Rajanna Sircilla District News
-
నేతకార్మికులు కావలెను
సిరిసిల్ల: వస్త్రోత్పత్తికి నైపుణ్యం గల నేతకార్మికుల కొరత వేధిస్తోంది. తరచూ వస్త్రవ్యాపారంలో సంక్షోభం తలెత్తుతుండడంతో వస్త్రోత్పత్తి నిలిచిపోతుంది. దీంతో కార్మికులకు పని దొరక్క ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలోనే చాలా మంది నైపుణ్యం గల కార్మికులు ఇతర రంగాల వైపు మళ్లిపోయారు. ఒకప్పుడు పుష్కలమైన ఉపాధి దొరకడంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు చెందిన నేతకార్మికులు ఇక్కడికి వలస వచ్చారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు లేక.. వచ్చినా నూలు అందుబాటులో లేక తరచూ సాంచాలు బంద్ పడుతుండడంతో సరిగ్గా పనిలేక స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానిక నేతకార్మికులు సైతం నమ్మకం లేని వస్త్రోత్పత్తిపై ఆధారపడకుండా కొందరు ఆటోలు కొనుక్కోగా.. మరికొందరు ఊరూరా తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నారు. ఇలా వస్త్రోత్పత్తి రంగానికి ఒక్కొక్కరుగా దూరమయ్యారు. ఉత్తరాది కార్మికులపైనే ఆధారం స్థానికంగా నైపుణ్యం గల నేతకార్మికుల కొరత ఏర్పడడంతో కొందరు ఆసాములు బిహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి కార్మికులను తెప్పిస్తున్నారు. భీవండీ, ముంబయి వంటి పట్టణాల్లో పవర్లూమ్స్ నడిపిన అనుభవం ఉన్న ఉత్తరాది కార్మికులను సిరిసిల్లకు రప్పిస్తున్నారు. అయినా వస్త్రపరిశ్రమ అవసరాల మేరకు ఉత్తరాధి కార్మికులు పూర్తి స్థాయిలో రావడం లేదు. మహిళాశక్తి చీరల ఉత్పత్తికి విఘాతం రాష్ట్రంలోని మహిళలకు ఏటా రెండు చీరలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందించింది. ప్రస్తుతం రెండు విడతల్లో 4.24 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లను 130 మ్యాక్స్ సంఘాలకు అందించారు. ఒక్కో మీటరుకు రూ.34 ప్రభుత్వం చెల్లిస్తుండగా.. బట్టను నేసే కార్మికుడికి రూ.5.25 చొప్పున చెల్లించాలని ఒప్పందం చేశారు. సొంతంగా వస్త్రోత్పత్తి చేయలేని మ్యాక్స్ సంఘాలకు ప్రభుత్వమే నూలు డిపో ద్వారా యారన్(నూలు)ను సరఫరా చేస్తుంది. దీంతో వస్త్రోత్పత్తిదారులపై నూలు కొనుగోలు భారం తప్పింది. ఆగస్టు 15వ తేదీలోగా రాష్ట్రంలోని సుమారు 66 లక్షల మంది మహిళలకు ఒక్కో చీరను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. పని నిదానంగా సాగుతోంది. సిరిసిల్లలో డాబీ, జకార్డ్ పరికరాలను అమర్చిన సాంచాలు 17 వేల వరకు ఉండగా.. ప్రస్తుతం 4,230 సాంచాలపై మహిళాశక్తి చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. రోజుకు 1.25లక్షల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 32వేల మీటర్లు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అనేక మంది ఆసాములకు సాంచాలు ఉన్నా.. బట్ట నేసేందుకు కార్మికులు లేక ఖాళీగా ఉంటున్నాయి. కార్మికుల కొరతతో పొద్దాంత మాత్రమే వస్త్రోత్పత్తి సాగుతుంది. రాత్రి వేళల్లో సాంచాలు బంద్ ఉంటున్నాయి. సిరిసిల్లలో పవర్లూమ్ వర్కర్ల కొరత ఇతర పనుల్లో స్థిరపడిన నేతకార్మికులు ఉత్తరాది రాష్ట్రాల కార్మికులతో వస్త్రోత్పత్తి మహిళాశక్తి చీరల ఆర్డర్లు.. దొరకని కార్మికులువిచిత్ర పరిస్థితి పనులు లేక నేతకార్మికులు రోడ్డున పడే పరిస్థితులు ఒకప్పుడు ఉండగా.. ఇప్పుడు కార్మికులు లేక సాంచాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా యువకులు ఈ పని చేసేందుకు ముందుకు రావడం లేదు. పొరుగు రాష్ట్రాల కార్మికులను తెచ్చుకునే పరిస్థితులు రావడంతో వారు గంటల తరబడి రెస్ట్ లేకుండా పని చేయడంతో వారితో స్థానిక కార్మికులు పోటీ పడలేక, వస్త్రోత్పత్తి పనికి దూరమవుతున్నారు. కార్మికులు దొరకడం లేదు ఇతను చందా రాజమౌళి. గణేశ్నగర్కు చెందిన రాజమౌళి వద్ద 48 సాంచాలు ఉన్నాయి. కానీ పవర్లూమ్ వర్కర్లు లేక రాజమౌళితోపాటు మరొకరు మాత్రమే మహిళాశక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తున్నారు. ఇంకా ఏడుగురు నేతకార్మికులు అవసరం. కానీ నైపుణ్యం గల కార్మికులు దొరక్క సాంచాలు నడవడం లేదు. ఇలాంటి పరిస్థితి సర్ధార్నగర్కు చెందిన వస్త్రోత్పత్తిదారులు మండల సత్యం, బూట్ల సతీశ్కుమార్లు నేతకార్మికుల కోసం నిరీక్షిస్తున్నారు. ఇతను బిహార్ రాష్ట్రం మధుబని జిల్లా పూర్సోలియాకు చెందిన జమీర్. స్థానికంగా ఓ కార్ఖానాలో పనిచేస్తున్నాడు. నిత్యం 12 గంటలపాటు పనిచేస్తూ పాలిస్టర్ బట్టను ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.14వేలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మహిళా శక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.26వేలు సంపాదిస్తున్నాడు. జమీర్ లాగే ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్లకు చెందిన 200 మంది కార్మికులు సిరిసిల్లలో పనిచేస్తున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు వచ్చాయి. బట్ట నేసేందుకు కార్మికులు లేరు. చాలా మంది ఆసాములు, వస్త్రోత్పత్తిదారులు కార్మికుల కోసం వెతుకుతున్నారు. మా కార్ఖానాలోనే నలుగురు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్క పూటనే పనిచేయిస్తూ.. సాంచాలు బందుపెట్టుకుంటున్నారు. పొరుగు జిల్లాలకు వెళ్లిపోయిన వారు తిరిగి రావడం లేదు. కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. – ఆడెపు భాస్కర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు, సిరిసిల్ల -
నేడు జాతీయ లోక్అదాలత్
సిరిసిల్లకల్చరల్: పెండింగ్ కేసుల పరిష్కారం కోసం శనివారం మెగా జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోదగిన కేసులను అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని న్యాయవాదులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. రుద్రంగిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, కనికరపు రాకేశ్, మండల విద్యాధికారి బన్నాజీ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన సేవలందించాలి ● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంగంభీరావుపేట(సిరిసిల్ల): అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పౌష్టికాహారంతోపాటు ఆట పాటలతో కూడిన విద్యనందించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. మండలంలోని లింగన్నపేట ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపం నివారించేందుకు సరైన పౌష్టికాహారం అందించాలన్నారు. డీహబ్ కో–ఆర్డినేటర్ రోజా, డీసీపీయూ ప్రొటెక్షన్ అధికారి శ్రీనివాస్, టీచర్లు గీతబాల, వనజ, రజని, ఉమారాణి, సునీత పాల్గొన్నారు. మహిళలు పరీక్షలు చేయించుకోవాలి ● జిల్లా వైద్యాధికారి రజిత సిరిసిల్ల: జిల్లాలో స్వశక్తి సంఘాల మహిళలు, మున్సిపల్లో పనిచేసే మహిళా సిబ్బంది విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత కోరారు. సుందరయ్యనగర్, అంబేడ్కర్నగర్, వేములవాడలోని ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా స్క్రీనింగ్ హెల్త్క్యాంప్లను నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, దీర్ఘకాల వ్యాధుల(మధుమేహం, రక్తపోటు) పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, డీపీవో రాజేందర్, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఉద్యోగులకు గుండె వైద్యశిబిరంసిరిసిల్లటౌన్: మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు, సిబ్బందికి శుక్రవారం ఉచిత గుండె వైద్యశిబిరం నిర్వహించారు. స్థానిక సినారె కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఇన్చార్జి కమిషనర్ పోసు వాణి ప్రారంభించారు. కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో 220 మంది ఉద్యోగులు, కార్మికులకు ఉచితంగా టూడీ ఈకో, షుగర్, బీపీ పరీక్షలు చేశారు. ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ ఆరోగ్యంగా జీవించడానికి వైద్యుల సలహాలు పాటించాలన్నారు. మున్సిపల్ ఈఈ రఘు, మెప్మా కోఆర్డినేటర్ మహాలక్ష్మి, ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
డేంజర్ యూ టర్న్
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం స్టేజీ వద్ద సిరిసిల్ల–వేములవాడ ప్రధాన రహదారిపై యూటర్న్ డేంజర్గా ఉంది. అంజన్న ఆలయం ఎదుట డివైడర్ నుంచి వాహనాలు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్రహారం స్టేజీ వద్ద.. హనుమన్ ఆలయం, కరీంనగర్ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రం, రోడ్డు అటు వైపు పాలిటెక్నిక్, డీగ్రీ, జేఎన్టీయూ కళాశాలలు ఉండడంతో ఎప్పుడూ ఇక్కడ విద్యార్థులతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న యూటర్న్ను మూసివేసి కొంచెం దూరంలో ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
గాలిపల్లి బడి.. ఘన చరిత్ర
● మహామహులను అందించిన పాఠశాల ● పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి చదివింది ఇక్కడే.. ● విద్యావేత్తలుగా ఎదిగిన విద్యార్థులు ఎందరో..ఇల్లంతకుంట(మానకొండూర్): గాలిపల్లి పెద్దబడికి ఘనమైన చరిత్ర ఉంది. పోరాట యోధులను అందించిన పాఠశాల ఇది. విద్యావేత్తలను తీర్చిదిద్దిన సరస్వతీ నిలయం. 1964 వరకు 8వ గ్రేడ్ వరకు ఉన్న పాఠశాలను 1964 తర్వాత హెచ్ఎస్సీకి అప్గ్రేడ్ చేశారు. ఒకప్పుడు సిరిసిల్ల తాలూకాలో గంభీరావుపేట, సిరిసిల్ల, గాలిపల్లి గ్రామాల్లోనే హయ్యర్ సెకండరీ స్కూళ్లు ఉండేవి. గాలిపల్లి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు ఇక్కడికే వచ్చి చదువుకునేవారు. కమ్యూనిస్ట్ నాయకుడు బద్దం ఎల్లారెడ్డి, ఆయన కొడుకులు బద్దం రామ్రెడ్డి, బద్దం లక్ష్మారెడ్డి ఇక్కడే ప్రాథమిక విద్య వరకు చదువుకున్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులెందరో విద్యావేత్తలుగా.. ప్రభుత్వ అధికారులుగా ఎదిగారు. గాలిపల్లి హైస్కూల్ ఘన చరిత్ర తెలుసుకుందాం.. కమ్యూనిస్టు లీడర్.. బద్దం ఎల్లారెడ్డి కమ్యూనిస్టు నాయకుడు బద్దం ఎల్లారెడ్డి గాలిపల్లి స్కూల్లోనే ఓనమాలు దిద్దారు. ప్రాథమిక స్థాయి వరకు ఇక్కడే చదువుకున్నారు. అనంతరం కరీంనగర్, హైదరాబాద్లలో చదువుకున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. నిజాం, రజాకార్ల అరాచకాలకు ఎదురెడ్డి పోరాటం చేశారు. డీఎస్పీ.. వెంకటరెడ్డి గాలిపల్లి హైస్కూల్లో 6వ తరగతి వరకు చదువుకున్న వెంకటరెడ్డి డీఎస్పీగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మండలంలోని అల్లిపురం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి ఇల్లంతకుంటలోని తన బావ ఇంటి నుంచి నిత్యం 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవారిమని గుర్తు చేసుకున్నారు. తాను చదువుకున్న రోజుల్లో తరగతిలో 25 మంది విద్యార్థులం ఉండేవారని వెంకటరెడ్డి తెలిపారు. గురువులు చక్కగా పాఠాలు బోధించేవారన్నారు. హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తూ 2005లో ఉద్యోగ విరమణ పొందారు. ప్రిన్సిపాల్.. నారాయణరెడ్డి మండలంలోని వంతడుపులకు చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి ఇదే బడిలో 9వ తరగతి వరకు చదువుకున్నారు. తమ తరగతిలో 30 మంది విద్యార్థులు ఉండేవారని తెలిపారు. వంతడుపుల నుంచి గాలిపల్లికి రావాలంటే మధ్యలో వాగు ఉండేదని.. వర్షాకాలంలో వాగు దాటేందుకు నానా కష్టాలు పడ్డామని గుర్తు చేసుకున్నారు. వాగు దాటరాని రోజు బడికి సెలవు ప్రకటించేవారని తెలిపారు. బెజ్జంకి జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. నారాయణరెడ్డి సోదరుడు సింగిరెడ్డి ఆనందరెడ్డి ఇక్కడే చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ పొందారు. -
పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు
వేములవాడఅర్బన్: కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్లోని గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు పరిశీలించి, అర్హులకు 50 జతల కోడెలు శుక్రవారం పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 750 కోడెలను రైతులకు అందజేసినట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధా కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
రోడ్డు విస్తరణ నిర్వాసితులకు పరిహారం
● వేములవాడలో 40 మందికి చెక్కులు అందజేత వేములవాడ: పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాభాయి శుక్రవారం పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు చేపట్టే రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న 40 మంది నిర్వాసితులకు శుక్రవారం కలెక్టరేట్లో చెక్కులు పంపిణీ చేశారు. రోడ్డు విస్తరణలో 343 మంది భూములు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారులు దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు అంటించారు. -
రైలు రగడ!
● తిరుపతి ప్రత్యేక రైలుపై రాజకీయ దుమారం ● వానాకాలంలో ఏసీ కోచ్లతో తిరుపతికి రైలు ● కానరాని జనరల్, స్లీపర్ కోచ్లు ● అధికస్టాపులు, ప్రయాణ సమయంపై ప్రయాణికుల పెదవి విరుపు ● వర్షాకాలంలో ఏసీ రైలుకు ఆదరణ ఉండేనా?సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తాజాగా దక్షిణ మధ్య రైల్వే తిరుపతి– కరీంనగర్ మార్గంలో వేసిన ప్రత్యేక రైలు 012761, 012762 ప్రారంభానికి ముందే రాజకీయ రంగు పులుముకుంది. ఈ ప్రత్యేక రైలు తమ వల్ల వచ్చిందని బీజేపీ, కాదు తామే తెచ్చామని కాంగ్రెస్ పార్టీలు ఘనతను చాటుకుంటున్నాయి. ఈ విషయంలో ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్గాల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. ఈ రైలు విషయంలో రాజకీయాలు కాసేపు పక్కనబెడితే సదుపాయాలపై ప్రయాణికులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ రైలు జూలైలో ప్రతీ ఆదివారం రాత్రి 7.45 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి.. సోమవారం ఉదయం 10గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కరీంనగర్లో బయల్దేరి, మంగళవారం ఉదయం 8.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జూలైలో తిరుపతి భక్తుల కోసం మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల అసంతృప్తి ఈ ప్రత్యేక వీక్లీ హంసఫర్ 02761/62 ఏసీ రైలుకు 16 స్టాపులు ఉన్నాయి. ఈ ప్రత్యేక రైలులో కేవలం 3వ శ్రేణి శీతల బోగీలే. స్లీపర్, జనరల్ బోగీలు లేవు. జూలైలో జోరుగా వానలు కురుస్తాయి. వర్షాకాలంలో థర్డ్ ఏసీ ప్రయాణానికి తక్కువగా మొగ్గు చూపుతారు. పైగా రిజర్వేషన్ చార్జీలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతికి నడుస్తోన్న రెగ్యులర్ బై వీక్లీ 12762/61 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు కేవలం 12స్టాప్లే. ఇందులో 3వ శ్రేణి, 2 వ శ్రేణి ఏసీ బోగీలతో పాటు, సాధారణ బోగీలు, స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయి. బైవీక్లీ రైలు కన్నా హంసఫర్ రైలు ప్రయాణం దాదాపు 3 గంటలు అధికంగా ఉండటం గమనార్హం. 02762 ఏసీ ప్రత్యేక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో తృతీయ శ్రేణి శీతల టిక్కెట్ ధర రూ.1355. కరీంనగర్ నుంచి తిరుపతి రెగ్యులర్ బై వీక్లీ 12762 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో తృతీయ శ్రేణి శీతల టిక్కెట్ ధర రూ.1100. రెండింటి మధ్య వ్యత్యాసం రూ.255. ఏదైనా రెగ్యులర్ రైలు వెనుక నుంచి వస్తుంది అంటే ప్రత్యేక రైళ్లను ఒక చోట ఆపి వాటిని పంపిస్తారు. ప్రత్యేక రైళ్లు సమయ పాలన పాటించడం అరుదనే చెప్పాలి. విఫల ప్రయోగంగా జూలైలో ఏసీ రైలు వేయడం అందులోనూ మొత్తం బోగీలు థర్డ్ ఏసీ వేయడంపై పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఏళ్లుగా తిరుపతి రైలును రెగ్యులర్ చేయమంటే.. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికుల సంఖ్య లేదని సమాధానమిస్తున్నారు. తీరా వర్షాకలంలో ఏసీ రైలు వేయడం, జనరల్ స్లీపర్ లేకుండా థర్డ్ ఏసీ వేయడంతో ఆక్యుపెన్సీ రేషియో భారీగా పడిపోతుందని, దీన్ని సాకుగా చూపి భవిష్యత్తులో తిరుపతి రైలును రెగ్యులర్గా చూపించరేమోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాజన్న ఆలయ ఈవోగా రాధాభాయి
● ఆలయంలో పూజలు.. బాధ్యతల స్వీకరణ వేములవాడ: రాజన్న ఆలయ ఈవోగా ఆర్డీవో రాధాభాయిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. ఇక్కడ పనిచేస్తున్న ఈవో కొప్పుల వినోద్రెడ్డిని హైదరాబాద్ డీసీగా బదిలీ చేశారు. ఈవోగా రాధాభాయి శుక్రవారం బాధ్యతలు స్వీకరించి, రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించారు. ఏఈవో బి.శ్రీనివాస్ ప్రసాదాలు అందించారు. రోడ్డు ఆక్రమిత నిర్మాణాలు కూల్చివేతసిరిసిల్లటౌన్: రోడ్డు ఆక్రమిత నిర్మాణాలపై సిరిసిల్ల బల్దియా చర్యలు చేపట్టింది. శుక్రవారం స్థానిక మార్కెట్ ఏరియాలోని పలు దుకాణాల ముందున్న గద్దెలు రోడ్డు ఆక్రమించి నిర్మించారన్న ఫిర్యాదుపై మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ పోసు వాణి ఆదేశాలతో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. స్థానిక బాలాజీ స్వీట్హౌస్ పక్క సందిలో రోడ్డుపై నిర్మించిన గద్దెలను జేసీబీ సాయంతో టీపీబీవో గణేశ్, నయీం, సిబ్బంది సహకారంతో కూల్చివేతలు చేపట్టారు. కాగా సదరు ఇళ్ల యజమానులే స్వతహాగా తొలగించుకుంటామని హామీ ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు. -
వయోవృద్ధుల రక్షణకు చట్టాలు
సిరిసిల్లటౌన్: వయోవృద్ధుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధికాజైశ్వాల్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని ఇందిరాపార్కులో వయోవృద్ధుల పోషణ, రక్షణ నిర్వహణ చట్టం–2007పై శుక్రవారం అవగాహన కల్పించారు. అనాథలైన వృద్ధులకు ప్రభుత్వం ఆశ్రమాల్లో నీడ కల్పిస్తుందని తెలిపారు. తల్లిదండ్రుల బాధ్యతను పిల్లలు చూసుకోవాలని ఇందుకు ప్రత్యేక చట్టా లు ఉన్నాయన్నారు. మహిళల రక్షణ, గృహహింస చట్టాలను వివరించారు. లోక్ అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్, ఆడెపు వేణు పాల్గొన్నారు. ● సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైశ్వాల్ -
సంతానం కోసం వెళ్తే ప్రాణమే పోయింది
జగిత్యాలక్రైం: ఆమెకు సుమారు 18 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. సంతానం లేకపోవడంతో పూజలు చేసింది. దేవుళ్లకు మొక్కింది. పలు ఆస్పత్రుల్లోనూ చూపించుకుంది. అయినా పిల్లలు కలగలేదు. చివరి ప్రయత్నంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించగా.. వారు ఆపరేషన్ చేయించుకుంటే పిల్లలు పుడుతారని చెప్పడంతో అమ్మతనం కోసం అంగీకరించింది. అయితే ఆ అమ్మతనం పొందకుండానే సదరు ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేస్తున్న సమయంలో మృతిచెందింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన అయిత గంగాధర్కు అదే గ్రామానికి చెందిన రాజవ్వతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం కాకపోవడంతో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలికి చూపించుకుంది. వైద్యురాలు గర్భసంచి ఆపరేషన్ చేస్తే పిల్లలు పుడతారని చెప్పడంతో ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ చేస్తుండానే మృతిచెందింది. ఆమె మృతికి వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై గీత ఆస్పత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో శాంతించారు. పోచంపేటలో విషాదం రాజవ్వ మృతిచెందడంతో ఆమె గ్రామంలో విషా దం చోటుచేసుకుంది. భర్త గంగాధర్ వ్యవసాయం చేస్తుండగా.. రాజవ్వ బీడీలు చుడుతోంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా నిండు ప్రాణం పోవడంతో గ్రామంలో విషాదం నిండింది. ఆపరేషన్ వికటించి మహిళ మృతి వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన -
మరికొందరు ఇంజినీర్లు!
ఏసీబీ రాడార్లోసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేసిన ఇరిగేషన్ అధికారి నూనె శ్రీధర్ కాళేశ్వరంలో భాగమైన అదనపు టీఎంసీ పనుల్లో ఇరిగేషన్ క్యాడ్ డివిజన్– 8 ఈఈగా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై దాడులు జరిగాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఈ దాడులు ఒక్కరితో ఆగేలా లేవు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మరింత మంది ఇంజినీర్లపై ఏసీబీ దాడులు జరపనుంది. ఈ డివిజన్లో పనిచేసే పలువురు ఇంజినీర్లు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఇటీవల ఏసీబీకి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ డివిజన్లో మొత్తం నాలుగు సబ్ డివిజన్లు ఉన్నాయి. ఒక్కో సబ్ డివిజన్కు ఒక డీఈఈ, అతనికి సహాయకంగా ఐదుగురు జేఈ ఈలు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు ఆదాయానికి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీంతో కొన్ని రోజులుగా ఏసీబీ వీరి ప్రతీ కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టింది. డివిజన్లో పనిచేస్తున్న ప్రతీ సిబ్బంది ఆస్తి పాస్తులు, వారు ప్రాజెక్టులో చేరినప్పటి నుంచి ఇప్పుటివరకు ఆస్తులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించినట్లు సమాచారం. ఇందులో కొందరు ఆస్తుల్లో గణనీయమైన ఎదుగుదల ఉన్నట్లు తెలిసింది. ఈ డివిజన్లో పనిచేస్తున్న కొందరు అధికారులు హైదరాబాద్, బెంగళూరుల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. కొన్నిచోట్ల విల్లాలు, రెస్టారెంట్లు, ఖరీదైన కార్లు కొన్నట్లు గుర్తించింది. కొంతకాలంగా వీరి ఇళ్లల్లో జరిగిన వివాహ, ఇతర వేడుకలకు భారీగా వెచ్చించడాన్ని కూడా ఏసీబీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. బుధవారం ఏసీబీ అధికారులు పలు రెస్టారెంట్లలో సోదాలు చేయడమే ఈ డివిజన్లో పనిచేసే సిబ్బందికి ఆయా రెస్టారెంట్లలో వాటాలు ఉన్నాయన్న ఖచ్చితమైన సమాచారానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో త్వరలోనే మరింత మంది అధికారులపై ఏసీబీ దాడులు చేయనున్నట్లు సమాచారం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి డివిజన్లో పనిచేస్తున్న చాలామంది అధికారులకు స్థానచలనం కలగలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లోనూ రాష్ట్రమంతటా ట్రాన్స్ఫర్లు జరిగినా.. వీరికి ప్రత్యేక మినహాయింపు రావడం వెనక భారీ లాబీయింగ్ జరిగిందని ప్రచారం సాగుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టులో ఇటీవల విచారణ కమిషన్ క్రిమినల్ కేసు నమోదు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్ ఇంజినీర్లు కూడా గతంలో ఇదే అదనపు టీఎంసీ ప్రాజెక్టులో పనిచేసిన వారే కావడం గమనార్హం. కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ ప్రాజెక్టు ఇంజినీర్ నివాసాల్లో సోదాలు భారీగా అక్రమాలకు పాల్పడ్డాడని ఏసీబీకి వరుస ఫిర్యాదులు రెస్టారెంట్లు, విల్లాలు, ఖరీదైన కార్లు కొన్నట్లు గుర్తించిన ఏసీబీ -
ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
కోనరావుపేట(వేములవాడ): జూలై 7న నిర్వహించే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలగందుల భిక్షపతి కోరారు. కోనరావుపేటలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలతో గురువారం సమావేశమయ్యారు. మండలకేంద్రంలో ఎమ్మార్పీఎస్ జెండా గద్దె భూమిపూజ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొమ్ము రా జశేఖర్, జిల్లా సీనియర్ నాయకులు ఖానాపూర్ లక్ష్మణ్, మంగళి చంద్రమౌళి, కుమ్మరి రవి, బొడ్డు ప్రభాకర్, బాబు, సురేశ్, తైదల రాజయ్య, చంద్రయ్య, శ్రీనివాస్, తాండ్రా ప్రతాప్, ఎనగందుల రాజు, మోహన్ ఉన్నారు. -
అల్ఫోర్స్ విద్యార్థులకు పతకాలు
జాతీయ ఒలింపియాడ్లో కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థులు ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి ఒలింపియాడ్ పోటీల్లో బంగారు పతకాలు, నగదు ప్రోత్సాహకం అందుకున్నారని సంస్థ చైర్మన్ వి.నరేందర్రెడ్డి తెలిపారు. స్థానిక అల్ఫోర్స్ స్కూల్లో గురువారం పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇంగ్లిష్ ఒలింపియాడ్లో రసగ్న (9వ తరగతి) బంగారు పతకం, కంప్యూటర్ ఒలింపియాడ్లో హేమంత్ జాదవ్ (10వతరగతి) బంగారు పతకం, హింలో ఎ.శ్రీ యాన్రెడ్డి (4వ తరగతి), యు.సాత్రివ్ (6వ తరగతి), ఇ.లిఖిత్ కుమార్ (8వ తరగతి), పి.నమన్వి త (10వ తరగతి) బంగారు పతకాలు, సోషల్ ఒలి ంపియాడ్లో హవీశ్రెడ్డి (6వ తరగతి), యం.శివేన్ రెడ్డి (8వ తరగతి) బంగారు పతకాలు, సోషల్ ఒలింపియాడ్లో ఎ.యశ్చంద్ర (9వ తరగతి)స్టేట్ టాపర్గా, నేషనల్ ఎస్సే ఒలింపియాడ్లో బి.తన్మయి (7వ తరగతి) స్టేట్ర్యాంక్, ఇంటర్నేషనల్ డ్రాయింగ్లో ముగ్గా హాసిని (10వ తరగతి) స్టేట్ ర్యాంక్, సోషల్లో ఎ.శ్రీయాన్ రెడ్డి (4వ తరగతి) స్టేట్ ర్యాంక్లు సాధించడం హర్షణీయమన్నారు. -
ఐఏయూవైఎస్ఏ ఆవిర్భావ వేడుకలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్ శివారు ఓమౌజయ ఆశ్రమంలో ఇంటర్నేషనల్ ఓమౌజయ యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్(ఐఏయూవైఎస్ఏ) స్వచ్ఛంద సేవాసంస్థ ఆవిర్భావ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు తరలివచ్చారు. ఆరు రోజుల పాటు యువతకు ఆవిర్భావం సందర్భంగా క్రికెట్, చెస్, కోకో వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. సంస్థ వ్యవస్థాపకులు మ్యాస్ట్రో, అధ్యక్షులు తిరుమల రుషి, సభ్యులు, ఆశ్రమం నిర్వహకులు పాల్గొన్నారు. -
తరగతి గదుల్లోనే దేశభవిష్యత్
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): దేశభవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలిరోజు గురువారం ఎమ్మెల్సీ స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు జాతీయతభావం, దేశభక్తి, నైతిక విలువలు, క్రమశిక్షణ అలవర్చాలని, అందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశానని గుర్తుచేశారు. డీఈవో మాధవి, ఎంఈవో మహేశ్ కుమార్ మాట్లాడారు. ఉపాధ్యాయుల కృషితో బడిబాట ద్వారా మండలస్థాయిలో మొత్తం 250 మంది విద్యార్థులను ప్రవేశాలు కల్పించామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, స్కూల్ కాంగ్లెక్స్ హెచ్ఎం సునీత, పీఎస్ హెచ్ఎం రాజారాం, మాజీ ఎంపీటీసీ గూడెపు జనార్దన్రెడ్డి, నాయకులు కావేటి రాజగోపాల్, ఈర్ల శంకర్, చిలువేరు సదాశివ, రఫీ, గరిడె కిషన్, ముల్కోజు వెంకన్న, తిరుపతి, సీను తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మల్క కొమురయ్య -
మిడ్మానేరు ప్రాజెక్టు పరిశీలన
● జిల్లాలో ముగిసిన కేంద్ర బృందం పర్యటనబోయినపల్లి(చొప్పదండి): మిడ్ మానేర్ ప్రాజెక్టును కేంద్ర బృందం అధికారులు గురువారం పరిశీలించారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ జాయింట్ సెక్రటరీ సెంతల్ రాజన్ ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ సుధీర్ కుమార్, కృష్ణా, గోదావరి బేసిన్ ఆర్గనైజషన్ ఈఈ ధీరజ్ సింఘాల్ పరిశీలించారు. వరదకాలువ నిర్మాణంలో కేంద్ర నిధుల వినియోగంపై తెలుసుకున్నారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీటి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలు.. ప్రాజెక్టు నుంచి ఏయే ప్రాంతాలకు నీళ్లు తరలిస్తారనే విషయం తెలుసుకున్నారు. ప్రాజెక్టు కింద ఆయకట్టు వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఈఈ జగన్, డీఈలు రాజు, శ్రీనివాస్, ఏఈలు రాధిక, అనుపమ, వర్క్ ఇన్స్పెక్టర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. మూడు పంటలు పండుతున్నాయి ఇల్లంతకుంట(మానకొండూర్): వరదకాల్వ పూర్తయిన తర్వాత మూడు పంటలు పండిస్తున్నామని మండలంలోని గాలిపల్లి రైతులు కేంద్ర బృందం అధికారులకు తెలిపారు. రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర బృందం అధికారులు గురువారం మండలంలోని పొత్తూరు మానేరువాగుపై నిర్మించిన మిడ్మానేరు కుడికాలువ దాని డిస్ట్రిబ్యూటరీ కాలువలను గురువారం పరిశీలించారు. గాలిపల్లిలో డిస్ట్రిబ్యూటరీ–4 వద్ద రైతుల నుంచి పంటల సాగు వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో పర్యటన ముగిసిందని, సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ప్రాజెక్టు పరిశీలించనున్నట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ ఈఈ ధీరజ్సింగాల్, గ్రౌండ్ వాటర్బోర్డ్ సైంటిస్ట్ ఎం.సుధీర్కుమార్, జిల్లా ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ జగన్, డిప్యూటీ ఇంజినీర్లు శ్రీనివాస్, అంజయ్య, రాజు, సెస్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
సకాలంలో ఇళ్లు పూర్తి చేయాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్రెడ్డి కోరారు. మండల కేంద్రంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గిరిధర్రెడ్డి మాట్లాడుతూ.. ఇసుక, ఇతర సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, నాయకులు నంది కిషన్, అంతర్పుల గోపాల్, ద్యాగ లక్ష్మీనారాయణ, ఎడ్ల రాజుకుమార్, గుర్రపు రాములు, పందిర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
క్షయపై అవగాహన
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని దమ్మన్నపేటలో గురువారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులు, పొగాకు తీసుకునే వారిలో క్షయవ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్న వారు తెమడ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి వేణుగోపాల్రెడ్డి, సీహెచ్వో రమేశ్, టీబీ సూపర్వైజర్ మహిపాల్, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ వద్ద నిరసన
సిరిసిల్ల అర్బన్: కార్మికుల కనీస వేతన సవరణ జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఎంఎస్ (భారతీయ మజ్దూర్ సంఘ్) రాష్ట్ర అధ్యక్షుడు కలల్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ వద్ద కార్మికులతో నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కోటి యాభై లక్షల మంది కార్మికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వేతన సవరణ జీవోలను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఇక్కడ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రవీందర్రెడ్డి, కార్యదర్శి కొండల్రెడ్డి, జిల్లా కన్వీనర్ పొన్న మేఘన, కోకన్వీనర్ రజిత తదితరులు పాల్గొన్నారు. షెడ్ కూల్చివేత తంగళ్లపల్లి(సిరిసిల్ల): సిరిసిల్ల సింగిల్విండో చైర్మన్ బండి దేవదాస్ వ్యవసాయక్షేత్రంలోని రేకుల షెడ్డును గురువారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మండెపలిలోని సర్వేనంబర్ 374లో 3.25 ఎకరాలను ప్రభుత్వం మూడు నెలల క్రితమే స్వాధీ నం చేసుకుందని తహసీల్దార్ జయంత్కుమార్ తెలిపారు. అక్రమంగా నిర్మించిన రేకులషెడ్డును కూల్చివేశామన్నారు. సింగిల్విండో చైర్మన్ బండి దేవదాస్ మాట్లాడుతూ అధికారులు నోటీసులు ఇవ్వకుండానే రేకులషెడ్డును కూల్చివేశారని ఆరో పించారు. హైకోర్టు నుంచి స్టే ఉన్నా కూల్చివే యడంపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్ నాయకుడిపై దాడి
● కేసు నమోదు జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడిపై అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు దాడిచేశాడని టౌన్ సీఐ ఎస్.రామకృష్ణ గురువారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కొత్తపల్లిలోని కసుబోజుల వెంకన్న ఇంటికి బుధవారం రాత్రి వెళ్లిన దేశిని కోటేశ్వర్(కోటి) రాబోయే ఎన్నికల్లో తనకు సపోర్టు చేయాలని బెదిరిస్తూ కర్రతో తలపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన అతని భార్యపై సైతం దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కరీంనగర్– తిరుపతికి ప్రత్యేక రైలు కరీంనగర్రూరల్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జూలై నెలలో కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడిపించేందుకు దక్షిణమధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. జూలై 6నుంచి 27వరకు రైలు నంబరు 02761 తిరుపతి నుంచి కరీంనగర్కు 4 ట్రిప్పులు, 7 జూలై నుంచి 28 వరకు రైలు నంబరు 02762 కరీంనగర్ నుంచి తిరుపతికి 4 ట్రిప్పులు నడిపించనున్నారు. ప్రతీ ఆదివారం తిరుపతి నుంచి ప్రత్యేక రైలు బయల్దేరి సోమవారం కరీంనగర్కు చేరుకుంటుంది. కరీంనగర్ నుంచి తిరుపతికి తిరిగి బయల్దేరుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నెలరోజుల పాటు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని కరీంనగర్స్టేషన్ మేనేజరు రవీందర్ తెలిపారు. రెగ్యులర్గా కరీంనగర్ నుంచి ప్రతి గు రు, ఆదివారాల్లో తిరుపతికి నడిచే రైలుకు అదనంగా ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు వివరించారు. -
14న జాతీయ మెగా లోక్ అదాలత్
సిరిసిల్లకల్చరల్: ఈనెల 14న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. రాజీతో పరి ష్కరించుకోదగిన కేసుల విషయంలో కక్షిదా రులు సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవా లని సూచించారు. వీలైనన్నీ ఎక్కువ కేసులు అదాలత్లో పరిష్కారమయ్యేలా సహకరించా లని న్యాయవాదులను కోరారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ‘తుమ్మల’● ‘అడ్లూరి’కి నల్గొండ జిల్లా బాధ్యతలు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి స్థానంలో తుమ్మల నాగేశ్వరరావును నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్ర భాకర్ల ఇన్చార్జీ బాధ్యతల్లో ఎలాంటి మార్పు జరగలేదు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జీ మంత్రిగా శ్రీధర్బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రిగా పొన్నం ప్రభాకర్లను కొనసాగించారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్కుమార్ను నల్గొండ ఉమ్మడి జిల్లా మంత్రిగా నియమించారు. కేంద్ర పథకాలతోనే రాష్ట్రంలో అభివృద్ధి సిరిసిల్లఅర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం 11 ఏళ్లపాటు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తుందన్నారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి నిధులు కేంటాయిండంతోపాటు ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క గిరిజ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్ట వెంకటేశ్వరెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి దేవేందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మూతపడిన స్కూల్ పునఃప్రారంభం ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలో నాలుగేళ్ల క్రితం మూతపడ్డ ఎర్రనర్సుపల్లి ప్రాథమిక పాఠశాల గురువారం పునర్ప్రారంభమైంది. ఐదుగురు విద్యార్థులు పాఠశాలకు వచ్చినట్లు ఉపాధ్యాయుడు అశోక్కుమార్ తెలిపారు. 2021లో మూతపడిన స్కూల్ తిరిగి ప్రారంభించడంపై పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎర్రనర్సుపల్లి స్కూల్ మూతపడ్డ విషయాన్ని గతంలో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఎంఈవో శ్రీనివాస్గౌడ్ బుధవారం స్కూల్ను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడడంతో పిల్లలను చేర్పించారు. సినారెకు నివాళి సిరిసిల్లకల్చరల్/వేములవాడ: జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా జిల్లా కవులు నివాళి అ ర్పించారు. జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ భవనంలో ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. కవి సమ్మేళనం వేములవాడలో కవితాభారతి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. సినారె సాహిత్యం, సినీ గేయరచనలపై కవితలు వినిపించారు. కవులు జి.నర్సన్, రిటైర్డ్ లెక్చరర్లు ఆడెపు నారాయణ, వీరగోని ఆంజ నేయులు, గూడూరి బాలరాజు, అంకారపు రవి, బూర దేవానందం, అద్దెంకి రాజు ఉన్నారు. -
నాటి విద్యార్థి.. నేటి ఎస్పీ
ప్రస్తుత వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన భూక్య రాంరెడ్డి ఎల్లారెడ్డిపేటలోని పెద్దబడిలో చదువుకొని ఎస్పీ స్థాయికి ఎదిగారు. రాంరెడ్డి మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో ఉంటూ స్థానిక పెద్దబడి(హైస్కూల్)లో చదువుకున్నారు. 1981–82లో పదో తరగతి చదివిన రాంరెడ్డి ఇంటర్ నాగార్జునసాగర్లోని ఏపీఆర్జేసీలో, డిగ్రీ కరీంనగర్లోని ఎస్సారార్ కాలేజీలో చదివారు. 1989లో ఎస్సైగా ఎంపికయ్యారు. సీఐగా ఏడూర్లబయ్యారం, ఆదిలాబాద్, డీఎస్పీగా డీటీసీ వరంగల్, వైరా, పీటీసీ కరీంనగర్లో పనిచేశారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది సీఐడీ వరంగల్లో పనిచేశారు. 2024, ఆగస్టు 14న ఎస్పీగా పదోన్నతి పొంది హైదరాబాద్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే లంబాడాలలో ఎస్పీగా ఎదిగిన తొలి వ్యక్తి రాంరెడ్డి కావడం గమనార్హం. ఎల్లారెడ్డిపేట పెద్దబడిలో చదివిన రాంరెడ్డి ఎస్పీ స్థాయికి ఎదిగి నేటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
నేతన్నలకు వరం త్రిఫ్ట్
● చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు రాఘవరావుసిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం మరమగ్గాల కార్మికులకు తెలంగాణ నేతన్న పొదుపు(త్రిఫ్ట్ ఫండ్) పథకాన్ని ప్రారంభించిందని జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు జి.రాఘవరావు గురువారం తెలిపారు. జిల్లాలోని మరమగ్గాల(పవర్లూమ్స్) కార్మికులు, అనుబంధ రంగాలు డైయింగ్, డిజైనింగ్, వార్ఫిన్, వైండింగ్, సైజింగ్, వైపని, బ్లీచింగ్, రోలింగ్ (గమ్మింగ్) కార్మికులు అర్హులని వివరించారు. గతంలో 36 నెలలు ఉన్న పథకాన్ని రెండేళ్లకు కుదించారని పేర్కొన్నారు. మరమగ్గాల కార్మికులు నెలకు గరిష్ఠంగా రూ.1,200, అనుబంధ రంగాల కార్మికులు రూ.800 చెల్లిస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం జమచేస్తుందని తెలిపారు. మొత్తం డబ్బును వడ్డీతో సహా కలిపి కార్మికులకు 24 నెలల తర్వాత వస్తాయని వివరించారు. జూన్ 9 నుంచి 19 వరకు ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉందన్నారు. -
పెద్దబడి నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ వరకు..
