. జీపీగా ఏర్పాటైన తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. వందశాతం గిరిజనులు ఉండే ఈ తండా జీపీలో స్వయం పాలన రానుంది. -
మోసపోయిన ప్రజలు గోస పడుతుండ్రు
సిరిసిల్ల: ఎన్నికల్లో మోసపోయిన ప్రజలు ఇప్పుడు గోసపడుతున్నారని మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ వద్ద శనివారం నిర్వహించిన దీక్షా దివస్లో మాట్లాడారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. 2009 నవంబరు 29న కేసీఆర్ చేపట్టిన దీక్షను తెలంగాణ సమాజం మరిచిపోదని, నేటి తరానికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్రాన్ని సీఎం రేవంత్రెడ్డి మూడు ముక్కలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజన్–2047 పేరిట ఓఆర్ఆర్ వరకు అర్బన్ తెలంగాణ, ఆర్ఆర్ఆర్ వరకు సెమీ అర్బన్, మిగతా జిల్లాలను గ్రామీణ తెలంగాణగా చూపుతున్నారని వివరించారు. రాష్ట్రం రాకముందు.. వచ్చిన తరువాత మార్పులను సమాజం గమనించిందన్నారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కేసీఆర్ చేసినన్ని పదవీ త్యాగాలు చరిత్రలో ఎవరూ చేయలేదన్నారు. ఉద్యమంలో తెలంగాణ భావజాల వ్యాప్తికి కేసీఆర్ స్వయంగా పాటలు రాశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, నాయకులు జిందం చక్రపాణి, న్యాలకొండ అరుణ, గూడూరి ప్రవీణ్, ఆకునూరి శంకరయ్య, ఏనుగు మనోహర్రెడ్డి, జిందం కళాచక్రపాణి, రామతీర్థపు మాధవి, బొల్లి రామ్మోహన్, సిద్ధం వేణు, కుంబాల మల్లారెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, ‘సెస్’ వైస్ చైర్మన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
మండలం సర్పంచ్ నామినేషన్లు వార్డు నామినేషన్లు రుద్రంగి 10 39 86 180 చందుర్తి 19 111 174 394 వేములవాడ అర్బన్ 11 122 104 345 కోనరావుపేట 28 202 238 513 వేములవాడ రూరల్ 17 98 146 335 సిరిసిల్ల: జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నా మినేషన్ల ఘట్టం శనివారం సాయంత్రంతో ముగిసింది. వేములవాడ అర్బన్, రుద్రంగి, కోనరావుపేట, వేములవాడరూరల్, చందుర్తి మండలాల్లోని 85 గ్రామాల్లో సర్పంచ్, 748 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లను రాత్రి వరకు క్యూ లైన్ కట్టి మరీ అభ్యర్థులు పోటీ చేశారు. నా మినేషన్ల దాఖలుకు ముహూర్తం చూసుకుని రావడంతో శనివారం నవమి కావడంతో ఆఖరి రోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. వేములవాడఅ ర్బన్ మండలం అనుపురంలో రాత్రి 8.40 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వా స్తవానికి శనివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా.. రిటర్నింగ్ అధికారి(ఆర్వో) వద్దకు ఒకే సారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు. దీంతో 5 గంటల్లోగా ఆర్వో ఆఫీస్ వచ్చిన అభ్యర్థులకు టోకెన్ నంబర్ కేటాయించి రాత్రి వరకు నామినేషన్ల దాఖలు కొనసాగించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 5 గంటల తర్వాత చెల్లుబాటు అయిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వెల్లడిస్తారు. నేటి నుంచి రెండో విడత నామినేషన్లు బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో ఆదివారం నుంచి నామినేషన్ల పర్వం మొదలుకానుంది. బోయినపల్లి మండలంలోని 23 సర్పంచ్, 212 వార్డు స్థానాలకు, ఇల్లంతకుంట మండలంలోని 35 సర్పంచులు, 294 వార్డులు, తంగళ్లపల్లి మండలంలోని 30 సర్పంచ్ స్థానాలకు, 252 వార్డుమెంబర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ మూడు మండలాల్లోని 88 గ్రామాల సర్పంచ్లకు, 758 వార్డులకు నామినేషన్లు వేయనున్నారు. డిసెంబరు 2తో నామినేషన్లకు చివరి గడువు. ఈమేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. -
కోడెల పక్కదారిపై విచారణ
● గతంలో అక్రమంగా నాలుగు కోడెల తరలింపు ● విచారణకు ఆదేశించిన ఈవో వేములవాడఅర్బన్: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయ కోడెల పక్కదారిపై అధికారులు విచారణకు ఆదేశించారు. శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు కోడెమొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా కొందరు భక్తులు స్వామి వారికి నిజకోడెలను సమర్పిస్తుంటారు. ఇలా భక్తులు అందజేసిన కోడెలను తిప్పాపూర్లోని గోశాలలో సంరక్షిస్తున్నారు. ఇలా భక్తుల ద్వారా వస్తున్న కోడెలతో గోశాల నిండిపోవడంతో కొన్నాళ్ల వరకు గోశాలలకు కోడెలను ఉచితంగా అందజేసేవారు. ఇలా వెళ్లిన కోడెలు పక్కదారి పడుతుండడంపై అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఆలయ ఈవో రమాదేవి విచారణకు ఆదేశించారు. గోశాల పేరిట పక్కదారి 2024 జనవరిలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దుబ్బతండాలోని శ్రీసోమేశ్వర గోసంరక్షణ సేవా సంఘానికి 20 కోడెలను రాజన్న గోశాల నుంచి అందజేశారు. కోడెలను తీసుకెళ్తున్న వాహనాన్ని విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ నాయకులు జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో తనిఖీ చేశారు. రాజన్న ఆలయం నుంచి 20 కోడెలను అందజేసినట్లు లేటర్ ఉండగా వాహనంలో 24 కోడెలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుతో పలు అవకతవకలు వెలుగుచూశాయి. అసలు ఆ ప్రాంతంలో గోశాలనే లేనట్లు తేలింది. వాహనంలో నాలుగు కోడెలు అదనంగా ఉండడంతో పోలీసులు రాజన్న ఆలయ ఉద్యోగులతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆలయ అధికారులకు అప్పుడే చార్జి మెమోలు జారీ చేశారు. గోశాలలోని కోడెలు పక్కదారి పట్టిన ఘటనపై రాజన్న ఆలయ ఈవో రమాదేవి ఇటీవల శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. -
కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపిబోయినపల్లి(చొప్పదండి): కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఇస్తున్న నిధుల కోసమే గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంట్లో పొయ్యి వెలిగించే ఉజ్వల గ్యాస్ కనెక్షన్, తినే రేషన్ బియ్యం నుంచి ఉపాధిహామీ పని, బయటకు వెళితే రోడ్లు, వీధి లైట్లకు కేంద్రమే నిధులు ఇస్తుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఆర్ఐఎఫ్, పీఎంజీఎస్వై నిధులతో రోడ్ల సౌకర్యం కల్పిస్తున్నారని, మోదీ గిఫ్ట్ కింద సైకిళ్లు, పదోతరగతి విద్యార్థుల ఫీజులు చెల్లించారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటలు నమ్మకుండా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు ఎడపల్లి పరశురాం, మండల ఇన్చార్జి దుబాల శ్రీనివాస్, నాయకులు ఉదారి నరసింహచారి, గుడి రవీందర్రెడ్డి, క్యాతం తిరుపతిరెడ్డి, సూదుల సాయికుమార్, బొంగోని అశోక్, స్వామికుమార్, శ్రీనివాస్రెడ్డి, రాజేంద్రప్రసాద్, సుంకపాక ప్రభు, సారంపల్లి రాజు, గంగయ్య, రమేశ్, ధర్మేంద్ర, వినోద్, అనిల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాలెట్ బాక్సులు వచ్చేశాయ్..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): స్థానిక ఎన్నికల మొదటి విడత నామినేషన్లు శనివారంతో పూర్తయి, రెండో విడత ఎన్నికల నామినేషన్లు ఆదివారంతో ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యా లెట్ బాక్సులు మండల కేంద్రాలకు చేరుతున్నాయి. శనివారం తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని స్ట్రాంగ్రూమ్లో బ్యాలె ట్ బాక్స్లను అధికారులు భద్రపరిచారు. మండలంలో 255 పోలింగ్ కేంద్రాలు ఉండగా 277 బ్యాలెట్ బాక్సులు కేటాయించారు. డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీవో మీర్జా అఫ్జల్ అహ్మద్ బేగ్, అధికారులు రాజునాయక్, బండి లక్ష్మణ్ పర్యవేక్షించారు. ఇల్లంతకుంట(మానకొండూర్): పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సమష్టిగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండలంలోని పత్తికుంటపల్లి, తాళ్లపల్లి, ముస్కానిపేటలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం కాంగ్రెస్లో చేరారు. పార్టీ మండలాధ్యక్షుడు కె.భాస్కర్రెడ్డి, నాయకులు వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, తిరుపతిరెడ్డి, ఎలుక రామస్వామి, నగేశ్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. సిరిసిల్లకల్చరల్: విద్యార్థులు, పిల్లల భద్రతకు సంబంధించిన అంశాల్లో పెద్దలు బాధ్యతా యుతంగా వ్యవహరించాలని పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ కోరారు. స్థానిక శివనగర్లోని మహర్షి ఇంగ్లిష్ మీడి యం హైస్కూల్లో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, ప్రధాన న్యాయమూర్తి బి.పుష్పలత, కార్యదర్శి పి.లక్ష్మణాచారి మార్గదర్శకత్వంలో చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. పిల్లలపై లైంగిక నేరాల నియంత్రణకు రూ పొందించిన పోక్సో చట్టంలోని కీలకాంశాలను వివరించారు. లోక్ అదాలత్ సభ్యులు గుర్రం ఆంజనేయులు, ఆడెపు వేణు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జ్యోతి, ప్యానెల్ అడ్వకేట్ అరుణ, హెచ్ఎం బూర శ్వేత పాల్గొన్నారు. నేడు సిరిసిల్లకు మంత్రి పొన్నం రాకసిరిసిల్లటౌన్: మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ ఆదివారం సిరిసిల్లకు వస్తున్నారు. ఇటీవల నియమితులైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి వస్తున్నారు. సిరిసిల్లకల్చరల్: జిల్లాకు చెందిన కవి గూడూరి బాలరాజు రచించిన బాలమణి చరితం యక్షగానం పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించనున్నట్లు సిరిసిల్ల సాహితీ సమితి అధ్యక్షుడు డాక్టర్ జనపాల శంకరయ్య తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఐఎంఏ అధ్యక్షురాలిగా డాక్టర్ శోభారాణిసిరిసిల్ల: జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షురాలిగా డాక్టర్ పి.శోభారాణి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ అభినవ్ ఎన్నికయ్యారు. జిల్లా ఐఎంఏ కార్యవర్గ సమావేశం శుక్రవారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో వైద్యులు సంతోష్, ప్రసాద్రావు, రమణారావు, మురళీధర్రావు, శ్రీనివాస్, పెంచలయ్య, శ్రీవాణి, పద్మలత, గీతావాణి తదితరులు పాల్గొన్నారు. -
తొలిఫలితాలు తేలేది ఇక్కడే!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: పంచాయతీ ఎన్నికలకు తొలివిడత నామినేషన్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతి తక్కువ ఓట్లున్న గ్రామాలపై అందరి దృష్టి పడుతోంది. నవంబరు 27 నుంచి మొదలై.. డిసెంబరు 17 వరకు మూడు దశల్లో జరిగే ఈ ఎన్నికలకు కరీంనగర్ 316 గ్రామాలు, పెద్దపల్లి 263 గ్రామాలు, జగిత్యాల 385 గ్రామాలు, సిరిసిల్ల 260 కలిపి మొత్తం గ్రామాలు 1,224 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా గ్రామ జనాభా కనీసం 1000 ఓట్లకు కాస్త అటూఇటూగా ఉంటుంది. కానీ.. నూతన రాష్ట్రంలో పలు హామ్లెట్లు, తండాలకు జీపీ హోదా లభించింది. ఈ నేపథ్యంలో 500 ఓట్లలోపు ఉన్న జీపీలు సర్వసాధారణ విషయంగా మారాయి. అదే సమయంలో అంతకుమించి తక్కువ ఓట్లున్న గ్రామపంచాయతీలు కూడా ఉన్నాయి. ఇలాంటి గ్రామపంచాయతీల్లో ఫలితాలు వేగంగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. మరీ 200, 300లోపు ఓట్లున్న గ్రామాల్లో గంటలోపే ఫలితం తేలనున్నాయి. ఇలాంటి తక్కువ ఓట్లున్న గ్రామ పంచాయతీలు సిరిసిల్లలో ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా ఎల్లారెడిపేట మండలం గుంటచెరువుపల్లి తండాలో కేవలం 121 ఓట్లు ఉండగా, ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లెలో 150 ఓట్లు.. చందుర్తి మండలం కొత్తపేటలో 163 ఓట్లు ఉండటం గమనార్హం. కరీంనగర్ జిల్లాలో 500 ఓటర్ల కంటే తక్కువగా ఉన్న గ్రామాలు (28) కరీంనగర్ నియోజకవర్గంలో (2), కరీంనగర్ రూరల్ మండలం తాహెర్కొండాపూర్ (436), నల్లగుంటపల్లి (431). హుజూరాబాద్ నియోజకవర్గంలో (9), హుజూరాబాద్ మండలం బొత్తలపల్లి (448), సైదాపూర్ మండలం గర్రెపల్లి (382), రాయికల్ తండా (470), గుండ్లపల్లి (420), జమ్మికుంట మండలం పాపయ్యపల్లి (492), నాగారం (457), వీణవంక మండలం నర్సింహాలపల్లి (498), రామకృష్ణాపూర్ (404), ఇల్లంతకుంట మండలం వాగొడ్డు రామన్నపల్లి (486). చొప్పదండి నియోజకవర్గంలో(2), చొప్పదండి మండలం కోనేరుపల్లి (347), గంగాధర మండలం ఇస్లాంపూ ర్ (484). మానకొండూర్ నియోజకవర్గంలో (15 గ్రామాలు) మానకొండూర్ మండలం పెద్దూర్పల్లి (282), రాఘవపూర్ (342), బంజేరుపల్లి (310), గన్నేరువరం మండలం చాకలివానిపల్లి (436), చొక్కరావుపల్లె (460), గోపాల్పూర్ (394), పీచుపల్లి (285), సాంబయ్యపల్లి (215), యస్వాడ (230), శంకరపట్నం మండలం అంబేద్కర్నగర్ (386), అర్కండ్ల (452), గుడాటిపల్లి (375), కల్వ ల (345), మక్త (264), నల్లవంకాయపల్లి (246).తంగళ్లపల్లి మండలంలో మొత్తం ఏడు గ్రామాల్లో 500 లోపు ఓట్లున్నాయి. అందులో చింతల్ఠాణాలో అత్యల్పంగా 209 ఓట్లే ఉన్నాయి. ముస్తాబాద్ మండలంలో మొత్తం ఐదు గ్రామాల్లో గోపాల్పల్లిలో 262 అత్యల్ప ఓట్లు కలిగి ఉంది. వీర్నపల్లి మండలంలో 5 గ్రామాలుండగా.. మద్దిమల్ల (306 ఓట్లు) ఆఖరుగా నిలిచింది. గంభీరావుపేటలో ఐదు గ్రామాలకు లక్ష్మీపూర్ (265 ఓట్లు) చివరన నిలిచింది. ఎల్లారెడ్డిపేటలో 9 గ్రామాలు ఉండగా అందులో గుంటచెరువుపల్లి తండా (121) ఓట్లు కలిగి ఉంది. ఇల్లంతకుంట మండలంలో మొత్తం నాలుగు గ్రామాలకు చిక్కుడువానిపల్లిలో (150) ఓట్లు నమోదయ్యాయి. వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ అర్బన్లో 500 ఓట్లున్న ఏకై క గ్రామం గుర్రంవానిపల్లి (293 ఓట్లు). వేములవాడ రూరల్లో మూడు గ్రామాలలో వెంకటంపల్లి (308) ఓట్లతో చివరన ఉంది. రుద్రంగిలో ఆరు గ్రామాల్లో వీరునితండా (278)ఓట్లతో ఆఖరు స్థానంలో నిలిచింది. కోనరావుపేటలో మొత్తం ఆరు గ్రామాలకు గొల్లపల్లి కొలనూరు 227 అతి తక్కువ ఓట్లు నమోదు చేసింది. చందుర్తిలోలో రెండు గ్రామాలకు కొత్తపేటలో అత్యల్పంగా 163 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. బోయినపల్లి మండలంలో 500లోపు ఓట్లున్న గ్రామాలేవీ లేవు.జగిత్యాల నియోజకవర్గంలో (5గ్రామాలు), రాయికల్ మండలం ధావన్పెళ్లి (436), కురుమపెళ్లి (323), కైరిగూడెం (170), రామారావుపల్లె (390), వస్తాపూర్ (442), సారంగాపూర్.. బీర్పూర్ మండలం (నాలుగు గ్రామాలు), ఇందిరానగర్ (310), బొందుగూడెం (235), చిన్నకొలువై(110), కోమన్పల్లి(350). కోరుట్ల నియోజకవర్గంలో (9గ్రామాలు), మల్లాపూర్ మండలం హుస్సేన్నగర్ (357), ఓబులాపూర్తండా (311), వాల్గొండతండా (326), మెట్పల్లి మండలం ఏఎస్ఆర్ తండా (297), చెర్లకొండాపూర్ (484), కేసీఆర్ తండా (333), పాటిమీది తండా (311), రామారావుపల్లె (359), రంగారావుపేట (424). ధర్మపురి నియోజకవర్గంలో (4 గ్రామాలు), గొల్లపల్లి మండలం గంగాదేవిపల్లి (441), నందిపల్లి (365), వెల్గటూర్ మండలం కోటిలింగాల (436), బుగ్గరాం మండలం సందయ్యాపల్లి (250).మంథని మండలంలో బెస్తపల్లిలో 472, భట్టుపల్లిలో 476, గుమ్నూర్లో 490, తోటగోపయ్యపల్లిలో 490 ఓటర్లు మాత్రమే ఉన్నారు. అలాగే రామగిరి మండలంలోని లొంకకేసారం గ్రామంలో 486, పెద్దంపేట గ్రామంలో 482, కమాన్పూర్లోని గొల్లపల్లెలో 507, ముత్తారంలోని దర్యాపూర్లో 360 ఓటర్లు ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఓదెల మండలంలోని అబ్బీడిపల్లిలో 450, లంబాడి తండాలో 421, కాల్వశ్రీరాంపూర్లోని మడిపల్లిలో 439, ఇప్పలపల్లిలో 477, లక్ష్మీపురంలో 496 ఓట్లు, ధర్మారం మండలంలోని లంబాడితండలో 445, నాయకంపల్లిలో 454, ఎలిగేడులోని లోకపేట గ్రామంలో 527 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. -
పారదర్శకత.. ప్రశాంతతే లక్ష్యం
సిరిసిల్ల: పారదర్శకంగా, ప్రశాంతంగా గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు(ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వలెన్స్ బృందాల (ఎస్ఎస్టీ)ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా సరిహద్దుల్లో పోలీస్ చెక్పోస్టుల ద్వారా వాహనాలను తనిఖీ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. సెన్సిటివ్ కేంద్రాలపై మండలస్థాయిలో కమిటీ జిల్లాలో సెన్సిటివ్(సమస్యాత్మక) పోలింగ్ కేంద్రాల నిర్ధారణకు మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్హెచ్వోలతో కమిటీలను ఏర్పాటు చేశాం. గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను నిర్ధారించి ఎస్పీకి నివేదిక పంపిస్తారు. దాని ఆధారంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు ఎస్పీ పర్యవేక్షిస్తారు. మా పరిధిలో ఆయా కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ లేదా మైక్రో అబ్జ ర్వర్స్ను నియమిస్తాం. కొన్ని కేంద్రాల్లో అవసరమైతే కాలేజీ విద్యార్థులతో వీడియో తీయిస్తాం. ఎన్నికల ఖర్చుపై డిక్లరేషన్ ఇవ్వాలిజిల్లాలో ఎన్నికల తీరును పరిశీలించేందుకు సాధారణ, వ్యయపరిశీలకులు పి.రవికుమార్, కె.రాజ్కుమార్ వచ్చారు. అభ్యర్థులు నిబంధనలకు లోబడి ఖర్చు చేస్తామని ముందుగానే అఫిడవిట్ ఇవ్వాలి. ఈసారి కొత్తగా ఈ విధానాన్ని ఎన్నికల కమిషన్ తీసుకవచ్చింది. జిల్లాలో పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకు అధికారులను మైక్రో అబ్జర్వర్లుగా నియమిస్తున్నాం. టీ–పోల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి ఈసారి ఎన్నికల కమిషన్ టీ–పోల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే.. ఓటర్ల వివరాలు, పోలింగ్ కేంద్రాల సమాచారం తెలుస్తుంది. ఏమైనా ఫిర్యాదులు ఉంటే యాప్ ద్వారా చేసే అవకాశం ఉంది. టీ–పోల్లో వచ్చిన ఫిర్యాదులను మూడు రోజుల్లో పరిష్కరిస్తారు. సీ–విజిల్ తరహాలో టీ–పోల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. కలెక్టరేట్లోనూ 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూంను, హెల్ప్లైన్ను, మీడియా సెంటర్ను ఏర్పాటు చేశాం. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే 1800 133 1495 నంబర్కు ఫోన్చేసి చెప్పవచ్చు. ఎన్నికల కమిషన్ ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ‘నోటా’కు అనుమతించింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ ఇష్టం లేకుంటే.. ‘నోటా’కు ఓటు వేయవచ్చు. ప్రతి ఒక్క ఓటరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులుజిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, గంభీరావుపేట మండలం పెద్దమ్మస్టేజీ, వేములవాడరూరల్ మండలం ఫాజుల్నగర్, ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి, బోయినపల్లి మండలం నర్సింగాపూర్, రుద్రంగి శివారులోని మానాల క్రాస్రోడ్డు వద్ద పోలీస్ చెక్పోస్టులు ఉన్నాయి. 24 గంటలూ ఇవి పనిచేస్తాయి. జిల్లాలోకి అక్రమ మద్యం, డబ్బులు రవాణా జరగకుండా తనిఖీలు చేస్తున్నారు. రూ.50వేలకు మించి తరలిస్తే సీజ్ చేసి రశీదు అందిస్తారు. క్షేత్రస్థాయిలో చెక్పోస్టులను పరిశీలించాను. మూడు విడతల్లో ఎన్నికలు జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే గ్రామాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేశాం. జిల్లాలోని 260 గ్రామపంచాయతీలు, 2,268 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో రుద్రంగి, వేములవాడ, వేములవాడరూరల్, కోనరావుపేట, చందుర్తి మండలాల్లోని 85 గ్రామపంచాయతీలు, 748 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ ఎన్నికలకు శనివారంతో నామినేషన్ల దాఖలు ముగుస్తుంది. రెండో విడతలో బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని 88 గ్రామపంచాయతీలకు, 758 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మూడో విడతలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లోని 87 గ్రామపంచాయతీలు, 762 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆఫీస్లో సాయంత్రం 5 గంటల్లోపు ఉన్న అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు. ఏకగ్రీవ ఎన్నికలపై నిషిత పరిశీలనజిల్లాలో ఎన్నికలు లేకుండా గ్రామస్తులు ఐక్యతతో.. స్వచ్ఛందంగా పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచి పరిణామం. కానీ లోపాయికారీగా వేలం పాటలు నిర్వహించడం, ప్రలో భాలకు గురిచేసి ఏకగ్రీవం చేసుకోవడం నిబంధనలకు విరుద్ధం. నామినేషన్ల పర్వం ముగిసిపోయి, సింగిల్ నామినేషన్ వచ్చిన సందర్భాల్లో అదనపు కలెక్టర్ చైర్మన్గా, డీఆర్డీవో కన్వీనర్గా కమిటీ ఉంది. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో నిషితంగా పరిశీలించి నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగానే ఏకగ్రీవమైనట్లుగా ప్రకటిస్తాం.రైతులకు ఇబ్బందులు లేకుండా..ఎన్నికల విధుల్లో అధికారులు బిజీగా ఉన్నా రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 1.72 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. తూకం వేసిన ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలిస్తున్నాం. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమవుతున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులు కొనసాగుతున్నాయి. -
ఖాళీ బిందెలతో నిరసన
సిరిసిల్ల అర్బన్: పెద్దూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వీరికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ వారం రోజులుగా నీటి సమస్యతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే వారు లేరన్నారు. మిషన్ భగీరథ నీరు కాలనీకి రావడం లేదన్నారు. కాలనీలోని బోరుమోటార్ల ద్వారా వస్తున్న నీరు గ్రౌండ్ఫ్లోర్కు మాత్రమే సరిపోతుందని, మిగతా వారు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆటోడ్రైవర్లు బీమా చేయించుకోవాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆటోడ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, బీమా కలిగి ఉండాలని సీఐ శ్రీనివాస్గౌడ్ సూచించారు. మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ నాగుల తిరుపతి గతేడాది జూన్లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. వారి కుటుంబానికి బీమా రూ.లక్ష చెక్కును శుక్రవారం అందజేశారు. గతేడాది ఎస్పీ మహేశ్ బీ గీతే ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి బీమా చేయించారు. తిరుపతి మృతిచెందడంతో మంజూరైన బీమా చెక్కును వారి కుటుంబానికి అందజేశారు. ఎస్సై రాహుల్రెడ్డి ఉన్నారు. రేపు డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం సిరిసిల్లటౌన్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీ తం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ముందుగా పట్టణంలో ర్యాలీ తీస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ అజ్మతులా్ల్ హుస్సేని, సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం హాజరవుతారని తెలిపారు. దీక్షాదివస్ను విజయవంతం చేయండి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లా కేంద్రంలో నిర్వహించే దీక్షాదివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరసన దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్షను గుర్తిస్తూ ఏటా దీక్షా దివస్ నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు అందె సుభాష్, గుల్లపల్లి నర్సింహారెడ్డి, కొండ రమేశ్గౌడ్, ఎడ్ల సందీప్, ఎనగందుల నర్సింలు, చాంద్పాషా, ప్రభు, పాశం దేవరెడ్డి, హసన్, రాము, సురేశ్, సుధాకర్రావు, అజ్జు, జీడి శ్రీనివాస్, బాద రమేశ్, నాగరాజు, బాల్రెడ్డి ఉన్నారు. ఇసుక ట్రాక్టర్ల బాధలు తప్పించాలిసిరిసిల్లటౌన్: ఇసుక ట్రాక్టర్ల ద్వారా పడుతున్న ఇబ్బందులను తప్పించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని సాయినగర్వాసులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈమేరకు ఇసుక ట్రాక్టర్లు రవాణా చేసే రోడ్డుపై బైఠాయించి మాట్లాడారు. అధికలోడ్, ఓవర్ స్పీడ్తో తమకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. గతంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనలు పాటించని ఇసుక ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన విరమించారు. -
పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలి
● ప్లాస్టిక్ వినియోగించొద్దు ● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: విద్యార్థులు పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూ చించారు. వికసిత్, ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా జిల్లా కేంద్రంలోని గీతానగర్ హైస్కూల్లో శుక్రవారం జిల్లాస్థాయి ఇన్స్పైర్, విద్య, వైజ్ఞానిక ప్రదర్శన, రాజ్య స్థరీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన (ఆర్ఎస్బీవీపీ) నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించి.. ఎలా తయారు చేశారు అని తెలుసుకున్నారు. ఇన్చార్జి కలెక్టర్ మా ట్లాడుతూ సీవీ రామన్, అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సౌర విద్యుత్, పవన విద్యుత్, ధర్మో డైనమిక్స్, కిరణ జన్య సంయోగక్రియపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టారు. సైన్స్ మ్యూజియం స్థలం కోసం ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. డీఈవో వినోద్కుమార్, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఖర్చు పక్కాగా నమోదు చేయాలి సిరిసిల్ల: ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చును పక్కాగా నమోదు చేయాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సహాయ వ్యయ పరిశీలకుల(ఏఈవో)కు శిక్షణ ఇచ్చారు. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు ఖర్చు రిజిస్టర్లు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలని తెలిపారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లవద్దని సూచించారు. వ్యయ పరిశీలకులు రాజ్కుమార్, నోడల్ అధికారి శేషాద్రి, డీపీవో షరీఫొద్దీన్ పాల్గొన్నారు. మొదటి ర్యాండమైజేషన్ పూర్తి పోలింగ్ సిబ్బందికి మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ తెలిపారు. నోడల్ అధికారులు డీ ఆర్డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫొద్దీన్, ఏవో రాంరెడ్డి, ఈడీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆర్వో కేంద్రాల తనిఖీ
వేములవాడరూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు ఆర్వో కేంద్రాలు, ఎస్ఎస్టీ చెక్పోస్ట్ను జిల్లా సాధారణ పరిశీలకులు రవికుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. వేములవాడరూరల్ మండలం చెక్కపల్లి, వట్టిమల్ల ఆర్వో కేంద్రాలు, ఫాజుల్నగర్ ఎస్ఎస్టీ చెక్పోస్ట్ను తనిఖీ చేశారు. గర్భస్థ లింగ నిర్ధారణ నేరం సిరిసిల్లటౌన్: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని జిల్లా వైద్యాధికారి రజిత హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీస్లో శుక్రవారం జిల్లా పీసీపీఎన్డీటీ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మా ట్లాడారు. జిల్లాలో 27 స్కానింగ్ కేంద్రాలు రిజిస్ట్రేష న్ అయ్యాయని తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ నే రమని, ఉల్లంఘనకు పాల్పడితే మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.10వేలు జరిమానా విధిస్తారని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రి స్కానింగ్ కేంద్రాలలో ఫారం–ఎఫ్ తప్పనిసరిగా నింపి, వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి ప్రతీ నెల 5న పంపించాలని ఆదేశించారు. వైద్యులు అనిత, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఎన్జీవో ప్రెసిడెంట్ చింతోజు భాస్కర్, అరవింద్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక గంభీరావుపేట(సిరిసిల్ల): జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు–2025లో భాగంగా మండలంలోని కొత్తపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన వి ద్యార్థులు అక్షయ, భువనశ్రీ, తేజశ్వి జిల్లాస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వచ్చేనెల 3న కరీంనగర్లో జరిగే రాష్ట్రస్థాయి చెకుముకి పోటీల్లో పాల్గొంటారు. -
చెక్పోస్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● సరిహద్దు చెక్పోస్టులు తనిఖీవేములవాడరూరల్/తంగళ్లపల్లి: చెక్పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. వేములవాడరూరల్ మండలం ఫాజుల్నగర్, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద సరిహద్దు చెక్పోస్టులను శుక్రవారం తనిఖీ చేసి మాట్లాడారు. రాత్రి సమయంలో ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాల తనిఖీ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపా రు. వేములవాడరూరల్ మండలం వట్టెంల, నూకలమర్రిలోని నామినేషన్ కేంద్రాలు పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధన అమలులో ఉంటుందన్నారు. సీఐలు శ్రీనివాస్, మొగిలి, ఎస్సై చల్లా వెంకట్రాజం, పీఆర్ ఏఈ మహేశ్, చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు. -
● సర్పంచ్ స్థానాలకు 149.. వార్డు స్థానాలకు 301
రెండో రోజు నామినేషన్ల జోరుసిరిసిల్ల: జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. మొదటి విడత నా మినేషన్లకు శనివారంతో గడువు ముగియనుండడంతో చాలా మంది అభ్యర్థులు శుక్రవారమే నామినేషన్లు వేశారు. వేములవాడరూరల్, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, వేములవాడ అర్బన్ మండలాల పరిధిలోని 85 సర్పంచ్ పదవులకు శుక్రవారం 149 మంది నామినేషన్లు వేశారు. గురు, శుక్రవారాల్లో కలిపి మొత్తం 191 నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదు మండలాల పరిధిలోని 748 వార్డుస్థానాలకు 301 నామినేషన్లు శుక్రవారం దాఖలు కాగా, గురువారంతో కలిపి 332 వేశారు. శనివారం సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. రేపటి నుంచి రెండో విడతకు నామినేషన్లు డిసెంబరు 14న జరిగే రెండో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ఆదివారంతో మొదలుకానుంది. ఇల్లంతకుంట, బోయినపల్లి, తంగళ్లపల్లి మండలాల్లోని 88 గ్రామపంచాయతీలకు, వాటి పరిధిలోని 758 వార్డుసభ్యుల స్థానాలకు రేపటి నుంచి నామినేషన్లు దాఖలుకానున్నాయి. -
పంచాయతీ షురూ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పల్లె పోరు షురువైంది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందడితో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావహులు మొదటి రోజు తమ మద్దతుదా రులతో వచ్చి నామినేషన్లు సమర్పించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో జరిగే 398 సర్పంచ్ స్థానాలకు తొలిరోజు 258 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 3,682 వార్డు స్థానాలకు 188 మంది నామినేషన్లు వేశారు. నేడు, రేపు భారీస్థాయిలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. నామినేషన్లు సమర్పించేందుకు కావాల్సిన ధ్రువపత్రాలు, ఇంటి, నల్లా పన్నులు చెల్లింపు ప్రతిపాదించే వారిని సమకూర్చుకోవడం వంటి కార్యక్రమాల్లో మరికొంత మంది నిమగ్నమై ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా కరీంనగర్ జిల్లాలో మొదటి విడతలో పోలింగ్ జరిగే ఐదు మండలాల్లో 92 సర్పంచ్స్థానాలకు గానూ 92 నామినేషన్లు, 866 వార్డుమెంబర్ స్థానాలకు 86 నామినేషన్లు దాఖలయ్యాయి. జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో జరిగే ఆరు మండలాల్లోని 122 సర్పంచ్ స్థానాలకు గానూ 48 నామినేషన్లు, 1172 వార్డు మెంబర్ స్థానాలకు 33 నామినేషన్లు దాఖలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడతలో జరిగే ఐదు మండలాల్లో 85 సర్పంచ్స్థానాలకు 42 నామినేషన్లు, 748 వార్డు మెంబర్ స్థానాలకు 32నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో మొదటి విడతలో జరిగే ఐదు మండలాల్లో 99 సర్పంచ్స్థానాలకు గానూ 76నామినేషన్లు, 896 వార్డు మెంబర్ స్థానాలకు 37 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి పరిశీలకులుగా నియమితులైన అధికారులు క్లస్టర్ గ్రామాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమావేశాలు నిర్వహించి పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులతో ప్రమేయం లేకున్నా ఆయా పార్టీల మద్దతు కోసం ఆశావహులు నాయకులతో మంతనాలు మొదలు పెట్టారు. అంగబలం, ఆర్థిక బలం, సామాజిక కోణంతో పరిశీలించి అభ్యర్థులను నియమించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీలు తమ పార్టీ తరఫున గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నాయి. సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీ, గత పదేళ్లలో జరిగిన అభివృద్ధితో బీఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీజేపీ తమ ప్రచారాన్ని గ్రామాల్లో ముమ్మరం చేసి కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నాయి. మరో రెండు రోజుల్లో మొదటి విడత నామినేషన్లు ముగుస్తుండడంతో ఏ పార్టీ తరఫున ఎవరు పోటీలో ఉంటారనేది తేటతెల్లం కానుంది. -
జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు
సిరిసిల్ల: ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు పి.రవికుమార్, కె.రాజ్కుమార్ గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్రూమ్, హెల్ప్లైన్, మీడియా సెంటర్ను సాధారణ పరిశీలకుడు రవికుమార్ పరిశీలించారు. ఎన్నికల ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. నోడల్ అధికారులు భారతి, ప్రకాశ్, డీపీఆర్వో లక్ష్మణ్కుమార్, కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ సిబ్బంది ఉన్నారు. -
విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి
● ఇన్చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్సిరిసిల్ల: ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ సూచించారు. కలెక్టరేట్లో ఫ్లయింగ్స్క్వాడ్ బృందాలు(ఎఫ్ఎస్టీ), స్టాటిక్ స ర్వేలెన్స్ బృందాలు(ఎస్ఎస్టీ), జోనల్, నోడల్ అధికారులకు గురువారం శిక్షణ ఇచ్చారు. జిల్లా సాధారణ, వ్యయ పరిశీలకులు రవికుమార్, రాజ్కుమార్లతో కలిసి ఎన్నికల కోడ్పై అవగాహన కల్పించారు. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొనకూడదని స్పష్టం చేశారు. నగదు, మద్యం పంపిణీని గుర్తించడం, ఆధారాలు సేకరించడం, రికార్డు చేసి, రిపోర్టు చేయాలని సూచించారు. నగదు, ఇతర ఆభరణాలు సీజ్ చేసినప్పుడు వీడియో ఫుటేజీ తీసుకోవాలన్నారు. నోడల్ అధికారులు శేషాద్రి, భారతి, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫొద్దీన్ పాల్గొన్నారు. టీ–పోల్ మొబైల్ యాప్ వినియోగించుకోవాలి జిల్లా ప్రజలు టీ–పోల్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని ఇన్చార్జి కలెక్టర గరీమా అగ్రవాల్ కోరారు. ఓటర్లకు సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉన్నాయన్నారు. ఓటర్ స్లిప్ డౌన్లోడ్, పోలింగ్ కేంద్రం సమాచారం, ఫిర్యాదులు చేసే అంశాలు ఉన్నాయని తెలిపారు. పకడ్బందీగా తనిఖీ చేయాలి రుద్రంగి(వేములవాడ): చెక్పోస్టు వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది పకడ్బందీగా తనిఖీలు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. రుద్రంగి శివారులోని ఎస్ఎస్టీ చెక్పోస్టును గురువారం పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఆర్వో కేంద్రాన్ని తనిఖీ చేశారు. నోటీసుబోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా.. లేదా.. అని తనిఖీ చేశారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వద్దంటే వినరూ..
● కొయ్యకాలు కాల్చుతున్న రైతులు ● దెబ్బతింటున్న భూసారం ● పర్యావరణానికి ముప్పుసిరిసిల్ల: ఓ వైపు వరికోతలు, వడ్ల కొనుగోళ్లు కొనసాగుతుండగా.. మరోవైపు యాసంగికి పొలాలు దున్నుతూ... వరినార్లు పోస్తున్నారు. ఇప్పటికే కోసిన వరిపొలాల్లోని కొయ్యకాళ్లను రైతులు కాలబెట్టుతున్నారు. ఇలా కొయ్యకాలును.. పంట అవశేషాలను కాల్చితే సారవంతమైన భూముల్లో పోషకాలు నశిస్తాయని, పర్యావరణానికి ముప్పు వాటిస్తుందని వ్యవసాయశాఖ అధికారులు చెప్పినా రైతులు వినిపించుకోవడం లేదు. వద్దంటే వినకుండా.. ఏటా అదే పనిని చేస్తున్నారు. నేలలో సూక్ష్మజీవులు నశిస్తాయి భూమిలో అనేక సూక్ష్మజీవులు పంటకు మేలుచేస్తాయి. వానపాములు(ఎర్రలు) లాంటి జీవులు అగ్నికి ఆహుతి అయిపోతాయి. భూసారాన్ని పెంచే వానపాములు క్షీణిస్తే.. సహజంగా పంటలకు సేంద్రియ ఎరువును అందించే జీవులు లేకుండా పోతాయి. ఫలితంగా పంటకు సహజసిద్ధమైన సేంద్రియ ఎరువు కరువు అవుతుంది. భూసారం యథాస్థితికి చేరాలంటే.. చాలా సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కలియదున్నితేనే మేలు నిజానికి కొయ్యకాలును తడిపి పొలంలోనే కలియదున్నితే కుళ్లిపోయి సేంద్రియ ఎరువు తయారవుతుంది. కాల్చడం మూలంగా భవిష్యత్లో పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. భూసారంలో లోపాలు తలెత్తి భూములు నిస్సారంగా మారుతాయి. ఎరువులు వాడుతూ.. పంటల దిగుబడి సాధిస్తున్నా.. ఇది భవిష్యత్ తరాలకు మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు పంటను కాల్చకుండా కలియదున్నాలని, సేంద్రియ ఎరువులతో భూమికి, పంటకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు ఎంత చెబుతున్నా వినడం లేదు. పొలంలోని కొయ్యకాలును కాలబెడుతూనే ఉన్నారు. ఇది తప్పుడు పద్ధతి అని చెప్పినా వినిపించుకోవడం లేదు. పొలంలో కొయ్యకాలును కలియదున్నితే పంట అవశేషాలు కుళ్లిపోయి భూమికి కావాల్సిన పోషకాలు అందుతాయి. రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చు. బహుముఖ ప్రయోజనాలను గుర్తించి కొయ్యకాలు, పంట అవశేషాలను కాల్చవద్దు. – అఫ్జల్బేగం, జిల్లా వ్యవసాయ అధికారి -
‘మా బతుకులు ఆగమైనయ్..’
● 60 గుంటలకు 15 గుంటలే మిగిలినయి ● ఆదుకోవాలని రైతు కుటుంబం వేడుకోలు సిరిసిల్లక్రైం: అందరి అభివృద్ధి కోసం తమ బతుకులు ఆగమైనయని.. 60 గుంటల భూమికి 15 గుంటలే మిగిలిందని.. ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాధిత రైతు కుటుంబ సభ్యురాలు పోలీసుల కాళ్లపై పడి వేడుకోవడం కలచివేసింది. ఈ సంఘటన రగుడు బైపాస్రోడ్డుపై గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రగుడుకు చెందిన పొచవేని బాలయ్య–భారతవ్వ దంపతులకు కలెక్టరేట్ సమీపంలో 60 గుంటల వ్యవసాయ భూమి ఉండేది. అభివృద్ధి పనుల్లో భాగంగా వీరి భూమి పోయింది. ప్రస్తుతం 15 గుంటలే మిగిలింది. గతంలోనే వీరి భూమిలో ఉన్న వ్యవసాయబావి కూల్చి వేతకు అధికారులు నోటీస్లు ఇచ్చారు. గురువారం నాడు ఆ బావిని కూల్చేందుకు అధికారులు పొలం వద్దకు చేరుకోగా.. తమ ఉపాధి పోతుందని కూల్చొద్దంటూ రైతు కుటుంబ సభ్యులు అధికారులను వేడుకున్నారు. అయినా వారిని పోలీస్స్టేష న్కు తరలించి, వారితో తాము పనులకు అడ్డురాబోమని పేపర్పై రాయించుకున్నట్లు తెలిసింది. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు గత ప్రభుత్వంలోనూ పరిహారం పరంగా న్యాయం జరగలేదని, ఇప్పటి ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
సరిహద్దుల్లో పటిష్ట నిఘా
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్పోస్టులుసిరిసిల్ల క్రైం/తంగళ్లపల్లి/బోయినపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ఆధారాలు లేకుండా రూ.50వేలకు మించి నగదు తరలిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. బోయినపల్లి మండలం నర్సింగపూర్, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారు చెక్ పోస్టులను గురువారం తనిఖీ చేశారు. జిల్లాలోని తంగళ్లపల్లి(జిల్లెళ్ల), గంభీరావుపేట(పెద్దమ్మ), ముస్తాబాద్(వెంకట్రావుపల్లి), వేములవాడరూరల్(ఫాజుల్నగర్), బోయినపల్లి(నర్సింగపూర్), రుద్రంగి(మనాల క్రాస్రోడ్) మండలాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రమాకాంత్ ఉన్నారు. ఎన్నికలకు పటిష్ట భద్రతగ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రత చేపడుతున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులు కొత్తగా విధుల్లో చేరిన వారికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక పోలింగ్స్టేషన్లను అధికారులు తరచూ సందర్శించాలని తెలిపారు. రౌడీషీటర్లు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా పెట్టాలని సూచించారు. సోషల్మీడియాలో విద్వేషాలు కలిగేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్ట్లు పెడితే చర్యలు తీసుకోవాలన్నారు. పోస్ట్ చేసిన వారితోపాటు గ్రూప్ అడ్మిన్లపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, ఇన్స్పెక్టర్లు మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, రవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఏకగ్రీవం.. ప్రలోభపర్వం !