ఎల్లారెడ్డిపేట పెద్దబడిలో అక్షరాలు దిద్దిన నలిమెల భాస్కర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకునే వరకు ఎదిగారు. మండల కేంద్రంలోని హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. కామారెడ్డిలో ఇంటర్, డిగ్రీ చదివారు. మొదట ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన భాస్కర్ తర్వాత లెక్చరర్గా ఎంపికయ్యారు. కరీంనగర్ ఎస్సారార్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. 14 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన భాస్కర్ ఎన్నో పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. మళయాళం అనువాద కవిత స్మారక శిలలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా కాళోజీ పురస్కారం స్వీకరించారు. పెద్దబడిలో ఆనాటి పరిస్థితులు అధిగమించి చదువుకున్న తాము ఈ స్థాయికి ఎదగడానికి తమ గురువుల బోధనలేనని నలిమెల భాస్కర్ గుర్తు చేసుకున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులు చేరి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. -
దేశం గర్వించే స్థాయికి ఎదిగారు
ఎల్లారెడ్డిపేట హైస్కూల్లో చదువుకున్న వారు ఎందరో దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. వారంతా సమాజ శ్రేయస్సు కోసం తమ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఐఏఎస్లుగా, సైంటిస్ట్లుగా, ఇంజినీర్లుగా, పోలీసులుగా సేవలందిస్తున్నారు. ఈ బడిలో చదువుకున్న పూర్వ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుత విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలి. పెద్దబడిలో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలి. కార్పొరేట్ స్కూళ్లకు మించి ఇక్కడ వసతులు ఉన్నాయి. విద్యాబోధన కూడా అంతకుమించి ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్దబడిలో చేర్చండి. వారిని మేము ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. – మనోహరాచారి, హెచ్ఎం, ఎల్లారెడ్డిపేట పెద్దబడి -
ఫస్ట్ ఇంజినీర్.. శాస్త్రవేత్త
ఎల్లారెడ్డిపేటకు చెందిన వేముల మనోహర్ పెద్దబడిలోనే విద్యాభ్యాసం పూర్తి చేసి.. దేశం గర్వించే శాస్త్రవేత్తగా ఎదిగారు. 1981–82లో పదోతరగతి పూర్తి చేశారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీర్ పట్టా అందుకున్నారు. ఎల్లారెడ్డిపేట నుంచి ఇంజినీరింగ్ చదివిన వారిలో మొదటి వారు మనోహర్ మాత్రమే. మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిసైల్ కాంప్లెక్స్లో డీఆర్డీఎల్(డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబరేటరీస్) సైంటిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. -
ఈ ప్రాంతబిడ్డ కలెక్టర్..
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన కేవీ రమణాచారి మండల కేంద్రంలోని పెద్దబడిలో చదువుకొని దేశంలోనే అత్యున్నత ఉద్యోగం కలెక్టర్గా ఎంపికయ్యారు. కలెక్టర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖలతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈవోగా తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ సలహాదారుగా మాజీ సీఎం కేసీఆర్ వద్ద తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎల్లారెడ్డిపేట పెద్దబడిలో చదువుకొని కలెక్టర్గా ఎదిగిన రమమణాచారి ఈ ప్రాంతంలోని విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఎంతో మంది ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదిగారు. -
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై చర్యలు
● ఎంవీఐ వంశీధర్ ముస్తాబాద్(సిరిసిల్ల): మోటారు వాహనాల చట్టం నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల ఎంవీఐ వంశీధర్ హెచ్చరించారు. ముస్తాబాద్ మండలంలో ప్రైవేటు పాఠశాలల స్కూల్ బస్సులను గురువారం తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్న ఓ పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం స్కూల్ యాజమాన్యాలు నడచుకోవాలని సూచించారు. సహాయక ఎంవీఐ రజనీ, కానిస్టేబుళ్లు సౌమ్య, ప్రశాంత్, రమ్య పాల్గొన్నారు. ముసురు వాన సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా గురువారం ముసురువానలు కురిశాయి. కోనరావుపేటలో అత్యధికంగా 8.7 మిల్లీమీటర్లు, రుద్రంగిలో 0.7, చందుర్తిలో 5.0, వేములవాడ రూరల్లో 4.5, బోయినపల్లిలో 8.0, వేములవాడలో 7.2, సిరిసిల్లలో 3.9, వీర్నపల్లిలో 3.1, ఎల్లారెడ్డిపేటలో 1.7, గంభీరావుపేటలో 0.5, ముస్తాబాద్లో 2.5, తంగళ్లపల్లిలో 0.5, ఇల్లంతకుంటలో 1.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
‘సీఎమ్మార్’లో వేగం
● రికార్డుస్థాయిలో బియ్యం డెలివరీ ● ముందంజలో పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలు ● జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో నత్తనడకన సాగిన వైనంసాక్షి, పెద్దపల్లి: రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్(సీఎమ్మార్– మర ఆడించి) చేసి బియ్యంగా ఇవ్వడంలో జాప్యం చేస్తూ వచ్చిన రైస్మిల్లర్లు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దిగొస్తున్నారు. సీఎమ్మార్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గ్యారెంటీబాండ్లు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయింస్తుండడంతో మిల్లర్లు దారికొస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఇటీవల సన్నబియాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తుండడంతో రీసైక్లింగ్ దందాకు చెక్పెట్టినట్లు అయ్యింది. దీంతో పెద్దపల్లి జిల్లా 90శాతంతో రాష్ట్రంలో రెండోస్థానంలో ఉండగా, కరీంనగర్ నాలుగో స్థానంలో నిలిచాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు సీఎమ్మార్ డెలివరీ చేయడంలో వెనకబడ్డాయి. బ్యాంక్ గ్యారెంటీ షరతు కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభు త్వం మిల్లర్లకు ఇస్తోంది. మిల్లర్లు క్వింటాల్ వడ్లు తీసుకుంటే 68 కిలోల బాయిల్డ్ రైస్, 67 కిలోల రా రైస్ ప్రభుత్వానికి అప్పగించాలి. రాష్ట్రంలో అవసరమైన రేషన్బియ్యం కోటా తీసుకొని మిగిలిన బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్సీఐకి అప్పగించాలి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ఇప్పటిదాకా బియ్యం అప్పగించకుండానే విక్రయించి ఆ డబ్బుతో వ్యాపారాలు చేసుకునేవారు. రూ.కోట్ల విలువైన ధాన్యం రైస్మిల్లర్లకు వరంగా మారినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నా యి. ప్రస్తుతం టాస్క్ఫోర్స్, రెవెన్యూ, సివిల్ సప్లయీస్, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టడం, కేసులు నమోదు చేయడంతోపాటు ఆస్తుల జప్తునకూ వెనకాడడం లేదు. సర్కారు ధాన్యాన్ని ఇప్పటికే విక్రయించిన మిల్లర్లు ఇప్పుడు బయట వడ్లు సేకరించి మిల్లింగ్ చేసి సర్కారుకు బియ్యం ఇస్తున్నారు. దీంతో సీఎమ్మార్ డెలివరీ వేగవంతమైంది. రికార్డు నమోదు రైస్మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యం ప్రకారం సీఎమ్మార్ను త్వరగా పూర్తిచేయాలి. ప్రస్తుత చర్యలతో గత వానాకాలం సీఎమ్మార్ను వేగంగా సేకరించగలిగాం. రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా రెండోస్థానంలో ఉంది. – శ్రీకాంత్రెడ్డి, డీఎం, జిల్లా పౌర సరఫరాలు, పెద్దపల్లి -
డంపుయార్డులో మంటలు పునరావృతం కానివ్వం
● విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేస్తాం ● మున్సిపల్ కమిషనర్ వాణిసిరిసిల్ల: జిల్లా కేంద్రం శివారులోని మున్సిపల్ డంపుయార్డులో మంటలు పునరావృతం కానివ్వబోమని మున్సిపల్ కమిషనర్ పోసు వాణి గురువారం స్పష్టం చేశారు. డంపుయార్డులో చెలరేగుతున్న మంటలపై ‘పచ్చని గుట్టల్లో ‘చెత్త’ మంటలు’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి స్పందించారు. తడి చెత్తతో కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నామని, పొడి చెత్తను వేరు చేసి మెప్మా మహిళా సంఘాల ద్వారా రీసైక్లింగ్ చేస్తున్నామని వివరించారు. డంపుయార్డులోని చెత్తలో లభించే రాగితీగల కోసం గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లోలో మంటలు పెడుతున్నారని, ఎండల తీవ్రతతో కొన్నిసార్లు ఆ మంటలు చెలరేగుతున్నాయని తెలిపారు. మంటలను గమనించిన వెంటనే అగ్నిమాపక కేంద్రం అధికారుల సహకారంతో ఆర్పివేస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పొడిచెత్తతో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
విద్యతో ఆర్థిక అసమానతలు దూరం
సిరిసిల్ల: విద్యతోనే సమాజంలో ఆర్థిక అసమానతలు దూరమవుతాయని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ‘బడిబాట’లో భాగంగా సిరిసిల్ల పట్టణం గీతానగర్ జెడ్పీ స్కూల్లో గురువారం విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. డాక్టర్, ఇంజినీర్, లాయర్ ఇతర ఉన్నత ఉద్యోగాలు, తాము ఎంచుకున్న రంగమే లక్ష్యంగా చదవాలని సూచించారు. విద్యార్థులు పుస్తకాలలోని ప్రతీ అంశంపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు. పాఠ్యాంశాలలోని అనుమానాలను ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. ఈ పాఠశాలలోని విద్యార్థులకు అన్ అకాడమీ ద్వారా ఐఐటీ, నీట్ పోటీ పరీక్షలకు శిక్షణ అందించే ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి, జిల్లా విద్యాధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ ఈనెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ సందీప్కుమార్ ఝా గురువారం ఆవిష్కరించారు. ఈనెల 19న కలెక్టరేట్లో అధి కారులతో యోగా కార్యక్రమం నిర్వహణకు కలెక్టర్ అనుమతించారు. జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శశిప్రభ, సహాయ నోడల్ అధికారులు డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డీపీఎం తిరుపతి, యోగా శిక్షకులు బొల్లాజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా యోగా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ -
పచ్చనిగుట్టల్లో ‘చెత్త’మంటలు
● కలెక్టర్ నివాసం పక్కనే కాలుష్యకాసారంసిరిసిల్ల: తడి, పొడి చెత్తను వేరు చేసి.. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు, పొడి చెత్తను విద్యుత్ ఉత్పత్తికి పంపించాల్సి ఉండగా.. సిరిసిల్ల మున్సిపల్ అ ధికారులు చెత్తమంటలు రేపుతున్నారు. సిరిసిల్లలో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. ఆ చెత్తను డంపుయార్డులో విభజించాలి. కానీ పొడిచెత్తను కాలబెడుతూ.. వాయుకా లుష్యానికి కారణమవుతున్నారు. మున్సిపల్ చె త్తను డంపుయార్డులో కాలబెట్టవద్దని ఉన్నతాధికా రులు చెప్పినా క్షేత్రస్థాయి సిబ్బంది నిప్పుపెడుతూ నే ఉన్నారు. గుట్టల్లో గుట్టుగా చెత్తమంటలు అంటిస్తున్నారు. ఇలా డంపుయార్డు నుంచి సోమవారం నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. పచ్చనిగుట్టల్లో చెత్తమంటలతో వాయుకాలుష్యం ఏర్పడుతుంది. గతంలో చెత్తను కాల్చవద్దని హెచ్చరిస్తూ డంపుయార్డు బాధ్యతలు నిర్వహించే శానిటరీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయడంతో కొంతకాలం చెత్తమంటలు ఆగిపోయాయి. కానీ ఇటీవల డంపుయార్డు నుంచి పొగలు వస్తున్నాయి. కలెక్టర్ నివాసం సమీపంలోనే డంపుయార్డు ఉంది. ఆ పొగంతా కలెక్టరేట్ ప్రాంతంలో వ్యాపిస్తుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పొడి చెత్తను కాల్చి వేయకుండా.. డంపుయార్డు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు. జిల్లెల్లకు చెందిన కోడూరి దశరథంగౌడ్ (55) మంగళవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా రామచంద్రాపూర్కు చెందిన గంధం పర్శరాములు బైక్పై వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దశరథంను కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికి త్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య వెంకటవ్వ, కొడుకులు అరవింద్, అరుణ్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు. -
సాంకేతిక శిక్షణ.. భవితకు నిచ్చెన
● ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు ● టైలరింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్లలో 42 రోజులపాటు తర్ఫీదు ● పూర్తి చేసిన 89 మంది పురుషులు, 680 మంది మహిళలు నప్తగిరికాలనీ(కరీంనగర్): తమ చిన్ననాటి కలలను ఇప్పుడు సాకారం చేసుకుంటున్నాముని కొందరు.. నేర్చుకుంటున్న కళను ఇంకా మెరుగుపర్చుకుందామని మరికొందరు.. స్కూల్లో పిల్ల లకు పెట్టే టాస్క్లో మేము సైతం సాయం చేద్దామని ఇంకొందరు.. ఉపాధి కోసమని.. ఉద్యోగం సాధించాలని.. పది మందికి ఉపాధి కల్పించాలని ఇలా ఎవరికి వారు తమ ఆశయాలు, లక్ష్యం సార్థకం చేసుకునేందుకు సిద్ధమయ్యారు నారీమణులు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ కళలకు వయస్సుతో సంబంధం లేదని కరీంనగర్ మంకమ్మతోటలోని ధన్గర్వాడీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ కోర్సు(టీటీసీసీ)లో ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళలు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సులో పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందారు. 42 రోజులపాటు సాగిన కోర్సు బుధవారంతో పూర్తయింది. ఈక్రమంలో శిక్షణ పొందిన మహిళల అనుభవాలు, భవిష్యత్ కార్యాచరణపై సాక్షి ప్రత్యేక కథనం. 42 రోజుల శిక్షణ ధన్గర్వాడీ పాఠశాలలో నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సులో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, మంచిర్యాల, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల నుంచి 89 మంది పురుషులు, 680 మంది మహిళలు మొత్తం 769 మంది వివిధ కోర్సుల్లో శిక్షణ పొందారు. మే 1న కోర్సు ప్రారంభించగా.. జూన్ 11తో ముగిసింది. టైలరింగ్, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్లలో 42 రోజులపాటు శిక్షణ పొందారు. 469 మంది డ్రాయింగ్లో, 360 మంది టైలరింగ్, క్రాఫ్ట్లలో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ కోర్సు డైరెక్టర్ బొట్ల రామస్వామి పర్యవేక్షణలో టీటీసీసీ శిక్షణ కార్యక్రమాలు పకడ్బందీగా పూర్తయ్యాయి. -
ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా చేస్తా
● 50 పడకల ఆసుపత్రి, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మిస్తా ● విద్యార్థినుల ఉన్నత విద్యకు సదుపాయాలు ● ధర్మపురి పుణ్యక్షేత్ర అభివృద్ధికి మాస్టర్ప్లాన్ ● ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సాక్షిప్రతినిధి,కరీంనగర్: తనకు రాజకీయ జన్మనిచ్చిన ధర్మపురిని నియోకవర్గాన్ని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో పునర్జన్మనిచ్చిన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి రుణాన్ని తాను ఏనాడూ తీర్చుకోలేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన ఆయన బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నియోజకవర్గపరంగా మీ ప్రాధాన్యాలేంటి? అడ్లూరి: ధర్మపురి ప్రజలను, లక్ష్మీ నరసింహ స్వామిని జీవితంలో మర్చిపోను. ప్రజలు ఎమ్మెల్యేగా జన్మనిస్తే.. రోడ్డు ప్రమాదంలో స్వామి నన్ను కాపాడి పునర్జన్మనిచ్చారు. ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడినా నా అనుచరులు నా కోసమే పనిచేశారు. వారిరుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. మంత్రిగా నియోజకవర్గంలో సాగునీటికి తొలి ప్రాధాన్యం ఇస్తా. విద్య, వైద్యం, సదుపాయాలకు పెద్దపీట వేస్తా. ఇక్కడి విద్యార్థినులు డిగ్రీ, పీజీ కళాశాలలు లేక జగిత్యాల, కరీంనగర్ వెళ్తున్నారు. ధర్మపురిలో డిగ్రీ, పీజీ కళాశాలలతోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యాసంస్థలు ఏర్పాటు చేయిస్తా. చారిత్రక ధర్మపురి పుణ్యక్షేత్రానికి చీకటిపడితే రవాణా సౌకర్యం లేదు. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. 50పడకల ఆసుపత్రి నిర్మిస్తా. ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా మారుస్తా. మంత్రిగా భవిష్యత్ ప్రణాళికలు? అడ్లూరి: తొలిసారి ఎమ్మెల్యే, ఆపై విప్.. ఇప్పుడు మంత్రి పదవి. పార్టీలో సామాన్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందనడానికి నాకు దక్కిన పదవులే నిదర్శనం. మంత్రి అయ్యాక మరింత బాధ్యత పెరిగింది. నాకు ప్రభుత్వం కేటాయించిన శాఖకు 100 శాతం న్యాయం చేస్తా. ప్రజా ఆకాంక్షల మేరకు పనిచేస్తా. ప్రతీ 30రోజులకు నా శాఖలోని పనులపై సమీక్ష చేపడతా. మీరు మంత్రి కావడంలో కుటుంబ పాత్ర? అడ్లూరి: నా భార్య కాంతకుమారి ప్రభుత్వ లెక్చరర్. నా రాజకీయ జీవితంలో ఆమె పాత్ర చాలా కీలకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థికంగా ఇబ్బందులున్నా.. తన ఉద్యోగాన్ని, కెరీర్ను త్యాగం చేసి నాకు అండగా నిలిచింది. 2018లో ఓడిన సమయంలో నాలో ధైర్యం నింపింది. నా పిల్లలు కూడా వెంట నిలిచారు. వారి సహకారం మాటల్లో వర్ణించలేనిది. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
చందుర్తి(వేములవాడ): మండలంలో చందుర్తి, మర్రిగడ్డలోని ఫర్టిలైజర్స్, విత్తనాల దుకా ణాలపై వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు బుధవారం దాడులు చేశారు. పత్తి విత్తనాలతోపాటు వరి ధాన్యం విత్తనాల సంచులను పరిశీలించారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చందుర్తి, కోనరావుపేట వ్యవసాయాధికారులు అనూష, సందీప్, ఎస్సై రమేశ్ హెచ్చరించారు. స్టాక్ వివరాలు బోర్డుపై నమోదు చేయాలని సూచించారు. ఏబీవీపీ నాయకుల నిరసన సిరిసిల్లటౌన్: జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థలో జరుగుతున్న దోపిడీని అరికట్టడంలో అధికారులు మీనమేశాలు లెక్కిస్తున్నారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో బుధవారం ధర్నాకు దిగారు. అక్రమంగా బుక్స్ అమ్ముతున్నారని ఎంఈవోకు సమాచారం ఇచ్చామన్నారు. ఏబీవీపీ డిస్ట్రిక్ట్ కన్వీనర్ లోపెళ్లి రాజురావు, టౌన్ జాయింట్ సెక్రెటరీ రుద్రవీణ, ధనుష్, పూజా, కార్తీక్ పాల్గొన్నారు. ఆరోపణలు సరికావు ఏబీవీపీ నేతలు విద్యాశాఖ అధికారులపై చేసిన ఆరోపణలు సరికాదని సిరిసిల్ల ఎంఈవో దూస రఘుపతి తెలిపారు. విద్యాసంస్థకు వెళ్లి చూడగా పుస్తకాలు ఏమీ దొరకలేవన్నారు. విద్యాసంస్థకు చెందిన పుస్తకాలు బయట అ మ్ముతున్నారని వాటికి ట్రేడ్లైసెన్స్ ఉన్నట్లు తెలిపారు. ‘కేశవరావు మృతిపై విచారణ జరపాలి’ ఇల్లంతకుంట(మానకొండూర్): కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలు వీడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. మండలకేంద్రంలో బుధవారం జరిగిన 13వ మండల మహాసభలో పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ పేరిట వందలాది మందిని పొట్టన పెట్టుకుంటున్నారని ఆరోపించారు. సీపీఐ ఎంఎల్ మావోయిస్టు పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు జిల్లా కార్యవర్గ సభ్యులు మంద సుదర్శన్, బోడ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, మంద అనిల్ కుమార్, ఆదిత్య, విష్ణు, రాజు, అఖిల్ పాల్గొన్నారు. 16న జిల్లా 4 మహాసభలు ఈనెల 16న జిల్లా నాలుగో మహాసభలు జరగనున్నట్టు సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తెలిపారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోణంనేని సాంబశివరావు జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పాల్గొంటారన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంవేములవాడ: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శిక్షకుడు కృష్ణ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం 20వ వార్డు ముదిరాజ్ సంఘ భవనంలో శిక్షణనిచ్చారు. యోగాతో ఒత్తిడి దూరమై ప్రశాంతత లభిస్తుందన్నారు. డీపీఎం తిరుపతి, రిషిక, ఆశావర్కర్లు లత, హేమలత, ఉమా, విజయలక్ష్మి, జయశీల పాల్గొన్నారు. -
మానవ విలువలతో కూడిన విద్య
మా పాఠశాల రోజుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం, పౌష్టిక విలువలు గల ఉప్మా, పాలు, కోడిగుడ్లు అందించేవారు. హెడ్మాస్టర్ను గ్రామపెద్దతో సమానంగా చూసేవారు. మానవ విలువలతో కూడిన విద్యనందించారు. ప్రభుత్వ బడుల్లో అందుతున్న నాణ్యమైన విద్యను తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ విద్య పటిష్టంతోనే సమసమాజస్థాప సాధ్యం. – గుడ్ల రవి, విశ్రాంత ఉపాధ్యాయుడు, సిరిసిల్ల సౌకర్యాలు కల్పిస్తున్నాం సీఎస్ఆర్ నిధుల ద్వారా పాఠశాలలో నూతన గదుల సముదాయం నిర్మాణం జరుగుతుంది. బడులు ప్రారంభమైన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలి. బోర్వేశారు కానీ మోటార్ బిగించాల్సి ఉంది. పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నాం. బడిబాట ద్వారా అడ్మిషన్లు పెంచుతున్నాం. – సిలుముల శంకర్, హెచ్ఎం, తంగళ్లపల్లి -
ఆర్ట్లో నైపుణ్యం సాధించా
ఎంటెక్ పూర్తి చేశా. ప్రస్తుతం జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నా. ఆర్ట్, డ్రాయింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. కోర్సులో భాగంగా చాలా రకాల వాటిని తయారు చేశా. కలెక్టర్ కూడా ఇంప్రెస్ అయ్యారు. – హెచ్.రోజా, కరీంనగర్ క్రాఫ్ట్ వర్క్ నేర్చుకున్నా కరీంనగర్లో జరిగిన టీటీసీసీ లో ప్రతిరోజు క్లాసులకు హాజ రయ్యా. క్రాఫ్ట్ వర్క్ బాగా నే ర్చుకున్నా. పూల బుట్టి, ఆకులతో పలు రకాల వస్తువులు తయారు చేశా. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశా. ఇలాంటి కోర్సులు మాకు ఉపాధినిచ్చే విధంగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరు కోర్సు చేయాలి. – ఎల్.లక్ష్మి, ఇందారం, మంచిర్యాల టైలరింగ్లో శిక్షణ బీకామ్ డిగ్రీ చేశా. గతంలో శిశు గృహ తదితర సంస్థల్లో పని చేశా. కోర్సు పూర్తి చేసి స్కూళ్లలో చిన్నారులకు నేర్పించాలనుకుంటున్నా. టైలరింగ్లో అల్లికలు తదితర వాటిని బాగా నేర్చుకున్నా. ట్రైనర్స్ బాగా చెప్పారు. ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే శిక్షణ ఇది. – ఇ.సంధ్య, గాలిపెల్లి, సిరిసిల్ల -
సర్కారు బడికే జై
● బడిబాటతో పెరిగిన ప్రవేశాలు ● కొత్తగా 1,276 అడ్మిషన్లు ● ప్రైవేట్లో ఫీజుల మోతతో తల్లిదండ్రుల వైఖరిలో మార్పు ● ప్రభుత్వ పాఠశాలల వైపు చూపు ● నేటి నుంచి తెరుచుకోనున్న బడులు సిరిసిల్లటౌన్/సిరిసిల్లఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలు సాధిస్తున్న ఫలితాలు.. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు.. ప్రైవేట్లో బాదుతున్న ఫీజుల మోతతో తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకొస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బడిబాటలో జిల్లా వ్యాప్తంగా కొత్తగా 1,276 అడ్మిషన్లు రావడమే ఇందుకు నిదర్శనం. గతేడాది 183 రాగా.. ప్రస్తుతం ఇంత పెద్ద మొత్తంలో ప్రవేశాలు రావడంతో గురువారం నుంచి తెరుచుకోనున్న స్కూళ్లకు ఉపాధ్యాయులు రెట్టించిన ఉత్సాహంతో వెళ్తున్నారు. రెండు నెలలపాటు వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ● సర్కారు బడులే నయం ఫీజుల నుంచి మొదలుకొని చదువుల విషయంలో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి ఉంటుండడంతో ప్రభుత్వ బడుల వైపు తల్లిదండ్రులు చూస్తున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి మొదలైన బడిబాట కార్యక్రమాన్ని చేపట్టగా.. తల్లిదండ్రుల నుంచి స్పందన బాగుంది. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1,276 కొత్త అడ్మిషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది జూన్ 12 వరకు కొత్తగా 183 ప్రవేశాలు రాగా.. ఈ యేడు బడులు తెరువక ముందే ఇంత పెద్ద మొత్తంలో అడ్మిషన్లు రావడం విశేషం. ● ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య ప్రభుత్వ బడులతోపాటు గురుకుల పాఠశాలలను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల విద్యార్థుల మెస్ చార్జీలు పెంచింది. గురుకుల విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడుకునేందుకు, తమ సమస్యలను ఉన్నతాధికారులకు తెలిపేందుకు ఫోన్మిత్రను ప్రవేశపెట్టింది. ఇక అన్ని ప్రభుత్వ బడుల్లో ఉచితంగా పుస్తకాలు, నోట్బుక్కులు ఇతర సామగ్రిని అందజేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ బడుల్లో 2,70,587 పుస్తకాలు అవసరం ఉండగా..ఇప్పటికే 2,58,419 పుస్తకాలు చేరుకున్నాయి. నోట్బుక్కులు 3,07,765 అందుబాటులో ఉన్నాయి. ఒకటి నుంచి ఐదోతరగతి వరకు వర్క్బుక్స్ 52,354 అవసరం ఉండగా..34,237 అందాయి. యూనిఫామ్స్ 39,039 అవసరం కాగా 38,600 అందించారు. మధ్యాహ్న భోజనం, రాగిజావ, అల్పాహారం, కంప్యూటర్ విద్య, మరికొన్ని పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ల వంటి వసతులు కల్పించారు. జిల్లా సమాచారం ప్రభుత్వ పాఠశాలలు : 511 గురుకులాలు : 22 కేజీబీవీలు : 13 మదర్సా : 01 ప్రైవేటు స్కూళ్లు : 122 బడిబాటలో ప్రవేశాలు : 1,276 గతేడాది విద్యార్థులు : 80,108 -
పోషణతో కూడిన విద్యనందించడమే లక్ష్యం
● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం వేములవాడరూరల్: పోషణతో కూడిన విద్యనందించడమే లక్ష్యమని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం ఎదురుగట్లలో మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 ఏళ్ల పిల్లల నమోదు పెంచడం, ప్రీస్కూల్ హాజరును పెంచడం ముఖ్య ఉద్దేశమన్నారు. చదువుతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. సీడీపీవో సౌందర్య తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదులు ఆరోగ్య స్పృహ పెంచుకోవాలి
సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్: న్యాయవాదులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ కోరారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం మెడికవర్ ఆస్పత్రి నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి వైద్యశిబిరం ప్రారంభించి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అనంతరం 200 మంది న్యాయవాదులు శిబిరంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ బీరకాయల లోకేశ్ ఆధ్వర్యంలో గుండె సంబంధిత వైద్యపరీక్షలు చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.ప్రవీణ్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కావేటి సృజన, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.8లక్షలు ఇవ్వాలి సిరిసిల్లఅర్బన్: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5లక్షలు సరిపోవడం లేదని.. రూ.8లక్షలకు పెంచాలని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ ఆఫీస్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ హయాంలో సగం వరకు ఇళ్లు నిర్మించుకున్న ఆగిపోయిన లబ్ధిదారులను సైతం ప్రస్తుతం అర్హులుగా గుర్తించాలని కోరారు. పోచమల్లు, సాయిలు, రాజయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆత్మరక్షణకు కరాటే వేములవాడ: ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని మహదేవ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్టుల్లో నెగ్గిన విద్యార్థులకు బెల్టులు ప్రదానం చేశారు. కరాటే మాస్టర్ మన్నాన్, కోచ్లు రాజు, రాజశేఖర్, వర్షిత్, రిషిక్తేజ, సూర్య జయచంద్ర పాల్గొన్నారు. జిల్లాలో చిరుజల్లులు సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా బుధవారం చిరుజల్లులు కురిశాయి. బోయినపల్లిలో 6.4 మిల్లీమీటర్లు, చందుర్తిలో 0.4, రుద్రంగిలో 1.2, వేములవాడ రూరల్లో 2.0, వేములవాడలో 1.5, సిరిసిల్లలో 1.8, కోనరావుపేటలో 0.6, వీర్నపల్లిలో 1.6, ఎల్లారెడ్డిపేటలో 1.0, ముస్తాబాద్లో 0.3, తంగళ్లపల్లిలో 3.5, ఇల్లంతకుంటలో 1.0 మిల్లీమీటర్ల వర్షం పడింది. గంభీరావుపేటలో వర్షం పడలేదు. చదువుకుంటూ.. శ్రమించే పిల్లలను ప్రోత్సహించాలి ● మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ సిరిసిల్ల: చదువుకుంటూ.. సంపాదిస్తూ.. కుటుంబాలకు అండగా ఉండే పిల్లలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆడెపు రవీందర్ పేర్కొన్నారు. పేపర్బాయ్స్గా పనిచేసే పిల్లలకు బుధవారం రెయిన్కోట్స్ పంపిణీ చేశారు. రవీందర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ఇంటింటికీ తిరుగుతూ పేపర్ వేయడం ఇబ్బందిగా ఉంటుందని రెయిన్కోట్స్ అందించేందుకు ముందుకొచ్చిన దాతలను అభినందించారు. సిరిసిల్ల పట్టణ న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోచంపల్లి రాజు, ఉపాధ్యక్షుడు తడక చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి మల్లేశంగౌడ్, సలహాదారులు బైరి దేవదాస్, యెల్లె రాజేంద్రప్రసాద్, కోశాధికారి గుడెల్లి నాగభూషణం, సహాయ కార్యదర్శి రాగుల వేణుగోపాల్, కార్యవర్గ సభ్యులు బొద్దుల బాలకృష్ణ, పిస్క సాయికుమార్, వెంగళ శ్రీకాంత్, నక్క వెంకటేశ్, చిట్యాల శ్రీహరి, గాజుల అశోక్, తడుక బాలకిషన్ పాల్గొన్నారు. -
సర్కార్ కళాశాలల్లో నాణ్యమైన విద్య
● డీఐఈవో శ్రీనివాస్ సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్: ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై.శ్రీనివాస్ పేర్కొన్నారు. సెస్ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వనజాకుమారి, అధ్యాపకులు తంగళ్లపల్లిలో బుధవారం ఇంటింటా ప్రచారం చేశారు. వారు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థల కంటే ప్రభుత్వ కళాశాల విద్యార్థులే అన్ని పోటీపరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రైవేట్ కళాశాలల్లో సీటు వచ్చినా ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చదువవచ్చన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. -
మనసు చలించిపోతోంది !