సిరిసిల్ల: రుద్రంగి మండలం రూప్లానాయక్ తండావాసులు తమ సర్పంచ్గా జవహర్లాల్నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా బుధవారం ప్రకటించారు. ఈ ఏకగ్రీవ ఎన్నిక వెనక సదరు అభ్యర్థి గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి తన సొంత స్థలం నుంచి గుంటన్నర ఇస్తానని ఒప్పుకోవడంతో ఏకగ్రీవానికి అంగీకరించినట్లు సమాచారం. ఇదే గ్రామపంచాయతీ పరిధిలోనే ఉన్న వర్జియాతండా వాసులు ఆ ఏకగ్రీవాన్ని విభేదించినట్లు సమాచారం. నామినేషన్లపర్వం సాగుతుండగానే.. ఏకగ్రీవం కావడం పరిపాటి. కానీ గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిని ఇస్తానని ఎరగా చూపి ఏకగ్రీవానికి ఎత్తులు వేసినట్లు ఇంటలీజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికై తే రూప్లానాయక్తండాలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రేపటి వరకు నామినేషన్లకు అవకాశం ఉండడంతో ఏకగ్రీవమవుతుండా? తండావాసుల ఐక్యత దెబ్బతింటుందా? అనే అనుమానాలు ఉన్నాయి. ఆదిలోనే హంసపాదు అవుతుందనే సంకేతాలు అందుతున్నాయి. ఏది ఏమైనా.. ఎన్నికల నిబంధనల మేరకు ప్రలోభాలతో ఏకగ్రీవం చేస్తే.. నేరమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఐక్యతతో వార్డు సభ్యులకు, గ్రామ సర్పంచ్కు ఒక్కో నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా దాఖలైతేనే ఏకగ్రీవమైనట్లు భావిస్తారు. ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహక పారితోషికం లభించే అవకాశం ఉంటుంది. -
ధనువాడ నుంచి అసెంబ్లీ స్పీకర్గా..
ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధనువాడ సర్పంచ్గా పనిచేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు 1983, 1985, 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 వరకు శాసనసభ స్పీకర్గా ఉన్నారు. శ్రీపాదరావు మరణానంతరం అతని తనయుడు దుద్దిళ్ల శ్రీధర్బాబు మంథని ఎమ్మెల్యేగా విజయం సాధించి ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు. రేకొండ నుంచి ఎమ్మెల్యే వరకు.. ప్రస్తుత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి రాజకీయ ప్రస్తానం సర్పంచ్గానే మొదలైంది. చిగురుమామిడి మండలం రేకొండ సర్పంచ్గా పనిచేసిన ఆయన జడ్పీటీసీగా, ఎంపీపీగా, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు జగిత్యాల మండలం అంతర్గాంకు చెందిన సుద్దాల దేవయ్య 1983లో సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1985లో జెడ్పీ చైర్మన్గా ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. 1994, 1999లో నేరెళ్ల ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2009లో చొప్పదండి నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. రుద్రవరం నుంచి సిరిసిల్ల దాకా.. వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన రేగులపాటి పాపారావు 1968 నుంచి 1981 వరకు గ్రామ సర్పంచ్గా పనిచేశారు. 1981 నుంచి 1986 వరకు వేములవాడ సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు. 1999లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వెంకట్రావుపేట నుంచి అసెంబ్లీకి.. మెట్పల్లి మండలం వెంకట్రావుపేట సర్పంచ్గా 1968లో పనిచేసిన కొమురెడ్డి రాములు 2004లో మెట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భార్య కొమురెడ్డి జ్యోతి సైతం మెట్పల్లి ఎమ్మెల్యేగా అంతకుముందే గెలిచారు. మొగిలిపేట నుంచి జెడ్పీ చైర్మన్ వరకు మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చెందిన కె.వి.రాజేశ్వర్రావు సర్పంచ్గా 1959 నుంచి 1981 వరకు కొనసాగారు. సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎంపికవుతూ 2004లో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. -
మద్యం పట్టివేత
చందుర్తి(వేములవాడ): మండలంలోని జోగాపూర్, కిష్టంపేటల్లో అక్రమ మద్యం నిలువ ఉందన్న పక్కా సమాచారంతో చందుర్తి పోలీసులు గురువారం రాత్రి దాడులు చేశారు. సుమారు రూ.12,395 విలువ గల అక్రమ మధ్యాన్ని పట్టుకున్నట్లు చందుర్తి ఏఎస్సై ఆనంద్ తెలిపారు. ఏఎస్సై ఆనంద్ తెలిపిన వివరాలు. మండలంలోని జోగాపూర్కు చెందిన గడ్డం అంజయ్య ఇంట్లో రూ.6,725 విలువ గల మద్యం, కిష్టంపేటలో వాంకే అనిత ఇంట్లో రూ.5,670 విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతికరీంనగర్క్రైం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. కరీంనగర్ హుస్సేనిపురకు చెందిన మహ్మద్ అమీర్ఖాన్ (18) మెకానిక్గా పనిచేస్తుంటాడు. బుధవారం రాత్రి షాపు మూసివేసి కార్ఖానాగడ్డకు రాగా, వెనకనుండి గుర్తు తెలియని వ్యక్తి వ్యాన్తో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..మోర్తాడ్: మోర్తాడ్ మండలం గాండ్లపేట శివారు పెద్దవాగుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్కు చెందిన పేర్ల కృష్ణ (44) తన స్నేహితుడు కోట సమ్మయ్యతో కలిసి ఆర్మూర్కు వెళుతుండగా వంతెనపై ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కృష్ణను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. -
‘ఆమె’ చుట్టే రాజకీయం
సాక్షి పెద్దపల్లి: సర్పంచ్ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం. ఒకట్రెండు ఓట్లతోనే ఫలితాలు తారుమారవుతాయి. దీంతో ప్రతీ ఓటును ఒడిసి పట్టుకునేందుకు అభ్యర్థులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో అతివల హవా నడుస్తోంది. హోరాహోరిగా సాగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా మారాయి. దాదాపుగా అన్ని గ్రామపంచాయతీల్లో వీరి ఓట్లే అధికంగా ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ‘ఆమె’ ఆశీస్సులపై దృష్టి పెడుతుస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేలా, తమకే ఓటేయాలని విజ్ఞాపనల్ని మహిళా లోకానికి వినిపిస్తున్నారు. ఆశావహుల ప్రయత్నాలు పోటీదారుల విజయావకాశాల్ని మార్చగలిగేలా సత్తా మహిళా ఓటర్లకు ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు చీరలు, ఇతర బహుమతులను పంచేందుకు ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి తదితర మహిళ సంబంధింత పథకాలతో తమకే అతివలు పట్టం కడుతారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తుండగా, చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేసిన విషయాన్ని మహిళలకు తెలుపడంతో వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ, మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మీ తదితర పథకాలను అమలు చేయటం ద్వారా మహిళలకు పెద్దపీట వేశామని బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పదవుల్లో సగం.. ఓట్లల్లో అధికం స్థానిక సంస్థల పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు.కాగా మహిళ ఓట్లను గుంపగుత్తగా ప్రసన్నం చేసుకునేందుకు మహిళా సంఘాల వారీగా చీరలు, కుట్టు మిషన్స్, వంట పాత్రలు, టెంట్హౌస్ సామగ్రి తదితర నిత్యం ఉపయోగించుకునే వాటిని ఇచ్చేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
● 2019లో గ్రామపంచాయతీ ● తొలి పాలకవర్గం ఏకగ్రీవం ● నేడు సైతం ఏకగ్రీవానికి చర్చలు
చిక్కుడువానిపల్లి ఏకగ్రీవం?ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని చిక్కుడువానిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్తోపాటు వార్డుసభ్యులను ఏకగ్రీవం చేసినట్లు తెలిసింది. ఈనెల 30 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా.. గ్రామస్తులు ముందస్తుగానే ఏకగ్రీవం కోసం చర్చించుకున్నట్లు తెలిసింది. 2019లో చిక్కుడువానిపల్లి ఏర్పడగా తొలి ఎన్నికల్లో సర్పంచ్తోపాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే ఆనవాయితీని కొనసాగించేందుకు ఇప్పుడు కూడా ఏకగ్రీవం చేసుకున్నట్లు సమాచారం. గ్రామంలో 45 నివాసాలు.. 250 మంది వరకు జనాభా.. 150 మంది ఓటర్లు ఉంటారు. గ్రామంలో నాలుగు వార్డులు ఉన్నాయి. సర్పంచ్ అభ్యర్థి జనరల్గా రిజర్వు అయింది. గత ఎన్నికల్లో ఏకగ్రీవమైనప్పటికీ ప్రోత్సాహక నజరానా రూ.10లక్షలు రాలేదని గ్రామస్తులు వాపోతున్నారు. తన నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామాలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.20 లక్షల వరకు కేటాయిస్తానని ఈ ప్రాంత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇటీవల ప్రకటించారు. హోరాహోరీగా వాలీబాల్ పోటీలు ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం నందిమేడారం బాలుర గురుకుల విద్యాలయంలో జరుగుతున్న 69వ ఎస్జీఎఫ్ అండర్– 14 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో గురువారం బాలబాలికలు హోరాహోరీగా తలపడ్డారు. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 244 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. కాగా ఈనెల 28 వరకు జరిగే పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సురేశ్, ఎంఈవో ప్రభాకర్, ప్రిన్సిపాల్ విద్యాసాగర్, వాలీబాల్ సంఘం అధ్యక్షుడు ముత్యాల రవీందర్, కార్యదర్శి తమ్మడవేని రాజయ్య, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మణ్, క్రీడల పరిశీలకులు బాలు, మల్లేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు కొమురయ్య, కుమార్, సౌజన్య, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు
● 29న దీక్షాదివస్ను సిరిసిల్లలో నిర్వహిస్తాం ● మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్సిరిసిల్ల: తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు.. అబద్దాలతో అధికారంలోకి వచ్చారని మాజీ ఎంపీ, ప్రణాళికసంఘం మాజీ అధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. నేటి తరం యువతరానికి 2001 నాటి దగాపడిన తెలంగాణ కన్నీటిగాథలు తెలియవన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ దీక్ష చేసి, ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. 2009 నవంబరు 29న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష చేయడంతో యావత్ దేశం కదిలిపోయి, రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిందన్నారు. శ్రీతెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడోశ్రీ అని ప్రాణాలకు తెగించి పోరాడారని గుర్తు చేశారు. ఆకలి చావులు, ఆత్మహత్యలు, రైతుల బలవన్మరణాలు, వలసలు.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడ్డ గోసలన్నారు. ఈనెల 29న సిరిసిల్ల అంబేడ్కర్ సర్కిల్లో దీక్షా దివన్ను నిర్వహిస్తామని, ఆనాటి ఉద్యమ ఫొటో ప్రదర్శన ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తారని తెలిపారు. అనంతరం అంబేడ్కర్ సర్కిల్ వద్ద దీక్షా దివస్ నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. సమావేశంలో ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ అరుణ, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ‘సెస్’ ఉపాధ్యక్షుడు దేవరకొండ తిరుపతి, ‘సెస్’ డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, వరుస కృష్ణహరి, పార్టీ నాయకులు బొల్లి రామ్మోహన్, అక్కరాజు శ్రీనివాస్, గజభీంకార్ రాజన్న, మాట్ల మధు పాల్గొన్నారు. -
వేలం వేస్తే జైలుకే..
సిరిసిల్ల: ఊరంతా ఐక్యంగా ఉంటూ అందరికీ ఆమోదయోగ్యమైన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆదర్శం. ఎన్నికలతో పల్లెల్లో ప్రశాంతత చెదిరిపోతుందనే సదాశయంతో ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకుంటే స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం పారితోషికంగా రూ.10లక్షలు ఇస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గుతుంది. కానీ డబ్బు ఉన్న పెద్దలు పదవులకు వేలం పాడితే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. అలాంటి వారు శిక్షార్హులవుతారు. గతంలో ఇలాంటి సంఘటనలో పలువురు అరెస్ట్ అయ్యారు. వేలం వెర్రి గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలకు బహిరంగంగానే వేలంపాటలు నిర్వహించి ఎవరూ ఎక్కువ డబ్బులు ఊరికి చెల్లిస్తే వారే సర్పంచ్ అని వేలం పాడడం చట్టవిరుద్ధం. ధనబలం ఉన్న వారు పదవులను కొనుక్కుంటే ప్రజాస్వామ్యం స్ఫూర్తి గాడితప్పుతుంది. ఇలా గ్రామాల్లో వేలంపాటలు నిర్వహిస్తే ఆ ఎన్నిక చెల్లదు. వేలం నిర్వహించిన గ్రామపెద్దలు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. 2013 గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో వేలం పాటల ఘటనే ఇందుకు సాక్ష్యం. బస్వాపూర్లో ఏం జరిగింది? 2013లో గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే బస్వాపూర్లో ధనస్వామ్యం పడగవిప్పింది. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ పదవులకు వేలం నిర్వహించారు. వేలంలో పొన్నం రవి సర్పంచ్ పదవిని రూ.4.10 లక్షలకు కొనుగోలు చేశారు. ఉపసర్పంచ్ స్థానాన్ని లక్ష్మారెడ్డి రూ.1.50 లక్షలకు దక్కించుకున్నారు. వార్డు సభ్యుల స్థానాలను రూ.25వేల చొప్పున అమ్మకానికి పెట్టారు. ఇది బహిరంగంగానే జరిగింది. ఈ సంఘటనపై అప్పట్లో శ్రీసాక్షిశ్రీ ఆధారాలతో బట్టబయలు చేసింది. జైలుకెళ్లిన బస్వాపూర్ పెద్దలు బస్వాపూర్ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు బహిరంగంగానే పంచాయతీ పదవులకు వేలం నిర్వహించారని నిర్ధారించారు. వారి ఎన్నిక చెల్లకపోగా.. వేలం పాటలు నిర్వహించిన పెద్దలు జైలుకు వెళ్లారు. ఐదేళ్ల అవినీతికి లైసెన్స్ వేలంలో లక్షలు పోసి పదవిని కొనుక్కున్న నాయకులు రేపు ఐదేళ్ల పదవీకాలంలో అడ్డదారులు తొక్కేందుకు గ్రామస్తులే అవకాశమిస్తున్నట్లు అవుతుంది. నిజాయితీగా పల్లెలో పనిచేయాల్సిన సర్పంచ్, వార్డు మెంబర్లను ఒక రకంగా అవినీతికి పాల్పడేందుకే ప్రజలే లైసెన్స్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికవడం, మంచి వ్యక్తులను అలా ఎన్నుకోవడం శుభ పరిణామం. కానీ, ఎవరెక్కువ డబ్బులు వెచ్చిస్తే వారికే పదవి అంటూ వేలం వేయడం అవినీతి పర్వానికి రాచబాటగా మారుతుంది. ఐదేళ్ల పదవీకాలంలో సర్పంచ్ అవినీతిపై నిలదీసి అడిగే దమ్మును ఓటరు కోల్పోతున్నాడు. స్ఫూర్తిదాయకం కావాలి ఏకగ్రీవ ఎన్నిక స్ఫూర్తిదాయకం కావాలి. కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 82 గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఇందులో 25 మంది మహిళా సర్పంచులు ఎన్నికవడం విశేషం. 2013లో జరిగిన ఎన్నికల్లో 40 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 2019 గ్రామపంచాయతీ ఎన్నికల్లో 13 గ్రామాల్లో ఏకగ్రీవమయ్యాయి. అందరూ కూర్చుని మంచివారిని ఎన్నుకోవడం ఆదర్శంగా ఉంటుంది. కానీ వేలం పాటలు నిర్వహించడం నేరమనే విషయాన్ని గుర్తించాలి. సర్పంచ్, పంచాయతీ పదవులకు బహిరంగ వేలం పాటలు 2013లె బస్వాపూర్లో సర్పంచ్ పదవికి రూ.4.10 లక్షలు ఉపసర్పంచ్కు రూ.1.50 లక్షలు వార్డు సభ్యులకు రూ.25 వేలు వేలం వేసిన పెద్దల అరెస్ట్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సిరిసిల్ల అర్బన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు క్తి మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణ పరిఽ దిలోని పెద్దూరు డబుల్ బెడ్రూమ్ కాలనీకి చెందిన అలిశెట్టి మహేశ్(40) వేములవాడలోని ఓ టెంట్ హౌస్లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని సిరిసిల్ల బస్టాండ్లో బస్సు దిగి ఇంటికి నడుచుకు ంటూ వస్తున్నాడు. ఈక్రమంలో నే పెద్దూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద గుర్తుతెలియని వాహ నం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య భవ్యశ్రీ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మోసగాళ్ల అరెస్ట్
కోనరావుపేట(మానకొండూర్): ఇంట్లో బంగారు నిధి ఉందని నమ్మించి దంపతుల నుంచి భారీ మొత్తంలో నగదు కాజేసిన మోసగాళ్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్కు చెందిన దుగ్గు వేణు ఇంట్లో బంగారం నిధి ఉందని, ఎవరో మంత్రాలు చేశారంటూ పెద్దూరుకు చెందిన మేకల నరేశ్ నమ్మబలికాడు. తనకు తెలిసిన బాబా అయితే బంగారు నిధి తీసి ఇస్తాడని నమ్మించి సదుల దేవేందర్, పెద్దూరుకు చెందిన కడవంచ ప్రసాద్, సదుల రాజేశంను తీసుకెళ్లాడు. ఇలా నమ్మించి ఆ దంపతుల నుంచి విడతల వారీగా రూ.3వేలు, రూ.50వేలు, రూ.15వేలు, రూ.3.40 లక్షలు వసూలు చేశాడు. తర్వాత నరేశ్ ముఖం చాటేయడంతో మోసపోయానని గుర్తించిన వేణు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిజామాబాద్ శివారులో మేకల నరేశ్, కడవంచ ప్రసాద్, సదుల దేవేందర్ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3లక్షలు స్వాదీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఎస్సై ప్రశాంత్రెడ్డి ఉన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ భార్యకు ప్రసవం
కోల్సిటీ(రామగుండం): ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకం పెంచుతూ.. అదే ఆస్పత్రిలో తన భార్యకు ప్రసవం చేయించిన సర్కారు వైద్యుడు దండె రాజు ఆదర్శంగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఇన్చార్జి ఆర్ఎంవో, ఆర్థోపెడిక్ సర్జన్, సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ) అసిస్టెంట్ ప్రొఫెసర్గా దండె రాజు విధులు నిర్వహిస్తున్నారు. నెలలు నిండిన తన భార్య శివాణికి డెలివరీ చేయించడానికి తను పనిచేస్తున్న జీజీహెచ్లో బుధవారం అడ్మిట్ చేయించారు. సిజేరియన్ ద్వారా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో ఆస్పత్రి వాతావరణం ఆనందంతో నిండిపోయింది. ప్రభుత్వ వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా డాక్టర్ రాజు తన భార్యకు సర్కారు ఆస్పత్రిలోనే డెలివరీ చేయిండం ఆదర్శంగా నిలిచిందని వైద్యాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజును గైనిక్, పీడియాట్రిక్, సర్జికల్, అనస్థీషియా తదితర విభాగాల ప్రొఫెసర్లు, నర్సింగ్ ఆఫీసర్లు అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం
వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందగా, రెండేళ్ల చిన్నారి అనాథగా మారింది. స్థానికుల, పోలీసులు తెలిపిన వివరాలు. వేములవాడ మండలం ఆరెపల్లి శివారులోని కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో వేములవాడ నుంచి ఎదురుగా వస్తున్న లారీ, కరీంనగర్ నుంచి వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరీంనగర్కు చెందిన వసీమ్(27) అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య ఐఫా(22)ను అంబులెన్స్లో వేములవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు వదిలింది. వీరి రెండేళ్ల పాప మైవిష్ఫాతిమా కాలు విరిగింది. చిన్నారిని వేములవాడ ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్లలోని బంధువుల శుభకార్యం కోసం వీరు వస్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. అనాథగా మారిన రెండేళ్ల చిన్నారి -
నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం
కొడిమ్యాల(చొప్పదండి): కొడిమ్యాలలోని శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్ తగిలి 11 ఏళ్ల చిన్నారి మృతిచెందింది. అప్పటి వరకు ఉత్సవాల్లో కోలాటం ఆడిన ఆ చిన్నారి.. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిందన్న విషయం స్థానికులను కలచి వేసింది. కొడిమ్యాలకు చెందిన తిప్పరవేణి నాగరాజు, మమత దంపతుల పెద్దకూతురు మధుశ్రీని చెప్యాలకు చెందిన ఆమె పెద్దమ్మ భాగ్యకు పిల్లలు లేకపోవడంతో ఆమె వద్దనే ఉంచుకుంటోంది. స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి మంగళవారం మధుశ్రీ కొడిమ్యాల వచ్చింది. రాత్రి సమయంలో తల్లిదండ్రులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొంది. అక్కడ అందరితో కలిసి కోలాటం ఆడింది. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో సుమారు 11.30 గంటల సమయంలో ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన లైట్సెట్టింగ్ విద్యుత్ తీగ చిన్నారి మెడకు తాకడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లముందే కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులతోపాటు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెద్దమ్మ భాగ్య గుండెలవిసేలా రోధించారు. నూరేళ్లు నిండాయా తల్లి అంటూ విలపించడంతో స్థానికులు, భక్తులు కంటతడిపెట్టుకున్నారు. నిర్లక్ష్యమే ప్రాణం తీసిందా..? బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ లైటింగ్ కోసం పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి నేరుగా వైర్లు తగిలించి కనెక్షన్ ఇచ్చారు. నిర్లక్ష్యంగా.. ముదు జాగ్రత్త చర్యలు పాటించకుండా వేసిన ఆ కరెంట్ వైర్లే చిన్నారి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ఆలయ కమిటీ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ చిన్నారి బంధువులు బుధవారం మృతదేహంతో ఆలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మల్యాల సీఐ నీలం రవి, ఎస్సై సందీప్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బంధువులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. ఇలాంటి నిర్లక్ష్యపు కనెక్షన్లపై విద్యుత్ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తే ప్రమాదం జరిగేది కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. మధుశ్రీ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో అపశృతి కరెంట్ షాక్ తగిలి 11 ఏళ్ల చిన్నారి మృతి బంధువుల ఆందోళన -
అభ్యర్థి స్థానికులై ఉండాలి
సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి ఆ గ్రామంలో ఓటరుగా నమోదై ఉండాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల మొదటిదశ నామినేషన్లు గురువారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు పరిశీలిద్దాం. ● నామినేషన్ వేసేవారు కొత్తగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. నామినేషన్ వేసే రోజు న్యూ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీ జతపరచాలి. ● రోజు వారి ఖర్చు లెక్కలు ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారానే నిర్వహించాలి. ● కులం సర్టిఫికెట్ ఇది వరకు ఉంటే సరిపోతుంది. లేకపోతే కొత్తగా సర్టిఫికెట్ (బీసీ, ఎస్సీ, ఎస్టీలు) తీసుకోవాలి. ● నామినేషన్ వేసే వ్యక్తికి 21 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. ● అభ్యర్థి, ప్రతిపాదకుడు సంతకం చేసిన నామినేషన్ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. ● ప్రతిపాదకుడు కచ్చితంగా సంబంధిత వార్డు ఓటర్ లిస్టులో నమోదై ఉండాలి. ● పోటీ చేసే అభ్యర్థి, ప్రతిపాదకుడు ఇంటి పన్నులు చెల్లించి, గ్రామపంచాయతీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాలి. ● ఎన్నికల్లో పోటీకి సర్పంచ్ అభ్యర్థి రూ.2వేల డిపాజిట్ రుసుం చెల్లించాలి. వార్డు సభ్యుడు అభ్యర్థి రూ.500 డిపాజిట్ చెల్లించాలి. ● ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణపత్రాలను తప్పనిసరిగా ఇవ్వాలి. లేకుంటే.. నామినేషన్ ఫారంలోని పార్ట్–3లో డిప్యూటీ తహసీల్దార్తో సంతకం చేయించాలి. ● రిజర్వుడు కేటగిరీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎన్నికల నామినేషన్ డిపాజిట్ సర్పంచ్ అభ్యర్థి రూ.వెయ్యి, వార్డు సభ్యుడి అభ్యర్థి రూ.250 చెల్లించాలి. ● ఇద్దరు సాక్షుల స్వీయ ధ్రువీకరణతో అన్ని గడులు పూరించి ఇవ్వాలి. ● రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎన్నికల ఖర్చు ఖాతా నిర్వహిస్తానని చెప్పే డిక్లరేషన్పై సంతకం చేయాలి. ● పోటీ చేసే అభ్యర్థులు తన గుర్తింపుకార్డు కోసం ఫొటోను ఇవ్వాలి. ● స్క్రుటీని రోజున నిర్ణీత సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురుగా హాజరుకావాలి. అవసరమైన పత్రాలు ఇవీ.. ● ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు.. కుల ధ్రువీకరణపత్రాలను జతచేయాలి. ● డిపాజిట్ సొమ్ము చెల్లించాలి. ● నేరచరిత్ర, స్థిర, చర ఆస్తులు, విద్యార్హతలతో కూడిన అఫిడవిట్, ఇద్దరు సాక్ష్యాలతో సంతకాలు పెట్టించి ఇవ్వాలి. ● ఎన్నికల ఖర్చుల వివరాలను నమోదు చేసి ఇస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి. ● అఫిడవిట్లో ఇద్దరు సాక్ష్యుల సంతకం, అభ్యర్థి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ● ఎన్నికల వ్యయ డిక్లరేషన్లో అభ్యర్థి సంతకం ఉండాలి. ● గ్రామపంచాయతీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ ● బ్యాంకు అకౌంట్ జిరాక్స్ పత్రం ఇవ్వాలి. కొత్త బ్యాంకు ఖాతాను తీసుకోవాలి 21 ఏళ్లు నిండిన వారే పోటీకి అర్హులు -
నిలిచిన రిజిస్ట్రేషన్లు
రామగుండం: మంచిముహూర్తం కావడం, తెల్లవారితో మూఢాలు ఆరంభం కానుండడంతో ఆస్తుల క్రయ, విక్రయదారులు, ఇతరత్రా అవసరాలు ఉన్నవారు బుధవారం పెద్ద ఎత్తున స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందే వీరు స్లాట్ బుక్చేసుకుని ఉన్నారు. అయితే, రిజిస్ట్రేషన్ కార్యాలయం తెరిచిన గంటలోపే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. రోడ్ల విస్తరణ కోసం చేపట్టిన తవ్వకాలతో వైర్లు తెగి ఇంటర్నెట్ సేవలు నిలిచినట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. 17 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం తమ వద్దకు వచ్చినట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. ఒక్కో డాక్యుమెంట్కు సుమారు ఐదురుగు తరలి రావడంతో కార్యాలయం కిటకిటలాడింది. ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్ తిరుపతినాయక్ డాక్యుమెంట్లు మాన్యువల్గా పరిశీలించారు. రాష్ట్రంలోని రామగుండం, భూపాలపల్లి, పటాన్చెరులో కొత్తగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రత్యామ్నాయ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించలేదని తెలిసింది. కానరాని వసతులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బంది కోసం వాష్రూమ్స్ నిర్మించారు. క్రయ, విక్రయదారులకు ఆ సౌకర్యం ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో గంటల కొద్దీ నిరీక్షించిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుభముహూర్తమని భారీగా తరలివచ్చిన జనం కార్యాలయం ఎదుట నిరీక్షించిన క్రయ, విక్రయదారులు సాంకేతిక సమస్యలే కారణమంటున్న అధికారులు -
భర్త వేధింపులు భరించలేక..
● భర్తను కత్తితో నరికి చంపిన భార్య ● మల్లాపూర్లో దారుణం మల్లాపూర్: భర్త వేధింపులు భరించలేక కత్తితో నరికి చంపిన ఘటన మండలకేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండలకేంద్రానికి చెందిన పల్లికొండ మల్లయ్య, రాజు దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. అందరికీ పెళ్లి అయ్యింది. కొంతకాలంగా భార్యతో మల్లయ్య గొడవ పడుతున్నాడు. నిత్యం దుర్భాషలాడుతున్నాడు. వ్యవసాయం చేసే విషయమై మంగళవారం రాత్రి వాగ్వాదానికి దిగారు. బుధవారం ఉందయం కుమారుడు, కోడలు వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. అప్పటికే బయటకు వెళ్లి వచ్చిన మల్లయ్య.. భార్యతో గొడవపెట్టుకున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేక మల్లయ్య మెడపై కత్తితో నరికింది. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులకు లొంగిపోయింది. సీఐ అనిల్, ఎస్సై రాజు సిబ్బందితో వచ్చి విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు సంపత్ నంది తండ్రి నంది కిష్టయ్య(75) మంగళవారం రాత్రి మృతిచెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం ఓదెల గ్రామ శివారులో కిష్టయ్య అంత్యక్రియలు జరిగాయి. హైదరాబాద్కు చెందిన సినీపరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఆయనకు కుమారులు సంపత్ నంది, రమేశ్ ఉన్నారు. సదాశయఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్కుమార్, ప్రధానకార్యదర్శి లింగమూర్తి, కార్యదర్శి మేరు గు జ్ఞానేంద్రచారి సూచనతో కిష్టయ్య కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు. బోయినపల్లి(వేములవాడ): బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన వృద్ధుడు అంజయ్య(65) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. అంజయ్య వండ్రంగి పనులు చేస్తూ జీవనోపాధి పొందేవాడు. కొదురుపాక పా త గ్రామంలో ముంపునకు గురైన ఓ పాత ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య పద్మ, కూతురు మమత ఉన్నారు. అంజయ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. వృద్ధురాలిబోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన నల్లాల లక్ష్మీనర్సవ్వ(70) బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. లక్ష్మీనర్సవ్వ గతంలో కోతులు బెదిరించడంతో కిందపడి చేయి విరిగింది. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. మధ్యాహ్నం ఇంట్లోంచి బయటకు వెళ్లిన వృద్ధురాలు వెంకట్రావుపల్లి, నర్సింగాపూర్ పరిసరాల్లోని ఓ వ్యవసాయబావిలో దూకింది. సాయంత్రం మృతదేహం కనిపించింది. మృతురాలుకు భర్త భూమయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్సై ఎన్.రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫుట్బాల్ ఆడుతూ.. అనంతలోకాలకు..
పెద్దపల్లిరూరల్: తను చదువుకునే పాఠశాలలో సహచర విద్యార్థులతో కలిసి సంతోషంగా ఫుట్బాల్ ఆడుతూ కిందపడిపోయిన కొద్దిగంటల్లోనే మృతి చెందిన విషాద సంఘటన పెద్దపల్లి శివారు రంగంపల్లిలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి శివారు రంగంపల్లిలో నివాసముంటున్న కుమారస్వామి–సునీత దంపతుల కుమారుడు కనవేన ప్రతీక్(15) రంగంపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. లంచ్టైంలో సహచర విద్యార్థులతో కలిసి మంగళవారం ఫుట్బాల్ ఆడుతుండగా కిందపడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తల్లి సునీత వచ్చి విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లింది. కాసేపటికే వాంతులు చేసుకోవడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. తలలో రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతోందని, కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. కరీంనగర్కు తీసుకెళ్లి వైద్యం చేయిస్తుండగానే రాత్రి మృతి చెందాడు. తండ్రి కుమారస్వామి సూచన మేరకు లయన్స్క్లబ్ ఎలైట్ సహకారంతో కళ్లు దానం చేశారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్
● 1800 233 1495లో ఫిర్యాదు చేయండి : ఇన్చార్జి కలెక్టర్ సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో బుధవారం కంట్రోల్ రూమ్, హెల్ప్లైన్ సెంటర్, మీడియా సెంటర్ను ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి ప్రారంభించి పరిశీలించారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా మీడియాలో ఫేక్న్యూస్ ప్రసారమైన, ఓటర్లు ఏదైనా సందేహాల నివృత్తికి, సమాచారం కోసం సంప్రదించిన వెంటనే స్పందించాలని చెప్పారు. ఎన్నికల ఫిర్యాదులను 1800 233 1495లో చెప్పాలని కోరారు. డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫోద్దీన్, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డేంజర్ జంక్షన్స్
● అభివృద్ధి లేని చౌరస్తాలు ● సిరిసిల్లలో పెరుగుతున్న ట్రా‘ఫికర్’ ● రోడ్డు ప్రమాదాలతో భయాందోళనసిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రానికి సొబగులు దిద్దాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జంక్షన్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. సుందరీకరణ పేరుతో చేపట్టిన పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో ప్రధా న చౌరస్తాలు బోసిపోతున్నాయి. నూతన కళ రాకపోగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో గోపాల్నగర్ చౌరస్తా, పాతబస్టాండ్ నేతన్నచౌక్, చంద్రంపేటచౌరస్తా, కలెక్టరేట్ ఎదుట గల జంక్షన్ డేంజర్గా మారాయి. కోట్ల రూపాయలు వెచ్చించినా ప్రమాదాలు తప్పడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు కలెక్టరేట్ జంక్షన్ వద్ద తికమక పడుతున్నారు. సమస్యలు ఇక్కడ.. ● సిరిసిల్లలోని గాంధీ సర్కిల్ ఇరుకుగా ఉండడంతో అక్కడ నిత్యం ట్రాఫిక్జామ్ ఏర్పడుతుంది. సెస్ ఆఫీస్ నుంచి వేంకటేశ్వర ఆలయం వైపు వెళ్లే క్రమంలో ఇరుకై న మలుపు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ● ప్రధాన రహదారులపై ఉన్న చంద్రంపేట, రగుడుతోపాటు పోస్టాఫీస్, బీవైనగర్, సుందరయ్యనగర్, పోలీస్స్టేషన్, మార్కెట్ ఏరియా, పెద్దబజార్ జంక్షన్లను విస్తరించాల్సిన అవసరం ఉంది. ● కొత్తబస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు డిపో, బస్టాండ్లకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ● గోపాల్నగర్ చౌరస్తాలో బీవైనగర్, తారకరామానగర్, శివనగర్, మార్కెట్పల్లి, బోనాల, సుందరయ్యనగర్, ఇందిరానగర్, గణేశ్నగర్ ప్రాంతాల నుంచి ట్రాఫిక్ పెరిగింది. ఆర్అండ్బీ ప్రధాన జంక్షన్ కావడంతో రోడ్డుపైకి ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు రోడ్డెక్కె సమయం, యూటర్న్ తీసుకునే సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ● ఇప్పటికే అభివృద్ధి చెందిన అంబేడ్కర్ సర్కిల్ వద్ద చుట్టుపక్కల ప్రైవేటు వాహనాలు పార్కింగ్ చేయడం, ఆ ప్రాంతంలో తరచూ నిరసన ప్రదర్శనలు జరుగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ● నేతన్నచౌక్లో పాతబస్టాండ్, వెంకంపేట, పెద్దబజార్, అంబేడ్కర్చౌరస్తా ప్రాంతాల నుంచి భారీవాహనాలతో కలుపుకుని తిరుగుతాయి. జంక్షన్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.మీరు చూస్తున్న ఈ ప్రధాన సర్కిల్ కలెక్టరేట్ ఎదుట ఉన్న జంక్షన్. హైదరాబాద్–సిరిసిల్ల–కామారెడ్డి, సిద్దిపేట–వేములవాడ రూట్ల నుంచి వేలాది వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. సిరిసిల్లకు ప్రధాన చౌరస్తాగా మార్చాలనే ఉద్దేశంతో గతంలోనే రూ.3కోట్లతో స్మార్ట్ సర్కిల్ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ అన్ని రూట్ల నుంచి వచ్చే వాహనాలు తికమకగా ఉండే ఈ జంక్షన్లో ప్రమాదానికి గురవుతున్నాయి.కలెక్టరేట్ జంక్షన్ అభివృద్ధికి రూ.3కోట్లతో పనులు ప్రారంభించాం. సర్కిల్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. పట్టణంలోని అన్ని సర్కిళ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. నేతన్నచౌక్, చంద్రంపేట చౌరస్తాలను అభివృద్ధి చేస్తాం. – ఎంఏ ఖదీర్పాషా, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల -
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిద్దాం
● రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి ● ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో బుధవారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్రూమ్, హెల్ప్లైన్, ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. 1800 233 1495 నంబరు అందుబాటులో ఉంటుందని వివరించారు. పోటీ చేసే అభ్యర్థులు నూతనంగా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలని, నామినేషన్ పత్రాలలో పూర్తి సమాచారం నింపాలని సూచించారు. తహసీల్దార్ నుంచి ప్రచార వాహనాల అనుమతి, పోలీసుల నుంచి లౌడ్స్పీకర్, ర్యాలీలకు అనుమతి తీసుకోవాలన్నారు. నామినేషన్లు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటారని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారానికి జిల్లా పౌర సంబంధాల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. మార్గదర్శకాలను నోడల్ అధికారులు పాటించాలి నోడల్ అధికారులు తమ విధులపై అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు అర్థం చేసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీపీవో షరీఫోద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలి
● హోంగార్డులకు ఈవో రమాదేవి సూచనలు వేములవాడ: భక్తులతో మర్యాదగా ప్రవర్తించా లని ఆలయ ఈవో రమాదేవి హోంగార్డులకు సూచించారు. భీమేశ్వర సదన్లో బుధవారం పలు సూచనలు ఇచ్చారు. విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వేతనాలు, ఇతర సమస్యలుంటే తన దృష్టికి తేవాలని తెలిపారు. క్రమశిక్షణ పాటించకుంటే ఎస్పీకి సరెండర్ చేస్తానని హెచ్చరించారు. సిరిసిల్లటౌన్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం బీజేపీ జిల్లా ఆఫీస్లో ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు దిశానిర్దేశం చేసిన రాజ్యాంగం విలువలను కాపాడాలని కోరారు. పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, జిల్లా ఆఫీస్ ఇన్చార్జి భాగయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు మోర శ్రీహరి, పట్టణ కార్యదర్శి సూరం వినయ్, నాయకులు ఉరగొండ రాజు, శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో నిర్మించిన అర్బన్ షెల్టర్ నిర్వహణకు ఆసక్తి గల మహిళా స్వశక్తి సంఘాల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖదీర్పాషా ప్రకటనలో కోరారు. స్థానిక రాజీవ్నగర్ మినీ స్టేడియం వెనకాల నిరాశ్రయుల వసతి కోసం ప్రత్యేక బిల్డింగ్ నిర్మించి వినియోగంలోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. స్వశక్తి మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తమ ప్రతిపాదనలను డిసెంబర్ 2వ తేదీ సాయంత్ర 5 గంటల్లోపు మెప్మా ఆఫీస్లో సమర్పించాలని తెలిపారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని చెక్కపల్లి హైస్కూల్లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఉమెన్స్ కబడ్డీలో మండలంలోని గాలిపల్లి హైస్కూల్ జట్టు విజేతగా నిలిచింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నీ, ఎంపికలు నిర్వహించారు. విజేతలను హెచ్ఎం పావని, పీడీ సానబాబు అభినందించారు. సిరిసిల్లటౌన్: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఐ టీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి బుధవారం సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ ఎదుట చేపట్టిన ధర్నాలో మాట్లాడారు. ఔట్సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన ఐదు నెలల పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఈమేరకు కార్యాలయంలో వినతిపత్రం అందించారు. మూశం రమేశ్, ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్(2025–26), అవార్డ్స్ ప్రదర్శన(2024–25) నవంబర్ 28, 29 తేదీల్లో సిరిసిల్లలోనీ గీతానగర్ హైస్కూల్లో నిర్వహించనున్నట్లు డీఈవో వినోద్ తెలిపా రు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్–గణితం(స్టెమ్), సుస్థిర వ్యవసాయం, హరితశక్తి, నీటిసంరక్షణ, వర్ధమాన సాంకేతికతలపై విద్యార్థులు ప్రాజెక్టులు ప్రదర్శించవచ్చని తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో ఒక్కో పాఠశాల నుంచి గరిష్టంగా 14 ప్రాజెక్టులు మాత్రమే అనుమతిస్తారని స్పష్టం చేశారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య 99661 02646లో సంప్రదించాలని సూచించారు. -
కూలుతున్నాయ్..!