భక్తుల రద్దీ వేములవాడ: రాజన్నను బుధవారం 15వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారి హుండీలలో భక్తులు వేసిన కట్నాలు, కానుకలను గురువారం లెక్కించనున్నారు. వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.ఇల్లంతకుంట(మానకొండూర్): సెలవులు రావడంతో రెండు నెలలుగా సందడి లేని స్కూళ్లు ఈరోజు జీవకళ సంతరించుకుంటున్నాయి. కానీ నేను ఏడాదిగా నా పిల్లలకు దూరంగానే ఉంటున్నాను. నన్ను పలకరించేవారు కరువయ్యారు. వేసవి సెలవులు వస్తేనే పిల్లలు లేక బోసిపోయి ఉండేదాన్ని. ఎప్పుడెప్పుడు సెలవులు ముగుస్తాయా.. అని ఎదురుచూసేదాన్ని. కానీ నా గేట్కు తాళం వేయడంతో ఎన్నాళ్లకు నాకు పునర్వైభవం వస్తుందోనని ఏడాదిగా ఎదురుచూస్తున్నాను. నేను మీకు గుర్తున్నానా.. అదే రహీంఖాన్పేట చిన్నబడిని. ఏడాది క్రితం పిల్లల సంఖ్య తగ్గిందని తాళం వేసి పోయిన మీరు ఇటువైపు చూడడమే లేదు. నా గతాన్ని తలచుకుంటే దుఃఖం ఆగడం లేదు. 1955లో ప్రారంభమైనప్పుడు ఎంతో దర్జాగా ఉండేదాన్ని. రంగురంగుల డ్రెస్సుల్లో పిల్లలు వస్తుంటే నా ఠీవీయే వేరు. ఈ లోకంలో నన్ను మించిన వారు లేరనే భావనతో ఉండేదాన్ని. ఊరిలోని పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల పిల్లలు నా ఒడిలోనే చదువుకొని ఉన్నతంగా ఎదిగారు. అయితే నా ఒడిలో ఓనమాలు దిద్దినవారే.. తమ పిల్లలను ప్రైవేట్కు పంపుతుండడం నన్ను కలచివేసింది. పొద్దుగాలనే వస్తున్న ప్రైవేట్ స్కూళ్ల బస్సుల్లో పిల్లలను పంపుతుంటే నా మనసు చలించిపోతోంది. నా ఒడిలో పెరిగి.. విద్యాబుద్ధులు నేర్చిన వారు.. తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపిస్తుండడంతో నా హృదయం గాయపడింది. జర ఆలోచించుండ్రి రెండు వేల జనాభా ఉన్న ఊరిలో పది మంది పిల్లలు కూడా నా దగ్గరికి రాకుండా అయ్యారంటే తప్పెవరిదీ? ఊరిలోకి ప్రైవేటు పాఠశాలల బస్సులు రాగానే పిల్లలు ఎక్కిస్తున్నా తల్లిదండ్రులదా..? పిల్లలు రాకపోతే తల్లిదండ్రులకు మంచి మాట చెప్పి మార్చాల్సింది పోయి మూతవేసిన అధికారులదా..? ఇప్పటికై నా ఆలోచించుండ్రి. కనీసం నా ఒడిలో చదువుకుని బాగుపడ్డ పిల్లల్లో ఒక్కరు కూడా పట్టించుకునే వారు లేరా..? చిన్న ఆలోచనే నన్ను బతికేలా చేస్తుంది. ఎవరో ఒక్కరూ ముందుకొస్తేనే కదా.. మార్పు వచ్చేది. ఊరిలోని నన్ను పట్టించుకుంటే ఎలాంటి ఖర్చు లేకుండా.. కడుపునిండా భోజనం పెడుతూ.. వేసుకునేందుకు రెండు డ్రెస్సులు ఇస్తూనే.. నాణ్యమైన చదువు చెబుతాను కదా.. ఈ ఆలోచన నా పిల్లలకు(నా వద్దే చదువుకున్న విద్యార్థులు) ఎందుకు రావడం లేదు. కనీసం నా గోడు వినైనా ఈ యేడు తమ పిల్లలను నా వద్దకు పంపుతారని ఆశిస్తూ.. ఇట్లు ––––––––––– మీకు విద్యాబుద్ధులు నేర్పిన సర్కార్ బడి (జిల్లాలో మూతపడ్డ ఓ పాఠశాల ఆవేదన ఇదీ..) నా పిల్లలే పట్టించుకోకపోతే ఎవరికీ చెప్పుకునేది -
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● మిషన్ భగీరథను పరిశీలించిన కేంద్ర బృందం
సిరిసిల్ల: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. జిల్లాలో బుధవారం కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రెటరీ సెంథిల్ రాజన్ టెక్నికల్ బృందం పర్యటించింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి కృషి సంచాన్ యోజన, జల్జీవన్ మిషన్ ప్రాజెక్టులపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో పీఎంకేఎస్వై కింద చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పురోగతి వివరాలు, మిషన్ భగీరథ, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు వివరాలను కేంద్ర అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా జిల్లాలో 85 శాతం ఆయకట్టు సృష్టించినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో 333 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ నిర్మించాల్సి ఉండగా 280 కిలోమీటర్ల పనులు పూర్తి చేశామన్నారు. ఎస్ఎస్ఆర్ రేట్లు 2008 నాటివి ఉండడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదన్నారు. భూసేకరణకు, డిస్ట్రిబ్యూషన్ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. డిసెంబర్ 2026 నాటికి ఈ ప్రాజెక్టు చివరి ఆయకట్టు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9 ద్వారా.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9లో మిడ్మానేరు రిజర్వాయర్ నుంచి టన్నెల్, లిఫ్ట్ ద్వారా మల్కపేట రిజర్వాయర్ నింపుతామని, ఇక్కడి నుంచి కాల్వల ద్వారా ఎల్లారెడిపేట, మరో 2 మండలాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. సమావేశం అనంతరం కలెక్టర్, కేంద్ర అధికారుల బృందంతో కలిసి అగ్రహారం మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటి పారుదల ప్రాజెక్టులను, ముస్తాబాద్ మండలం కొండాపూర్, మోర్రాయిపల్లి గ్రామాల్లోని నీటి ట్యాంకులు, గ్రిడ్ ద్వారా నీటిని సరఫరా చేసే విధానాన్ని పరిశీలించారు. ఈ బృందం రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనుంది. ఈఈ జానకి, డీఆర్డీవో శేషాద్రి, ఎంపీడీవో బీరయ్య, డీఈలు ఉన్నారు. కోడెలను పక్కదారి పట్టిస్తే చర్యలు వేములవాడఅర్బన్: కోడెలను పక్కదారి పట్టిస్తే చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ పనులకు మాత్రమే ఉపయోగించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. తిప్పాపూర్లోని గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు పరిశీలించి, అర్హులకు 190 జతల కోడెలను బుధవారం పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధా కిషన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
అడగండి... అడుగేయండి
గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే ముందు తల్లిదండ్రులు ఆచితూచీ అడుగేయాల్సిన అవసరం ఉంది. ఆ స్కూల్ ఎలాంటిది? గతంలో స్కూల్ విద్యార్థులు సాధించిన ఫలితాలు ఎలా ఉన్నాయి? ఫీజుల వివరాలు, తల్లిదండ్రులతో యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుంది? అనే వివరాలు గమనించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేది పా ఠశాలే కాబట్టి.. ఆలోచించి అడుగేయాల్సిన బా ధ్యత తల్లిదండ్రులపై ఉంది. జిల్లాలో 120 గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. నేటి నుంచి పాఠశాలలు పునర్ప్రారంభం కానుండడంతో ఇప్పటికే జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు తమ ప్ర చారాన్ని ముమ్మరం చేశాయి. హంగు ఆర్భాటాలతో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్ని స్తున్నాయి. ఉపాధ్యాయులను ఇళ్లకు పంపిస్తూ పిల్ల లను తమ బడిలో చేర్పించాలని కోరుతున్నారు. అనుమతులు ఉన్నాయా.. ప్రైవేటు పాఠశాల తమ వివరాలను విద్యాశాఖ కార్యాలయంలో నమోదు చేసుకొని ఉంటుంది. వారికి నిర్ధిష్ట సంఖ్య, నమోదైన సంవత్సరంతో కూడిన పత్రాన్ని ఇస్తారు. దీన్ని పరిశీలించాకే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలి. కొన్ని పాఠశాలలు 1–7, 8–10 తరగతుల వరకు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నోటీస్ బోర్డుపై ఇవి ఉన్నాయా.. మీరు చేర్పించబోయే ప్రైవేటు పాఠశాలలోని బోధన సిబ్బంది అర్హతలు ఎలా ఉన్నాయో గమనించాలి. అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారా? అనేది ఆరా తీయాలి. బీఈడీ, డీఈడీ వంటి విద్యార్హతలు గల వారితో విద్యాబోధన చేస్తున్నారో.. లేదో తెలుసుకోవాలి. ఉపాధ్యాయుల వివరాలు, అర్హతలను ప్రభుత్వ పాఠశాలలో మాదిరిగా ప్రైవేటు పాఠశాల నోటీస్ బోర్డుపై ప్రదర్శించారో.. లేదో చూడాలి. ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయి? ఫీజుల్లో పారదర్శకత ఉందా.. అడిగి తెలుసుకోవాలి. వసతులపై దృష్టి పెట్టండి మెరుగైన ఫలితాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో.. లేదో తెలుసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచి పఠనాసక్తి కలిగించే ఎలాంటి అంశాలు అమలు చేస్తున్నారో అడగాలి. స్కూల్లో లైబ్రరీ, ప్లేగ్రౌండ్, టాయిలెట్స్.. తాగునీటి వసతుల గురించి తెలుసుకోవాలి. ఇన్నోవేటీవ్ అంశాలపై.. పాఠశాలలో ఇన్నోవేటివ్ అంశాలు నేర్పిస్తున్నారా.. కొత్త విషయాలను విద్యార్థులకు తెలిసేలా తరగతులు నిర్వహిస్తున్నారా.. తెలుసుకోవాలి. గతంలో వైజ్ఞానిక ప్రదర్శనలు.. ఇన్స్పైర్ మానక్, సైన్స్మేళాల్లో భాగస్వామ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని, ప్రతిభ చాటే వారిని ఎలా ప్రోత్సాహం ఎలా ఉందో ఆరా తీయాలి. అలాంటి పాఠశాలలను తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవాలి. -
బీఆర్ఎస్ అవినీతికి పరాకాష్ట కాళేశ్వరం
● కరీంనగర్ పార్లమెంట్ కో–కన్వీనర్ చక్రధర్రెడ్డి ముస్తాబాద్(సిరిసిల్ల): పదేళ్ల బీఆర్ఎస్ పాలన అవినీతికి పరాకాష్టగా కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిపోయిందని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ కో–కన్వీనర్ కనమేని చక్రధర్రెడ్డి విమర్శించారు. ముస్తాబాద్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం ప్రారంభమైందన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలుచేశారని ఆరోపించారు. విచారణ కమిషన్ ఎదుట వాస్తవాలు చెప్పి, ప్రజలకు నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారందరు జైలుకు వెళ్లక తప్పదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి ధరణిని బంగాళాఖాతంలో కలిపి.. భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు కలకొండ కిషన్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, వేణు, పుట్ట చంద్రయ్య, శ్రీకాంత్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ అభివృద్ధిలో సొంత ఎజెండా లేదు
● అభినవ తీర్థ సదన్కు భూమి పూజ చేసిన ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధిలో తన సొంత ఎజెండా ఏమీ లేదని, ప్రజాభీష్టం మేరకు, శృంగేరిపీఠాధిపతుల అనుమతులతో పనులు చేపట్టబోతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. పట్టణంలోని శంకరమఠం వెనుక భాగంలో అనువంశిక అర్చక ట్రస్ట్, బ్రాహ్మణ నిత్యాన్నసత్రం ఆధ్వర్యంలో అభినవ విద్యాతీర్థ సదన్ నిర్మాణం పనులకు బుధవారం భూమిపూజ చేశారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాజన్న క్షేత్రంలో బ్రాహ్మణుల కోసం వసతిగృహం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ అభివృద్ధిపై త్వరలోనే పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం గౌరవాధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నామాల లక్ష్మీరాజం, రామతీర్థపు రాజు, గడ్డం నర్సయ్య, రేగుల మల్లికార్జున్, మధు రాధాకిషన్, నరహరిశర్మ, బుడంగారి మహేశ్, పురాణం రాము, మామిడిపల్లి వెంకటేశం, గర్శకుర్తి వెంకటేశం, చంద్రగిరి శరత్, గోపన్నగారి చందు, నమిలకొండ ఉమేశ్, మధు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. -
అయ్యో.. ఇదేం శిక్షణ
సిరిసిల్ల: భూభారతి చట్టంలో భాగంగా అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్డ్ సర్వేయర్లుగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో మే 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 163 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేయగా, 156 మందిని ఎంపిక చేశారు. ఎంపికై నవారికి మే 26 నుంచి చంద్రంపేట రైతు వేదికలో శిక్షణ ప్రారంభించారు. కాగా, జిల్లాలో ఇప్పటికే 19 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఉన్నారు. భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో వ్యవసాయ భూములను సైతం కొలతల నక్షా(మ్యాప్) ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం నిజాం కాలం నాటి షేత్వార్(టీపన్) నక్షాలు ఉన్నాయి. రెవెన్యూ సర్వేలాండ్ రికార్డుల ప్రకారం హద్దులు నిర్ణయిస్తున్నారు. ఈ విధానంతో సమస్యలు వస్తున్నాయి. తాజాగా భూభారతి చట్టంలో నక్షా ఉండాలనే విధానాన్ని తేవడంతో లైసెన్స్డ్ సర్వేయర్ల అవసరం ఏర్పడింది. రైతు వేదికలో ఇబ్బందులు ఇవీ.. ● మైకు రీసౌండ్ వస్తుంది. శిక్షణ ఇచ్చే అధికారులు చెప్పేది అభ్యర్థులకు అర్థం కావడం లేదు. బోర్డుపై రాసిన అక్షరాలు, మ్యాప్లు అభ్యర్థులకు కనిపించడం లేదు. ● డెస్క్లు లేకుండా కుర్చీలు మాత్రమే ఉండడంతో రికార్డులు రాసుకునేందుకు కింద కూర్చోవాల్సి వస్తుంది. ● రైతు వేదికలో మరుగుదొడ్లు, మూత్రశాలల్లో నీళ్లు లేక కంపు కొడుతున్నాయి. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ● రైతు వేదిక రేకులతో నిర్మించడంతో ఎప్పుడైనా వర్షం వస్తే.. బొలబొల శబ్దంతో ఇబ్బందిగా ఉంది. ఎండలు కొడితే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ● స్థానిక రైతులకు ఏదైనా శిక్షణ ఉంటే, అభ్యర్థులంతా రైతుల మీటింగ్ అయిపోయే వరకు ఆరుబయట కాలక్షేపం చేయాల్సిందే. ● ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక శిక్షణ మొక్కుబడిగా సాగుతుంది. పొరుగు జిల్లాలో ఎలా ఉందంటే.. ● ఇదే శిక్షణ పొరుగున ఉన్న జిల్లాలో చాలా పద్ధతిగా సాగుతోంది. డెస్క్లు ఉన్న కుర్చీలు, బేంచీలు, సిమెంట్ భవనాలు ఉండడంతో శిక్షణ బాగుంది. కొందరు అభ్యర్థులు ఇక్కడ వసతులు లేవని పొరుగు జిల్లాలకు వెళ్లిపోవడం గమనార్హం. జిల్లాలో ప్రభుత్వ సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు పూర్తిస్థాయి భూమి కొలతల శాఖ అధికారి లేక ఇన్చార్జి అధికారి పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ గారూ.. చూడండి సారూ.. ● భూభారతి చట్టంలో భాగంగా శిక్షణ పొందే లైసెన్స్డ్ సర్వేయర్ల శిబిరాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సందర్శిస్తే, అభ్యర్థుల సమస్యలు తీరనున్నాయి. ఇక్కడే మౌలిక వసతులు కల్పించడం, లేదా మరో కాలేజీలో వసతులు కల్పించి శిక్షణ ఇస్తే భావి సర్వేయర్లకు ప్రభుత్వం నిర్వహించే ‘పరీక్ష’ల్లో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఉంది. లేకుంటే, శిక్షణ లోపాలు.. అభ్యర్థులకు శాపాలుగా మారనున్నాయి. శిక్షణపై జిల్లా కలెక్టర్ చొరవచూపాలని మహిళా అభ్యర్థులు కోరుతున్నారు. చెప్పింది వినిపించదు.. రాసింది కనిపించదు వర్షం పడితే బొలబొల.. ఎండకొడితే చిటచిట డెస్క్ల్లేని కుర్చీలు.. కంపు కొడుతున్న మరుగుదొడ్లు చంద్రంపేట రైతు వేదికలో భావి సర్వేయర్ల శిక్షణ తీరిదీ భూ భారతి చట్టం అమలుకు మొక్కుబడి తర్ఫీదుశిక్షణలో ఇబ్బందులు ఉన్నాయి ‘ఇతడి పేరు సీహెచ్ సంతోష్. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన సంతోష్ హైదరాబాద్లో బీటెక్(ఈసీఈ) చదివారు. ప్రభుత్వం భూభారతి చట్టంలో లైసెన్స్డ్ సర్వేయర్లుగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆ శిక్షణ పొందేందుకు రూ.5,200 ఆన్లైన్లో చెల్లించారు. 50 రోజుల శిక్షణలో భూమి కొలతలు చేయడం, నక్షాల తయారీ వంటి అంశాలను నేర్చుకోవాల్సి ఉంది. కానీ సిరిసిల్ల శివారులోని చంద్రంపేట రైతు వేదికలో శిక్షణ ఇవ్వడంతో అక్కడ మౌలిక వసతులు లేక మైకులో చెప్పింది వినిపించక, బోర్డుపై రాసింది కనిపించక ఇబ్బందులు పడుతున్నారు.’ ‘నేలపై కూర్చుని రాస్తున్న ఈ అభ్యర్థులు భావి లైసెన్స్డ్ సర్వేయర్లు. చంద్రంపేట రైతు వేదికలో కూర్చుని మ్యాప్లు వేసుకోడానికి, రికార్డులు రాసుకోడానికి ఎలాంటి డెస్క్లు లేక ఇలా నేలపై కూర్చుని రికార్డులు రాస్తున్నారు. కూర్చునే కుర్చీల్లోనే అభ్యర్థులను కూర్చోబెట్టి థియరీ చెబుతుండగా.. చెప్పింది అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. ఫీల్డ్ వర్క్లో భాగంగా భూమి కొలతలు చేయడం బాగున్నా, రైతు వేదికలో శిక్షణ.. డబ్బులు చెల్లించి వచ్చిన అభ్యర్థులకు ‘శిక్ష’లా మారింది. ఇది ఏ ఒక్కరిద్దరు కాదు.. జిల్లాలో శిక్షణ పొందుతున్న 156 మంది అభ్యర్థులదీ ఇదే దుస్థితి.’ చంద్రంపేట రైతు వేదికలో శిక్షణకు ఇబ్బందులు ఉన్నాయి. జిల్లాలో చాలా భవనాలను శిక్షణ కోసం అడిగాము. ఎవ్వరూ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇది 50 రోజుల కార్యక్రమం. మరో పది రోజుల తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో శిక్షణను మరేదైనా భవనంలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. జూలై 26 వరకు శిక్షణ ఉంటుంది. – వెంకట్రెడ్డి, భూముల సర్వేశాఖ జిల్లా అధికారి -
సాక్షిపై దాడి అప్రజాస్వామికం
● కొమ్మినేని అరెస్టు గర్హనీయం ● జర్నలిస్టు సంఘాల నిరసనకరీంనగర్: ఏపీలో ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానళ్ల కార్యాలయాలపై టీడీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు అప్రజాస్వామికమని, మీడియా స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్దమని టీయుడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్, ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జి భాషబోయిన అనిల్కుమార్ పేర్కొన్నారు. ఏపీలో ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును నిరసిస్తూ మంగళవారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఉమ్మడి జిల్లాకు చెందిన జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపు చర్యలను ఖండించారు. ఇటీవల ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయ్ రెడ్డి మీద కేసులు బనాయించడం, తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం, సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్ప డటం భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఉందని మండిపడ్డారు. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చేలా ఉన్న ఏపీ ప్రభుత్వ చర్యలను దేశవ్యాప్తంగా మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఏపీ సర్కారు పత్రికా కార్యాలయాలపై, మీడియా ప్రతినిధులపై దాడులు కొనసాగిస్తే అదేస్థాయిలో నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకులు ఎలగందుల రవీందర్, బల్మూరి విజయసింహారావు, ఈద మధుకర్రెడ్డి, ఏలేటి శైలేందర్రెడ్డి, జీఎస్ ఆనంద్తో పాటు సీనియర్ జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు
వేములవాడ: ప్రజాప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే వేములవాడ నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 7,8,11,12వ వార్డుల్లో రూ.3 కోట్లతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇతర పనులకు కమిషనర్ అన్వేశ్, సెస్ డైరెక్టర్ నామాల ఉమ, ఏఎంసీ చైర్మన్ రొండు రాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు వేములవాడను టెంపుల్ సిటీగా మార్చుతామని చెప్పిన మాటకు కట్టుబడి ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.76 కోట్లతో త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సోషల్ మీడియా షార్ప్గా పని చేయాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సోషల్ మీడియా బాధ్యులు షార్ప్గా పని చేయాలని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గ్రాండ్లో జరిగిన నియోజకవర్గ సోషల్ మీడియా సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యేగా తాను గెలవడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ పాత్ర కీలకమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేందుకు మరింత స్పీడ్గా పని చేయాలని సూచించారు. సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జ మల్లేశ్, జిల్లా కోకన్వీనర్ కనికరపు రాకేశ్, పట్టణ కన్వీనర్ ఎర్ర శ్రావణ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్ తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
ఆది దేవునికి అభిషేకాలు
వేములవాడ: వేములవాడ రాజన్నను మంగళవారం 20 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాలకు చెందినవారు తరలివచ్చి రాజన్నకు అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణవ్రతాలు, అమ్మవారికి కుంకుమపూజ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.25 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అవెలబుల్ స్కూళ్లలో గిరిజన విద్యార్థులకు ఐదు సీట్లుసిరిసిల్లకల్చరల్: జిల్లాలోని బెస్ట్ అవెలబుల్ స్కూళ్లలో గిరిజన విద్యార్థులకు ఐదు సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. జిల్లావాసులై ఉండి వార్షికాదా యం పట్టణాల్లో రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 17న సాయంత్రం 5 గంటలలోపు కరీంనగర్లోని జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. మూడో తరగతిలో లంబాడ బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి, ఎరుకల బాలురకు ఒకటి, ఐదో తరగతిలో లంబాడ బాలురకు ఒకటి, 8వ తరగతిలో లంబాడా బాలికలకు ఒకటి చొప్పున సీట్లు ఉ న్నాయన్నారు. కులం, ఆదాయ ధ్రువ పత్రాలు, ఆధార్, సంబంధిత పాఠశాల స్టడీ సర్టి ఫికెట్లు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జత చేసి దరఖాస్తులు అందజేయాలన్నారు. ఈనె ల 20న లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని, మరిన్ని వివరాలకు 96521 188 67 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఇసుక కొరత లేకుండా చూడాలిసిరిసిల్లటౌన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏర్పడిన కృత్రిమ ఇసుక కొరతను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. మంగళవారం పార్టీ ఆఫీసులో మాట్లాడారు. ఇందిరమ్మ పథకంలో సిరిసిల్ల పట్టణంలో 700పైగా ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఒకేసారి అందరూ నిర్మాణం ప్రారంభించడం వల్ల ఇసుక కొరత నెలకొందన్నారు. ఇదే అదునుగా కొంతమంది అక్రమంగా ఇసుక రవాణా చేసేవారు ఒక ట్రాక్టర్ ధర రూ.1,500 నుంచి రూ.4 వేలకు పెంచారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు సరిపడా ఇసుకను ప్రభుత్వం నిర్ణీత ధరలకే అందించాలని లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, మల్లారం ప్రశాంత్, మిట్టపల్లి రాజమల్లు పాల్గొన్నారు. వేములవాడలో హిందూ సమ్మేళనంవేములవాడ: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని పద్మశాలీ సంఘంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ, వేములవాడ రాజన్న ఆలయం, పట్టణాభివృద్ధి పనుల దృష్ట్యా నెలకొన్న పరిణామాలు, చేయవలసిన పనులు ఆగమశాస్త్రం ప్రకారం చేసేలా హిందూ సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. హిందూ ఆలయాల పరిషత్ అధ్యక్షుడు రవీందర్గౌడ్, ఎస్సీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు అమరప్రసాద్, శివశక్తి కళ్యాణ్, సీనియర్ స్వయంసేవక్ మదన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంసిరిసిల్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కారంలో సీపీఐ నిరంతర పోరాటాలు చేస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. మంగళవారం కార్మిక భవనంలో మాట్లాడారు. ఈ నెల 16న స్థానిక లహరి ఫంక్షన్హాల్లో సీపీఐ నాల్గో జిల్లా మహాసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మహాసభలకు అన్ని వర్గాల ప్రజలు పెద్దెత్తున హాజరుకావాలని కోరారు. కార్యవర్గ సభ్యులు పంతం రవి, కడారి రాములు, నాయకులు పాల్గొన్నారు. -
భూ సమస్యలు పరిష్కరిస్తాం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): భూ సమస్యలు ఉంటే రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసుకోవాలని, పరిష్కరిస్తామని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మాట్లాడారు. దీర్ఘకాలికంగా భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించే అవకాశం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తహసీల్దార్ సుజాత, ఆర్ఐ శ్రావణ్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
అనుమతి లేని ఆస్పత్రికి జరిమానా, నోటీస్
సిరిసిల్ల: జిల్లాకేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం అకస్మికంగా దాడులు నిర్వహించారు. అనుమతి లేని ఆస్పత్రులకు జరి మానా విధించి, సంజాయిషీ నోటీసులను జారీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి రజిత తెలిపారు. విధిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని, లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆరోగ్య పథకాల లక్ష్యాలు సాధించాలి జిల్లాలో ఆరోగ్య పథకాల లక్ష్యాలను సాధించాలని డీఎంహెచ్వో రజిత అన్నారు. కలెక్టరేట్లోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లు(సీహెచ్వో), ఎంపీహెచ్ఎస్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గర్భిణుల నమోదు, సకాలంలో అన్ని పరీక్షలు చేసి మాతృ, శిశు మరణాలు తగ్గించాలన్నారు. వర్షాకాల వ్యాధులపై జాగ్రత్తలు వివరించారు. డిప్యూటీ డీఎంహెచ్వో అంజలి ఆల్ఫ్రెడ్, డీఐవో సంపత్కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అనిత, రామకృష్ణ, డిప్యూటీ డెమో రాజ్కుమార్, సీహెచ్వో శాంత, హెచ్ఈ బాలయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
బోనస్ ఎప్పుడొచ్చేనో?
● నెల క్రితమే సన్నధాన్యం కొనుగోళ్లు పూర్తి ● జమైన ధాన్యం డబ్బులు ● బోనస్ కోసం ఎదురుచూపులు ● జిల్లాలో 87,732 క్వింటాళ్ల సన్నవడ్లు సేకరణ ● రైతులకు రూ.4.38కోట్ల బోనస్ బకాయిముస్తాబాద్(సిరిసిల్ల): సన్నవడ్ల బోనస్ కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఎండాకాలం సీజన్లో సన్నధాన్యం సాగుచేసిన రైతులు వర్షాకాలం మొదలుకావడంతో మళ్లీ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. బోనస్ డబ్బులు వస్తే విత్తనాలకు, ఎరువులకు, దున్నకం, నాటువేసే కూలీల ఖర్చుకు ఉపయోగపడతాయని ఆశపడ్డ రైతులకు ఎదురుచూపులే దిక్కయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 87,732 క్వింటాళ్ల సన్నధాన్యాన్ని రైతులు పండించగా.. వారికి రూ.4.38కోట్ల బోనస్ రావాల్సి ఉంది. కొనుగోళ్లు పూర్తయి డబ్బులు ఖాతాల్లో జమకాగా.. సన్నవడ్ల బోనస్ క్వింటాల్కు రూ.500చొప్పున మాత్రం రాలేవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తమ ఖాతాల్లో వేస్తే వానాకాలం పంటల సాగుకు ఉపయోగపడతాయని ఆశలో అన్నదాతలు ఉన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జిల్లాలో 242 కొనుగోలు కేంద్రాల ద్వారా దొడ్డు రకం 2.7 లక్షల మెట్రిక్ టన్నులను 32,556 మంది నుంచి సేకరించారు. సన్నరకం వడ్లు 87,732 క్వింటాళ్లు సేకరించారు. నెల రోజుల క్రితమే సన్నధాన్యం సేకరణ పూర్తయింది. డబ్బులు దాదాపు తొంభై శాతం రైతుల ఖాతాల్లో జమచేశారు. కానీ సన్నరకంపై రావాల్సిన రూ.4.38కోట్ల బోనస్ మాత్రం రైతుల ఖాతాల్లో జమకాలేదు. -
మహిళలు అంచనాకు మించి శ్రమించారు
● కోటీశ్వరులను చేయడమే లక్ష్యం ● ధాన్యం సేకరణలో రికార్డు ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో మహిళలు అంచనాకు మించి శ్రమించి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశారని, రికార్డు స్థాయిలో సేకరించారని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కొనియాడారు. కలెక్టరేట్లో సోమవారం మహిళా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గతంలో మహిళలు 42 కేంద్రాల్లోనే ధాన్యం సేకరించేవారని, వాటిని 190కి పెంచామన్నారు. ఈ యాసంగి సీజన్లో మహిళలకు రూ.7కోట్ల మేరకు ధాన్యం కమీషన్ వచ్చిందని తెలిపారు. వచ్చే సీజన్లో 220 కొనుగోలు కేంద్రాలను కేటాయిస్తామని ప్రకటించారు. ప్రతీ మండలంలో రెండు విత్తన, ఎరువుల దుకాణాలను మహిళలకు మంజూరు చేస్తామని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ను మహిళలు సత్కరించారు. ధాన్యం సేకరణలో బాగా పనిచేసిన మహిళలను కలెక్టర్ సన్మానించారు. డీఆర్డీవో శేషాద్రి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ పి.రజిత, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, అదనపు డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎల్.భాగ్య, డీపీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. కలెక్టరేట్లో జిరాక్స్ సెంటర్ కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు జిరాక్స్ సెంటర్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కలెక్టర్ ఇందిరా మహిళా శక్తిలో భాగంగా శ్రీరాజరాజేశ్వర మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయించారు. మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి సోమవారం ప్రారంభించారు. కోడెలను వ్యవసాయ పనులకే వినియోగించాలి వేములవాడఅర్బన్: రాజన్న గోశాలలో పంపి ణీ చేసే కోడెలను రైతులు వ్యవసాయ పనులకే ఉపయోగించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు 200 కోడెలను సోమవారం పంపిణీ చేశా రు. కోడెలను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయ ఈ వో వినోద్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం పాల్గొన్నారు. -
ఎదురుచూపులే..
యువ వికాసం● లబ్ధిదారులకు నిరీక్షణే ● జూన్ 2న ప్రారంభిస్తామని వాయిదా ● ఆన్లైన్ దరఖాస్తులు.. ఆఫ్లైన్ విచారణ... ఇంటర్వ్యూలు ● అర్హుల ఎంపిక పూర్తి.. అమలు జాప్యందరఖాస్తులు ఇలా.. ఎస్సీ : 8,865 ఎస్టీ : 1,943 బీసీ : 23,243 మైనార్టీ : 1,606 క్రిస్టియన్ : 39 ఈబీసీ : 1,123 మొత్తం : 36,819ఇతను బండ రాజనర్సయ్య. ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన రాజనర్సయ్య గేదెల పెంపకానికి రూ.2లక్షల రుణం కోసం రాజీవ్ యువవికాసంలో దరఖాస్తు చేశారు. అధికారులు ఇంటర్వ్యూ నిర్వహించారు. జూన్ 2న మంజూరుపత్రం ఇస్తామని అధికారులు ప్రకటించారు. కానీ బ్యాంకు లోన్ ఇప్పటి వరకు రాలేదు. గేదెల పెంపకం యూనిట్ గ్రౌండింగ్ కాలేదు. సిరిసిల్ల: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో జాప్యమవుతోంది. జిల్లాలో ప్రధానమైన వ్యవసాయరంగంతోపాటు, అనుబంధ రంగాలను, చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేయించి యువతను స్వయం ఉపాధి మార్గంలో నడిపించే సదాశయంతో ప్రారంభించిన యువవికాసం పథకాన్ని జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించాలని హడావుడి చేశారు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మండల, మున్సిపల్ స్థాయిల్లో ముఖాముఖీ ఇంటర్వ్యూలు నిర్వహించారు. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరుపత్రాలు అందిస్తామని ప్రకటించిన అధికారులు.. ప్రభుత్వ నిర్ణయంతో వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు మంజూరుపత్రాలు అందిస్తారో ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. ఐదు విడతల్లో మంజూరుపత్రాలు ● కేటగిరీ–1లో రూ.50వేలు, కేటగిరీ–2లో రూ.లక్ష వరకు ఉండే యూనిట్లను మొదటి విడతలో జూన్ 9 వరకు మంజూరు చేసి 15వ తేదీలోగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు మంజూరుపత్రాలు ఇవ్వలేదు. ఫలితంగా శిక్షణ ఊసే లేదు. కేటగిరీ–1, 2లో జిల్లా వ్యాప్తంగా 3,919 మంది ఉన్నారు. ఐదు విడతల్లో మంజూరుపత్రాలు ఇవ్వాలని భావించినప్పటికీ మొదటి విడతకే ముహూర్తం కుదరడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు రావాలి జిల్లాలో రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. కలెక్టర్ ఆదేశాలతో కేటగిరీ 1, 2 లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. బ్యాంకర్లు సైతం కాన్సెంట్ ఇచ్చారు. రాజీవ్ యువవికాసం అమలుకు ప్రభుత్వ ఆదేశాలు రావాల్సి ఉంది. – స్వప్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీకేటగిరీ వారీగా యూనిట్ల వివరాలు కేటగిరీ యూనిట్ విలువ యూనిట్లు (అన్ని సామాజిక వర్గాలు) 1 రూ.50వేలు 2,148 2 రూ.50వేలు – రూ.లక్ష 1,771 3 రూ.లక్ష – రూ.2లక్షలు 1,587 4 రూ.2లక్షలు – రూ.3లక్షలు 372 5 రూ.3లక్షలు – రూ.4లక్షలు 308 6 రూ.2లక్షలు – రూ.4 లక్షలు 924 7 బోర్వెల్స్ 08 8 ఎనర్జీ ఓఆర్సీ 02 9 సోలార్ ప్యానెల్స్ 01 ఇతను తెంబరవేణి రాజు. తంగళ్లపల్లికి చెందిన రాజు కుట్టుమిషన్ షాపు కోసం రాజీవ్ యువ వికాసం పథకంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వ సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణం వస్తే స్వయం ఉపాధి పొందాలనుకున్నాడు. కానీ ఇప్పటి వరకు యువ వికాసం యూనిట్లు గ్రౌండింగ్ కాలేదు.. ఇలాంటి పరిస్థితి జిల్లాలో 7,121 మంది అర్హులది. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్చందుర్తి(వేములవాడ): పేదల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తిలోని రైతువేదికలో 89 మందికి మంజూ రైన రూ.29.33లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడిన ఈ ప్రాంతంలోని నిరుపేదలు వైద్యం చే యించుకునేందుకు రూ.20కోట్ల ఎల్వోసీలు అందజేసినట్లు తెలిపారు. పేదల వైద్యం కోసం గత ప్రభుత్వం పదేళ్లలో రూ.400కోట్లు ఖర్చు పెడితే తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.800 కోట్లు వెచ్చించిందని తెలిపారు. మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, పార్టీ మండలాధ్యక్షు డు చింతపంటి రామస్వామి, నాయకులు భీంరా జు కనకరాజు, ఏనుగు లచ్చిరెడ్డి, పులి సత్తయ్య, ఈసరి శ్రీనివాస్, సంటి ప్రసాద్ పాల్గొన్నారు. కోనరావుపేట(వేములవాడ): ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదలకు వరమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండల పరిషత్లో సోమవారం 56 మందికి రూ.18.37 లక్షల విలువైన సీఎమ్మార్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్పాషా, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్చైర్మన్ ప్రభాకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, బొర్ర రవి, చేపూరి గంగాధర్, కార్తీక్, గొట్టె రుక్మిణి పాల్గొన్నారు. -
సారూ.. ఆదుకోరూ..
‘సార్ నా పేరు షేక్ జలీల్. మాకు సిరిసిల్లలోని విద్యానగర్ బైపాస్రోడ్డులో సర్వేనంబరు 517లో స్థలం ఉంది. మా స్థలంలో హోటల్ పెట్టుకోవాలని చూస్తుంటే ఓ బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు బెదిరిస్తున్నాడు. అతనితోపాటు మరికొందరు నేతలకు సంబంధించిన భూమి అదే సర్వేనంబర్లో ఉండగా బైపాస్రోడ్డులో పోయింది. ఆ స్థలానికి వారు పరిహారం కూడా పొందారు. ఇప్పుడు నిరుపేద అయిన నా స్థలాన్ని కాజేయాలని చూస్తుండ్రు. ఈవిషయం నేను గత నెలలో ప్రజావాణిలో మిమ్మల్ని కలిస్తే ఆర్డీవోకు రాసి తహసీల్దార్తో ఎంక్వయిరీ చేయించాలని రాశారు. అక్కడికి వెళితే రికార్డు నేను ఇచ్చిన ఫైలు కాపీలు లేవు అంటున్నారు.. అంటూ కలెక్టర్తో మొరపెట్టుకున్నారు.సిరిసిల్లటౌన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పెద్ద ఎత్తున కలెక్టరేట్ బాట పడుతున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తమ సమస్యలు విన్నవించేందుకు భారీగా తరలివచ్చారు. రోజుల తరబడి పెండింగ్లోనే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేయగా.. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దని అధికారులకు సూచించారు. రెవెన్యూ 51, ఏడీఎస్ఎల్ఏ 7, డీఈవో 7, డీఆర్డీవో 6, డీడబ్ల్యూవో 5, సివిల్ సప్లయ్, ఎస్సీ కార్పొరేషన్, ఉపాఽధి కల్పన శాఖలకు మూడు చొప్పున, సిరిసిల్ల మున్సిపల్, బోయినపల్లి ఎంపీడీవోకు రెండు చొప్పున, ఎస్పీ, ఎస్డీసీ, నీటి పారుదల శాఖ, సెస్, ఎకై ్సజ్, మిషన్ భగీరథ, ఎల్డీఎం, హ్యాండ్లూమ్ ఏడీ, సీపీవోకు ఒక్కొక్కటి చొప్పున మొత్తంగా 134 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఈర్డీవో శేషాద్రి, ఆయా శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.సారూ.. పదహారోసారి నేను రావడం. మాది చందుర్తి మండలం రాజారాంపల్లి. నా భార్య బోజుగారి గంగవ్వ పేరున ఊరి శివారులో 20 గుంటల జాగ ఉంది. యాభై ఏళ్ల కింద మా నాన్న రెండకరాల భూమిని కొనగా వారసత్వంగా మాకు వచ్చింది. ధరణి వచ్చాక స్థలం ఆన్లైన్లోకి రాలేదు. మీరే స్పందించి మా భూమికి పట్టాచేసి పాస్పుస్తకం ఇప్పించాలి..’ అంటూ బోజగారి మల్లేశం కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులను పిలిచి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
మట్టి తవ్వకాలపై విచారణ
● అక్రమ మైనింగ్పై కలెక్టర్కు నివేదిక ముస్తాబాద్(సిరిసిల్ల): నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని భూగర్భ గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ క్రాంతికుమార్ హెచ్చరించారు. ముస్తాబాద్ మండలం పోతుగల్లో పంట పొలాల నుంచి అక్రమంగా మట్టి తరలింపుపై ఏడీ క్రాంతి సోమవారం విచారణ చేపట్టారు. చేనులో తీసిన మట్టి కొలతలను తీసుకోవడం జరిగిందని వి వరించారు. ఎంతమేరకు మట్టిని తవ్వి తీశారో విచారణ చేయనున్నట్లు తెలిపారు. అనుమతులు పొందకుండా భారీ యంత్రాలతో మట్టిని తరలించినట్లు పేర్కొన్నారు. ఇటుకబట్టి పరిశ్రమలకు మట్టిని తరలించారన్నారు. మట్టి తరలింపు కొలతలు, నివేదికను కలెక్టర్కు సమర్పించనున్నట్లు తెలిపారు. అక్రమ మైనింగ్కు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటాచి వాహనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నామని ఆర్ఐ రఘు తెలిపారు. కెనాల్లో మట్టి తొలగింపు ముస్తాబాద్ మండలం పోతుగల్లో మానేరు కెనాల్లో మట్టి వేసి రోడ్డు వేయించిన విషయంపై సోమవారం క్షేత్రస్థాయిలో విచారణ చే శామని డీఈ రవికుమార్ తెలిపారు. కెనాల్లో మట్టివేసి రోడ్డుగా ఉపయోగించుకున్నారని, దీనిపై ఏఈ వంశీకృష్ణ విచారణ చేశారన్నారు. కెనాల్లో మట్టిని వేసిన వ్యక్తుల ఆధ్వర్యంలో యంత్రాలతో తీయించినట్లు తెలిపారు. మరో సారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త పంచాయతీలతో అభివృద్ధి ● ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొత్త గ్రామపంచాయతీలతో అభివృద్ధి జరుగుతుందని ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం పేర్కొన్నారు. మండలంలోని బాకూర్పల్లి, సేవాలాల్తండా నూతన గ్రామపంచాయతీలను సోమవారం అధికారులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. చిన్న పంచాయతీలను అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. జీపీ భవనం కోసం రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎంపీడీవో సత్తయ్య, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ గుండాడి రాంరెడ్డి, అందె సుభాష్ పాల్గొన్నారు. హద్దులు నిర్ణయించండి ఇల్లంతకుంట(మానకొండూర్): అటవీ అధికా రులు తమ భూముల్లో సూచికలు ఏర్పాటు చేస్తున్నారని.. హద్దులు నిర్ణయించాలని కోరుతూ మండలంలోని అనంతారం గ్రామ రైతులు సోమవారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. తహసీల్దార్ ఫారుక్, ఫారెస్ట్ రేంజ్ అధికారి వచ్చి రైతులతో మాట్లాడారు. రెవె న్యూ, ఫారెస్ట్ అధికారులు కలిసి సరిహద్దులు నిర్ణయిస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. అక్కెం నాగరాజు, ఎల్లయ్య, ప్రభాకర్, నరేందర్, తిరుపతి, మల్లేశం, దేవయ్య, హరీశ్ ధర్నాలో పాల్గొన్నారు. శిక్షణతో కళలకు జీవం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అంతరించి పోతున్న కళలను కాపాడుకునేందుకు పిల్లలకు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్లు భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, మ్యూజిక్ అకాడమీ చైర్మన్ అందె భాస్కర్ తెలిపారు. మండలంలోని రాజన్నపేటలో 20 రోజులపాటు కొనసాగిన శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. కోలా టం, జడకొప్పు, చెక్కభజనలపై శిక్షణ ఇచ్చా రు. మాజీ సర్పంచ్ ముక్క శంకర్, మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జూన్ ఫీవర్
సాగు ఖర్చూ తడిసి మోపెడు.. ఉమ్మడి జిల్లాలో సుమారు 6,10,102 మంది రైతులు దాదాపు 12,82,207 ఎకరాల్లో వానాకాలం పంటలు పండిస్తారని అధికారులు అంచనా వేశారు. తొలకరితో పెట్టుబడి సమయం అసన్నమైంది. భూములను చదునుచేసి, దుక్కిదున్ని, విత్తనాలు, ఎరువులకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెరిగిన యాంత్రీకరణ, ఎరువులు, విత్తనాల ధరలు, కూలీల కొరత రైతులను ఏటా వేధిస్తూనే ఉన్నాయి. దీనికితోడు అకాల వర్షాలు, చీడపీడలతో దిగుబడి తగ్గి అన్నదాతలు అప్పుల్లో ఊబీలో చిక్కుకుంటున్నారు. సాగులో ఖర్చు తగ్గించుకునేందుకు విత్తనాలు సొంతగా తయారు చేసుకోవడం, ఆధునిక సాంకేతికను వినియోగించుకోవడం ద్వారా ఆదాయం పెంచుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయినా, పిల్లల చదువులు, వ్యవసాయ పెట్టుబడులు, సీజనల్ వ్యాధులతో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. సాక్షి, పెద్దపల్లి: వేసవి సెలవుల్లో ఆటాపాలతో ఆనందంగా గడిపిన విద్యార్థులు.. పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. ఇదేసమయంలో తొలకరితో ఎరువులు, విత్తనాల కొనుగోలు తదితర ఖర్చులతో సామాన్యులు ‘అమ్మో.. జూన్’ అని ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు వానలతో మారుతున్న వాతావరణ పరిస్థితులతో సీజనల్ వ్యాధుల ప్రబలే అవకాశం.. ఇలా అన్ని రకాల ఖర్చులు ఈనెలలో రానుండటంతో ఎలా గడపాలో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. జూన్ నెల పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు పుట్టిస్తోంది. పెన్సిల్ నుంచి పుస్తకాల వరకూ మోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 938 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా అందులో సుమారు 2,26,829 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం అంటేనే ఫీజులు, పుస్తకాలు, నోట్బుక్సులతోపాటు, వాటిని భద్రపరుచుకునేందుకు బ్యాగులు, లంచ్ బాక్స్లు, పెన్నులు, పెన్సిళ్లు, టైబెల్టులు, యూనిఫామ్స్.. ఇలా ఒఒక్కటేమిటి.. రకరకాల వస్తువులు ఆయా పాఠశాల్లోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. దీంతో యాజమాన్యాలు చెప్పిన ధర చెల్లించలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇంటర్ కాలేజీల్లో సైతం ఏసీ క్యాంపస్లు, నాణ్యమైన విద్యాబోధన పేరిట రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తుండడంతో ఆర్థికభారమైనా.. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం అప్పు లు తెచ్చిమరీ చెల్లిస్తున్నారు. స్టేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల పేరిట నర్సరీ చదువులకే రూ.30వేలకుపైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజుల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నా.. పర్యవేక్షణ, నియంత్రణ మచ్చుకై నా కనిపించడం లేదు. భయపెడుతున్న వైరల్ ఫీవర్ ఒకసీజన్ నుంచి మరోసీజన్లోకి ప్రవేశించేటప్పుడు వాతావారణం చల్లబడి వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరాల తీవ్రత ఉంటుంది. దోమల బెడత పెరిగి ప్రతీ పదిమందిలో నలుగురికి జ్వరం, గొంతునొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో వైద్యం కోసం తరచూ ఆస్పత్రులకు వెళ్లేపరిస్థితి నెలకొని ఉంటోంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో ఏటా జూన్, జూలైలో జ్వరాలతో ఆస్పత్రుల పాలై జేబులు గుల్లచేసుకునే వారు అధికంగానే ఉన్నారు. ఓపీ, టెస్టుల పేరిట ఆస్పత్రుల యాజమాన్యాలు పిండిపిప్పి చేస్తుండటంతో ఈవానాకాల అంటేనే జనాలు భయపడుతున్నారు. వ్యాధుల బారిన పడిన తర్వాత వైద్యఖర్చులకు భయపడడం కన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో డబ్బు ఆదాతోపాటు టెన్షన్ ఉండదని నిపుణులు అంటున్నారు. చదువుల ఫీజులు.. సాగు పెట్టుబడులు.. సీజనల్ వ్యాధులు అన్ని ఖర్చులూ ఒకే నెలలో రావడంతో సర్వత్రా ఆందోళన ఆర్థికభారంతో హడలెత్తిపోతున్న సామాన్య ప్రజలు పెట్టుబడులు పెరిగాయ్ వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతంది. పెరిగిన ఖర్చులతో సాగు చేయడం కష్టంగా మారింది. ఎరువులు, విత్తనాల ధరలు, కూలీల రేట్లు పెరుగుదలలో పోటీపడుతున్నాయి. సాగు సీజన్ వచ్చిందంటే హడలెత్తిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. – మహేశ్గౌడ్, రైతు జూన్ అంటేనే భయం నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు యూకేజీ, మరొకరు సెకండ్ క్లాస్. జూన్ వచ్చిందంటే అడ్మిషన్లు, పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్ల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు ప్రైవేట్ పాఠశాలలు ఏటా ఫీజులు పెంచుతూ మరింత ఆర్థిక భారం మోపుతున్నాయి. – రాదాసు శైలజ, గృహిణి -
అడ్లూరి లక్ష్మణ్ అనే నేను..
● ఉమ్మడి జిల్లాకు మరో మంత్రి పదవి ● అడ్లూరి లక్ష్మణ్ను వరించిన అవకాశం ● విధేయతకు దక్కిన ప్రాధాన్యం ● మూడుకు చేరిన మంత్రుల సంఖ్య ● పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ముగ్గురు మంత్రులు ● కవ్వంపల్లికి విప్ ఇచ్చే అవకాశంధర్మపురికి అచ్చొచ్చిన మంత్రి పదవి తెలంగాణ ఏర్పాటు నుంచి జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి మంత్రివర్గంలో చోటు లభిస్తోంది. 2014లో గెలిచిన కొప్పుల చీఫ్విప్గా కేబినెట్ హోదా అందుకోగా, 2018లో సంక్షేమశాఖ మంత్రిగా వ్యవహరించారు. 2023లో గెలిచిన అడ్లూరి మొదట ప్రభుత్వ విప్గా, తాజాగా మంత్రిపదవి చేపట్టారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిపదవుల్లో పెద్దపీట దక్కింది. ఎన్న డూ లేని విధంగా ముగ్గురు మంత్రి పదవులను దక్కించుకోగా, గడ్డం వివేక్ సైతం ఉమ్మడి జిల్లాతో అనుబంధం కలిగి ఉన్నవారే. దీంతో మొత్తంగా రాష్ట్ర కేబినెట్లో జిల్లావాసులకు సముచిత స్థానం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు గానూ ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయగా, దానికి తగ్గట్టుగా మంత్రి పదవులు దక్కాయనే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లానుంచి ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా కొనసాగుతుండగా, తాజాగా ధర్మపురి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అడ్లూరి లక్ష్మణ్ అదివారం రాజ్భవన్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా, అందులో ముగ్గురికి మంత్రి పదవులు దక్కటంతో కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అన్ని వర్గాలకు సమప్రాధాన్యం కాంగ్రెస అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన తొలిమంత్రివర్గ విస్తరణలో బ్రహ్మణ సామాజికవర్గానికి చెందిన శ్రీధర్బాబు, బీసీగౌడ్ నుంచి పొన్నం ప్రభాకర్కు మంత్రి పదవులు దక్కాయి. మాదిగ సామాజికవర్గానికి చెందిన అడ్లూరి, ము న్నూరు కాపు అయిన ఆది శ్రీనివాస్లకు ప్రభుత్వ విప్లుగా అవకాశం కల్పించారు. ఆదివారం రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అడ్లూరికి మంత్రిపదవి లభించింది. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చివరి నిమిషంలో కేబినెట్లో చోటు దక్కకపోయినా.. ప్రభుత్వ విప్ ఇచ్చే అవకా శాలున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్పుతున్నాయి. తొలిసారి ఎమ్మెల్యే.. కేబినెట్లోకి సుదీర్ఘకాలంగా పార్టీలోనే కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్కుమార్కు మంత్రి పదవిరావడం విధేయతకు పట్టం కట్టినట్లయింది. కార్మిక క్షేత్రమైన గోదావరిఖని నుంచి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టిన అడ్లూరి ఎన్ఎస్యూలో స్టూడెంట్ లీడర్గా, యూత్ కాంగ్రెస్లో, జెడ్పీటీసీ, జెడ్పీచైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా వివిధ హాదాల్లో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రభుత్వ విప్గా కొనసాగగా, తాజాగా కేబినెట్లో చోటు సంపాదించారు. అడ్లూరి లక్ష్మణ్ నేపథ్యం 1982 నుంచి 85 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పని చేశారు. 1986 నుంచి 94 వరకు ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుంచి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 2006లో ధర్మారం (ఎస్సీ) రిజర్వుడ్ స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2010–12 వరకు కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా పని చేశారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2013–14వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పని చేశారు. 2018లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2023 డిసెంబర్ 15న ప్రభుత్వ విప్గా ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆయనకు కేబినెట్లో బెర్త్ కల్పించింది. -
ఆశీర్వచనాలు.. పలకరింపులు
సిరిసిల్లటౌన్/ముస్తాబాద్(సిరిసిల్ల): కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ ఆదివారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. సిరిసిల్లలోని పార్టీ జిల్లా కార్యాలయంలో యూత్ కార్యకర్త అభినయ్ పుట్టిన రోజు వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్ల, ముస్తాబాద్ మండలంలోని పార్టీ నాయకుల ఇళ్లలో జరిగిన వివాహాలకు హాజరై ఆశీర్వదించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాయకులు ప్రతాప రామకృష్ణ, దుమాల శ్రీకాంత్, అన్నల్దాస్ వేణు, రాజిరెడ్డి, రాజాసింగ్, సౌల్ల క్రాంతి, మట్ట వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్ రావు, సంతోష్రెడ్డి, నరేశ్, మల్లారెడ్డి, ఎదునూరి గోపి, శంకర్, మీస సంజీవ్, సత్తయ్య, శ్రీకాంత్, కృష్ణ, మహేశ్, జనార్దన్, సుధాకర్రెడ్డి, వెంకన్న, సత్యం, రమేశ్రెడ్డి పాల్గొన్నారు. -
ఐటీఐ విద్య.. ఉపాధిబాట
● పారిశ్రమికవిద్యతో ఉపాధి అవకాశాలు ● అందుబాటులో ప్రభుత్వ ఐటీఐ ● ప్రారంభమైన ప్రవేశాలు తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఆసక్తి ఉంటే చాలు.. ఐటీఐ శిక్షణతో చిన్నవయసులోనే ఉద్యోగాలు సాధించవచ్చు. సొంతంగా వర్క్షాపలు పెట్టుకొని ఇతరులకు ఉపాధి కల్పించవచ్చు. డీగ్రీలు..పీజీలు చదువకుండానే పోటీ ప్రపంచంలో తక్కువ సమయంలోనే ఉద్యోగ, ఉపాధి మార్గాలు చూపుతుంది ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ). పదోతరగతి అర్హతతో రెండేళ్లు ఐటీఐ పూర్తిచేసి మరో ఏడాది గౌరవ వేతనంతో కూడిన అప్రెంటీస్షిప్ పూర్తిచేస్తే చాలు ఉద్యోగం సాధించినట్లే. ఐటీఐ పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. పదోతరగతి పూర్తయిన వారు https://iti.telangana. gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ జిల్లా విద్యార్థులు ఒకప్పుడు ఐటీఐ విద్య కోసం పెద్దపల్లి వంటి దూరప్రాంతానికి వెళ్లేవారు. కానీ ఇప్పుడు జిల్లాలోనే ప్రభుత్వ ఐటీఐ ఉంది. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో రూ.7.77కోట్లతో ఐటీఐని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధునాతన భవనం, నిష్ణాతులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారు. మండెపల్లి ప్రభుత్వ ఐటీఐలో ప్రస్తుతం ఆరు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, వెల్డర్, మోటార్ మెకానిక్ వెహికల్, డీజిల్ మెకానిక్, సీవోపీఏ కోర్సులు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరికొన్ని కోర్సులు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఆర్టిఫిషియల్ యూజింగ్ అడ్వాన్స్ టూల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకానిక్ ఎలక్ట్రానిక్స్ వెహికల్, బేసిక్ డిజైన్ వర్చువల్ వెరిఫయర్ వంటి అధునాతన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. అవకాశాలు మెండు సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ రామగుండం, టీఎస్ ఎన్పీడీసీఎల్, టీస్ ఎస్పీడీసీఎల్, రైల్వే, ఆర్టీసీ, బీహెచ్ఈఎల్, డీఆర్డీవో, ఇస్త్రో వంటి ప్రభుత్వ రంగసంస్థలతోపాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వంటి రక్షణ రంగాల్లో ఐటీఐ చదివిన వారికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ప్రైవేటు పారిశ్రామికరంగంలోనూ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ(టామ్కామ్) ద్వారా ఐటీఐ విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు సాధించారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఏటీసీ ప్రస్తుతం ప్రభుత్వ ఐటీఐలో ఏడు కోర్సులు అందుబాటులో ఉన్నా యి. ఐటీఐ ప్రాంగణంలోనే ఏటీసీ నిర్మాణం కూడా పూర్తయ్యింది. రాబోయే విద్యా సంవత్సరంలో మరిన్ని అధునాతన కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం ఐటీఐలో ప్రవేశాలు ఆన్లైన్ ద్వారా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – ఎస్.కవిత, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ -
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సిరిసిల్ల: జిల్లాలో అన్నదాతలు రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు సాధించారు. గతంలో ఎన్న డూ లేని విధంగా 2,73,636.604 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఫలితంగా రైతులకు రూ.724.84కోట్లు చేతికి అందాయి. జిల్లాలో రెండు నెలలపాటు సేకరించిన ధాన్యానికి సంబంధించి రూ.6కోట్ల కమీషన్ మహిళా సంఘాలకు జమవుతున్నాయి. ఈ సీజన్ మహిళా సంఘాలకు ఆర్థికంగా కలిసివచ్చింది. జిల్లా వ్యాప్తంగా 243 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా.. ఇందులో 190 కేంద్రాలను మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో ఏర్పాటయ్యాయి. రూ.470కోట్ల విలువైన వడ్లు సేకరించిన మహిళలు జిల్లాలో 190 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఇందిరా మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రూ.470 కోట్ల విలువైన 2.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 32,556 రైతుల నుంచి సేకరించగా.. 32,087 మంది ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. మిగతా వారికి త్వరలోనే అందనున్నాయి. రూ.6కోట్ల కమీషన్ ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు సేకరించిన ధాన్యం ఒక క్వింటాలుకు రూ.32 కమీషన్గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన జిల్లాలోని మహిళా సంఘాలకు రూ.6కోట్ల కమీషన్ రానుంది. కలెక్టర్ సందీప్కుమార్ ఝా చొరవతో జిల్లాలో మహిళా సంఘాలు రూ.6 కోట్ల వడ్ల కమీషన్ దక్కనుంది. ప్రభుత్వ, ప్రైవేటు కొనుగోళ్లతో జిల్లా రైతులకు రూ.724.84కోట్ల శ్రమఫలం దక్కనుంది. నేడు మహిళా సంఘాల సమావేశం కలెక్టరేట్లో సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక సమావేశాన్ని డీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో చాలాకాలం తరువాత 190 మహిళా శక్తి సంఘాలకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కల్పించారు. కలెక్టర్ చొరవతో జిల్లాలోని మహిళా సంఘాలకు రూ.6కోట్ల కమీషన్ రానుంది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ను డీఆర్డీఏ అధికారులు సన్మానిస్తున్నారు. ఈమేరకు మహిళా సంఘాలకు కలెక్టరేట్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ముగిసిన కొనుగోళ్లు రైతుల శ్రమఫలం రూ.724.84కోట్లు 2,73,636.604 మెట్రిక్ టన్నులు సేకరణ ప్రైవేటుగా 4,310.344 మెట్రిక్ టన్నులు సేకరణ మహిళా సంఘాలకు రూ.6కోట్ల కమీషన్ జమ నేడు కలెక్టర్ను సన్మానించనున్న మహిళా సంఘాలుధాన్యం కొనుగోళ్లు ఇలా.. కొనుగోలు కేంద్రాలు : 246మూసివేసిన కేంద్రాలు : 243కొనుగోలు చేసిన ధాన్యం : 2,69,326.260 మెట్రిక్ టన్నులు ధాన్యం విలువ : రూ.624.84 కోట్లు వడ్లు అమ్మిన రైతులు : 42,119డబ్బులు పొందిన రైతులు : 41,511జమయిన డబ్బులు : రూ.543.86 కోట్లు -
మిర్గం ర(ఫి)ష్
మృగశిరకార్తే ప్రవేశించిన రోజు చేపల కోసం జనాలు ఆదివారం తెల్లవారు జాము నుంచే మార్కెట్ బాట పట్టారు. ఇన్నాళ్లు ఎండలు దంచికొట్టడంతో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. మృగశిరకార్తేతో వర్షాలు మొదలవుతాయి. వాతావరణంలో మార్పులు సంభవించే సమయంలో శరీరంలో మార్పులు.. ఉబ్బసం వంటి వ్యాధి నివారణకు చేపల కొనుగోలు చేశారు. మరికొందరు చేప మందు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. చేపలకు గిరాకీ ఉండడంతో బొమ్మెలు కిలోకు రూ.500, రవులు రూ.200, రొయ్యలు రూ.600 ధర పలికాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల -
పేదలకు ఆపన్నహస్తం అందించడమే లక్ష్యం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: పేదలకు ఆపన్నహస్తం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అధికారులు, పార్టీ నాయకులతో కలసి ఆదివారం భూమిపూజ చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి కోసమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని హామీలిచ్చి తుంగలో తొక్కారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలో భూమిలేని పేదలకూ భూమితోపాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తామన్నారు. క్షత్రియ అన్నదాన సత్రం నిర్మాణానికి భూమి పూజ వేములవాడఅర్బన్: వేములవాడలో శ్రీరాజరాజేశ్వర సగర క్షత్రియ అన్నదాన సత్రం భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ ఆదివారం భూమి పూజ చేశారు. సత్రం అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, రాష్ట్ర కోశాధికారి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి సీత కమలాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దబుద్దుల సతీశ్సాగర్, రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పరి మహేందర్, గంటి శ్రీనివాస్, సమ్మన్న పాల్గొన్నారు. బీసీలు సంఘటితమైతేనే రాజ్యాధికారం సిరిసిల్లకల్చరల్: బీసీలు సంఘటితమైతేనే రాజ్యాధికారం సాధ్యమని సమితి రాష్ట్ర అధ్యక్షుడు కటకం నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వస్త్ర, వ్యాపార సంఘ భవనంలో జరిగిన సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చైతన్యమే ఆయుధంగా జ్యోతిబాపూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచన విధానంతో ఐకమత్యాన్ని సాధించి రాజ్యాధికారం సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు. అధికార సాధనతోనే బీసీల్లో సామాజిక, ఆర్థిక స్థిరత్వం వస్తుందన్నారు. త్వరలోనే ప్రతి బీసీ కులం నుంచి ఇద్దరు ప్రతినిధులను సమన్వయ కర్తలు నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15న బీసీ చైతన్య పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దొంత ఆనందం, మంగలిపల్లి శంకర్, శ్రీగాద మైసయ్య, దొంత దేవదాస్, వెంగల అంకయ్య, వెంగల లక్ష్మణ్, డాక్టర్ జనపాల శంకరయ్య పాల్గొన్నారు. -
కేబినెట్లోకి ఎవరో?