● నాడు మూలవాగుపై బ్రిడ్జి ● నేడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బేస్మెంట్ ● నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు ● ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులుఇదీ వేములవాడ మూలవాగుపైన నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి. గతంలో వచ్చిన వరదకు కొట్టుకుపోయింది. 2016లో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రూ.28కోట్లతో రెండు వంతెనల పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.13కోట్లు బ్రిడ్జి కోసం, మిగతావి భూసేకరణకు కేటాయించారు. మొదటి బ్రిడ్జి పూర్తికాగా.. రెండో వంతెన పనులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే వర్షాలు కురిసి వరద రావడంతో రెండో వంతెన కూలిపోయింది. రెండు బ్రిడ్జీలకు రూ.13 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా.. అప్పటి వరకు జరిగిన పనులకు రూ.3.50కోట్లు పెండింగ్లో ఉన్నాయని సాయి కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి పనులు నిలిపివేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లు మారడం, రీషెడ్యూల్ కావడం, అంతలోనే ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో పనులు మొదలయ్యాయి. వేములవాడ: వసతుల కల్పనే లక్ష్యంగా చేపడుతు న్న పనులు పూర్తికావడం లేదు. పూర్తికాకముందే కూలిపోతున్నాయి. గతంలో మూలవాగుపై నిర్మి స్తున్న రెండో వంతెన వరదలో కొట్టుకుపోయింది. ఈనెల 25న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ వేములవాడ శివారులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తుండగా బేస్మెంట్ కూలిపోయిన విష యం తెలిసిందే. ఈ సంఘటనల నేపథ్యంలో అభివృద్ధి పనుల నాణ్యతపై అనుమానాలు కలుగుతున్నాయి. కోట్ల నిధులు.. కూలుతున్న సౌదాలు వేములవాడ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారు. అయితే పనులు చేయడంలో నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు నాణ్యత పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూలవాగుపై రెండో వంతెన నిర్మిస్తుండగా వరదకు కొట్టుకుపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. అదే సమయంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బేస్మెంట్ కుంగిపోవడం వెనుక నాణ్యత లేకపోవడమేననే చర్చ సాగుతోంది. మూలవాగుపై రెండు వంతెనల నిర్మాణానికి రూ.13 కోట్లు కేటాయిస్తే ఒకే వంతెన మాత్రమే పూర్తయింది. రెండో వంతెన పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. తిప్పాపూర్ శివారులో రూ.7.63కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నారు. 12 బ్లాకులు.. ఒక్కో బ్లాకులో 12 ఇళ్ల చొప్పున 144 గృహాలను నిర్మిస్తున్నారు. పనులు కొనసాగుతుండగానే బేస్మెంట్ కుంగిపోవడంపై ఎంతపాటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారో తెలుస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. -
రాజన్న సిరిసిల్ల
గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 20257తంగళ్లపల్లి: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ఎస్సీఆర్టీ(స్టేట్కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ) అబ్జర్వర్ చందన తనిఖీ చేశారు. రోజంతా ఎండగా ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి.ఇల్లంతకుంట: అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టులో 3.39 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 3.50 టీఎంసీలు. 18 క్యూసెక్కుల నీరు ఔట్ఫ్లోగా వెళ్తోంది. -
సమ్మక్క జాతరకు ఏర్పాట్లు
● ముందుగా వేములవాడకే భక్తుల రాక ● ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ● డిసెంబర్ 10లోగా పనుల పూర్తికి కసరత్తు వేములవాడ: గిరిజనుల అతిపెద్ద పండుగ సమ్మక్క–సారలమ్మ జాతర త్వరలోనే ప్రారంభంకానుంది. సమ్మక్క భక్తులు ముందుగా వేములవాడ రాజ న్నను దర్శించుకోవడం ఆనవాయితీ. రెండేళ్లకో సారి జరిగే గిరిజన జాతర కావడంతో అంతేస్థాయిలో భక్తులు వేములవాడకు వస్తుంటారు. త్వరలోనే సమ్మక్క భక్తుల రాక మొదలుకానుండడంతో అధికారులు ఏర్పాట్ల పనులను వేగిరం చేస్తున్నారు. క్యూలైన్లు... కల్యాణకట్ట జనవరి 28 నుంచి 31 సాగే సమ్మక్క జాతర భక్తులు ముందుగా వేములవాడకు వచ్చే మొక్కులు చెల్లించుకుంటారు. వీరి కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు ప్రారంభం కావడంతో భీమన్న ఆలయంలో దర్శనాలు, మొక్కులు కొనసాగిస్తున్నారు. దీంతో సమ్మక్క జాతర సందర్భంగా డిసెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే భక్తుల రద్దీకి అనుగుణంగా పనులు మొదలుపెట్టారు. భీమన్న ఆలయంలో దర్శనాల కోసం పార్వతీపురం వసతి గదుల బ్యాక్సైడ్లోని వీఐపీ రోడ్డుపై క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. రాజేశ్వరపురం వద్ద పాత ఎస్బీహెచ్ బ్రాంచ్ ఉన్న ప్రాంతంలో కల్యాణకట్ట, షవర్ల ఏర్పాటుకు పనులను ముమ్మరం చేశారు. నటరాజ్ విగ్రహం వద్ద ఫ్లై ఓవర్, భీమన్న ఆలయంలో ఎగ్జిట్, ఎంట్రీ, వీఐపీ దర్శనాల క్యూలైన్, ఆశీర్వచన మండపం పనులు చేపడుతున్నారు. భక్తుల రద్దీ పెరుగుతుండడంతో ప్రస్తుతం ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బందికి అదనంగా మరో 12 మందిని కేటాయించారు. హోంగార్డులకు షిఫ్టులవారీగా విధులు కేటాయిస్తున్నారు. సీసీ కెమెరాలు ఇటీవల ఏర్పాటు చేశారు. ఇబ్బందులు లేకుండా చూస్తాం సమ్మక్క జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. డిసెంబర్ 10 నుంచి సమ్మక్క జాతర భక్తుల రద్దీ ప్రారంభమవుతుందనే అనుకుంటున్నాం. అందుకు తగినట్లుగానే పనులు పూర్తి చేయిస్తాం. త్వరలోనే ఈ–టికెట్ విధానాన్ని అందుబాటులోకి తెస్తాం. – రమాదేవి, ఆలయ ఈవో -
గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలోని ఓ గార్డెన్లో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారనేందుకు జూబ్లిహిల్స్లో విజయమే నిదర్శనమన్నారు. బడుగు, బలహీనవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యపడుతుందన్న అంశాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. -
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
● సైకాలజిస్ట్ పున్నంచందర్సిరిసిల్ల: నేతకార్మికులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయొచ్చని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ పేర్కొన్నారు. స్థానిక గణేశ్నగర్లో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. పున్నంచందర్ మాట్లాడుతూ పని బాధ్యతలు పెరుగుతున్న తరుణంలో కార్మికులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మద్యపానం, బీడీ, సిగరెట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పోషకాహారం తీసుకుంటూ.. తగినంత విశ్రాంతి పొందాలన్నారు. మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ, సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు నేత కార్మికులు పాల్గొన్నారు. పరీక్షలంటే భయాన్ని వీడాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యార్థులు పరీక్షలంటే భయం వీడితేనే విజయం దక్కుతుందని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ పేర్కొన్నారు. మండలంలోని మండెపల్లి హైస్కూల్లో హెల్పింగ్హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, అడ్వకేట్ దాసరి తిరుమల, హెచ్ఎం అనురాధ, సజ్జనం శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు. -
పంచాయతీల ఖజానా గలగల
● బిల్లులు చెల్లిస్తున్న ఆశావహులు ముస్తాబాద్(సిరిసిల్ల): పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల ప్రకటనతో ఆశావహులు తమ ప్రచారాన్ని షురూ చేశారు. ముస్తాబాద్ మండలంలోని 22 గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. అధికార పార్టీ కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు ఎన్నికల బరిలో ఉన్నామంటూ ఇంటింటా ప్రచారం మొదలుపెట్టారు. బరిలో నిలబడేందుకు సమాయత్తమవుతున్నారు. ఈమేరకు పంచాయతీ కార్యాలయాలలో ఇంటిపన్ను, నల్లాబిల్లులు కడుతున్నారు. స్థానిక సమరంలో నిలబడేందుకు బకాయిలు ఉండరాదనే నిబంధనతో పంచాయతీల ఖజానా కలకలలాడుతోంది. పన్నుల వసూలు కోసం మేజర్ పంచాయతీలలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. -
తాగి వాహనాలు నడపొద్దు
● బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దు ● గీత దాటితే కఠిన చర్యలు ● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల క్రైం: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని, మద్యం మత్తులో వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 3,740 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. పెట్రోలింగ్ను పకడ్బందీగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పెట్రోకార్స్, బ్లూకోల్ట్ టీమ్లతో నిఘా కఠినతరం చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి రోజు వాహనాల తనిఖీ, డ్రంకెన్డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఏడు నెలల్లో డ్రంకెన్డ్రైవ్ తనిఖీల్లో 10,980 మంది పట్టుబడగా.. జరిమానాలతోపాటు 260 మందికి శిక్షలు కూడా పడినట్లు వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారి డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేయడానికి రవాణా శాఖకు సిఫారసు చేస్తున్నట్లు హెచ్చరించారు. డ్రంకెన్డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. -
మూలకుపడ్డ రిక్షాలు
● వృథా అవుతున్న నిధులు ● పట్టించుకోని జీపీ సిబ్బంది ● ఇప్పటికే కొన్ని దొంగలపాలు చందుర్తి(వేములవాడ): స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గతంలో గ్రామపంచాయతీలకు అందజేసిన చెత్త సేకరణ రిక్షాలు నిరుపయోగంగా మారాయి. మొదట్లో చెత్తసేకరించగా.. అనంతరం గ్రామపంచాయతీకో ట్రాక్టర్ను కొనుగోలు చేయడంతో ఈ రిక్షాలు మూలకుపడ్డాయి. అప్పటి నుంచి వాటిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఫలితంగా ప్రజాధనం వృథా అవుతుంది. జనాభా ఆధారంగా రిక్షాలు జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలలో జనాభా ఆధారంగా చెత్త సేకరణ రిక్షాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు రిక్షాలు వచ్చాయి. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించకముందే గ్రామపంచాయతీకో ట్రాక్టర్ చొప్పున కొనుగోలు చేయడంతో వీటిని పట్టించుకునే వారు లేరు. ట్రాక్టర్లలో చెత్త సేకరణ సులభంగా ఉండడంతో రిక్షాలను మూలకుపడేశారు. దీంతో గ్రామాల్లోని రిక్షాలు నిరుపయోగంగా మారాయి. చందుర్తి మండలం నర్సింగపూర్లోని చెత్తా రిక్షాలను నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనం వెనుక... చెత్తకుప్పల్లో పడేశారు. మండలంలోని బండపల్లిలో రిక్షాల సీట్లు, చక్రాలను ఎత్తుకెళ్లారు. మర్రిగడ్డ, మల్యాల, లింగంపేట గ్రామాల్లో ఎక్కడికక్కడే వదిలేశారు. మరమ్మతు చేయించుకోవచ్చు జీపీలకు ట్రాక్టర్లు వచ్చాక రిక్షాలు వినియోగించడం లేదు. కానీ ఇరుకు గల్లీల్లో తిరిగేందుకు రిక్షాలే నయం. ఏ గ్రామంలోనైనా ట్రాక్టర్ వెళ్లని వీధులు ఉంటే రిక్షాలు బాగు చేసుకొని వాడుకోవచ్చు. పూర్తిగా తుప్పుపడితే స్క్రాప్ కింద విక్రయించి, వచ్చిన డబ్బులను గ్రామపంచాయతీలో జమచేసుకునేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటాం. – బండి ప్రదీప్కుమార్, మండల పంచాయతీ అధికారి, చందుర్తి -
మూడు విడతల్లో
బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025పల్లెపోరు!సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు, ఆశావహుల నిరీక్షణకు తెరపడింది. నేటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే డిసెంబర్ 17 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈనెల 27న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వి డుదల కానుండగా, సర్పంచ్, వార్డు సభ్యులకు డి సెంబర్ 11, 14, 17వ తేదీల్లో మూడు విడతల్లో ఎ న్నికలు నిర్వహించనున్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని రెండు గ్రామపంచా యతీ లు మినహా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్, వా ర్డుసభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. షెడ్యూల్ విడుదలతో కోడ్ అమల్లోకి రాగా, పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఉత్కంఠకు తెర బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సెప్టెంబర్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలై, నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఎన్నికల నిర్వహణపై అయోమయం నెలకొంది. తాజాగా ప్రభుత్వం 2019లో 50 శాతం మించకుండా ఇచ్చిన రిజర్వేషన్లను అనుసరిస్తూ రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రిజర్వేషన్స్ ఖరారు చేసి ఆదివారం ఆయా జిల్లాలోని ప్రజాప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా మహిళలకు మొత్తం స్థానాల్లో సగం సీట్లు కేటాయించారు. దీంతో రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో నడుస్తున్నా జీపీలకు పాలకవర్గాల ఎన్నికకు మార్గం సుగమం అయ్యింది. సర్వం సిద్ధం ఎన్నికల ఏర్పాట్లపై యంత్రాంగం ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్స్లు, ఇతర సామగ్రి సమకూర్చుకున్నారు. ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనుండగా, పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు వెల్లడించి, ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. ఏదైనా కారణంతో ఉపసర్పంచ్ ఎన్నిక జరగకుంటే మరుసటి రోజు ఎన్నుకుంటారు. మోగిన పంచాయతీ నగారా సిరిసిల్ల జిల్లా సమాచారం -
ఆకాశమే హద్దుగా ముందుకెళ్లాలి
సిరిసిల్ల: మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా సీఎం ముందుకు సాగుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పేదలు మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరాలని కోరారు. ఇందిరా మహిళా శక్తి కింద 8,871 ఎస్హెచ్జీలకు రూ.8.12 కోట్ల చెక్కులను వేములవాడ, కలెక్టరేట్లో వేర్వేరుగా మంగళవారం పంపిణీ చేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం మొదటి విడతలో 7,802 ఎస్హెచ్జీలకు రూ.7.40 కోట్లు, రెండో విడతలో 8,552 ఎస్హెచ్జీలకు రూ.11.78 కోట్లు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు రూ.100 కోట్ల చెల్లింపులు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూ.100.10 కోట్లు ఆర్ధిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. శ్రీమహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతిశ్రీ కింద జిల్లాలో 1.14 లక్షల చీరలు పంపిణీ చేశామన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, సన్నబియ్యం అందిస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. వేములవాడ ఆలయాన్ని రూ.150కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ మహిళల ఉన్నతితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ప్రతీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలను భాగస్వాములను చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతు పనులు, వసతుల కల్పనను అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇస్తున్నట్లు గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాలు, ఇతర వ్యాపారాలకు అవకాశం కల్పించిందని తెలిపారు. గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు వి.స్వరూపారెడ్డి, విజయ, సాబేర బేగం, రాణి, చైర్మన్లు రాములు నాయక్, తిరుపతి, రాజు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఆర్డీఓ రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, తహసీల్దార్ విజయ ప్రకాశ్రావు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ నగేశ్ ఇల్లంతకుంట/బోయినపల్లి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, ధాన్యం కోతలు విధించొద్దని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. ఆయిల్పామ్తో ఎన్నో లాభాలు ఉన్నాయని, రైతులు సాగుచేయాలని సూచించారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురం, అనంతారం, పొత్తూరు, గాలిపల్లి, ముస్కానిపేట, బోయినపల్లి మండలం స్తంభంపల్లి, అనంతపల్లి, కోరెం, తడగొండ, బోయినపల్లి, కొదురుపాక, మాన్వాడ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. లారీల సమస్యను నిర్వాహకులు అదనపు కలెక్టర్ దృష్టికి తేగా.. బుధవారం నుంచి అదనంగా లారీలను పంపిస్తామని తెలిపారు. తహసీల్దార్ ఎంఏ ఫరూక్, కాలె నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 30 నుంచి ఎనిమిదో రాష్ట్ర పోటీలు సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో ఈనెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్ తెలిపారు. సిరిసిల్లలోని ప్రెస్క్లబ్లో మంగళవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నట్లు తెలిపారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చింతకింది శ్యామ్, దర్శనాల రామస్వామి, మాదాసు లక్ష్మణ్, కోడం శ్రీనివాస్, గుడ్ల రవి పాల్గొన్నారు. హలో కళాకారులు... చలో కరీంనగర్ సిరిసిల్లటౌన్: తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ఆవిర్భావ సదస్సు పోస్టర్ను సంఘ సేవకులు, గవర్నర్ అవార్డు గ్రహీత తాళ్లపెల్లి సంధ్య ఆవిష్కరించారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈనెల 28న కరీంనగర్ కళాభారతిలో జరిగే రాష్ట్ర సదస్సుకు కళాకారులు తరలిరావాలని కోరారు. కళాకారులు దాట్ల నిర్మల, ఎద్దు మమత, ఎడ్మల శ్రీధర్రెడ్డి, వేముల మార్కండేయ, గూడూరు శ్రీకాంత్, బండారి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పద్యరచనలో విద్యార్థుల సత్తా ముస్తాబాద్(సిరిసిల్ల): తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పద్య రచన పోటీల్లో ఎల్లారెడ్డిపేట విద్యార్థులు సత్తా చాటారు. ఎల్లారెడ్డిపేట హైస్కూల్ విద్యార్థులు సారిక, దివ్యజ్యోతి, హర్షిణి, సంజన, నందిని ప్రతిభ కనబర్చారని హెచ్ఎం మనోహరాచారి తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య డాక్టర్ చెన్నయ్య చేతుల మీదుగా బహుమతులు అందుకున్నట్లు తెలిపారు. కుటుంబ నియంత్రణ శిబిరం వేములవాడఅర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో మంగళవారం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరం నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. 31 మంది పురుషులకు కుటుంబ నియంత్రణ కోత, కుట్టులేని ఆపరేషన్లు చేసినట్లు వివరించారు. డాక్టర్లు రమేశ్, సంపత్కుమార్, దివ్య ఉన్నారు. -
మహిళలపై వివక్ష రూపుమాపాలి
● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం సిరిసిల్ల: మహిళలపై వివక్షను రూపుమాపాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. మహిళలపై హింస నివారణ పక్షోత్సవాల సందర్భంగా సిరిసిల్లలో మంగళవారం అవగాహన సదస్సును నిర్వహించారు. లక్ష్మీరాజం మాట్లాడుతూ మహిళల హక్కులను గుర్తించి, గౌరవించాలన్నారు. మద్యపానం, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. మహిళా సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, నషా ముక్త్ భారత అభియాన్ కోఆర్డినేటర్ జనార్దన్, లీగల్ ఆఫీసర్ అంజయ్య, ప్రిన్సిపాల్ శాంతికిరణ్ పాల్గొన్నారు. -
ప్రజా బలం కాంగ్రెస్కే..