● ఉమ్మడి జిల్లా నుంచి ఒకరికి అవకాశం ● కవ్వంపల్లి, ఆది, అడ్లూరిలో ఒకరికి చోటు? ● ఉత్కంఠలో ఆశావహులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎప్పుడెప్పుడా... అని ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కేబినెట్ విస్తరణ ఆదివారం జరుగనుంది. కేబినెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రి పదవి దక్కడం ఖాయమనే సమాచారం ఉంది. ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరికి చోటు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గురించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆలోచన చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతును కూడగట్టే భాగంగా అధిష్టానం ఉమ్మడి జిల్లాలో ఒకరికి మంత్రి పదవీ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ విప్గా కొనసాగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్నూరు సామాజికవర్గం కోటాలో మంత్రివర్గంలో బెర్తు ఖాయమనే ఊహగానాలు వినబడుతున్నాయి. ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్, జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కేబినెట్లో చోటు ఖాయమని వారి అనుచరులు ధీమాగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు వ్యవహరిస్తుండగా ప్రస్తుత మంత్రివర్గంలో ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరిని తీసుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా పార్టీ అధిష్టానం సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈమేరకు కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్ నేతలను సామాజిక వర్గం అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి కరీంనగర్ నుంచి కేబినెట్లో ఒకరిని మంత్రిగా నియమించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఆదివారం జరిగే కేబినెట్ విస్తరణలో జిల్లా నుంచి ఈ ముగ్గురిలో ఒకరికి చోటు దక్కి ఉత్కంఠకు తెరపడనుంది. -
చెరువులు ధ్వంసమవుతున్నాయి
అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు తమ స్వార్థం కోసం మట్టిని తరలిస్తుండగా.. చెరువులు, కుంటలు, గుట్టలు ధ్వంసమవుతున్నాయి. మండలం నుంచి నిత్యం 20 నుంచి 25 వాహనాల వరకు మట్టిని తోడేస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ అధికారులు మట్టి తరలిపోకుండా తగు చర్యలు తీసుకోవాలి. – నిమ్మల బాబు, రైతు, దుమాల అనుమతులు లేకపోతే చర్యలు అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే చర్యలు తీసుకుంటాం. వాహనాలను సీజ్ చేస్తాం. నిబంధనల ప్రకారం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తాం. అవసరాల కోసం మట్టి తప్పనిసరైతే మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. అప్పులే మట్టి కొట్టుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం.– సుజాత, తహసీల్దార్ -
ప్రభుత్వ స్కూల్కు టీచర్ కూతురు
వేములవాడఅర్బన్: ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన కూతురును ప్రభుత్వ స్కూల్లో చేర్పించాడు. కథలాపూర్లో టీచర్గా విధులు నిర్వర్తించే కిష్టయ్య.. 9వ తరగతి చదువుతున్న తన కూతురు మధురిమను వేములవాడలోని ప్రభుత్వ స్కూల్ చేర్పించాడు. ఈమేరకు శని వారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాడు. కిష్టయ్యను మండల విద్యాధి కారి బన్నాజీ, ఉపాధ్యాయులు హరికృష్ణ, బా లరాజు, కృష్ణ తదితరులు అభినందించారు. ‘ఇసుక ట్రాక్టర్లు వెళ్లేందుకు వీల్లేదు’ తంగళ్లపల్లి(సిరిసిల్ల): తమ గ్రామంలోని ఇరుకురోడ్లపై ఇసుక ట్రాక్టర్లు తిరిగేందుకు వీల్లేకుండా ఉందని కస్బెకట్కూర్ అనుబంధ చింతాలపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. తమ గ్రామంలో నుంచి ఇసుక ట్రాక్టర్లు వెళ్లేందుకు వీల్లేదన్నారు. ఈమేరకు శనివారం ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అనంతరం తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుని తమ సమస్యను పోలీసులకు విన్నవించారు. చింతాలపల్లి నుంచి కా కుండా గండిలచ్చపేట నక్కవాగు బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేయండి బోయినపల్లి(చొప్పదండి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ను మండల బీజేపీ అధ్యక్షుడు ఎడపల్లి పరశురాం ఆధ్వర్యంలో బోయినపల్లి రజక సంఘం నాయకులు శనివారం కలిశారు. తమ కుల సంఘ భవనం అభివృద్ధి, మడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఉదారి నరసింహాచారి, రజక సంఘం అధ్యక్షుడు గంగిపెల్లి మొండయ్య, దుడ్డెల మల్లేశం, గంగిపెల్లి రాజశేఖర్, గంగిపెల్లి శ్రీనివాస్, దుడ్డెల లచ్చయ్య, కొత్తకొండ రమేశ్ తదితరులు ఉన్నారు. క్రీడలతో మానసికోల్లాసం రుద్రంగి(వేములవాడ): క్రీడలతో మానసికోల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం కలుగుతుందని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రుద్రంగిలోని జెడ్పీ హైస్కూల్లో జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన వాలీబాల్ ఉచిత వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి అతిథులుగా సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గంగం మహేశ్ హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు కర్ణవత్తుల చందు, దేశవేని శ్రీనివాస్, అంబటి శంకర్, దయ్యాల శ్రీనివాస్, అంబటి శ్రీనివాస్, రోమాల అశోక్, అక్కెనపల్లి శ్రీనివాస్, కోచ్లు ఆరిపళ్లి రవి, సుంచు అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా పెద్దమ్మ కల్యాణం తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్లలో పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మాట్ల మధు, బీజేపీ నాయకులు సుధాకర్, రాజేందర్, రమేశ్, నరేశ్, సందీప్, జిల్లెల్ల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పిట్ల మల్లేశం, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రారండోయ్.. సర్కారు బడికి
● ఊరూరా జయశంకర్ బడిబాట ● ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ఇంటింటా ప్రచారం ● ఆకర్షించే కార్యక్రమాలు ● పిల్లలు సర్కారు బడిలో చేరాలని పిలుపుఇదే మా ఓపెన్ చాలెంజ్..● మా పిల్లల కన్నా ‘ప్రైవేటు’ వాళ్లు బాగా చదివితే రూ.500 నజరానా ● పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి స్కూల్ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం ధర్మారం: ‘ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మా పిల్లల కన్నా బాగా చదవగలరా..? అలా ఒక్క విద్యార్థి చదివినా రూ.500 నజరానా ఇస్తాం’.. అంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నారు. బడిబాటలో భాగంగా ఇంటింటా తిరుగుతూ.. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీమోహనాచార్యులు, ఉపాధ్యాయులు కలిసి ఫిబ్రవరి 21నుంచే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు బడికి పంపించాలని కోరుతున్నారు. తమ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థుల కన్నా ప్రైవేటులో చదివేవారు ప్రతిభ కనబరిస్తే.. రూ.500నగదు బహుమతి అందిస్తాని చాలెంజ్ చేస్తున్నారు. పాఠశాల ప్రత్యేకతలను వివరిస్తూ.. ఇంటింటా కరపత్రాలు పంచుతున్నారు. ఇప్పటి వరకు పాఠశాలలో 36 మంది విద్యార్థులుండగా.. బడిబాటలో భాగంగా 14మంది అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్ఎం తెలిపారు. గ్రామంలోని ప్రతీ విద్యార్థి సర్కారు బడికి వచ్చేలా చొరవ చూపుతామని పేర్కొన్నారు.ఇంగ్లిష్ మీడియం చదువులు.. ఉచితంగా ఏకరూప దుస్తులు.. షూలు.. చదువుకునేందుకు పాఠ్యపుస్తకాలు.. ఆకలేస్తే మధ్యాహ్నం రుచికరమైన పౌష్టికాహారం.. విశాలమైన డిజిటల్ తరగతి గదులు.. క్రీడా మైదానాలు.. సకల సౌకర్యాలు.. అన్నింటికీ మించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. ఇంకెందుకు ఆలస్యం.. రారండోయ్ సర్కారు బడికి అంటూ.. ఊరూరా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రూ.లక్షలు పోసి ప్రైవేటులో చదివించే కన్నా.. అన్నీ ఉచితంగా అందిస్తున్న సర్కారు బడిలో చేరాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వినూత్నంగా ప్రచారం చేస్తూ.. పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై సండే స్పెషల్..– వివరాలు 10లోu -
సారూ.. చీరలు అడ్డుపెట్టుకుంటున్నాం
● ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోండి ● ‘డబుల్’ లబ్ధిదారుల వేడుకోలుతంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘సారూ..చీరలు అడ్డుపెట్టుకుని ఉంటున్నాం. వానకు..చలికి ఇబ్బంది పడుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు వస్తే గోడలు కట్టుకుంటాం.. ఆదుకోండి..’ అంటూ తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ అనుబంధ చింతాలపల్లి గ్రామానికి చెందిన సావనపల్లి నర్సవ్వ వేడుకుంటుంది. ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే ఉన్న పాత ఇంటిని కూలగొట్టి.. 25 గుంటల భూమి అమ్మి కొత్తగా ఇంటి పనులు మొదలుపెట్టినట్లు తెలిపింది. స్లాబ్ వరకు పనులు జరిగి ఆగిపోయాయని.. మూడేళ్లుగా స్లాబ్ చుట్టూ పాతచీరలు, పరదాలు కట్టుకుని ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. వర్షాకాలం, చలికాలంలో ఉండలేకపోతున్నామని కన్నీరుమున్నీరయ్యారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా, కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్రెడ్డి స్పందించి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్నారు. -
కొత్త కోర్సు.. ఉపాధి చూపు
● బీకాం విద్యార్థుల కోసం బీఎఫ్ఎస్ఐ ● గంభీరావుపేట డిగ్రీ కళాశాలలో ప్రారంభం ● దోస్త్ విధానంలో ప్రవేశాలు ● విజ్ఞానంతోపాటు నైపుణ్యానికి ప్రాధాన్యతగంభీరావుపేట(సిరిసిల్ల): వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) రంగంలో నిపుణులను తయారు చేసేందుకు డీగ్రీలో కొత్త కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సు ఉద్యోగావకాశాలు కల్పించే నైపుణ్యాలు అందించనుంది. ఈ కోర్సును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశపెట్టారు. గంభీరావుపేట మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. దోస్త్ విధానంలో జరుగుతున్న ప్రవేశప్రక్రియలో బీఎఫ్ఎస్ఐ కోర్సులో చేరుతున్న విద్యార్థులు ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్లు, బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు వంటి వాటిపై లోతైన అవగాహన పొందగలుగుతారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు బ్యాంకులు, ఎన్బీఎఫ్ఎస్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీ రంగాల్లో ఉద్యోగావకాశాలు విస్తృతంగా లభిస్తాయంటున్నారు. విజ్ఞానంతోపాటు నైపుణ్యానికి ప్రాధాన్యత ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విజ్ఞానంతోపాటు నైపుణ్యాలు అందించడంలో కొంత వెనుకబడిపోతున్నాం. ఈ నేపథ్యంలో బీకాం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన బీఎఫ్ఎస్ఐ కోర్సు ఒక కీలకమైన పరిష్కారంగా నిలుస్తోంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో టెక్నికల్ నాలెడ్జ్తోపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. బీఎఫ్ఎస్ఐ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగాల్లో నిపుణుల కొరతను తీర్చడానికి విద్యార్థులను తీర్చిదిద్దే కోర్సులు అవసరం. ఈ కోర్సు విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం, మార్కెట్పై అవగాహన, క్లయింట్ హ్యాండ్లింగ్ మాదిరి నైపుణ్యాలను పెంచుతుంది. కోర్సు విశేషాలు డిగ్రీలో బీకాం చదవాలి అనుకునే విద్యార్థులు దోస్త్ ద్వారా అప్లయ్ చేసుకొని గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ తరగతులతోపాటు అప్రెంటీస్షిప్ తరగతులు ఉంటాయి. దీంతో కంపెనీల్లో పనిచేసే అనుభవం పొందగలుగుతారు. మూడేళ్ల కోర్సు వ్యవధిలో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. ఫైనలియర్లో ఆరు నెలల శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.4వేల చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తారు. త్వరగా స్థిరపడాలనుకునే వారికి చక్కని అవకాశం భవిష్యత్లో ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకొని త్వరగా స్థిరపడటానికి వీలు పడే కోర్సు బీఎఫ్ఎస్ఐ. ఈ కోర్సు స్పెషలైజేషన్ ద్వారా బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సేవలు, బీమారంగాల్లో ప్రావీణ్యం పొందగలుగుతారు. గంభీరావుపేట కళాశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టాం. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వి.విజయలక్ష్మి, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ప్రిన్సిపాల్, గంభీరావుపేట -
మట్టే బంగారమాయే !
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో మట్టి దందా జో రుగా సాగుతోంది. గుట్టలు కరిగిపోతుండగా.. చె రువులు, కుంటలు ఖాళీ అవుతున్నాయి. మైనింగ్ అ ధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో స్మగ్లర్లకు మట్టి కాసులు కురిపిస్తోంది. అనుమతులు లేకుండా తరలిస్తున్న స్మగ్లర్లు ట్రిప్పునకు రూ.4వేలు వసూలు చేస్తున్నారు. ఇంత వసూలు చేస్తున్నా ప్రభుత్వానికి పన్నులు మాత్రం చెల్లించడం లేదు. యథేచ్ఛగా రవాణా ● జిల్లాలో మట్టిదందా యథేచ్ఛగా సాగుతోంది. ఎల్లారెడ్డిపేట మండలంలో నిత్యం 20 నుంచి 25 ట్రిప్పుల వరకు మట్టి తరలిపోతుంది. ఒక్క ఎల్లారెడ్డిపేట మండలంలోనే ప్రతీ రోజు రూ.లక్ష వరకు వ్యాపారం జరుగుతుందంటే జిల్లా వ్యాప్తంగా ఇంకెంత జరుగుతుందో అంచనా వేయొచ్చు. ● జిల్లాలో వేములవాడ చుట్టుపక్కల గ్రామాల్లో మట్టి దందా జోరుగా సాగుతోంది. వేములవాడ శివారు ప్రాంతాలు, అగ్రహారం, బోయినపల్లి మండలాల్లో మట్టి దందా సాగుతోంది. ● చందుర్తి, రుద్రంగి మండల కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు మట్టి తరలిపోతుంది. ● గ్రామాల్లోని సహజవనరులు ధ్వంసమవుతున్నాయి. పడిపోతున్న భూగర్భజలాలు చెరువులు, కుంటలు, గుట్టల నుంచి మట్టి తరలిస్తుండడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గతంలో మానేరువాగు ఏడాది పొడవునా నీరు పారేది. కానీ నేడు వర్షాకాలంలోనూ నీటిదార కనిపించలేదు. పంట పొలాల్లో బోరుబావులు వట్టిపోతున్నాయి. కొత్తగా 400 నుంచి 500 ఫీట్ల వరకు వేస్తేనే బోరుబావుల్లో నీటిదారలు కనిపిస్తున్నాయి. సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికై నా మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించి మట్టిదందాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. స్మగ్లర్లకు కాసులు కురిపిస్తున్న దందా అక్రమంగా వ్యాపారం ప్రభుత్వ ఆదాయానికి గండి మాయమవుతున్న గుట్టలు పట్టించుకోని మైనింగ్ అధికారులు -
విద్య, వైద్యం అందించడమే లక్ష్యం
రుద్రంగి(వేములవాడ): పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు మెరుగైన ప్రభుత్వ ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగిలో నిర్మిస్తున్న 30 పడకల ఆస్పత్రి పనులను శుక్రవారం పరిశీలించారు. అనంతరం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని పరిశీలించి అధికారులకు ఫోన్చేసి త్వరగా తూకం వేయాలని సూచించారు. రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్రెడ్డి, తర్రె లింగం, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గండి నారాయణ, పల్లి గంగాధర్, దువ్వాక గంగాధర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక వేములవాడఅర్బన్: ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడఅర్బన్ మండలం చింతాల్ఠాణాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
తాగి వాహనాలు నడపొద్దు
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్లక్రైం: మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరా రు. జిల్లాలో పది రోజుల వ్యవధిలో 77 మందిపై డ్రంకెన్డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో 46 మందికి జరిమానాలు, 31 మందికి జైలుశిక్ష ఖరారు చేసినట్లు వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయన్నారు. దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనాలకు బీమా చేయించుకోవాలన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
● జెడ్పీ సీఈవో గీత కోనరావుపేట(వేములవాడ): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని జెడ్పీ సీఈవో గీత కోరారు. కోనరావుపేట మండల పరిషత్లో కార్యదర్శులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఇంకా ముగ్గులు పోసే దశలోనే ఉంటున్నాయని, వెంటనే పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో శంకర్రెడ్డి, లేబర్ ఆఫీసర్ రఫీక్, ఎంపీవో ఆరిఫ్పాషా, ఏఈ సాయిప్రసన్న తదితరులు పాల్గొన్నారు. యారన్ సబ్సిడీ అందించాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): టెక్స్టైల్ పార్క్లో పనిచేసే పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న యారన్ సబ్సిడీని వెంటనే అందించాలని సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. టెక్స్టైల్ పార్క్లో చేనేత జౌళిశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్వీ రావుకు వినతిపత్రం అందజేశారు. రమణ మాట్లాడుతూ కార్మికులకు నిరంతరం ఉపాధితోపాటు మెరుగైన వేతనాలు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. టెక్స్టైల్ పార్కు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్, మా మిడాల శ్రీనివాస్, రాచర్ల వేణు, పులి రమేశ్, కందికట్ల శ్రీనివాస్, వెంకటేశ్ పాల్గొన్నారు. 9న ఐటీఐలో అప్రెంటీస్ మేళా సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో ఈనెల 9న జాతీయస్థాయి అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కవిత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 2024 నాటికి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మో టార్ వెహికల్, వెల్డర్ ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని కోరారు. ఎస్సెస్సీ మెమో, ఐటీఐ మెమో, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణపత్రాలతో హాజ రుకావాలని తెలిపారు. వివరాలకు 86886 12668లో సంప్రదించాలని సూచించారు. మధ్యాహ్న కార్మికుల బిల్లులు చెల్లించాలి సిరిసిల్లటౌన్: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి మాట్లాడారు. కార్మికులకు ఆరు నెలల మెస్చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు, గౌరవ వేతనం పెండింగ్లో ఉందన్నారు. వెంటనే విడుదల చేయాలని కోరారు. నాయకులు గురిజాల శ్రీధర్, కార్మికులు వసంత, సత్తవ్వ, పద్మ, ఎల్లవ్వ, భాగ్య పాల్గొన్నారు. ఏరియా ఆస్పత్రిలో కాయకల్ప బృందంవేములవాడఅర్బన్: వేములవాడ ఏరియా ఆస్పత్రిని కాయకల్ప బృందం అధికారులు శుక్రవారం సందర్శించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు, నిర్వహణపై కాయకల్ప టీమ్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. గతంలోనూ ఈ ఆస్పత్రికి మూడుసార్లు కాయకల్ప అవార్డుతోపాటు ఎన్క్వాస్లో మొదటిస్థానం, లక్ష్యలో మొదటి స్థానం నిలిచిందని వివరించారు. ఈ ఏడాది సైతం ఆస్పత్రి మొదటిస్థానంలో నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యులు సతీశ్, అస్సెసర్ స్టెల్లా, పెరుక తిరుపతి, నిషాత్ సల్మా, సుభాషిణి, సంతోష్చారి ఉన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. పేద కుటుంబానికి శాపం
● ఇంటినంబరు తప్పు మంజూరుతో ఇరకాటం ● అధికారులను వేడుకుంటున్న పేద కుటుంబం ● మున్సిపల్ తప్పునకు ఇల్లు కోల్పోతున్న బాధితులుసిరిసిల్లటౌన్: మున్సిపల్ అధికారులు చేసిన తప్పు.. ఓ నిరుపేద కుటుంబానికి శాపంగా మారింది. ఇంటినంబర్ తప్పుగా నమోదు చేయడం.. పాత నంబర్ను ఇతరులకు కేటాయించడంతో మంజూరైన ఇందిరమ్మ ఇల్లు రద్దయ్యేలా ఉంది. బాధితులు తెలిపిన వివరాలు. నేతకార్మికుడు అరికాల పాపయ్యకు స్థానిక 11వ వార్డులో స్థలం ఉంది. రాజీవ్నగర్.. సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం కాకముందు గ్రామపంచాయతీగా ఉండేది. ఆ సమయంలో వీరు నివసించిన ఇంటి నంబర్ 11–55గా ఉండేది. దీనిని గ్రామపంచాయతీ కార్యదర్శి 11–56గా ఇచ్చారు. ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఇల్లు కట్టుకుంటామంటే అసలు ఇంటి నంబర్ లేదని, ఆ ఇంటి నంబర్ వేరేవాళ్లకు కేటాయించారన్నారు. దీంతో తమ ఇంటి రికార్డ్స్ మున్సిపాలిటీలో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ప్రజావాణిలో మున్సిపల్ ప్రత్యేకాధికారి, కలెక్టర్కు విజ్ఞప్తి చేయగా.. సిరిసిల్ల మున్సిపల్ అధికారులను దీనిపై చర్యలు తీసుకోమని ఆదేశించారన్నారు. మున్సిపల్కు వెళ్తే ఈ ఇంటి నంబర్ వేరే వాళ్లకు ఇచ్చామని.. తమకు కొత్త ఇంటి నంబర్ ఇస్తామంటున్నారని వాపోయాడు. కలెక్టర్ జోక్యం చేసుకొని తమకు కేటాయించిన ఇంటి నంబర్నే ఇవ్వాలని కుటుంబ సభ్యులు శారద, జశ్వంత్ కోరుతున్నారు. సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారుల తప్పిదానికి పేద కుటుంబానికి సొంతింటి కల దూరం చేయొద్దని కోరారు. -
ప్రభుత్వ కళాశాలలోనే చేరాలి
సిరిసిల్లటౌన్: విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలోనే చేరాలని సిరిసిల్ల ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్ అన్నారు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్) కళాశాల అధ్యాపకులు వెంకంపేట ప్రాంతంలో ప్రచారం చేపట్టారు. ప్రిన్సి పాల్ విజయ రఘునందన్, అధ్యాపకులు పాల్గొన్నారు. మెరిట్ స్కాలర్షిప్కు ఎంపిక చందుర్తి(వేములవాడ): మండలంలోని మల్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీదర్ల దీక్షిత జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్కు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు శరత్చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యాయులు అభినందించారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): తాడూర్ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని కొత్వాల సహస్ర జాతీయ స్థాయి ఉపకార వేతనానికి ఎంపికైంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు సహస్ర ఎంపికైనట్లు హెచ్ఎం బూర రవీందర్ శుక్రవారం తెలిపారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు అభినందించారు. ఈ స్కాలర్షిప్ ద్వారా నెలకు రూ.వెయ్యి చొప్పున ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం అందివ్వనుంది. -
హద్దుల్లేని మైనింగ్
● ఈటీఎస్ సర్వేలో వెలుగులోకి అక్రమాలు ● జిల్లాలోని వ్యాపారులకు రూ.129కోట్ల జరిమానా ● అభివృద్ధి పనులకు కంకర సరఫరా చేశామని లెక్కలు ● జరిమానాలు తప్పించుకునేందుకు యత్నం సిరిసిల్ల: జిల్లాలో మైనింగ్ హద్దులు దాటింది. గనుల గడువు ముగిసినా అక్రమ తవ్వకాలు సాగించారు. నిర్ణయించిన హద్దులను దాటి తవ్వకాలు చేపట్టారు. రెవెన్యూ, గనులశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో క్వారీల యాజమాన్యాలు ఆడింది ఆటగా చెలామణి అయింది. ప్రభుత్వానికి సీనరేజీ, రాయల్టీ చెల్లించలేదు. జిల్లాలోని 14 క్వారీలకు, 9 క్రషర్లకు గడువు దాటిపోయిందని గనులశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. కొన్నింటిని ఏకంగా నిషేధిత జాబితాలో పెట్టారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. క్రషర్లలో నలిగిన నిబంధనలు జిల్లాలో నిబంధనల మేరకు మైనింగ్శాఖ 2020లో మైనింగ్కు అనుమతించింది. వీటి గడువు ఇప్పటికే ముగిసిపోయింది. 1994 ఆదేశాల మేరకు ఐదు హెక్టార్లకు మించి ఖనిజాల తవ్వకాలు సాగిస్తే పర్యావరణ అనుమతులు పొందాలి. కానీ జిల్లాలో ఆ నిబంధనలు అమలుకావడం లేదు. రోడ్లు, భవనాల నిర్మాణాలకు అవసరమైన అన్ని సైజుల కంకర తయారీ కాగా.. క్రషర్లలో నిబంధనలు పాటించలేదు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన మైనింగ్ అధికారులు జిల్లాలోని పలు స్టోన్ క్రషర్లకు నోటీసులు ఇచ్చారు. వీటిపై యజమానులు కోర్టుకు వెళ్లగా యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. పక్క‘దారుల్లో’ అక్రమార్కులు జిల్లాలో అక్రమ మైనింగ్తో గుట్టలను గుల్లచేసిన అక్రమార్కులకు జిల్లాలో రూ.129కోట్ల జరిమానాలు విధించారు. ఈమేరకు ఆయా స్టోన్క్రషర్లకు నోటీసులు జారీచేసి వన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) అవకాశం కల్పించారు. అక్రమార్కులు దోచుకున్న సీనరేజీ, రాయల్టీ పన్నులను చెల్లించాల్సి వస్తోందని కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు అన్ని సైజుల కంకరను సరఫరా చేసినట్లు చెబుతున్నారు. ఈమేరకు పక్క‘దారులు’ వెతుకుతున్నారు. ఏ అభివృద్ధి పనికి ఎంత మేరకు సరఫరా చేశారో వివరాలు ఇవ్వాలని మైనింగ్ అధికారులు కోరగా.. ఆ లెక్కలను అందించే పనిలో పడ్డారు. గనుల స్వరూపం కలర్ గ్రానైట్ లీజులు : 24రాయి(కంకర) లీజులు : 16పట్టాభూములు : 40.14 హెక్టార్లు ప్రభుత్వ భూములు : 103.43 హెక్టార్లు 2023–2024 ఆదాయం : రూ.16.72 కోట్లు 2024–2025 ఆదాయ లక్ష్యం : రూ.18.77 కోట్లుఆరుగురు వివరాలు అందించారు జిల్లాలో 14 క్వారీలు, 9 స్టోన్క్రషర్లు ఉన్నాయి. నిబంధనలు పాటించకుండా తవ్వకాలు సాగించిన వారికి నోటీసులు జారీ చేశాం. క్వారీల్లో ఈటీఎస్ సర్వే నిర్వహించాం. డిజిటల్ సర్వే ద్వారా అక్రమ మైనింగ్ను నిర్ధారించి జరిమానాలు విధించాం. ప్రభుత్వ అభివృద్ధి పనులకు మెటీరియల్ సరఫరా చేశామని ఆరుగురు మాత్రమే వివరాలు అందించారు. మిగతా వారు ఇవ్వలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం. – క్రాంతికుమార్, జిల్లా గనులశాఖ అధికారి, రాజన్న సిరిసిల్ల -
నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సిందే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు రావాలంటే.. తప్పకుండా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సిందేనని కరీంనగర్ పార్లమెంటరీ నాయకులు అధిష్టానానికి స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీభవన్లో కరీంనగర్ పార్లమెంటరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లా నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా నేతలందరి నోట దాదాపుగా ఒకే డిమాండ్ వినిపించింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. డీసీసీ, కార్పొరేషన్ చైర్మన్లు సహా ఎలాంటి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడంపై కిందిస్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వెల్లడించారు. వెంటనే పోస్టులు భర్తీ చేయకపోతే.. పార్టీకి క్షేత్రస్థాయిలో జరిగే నష్టాలను వివరించారు. పదవులు భర్తీ చేయలేకపోతే.. గ్రామాల్లో సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉండదని కుండబద్ధలు కొట్టారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న మీనాక్షి.. త్వరలోనే పదవుల భర్తీ ఉంటుందని, కష్టపడి పనిచేసిన వా రందరికీ సముచితస్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అధిష్టానం ఇచ్చే ప్రొఫార్మా ప్రకారం.. పేర్లు పంపాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ల విలీనం తథ్యం పథకాల అమలులో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, సన్నబియ్యం, ఇందిరమ్మ పథకాల అమలు తీరును మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ ధర్మం పేరుతో చేస్తున్న చర్యలను ఎక్కడికక్కడ ప్రజలకు వివరించాలన్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ బీజేపీ వ్యవహరించిన తీరును, దాని వైఫల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ ఏనాటికై నా బీజేపీలో విలీనం కావాల్సిందేనని, ఆ పార్టీల మైత్రిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇక తాము ఎన్నికల ముందు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, తమకు న్యాయం జరగాలని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే.మహేందర్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తదితరులు గుర్తుచేశారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రణవ్బాబు, మాజీ మంత్రి జీవ న్రెడ్డి, సీనియర్ నేత కటకం మృత్యుంజయం, సు డా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షికి స్పష్టం చేసిన కరీంనగర్ పార్లమెంటరీ నేతలు త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన మీనాక్షి నటరాజన్ బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీని ఎండగట్టాలని పిలుపు -
ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు
● జిల్లా వైద్యాధికారి రజిత సిరిసిల్ల: ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని, ప్రభుత్వం నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి రజిత కోరారు. జిల్లా కేంద్రంలోని బీవైనగర్లో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధులు బీపీ, షుగర్, హెపటైటిస్ బీ, సీ వంటి వాటికి పరీక్షలు చేయించుకుని, నిర్ధారణ అయితే మందులు వాడాలన్నారు. సెప్టెంబరు వరకు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తామని సుఖవ్యాధులు( హెచ్ఐవీ)లకు ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత కోసం జాగ్రత్త వహించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, టీబీ కో–ఆర్డినేటర్ బిగిందర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
పిల్లలు బడిలో ఉండాలి
సిరిసిల్ల: జిల్లాలో ప్రతీ పిల్లవాడు బడిలో చేరేలా చూడాలని, బాలకార్మికులు లేని జిల్లాగా మార్చాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం బడిబాటపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబాటలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఏఎన్ఎంలు, వీవోఏలు కలిసి బృందంగా ఏర్పడి ప్రతీ ఇంటిని సందర్శించి, పిల్లలంతా పాఠశాలల్లో నమోదయ్యేలా చూడాలన్నారు. విద్యాబోధన, వసతులు, ఉచిత పుస్తకాలు, యూని ఫామ్, మధ్యాహ్న భోజనం వివిధ పోటీపరీక్షలు జేఈఈ, నీట్ ఎంట్రన్స్ పరీక్ష కోచింగ్, డిజిటల్ క్లాస్రూమ్, విశాలమైన ప్లే గ్రౌండ్ గురించి తల్లి దండ్రులకు వివరించాలని సూచించారు. డ్రాపౌ ట్ కాకుండా చూడాలన్నారు. గ్రామాల్లో పంచా యతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాలకార్మికులు లేకుండా చూడాలన్నారు. డీఆర్డీవో శేషాద్రి, జి ల్లా వైద్యాధికారి రజిత తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించాలి ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపత్రాలు పొందిన వారు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ కోరారు. ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,413 ఇండ్లు గ్రౌండింగ్కాగా, మిగతా ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఉత్తమ పనితీరు చూపుతున్న పంచాయతీ కార్యదర్శులను అభినందించారు. గ్రామాలవారీగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో వాట్సాప్ గ్రూపులు పెట్టాలని తెలిపారు. కంపోస్టుషెడ్లు వినియోగించాలి సెగ్రిగేషన్ షెడ్లు, కంపోస్టుషెడ్లు వినియోగించాలని డీఆర్డీవో శేషాద్రి సూచించారు. వర్మీ కంపోస్ట్ తయారీపై వివరాలు ఇవ్వాలన్నారు. వ్యక్తిగత, సామూహిక ఇంకుడుగుంతలు వినియోగంలోకి వచ్చేలా పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని తెలిపారు. హౌసింగ్ పీడీ శంకర్, డీపీవో షరీఫొద్దీన్, డీఎల్పీవో నరేశ్కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
నేటి నుంచి బడిబాట
● ప్రవేశాల పెంపే లక్ష్యంగా ముందుకు.. ● స్కూళ్లకు చేరిన పుస్తకాలు గంభీరావుపేట(సిరిసిల్ల): పాఠశాలల్లో విద్యార్థుల నమోదే లక్ష్యంగా ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట చేపట్టనున్నారు. ఈనెల 19 వరకు కొనసాగే బడిబాటలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల పెంపే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అందుతున్న సౌకర్యాలు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనంపై ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రవేశాల పెంపు, బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్చడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. విద్యార్థుల తల్లిదండ్రులను, గ్రామపెద్దలను, స్థానిక ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను, యువజన సంఘాలను భాగస్వామ్యం చేయనున్నారు. బడికి చేరిన పుస్తకాలు విద్యాసంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే సరఫరా చేసింది. జిల్లాలో ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలలు 535 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో దాదాపు 50వేలకు పైగా విద్యార్థులు ఉన్నారు. 2,70,587 పుస్తకాలు అవసరం కాగా ఇప్పటికే 2,54,937 పుస్తకాలు వచ్చాయి. నాలుగో తరగతి తెలుగు, 9, 10వ తరగతులకు సంబంధించిన పర్యావరణవిద్య పాఠ్యపుస్తకాలు మాత్రమే రావాల్సి ఉంది. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
సిరిసిల్లకల్చరల్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా న్యాయస్థానం ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ సారథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు వి.పుష్పలత, లక్ష్మణాచారి, కావేటి సృజన, ఎ.ప్రవీణ్ తదితరులు మొక్కలు నాటారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సీహెచ్ బాలమణి, లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు, చింతోజు బాస్కర్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి వేములవాడఅర్బన్: ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని వేములవాడ సబ్ కోర్టు న్యాయమూర్తి అజయ్కుమార్ జాదవ్ పేర్కొన్నారు. వేములవాడ కోర్టు ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. కాలుష్య నియంత్రణలో తమ బాధ్యతగా కోర్టు ఆవరణలో వివిధ రకాల మొక్కలు నాటినట్లు తెలిపారు. కోర్టు సిబ్బంది భూషణ్, రమణారెడ్డి, అంజయ్య,శంకర్ రెడ్డితదితరులు ఉన్నారు. మొక్కలు పంపిణీ సిరిసిల్లటౌన్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని సిరిసిల్ల మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ పోసు వాణి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో గురువారం మొక్కల పంపిణీ, పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. అసిస్టెంట్ ఇంజినీర్ నరసింహస్వామి, టౌన్ ప్లానింగ్ అధికారి సాయికృష్ణ, రెవెన్యూ ఆఫీసర్ రామ్మోహన్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ స్వర్ణలత, టీఎంసీ మహాలక్ష్మి, పౌర సేవసమితి అధ్యక్షుడు బియ్యంకర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కోడెల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా వేములవాడఅర్బన్: తిప్పాపూర్లోని రాజన్న గోశాలలోని కోడెల కోసం రైతులు, ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. వెబ్సైట్ https://rajannasiricilla.telangana.gov.inలో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. పట్టాదారు పాస్బుక్, ఆధార్కార్డ్లతో వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.భూభారతితో సమస్యలు పరిష్కారం● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముస్తాబాద్(సిరిసిల్ల): భూ భారతితో రైతుల భూమి సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని ఆవునూర్లో జరుగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును ప్రభుత్వ విప్ గురువారం పరిశీలించి మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో గ్రామాల్లో అనేక భూమి సమస్యలు సృష్టించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణి రద్దు చేసి.. భూభారతిని తీసుకొచ్చామని తెలిపారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, నాయబ్ తహసీల్దార్ అపర్ణ, ఆర్ఐ సుమలత, సారగొండ రాంరెడ్డి, గజ్జెల రాజు, గుండెల్లి శ్రీను, ఆంజనేయులు, వేణు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి ● సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు గంభీరావుపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలోని గోరింటాలలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. తహీసీల్దార్ మారుతిరెడ్డి తదితరులు ఉన్నారు. ఘనంగా రావి నారాయణరెడ్డి జయంతి సిరిసిల్ల: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి జయంతి వేడుకలను సిరిసిల్లలోని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘంలో గురువారం నిర్వహించారు. రావి నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని సాగించిన యోధుడని కొనియాడారు. జిల్లా కోర్ కమిటీ సభ్యులు బాణాపురం రంగారెడ్డి, పొన్నాల బాల్రెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, గుల్లపల్లి నర్సింహారెడ్డి, కోశాధికారి ఎడమల హన్మంతరెడ్డి, కార్యవర్గ సభ్యులు కంది భాస్కర్రెడ్డి, అబ్బాడి తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు సింగిరెడ్డి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారులపై కేసులు ఉపసంహరించుకోవాలి సిరిసిల్లటౌన్: జిల్లా ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము ప్రభుత్వాన్ని కోరారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోసం ఉద్యమించిన కేసు విషయమై గురువారం ఉద్యమకారులతో కలిసి కరీంనగర్ కోర్టుకు హాజరయ్యారు. జిల్లా ఏర్పడి 9 ఏళ్లు గడుస్తున్నా ఉద్యమకారులకు తిప్పలు తప్పడం లేదన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ న్యాయం చేయాలని కోరారు. మైలారం తిరుపతి, కంసాల మల్లేశం, వీరవేని మల్లేశంయాదవ్ తదితరులున్నారు. -
మూడు నెలల్లోగా ఇళ్లు పూర్తి చేయాలి
● ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపత్రాలు పొందిన లబ్ధిదారులు మూడు నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఇందిరమ్మ లబ్ధిదారులు గురువారం కలెక్టర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు. మంజూరు పత్రాలు పొందిన వారికి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని తెలిపారు. సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించేలా ఏర్పాట్లు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇల్లు మొదలు పెట్టేందుకు, నిర్మాణ పనులకు డబ్బులు లేని వారికి రుణవసతి కల్పిస్తామన్నారు. బేస్మెంట్, ఇతర దశలు పూర్తి కాగానే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లతో ఫొటో తీయించి, అప్లోడ్ చేయించాలని సూచించారు. బిల్లుల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. పీడీ హౌసింగ్ శంకర్, ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, కాంగ్రెస్ నాయకులు పర్శ హన్మాండ్లు, బాల్రెడ్డి పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి వేములవాడఅర్బన్: జిల్లాలో ఎరువులు, విత్తనాలు నిబంధనలు ప్రకారం విక్రయించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడలోని హనుమాన్ ఎంటర్ర్పైజేస్, శ్రీలక్ష్మీ ట్రేడర్స్ విత్తనాల దుకాణాలు, గోదాములను గురువారం తనిఖీ చేసి మాట్లాడారు. శ్రీలక్ష్మీ ట్రేడర్స్లోని సేల్స్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. రిజిస్టర్లోని వివరాల ప్రకారం గోదాములో ఎరువులు లేనట్లు గుర్తించి అమ్మకాల నిలిపివేతకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. సరైన సంజాయిషీ సమర్పించకపోతే షాప్ను సీజ్ చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, మండల వ్యవసాయాధికారి సాయికిరణ్ ఉన్నారు. కోడెలకు మెరుగైన వైద్యం అందించాలి రాజన్న గోశాలలోని కోడెలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. గోశాలను గురువారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గోశాల ఆవరణలో పారిశుధ్య పనుల నిర్వహణకు అదనంగా వర్కర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో వినోద్రెడ్డి ఉన్నారు. అనంతరం గోశాలలోని కోడెలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనిఖీ చేశారు. సువిశాలమైన ప్రదేశంలో గోశాలను నిర్మిస్తామని తెలిపారు. భక్తులు తెచ్చే కోడెలలో కొన్నింటికి లంపీస్కిన్ వ్యాధి ఉండడంతో పది రోజులపాటు క్వారంటైన్లో పెట్టిన తర్వాత మిగతా వాటితో కలపాలని సూచించారు. -
ప్రజాసంక్షేమమే బీజేపీ లక్ష్యం
● పదకొండేళ్లలో అభివృద్ధిలో ముందంజ ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపిసిరిసిల్లటౌన్: ప్రజాసంక్షేమమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. పార్టీ జిల్లా ఆఫీస్లో గురువారం ‘పదకొండేళ్ల మోదీ ప్రభుత్వం – సంకల్పంతో సాకారం’పై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథి అంజన్కుమార్ మొక్క నాటారు. వారు మాట్లాడుతూ జూన్ 6న అన్ని మండలాల్లో ఒకే స్థాయి కార్యశాలలు, జూన్ 9న జిల్లా స్థాయిలో ప్రెస్మీట్, జూన్ 10, 11 తేదీల్లో నియోజకవర్గాలలో ప్రెస్కాన్ఫరెన్స్, తర్వాత రోజుల్లో జిల్లా స్థాయిలో ప్రొఫెషనల్ మీట్స్, మేధావుల సదస్సులు నిర్వహిస్తామని వివరించారు. పార్టీ కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేశ్, అల్లాడి రమేశ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవేందర్యాదవ్, కార్యక్రమ కన్వీనర్ గరిపెల్లి ప్రభాకర్, కో–కన్వీనర్ నంద్యాడపు వెంకటేశ్ పాల్గొన్నారు. -
డిగ్రీ కాలేజీ పిలుస్తోంది
● అగ్రహారం ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు ● అనుభవజ్ఞులైన అధ్యాపకులు ● పరిశోధనల్లో రాణిస్తున్న విద్యార్థులు ● కొనసాగుతున్న రెండో విడత దోస్త్ ప్రవేశాలు ● ఈ ఏడాది నుంచి హాస్టల్ సౌకర్యంసిరిసిల్లకల్చరల్: డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ దోస్త్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. తొలి విడత పూర్తి కాగా రెండో దశ రిజిస్ట్రేషన్లు గత నెల 30 నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో అగ్రహారంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తన సుదీర్ఘ ప్రయాణంలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్కు ఆలంబనగా నిలుస్తోంది. 38 ఏళ్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటూనే కార్మిక, ధార్మిక క్షేత్రాల్లో విద్యాపరిమళాలు వెదజల్లుతోంది. కోర్సులు ఇవీ.. బీఏ, బీకామ్ కోర్సులతో 1987లో మొదలైన కళాశాలలో ప్రస్తుతం వీటితోపాటు బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ బీజెడ్సీ కోర్సులు, బీఎస్సీ బీజెడ్సీఎస్ ఉన్నాయి. గతేడాది బీఎస్సీ ఫుడ్సైన్స్ క్వాలిటీ కంట్రోల్, బీఏ హెచ్ఈపీ, హెచ్పీపీ, ఈపీపీ, హెచ్ఈసీఎస్ కోర్సులతోపాటు బ్యుటీషీయన్, కాస్మెటాలజీ అనే సర్టిఫికెట్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది నుంచి హాస్టల్ సౌకర్యం దూరప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం వసతిగృహాన్ని మంజూరు చేసింది. రూ.10కోట్లు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ, స్థల సేకరణ పూర్తయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో భవన నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉన్న భవనంలో హాస్టల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. ఏటా ఉద్యోగ మేళాలు డిగ్రీ పట్టా ఇవ్వడంతో సరిపెట్టకుండా పట్టభద్రులై న విద్యార్థులకు ఉపాధిమార్గాల అన్వేషణలోనూ కళాశాల దోహదం చేస్తోంది. ఏటా ఉద్యోగమేళాలు నిర్వహిస్తూ యువతకు ప్లేస్మెంట్ సౌకర్యాలను చేరువ చేస్తోంది. కోర్సుల అధ్యయనంతోపాటు ఉద్యోగ సాధనకు అవసరమైన స్కిల్స్ నేర్పించే ప్ర క్రియపై శ్రద్ధ పెడుతున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం సులువు అవుతోంది. ప్రైవేట్ వలలో పడొద్దు ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలతోపాటు నిష్టగా పనిచేసే ఉన్నత విద్యార్హతలు గల అధ్యాపకులు ఉన్నారు. ప్రైవేట్ వలలో పడకుండా దోస్త్ రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటే ప్రభుత్వపరమైన అన్ని సౌకర్యాలు, నాణ్యమైన ఉన్నత విద్యతోపాటు సామాజిక విజయాలను సొంతం చేసుకోవచ్చు. – డాక్టర్ టి.శంకర్, ప్రిన్సిపాల్దోస్త్ షెడ్యూల్ ఇలా...రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు మే 30 నుంచి జూన్ 8 వరకు వెబ్ ఆప్షన్స్ : జూన్ 9 వరకు సీట్ల కేటాయింపు : జూన్ 13 సెల్ఫ్ రిపోర్టింగ్ : జూన్ 19 మూడో విడత జూన్ 13 నుంచి 19 వరకు సీట్ల కేటాయింపు : జూన్ 23 సెల్ఫ్ రిపోర్టింగ్ : జూన్ 28 కళాశాలలో ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ : జూన్ 24 నుంచి 28 తరగతులు : జూన్ 30 -
ట్రస్ట్బోర్డు నిరీక్షణే !
● ‘పుష్కర’కాలంగా ఏర్పాటు చేయని ప్రభుత్వాలు ● ఏటా ఉత్సవ కమిటీలతోనే శివరాత్రి వేడుకల నిర్వహణ ● 800 ఏళ్ల చరిత్ర ఉన్న దక్షిణకాశీ.. అభివృద్ధిలో వెనుకంజ ● ఆదాయంలో ఘనం.. వసతులు అంతంతే.. ● టీటీడీ తరహాలో బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం సన్నాహాలుసిరిసిల్ల: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి 800 ఏళ్ల ఘన చరి త్ర. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగుబంగా రంగా నిలుస్తున్న స్వామి వారి ఆలయం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. నిత్యం వేలాదిగా తరలి వస్తున్న భక్తుల ద్వారా భారీగా ఆదాయం వ స్తున్నా వసతులు అంతంతే ఉన్నాయి. ట్రస్ట్బోర్డు లేక అభివృద్ధి సాధించలేకపోతోంది. పుష్కరకాలంగా ప్రభుత్వాలు ట్రస్ట్బోర్డును పట్టించుకోవడం లేదు. ఫలితంగా భక్తులకు సౌకర్యాలు దరిచేరడం లేదు. 12 ఏళ్లుగా ఊసేలేని ట్రస్ట్బోర్డు వేములవాడ ఆలయ ట్రస్ట్బోర్డు లేక పన్నెండేళ్లు గడుస్తోంది. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బొమ్మ వెంకన్నను ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్గా నియమించగా 2013 వరకు కొనసాగారు. అనంతరం రాజన్న ఆలయానికి ట్రస్ట్బోర్డు కమిటీ లేదు. ఏటా మహాశివరాత్రి వేడుకలకు ముందు ఉత్సవ కమిటీని నియమిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో ట్రస్ట్బోర్డు లేక ఆలయ అభివృద్ధి, నిర్వహణలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో పూర్తిస్థాయి ధర్మకర్తల మండలిని నియమిస్తే ఆలయం అభివృద్ధిలో దూసుకెళ్తుందని స్థానికులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఉత్సవ కమిటీలు తాత్కాలిక పనులు మాత్రమే చేస్తున్నాయి. ట్రస్ట్బోర్డు లేక శాశ్వత అభివృద్ధి పనులు సాగడం లేదు. దాతలను సమీకరించి సన్నిధిలో వసతిగృహాల నిర్మాణాలు, ఆధునిక హంగుల కల్పన వంటి పనులు సాగడం లేదు. 62 ఏళ్ల కిందటే ట్రస్ట్బోర్డు ఏర్పాటు రాజన్న ఆలయంలో 1963లో అంటే.. 62 ఏళ్ల కిందటే తొలి ట్రస్ట్బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ధర్మకర్తల మండలిని నియమిస్తూ వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో రాజకీయంగా ప్రాధాన్యమున్న ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ నియామకంపై ప్రభుత్వాలు ఆచీతూచీ నియమించాయి. 12 ఏళ్లుగా ట్రస్ట్బోర్డు కమిటీ లేక అధికారుల పర్యవేక్షణలో రాజన్న ఆలయ నిర్వహణ సాగుతోంది. కలెక్టరేట్లో వీటీడీఏ ఆఫీస్ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ)ని 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ర్పాటు చేసింది. దీనికి సీఎం చైర్మన్గా, కలెక్టర్ వైస్ చైర్మన్గా ఉన్నారు. కానీ పూర్తిస్థాయిలో నిధులు కే టాయించకపోవడంతో వీటీడీఏ నామమాత్రంగా మారింది. వేములవాడ ఆలయ అభివృద్ధి ఆఫీస్ను కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. గత నవంబరులో సీఎం రేవంత్రెడ్డి వేములవాడకు వచ్చి ఆలయ అభివృద్ధికి రూ.127కోట్లు కేయించారు. అయినా పనుల్లో ప్రగతి లేదు. ఏడు నెలల కిందటే సీఎం నిధులు మంజూరు చేయగా టెండర్లు కూడా పూర్తికాలేదు. వేములవాడలో రోడ్ల విస్తరణ, పుష్కరిణి అభివృద్ధి, గోశాల నిర్మాణం, విస్తరణ, మురికికాల్వల నిర్మాణాలు పెండింగ్లోనే ఉన్నాయి. ట్రస్ట్బోర్డు ఉంటే... ఆలయ అభివృద్ధిపై తరచూ సమీక్షలు.. ప్రొటోకాల్ నిర్వహణ, దాతల నుంచి విరాళాలు సేకరించి వస తి గదులు నిర్మించడం.. సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. ఆలయ ధర్మకర్తల మండలి నియాకమంపై ప్రభుత్వం జాప్యం చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లు ఆలయ ట్రస్ట్బోర్డు ఊసే లేకుండా నెట్టుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. పుష్కరకాలంగా ట్రస్ట్బోర్డు ఏర్పాటులో పడిగాపులు తప్పడం లేదు.వేములవాడ రాజన్న ఆలయ ముఖద్వారంట్రస్ట్బోర్డు చైర్మన్లు.. పదవీకాలం సీహెచ్.వెంకటేశ్వర్రావు 1963–1977 ఎం.కొండల్రావు 1977–1980 సీహెచ్.వెంకటేశ్వర్రావు 1981–1984 వుచ్చిడి మోహన్రెడ్డి 1984–1987 దుగ్గిరాల వెంకట్రావు 1988–1990 వుచ్చిడి మోహన్రెడ్డి 1992–1994 సీహెచ్.కమలాకర్రావు 1994–1996 శికారి విశ్వనాథం 1998–1999 శికారి విశ్వనాథం 2002–2004 ఆది శ్రీనివాస్ 2004–2006 ఆది శ్రీనివాస్ 2007–2009 బొమ్మ వెంకన్న 2009–2013టీటీడీ తరహాలో ఏర్పాటుకు సన్నాహాలు వేములవాడ ఆలయ ట్రస్ట్బోర్డును టీటీడీ తరహాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వేములవాడ, యాదగిరిగుట్ట ఆలయాలకు ధర్మకర్తల మండలి ఏర్పాటుపై ప్రభుత్వం కేబినెట్ స్థాయిలో చర్చించింది. రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. పనులు జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. – ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే -
సన్నబియ్యం.. దేశానికే తలమానికం
● సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి సిరిసిల్లటౌన్: సన్నబియ్యం పథకం దేశానికే తలమానికంగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్పై అక్కసుతో బీజేపీ, బీఆర్ఎస్లు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. పదేళ్లపాటు అవినీతికి అలవాటు పడిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనూ పేదల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో అక్రమాల భయంతోనే కమీషన్ ముందుకు హాజరుకావడానికి జంకుతున్నారని ఎద్దేవా చేశారు. పది నెలల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు 58వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఆడెపు చంద్రకళ, నాయకులు ఆకునూరి బాలరాజు, వైద్య శివప్రసాద్, గడ్డం నర్సయ్య, గోనె ఎల్లప్ప, యెల్లె లక్ష్మీనారాయణ, రాపెల్లి కళ్యాణ్ పాల్గొన్నారు. -
‘ప్రైవేట్’లో పేదలకు ఉచితం అందేనా !
● 25 శాతం ఉచిత సీట్లపై తల్లిదండ్రుల ఎదురుచూపులు ● ఫీజులు చెల్లించలేక అవస్థలు ● విద్యాహక్కు చట్టం అమలుపై సందిగ్ధం గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేదలకు, దివ్యాంగులకు కేటాయించాలన్న చట్టం అమలుపై సందిగ్ధం నెలకొంది. ఫలితంగా ఏళ్లుగా పేదలు కార్పొరేట్ విద్యకు దూరమవుతున్నారు. విద్యాహక్కు చట్టం–2009 ప్రకా రం ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్లు నిరుపేద, దివ్యాంగ విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్యనందించాల్సి ఉంది. కానీ ఏళ్లుగా ఈ చట్టం అమలు కా వడం లేదు. తాజాగా ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్ర భుత్వం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో పేద విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆశలు చిగురిస్తున్నా యి. ఈ ఏడాది నుంచైనా విద్యాహక్కుచట్టం అమలవుతుందో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 120 ప్రైవేటు పాఠశాలలు ఉన్నా యి. ఆయా పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చట్టం అమలైతే వారిలో 25 శాతం మందికి ప్రయోజనం కలుగనుంది. 16 ఏళ్లుగా నిరీక్షణే.. 2009లో విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25శాతం మంది పేద విద్యార్థులను చదివించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉచిత నిర్బంధ విద్యలో భాగంగా ఈ చట్టాన్ని కార్యాచరణలో చూపించాల్సి ఉంది. జీవో 44ను అమలు చేయాల్సి ఉన్నా.. 15 ఏళ్లుగా అమలు చేయడం లేదు. విద్యాశాఖ అధికారులు జీవోనుగాని, చట్టాన్నిగాని అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పేద, ధనిక అనే తేడా లేకుండా పిల్లల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి. అప్పుడే పేద పిల్లలపై ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చట్టం ప్రకారం 25శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. – కల్యాణ్కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అమలుపై దృష్టి పెట్టాలి విద్యాహక్కు చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలి. అనేక మంది పేద పిల్లలకు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యాహక్కు చట్టాన్ని, జీవో 44ను పకడ్బందీగా అమలు చేసి పేద పిల్లలకు న్యాయం చేయాలి. – తిరుపతి, ఏబీవీపీ నాయకుడు -
నీరుంటే నారు పోసుకోవచ్చు
● ఎప్పడూ ఒకే పంటలు వేయొద్దు ● ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి ● యూరియా, డీఏపీ వాడకం తగ్గించాలి ● లైసెన్స్ గల దుకాణాల్లో విత్తనాలు కొనాలి ● విత్తనాలు, ఎరువుల రశీదులు దాచుకోవాలి ● భూసార పరీక్షలు చేస్తాం ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం సిరిసిల్ల: పది రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. తొలకరి జల్లులు ముందే కురిశాయి. ఇప్పుడు మళ్లీ ఎండలు కొడుతున్నాయి. వర్షాలకు భూమి బాగా నానాలి.. భూమిలో వేడితగ్గాలి.. అప్పుడే ఏ విత్తనమైనా విత్తుకుంటే.. మొలకెత్తుతుంది. ఎప్పుడూ ఒకే పంటను వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాని, పంట మార్పిడితో భూసారం పెరిగి ఎంతో ప్రయోజనం ఉంటుంది. నీరుంటే నారు పోసుకోవచ్చని రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ ఆఫీస్లో బుధవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ‘సాక్షి’ నిర్వహించిన ‘ఫోన్ఇన్’లో వ్యవసాయ అధికారులు మహేశ్వరీ, కృష్ణవేణిలతో కలిసి సమాధానాలు ఇచ్చారు. జిల్లాలోని నలుమూలల నుంచి అనేక మంది రైతులు ఫోన్ చేసి సాగులో సందేహాలకు సమాధానాలు పొందారు. ఆ విశేషాలు ఇవీ... -
ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు
● పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం ● ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్ పేర్కొన్నారు. మండలంలోని సనుగులలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేసిన అనంతరం చౌడాలమ్మ కల్యాణ మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు. గుడిసె లేని గ్రామాలే లక్ష్యమన్నారు. పేదల సొంతింటి కల ఇందిరమ్మతో నెరవేరుతుందన్నారు. నిబంధనల మేరకు నిర్మించుకుంటే బిల్లులు వస్తాయని తెలిపారు. ప్రజాప్రభుత్వంపై బురదజల్లే ప్రతిపక్షాలకు మెనిఫెస్టోలో లేని సన్నబియ్యాన్ని అందజేయడం చెంపపెట్టులాంటిదన్నారు. రుద్రంగి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీలు నాగం కుమార్, పొద్దుపొడుపు లింగారెడ్డి, సనుగుల సింగిల్విండో మాజీ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు ఏగోలపు శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీటీసీ మ్యాకల గణేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యం వేములవాడ: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన 65 మంది లబ్ధిదారులకు రూ.28.48లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి, ఎల్వోసీల ద్వారా ఇప్పటి వరకు రూ.20కోట్ల పైచిలుకు మంజూరు చేయించినట్లు విప్ తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి
● మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ ఇల్లంతకుంట(మానకొండూర్): ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. మండలంలోని కందికట్కూరులో లబ్ధిదారు తాళ్లపల్లి శ్రీధర్ ఇంటికి ముగ్గుపోసే కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మ జాతరలో పా ల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్రెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు వెలిచాల జ్యోతి, నాయకులు గుడిసె ఐలయ్య, యాస తిరుపతి, గ్రామాధ్యక్షుడు బిగుల్ల విజయ్ పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలు అందించాలి సిరిసిల్లటౌన్: ఏడు నెలల పెండింగ్లో ఉంచిన తమ జీతాలు వెంటనే అందించాలని ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ స్కావెంజర్స్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తమ సమస్యల సాధనకు కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా చేపట్టగా స్వీపర్స్ స్కావెంజర్స్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ మాట్లాడా రు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేతనాలు అందించిన జిల్లాలో మాత్రం మూడు నెలలుగా పెండింగ్లో ఉంచారన్నారు. వెంటనే చెల్లించకుంటే జూన్ 16న నిరవదిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. నెలకు రూ.15వేల వేతనం చెల్లించాలని కోరారు. ఎ.రాజశేఖర్, డి.వెంకటేశ్, దేవయ్య, రాజు, మహేశ్, పరశురాములు, లత, లావణ్య, అనిత పాల్గొన్నారు. దమ్మన్నపేట శివారులో చిరుత సంచారంగంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని దమ్మన్నపేట శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. బుధవారం గ్రామస్తులకు చిరుత సంచారంపై అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశారు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హరిప్రసాద్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అంజలి పాల్గొన్నారు. గాలిపల్లి, ఇల్లంతకుంట ప్యాక్స్ చైర్మన్ల కొనసాగింపు ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ఇల్లంతకుంట మాజీ ప్యాక్స్ చైర్మన్లను తిరిగి చైర్మన్లుగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీసీవో రామకృష్ణ బుధవారం తెలిపారు. ప్యాక్స్ చైర్మన్ల పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగియడంతో వారి స్థానంలో కో–ఆపరేటీవ్ రిజిస్ట్రార్ లచ్చయ్యను గాలిపల్లి సొసైటీ స్పెషల్ ఆఫీసర్గా, బి.రమాదేవిని ఇల్లంతకుంట స్పెషలాఫీసర్గా నియమించారు. దీన్ని సవాల్ చేస్తూ గాలిపల్లి, ఇల్లంతకుంట సొసైటీల చైర్మన్లు అనంతరెడ్డి, తిరుపతిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారినే తిరిగి చైర్మన్లుగా కొనసాగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు వారు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. -
పరిషత్ సమరానికి సిద్ధం!
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కసరత్తు ● చర్యలు ప్రారంభించిన ఆయా జిల్లాల అధికారులు ● చకచకా ఓటర్ల తుది జాబితా, మార్పులు– చేర్పులు ● సిద్ధమవుతున్న పోలింగ్ స్టేషన్ల రూట్మ్యాప్లు ● ఈనెల 15 లేదా నెలాఖరున నోటిఫికేషన్ ?సాక్షిప్రతినిధి,కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. లోకల్బాడీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల సంకేతాలు వెలువడిన దరిమిలా.. ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. ఈమేరకు కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని జెడ్పీ సిబ్బంది ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఓటర్ల తుది జాబితాను మే 30వ తేదీన హైదరాబాద్కు పంపారు. ఇది పంపే ముందు.. ఇటీవల 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను చేర్చడం విశేషం. ఆ తరువాత అందులో కొన్ని సవరణలు చేసి తిరిగి 31వ తేదీన మరోసారి ఓటర్ల జాబితాను హైదరాబాద్కు పంపారు. జోరుగా ఏర్పాట్లు.. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారని సమాచారం. ఈ నెల15న లేదా నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఆ లోపు జిల్లా అధికారులు పూర్తిగా సంసిద్ధులు కావాలన్న ఆలోచనలో భాగంగానే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల ఖరారు చేశారు. పోలింగ్ స్టేషన్ల రూట్ మ్యాపింగ్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలలోని పోలింగ్ స్టేషన్లను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు అనుగుణంగా సర్దుబాటు చేసే ప్రక్రియ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ ప్రక్రియపై వారాంతానికి స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల జెడ్పీ కార్యాలయ సిబ్బంది ఇదే పనిలో తలమునకలయ్యారు. ఈనెలలో ఏక్షణమైనా ఎన్నికలు జరుగవచ్చన్న ప్రభుత్వ ఆదేశాలతో అంతా సిద్ధమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజకీయ నాయకులు సైతం ఉత్సాహంగా ఉన్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారంతా ఇక రంగంలోకి దిగేందుకు సిద్ధమతున్నారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలుజిల్లా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు స్థానాలు కరీంనగర్ 170 15 జగిత్యాల 216 20 పెద్దపల్లి 140 13 రాజన్నసిరిసిల్ల 123 12 మొత్తం 649 60 -
ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండి
● జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీనివాస్ గంభీరావుపేట(సిరిసిల్ల): తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీనివాస్ కోరారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు బుధవారం ఇంటింటీ ప్రచారం చేశారు. కళాశాల ప్రత్యేకతలు వివరిస్తూ రూపొందించిన ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీధర్, అధ్యాపకులు గజానంద్, శ్రీనివాస్, పాపారావు, సత్యనారాయణ, రవి, శ్రీధర్ పాల్గొన్నారు. ఐటీఐలో ప్రవేశాలు తంగళ్లపల్లి(సిరిసిల్ల): 2025–26 విద్యా సంవత్సరానికి ఐటీఐలో ప్రవేశాలకు 10వ తరగతి ఉత్తీర్ణులైన 14 ఏళ్లు నిండిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కవిత బుధవారం ప్రకటనలో తెలిపారు. జూన్ 21 వరకు మొదటి విడత దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, వెల్డర్, డీఎం సివిల్, డీజిల్ మెకానిక్, సీవోపీఏ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సర్కారు బడికి చేయూతనివ్వాలి
● మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సిరిసిల్ల ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ సర్కారు బడికి చేయూతనందించాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ‘ప్రభుత్వ బడులు నిలబడాలి–చదువుల్లో అంతరాలు పోవాలి’ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ మంగళవారం సిరిసిల్ల చేరుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలని, తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. పౌరస్పందన వేదిక ఉపాధ్యక్షురాలు మంగ, కార్యవర్గ సభ్యులు నాగమణి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మాన మూర్తి, రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు గుండమనేని మహేందర్రావు, కోశాధికారి అంబటి రమేశ్, కార్యదర్శులు పాముల స్వామి, కొత్వాల్ ప్రవీణ్, తిరుపతిజాదవ్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు సి.రామరాజు, జిల్లా అధ్యక్షుడు సిలువేరి సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వానాకాలం సాగులో సందేహాలా..