● పార్టీని మరింత బలోపేతం చేద్దాం ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● డీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు ‘సంగీతం’కు అప్పగింతసిరిసిల్లటౌన్: ప్రజా ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీపైనే ఉన్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మంగళవారం డీసీసీ కార్యాలయంలో సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కొత్తగా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగీతం శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘సంగీతం’కు అభినందనల వెల్లువ కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సంగీతం శ్రీనివాస్కు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్లకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, ఆడెపు చంద్రకళ, మడుపు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఖోఖోలో తృతీయస్థానం
చౌటుప్పల్రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న 69వ స్కూల్గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి. చివరి రోజు జరిగిన సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లను తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, యాదాద్రి భువనగిరి డీఈవో సత్యనారాయణ ప్రారంభించారు. బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు ప్రథమ స్థానంలో నిలువగా.. ద్వితీయస్థానంలో మహబూబ్నగర్, తృతీయ స్థానంలో నల్లగొండ జిల్లా జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్, ద్వితీయస్థానంలో రంగారెడ్డి, తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు అధికారులు బహుమతులు అందజేశారు. డిసెంబర్ 20న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగే జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి 12 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల విద్యాధికారి గురువారావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.దశరథరెడ్డి, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, తోట జయప్రకాశ్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణమూర్తి, బిక్కునాయక్, ప్రధానోపాధ్యాయులు సత్యనారా యణ, శ్రీనివాస్రెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్, వేణుగోపా ల్, టి.సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్తాచాటిన ఉమ్మడి జిల్లా బాలుర క్రీడాకారులు ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు -
జాతీయ కబడ్డీ పోటీలకు కీర్తన
కరీంనగర్స్పోర్ట్స్: హరియాణా రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి 30 వరకు జరిగే 35వ జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీలకు కరీంనగర్ కోతిరాంపూర్లోని ప్రభు త్వ ఉన్నత పాఠశాల సవరన్ విద్యార్థిని కీర్తన ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ లింగారావు తెలి పారు. ఇటీవల రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటి జాతీయ పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో కీర్తనను హెచ్ఎం సతీశ్, ఉపాధ్యాయులు అభినందించారు. ధర్మపురి: ధర్మపురి మండలం జైనా సింగిల్ విండో సొసైటీ కార్యదర్శి సాగర్రావును సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి మనోజ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ పరిధిలోని దమ్మన్నపేట కొనుగోలు కేంద్రాన్ని ఇటీవల అదనపు కలెక్టర్, పౌర సరఫరాల అధికారి సందర్శించారు. ఆ సమయంలో రైస్మిల్లులకు ధాన్యం తరలించే విషయమై కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనలో నిర్వాహకుడిని ఇప్పటికే తొలగించారు. తాజాగా సొసైటీ కార్యదర్శి సాగర్రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గుప్త నిధుల పేరిట మోసంకోనరావుపేట(వేములవాడ): ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయంటూ, వెలికి తీయాలని రూ.4లక్షలు వసూలు చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ప్రశాంత్రెడ్డి తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్కు చెందిన దుగ్గు వేణు ఇంట్లో బంగారు నిధులు ఉన్నాయని సిరిసిల్ల శివారులోని పెద్దూరుకు చెందిన మేకల నరేశ్, కడవంచ ప్రసాద్, సదుల దేవేందర్, సదుల రాజేశం నమ్మబలికారు. వాటిని బయటకు తీయాలంటే ఖర్చు అవుతుందని నమ్మబలుకుతూ పలుమార్లు కలిపి రూ.4.08లక్షల వరకు వసూలు చేశారు. తర్వాత ముఖం చాటేయడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు కోనరావుపేట పోలీసులను మంగళవారం ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేశారు. చెరుకు తోట దగ్ధంబోయినపల్లి(చొప్పదండి): వరికొయ్యలు కాలు స్తున్న క్రమంలో మంటలు వ్యాపించడంతో రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం స్తంభంపల్లికి చెందిన పులి లక్ష్మీపతికి చెందిన ఆరు ఎకరాల చెరుకుతోట దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాలు. ఆరు ఎకరాల మేర చెరుకు తోట కోతకు వచ్చింది. సమీప పొలంలో వరికొయ్యలు కాల్చడంతో మంటలు చెరుకుతోటలోకి వ్యాపించాయి. ఆరు ఎకరాల మేర చెరుకుపంట కాలిపోయింది. స్థానికులు ఫైరింజన్కు సమాచారం ఇవ్వగా వారు వచ్చే వరకే మంటలు వ్యాపించి పంట మొత్తం కాలిపోయింది. తనకు రూ.7లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు రోదిస్తూ తెలిపాడు. ‘ఓలా’ షోరూం ఎదుట ఆందోళన జగిత్యాలటౌన్: వాహన చట్టం ప్రకారం సర్వీస్ అందించని ఓలా కంపనీ అనుమతులు రద్దు చేయాలంటూ వినియోగదారులు జగిత్యాలలోని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూం ఎదుట ఆందోళనకు దిగారు. వివిధ ప్రాంతాల నుంచి మంగళవారం షోరూంకు వచ్చిన కస్టమర్లు వాహన సర్వీస్ ఆలస్యంపై నిర్వాహుకులను నిలదీశారు. కంపెనీ నుంచి విడిభాగాలు సరఫరా కావడం లేదని వారు చెప్పడంతో ఆగ్రహంతో షోరూంషెట్టర్లు మూసి తాళం వేసి నిరసన తెలిపారు. నాలుగు నెలలుగా వాహనాలు మరమ్మతు చేయడం లేదని, షోరూంలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీణవంక: ఓ రైతు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని వల్భాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు ధాన్యం విక్రయించగా రూ.2.80లక్షలు తన ఖాతాలో జమయ్యాయి. ఓ వ్యక్తికి డబ్బులు చెల్లించాల్సి ఉండగా రూ.లక్ష ట్రాన్స్ఫర్ చేశాడు. మిగతా రూ.1.80లక్షలు ఖాతాలో ఉన్నాయి. ఈక్రమంలో అనుకోకుండా ఏపీకే యాప్ డౌన్లోడ్ కావడంతో సైబర్ నేరగాళ్లు డబ్బులు మాయం చేశారు. రైతు తేరుకునే లోపు డబ్బులు ఖాతా నుంచి మాయం కావడంతో బ్యాంకును సంప్రదించాడు. అధికారులు ఖాతాను ఫ్రీజ్ చేద్దామనుకుంటే అప్పటికే కేటుగాళ్లు మాయం చేశారు. సెల్ఫోన్ స్క్రీన్ చెడిపోవడంతో అనుకోకుండా యాప్ డౌన్లోడ్ కావచ్చని రైతు విలపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వారం క్రితం ఇదే మండలం బేతిగల్కు చెందిన ఓ మహిళ ఆర్టీఏ పెండింగ్ చలాన్ పేరుతో వచ్చిన లింకును ఓపెన్ చేయడంతో నిమిషాల్లో రూ.29,500 మాయం చేశారు. మరో ఇద్దరు యువకులు ఇదే యాప్ను ఓపెన్ చేయడంతో ఖాతాలో డబ్బులు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలో మంగళవారం అనుమానాస్పదస్థితిలో మహిళ మృతిచెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. రాచర్ల గొల్లపల్ల్లికి చెందిన అందె నీరజ(25) ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం తన కుమారుడిని స్కూల్కు పంపించి, ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. నీరజ ఆడపడచు వదినతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లగా ఎంతకూ తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన ఆమె కిటికిలో నుంచి చూడగా నీరజ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె పోలీసులు, బంధువులకు సమాచారం అందించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే నీరజ మృతి చెంది ఉంది. ఈమేరకు నీరజ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రెండుసార్లు యత్నించి.. మూడోసారి ఆత్మహత్య చేసుకుని.. ● సింగరేణి రిటైర్డ్ కార్మికుడి బలవన్మరణం గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ద్వారకానగర్కు చెందిన బండారి రాములు(65) అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మంగళవారం ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాములు కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున మృతుడి భార్య భాగ్యలక్ష్మి నిద్రలేచి చూడగా ఇంట్లో సీలింగ్ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే తన కుమారుడికి ఫోన్చేసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ సురేందర్ కేసు నమోదు చేసుకున్నారు. -
పరిశ్రమలు కావు.. పక్కలో బాంబులు
సింగరేణి గనులు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, ఓపెన్కాస్ట్ల వల్ల ఉపాధి సంగతేమో కానీ, మా గోదావరిఖని పరిసర ప్రాంతాల పక్కలో బాంబుల్లా మారాయి. ఆర్ఎఫ్సీఎల్ నుంచి లీకవుతున్న విష వ్యర్థాలు నీరు, గాలిలో కలుస్తున్నాయి. ఫలితంగా స్థానికులకు శ్వాసకోస, కేన్సర్ తదితర వ్యాధులు వస్తున్నాయి. ఓపెన్కాస్ట్ బ్లాస్టింగ్ వల్ల వీర్లపల్లి వాసులకు వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికై నా ప్రభావిత ప్రాంతాల్లో సింగరేణి, ఇతర సంస్థలు ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. ఆర్ఎఫ్సీఎల్ నుంచి విషవాయువులు వదిలినప్పుడు ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. – ప్రవీణ్, విఠల్నగర్, గోదావరిఖని -
ముంబైలో చిత్రకళా ప్రదర్శన
రుద్రంగి(వేములవాడ): ముంబై మహానగరంలోని ప్రఖ్యాత జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ కాంప్లెక్స్–హిర్జీ గ్యాలరీలో తెలంగాణ యువకుడి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ సోమవారం ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మంచె శ్రీనివాస్ తన చిత్రకళను ఈనెల 24 నుంచి 30 వరకు ప్రదర్శించనున్నారు. బృహన్ ముంబై మహానగర పాలకసంస్థ అసిస్టెంట్ కమిషనర్ అల్లే చక్రపాణి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కమిషనర్ మాట్లాడుతూ శ్రీనివాస్ గీసిన చిత్రాలు సమాజానికి సందేశాన్నిచ్చేలా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమానికి అథితులుగా స్వయం కృషి ఫౌండేషన్ సభ్యులు పిల్లమారపు గంగాధర్, ద్యావరశెట్టి గంగాధర్, శ్రీపతి శ్రీనివాస్, దేవరశెట్టి శ్రీధర్, ఆడేపు రాంమోహన్, తాటికొండ శివకుమార్, పూల రామలింగం హాజరై పట్టుదల, కృషితో చిత్రకళలో జాతీయస్థాయిలో రాణిస్తూ నేటియువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మంచె శ్రీనివాస్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గడ్డం హరీష్, శ్రీధర్, సాయి పాల్గొన్నారు. ఆకట్టుకున్న చిత్రాలు -
భార్యను హతమార్చిన భర్త అరెస్ట్
సైదాపూర్(హుస్నాబాద్): మాజీ భార్యను హత్య చేసిన చింతకుంట్ల మహిపాల్రెడ్డి(46)ని అరెస్టు చేసినట్లు హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. వివరాలు.. సైదాపూర్ మండలం రాములపల్లికి చెందిన మహిపాల్రెడ్డికి చెల్పూర్ పంచాయతీ పరిధి తోకలపల్లికి చెందిన సుకృతతో 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు. నేర ప్రవృత్తి కలిగిన మహిపాల్రెడ్డి భార్య ఉండగానే 2002లో ఓ యువతిని ప్రేమ పేరుతో తీసుకెళ్లాడు. ఆమె బంధువులు వెతికి ఇంటికి తీసుకెళ్లగా అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంది. ఈక్రమంలో సుకృతను తరచూ వేధించడంతో తల్లిగారింటికి వెళ్లింది. దీంతో 2009లో మహిపాల్రెడ్డి రాములపల్లికి చెందిన రమాదేవిని పెళ్లి చేసుకోగా, సుకృత కేసులు పెట్టింది. కేసులు నడుస్తుండగానే సుకృతకు మహిపాల్రెడ్డి 20 గుంటల భూమి ఇవ్వగా, కూతురు పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. సదరు భూమి తిరిగి ఇవ్వాలని ఆమెతో గొడవపడుతున్నాడు. ఈ నెల 22న మధ్యాహ్నం పొలం వద్ద సుకృతపై పెట్రోల్ పోసి తగలబెట్టి పరారయ్యాడు. మంగళవారం నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈసందర్భంగా ఎస్సై తిరుపతి, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
రామగుండమా..! ఊపిరి పీల్చుకో!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: రామగుండం.. అంటే ఇంతకాలం ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి గనులు, బసంత్నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలు, ఓపెన్కాస్ట్లు ప్రపంచానికి తెలిసింది ఇంతే! కొంతకాలంగా పెరుగుతున్న కేన్సర్ కేసులకు రామగుండం పారిశ్రామిక పాంతం నిలయంగా మారుతోందన్న విషయం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల రామగుండం ప్రాంతంలోని దాదాపు 10 గ్రామాల్లో ప్రజలకు వైద్యశిబిరాల ద్వారా ప్రభుత్వ సహకారంతో రక్తనమూనాలు సేకరించారు. ఇందులో దాదాపు 183 మందికి ప్రీకేన్సర్ లక్షణాలు కనిపించగా 30 మంది వరకు కేన్సర్ అనుమానిత కేసులు ఉన్నాయన్న ప్రచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో వాయుకాలుష్యం పెరిగిన మాట వాస్తవమే. ఫలితంగా వాయునాణ్యత రోజురోజుకు దిగజారిపోతుంది. సాధారణంగా వాయు నాణ్యత 5 ఏక్యూఐ యూనిట్లు ఉండాలి. కానీ, ప్రస్తుతం సగటున రామగుండం పరిసరాల్లో 180 నుంచి 1,200 వరకు ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) యూనిట్లను తాకుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరిగింది? దాదాపు ఐదు దశాబ్దాలుగా రామగుండంలో వాయుకాలుష్యం సాధారణ విషయమే. ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు, దాని ఆధారిత ఎన్టీపీసీ ప్రాజెక్టులు, వాటి నుంచి ఉత్పత్తి అవుతున్న ఫ్లైయాస్, ఓపెన్కాస్ట్ బ్లాస్టింగులు, సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల గాలిలోకి రోజుకు టన్నుల కొద్దీ కార్బన్యాకై ్సడ్, కార్బన్ మోనాకై ్సడ్, సల్ఫర్ తదితర విషవాయువులు వెలువడుతున్నాయి. వీటికితోడు ఇక్కడ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పలు కొత్త పవర్ ప్రాజెక్టులు, ఇటీవల ఆర్ఎఫ్సీఎల్ పునఃప్రారంభంతో గాలిలోకి కార్బన్మోనాకై ్సడ్, అమోనియా లీకేజీలు పెరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నాయి. ఆర్ఎఫ్సీఎల్ నుంచి రాత్రిపూట అమోనియా లీకై న సందర్భంలో పరిసరాల్లోని గోదావరిఖని, వీర్లపల్లి, ఎలకలపల్లి, ఎన్టీపీసీ, గౌతమినగర్ తదితర 10 గ్రామాల్లో ప్రజలకు ఊపిరి ఆడని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక వాతావరణంలోకి విడుదలవుతున్న వ్యర్థాల విషయంలో పీసీబీ పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నా.. పెద్దగా స్పందించిన దాఖలాలు కానరావడం లేదు. ఎక్కడెక్కడ రక్తపరీక్షలు నిర్వహించారు? పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో, రోహిణి ఫౌండేషన్, ఎన్టీపీసీ రామగుండం, స్థానిక పోలీసుల సహకారంతో రామగుండం ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల్లో నోటి కేన్సర్ పరీక్షా శిబిరాలు నిర్వహించారు. శిబిరాల్లో మొత్తం 5,000 మందిని పరీక్షించగా, 183 మందిలో ప్రీకేన్సర్ లక్షణాలు, అలాగే 20 మందిలో కేన్సర్ అనుమానిత కేసులను గుర్తించారు. రోజురోజుకు పెరుగుతున్న వాయు, నీరు, నేల కాలుష్యాల కారణంగా ప్రభావితమవుతున్న ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు రామగుండం మండలం కుందన్పల్లి, మల్యాలపల్లి, బ్రాహ్మణపల్లి, లక్ష్మీపూర్, విఠల్నగర్, ఎల్కపల్లి, అంతర్గాం, నరసలపల్లి పరిసర గ్రామాల్లో నివసిస్తున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. పరీక్షల ఫలితాల అనంతరం అనుమానిత కేసులను తదుపరి పరీక్షలు, చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డెంటల్ ఓపీకి పంపించారు. ప్రమాదకరస్థాయిలో వాయుకాలుష్యం తీవ్రత జీవించడానికి వీలు లేకుండా వాయు నాణ్యత 170–1,200 యూనిట్లు తాకుతున్న ఎయిర్క్వాలిటీ ఇండెక్స్ పెరుగుతున్న కేన్సర్ కేసులతో ఆందోళనలో ప్రజలు రామగుండంలో 10 గ్రామాల్లో 5,000 మందికి రక్త పరీక్షలు 183 మందికి ప్రీక్యాన్సర్ లక్షణాలు గుర్తించిన రోహిణీ ఎన్జీవో -
రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకుడి మృతి
కొండగట్టులో ‘సమ్మక్క’సందడి మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో సమ్మక్క, సారలమ్మ జాతర సందడి మొదలైంది. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రాత్రి కొండపైనే బస చేసి వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు. మంగళవారం వేలాదిమంది తరలిరావడంతో ఆలయ పరిసరాలు, భక్తులతో కిక్కిరిసిపోయాయి. లడ్డూ, పులిహోరా విక్రయాలకు అదనంగా మరో కౌంటర్ ఏర్పాటు చేశారు. భక్తుల ప్రత్యేక దర్శనం టికెట్లు, లడ్డూ, పులిహోర విక్రయాల ద్వారా ఆలయానికి రూ.5లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈఓ శ్రీకాంత్రావు, ఏఈఓ హరిహరనాథ్ పర్యవేక్షించారు. రామడుగు(చొప్పదండి): రామడుగు మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు పూరెల్ల శ్రీకాంత్గౌడ్ (35) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంగళవారం ఉదయం మృతిచెందాడు. వివరాలు.. శ్రీకాంత్గౌడ్తో పాటు రామడుగుకు చెందిన వనపర్తి అరుణ్, పూరెల్ల సురేశ్ ద్విచక్రవాహనంపై షానగర్ నుంచి రామడుగు వెళ్తుండగా గుర్తు తెలియని టిప్పర్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో శ్రీకాంత్గౌడ్ రోడ్డుపక్కన పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య సుకృత ఫిర్యాదు మేరకు ఎస్సై రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి పరామర్శ శ్రీకాంత్గౌడ్ మృతి వార్త తెలుసుకున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ మంగళవారం ఉదయం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అతడి మృతదేహానికి నివాళి అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. -
బ్లాస్ట్ కాదు.. నాణ్యత లోపమే..?
సాక్షి పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల – పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మధ్య మానేరుపై చెక్డ్యాం ధ్వంసం కావడానికి నాణ్యత లోపమే కారణమని పోలీస్ విచారణలో తేలినట్లు సమాచారం. అందరూ ఊహించినట్లు ఇసుక మాఫియా హస్తం లేదని విచారణలో తేలినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి గుంపుల చెక్డ్యాం కూలిన విషయం తెలిసిందే. ఇసుక తోడుకునేందుకు ఇసుక మాఫియానే జిలెటెన్స్టిక్స్తో చెక్డ్యాంను పేల్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనివెనుక ఇసుక అక్రమార్కుల హస్తం ఉందని ఏకంగా ఇంజినీరింగ్ అధికారులే జమ్మికుంట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో గుంపుల చెక్డ్యాం కూలిపోవడం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. కాల్వశ్రీరాంపూర్కు చెందిన ముగ్గురు జాలరులను గుర్తించి ప్రశ్నించగా.. శుక్రవారం సాయంత్రం 6.30 ప్రాంతంలో చెక్డ్యాం కూలిపోయిందని చెప్పినట్లు సమాచారం. చెక్డ్యాం కుంగినప్పుడు అక్కడే తాము ఉన్నామని ఆ మత్స్యకారులు ఇచ్చిన వాంగ్ములం ఆధారంగా దీని వెనుక ఎవరిహస్తం లేదని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీనికితోడు డ్యాంను బాంబులతో కూల్చివేసినట్లు ఆనావాళ్లు కానరాలేదని, అదేవిషయం ఫోరెన్సిక్ నివేదికలోనూ వెల్లడైనట్లు సమాచారం. బాంబలతో పేల్చితే పేలుడు పదార్థాల అవశేషాలు, పరిసర ప్రాంతాల్లో ఉపయోగించిన రసాయనాల (నైట్రోజన్ సమ్మేళనాలు, టీఎన్టీ మొదలైనవి) లభి స్తాయి. అలాగే భారీ పేలుడు జరిగినచోట గొయ్యి ఏర్పడుతుంది. ముఖ్యంగా కాంక్రీట్ రంగు మారడం, పగుళ్లపొరలుగా ఊడిపోవడం, పేలుడు పరికరాల భాగాలు.. అంటే స్విచ్లు, వైర్లు, టైమర్లు, సర్క్యూట్ బోర్టుల వంటివి పేలుడు ప్రదేశంలో లభిస్తాయి. కానీ, ఇవేమీ డ్యాం కూలిన ప్రదేశంలో కనిపించలేదని పోలీస్, ఫోరెన్సిక్ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. దీంతో కేవలం డిజైన్, నాణ్యత లోపమే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఉపనదులు, వాగుల నీటి ప్రవాహాలను ఆపి, నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చెక్డ్యాంలను నిర్మించింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 16 చెక్డ్యాంలను రూ.128 కోట్లతో గత ప్రభుత్వం హయాంలో నిర్మించారు. అయితే, నిర్మాణ సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, డిజైన్ లోపాలు, నిర్మాణ ప్రదేశం ఎంపికలో లోపాలతో పలు చెక్డ్యాంలు వరదల సమయంలో కొట్టుకపోయాయని, ప్రస్తుత చెక్డ్యాం సైతం కూలిపోవడానికి అదే కారణమని అధికారులు చెబుతున్రాఉ. దీంతోనే పెద్దపల్లి నియోజకవర్గంలో 13 చెక్డ్యాంలు నిర్మిస్తే 8 చెక్డ్యాంలు కృంగిపోయాయని గుర్తించినట్లు సమాచారం. చెక్డ్యాంకు బాంబులు పెట్టి పేల్చిన ఆనవాళ్లు కనబడటంలేదని, డ్యాంకు మధ్య, ముందు భాగంలో బుంగలు ఏర్పడడంతో చెక్డ్యాం కూలిపోయిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీస్ ఉన్నాతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. గుంపుల చెక్డ్యాం కుంగుబాటుకు కారణం నాణ్యత లోపమే ఫోరెన్సిక్ నివేదికలో కానరాని బ్లాస్టింగ్ ఆనవాళ్లు పోలీస్ విచారణలో ప్రత్యక్ష సాక్షుల వాంగ్ములం -
భట్టిని కలిసిన సంగీతం
సిరిసిల్లటౌన్: నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్లో డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలిగంభీరావుపేట(సిరిసిల్ల): స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని నాఫ్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. సోమవారం మండలంలోని పార్టీ కార్యాలయంలో రాబోయే ఎన్నికలపై మార్గనిర్దేశనం చేశారు. పార్టీ బలపరిచే అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. నాయకులు వెంకటస్వామిగౌడ్, దయాకర్రావు, భూపతి సురేందర్, వెంకటియాదవ్, రామానుజాగౌడ్, రాజేందర్, గంధ్యాడపు రాజు, వహీద్ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల
వాతావరణం మధ్యాహ్నం ఎండ సాధారణంగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.7నృసింహుని సన్నిధిలో రద్దీ ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామివారి సన్నిధి సోమవారం భక్తులతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కళాకారుల నృత్యనివేదన పరమేశ్వరుడు అమితంగా ఇష్టపడే నృత్యనివేదనను కళాకారులు ఇటీవల కార్తీక మాసం సందర్భంగా రాజన్న సన్నిధిలో కనులపండువగా నిర్వహించారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం బాలికల విభాగంలో అండర్–14,16 అస్మిత అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహించారు. సైకియాట్రిస్ట్ పున్నంచందర్ పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని 13 మండలాల నుంచి సుమారు 150 మంది పాల్గొన్నారు. రన్నింగ్, జావెలిన్ త్రో, షాట్పుట్, లాంగ్జంప్లో పలువురు సత్తాచాటారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, అబ్జర్వర్ గుండ సునంద్, డీవైఎస్వో అజ్మీరరాందాస్, ప్రిన్సిపాల్ రఘునందన్ తదితరులు ఉన్నారు. -
నిరుపేదలు గౌరవంగా బతకాలి
● విప్ ఆది శ్రీనివాస్ వేములవాడఅర్బన్: ఇందిరమ్మ ఇళ్లతో లబ్ధిదారుల్లో ఆనందం నెలకొంటుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లో సగ్గు లావణ్య– శ్రీనివాస్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసి సోమవారం గృహ ప్రవేశం చే శారు. ఈ సందర్భంగా విప్ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి మాట్లాడారు. ప్రతీ నిరుపేద కుటుంబం గౌరవప్రదమైన నివాసం కలిగి, సంతోషంగా జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం అన్నా రు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సాగరం వెంకటస్వామి, ఎండీ ఇర్ఫాన్, నాగుల విష్ణు, దుర్గం పర్శరాములు, సాబీర్ తదితరులు ఉన్నారు. -
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్లటౌన్: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సెస్ అసిస్టెంట్ హెల్పర్లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ తీసి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడారు. కోఆపరేటివ్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. తదితర డిమాండ్లలో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. యూనియన్ అధ్యక్షుడు కె.ఈశ్వర్రావు, వి.గోవర్ధన్, నలువాల స్వామి, ప్రసాద్, మధు తదితరులు పాల్గొన్నారు. -
● ఎస్పీ మహేశ్ బీ గితే
బాధితులకు భరోసా గ్రీవెన్స్సిరిసిల్లక్రైం: సమస్యల పరిష్కారం లక్ష్యంగా, బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గితే తెలిపారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 32 ఫిర్యాదులు స్వీకరించినట్లు వివరించారు. ఫిర్యాదులపై ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి, బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించి ఫిర్యాదులు స్వీకరించాలని సూచించారు. అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, దీంతో ఫిర్యాదుదారుకు పోలీస్శాఖపై భరోసా కలుగుతుందన్నారు. -
ఊరు.. పోరు షురూ
● గ్రామాల వారీగా ‘రిజర్వేషన్ల’ గెజిట్ జారీ ● ఎస్టీలకు 30, ఎస్సీ 53, బీసీ 56, జనరల్కు 121 గ్రామాలు ● 119 స్థానాలు మహిళలకు కేటాయింపు ● తుది ఓటర్ల జాబితా వెల్లడి ● పల్లె ఓటర్లు 3,53,351 మందిసిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని 260 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్ల గెజిట్ను ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ జారీ చేశారు. గ్రామాల వారీగా ఓటర్ల జాబితాకు తుది రూపమిచ్చారు. ఈ మేరకు జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. బీసీల్లో నిరాశ జిల్లాలోని 260 గ్రామపంచాయతీల్లో ఈసారి కేవలం 56 గ్రామాలు బీసీలకు రిజర్వు చేయబడ్డాయి. అదే 42 శాతం ప్రకారం.. సెప్టెంబరు నోటిఫికేషన్లో 109 గ్రామాలను బీసీలకు కేటాయించారు. ఈ లెక్కన జిల్లాలో బీసీలకు రిజర్వేషన్లలో నిరాశ ఎదురైంది. 2019 నాటి రిజర్వేషన్లను ప్రామాణికంగా తీసుకుని 50 శాతం దాటకుండా కేటాయించడంతో బీసీలు నిరాశకు లోనయ్యారు. అలాగే వార్డు సభ్యుల స్థానాల్లోనూ ప్రస్తుతం బీసీలకు 553 స్థానాలను కేటాయించారు. కానీ, సెప్టెంబరు నోటిఫికేషన్ ప్రకారం 952 వార్డు సభ్యుల స్థానాల్లో బీసీలకు అవకాశం లభించింది. రిజర్వేషన్ కోటా తగ్గడంతో బీసీల స్థానాలు తగ్గి జనరల్ స్థానాలు పెరిగాయి. వీర్నపల్లి మండలంలో 17 గ్రామాలు ఉండగా, ఒక్క స్థానం కూడా బీసీలకు కేటాయించకపోవడంపై బీసీ జనాభా ఉన్న గ్రామస్తులు అభ్యంతరం చెబుతున్నారు. 50 శాతం మించకుండా రిజర్వేషన్లను ఖరారు చేయడంతో ఈ సమస్య ఎదురైందని అధికారులు చెబుతున్నారు. మహిళా ఓటర్లే అధికం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఓటర్లు 3,53,351 మంది కాగా.. ఇందులో మహిళలు 1,82,559, పురుషులు 1,70,772, ఇతరులు 20 మంది ఉన్నారు. పురుషుల కంటే 11,787 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలోని 260 గ్రామపంచాయతీలకు గాను 119 స్థానాల్లో మహిళా సర్పంచ్లు ఎన్నిక కానున్నారు. 2,268 వార్డు సభ్యుల స్థానాల్లో మహిళలు 976 మంది ఎన్నికయ్యే చాన్స్ వచ్చింది. మొత్తం గ్రామపంచాయతీలు 260 ఎస్టీ 30 (మహిళ 13, జనరల్ 17) ఎస్సీ 53 (మహిళ 24, జనరల్ 29) బీసీ 56 (మహిళ 24, జనరల్ 32) జనరల్ 121(మహిళ 58, జనరల్ 63)మొత్తం 2,268 ఎస్టీ 229 (మహిళ 106, జనరల్ 123) ఎస్సీ 442 (మహిళ 177, జనరల్ 265) బీసీ 553 (మహిళ 222, జనరల్ 331) జనరల్ 1,044 (మహిళ 471, జనరల్ 573)ఈ సారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో యువకులు ఎక్కువగా పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. 260 గ్రామాల్లో కలిసొచ్చే రిజర్వేషన్లను వినియోగించుకుని గ్రామస్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సామాజిక సమీకరణను అంచనా వేస్తూ.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు. మరోవైపు సర్పంచ్గా అవకాశం రానివారు వార్డు సభ్యుడిగా ఎన్నికై .. ఉప సర్పంచ్గా విజయం సాధించాలని భావిస్తున్నారు. ఈ మేరకు గ్రామాల్లో వార్డులను వెతుక్కుంటున్నారు. వార్డు సభ్యుడి స్థానంలో విజయం సాధించడంతో మెజార్టీ సభ్యులను గెలిపించుకుని పంచాయతీలో జాయింట్ చెక్పవర్ ఉన్న ఉపసర్పంచ్ స్థానాన్ని దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. కాగా, గ్రామాల్లో తుది ఓటర్ల జాబితా వెల్లడించడం, వార్డు స్థానాలతో పాటు, గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను వెల్లడించడంతో పల్లె పోరుకు తెరలేచింది. -
కలెక్టర్ సెలవు పొడిగింపు
సిరిసిల్ల: కలెక్టర్ ఎం.హరిత తన దీర్ఘకాలిక సెలవును పొడిగించారు. అక్టోబరు 22న సెలవుపై వెళ్లిన కలెక్టర్ సోమవారం విధులకు రావాల్సి ఉంది. కానీ ఆమె తన సెలవులను డిసెంబరు 12 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. అదనపు కలెక్టర్గా విధుల్లో చేరిన గరిమా అగ్రవాల్ ఇన్చార్జి కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఒకట్రెండు రోజుల్లో వచ్చే చాన్స్ ఉన్న నేపథ్యంలో కలెక్టర్ హరిత జిల్లాకు వస్తారా..? సెలవులోనే ఉంటారా.! అనే చర్చ జిల్లా అధికార వర్గాల్లో సాగుతుంది. జిల్లాకు కలెక్టర్గా వచ్చిన హరిత నెల రోజుల్లోనే దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఈ– శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలిసిరిసిల్ల: జిల్లాలోని భవన నిర్మాణ, ఇతర రంగాల్లోని కార్మికులు ‘ఈ–శ్రమ్’ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ కోరారు. కార్మిక శాఖ రూపొందించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించి మాట్లాడారు. ‘ఈ–శ్రమ్’ పోర్టల్లో చేరినవారికి సహజ, ప్రమాద మరణం దరి చేరినా.. అంగవైకల్యం కలిగినా బీమా సదుపాయం ఉంటుందన్నారు. డిసెంబరు 3 వరకు కార్మికులకు క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, డీఆర్డీవో శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాలకు రూ.8.12 కోట్లుసిరిసిల్ల: జిల్లాలోని 8,871 స్వయం సహాయక మహిళా సంఘాల(ఎస్హెచ్జీ)కు ఇందిరా మహిళా శక్తి కింద వడ్డీలేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. మహిళా సంఘాలకు రూ.8.12 కోట్లు మంగళవారం సిరిసిల్ల, వేములవాడల్లో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు డీఆర్డీఏ అధికారులతో సోమవారం సమీక్షించారు. ఇప్పటికే ప్రభుత్వం మొదటి విడతలో 7802 ఎస్హెచ్జీలకు రూ.7.40 కోట్లు, రెండో విడతలో 8552 ఎస్హెచ్జీలకు రూ.11.78 కోట్లు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిందని వివరించారు. వేములవాడలోని రామలింగేశ్వర గార్డెన్లో వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. మధ్యాహ్నం 1 గంటకు కలెక్టరేట్లో సిరిసిల్ల నియోజకవర్గ మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. డీఆర్డీవో శేషాద్రి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీపీఎంలు పాల్గొన్నారు. కులగణన ఆపరేటర్ల వేతనాలు ఇవ్వాలిసిరిసిల్లటౌన్: కులగణన సర్వే ఆపరేటర్ల వేతనాలు ఎప్పుడు అందిస్తారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. సోమవారం సిరిసిల్లలోని కార్మిక భవనంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో అట్టహాసంగా కులగనన చేపట్టిందని, అనంతరం పార్టీకి మంచి పేరు వచ్చిందన్నారు. కానీ, కులగణలో పాల్గొన్న నిరుద్యోగ యువతకు ఇప్పటివరకు వారికి రావాల్సిన డబ్బులు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. జిల్లా నుంచి నిరుద్యోగ యువత సుమారు 400 మంది నెల రోజులు శ్రమించినారని, వారికి డబ్బులు ఇవ్వకపోవడం సరికాదన్నారు. సమావేశంలో వెంటనే చెల్లించాలని లేకుంటే పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సోమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల‘వాణి’.. పరిష్కరించాలని
సిరిసిల్లఅర్బన్: ప్రజావాణి సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 143 దరఖాస్తులు వచ్చాయి. ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలనికలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.సింగారం గ్రామానికి చెందిన 11 మంది లబ్ధిదారులం గత ప్రభుత్వ హయాంలో అప్పు చేసి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టుకున్నాం. కొందరివి అసంపూర్తిగా ఉన్నాయి. లబ్ధిదారులకు ఇస్తామన్న రూ.5 లక్షలు ఇప్పటికీ ఇవ్వలేదు. రెండేళ్లుగా బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి బిల్లులు మంజూరు చేయాలి. – సింగారం గ్రామస్తులుసిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని మరో చోటుకు మార్చాలి. జనావాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడం వల్ల మహిళలు, విద్యార్థులు, పిల్లలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. – ఆనంద మిత్రమండలి అసోసియేషన్ రంగనాయకసాగర్ నుంచి జిల్లెల్ల అగ్రికల్చర్ మీదుగా మల్లాపూర్ వరకు సాగునీటి కాలువ పనులను కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలేశాడు. కాలువ పూర్తిచేస్తే ఈ ప్రాంత రైతులకు సాగునీటి కరువు ఉండదు. పనులు త్వరగా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి. – రైతు సంక్షేమ సంఘం బాధ్యులు, జిల్లెల్ల మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురైన 18 ఇళ్లకు ఇప్పటికీ పరిహారం రాలేదు. పలుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇప్పటికై నా నిర్వాసితుల వద్ద ఆధారాలు పరిశీలించి పరిహారం ఇప్పించాలి. – చింతల్ఠాణా నిర్వాసితులు -
అరచేతిలో ‘మీ సేవ’లు
● వాట్సాప్ ద్వారా అందుబాటులోకి.. ● సులభతరం చేస్తూ ప్రభుత్వ నిర్ణయంగంభీరావుపేట(సిరిసిల్ల): పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అవసరమైన సేవలు, సర్టిఫికెట్లను త్వరగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో శ్రీమీ సేవలుశ్రీను ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై అధికారిక వాట్సాప్ నంబర్కు సందేశం పంపితే చాలు అభ్యర్థన నమోదు నుంచి స్టేటస్ చెక్ వరకు అన్నీ మొబైల్లోనే పూర్తికానున్నాయి. పౌరసేవలను ప్రజల అరచేతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజా పరిపాలనలో మరో ముందడుగుగా నిలుస్తోంది. డిజిటల్ తెలంగాణ దిశగా సాంకేతికతను వినియోగిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు ప్రజలకు మరింత భరోసా కలిగించేలా ఉంది. ప్రస్తుతానికి 35.. రానున్న కాలంలో 580 సేవలు ఉన్నత చదువులకో.. ఉద్యోగాలకో.. విద్యాసంస్థల ప్రవేశాలకో అవసరమైన సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి మీసేవ కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేదు. దాదాపు 35 సేవలను వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రానున్న కాలంలో మొత్తం 580 సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జనన, మరణ, ఆదాయం సర్టిఫికెట్లతోపాటు విద్యుత్ బిల్లులు, ట్యాక్స్లు చెల్లించే వీలు కలిగింది. అధికారిక వాట్సాప్ నంబర్ 80969 58096ను మొబైల్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సులభతరం.. వేగవంతం ప్రస్తుతం మీసేవలలో ఉన్న పలు సర్టిఫికెట్లు, అప్లికేషన్లు, ఫిర్యాదులు ఇవన్నీ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిపోవడంతో ప్రజల వినియోగ శైలిలో మార్పు రావడంతో, ప్రభుత్వం వాట్సాప్ను కూడా అధికారిక సేవా వేదికగా మార్చింది. ఇంటర్నెట్ ఉన్న ఏ సాధారణ మొబైల్లోనైనా తక్షణం ఉపయోగించుకునే వీలు కలిగించింది. వాట్సాప్ ద్వారా ఏం చేయొచ్చు – కొత్తగా దరఖాస్తు, అవసరమైన పత్రాల అప్లోడ్ చేయడం, అప్లికేషన్ ఫీజు చెల్లించడం, అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం, పూర్తి వివరాలు, మార్గదర్శకాలు పొందడం, ఫిర్యాదులు, సూచనలు పంపడం వంటివి చేయొచ్చు. -
దక్షిణ ప్రాకారం తొలగింపు పనులు షురూ..
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ దక్షిణ ప్రాకారం తొలగింపు పనులు శనివారం కొనసాగించారు. ఆలయ దక్షిణ భాగంలోని పలు గృహాల యజమానులు ఏమేరకు రోడ్డును ఆక్రమించుకుంటారో చెప్పకుండా రోడ్డుపై పిల్లర్లు వేసేందుకు రిగ్ చేస్తున్నారంటూ అడ్డు చెప్పారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి హైడ్రారిగ్తో రోడ్డుపై పిల్లర్లు వేసేందుకు హోల్స్ చేయించారు. భారీ క్రేన్తో ప్రాకారం కూల్చివేత పనులు చేపట్టారు. నడిరోడ్డుపై పనులు జరుగుతున్న క్రమంలో జనసంచారం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. -
పొత్తూరు వరకు రోడ్డు నిర్మించాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని పొత్తూరు గ్రామస్తులు మానేరువాగు బ్రిడ్జిపై శనివారం ధర్నాకు దిగారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పొత్తూరు వరకు డబుల్ రోడ్డు కోసం రూ.77కోట్లు మంజూరు చేశారని ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయన్నారు. నిధులు లేవని గన్నేరువరం వరకే రోడ్డు వేస్తామనడం అన్యాయమన్నారు. సిద్ధం శ్రీనివాస్, అశ్విని శ్రీనివాస్, గుంటి ఆంజనేయులు, బండారి మహేశ్, రోడ్ల కరుణాకర్రెడ్డి, పట్నం మహేందర్, సతీశ్, తిరుమల్, అభి, సన్నీ పాల్గొన్నారు. రేపటి నుంచి మాస్టర్ప్లాన్ సర్వేసిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి మాస్టర్ప్లాన్లో భాగంగా క్షేత్రస్థాయిలో అమృత్ 2.0 సర్వే నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా తెలిపారు. 39 వార్డుల పరిధిలో ఈనెల 24 నుంచి 30 వరకు సిబ్బంది ఇంటింటా విచారణ చేపడతారని పేర్కొన్నారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చేసే సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక ముస్తాబాద్: మండలంలోని నామాపూర్ జెడ్పీ హైస్కూల్కు చెందిన హార్థిక రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పీడీ శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్లుల్లలో 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారన్నారు. ఉమ్మడి జిల్లాస్థాయిలో జరిగిన అండర్–17 పోటీల్లో హర్థిక ప్రతిభ కనబర్చిందన్నారు. యాదాద్రి భువనగిరిలో జరిగే పోటీలకు హర్థిక ఎంపికడంపై హెచ్ఎం సుధాకర్, టీచర్లు అభినందించారు. -
మహిళల సంక్షేమమే ధ్యేయం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్రుద్రంగి(వేములవాడ): మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగిలో ఇందిరా మహిళాశక్తి చీరలను పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి కోసమే మండల కేంద్రంలోని తాతమ్మగుడి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు భూమిపూజ చేసి, నిర్మించడం మరిచిపోయారన్నారు. రుద్రంగి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. రుద్రంగి ఏఎంసీ చైర్మచ్ చెలుకల తిరుపతి, మండల అధికారులు, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్రెడ్డి, తర్రె లింగం, నాయకులు పల్లి గంగాధర్, గండి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రక్తపరీక్షలు శాసీ్త్రయంగా చేయాలి
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సిరిసిల్ల/తంగళ్లపల్లి: రక్తపరీక్షలను శాసీ్త్రయంగా విశ్లేషించాలని, వ్యాధుల నిర్ధారణలో రక్తపరీక్షలే కీలకమని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్(టీడీ) కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. రక్తపరీక్షల రికార్డులు పరిశీలించారు. జిల్లాలోని ఆస్పత్రుల నుంచి వచ్చే శ్యాంపిళ్లను జాగ్రత్తగా నమోదు చేసి, నివేదికలు ఖచ్చితత్వంతో అందించాలని సూచించారు. అనంతరం తంగళ్లపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. చిన్నపిల్లల తల్లిదండ్రులకు వ్యాధి నిరోధక టీకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యాధికారి స్నేహ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): స్కూల్లో 20 మంది, అంగన్వాడీలో మరో 20 మంది పిల్లలు ఉన్నారని ఒకే టీచర్ సరిపోవడం లేదని, మరో టీచర్ను కేటాయించాలని మండలంలోని బోటుమీదిపల్లి గ్రామ మహిళలు కోరారు. ఈమేరకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు శనివారం వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రంలో చీరల పంపిణీకి హాజరైన ఎమ్మెల్యేను కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. స్కూల్కు ప్రహరీ కూడా మంజూరు చేయాలని కోరారు. గౌరవేణి రజిత, దీప, రేఖ, శారద, దేవకి, గొడుగు రవళి ఉన్నారు. గంభీరావుపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్మిల్లర్లు ఎప్పటికప్పుడు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్, గజసింగవరం, గోరింటాల, గంభీరావుపేట, లింగన్నపేట, ముస్తఫానగర్, ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేట, వెంకటాపూర్, పదిర, రాగట్లపల్లి, నారాయణపూర్, రాచర్లబొప్పాపూర్, తిమ్మాపూర్, కిషన్దాస్పేటల్లోని కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించారు. తహసీల్దార్లు మారుతిరెడ్డి, తహసీల్దార్ సుజాత తదితరులు ఉన్నారు. సిరిసిల్ల: బాల్యవివాహాలను అరికట్టాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. లక్ష్మీరాజం మాట్లాడుతూ చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తే అనేక అనర్థాలు వస్తాయన్నారు. కళాశాల యువత డ్రగ్స్ బారిన పడొద్దని కోరారు. డ్రగ్స్తో మెదడు మొద్దు బారడం, కండరాలు పనిచేయకుండా పోతాయన్నారు. బాల్య వివాహాలు జరుగుతుంటే చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098, మహిళా హెల్ప్లైన్ 181లో సమాచారం ఇవ్వాలని కోరారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ రోజా, టీమ్ మెంబర్ జనార్దన్, జెండర్ స్పెషలిస్ట్ దేవిక తదితరులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని జిల్లా సహకార అధికారి రామకృష్ణ అన్నారు. మండలంలోని రామన్నపల్లి, అంకుశాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించారు. రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి నిత్యం రెండు లారీల ధాన్యం మిల్లులకు తరలించాలని ఆదేశించారు. -
పల్లెపోరుకు తొలి అడుగు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పల్లె పోరుకు తొలి అడుగుగా రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైంది. పాత పద్ధతిలో రిజర్వేషన్ ఉండనుండగా బీసీల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ కీలకమైన జీవో ను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల కు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్ర కారం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొ టేషన్ పద్ధతిలో అమలు చేయనున్నారు. ఈ పద్ధతి ద్వారా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించింది. ఈ జీవోలో గిరిజన గ్రామాలకు సంబంధించి ఒక ప్రత్యేక నిబంధనను చేర్చింది. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు అన్నీ ఎస్టీలకే రిజర్వ్ చేయనున్నారు. సదరు ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం పూర్తికావడంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. – లోపలి పేజీలోసర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లుకరీంనగర్: 5,07,531, పెద్దపల్లి: 4,04,181 జగిత్యాల: 2,97,763, సిరిసిల్ల: 3,53,351పంచాయతీలు: 1,226, వార్డులు: 4,978 ఎంపీటీసీలు: 646, జెడ్పీటీసీలు: 60 -
వనితర సాధ్యం!