● నేడు ‘సాక్షి’ ఫోన్ఇన్ ● సమాధానాలు ఇవ్వనున్న జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగంసిరిసిల్ల: వర్షా కాలం మొదలైంది. రోహిణి కార్తె ప్రవేశించింది. వానాకాలం(ఖరీఫ్) ప్రారంభంలోనే తొలకరి జల్లులు పలకరించాయి. జిల్లాలోని రైతులు మరికొద్ది రోజుల్లో విత్తనాలు వేసుకునేందుకు, నారు పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసుకున్నారు. వానాకాలం సీజన్లో పంటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి? వర్షాలు ఆలస్యమైతే.. ఏ పంటలు వేసుకోవాలి? అనే సందేహాల నివృత్తికి ‘సాక్షి’ ఫోన్ఇన్లో కాల్ చేయండి. ఈనెల 4న నిర్వహించే ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం రైతుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. సమయం : బుధవారం ఉదయం 9 నుంచి 10 గంటలు తేదీ: 04–06–2025 ఫోన్ నంబర్: 89777 55264 -
చిట్టీల రాయుళ్లు!
శాతవాహన వర్సిటీలో భారీగా చూచిరాతలు ● డిగ్రీలో డిబార్ అవుతున్న వారిలో కరోనా టైంలో ‘పది’ పాసైన వారే ఎక్కువ ● మొదటి నుంచి ఆరో సెమిస్టర్ వరకు ఇదే తీరు ● పర్యవేక్షణ పెరగడంతో భారీగా పట్టుబడుతున్న విద్యార్థులు ● సోషల్ మీడియా వ్యసనం, చదవలేక పోవ డంతో అడ్డదారులు ● డిబార్ అయిన విద్యార్థికి మద్దతుగా ఉత్తరాది మంత్రి ఫోన్!సాక్షిప్రతినిధి,కరీంనగర్: కుదురుగా పది నిమిషాలు కూర్చుని పరీక్ష రాయలేరు. పరీక్ష మొదలవగానే.. జేబులో దాచిన మైక్రో జిరాక్స్లు తీయడం, కాపీ చేయడం.. ఇదీ.. శాతవాహన వర్సిటీలో డిగ్రీ విద్యార్థుల తీరు. వాస్తవానికి మునుపెన్నడూ లేని స్థాయిలో విద్యార్థులు చిట్టీలు కొడుతూ పట్టుబడి డిబార్ అవుతున్నారు. గతవారంలో ఒకేరోజు 35 మంది డిబార్ అవడం వర్సిటీ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. వాస్తవానికి విద్యార్థులు ఇలా చిట్టీలు రాయడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్న ఆశయంతో యూనివర్సిటీ అధికారులు ఈసారి సిబ్బందిని పెంచి ఆకస్మిక తనిఖీలు చేయిస్తుండటంతో భారీగా చిట్టీల రాయుళ్లు పట్టుబడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా విద్యార్థులు డిబార్ కావడంపై వర్సిటీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. జూన్ 2 వరకు వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు రాస్తున్న 171 మంది డిబార్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలోని వారేనా? ఈ విషయంపై ఆరా తీసినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వాస్తవానికి ఇప్పుడు డిబార్ అవుతున్న విద్యార్థులంతా కరోనా విపత్తు సమయంలో 10వ తరగతి పాస్ అయినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. 2020 మార్చిలో ఆకస్మికంగా కరోనా విపత్తు ప్రపంచాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు నిర్వహించలేకపోయింది. ఫలితంగా ఎలాంటి పరీక్షలు లేకుండా విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 2021లోనూ పరీక్షలు లేకుండా పది పాసయ్యారు. 2022లో మాత్రం పది పరీక్షలు నిర్వహించినా.. గతంలో ఉన్న 11 పేపర్లను ఆరుకు కుదించి తేలిగ్గా ప్రశ్నలు ఇచ్చారు. 2023లో పది పరీక్షరాసిన పిల్లలు కాస్త నయంగానీ, 2020, 2021లో అసలు పరీక్షలు లేకుండా పాసైన విద్యార్థుల ప్రతిభాపాటవాలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియా మరో కారణం 2020, 2021లో పది పాసైన వారి ప్రతిభాపాటవాలపై ఇప్పుడు ప్రొఫెసర్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డిబార్ అవుతున్న వారిలో అధికంగా వారే ఉండటం, వారంతా సోషల్ మీడియా ప్రభావంతో కాపీయింగ్ పాల్పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. సులువుగా పరీక్షలు పాసవడానికి అలవాటు పడినవారు, ఆ కోణంలో వెళ్తున్నారని అంటున్నారు. కాపీ కొడితే పట్టుబడ్డారంటూ సోషల్మీడియా రీల్స్ చూసి వీరు కూడా పాటించి దొరికిపోతున్నారని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ ప్రొఫెసర్ తెలిపారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. డిబార్ అయిన విద్యార్థులంతా రాజకీయ నాయకులతో వారిని వదిలేయాలంటూ వర్సిటీ అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నారు. వారిలో ఓ విద్యార్థిని వదిలేయాలంటూ ఉత్తరాదికి చెందిన ఓ పెద్ద మంత్రి ఏకంగా వర్సిటీకి ఫోన్ చేయడంతో విస్తుపోవడం అధికారుల వంతైంది.వారిలోనే డిబార్ సంఖ్య ఎక్కువ 2020లో పది పాసైనవారు ఇప్పుడు 6వ సెమిస్టర్, 2021లో పది పాసైనవారు 4వ సెమిస్టర్, 2022లో పది పాసైన వారు 2వ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నారు. ప్రతీ విద్యాసంవత్సరంలోనూ 1,3,5వ సెమిస్టర్లకు ఒకసారి, 2,4,6వ సెమిస్టర్లకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. 2023–24లో 1,3,5వ సెమిస్టర్లలో 26 మంది డిబార్ అయ్యారు. అదే 2023–24 విద్యా సంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో 60 మంది డిబార్కు గురయ్యారు. 2024–25లో 1,3,5వ సెమిస్టర్లలో కేవలం 31 మంది డిబార్ కాగా, 2024–25 విద్యాసంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో ఏకంగా 140 మంది డిబార్ అయ్యారంటే.. పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో మే 28న ఒకేరోజు 34 మంది డిబార్కావడం గమనార్హం. అందులోనూ కరీంనగర్ నడిబొడ్డున తెలంగాణచౌక్ను ఆనుకుని ఉన్న కాలేజీ నుంచి ఏకంగా 13 మంది విద్యార్థులు ఉండటం విశేషం. ఇప్పుడు డిబార్ అయిన విద్యార్థుల్లో అధికంగా 2020, 2021లో పదో తరగతి పాసైన వారే అధికంగా ఉండటం గమనించదగ్గ అంశం. శాతవాహన యూనివర్సిటీ కింద సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో మొత్తం 120 డిగ్రీ కాలేజీలు, 28 పీజీ, 23 బీఈడీ, 7 ఎంబీఏ, ఒక ఎంఈడీ, ఒక బీపీఈడీ, ఒక లా కాలేజీలు తదితరాలు ఉన్నాయి. ఇటీవల వర్సిటీకి అదనంగా లా, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా మంజూరయ్యాయి. ఇంతటి ప్రతిష్టాత్మక వర్సిటీలో ఇలాంటి విపరీత ధోరణి ఇదే తొలిసారి అని పలువురు వాపోతున్నారు. -
అంగన్వాడీ సేవలు విస్తరించాలి
● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం సిరిసిల్ల: అంగన్వాడీ కేంద్రాల సేవలను విస్తరించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. సిరిసిల్లలోని అంబేడ్కర్నగర్, బీవై నగర్ సెక్టార్లలో మంగళవారం జరిగిన అంగన్వాడీ టీచర్ల సమీక్ష సమావేశంలో మాట్లాడారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు రప్పించడం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందుతుందన్నారు. ఉచితంగా మధ్యాహ్న భోజనం, ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తామని ప్రజలకు వివరించాలని సూచించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని సరిచేసేందుకు ప్రత్యేక బాలామృతం అందిస్తామన్నారు. కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్లే మెటీరియల్, స్మార్ట్ టీవీలు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నాయని వివరించారు. గత నెలలో రిటైర్మెంట్ పొందిన ఇద్దరు టీచర్లు, ఒక ఆయాను సన్మానించారు. సూపర్వైజర్లు దివ్య, సుస్మిత తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏఎస్పీ విచారణ
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన అందాసు మాధురి అదే గ్రామానికి చెందిన మ్యాదరి శంకరయ్యను కులం పేరుతో దూషించిందన్న కేసులో మంగళవారం వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి విచారణ చేపట్టారు. జోగాపూర్కు చెందిన మాధురికి అదే గ్రామానికి చెందిన శంకరయ్యకు మధ్య రెండేళ్లుగా భూవివాదం ఉంది. మాధురి సాగుచేస్తున్న భూమిలో ప్రభుత్వ భూమి ఉందన్న నెపంతో తరచూ మహిళతో గొడవకు దిగుతున్నారని నెల రోజుల క్రితం మ్యాదరి శంకరయ్యతోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మాధురి తమను దూషించిందన్న శంకరయ్య ఫిర్యాదుతో వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి విచారణ చేపట్టారు. అనంతరం చందుర్తిలో వారం క్రితం మహిళ హత్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమె వెంట చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య ఉన్నారు. -
‘ఉద్యానం’ ఉపాధి
● పండ్ల తోటలు.. కూరగాయలతో లాభాలు ● ఆయిల్పామ్ సాగుతో ప్రయోజనాలు ● రైతులకు రాయితీ .. ప్రణాళిక ఖరారుసిరిసిల్ల: వరి, పత్తి పంటలే కాకుండా.. ఉద్యానపంటలతో నమ్మకమైన ఉపాధి పొందవచ్చు. రైతులు ఆసక్తి చూపితే సిరులు పండించవచ్చు. ప్రభుత్వం సైతం రాయితీ కల్పిస్తోందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సాగుప్రణాళికను ఉద్యానశాఖ అధికా రులు ఖరారు చేశారు. వివరాలను జిల్లా ఉద్యానశాఖ అధికారి కేఆర్ లత వివరించారు. సమగ్ర ఉద్యాన మిషన్ పథకం పండ్ల తోటల పెంపకానికి 50 శాతం, కూరగాయలు, పూల తోటల పెంపకానికి 40 శాతం సబ్సిడీ ఉంటుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డ్రాగన్ఫ్రూట్ తోటలను 12.50 ఎకరాలు, బొప్పాయి 22.50 ఎకరాలు, మామిడితోటలు 25 ఎకరాల్లో పెంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జామ తోటలు ఐదెకరాలు, కూరగాయల నారు కోసం 87.50 ఎకరాలు, పూలు 47.50ఎకరాలు, సుగంధ ద్రవ్యాల విత్తనాల కోసం 17.50 ఎకరాలు, మామిడితోటల పునరుద్ధరీకరణకు 50 ఎకరాలు, మల్చింగ్ కోసం 125 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. పనిముట్లు పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, పవర్స్ప్రేయర్లు, బ్రష్ కట్టర్లకు రాయితీ ఉంటుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కూరగాయల సాగుకు శాశ్వత పందిరి నిర్మాణానికి 2025–26లో 30 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. వెదురు మిషన్ పథకంలో పొలాల సరిహద్దులపై 2వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్లను జత చేయాల్సి ఉంటుంది. ఆధునిక విధానంలో సాగు.. పండ్లు, కూరగాయలు, పూలతోటల పెంపకం, మ ల్చింగ్, పాతతోటల పునరుద్ధరణ, ఉద్యాన యాంత్రీకరణ, జాతీయ వెదురు మిషన్ ద్వారా తోటల చుట్టూ వెదురుచెట్లు నాటించడం కోసం ఉద్యానశాఖ కార్యాచరణ రూపొందించింది. ఆయిల్పామ్ ఆయిల్పామ్ తోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రో త్సహిస్తుంది. ఒక ఆయిల్పామ్ మొక్కకు ఖరీదు రూ.193 ఉండగా.. రైతు రూ.20 చెల్లిస్తే ప్రభుత్వం రూ.173 చెల్లిస్తుంది. ఎకరానికి 50 మొక్కల నాటుతారు. ఆయిల్పామ్స్లో అంతర పంటలకు, పంట ల నిర్వహణకు ఎకరాకు రూ.4,200 చొప్పున ఏటా చెల్లిస్తుంది. ఇలా నాలుగేళ్లు రాయితీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ఈ ఏడాది 2వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పండ్లు, కూరగాయలు, ఇతర తోటలకు బిందు సేద్యానికి 437 ఎకరాలు, తుంపర సేద్యానికి 212 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. సూక్ష్మ, బిందు సేద్యం సబ్సిడీ ఇలా.. రైతులు సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ వంద శాతం సన్న, చిన్నకారు 90 శాతం ఇతరులు 80 శాతం సంప్రదించాల్సిన అధికారులు సిరిసిల్ల గోవర్ధన్ 89777 14049 వేములవాడ లోకేశ్ 89777 14048 తక్కువ నీటితో ఎక్కువ పంటలు జిల్లాలో తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే అవకాశం ఉంది. ఉద్యాన పంటలు సాగుచేస్తే ప్రభుత్వం తరఫున రాయితీలు లభిస్తాయి. కూరగాయలు, పండ్లతోటల సాగుతో లాభాలు ఉంటాయి. ఆయిల్పామ్ సాగుతో బహుముఖ ప్రయోజనాలున్నాయి. జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటల సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. ఆసక్తి గల రైతులు ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలి. – కె.ఆర్.లత, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
‘ఇందిరమ్మ’తో సొంతింటి కల సాకారం
● మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ ఇల్లంతకుంట(మానకొండూర్): ఇందిరమ్మ పథకంతో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలంలో 760 మంది లబ్ధిదారులకు మంగళవారం మంజూరుపత్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలోనే రేషన్కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ఝా, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శశికళ, తహసీల్దార్ ఎంఏ ఫారుక్, నాయకులు భాస్కర్రెడ్డి, ఐలయ్యయాదవ్, రమణారెడ్డి, పసుల వెంకటి తదితరులు పాల్గొన్నారు. టీబీ బాధితులకు ఉచితంగా మందులు ● డీఎంహెచ్వో రజిత తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలోని టీబీ వ్యాధి బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా వైద్యాధికారి రజిత పేర్కొన్నారు. పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తామన్నారు. మండలంలోని ఇందిరానగర్లో టీబీ ముక్త్ భారత్లో భాగంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో టీబీ మందులు వాడినవారు, డయాబెటీస్, బీడీ తాగేవారు, బీఎంఐ 18 కన్నా తక్కువ ఉన్నవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఎక్స్రే పరీక్షలు చేయాలని సూచించారు. అందుకోసం 102 ప్రభుత్వ వాహనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. టీబీ వ్యాధి వచ్చిన వారికి ప్రభుత్వం నుంచి ఉచితంగా మందులు, ఆరు నెలల వరకు పోషణ భత్యం, పోషకాహారం కోసం రూ.వెయ్యి అందిస్తామని తెలిపారు. టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిత, వైద్యులు అంజలి ఆల్ఫ్రెడ్, సంపత్, రామకృష్ణ, ఎంఎల్హెచ్పీ స్రవంతిరెడ్డి, డిప్యూటీ డెమో రాజ్కుమార్, లింగం, బిగిందర్, జేత్య పాల్గొన్నారు. -
భూ సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఇల్లంతకుంట(మానకొండూర్): భూభారతి చట్టం ద్వారా భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలం ముస్కాన్పేటలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. ఈ నెల 20 వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని, సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన మ్యాపులను జతచేయాలన్నారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఎంఏ పారుఖ్, డీటీ సత్యనారాయణ పాల్గొన్నారు. గోశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లటౌన్: దక్షిణకాశీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ గోశాలలో కోడెల మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝాను మంగళవారం కలిసి వినతిపత్రం అందించి మాట్లాడారు. గోశాలలో అపరిశుభ్రత, అధిక సంఖ్యలో కోడెలు ఉండడంతోనే చనిపోతున్నాయన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులకు డబుల్ ఇళ్లు ఇవ్వాలి ● సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ సిరిసిల్లటౌన్: గత ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించి డ్రాలో పేర్లు వచ్చిన వారికి డబుల్బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. డ్రాలో పేర్లు రాని పేదలకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి, నిర్మాణా నికి రూ.5లక్షలు అందించాలని కోరారు. సిరిసిల్లలో వెయ్యికి పైగా ఇల్లు లేని కుటుంబాలు ఉ న్నాయన్నారు. అద్దె కుటుంబాల్లో ఎవరైనా చని పోతే శవాన్ని రోడ్డుమీద వేసుకోవాల్సిన దుస్థితి ఉందన్నారు. నాగుల సత్యం, గాజుల మల్లేశం, స్వామి, మహేశ్ పాల్గొన్నారు. మత్స్య సంఘాల సమస్యలు పరిష్కరించాలి సిరిసిల్లటౌన్: మత్స్య కార్మిక సహకార సంఘాల సమస్యలు పరిష్కరించాలని సిరిసిల్ల గంగపుత్రులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ను కోరారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మత్స్య కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్భయంగా ఫిర్యాదు చేయండి● మహిళలకు భరోసాగా షీ టీం సిరిసిల్లక్రైం: మహిళలకు భరోసాగా ఉండేందుకు షీటీం పనిచేస్తుందని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. గత నెలలో పలువురు పోకిరీలపై 3 ఎఫ్ఐఆర్లు, 6 పెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పనిచేసే ప్రదేశాలు, విద్యాలయాల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులను నిర్భయంగా తెలపాలని కోరారు. కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, జిల్లా షీటీం 87126 56425లో సంప్రదించాలని సూచించారు. -
వానాకాలం సాగులో సందేహాలా..
● ‘సాక్షి’ ఫోన్ఇన్లో నివృత్తి చేసుకోండి ● సమాధానాలు ఇవ్వనున్న జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగంసిరిసిల్ల: వర్షా కాలం మొదలైంది. రోహిణి కార్తె ప్రవేశించింది. వానాకాలం(ఖరీఫ్) ప్రారంభంలోనే తొలకరి జల్లులు పలకరించాయి. జిల్లాలోని రైతులు మరికొద్ది రోజుల్లో విత్తనాలు వేసుకునేందుకు, నారు పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసుకున్నారు. వానాకాలం సీజన్లో పంటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి? వర్షాలు ఆలస్యమైతే.. ఏ పంటలు వేసుకోవాలి? అనే సందేహాల నివృత్తికి ‘సాక్షి’ ఫోన్ఇన్లో కాల్ చేయండి. ఈనెల 4న నిర్వహించే ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం రైతుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. సమయం: బుధవారం ఉదయం 9 నుంచి 10 గంటలు తేదీ: 04–06–2025 ఫోన్ నంబర్: 89777 55264 -
గీతా శ్లోక పఠన విజేతలకు సత్కారం
సిరిసిల్లకల్చరల్: భగవద్గీతలోని 700 శ్లోకాలను అవలీలగా పఠించి మైసూర్లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో బంగారు పతకాలు సాధించిన జిల్లాకు చెందిన ఐదుగురు మహిళలను గీత ప్రచార సమితి సోమవారం ఘనంగా సత్కరించింది. పట్టణానికి చెందిన నార్ల సంతోషి, కటకం లక్ష్మి, కటకంవిజయ, జి. సంగీత, జి ప్రశస్తిలు భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేశారు. మైసూర్ ఆశ్రమంలో ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు. వీరిని సమితి స్థానిక మళయాళ సద్గురు గీతాశ్రమంలో శ్రీ నారాయణ నందగిరి స్వామి చేతుల మీదుగా సత్కరించారు. సమితి అధ్యక్ష, కార్యదర్శులు కోడం నారాయణ, డాక్టర్ జనపాల శంకరయ్య, మోర దామోదర్, గజ్జెల్లి రామచంద్రం, కొక్కుల రాజేశం, గడ్డం కౌసల్య, అనసూయ, పత్తిపాక హరికిషన్ పాల్గొన్నారు. -
హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేతనాలు ఇవ్వాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): మధ్యాహ్న భోజన కార్మికులకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేతనాలు పెంచి ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హన్మండ్లు డిమాండ్ చేశారు. ముస్తాబాద్లో సోమవారం వంట కార్మికుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా హన్మండ్లు మాట్లాడుతూ.. కార్మికులకు ప్రభుత్వం కేవలం రూ.3వేల వేతనాలు మాత్రమే ఇస్తోందన్నారు. రూ.17వేల వేతనాలు ఇవ్వాలని గత ఫిబ్రవరి 24న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రధా న కార్యదర్శి బాబాయి, జిల్లా అధ్యక్షురాలు సంతోష, దివ్య, నర్సవ్వ, నిమ్మల దేవవ్వ, లక్ష్మీనర్సవ్వ,మణెమ్మ, ఎల్లవ్వ పాల్గొన్నారు. అమ్మమాట అంగన్వాడీ బాట వేములవాడరూరల్: వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి వి.లక్ష్మిరాజం సూచించారు. వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని చెక్కపల్లి, అర్బ న్ పరిధిలోని కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు బడికి రాని పిల్లలను గుర్తించి సెంటర్లో చేర్పించాలన్నారు. సెంటర్లో చదువుకుంటున్న పిల్లల ఎదుగుదలపై దృష్టిపెట్టాలని సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా అన్నారు. సూపర్వైజర్లు నిర్మల, అంజమ్మ పాల్గొన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాలి సిరిసిల్లటౌన్: మార్కెట్లో నకిలీ విత్తనాలు అమ్మకుండా వ్యవసాయశాఖ అఽధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో సోమవారం మాట్లాడుతూ.. వానా కాలం సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారన్నారు. వ్యాపారులు నాణ్యమైన విత్తనాలను అందించే విధంగా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, నకిలీవి అమ్మితే పీడీయాక్టు నమోదు చేయాలన్నారు. పత్తి విత్తనాల అమ్మకంలో మోసపూరితమైన వ్యాపారాలు చేస్తున్నారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యురాలు సూరం పద్మ పాల్గొన్నారు. యారన్ సబ్సిడీ అందించాలి సిరిసిల్లటౌన్: ప్రభుత్వం నుంచి నేత కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ డబ్బులు వెంటనే అందించాలని పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. బీవైనగర్లోని అమృత్లాల్ శుక్లా భవన్లో సోమవారం మాట్లాడుతూ.. 2023 బతుకమ్మ చీరలకు సంబంధించి గత నెలరోజుల క్రితం మొదటి విడతగా 3,000 మంది కార్మికుల ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. ఇంకా 2200 మందికి సబ్సిడీ రావాల్సి ఉందన్నారు. వెంటనే సబ్సిడీ అందించాలని జూన్ 4న సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదు ట ధర్నా చేపట్టడం జరుగుతుందన్నారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్, స్వర్గం శేఖర్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు. విదేశీ విద్యకు స్కాలర్షిప్ సిరిసిల్లకల్చరల్: విదేశాల్లో విద్యాభ్యాసం చేసే మైనార్టీ విద్యార్థులకు చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ పథకం ద్వారా ప్రత్యేక స్కాలర్షిప్లు మంజూరు చేయనున్నట్లు జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి ఎంఏ భారతి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ దేశాల్లో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్న మైనారిటీ అభ్యర్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. అర్హత, ఆసక్తి గల వారు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
రాజన్న ఆలయం మూసివేయడం లేదు
● భీమేశ్వరాలయంలో దర్శనాలకు ఏర్పాటు ● ఆలయ విస్తరణపై అవగాహన ● రూ.76కోట్ల పనులకు త్వరలో టెండర్లు ● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయం మూసివేయడం లేదని, ఆలయ విస్తరణపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పట్టణవాసులు, భక్తులు, ప్రజలందరికీ అవగాహన కల్పించనున్నట్లు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలయ విస్తరణ, భీమేశ్వరాలయంలో దర్శనాల ఏర్పాట్లపై ఆలయ గెస్ట్హౌస్లో దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు, వీటీడీఏ వైస్చైర్మన్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా, స్థపతి వల్లినాయగం, ఈవో వినోద్రెడ్డి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్తో సమావేశం అయ్యారు. రూ.76కోట్లతో ఆలయ విస్తరణ పనులకు టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. రాజన్న ఆలయాన్ని మూసివేయమని స్పష్టం చేశారు. స్వామివారికి నిత్య పూజలు కొనసాగుతాయన్నారు. ఆలయంలో పనులు చేపట్టనున్న దృష్ట్యా భక్తులకు భీమేశ్వరాలయంలో దర్శనానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భీమేశ్వరాలయంలో నిత్య కల్యాణం షెడ్లు, భక్తుల దర్శనం క్యూలైన్లు, కోడెమొక్కుల క్యూలైన్లు, ఆలయ ఆవరణలో షెడ్లు తదితరుల వసతులు వంటి మొత్తం ఎనిమిది అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. విశాలమైన స్థలం, ఆధునిక సౌకర్యాలతో గోశాలలు నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించగా, స్థానికంగా స్థలం గుర్తించాలని చర్చించామన్నారు. రాజన్న ఆలయ సమీపంలో కిలోమీటర్ పరిధిలో పెద్దపెద్ద భవనాలు నిర్మించవద్దని గతంలో జారీ చేసిన జీవోను 100 మీటర్ల పరిధిని కుదించాలని చర్చించినట్లు తెలిపారు. రాజన్న ఆలయ గోశాలలోని కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కోడలకు పచ్చి గడ్డి ఇవ్వాలని, నాణ్యమైన దాన పెట్టాలని, వైద్య శిబిరాలు నిర్వహించి, మందులు అందజేయాలని ఆదేశించారు. -
అభివృద్ధి.. సంక్షేమం
సిరిసిల్ల: ‘రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏళ్లు పూర్తి. అమరవీరుల త్యాగాల పునాదులపై అవతరించిన తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి దిశగా సాగుతోంది. పారదర్శక, సుపరిపాలన లక్ష్యాలుగా అభివృద్ధి, సంక్షేమబాటలో ప్రజా ప్రభుత్వం పాలన సాగుతోంది’ అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పో లీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. ప్రభుత్వ పాలన.. భవిష్యత్ ప్రణా ళికను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. నేతన్నలకు అండగా నేతన్నలకు నిరంతరం పని కల్పించేందుకు 4.30 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లను అందించామన్నా రు. రూ.50 కోట్లతో యారన్(నూలు) డిపోను వే ములవాడలో ఏర్పాటు చేశామని తెలిపారు. 4,111 మందికి 10శాతం యారన్ సబ్సిడీగా రూ.6.91 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి గతేడాది నవంబరులో శ్రీకారం చుట్టారని, రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అన్నదాన సత్రాన్ని రూ.35.25 కోట్ల అంచనాలతో నిర్మిస్తున్నామని, కోడెల సంరక్షణకు ఆధునిక గోశాలను నిర్మిస్తున్నామన్నారు. పేదలకు కూడు.. గూడు జిల్లాలోని రేషన్కార్డుదారులకు ప్రతినెలా 3,300మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఇస్తున్నామని, వసతి గృహాలకు మరో 220 మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 7,808 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మంజూరు పత్రాలు అందించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపామని తెలిపారు. మధ్యమానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు 4,696 ఇళ్లు మంజూరు చేశామన్నారు. రుద్రంగి, భీమారం తహసీల్దార్ ఆఫీస్లు, వేములవాడలో సబ్ రిజిస్ట్రా ర్ ఆఫీస్లను త్వరలో నిర్మిస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులు భూ భారతి పైలట్ ప్రాజెక్ట్గా రుద్రంగి మండలాన్ని ఎంపిక చేసి భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, భూమి కొలతలకు 149మంది సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. చందుర్తి మండలం నర్సింగాపూర్, లింగంపేట, ఎన్గల్, కోనరావుపేట మండలం మర్రిమడ్ల, వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో 33/11 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మహిళలకు ఆర్థిక చేయూత ఇందిరా మహిళ శక్తిలో జిల్లాలో 19 గ్రామ సంఘాలకు సీడ్స్, ఫెర్టిలైజర్ షాపుల లైసెన్స్లు అందించామని, 4,376 మహిళా సంఘాలకు బ్యాంకు ద్వా రా రూ.542 కోట్ల రుణాలు అందించామన్నారు. జిల్లాలో 40,285 ఎకరాలు సాగునీరు అందించేందుకు రూ.63.36 కోట్లతో మిగిలిన పనులను పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. 222 మంది రైతుల కుటుంబాలకు రూ.11.10 కోట్ల భీమా సొమ్ము పంపిణీ చేశామని తెలిపారు. రూ.200 కోట్లతో స్కూల్ కాంప్లెక్స్ వేములవాడలో రూ.200 కోట్లతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరైందన్నారు. జిల్లాలోని 486 ప్రభుత్వ పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్ సౌకర్యం కల్పిస్తూ డిజిటల్ మాధ్యమంలో బోధనను అందిస్తున్నామన్నారు. రుద్రంగిలో రూ.42కోట్లతో అ డ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామ న్నారు. అగ్రహారం డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్ల తో మహిళా వసతి గృహం మంజూరైందన్నారు. రోడ్లు, భవనాలు.. పరిశ్రమలు జిల్లాలో ఉపాధిహామీలో 730 పనులను రూ.50.29 కోట్లతో చేపట్టామని, గ్రామ పంచాయతీ, ఇందిరా మహిళా శక్తి, సామాజిక, అంబేద్కర్, పాలశీతలీకరణ కేంద్రాల భవనాల నిర్మాణాలకు రూ.16.51 కోట్లు, మూడు పీహెచ్సీలకు రూ.4.45కోట్లు, 16 ఆరోగ్య ఉపకేంద్రాలకు రూ.3.20 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. పీఎంజీఎస్వైలో నాలుగు వంతెనలు, 12 రోడ్ల నిర్మాణాలకు రూ.59.97 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. సిరిసిల్లలో కోర్టు సముదాయాలకు రూ.81 కోట్లు, వైద్య కళాశాల వసతి గృహానికి రూ.166 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. టీఎస్–ఐపాస్ ద్వారా రూ.5కోట్లతో 9 పరిశ్రమలను స్థాపించి 72 మందికి ఉపాధి కల్పించామని, టీ– ఐడియా, ఫ్రైడ్లో 73 పరిశ్రమలకు (రవాణా వాహనాలకు) రూ.3కోట్లు అందించామ ని తెలిపారు. టీ ప్రైడ్ పథకం కింద 42మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.1.85కోట్లు సబ్సిడీ మంజూరు చేశామని వివరించారు. వైద్య రంగంలో జిల్లాలో 50అంగన్వాడీ భవనాలకు రూ.6కోట్లు మంజూరయ్యాయని, 121 పోక్సో బాధితులకు రూ.51.65 లక్షల పరిహారం అందిచామని తెలిపా రు. సీఎంఆర్ఎఫ్ ద్వారా 4,969 మందికి రూ.17.76 కోట్లు, 248 మందికి ఎల్వోసీలు అందించి రూ.4.84 కోట్ల సాయం చేశామని తెలిపారు. జిల్లాలోని 324 చెరువులు, కుంటల్లో 46.71లక్షల చేప పిల్లలను వేశామని తెలిపారు. 123 మంది రైతులు 331 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేసేలా ప్రోత్సహించామని పేర్కొన్నారు. రుద్రంగిలో పోలీస్స్టేషన్ భవనానికి రూ.2.50కోట్లు మంజూరు అయ్యాయని వివరించారు. ఏఎస్పీ శేషాద్రినీరెడ్డి, చంద్రయ్య, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ఏఎంసీ చైర్మన్లు వెల్ముల స్వరూపారెడ్డి, సబేరా బేగం, రాజు, ఎల్లయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, స్కూల్ పిల్లలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని 110 స్వశక్తి సంఘాలకు 102.45కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను విప్ శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రైతులకు విత్తన కిట్లను అందజేశారు. టీ ప్రైడ్ పథకం కింద 42 మందికి రూ.1.85 కోట్ల సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. రవాణాశాఖ, ఆర్టీసీ శకటాలను ప్రదర్శించారు. అంతకుముందు పాత బస్స్టాండ్ నేతన్న చౌక్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే నివాళి అర్పించారు. పారదర్శక ప్రజాపాలన అందిస్తున్నాం వేములవాడ ఆలయ విస్తరణ.. పల్లె ప్రగతికి బాటలు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
కోడెలను జాగ్రత్తగా చూసుకోవాలి
● 32 మందికి రెండు చొప్పున 64 కోడెల పంపిణీ ● పక్కదారి పడితే కఠిన చర్యలు ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా వేములవాడ: రాజన్న కోడెలు పొందిన రైతులు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. ఏమైనా పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిప్పాపూర్ గోశాలలోని 32 జతల కోడెలను అర్హులైన రైతులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోశాల ఆవరణను పరిశీలించి పలు సలహాలు, సూచనలు చేశారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ గోశాలలో కోడెల సంరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గోశాల ఆవరణలో లోతుగా ఉన్న స్థలంలో మట్టిని పోయిస్తూ చదును చేస్తున్నామని తెలిపారు. కోడెలకు మెరుగైన దాణా, పచ్చిగడ్డి అందిస్తామన్నారు. పశువైద్యాధికారుల బృందంతో వైద్యం అందిస్తూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో రాధాభాయి, వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్బేగం, ఈవో వినోద్రెడ్డి, తహసీల్దార్ విజయప్రకాశ్రావు, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ ఉన్నారు. కోడెల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ శ్రీరాజేశ్వరస్వామి ఆలయానికి కోడెలను పొందేందుకు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదివారం తెలిపారు. వేములవాడ శివారులోని తిప్పాపూర్ గోశాలలోని కోడెలను ఉచితంగా రైతులు పొందేందుకు ఆన్లైన్లో రైతు పట్టదారు పాస్బుక్కు, ఆధార్కార్డు ఇతర వివరాలను నమోదు చేసి దరఖాస్తులు చేయాలన్నారు. అర్హులైన రైతులకు మాత్రమే జియోట్యాగింగ్ కలిగి ఉన్న కోడెలను పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. జియో ట్యాగింగ్ చేసి, ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన రైతులకు రాజన్న కోడెలను పంపిణీ చేస్తే.. అవి పక్కదారి పట్టకుండా ఉంటాయని, భవిష్యత్లో వాటిని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని సందీప్కుమార్ ఝా స్పష్టం చేశారు. కోడెలను తీసుకెళ్లే రైతులు విధిగా వాటి సంరక్షణ బాధ్యతను చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈమేరకు ఆన్లైన్ వెబ్సైట్: https://rajannasircilla.telangana. gov.inలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. -