● అన్నింటా ‘రాణి’స్తున్నారు ● అతివల బహుముఖ బాధ్యతలు అతివలు.. అనితర సాధ్యులంటే అతిశయోక్తి కాదేమో.. క్రమశిక్షణతో కూడిన యూనిఫామ్ ఉద్యోగాలు చేస్తూ.. ఎప్పుడే నిమిషంలో పిలుపు వస్తుందో తెలియని ఒత్తిడితో కూడిన విధులు నిర్వహిస్తూనే తమ ఇంటి పురోగతికి, పిల్లల భవిష్యత్తుకు అదేస్థాయిలో శ్రమిస్తున్నారు. పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తూనే ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు.. బరువైన బాధ్యతలను అవలీలగా పోషిస్తూ అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పోలీసులు, వైద్యులు, కండక్టర్లు, లాయర్లుగా రాణిస్తున్న పలువురు మహిళలపై కథనం. రిస్క్ సక్సెస్తోనే రిలాక్స్కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): రిస్క్ సక్సెస్తో రిలాక్స్ అవుతానంటోంది ఏఎస్సై నీలిమ. కాల్వశ్రీరాంపూర్ పోలీస్స్టేషన్లో ఏఎస్సైగా పని చేస్తున్న ఆమె ఉద్యోగం, కుటుంబం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ విధులు నిర్వహిస్తున్నానని చెప్పారు. గొడవపడి స్టేషన్కు వచ్చే భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరినీ ఒక్కటి చేసినప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంటోంది. ట్రాన్స్పోర్టు(సరుకుల రవాణా)కు వెళ్లే భర్త, ఇద్దరు పిల్లలను స్కూల్కు తయారు చేయడం, వారికి లంచ్ బాక్స్ రెడీ చేసి విధులకు రావడంలో తల్లి, కుటుంబ సభ్యుల సహకారం ఉంటుదని తెలిపారు. -
ఆయన కూడా సహకరిస్తారు
రోజూ ఐదింటికే మొదలయ్యే దినచర్యలో భాగంగా ఇల్లు, వాకిలి శుభ్రం చేయడం, ఇద్దరు పిల్లల్ని స్కూల్కు తయారు చేయడం, వంటావార్పు, తర్వాత లంచ్ బాక్స్ రెడీ చేయడంతో ఒక దశ పూర్తవుతుంది. పది గంటలకల్లా కోర్టు విధులకు హాజరవుతాను. వివిధ రకాల సమస్యలతో కోర్టు మెట్లెక్కే బాధితులకు శాఖాపరమైన సూచనలు, సలహాలతో పాటు అవసరమైన అన్ని కర్తవ్యాలను నెరవేరుస్తాను. సాయంత్రం ఐదున్నరకు ఇంటికొచ్చాక మళ్లీ ఇంటి పనులతో బిజీ. దాంతో పాటు వృద్ధాప్యంలో ఉన్న అత్తగారి బాగోగులూ రోజువారీ చర్యలో భాగమే. ఇవన్నీ సమతూకం చేసుకునేందుకు సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటాను. ఇంటి పనుల్లో మా ఆయన కూడా సహకరించడం నాకు కలిసొచ్చే అంశం. – ఇ.జ్యోతి, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, సిరిసిల్ల -
డీపీవోలో ఉచిత కంటి వైద్యశిబిరం
సిరిసిల్ల క్రైం: జిల్లా పోలీస్ అధికారులు, కుటుంబ సభ్యుల కోసం శరత్ మ్యాక్స్ విజన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఎస్పీ మహేశ్ బి గీతే శనివారం ప్రారంభించారు. పోలీసులు ఆరోగ్య సంరక్షణపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వైద్యశిబిరంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు మొగిలి, శ్రీనివాస్, రవి, నాగేశ్వరరావు, మధుకర్, ఆర్ఐలు మధుకర్, రమేశ్, యాదగిరి పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు కొత్త సారథులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీసీసీ అధ్యక్షుల నియామకానికి కాంగ్రెస్ పార్టీ పచ్చజెండా ఊపింది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని 4 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు గాజెంగి నందయ్య, రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు సంగీతం శ్రీనివాస్ను నియమించారు. అలాగే కరీంనగర్ కార్పొరేషన్కు సీనియర్ నాయకుడు వైద్యుల అంజన్కుమార్ను నియమించారు. ఆయా జిల్లాల రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల సమతుల్యత, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏఐసీసీ వ్యూహాత్మక నిర్ణయంతో తుది ముద్ర వేసినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కరీంనగర్కు ఎస్సీ, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలతోపాటు కరీంనగర్ కార్పొరేషన్కు బీసీలను అధ్యక్షులుగా నియమించారు. దీంతో ఆయా జిల్లాల కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. అదే పంథాల్లో కరీంనగర్ సిటీ అధ్యక్షుడిగా అంజన్కుమార్ నియామకంతో నగర కాంగ్రెస్లో ఉత్సాహం నెలకొంది. అంజన్కుమార్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్లోనే కొనసాగారు. ఉమ్మడి జిల్లాలో డీసీసీ, నగర అధ్యక్షుల నియామకాల్లో పార్టీ విధేయతకు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. ఈ కొత్త నియామకాలతో కాంగ్రెస్ రాబోయే ఎన్నికలకు సమగ్రంగా సిద్ధమవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జిల్లా, నగర స్థాయిల్లో కొత్త సారథులు రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ శిబిరంలో ఓ కొత్త ఊపు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపినట్లయింది. పార్టీలో అంతర్గతంగా నెలకొన్న చిన్నచిన్న విభేదాలను సర్దుబాటు చేయడమే కాకుండా, భవిష్యత్ ఎన్నికల వైపు దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ పూర్తిగా సమాయత్తమవుతోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
నేతన్నల నైపుణ్యానికి ప్రతీక చీరలు
సిరిసిల్ల: నేతన్నల నైపుణ్యానికి ఇందిరా మహిళాశక్తి చీరలు ప్రతీక అని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో శనివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణ వసతిని కల్పించారని, ఇందిరమ్మ ఇండ్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరిట స్కూళ్లలో వసతులు కల్పించే పనులు మహిళలకు అప్పగించారన్నారు. ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ చీరలతో స్థానికంగా ఉన్న 130 మ్యాక్స్ సొసైటీలకు, 6 వేల మంది కార్మికులకు ఉపాధి లభించిందని పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కె.కె.మహేందర్రెడ్డి, గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్పర్సన్లు వెల్ముల స్వరూపారెడ్డి, విజయ, సాబేరబేగం, రాణి, ఏఎంసీ చైర్మన్ రాములునాయక్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్బేగం పాల్గొన్నారు. -
యువశక్తి..పఠనాసక్తి
సిరిసిల్లటౌన్: డిజిటల్ యుగంలో సోషల్మీడియా ప్రభావం చూపుతున్న కాలంలోనూ సిరిసిల్ల యువత పుస్తకాల పురుగులుగా మారిపోయారు. జ్ఞాన సముపార్జనకు జిల్లా గ్రంథాలయంలో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. నిత్యం వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు జిల్లా గ్రంథాలయంలో పోటీపరీక్షల పుస్తకాలు చదువుతూ కొలువులు సాధిస్తున్నారు. ఎక్కువగా పేదలు ఉండే కార్మికక్షేత్రం సిరిసిల్లలో ప్రభుత్వం ఉచితంగా విజ్ఞానాన్ని అందించేందుకు జిల్లా గ్రంథాలయాన్ని నిర్వహిస్తోంది. ఇందులోని పుస్తకాలను సద్వినియోగం చేసుకుంటూ పలువురు ఉద్యోగాలు సాధించారు. ఆశయ సాధనకు పఠనాసక్తిని కనబరస్తున్న యువతరంపై ప్రత్యేక కథనం. 40 వేల పుస్తకాలు సిరిసిల్లలోని జిల్లా గ్రంథాలయంలో దాదాపు 40వేల పుస్తకాలున్నాయి. నిత్యం 200 మందికి పైగా అన్ని వయస్సుల వారు వస్తుంటారు. బుక్స్ సెక్షన్, రీడింగ్ సెక్షన్, డైలీ పేపర్స్ రీడింగ్ సెక్షన్లు రద్దీగా కనిపిస్తుంటాయి. నీట్, డీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, పోలీస్, గ్రూప్స్, సివిల్స్, యూపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఎన్డీఏ పోటీపరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. చితంగా వైఫై సౌకర్యం ఉంది. ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పోటీపరీక్షల పుస్తకాలు కావాలంటే పాఠకుల కోరిక మేరకు వెంటనే పాలకవర్గం తెప్పిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మెరుగైన వసతులు ● పోటీపరీక్షలకు సన్నద్దమయ్యే బీఎస్ఆర్బీ, టీఎస్పీఎస్సీ, ఆర్మీ, రైల్వే రిక్రూట్మెంట్లు, గ్రూపు–1, గ్రూపు–2, గ్రూపు–3, గ్రూపు–4, ఇతర పోటీ పరీక్షల పుస్తకాలు ఉన్నయి. ● నవలలు, వీక్లీ మ్యాగజైన్స్తోపాటు ఇతర పుస్తకాలు ఉన్నాయి. ● కరెంటు అఫైర్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని సమస్యలు ● పాఠకుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్ లేవు. ● సెలవు రోజుల్లో లైబ్రరీ మూసివేసి ఉంటుంది. ● గ్రంథాలయం తెరిచి ఉంచే సమయాన్ని కొంచెం పెంచాలని పాఠకులు కోరుతున్నారు. ● శుక్రవారం కూడా బుక్స్ సెక్షన్లో పుస్తకాలు తీసుకుని చదువుకునే అవకాశం కల్పించాలనే కోరుతున్నారు. -
మానీటి పాలు!
ఆరుగాలం శ్రమ..వేములవాడఅర్బన్: వారంతా మిడ్మానేరు నిర్వాసితులు. మిగిలిన భూముల్లో పంటలు సాగుచేసుకొని బతుకుతుంటే బ్యాక్వాటర్ లెవల్ పెరిగి ఆ పంటలు సైతం నీటిలోనే మునిగిపోయాయి. ఆరుగాలం పడ్డ శ్రమంతా నీటిలోనే మునిగిపోవడంతో ఆ రైతుల వేదన అంతా.. ఇంతా కాదు. పంట చేతికొచ్చిందన్న ఆనందం అంతలోనే నీటిమునిగి పోయింది. ఆ పంటను కోసేందుకు ఖర్చు తడిసిమోపెడవుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిడ్మానేరు బ్యాక్వాటర్లో మునిగిన పంటలు.. రైతులు పడుతున్న తిప్పలుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు. మిడ్మానేరు సామర్థ్యం 27.55 టీఎంసీలు బోయినపల్లి మండల పరిధిలో నిర్మించిన మిడ్మానేరు ప్రాజెక్టు సామర్థ్యం 27.55 టీఎంసీలు. ఈ ప్రాజెక్టులో బోయినపల్లి మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు వేములవాడ మండలం సంకెపల్లి, ఆరెపల్లి, అనుపురం గ్రా మాలు ముంపునకు గురయ్యాయి. మిడ్మానేరు ప్రాజెక్ట్ పూర్తిగా నిండితే ఈ మూడు గ్రా మాల శివారు వరకు బ్యాక్వాటర్ చేరుతుంది. నీటి మునిగిన పంటలు మిడ్మానేరు ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ను ఆనుకుని ఉన్న గ్రామాలు నాంపల్లి శివారు కొంత భాగం, సంకెపల్లి, ఆరెపల్లి, అనుపురం గ్రామాల రైతులు తమ పట్టా భూముల్లో వరి, పత్తి వేసుకుంటున్నారు. ఈసారి వర్షాలు ఎక్కువగా కురువడంతో బ్యాక్వాటర్ స్థాయి పెరిగి వరి, పత్తి చేన్లు మునిగిపోయాయి. కోతకు వచ్చిన వరిని కోయడం ఇబ్బందిగా మారింది. పంట పొలాల్లో నీరు చేరడంతో పత్తి ఏరేందుకు కూలీలు రావడం లేదు. వరి కోసేందుకు హార్వెస్టర్లు రాకపోవడంతో కూలీలను పెట్టి కోయిస్తున్నారు. ఇలా కోసిన వరిపంటను థర్మాకోల్ తెప్పల సహాయంతో ఒడ్డుకు తీసుకొస్తున్నారు. ఇలా తెచ్చిన పంటను మళ్లీ హార్వెస్టర్తో పట్టిస్తే వడ్లు వస్తాయి. పెట్టుబడి రాదు వరిపంట వేయడానికి ఎకరానికి రూ.25వేలు పెట్టుబడి కాగా.. ఇప్పుడు నీటిలో మునిగిన పంటను కోసి, ఒడ్డుకు తీసుకొచ్చేందుకు రూ.25వేలు కూలీలకు ఇస్తున్నారు. ఇలా ఒడ్డుకు తెచ్చిన వరిపంటను మళ్లీ హార్వెస్టర్లో వేస్తేనే వడ్లు వస్తాయి. ఇదంతా ఆర్థికంగా భారమే అయినప్పటికీ రెక్కలకష్టాన్ని నీళ్లల్లో వదిలేయలేక కోపిస్తున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించి భవిష్యత్లో బ్యాక్వాటర్ ఇలా పంటలను ముంచకుండా చూడాలని కోరుతున్నారు.గ్రామం విస్తీర్ణం నాంపల్లి 15 ఎకరాలు సంకెపల్లి 25 ఎకరాలు ఆరెపల్లి 15 ఎకరాలు అనుపురం 20 ఎకరాలు -
రాజన్న సిరిసిల్ల
శనివారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 20259వేములవాడ: పోలి పాడ్యమిని పురస్కరించుకుని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామి ఆలయంలో దీపోత్సవం నిర్వహించారు.జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటుంది. స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.వేములవాడ: ధర్మగుండంలోకి భక్తులను అనుమతించకపోవడంతో పార్వతీపురం వసతిగదుల పక్కన నల్లాల వద్ద స్నానాలు చేసి, దర్శనానికి వెళ్తున్నారు. -
అడిగిన బుక్స్ తెప్పిస్తున్నారు
జిల్లా గ్రంథాలయానికి 2023 నుంచి వచ్చి చదువుకుంటున్నాను. ఏఈఈ పోస్టుల పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న. ఏమైనా పుస్తకాలు, మెటీరియల్ కావాలని కోరితే మేనేజ్మెంట్ వెంటనే తెప్పిస్తున్నారు. అన్ని విభాగాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ ల్రైబ్రరీగా మార్చితే బాగుంటుంది. – యేశ శ్రీనివాస్, సిరిసిల్ల నేను మొదటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. ఇప్పటికీ నా స్మార్ట్ఫోన్లో వాట్సాప్ వినియోగించను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా లక్ష్యం. ఉద్యోగం సాధించాకే మొదటి వాట్సాప్ స్టేటస్ను పెట్టుకుంటాను. ఏడాదిలో అన్ని రోజులూ లైబ్రరీని అందుబాటులో ఉంచితే బాగుంటుంది. – బొడ్డు రమ్యకృష్ణ, సిరిసిల్ల -
మహిళల ఆర్థిక ఉన్నతితో ప్రగతి
వేములవాడరూరల్/వేములవాడఅర్బన్/చందుర్తి: మహిళల ఆర్థిక ఉన్నతితో రాష్ట్ర ప్రగతి సాధ్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం, చందుర్తి మండలం మల్యాల గ్రామాల్లో ఇందిరా మహిళాశక్తి చీరలను శుక్రవారం పంపిణీ చేశారు. ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 1.45లక్షల మహిళలకు చీరలు అందజేస్తున్నామన్నారు. మధ్యమానేరు ముంపు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, డీఆర్డీవో శేషాద్రి, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, ఏఎంసీ డైరెక్టర్ పాలకుర్తి పర్శరాములు, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశ్ పాల్గొన్నారు. -
పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్
● ఎస్పీ మహేశ్ బీ గీతే తంగళ్లపల్లి(సిరిసిల్ల): విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా తంగళ్లపల్లి ఠాణాను శుక్రవారం తనిఖీ చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ ప్రజలకు చేరువ కావాలన్నారు. రౌడీషీటర్లు, ిహిస్టరీ షీటర్లపై నిఘా పెట్టాలన్నారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఎస్సై ఉపేంద్రచారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. రిజర్వేషన్లపై కసరత్తుసిరిసిల్ల: గ్రామపంచాయతీ పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాస్థాయిలో సన్నాహాలు మొదలయ్యాయి. గ్రామపంచాయతీల రిజర్వేషన్లు ఖరారుకు అధికారులు కసరత్తు చే స్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, జెడ్పీ సీఈవో వినోద్, డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీ ఫొద్దీన్ కలెక్టరేట్లో సమీక్షించారు. గతంలో ప్రకటించిన రిజర్వేషన్లలో కొద్దిపాటి మార్పులతో ఖరారు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో పెద్దగా మార్పులు ఉండబో వని, బీసీ స్థానాలు జనరల్గా మారే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రిజర్వేషన్లు తుది రూపానికి వచ్చాక కలెక్టర్ ఆమోదంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఈమేరకు కలెక్టరేట్లో శుక్రవారం రా త్రి వరకు అధికారులు శ్రమించడం విశేషం. -
వేములవాడ ఏఎస్పీగా రుత్విక్సాయి
● శేషాద్రినిరెడ్డి జగిత్యాలకు బదిలీ వేములవాడ: వేములవాడ ఏఎస్పీగా రుత్విక్సాయి కొట్టెను ప్రభుత్వం నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది గ్రేహౌండ్స్లో విధులు నిర్వహిస్తున్న రుత్విక్సాయికి వేములవాడ ఎస్డీపీవోగా పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ ఎస్డీపీవోగా విధులు నిర్వహించిన ఏఎస్పీ శేషాద్రిరెడ్డిని జగిత్యాలకు బదిలీ చేశారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మూడేళ్లుగా గుడిని నిర్మించుకోలేక నిద్రపోతున్నారా? తొందరగా నిర్మించుకోవాలని, నిధులను స్వతహాగా తలా ఇంత పోగుచేసుకోవాలని హంపి పీఠాధిపతి విద్యారణ్యభారతీస్వామి సూచించారు. గుడి నిర్మాణం కోసం ఆలయ కమిటీ ముందుండాలని హితవు పలికారు. ఎల్లారెడ్డిపేటలోని వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మిస్తున్న సందర్భంగా హంపి పీఠాధిపతిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. స్వామి వారు విచ్చేసి ఆలయ పరిసరాలు పరిశీలించిన సందర్భంగా పై విధంగా స్పందించారు. గుడినిర్మాణానికి పాతరాయిని వాడుకోవచ్చని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. ఆలయ కమిటీ చైర్మన్ గుండం సుధాకర్రెడ్డి, అర్చకులు నవీన్చారి ఉన్నారు. కోనరావుపేట(వేములవాడ): మీసేవ కేంద్రాల్లో సర్వర్లు పనిచేయకపోవడంతో వినియోగదారులు సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజులుగా జిల్లాలోని అన్ని మీసేవ కేంద్రాల్లోని సీడీఎంఏ సర్వర్ పనిచేయడం లేదు. ఈనెల 18 నుంచి కొన్ని రకాల సేవలు అందడం లేదు. పుట్టిన తేదీ సర్టిఫెకెట్లు, మరణ ధ్రువీకరణపత్రాలు జారీకావడం లేదు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. చందుర్తి(వేములవాడ): హైకోర్టు ఆదేశాలతో చందుర్తి సింగిల్విండో పాలకవర్గం శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా స హకార సంఘాల పదవీకాలం పొడగిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. చందుర్తి సింగిల్విండో పాలకవర్గాన్ని రద్దు చేసి ప్రత్యేకాధికారిని నియమించింది. పాలకవర్గాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో సింగిల్విండో అధ్యక్షుడు తిప్పని శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పుల్కం మోహన్, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. సీఈవో శ్రీవర్ధన్ ఉన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వంతడుపుల అనుబంధ గ్రామం గుండ్లపల్లిలో ఎలుగుబంటి సంచరిస్తుందన్న రైతుల సమాచారంతో జిల్లా ఫారెస్ట్ అధికారులు శుక్రవారం పరిసరాలు పరిశీలించారు. మండలంలో వా రం రోజులుగా గాలిపెల్లి, వడ్లూరు పారువెల్ల సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తోందని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. ఈమేరకు ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటి ఆచూకీ కోసం రైతులతో కలిసి గాలింపు చేపట్టారు. నాణ్యమైన విత్తనాలు అందించాలిసిరిసిల్లఅర్బన్: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేలా చూడాలని జిల్లా వ్యవసాయాధి కారి అఫ్జల్బేగం కోరారు. చంద్రంపేట రైతువేదికలో రైతువిజ్ఞాన కేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో నూతన విత్తన బిల్లు–2025 ముసాయిదాపై శుక్రవారం చర్చాగోష్టి నిర్వహించారు. రైతువిజ్ఞన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె.మదన్మోహన్రెడ్డి విత్తనబిల్లు గురించి గురించి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. శాస్త్రవేత్త జి.ఉషారాణి, సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ నవీన్రెడ్డి, సునీల్ తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజితసిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు(డెలివరీలు) జరిగేలా ప్రోత్సహించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో గురువారం పీహెచ్సీ డాక్టర్లతో సమావేశమయ్యారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ కేంద్రం నిర్ధేశించిన ఆరోగ్య పథకాలను సమర్థంగా అమలు చేయాలన్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్ చేయాలని, వైద్యాధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు అంజలి, సంపత్కుమార్, రామకృష్ణ, అనిత, నయిమా జహా పాల్గొన్నారు. గురుకులం తనిఖీ తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత గురువారం తంగళ్లపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ప్రోగ్రాం అధికారి సంపత్, సీహెచ్వో బాలచంద్రం, ఏఎన్ఎం జ్యోతి పాల్గొన్నారు. -
ధర్మయుద్ధం గెలిచాం
సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై బీజేపీ చేపట్టిన ధర్మయుద్ధం గెలిచిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్పై అక్రమంగా పెట్టిన పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టివేయడంతో గురువారం పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. అంబేడ్కర్ చౌరస్తాలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ అధర్మంగా బీజేపీ నాయకులపై పెట్టించిన కేసులు ధర్మయుద్ధంతో గెలుస్తామన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంతర్గత విభేదాలపై డీఈవో ఆరా!సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సిబ్బంది మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను చక్కదిద్దేందుకు ఆ శాఖ ఉన్నతాధికారి చర్యలుకు ఉపక్రమించినట్లు తెలిసింది. జిల్లా స్థాయి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మధ్య సయోధ్య లేకపోవడంపై సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. డీఈవో కార్యాలయంలో గురువారం పరిస్థితులు సాధారణంగానే ఉన్నప్పటికీ.. ‘మనమే సమయానికి వచ్చి, పని చేసుకుని వెళ్లాలి. అనవసర చర్చలు, విభేదాలు అవసరం లేదు’ అన్న భావన కనిపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిబ్బంది మధ్య సమన్వయం కోసం అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. -
ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం చేసిండ్రు
● ఎన్నికల హామీని విస్మరించారు ● సిరిసిల్లలో కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంసిరిసిల్ల: రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల బతుకులను ఆగం చేసిండ్రని, ఉపాధి లేక రోడ్డున పడ్డారని ఆటోడ్రైవర్ల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు బొల్లి రామ్మోహన్ పేర్కొన్నారు. జిల్లాలోని ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు సొంత ఖర్చులతో బీమా చేయిస్తానని హామీ ఇవ్వడంపై ఆటో డ్రైవర్లు నేతన్నచౌక్లో కేటీఆర్ చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు. రామ్మోహన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఏటా రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, రెండేళ్లుగా ఒక్కో ఆటో డ్రైవర్కు ప్రభుత్వం రూ.24వేలు బాకీ పడిందన్నారు. ఉచిత బస్ పుణ్యమా అని ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ఆటోడ్రైవర్ల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు అల్లె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పిల్లి నాగరాజు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