వస్త్రపరిశ్రమ సమస్యలు పరిష్కరించాలి
● శ్రీధర్బాబును కలిసిన సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు సిరిసిల్లటౌన్: వస్త్రపరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్ల వస్త్రవ్యాపారులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును కోరారు. హైదరాబాద్లో ఆదివారం ఈమేరకు విన్నవించారు. పవర్లూమ్ కరెంటు సమస్య, బ్యాక్ బిల్లింగ్ తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, ఉపాధ్యక్షుడు ఏనుగుల ఎల్లయ్య, కార్యదర్శి గౌడ రాజు, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, కార్యదర్శి అంకాలపు రవి, బూట్ల నవీన్, బూట్ల సతీశ్, బండారి అశోక్ పాల్గొన్నారు. ప్రైమరీ స్కూళ్లపై వివక్ష చూపొద్దు సిరిసిల్లటౌన్: ప్రైమరీ పాఠశాలలపై వివక్ష చూపొద్దని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు మ్యాడారం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి కోరారు. సిరిసిల్లలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అసంబద్ధమైన సర్దుబాటు ఉత్తర్వులను వెనక్కితీసుకోవాలని కోరారు. బడిబాట ముగిసిన తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కూర శ్రీనివాస్, పెంచాల సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు శిరోమణి, సరోజ, వెంకటరమణ పాల్గొన్నారు. ‘ఆక్రమించిన భూమిని ఇప్పించండి’ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్ శివారులోని ఓమౌజయ ఆశ్రమం నిర్మాణంలో కోల్పోయిన తమ భూములను తిరిగి అప్పగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులు సంగెం బాలయ్య, నోముల రజిత, ఎరుకల ప్రశాంత్ ఆదివారం ఆశ్రమం వద్ద నిరసన తెలిపి మాట్లాడారు. గ్రామ శివారులో తమకు 982 సర్వేనంబర్లో 13 ఎకరాలకు పైగా భూమి ఉందని తెలిపారు. తమకు చెందిన పట్టాభూమిని ఆక్రమిస్తూ ఆశ్రమ నిర్వాహకులు ప్రహరీ నిర్మించారని ఆరోపించారు. దీనిపై ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గోశాల నిర్వహణపై ఇంత నిర్లక్ష్యమా ? వేములవాడ: రాజన్న ఆలయ గోశాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా చీమ చిటుక్కుమన్న మాట్లాడే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోడెలు చనిపోతున్నా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆరు నెలలుగా కోడెల పంపిణీ నిలిచిపోవడంతోనే తిప్పాపూర్ గోశాలలో భారీగా కోడెలు జమయ్యాయన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో గోశాలల నిర్వహణ బాగుందని, అక్కడికి వెళ్లి పరిశీలించి రావాలని సూచించారు. ఏనుగు మనోహర్రెడ్డి, క్రాంతికుమార్, రామతీర్థపు రాజు, నరాల శేఖర్, సిరిగిరి రామచందర్, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, గోలి మహేశ్ పాల్గొన్నారు. నేడు ప్రజావాణి రద్దుసిరిసిల్ల: కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిని ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదివారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. -
గోశాల నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టండి
వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా గోశాలను సువిశాల ప్రాంతంలో నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి తనకు సూచించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఖతర్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని రాష్ట్రానికి చేరుకున్న ఆయన ఆదివారం సీఎంను కలిసి పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. కోడెల సంరక్షణకు అత్యాధునిక వసతులు, సువిశాలమైన గోశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలని సూచించారు. ఇటీవల రూ.200కోట్లతో వేములవాడ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరుపై, ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన కమిటీల్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, డిలీమిటేషన్ కమిటీ సభ్యులుగా నియమించడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
పచ్చదనమే లక్ష్యం
● నర్సరీలలో సిద్ధమవుతున్న మొక్కలు ● జిల్లా వ్యాప్తంగా 255 నర్సరీలు ● 5.70 లక్షల మొక్కలు లక్ష్యం ● జూన్ నెలాఖరు వరకు సిద్ధమవుతున్న అధికారులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవానికి అన్ని సిద్ధమయ్యాయి. ఇప్పటికే నర్సరీలలో మొక్కలను అధికారులు పెంచారు. జిల్లాలో 5.70 లక్షల మొక్కలు లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఈమేరకు సిద్ధం చేశారు. జూన్ నెలాఖరు వరకు వనమహోత్సవానికి స్థలాలను ఎంపిక చేసి, మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. 255 నర్సరీలు..5.70లక్షల మొక్కలు జిల్లా వ్యాప్తంగా 255 గ్రామపంచాయతీల పరిధిలో నర్సరీలను నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రామపంచాయతీలో ఒక్కో నర్సరీ నిర్వహిస్తున్నారు. ఒక్కో నర్సరీలో దాదాపు 50 వేల నుంచి 80 వేల వరకు మొక్కలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 9 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. లక్ష్యానికి మించి మొక్కలు రెడీగా ఉన్నాయి. నాటిన మొక్కలు ఒక వేళ ఎండిపోయిన, పశువులు తిన్నా.. వాటి స్థానంలో కొత్తవి నాటేందుకు అదనపు మొక్కలు కూడా జిల్లాలో ఉన్నాయి. వర్షాలు కురవగానే జూన్ 15 నుంచి మొక్కలు నాటడానికి స్థలాలను ముందుగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. జూన్ నెలాఖరు నుంచి మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేశారు. ఉపాధిహామీలో.. ఉపాధిహామీ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ముందుగా గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి, కూలీలతో మొక్కల పెంపకం చేపడుతున్నారు. నర్సరీలను జిల్లా కలెక్టర్తోపాటు గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చారు. నిర్ధేశిత లక్ష్యాలను చేరుకునేలా నర్సరీ నిర్వాహకులను స్థానిక ఏపీవోలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. దీంతో జిల్లాలో ఇప్పటికే 9 లక్షల మొక్కల వరకు సిద్ధం చేయగా.. రానున్న వనమహోత్సవంలో నాటేందుకు ప్రణాళికలు పెట్టుకున్నారు. మొక్కలు ఇవీ.. వనమహోత్సవంలో ప్రధాన రహదారుల వెంట కానుగ, గుల్మోర్, నిద్రగన్నేరు, సిసు వంటి మొక్కలను నాటనున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని వీధులు, గృహాల్లో జామ, ఉసిరి, అల్లనేరేడు, చింత, మామిడి, సీతాఫలం, దానిమ్మ, ఖర్జూర, బాదం, గులాబీ, మల్లె, మందారం మొక్కలు నాటనున్నారు. మొక్కలను తీసుకునేందుకు నర్సరీలకు వచ్చే వారికి పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల వారు నర్సరీలకు వస్తే వారికి ఇష్టమైన మొక్కలు అందిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో మొక్కలు ఇలా.. మండలం జీపీలు మొక్కలు బోయినపల్లి 23 30,000 చందుర్తి 19 40,000 ఇల్లంతకుంట 33 60,000 గంభీరావుపేట 21 60,000 కోనరావుపేట 28 60,000 ముస్తాబాద్ 22 60,000 రుద్రంగి 10 30,000 తంగళ్లపల్లి 30 60,000 వీర్నపల్లి 17 50,000 వేములవాడ రూరల్ 17 40,000 వేములవాడ అర్బన్ 11 20,000 ఎల్లారెడ్డిపేట 24 60,000మొక్కలు సిద్ధం వనమహోత్సవానికి నర్సరీలలో మొక్కలు సిద్ధం చేశాం. జిల్లాలో 5.70 లక్షల మొక్కలు లక్ష్యంగా పెట్టుకున్నాం. గతేడాదిలో పెంచిన మొక్కలు దాదాపు 9 లక్షల వరకు రెడీగా ఉన్నాయి. – కొమురయ్య, ఏపీవో -
‘బంటియా’ ఫర్నీచర్ షోరూం ప్రారంభం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఎదురుగా నూతనంగా ఏ ర్పాటు చేసిన బంటియా ఫర్నీచర్ షోరూంను శు క్రవారం బంటియా మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ బంటియాతో కలిసి సుడా చైర్మన్ కె.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేందర్ బంటియా మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు పొందిన బంటియా ఫర్నీచర్స్ ఇప్పుడు కరీంనగర్లో తన అతిపెద్ద షోరూంను గ్రాండ్గా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి దిగుమతి చేసిన తాజా, నాణ్యమైన ఫర్నిచర్ ఉత్పత్తులను అందిస్తున్నామని అన్నారు. రూ.99,999కి పైగా కొనుగోలు చేసే కస్టమర్లకు హోండా యాక్టివా 6జీ ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రత్యేక బహుమతులు, డిసౌంట్లు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ ఆధారిత రీకై ్లనర్లు రూ.99,999లకు లభిస్తాయన్నారు. క్రేవింగ్ సోఫాలు రూ. 66,000 నుంచి ప్రారంభమవుతాయని, ప్యాకేజీలు, జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పొగాకుతో గుండెకు ముప్పు
పాన్, గుట్కా, తంబాకు, సిగరెట్లలో నికోటిన్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలను సంకుచితం చేస్తాయి. దీంతో రక్తప్రసరణ తగ్గి గుండైపె ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలంగా వీటిని వినియోగించే వారిలో గుండెపోటు, పక్షవాతం, హైపర్టెన్షన్ వంటి తీవ్రమైన కార్డియోవాస్కులర్ సమస్యలు వస్తాయి. పొగాకు వల్ల శరీరంలో శ్రీకోలెస్ట్రాల్శ్రీ స్థాయి పెరిగి, నాళాల్లో శ్రీబ్లాక్శ్రీ ఏర్పడుతుంది. ఇది గుండెకు రక్తసరఫరాను తగ్గించి ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, మితాహారం, వ్యాయామం పాటించడం ఎంతో అవసరం. – డాక్టర్ అనీశ్పబ్బ, కార్డియాలజిస్టు -
బావిలో పడిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
మల్లాపూర్: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్ పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలకేంద్రం శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మాట్ల చిన్నపెద్దులు(61)కు భార్య సత్తమ్మ, కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం గతంలో గల్ఫ్ వెళ్లి వచ్చి కుమార్తె వివాహం జరిపించాడు. ఎనిమిదేళ్లుగా స్వగ్రామంలోనే ఉంటూ ట్రాక్టర్ నడిపించుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన శనిగారపు రమేశ్కు చెందిన వ్యవసాయ భూమిలో చిన్నపెద్దులు ట్రాక్టర్తో దుక్కి దున్నుతున్నాడు. రివర్స్ వెళ్లే క్రమంలో ట్రాక్టర్ వ్యవసాయబావిలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. నీటమునిగి చిన్నపెద్దులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి భార్య సత్తెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు. -
అంజన్న హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును శుక్రవారం ఆలయ అధికారి శ్రీకాంత్, పర్యవేక్షణాధికారి రాజమౌలి ఆధ్వర్యంలో చేపట్టారు. 24 రోజులకుగాను హుండీ ఆదాయం రూ.1,00,95,392 సమకూరిందని, 44 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు. భక్తులు హుండీలో వేసిన మిశ్రమ బంగారం, వెండికి సీలువేసి,తిరిగి హుండీలో వేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణ, స్థానాచార్యుడు కపీందర్, పర్యవేక్షకుడు సునీల్కుమార్, ఎన్.చంద్రశేఖర్, హరిహరనాథ్, ఆలయ సిబ్బంది, ఏఎస్సై శ్రీనివాస్, శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ఉరేసుకుని ఒకరి ఆత్మహత్యమల్యాల: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి కృష్ణ(38) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. వైద్య చికిత్స కోసం లక్షలు ఖర్చు చేసినా, వ్యాధి నయం కాకపోవడంతోపాటు జీవితంపై విరక్తి చెందిన తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. బావిలో పడి వృద్ధుడు మృతిసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన లంక ముత్తయ్య(70) సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపిన వివరాలు.. ముత్తయ్యకు కొడుకు, కూతురు ఉండగా కూతురు నర్సయ్యపల్లిలో ఉంటోంది. అనారోగ్యంతోపాటు మతిస్థిమితం సరిగా లేని ముత్తయ్య నెలరోజుల క్రితం కూతురు ఇంటికి వచ్చాడు. ఈనెల 18న ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. ఈక్రమంలో అతడు ఇంటికి వెళ్లకపోవడంతో బంధువులు ఇళ్లలో, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం నర్సయ్యపల్లి శివారులోని వ్యవసాయ బావిలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనబడడంతో ముత్తయ్యగా కుటుంబసభ్యులు నిర్ధారించారు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని గంగారం శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కూనారం గ్రామానికి చెందిన ఎండీ అక్రం(27) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలో మెకానిక్ పని చేస్తూ జీవనం సాగిస్తున్న అక్రం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా ఆటోట్రాలీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అక్రం అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్ పేర్కొన్నారు. మృతుడికి భార్య సమీరాబేగం, తల్లి దండ్రులు రేష్మ బేగం అక్బర్ పాషా ఉన్నారు. -
సేవ.. స్వచ్ఛంద తోవ
● రాజన్న సేవలో మహిళలు ● ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరు ● గోశాలలోని గడ్డి ఆరబెట్టేందుకు తరలివచ్చిన అతివలు వేములవాడ: రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు రాజన్న సేవలో తరిస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. హుండీ లెక్కింపు.. ఉత్సవాల సమయాల్లో ఆలయంలో వివిధ సేవల్లో రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన తిప్పాపూర్ గోశాలలోని గడ్డిని ఆరబెట్టేందుకు సైతం శుక్రవారం భారీగా మహిళలు స్వచ్ఛందంగా వచ్చారు. పశువులకు సేవా చేయడంలో ఉన్న సంతృప్తి వేరేదాంట్లో రాదని వారు పేర్కొంటున్నారు. దాదాపు 63 మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి కోడెలకు ఉపయోగపడే గడ్డిని ఆరబెట్టే పనుల్లో నిమగ్నమై.. ఆదర్శంగా నిలిచారు. -
పొగాకు నిర్మూలిద్దాం
● విచ్చలవిడిగా తంబాకు, గుట్కా వినియోగం ● బహిరంగంగానే ధూమపానం ● పెరుగుతున్న సిగరేట్లు కాల్చే వారి సంఖ్య ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంకరీంనగర్టౌన్: యువత ఎంజాయ్ చేస్తున్నామనే భావనలో ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. సిగరేట్ కాలినట్లే తమ ఆరోగ్యం కాలిపోతుందనే విషయం గమనించలేకపోతున్నారు. జిల్లాలో యుక్తవయస్సు వచ్చిన విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సిగరేట్, బీడీ, తంబాకు, జర్ధా, గుట్కా వంటి మత్తు పొగాకు మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదాగా మొదలు పెట్టి చివరకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పొగాకు ఉత్పత్తులపై నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వాటి వల్ల వివిధ రకాల రోగాలు వస్తాయని వైద్యులు చెబుతున్నా తినేవారిలో మార్పు రావడం లేదు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కథనం.బహిరంగ ధూమపానం నేరం ధూమపానం నష్టాన్ని గుర్తించిన పాలకులు 2003లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరమని చట్టం తీసుకువచ్చారు. చట్ట ప్రకారం ప్రయాణ ప్రాంగణాలు, పార్కులు, రోడ్లపై, సినిమా థియేటర్లు, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగితే చట్టరీత్యా చర్యలతో పాటు జరిమానా విధించాలి. కానీ, జిల్లాలో అలాంటి కేసులు నమోదు కావడం లేదు. సిగరేట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని ప్యాకెట్లపై ముద్రించి వదిలేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై మరింత కఠిన నియంత్రణలు విధించాలని, విద్యాసంస్థల పరిసరాల్లో గుట్కా, సిగరెట్ అమ్మకాలు పూర్తిగా నిషేధించాలని ఆరోగ్య కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. -
ధాన్యం రాశిపై అడవి పందుల దాడి
రుద్రంగి(వేములవాడ): ఓవైపు నెలల తరబడి ధాన్యం కొనుగోలు చేయక రైతన్న ధాన్యం వర్షాలకు మొలకెత్తుతుంటే.. అదే ధాన్యంపై అడవి పందులు దాడి చేసి టార్పాలిన్ కవర్లు చింపి ధాన్యం చిందరవందర చేస్తున్నాయి. గురువారం రాత్రి మండల కేంద్రానికి చెందిన అక్కెనపెల్లి నర్సింగరావు అనే రైతుకు చెందిన ధాన్యం రాశిపై అడవి పందులు దాడి చేసి టార్పాలిన్ చింపి వేశాయి. ధాన్యాన్ని చెల్లాచెదురు చేయడంతో రైతు లబోదిబోమంటున్నాడు. 22 మంది మందుబాబులకు జైలువేములవాడ: మద్యం సేవించి వాహనాలు నడిపిన 22 మందికి జైలుశిక్ష విధించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ శుక్రవారం తెలిపారు. స్టేషన్ పరిధిలో గత 14 రోజులుగా డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 36 మంది మందుబాబులను పట్టుకున్నట్లు వివరించారు. వీరందరిని శుక్రవారం వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్ ఎదుట హాజరుపరచగా 36 మందిలో 22 మందికి జైలు, 14 మందికి జరిమానా విధించినట్లు తెలిపారు. ఇందులో 11 మందికి మూడు రోజుల జైలు, రూ.2వేలు జరిమానా, ఐదుగురికి రెండు రోజుల జైలు, రూ.2వేల జరిమానా, నలుగురికి నాలుగు రోజుల జైలు, రూ.2వేల జరిమానా, ఒకరికి ఐదు రోజుల జైలు, రూ.2వేల జరిమానా, ఒక వ్యక్తికి ఏడు రోజుల జైలు, రూ.2వేలు జరిమానా విధించారని తెలిపారు. ఐదుగురికి.. చందుర్తి(వేములవాడ): డ్రంకెన్డ్రైవ్ కేసులో ఐదుగురికి రెండు రోజుల జైలు, రూ.2వేలు జరిమానాను మెజిస్ట్రేట్ ప్రవీణ్కుమార్ విధించినట్లు చందుర్తి ఎస్సై బి.అంజయ్య తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు.. మెట్పల్లికి చెందిన ఒకరు, కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన ఒకరు, ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక వ్యక్తి, వేములవాడ రూరల్ మండలం తిప్పయ్యపల్లికి చెందిన ఒకరు, చందుర్తికి చెందిన మరొకరికి రెండు రోజుల జైలు, రూ.2వేల జరిమానా విధించినట్లు ఎస్సై అంజయ్య వివరించారు. ట్రాక్టర్, జేసీబీ పట్టివేతఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలో శుక్రవారం అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు, జేసీబీని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ ఆఫీస్కు తరలించారు. మండలంలోని దేవునిగుట్టతండాలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకోగా.. గొల్లపల్లి హైస్కూల్ వద్ద తప్పించుకున్నారు. గల్ఫ్ కార్మికులకు అండగా రేవంత్రెడ్డి సర్కార్ వేములవాడ: గల్ఫ్ కార్మికులకు రేవంత్రెడ్డి సర్కార్ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఖతర్ వెళ్లిన ఆయనకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఖతర్లోని లేబర్ క్యాంపులను సందర్శిస్తూ కార్మికుల బాధలు తెలుసుకొని వారిలో ఆత్మస్థయిర్యం, మనోనిబ్బారాన్ని నింపారు. టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్, గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ సింగిరెడ్డి నరేశ్రెడ్డి, గుగ్గిళ్ల రవిగౌడ్, టీపీసీసీ ఖతర్ కన్వీనర్ నిజామోద్దీన్ ఖాజా, తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ ఫౌండర్ మెంబర్లు శంకర్గౌడ్, ఎల్లన్న తల్లపెల్లి, వెంకటేశ్, ఎల్లన్న మండపెల్లి, గడ్డి రాజు, చింతకుంట మహేందర్ తదితరులు ఉన్నారు. -
వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతం
కొత్తపల్లి(కరీంనగర్): టీపీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలో విద్యుత్ వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైందని ఎస్ఈ మేక రమేశ్బాబు అన్నారు. విద్యుత్ భవన్లోని ఎస్ఈ చాంబర్లో శుక్రవారం ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. గత సంవత్సరం నవంబర్ నెల నుంచి వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని.. అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంతో విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించామన్నారు. లోడ్ పెరిగే అవకాశమున్నచోట్ల రాచర్ల తిమ్మాపూర్, మొయినకుంట, జేపీనగర్, బోనాల, మల్లారం, రేణిగుంట ప్రాంతాల్లో 5 ఎంవీఏ, కరీంనగర్ టౌన్ బ్యాంక్ కాలనీలో 12.5 ఎంవీఏ కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పామని, కరీంనగర్ టౌన్ ఉజ్వల పార్క్, వాటర్ వర్క్స్, ఎస్ఆర్ఆర్, నవపేట్, వీర్నపల్లి ప్రాంతాల్లో 5 ఎంవీఏ నుంచి 8 ఎంవీఏ, సప్తగిరికాలనీ సాయినగర్(ఖాజీపూర్–2)లో 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏ, కోర్కల్, వట్టములలో 3.15 నుంచి 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం వరకు పెంచామని వివరించారు. కరీంనగర్ మున్సిపల్ టౌన్, కాజిపూర్(బాబుపేట్), చిగురుమామిడి, సిరిసిల్ల జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి లోడ్ సామర్థ్యం పెంచడంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నివారించగలిగామని చెప్పారు. ఇప్పటివరకు 325 కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతోపాటు 355 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్ టౌన్, కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో అల్గునూరు, చిగురుమామిడి, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర ప్రాంతాల్లో ఓవర్ లోడ్ తగ్గించామని, గత నవంబర్ నెల నుంచి నిరంతరాయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ వేసవికాల ముందస్తు కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేశామని తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● డీఈవో శ్రీరామ్ మొండయ్యకరీంనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మక విద్య లభిస్తుందని, పాఠశాలల బలోపేతానికి ఎస్జీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆరు రోజుల పాటు బడిబాట ప్రచార రథాన్ని నిర్వహించడం అభినందనీయమని డీఈవో శ్రీరామ్ మొండయ్య అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదు కోసం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల ఉమ్మడి జిల్లా ప్రచార రథాన్ని డీఈవో శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జూన్ 5 వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు. ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి మాట్లాడుతూ, న్యాయపరంగా రావాల్సిన హక్కుల కోసం ఉద్యమిస్తామని, ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, విద్యార్థులు తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో విజయేందర్రెడ్డి, మంజుల హరిప్రియ, రమణారెడ్డి, సత్యం, కిషన్, సుధాకర్రావు, గాయత్రి, రోహిణిదేవి, సాగర్, మాధవ్, రామన్, వెంకటేశ్, అరవింద్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకుంటున్నారు
గాలిపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈ శిబిరానికి హాజరవుతున్నారు. ఈతరం యువజన సంఘం సభ్యులు సహకరిస్తున్నారు. గ్రామంలోని క్రీడాభిమానులు విద్యార్థులకు స్నాక్స్, క్రీడాదుస్తులు అందించారు. – సాన బాబు, వ్యాయామ ఉపాధ్యాయుడు క్రీడాకారులను ప్రోత్సహించాలనే.. విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశాం. వ్యాయామ ఉపాధ్యాయుడు సానబాబు విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తున్నారు. మంచి క్రీడాకారులు తయారు చేయడమే లక్ష్యం. – జి.నరేశ్, ఈతరం యువజన సంఘం అధ్యక్షుడు -
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
● జిల్లా జెండర్, ఈక్విటీ కో–ఆర్డినేటర్ పద్మజాసిరిసిల్ల: మానవ అక్రమ రవాణాను అరికట్టాలని, సామాజిక బాధ్యతగా అందరూ భాగస్వాములు కావాలని జెండర్ అండ్ ఈక్విటీ జిల్లా కోఆర్డినేటర్ పద్మజా కోరారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ స్కూల్లో ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. పద్మజా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందన్నారు. సైబర్ ట్రాఫికింగ్పై అవగాహన కల్పించాలన్నారు. ఉద్యోగం, సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ పట్టణాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహాల్లో అమ్ముతున్నారని.. ఇలాంటి వాటి గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజ్వల సంస్థ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ బలరాం మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించుకోవచ్చన్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 30 వేల మంది అమ్మాయిలు, మహిళలను కాపాడినట్లు తెలిపారు. ఇలాంటి వాటిపై సఖీ, భరోసా, చైల్డ్లైన్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ 1098, 100, 181, 1930, 181లో గురించి చెప్పాలన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ శైలజా, అసిస్టెంట్ కోఆర్డినేటర్ అంబర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
● సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీహరి ప్రసాద్ వీర్నపల్లి(సిరిసిల్ల): ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి, సంరక్షించాలని సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీహరిప్రసాద్ కోరారు. ప్రపంచ పర్యావరణ వా రోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం వీర్నపల్లి మండలం రాశిగుట్టతండాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. మే 22 నుంచి జూన్ 6 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు ముందుకురా వాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జూట్ బ్యాగులను వాడాలని సూచించారు. గతంలో ఇచ్చిన పోడు పట్టాలకు మించి అటవీ భూమి లో సాగుచేస్తే చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. తహసీల్దార్ ముక్తార్పాషా, ఎస్సై ఎల్లయ్యగౌడ్, మండల అబివృద్ధి అధికారి వాజిద్, వీర్నపల్లి సెక్షన్ అధికారి రంజిత్కుమార్, మోహన్లాల్, అంజలి, భూలక్ష్మి, పద్మలత, సక్కారాం పాల్గొన్నారు. నేడు కేంద్ర మంత్రి సంజయ్ పర్యటన బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని వెంకట్రావుపల్లి–జగ్గారావుపల్లి గ్రామాల పరిసరాల్లో నిర్మించే బ్రిడ్జి పనులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ శనివారం శంకుస్థాపన చేస్తారని బీజేపీ మండల అధ్యక్షుడు ఎడపల్లి పరశురామ్ శుక్రవారం తెలిపారు. కేంద్ర మంత్రి పర్యటనలో మండలానికి చెందిన బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
శిక్షణతో నైపుణ్యాలకు మెరుగు
● వేసవి శిక్షణ శిబిరంలో రాణిస్తున్న విద్యార్థులు ● గాలిపల్లి హైస్కూల్లో నెల రోజులుగా కొనసాగుతున్న శిబిరం ● ప్రోత్సహిస్తున్న గ్రామస్తులు, ఈతరం యువజన సంఘం ఇల్లంతకుంట(మానకొండూర్): వేసవి సెలవులను వృథా చేయకుండా క్రీడల్లో నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం శిక్షణ తరగతులకు హాజరవుతూ నచ్చిన క్రీడాంశంలో శిక్షణ పొందుతున్నారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి హైస్కూల్లో గ్రామానికి చెందిన సీనియర్ క్రీడాకారుల ఆధ్వర్యంలో నెల రోజులగా వాలీబాల్, కబడ్డీ క్రీడల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వీరికి ఈతరం యువజన సంఘం తోడుగా నిలిచింది. సమ్మర్ క్యాంప్నకు వస్తున్న విద్యార్థులకు స్నాక్స్ అందించడంతోపాటు సౌకర్యాలు కల్పిస్తున్నారు. గ్రామస్తుల ప్రోత్సాహంతో విద్యార్థులు క్రీడల్లో మెరికల్లా తయారవుతున్నారు. 80 మంది విద్యార్థులు నెల రోజులుగా కొనసాగుతున్న క్రీడల వేసవి శిబిరానికి గాలిపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 80 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం వాలీబాల్, కబడ్డీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్థానిక పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సాన బాబు, గ్రామంలోని సీనియర్ క్రీడాకారుల సలహాలు, సూచనలతో శిక్షణ తీసుకుంటున్నారు. గ్రామంలోని సీనియర్ క్రీడాకారులు శిక్షణార్థులకు క్రీడాదుస్తులు అందజేశారు. -
పీసీసీలో మనోళ్లకు చోటు
● పీఏసీ కమిటీలో దుద్దిళ్ల, పొన్నం, ఆది ● కేబినెట్లో చోటు కోసం ఉమ్మడి నేతల ఆరాటంసాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన వివిధ పీసీసీ కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రికి చోటు దక్కింది. పీసీసీ కమిటీల్లో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్లను నియమించారు. కాగా.. ఇటీవల కొంతకాలంగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డికి సలహా కమిటీలో అవకాశం కల్పించారు. అదేవిధంగా డీలిమిటేషన్ కమిటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలను సభ్యులుగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, అందులో నలుగురికి పీసీసీ కమిటీల్లో అవకాశం లభించింది. మంత్రి వర్గంలో ఆది.. మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు మరో బెర్తు ఖాయంగా కని పిస్తోంది. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నా రు. మున్నూరు కాపు సామాజికవర్గం కోణంలో ఆ యనకు బెర్తు ఖాయమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. మాదిగ సామాజిక వర్గం తరఫున త మకు కూడా కేబినెట్ లో చోటు కల్పించాలని మరో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు కో రుతున్నారు. మరోవైపు తనకు కూడా మంత్రి పద వి ఇవ్వాలని ఇటీవల రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోరిన విషయం విదిత మే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటికే దు ద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ కేబినెట్లో ఉ న్నారు. వీరికితోడుగా మరో ఒక్క బెర్తు మాత్రమే ఖ రారయ్యే అవకాశాలు ఉండటంతో ఈ ఒక్క మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
జెండా పండుగ అతిథులు వీరే
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ పండుగకు జిల్లా కేంద్రాల్లో జరిగే ఉత్సవాలకు అతిథులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, జగిత్యాలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, పెద్దపల్లికి రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, రాజన్న సిరిసిల్లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లు జెండా ఆవిష్కరించనున్నారు.వేములవాడ సబ్రిజిస్ట్రార్గా విజయభాస్కర్వేములవాడ: వేములవాడ సబ్ రిజిస్ట్రార్గా దేవరం విజ యభాస్కర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన వేములవాడకు ప్రమోషన్పై వచ్చారు.నీరు నిల్వ ఉండకుండా చూడాలి● జిల్లా వైద్యాధికారి ఎస్.రజితసిరిసిల్ల: కొబ్బరి బొండాలు, కూలర్లు, డ్రమ్ముల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత కోరారు. సిరిసిల్లలోని సుందరయ్యనగర్ ఆరోగ్య కేంద్రం పరిధిలో శుక్రవారం డ్రై డేలో భాగంగా ప్రగతినగర్లో తనిఖీలు చేశారు. ఇంటి వద్ద ఉండే నీటితొట్లు, డ్రమ్ములు, ఆరు బయట పరిసరాలను పరిశీలించారు. డెంగీ, మలేరియా జ్వరాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, మలేరియా సూపర్వైజర్ లింగం, వాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.అధిక ధరలకు విక్రయిస్తే చర్యలుకోనరావుపేట(వేములవాడ): విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు గరిష్ట ధర(ఎమ్మార్పీ) కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధి కారి అఫ్జల్ బేగం హెచ్చరించారు. కోనరావుపేట, నిజామాబాద్, ధర్మారం గ్రామాల్లోని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నాణ్యమైన విత్తనాలు అందించాలని ఫర్టిలైజర్ దుకాణాదారులకు సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. విత్తనాల ధరలు, స్టాక్ వివరాలు బోర్డుపై ప్రదర్శించాలన్నారు. తనిఖీలలో స్థానిక మండల వ్యవసాయ అధికారి సందీప్ పాల్గొన్నారు.స్పోర్ట్స్ అకాడమీ హాస్టళ్లలో ప్రవేశాలకు ఎంపికలుసిరిసిల్లకల్చరల్: రాష్ట్ర క్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ స్పోర్ట్స్ అకాడమీలు, హాస్టళ్లలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖాధికారి అజ్మీర రాందాస్ శుక్రవారం తెలిపారు. సిరిసిల్ల వాలీబాల్ అకాడమీ కోసం రాజీవ్నగర్ మినీస్టేడియంలో జూన్ 10న జరిగే పోటీల్లో 14 నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలు పాల్గొనాలని తెలిపారు. జూన్ 1న సిద్దిపేట అకాడమీ, జూన్ 12, 13న మహబూబ్నగర్ స్టేడియం, 10, 11న సైక్లింగ్ వెలోడ్రోమ్ ఓయూ క్యాంపస్, ప్రాంతీయ క్రీడా వసతి గృహం హనుమకొండ, 12న వనపర్తి హాకీ అకాడమీ, ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు.ఆర్టీసీ బస్టాండ్లో పార్కింగ్కు టెండర్లుసిరిసిల్లటౌన్: ఆర్టీసీ కొత్త బస్టాండ్లో వెహికిల్ పార్కింగ్, క్యాంటీన్ నిర్వహణ, ఎల్లారెడ్డిపేటలో వెహికిల్ పార్కింగ్, ముస్తాబాద్లో మొబైల్ షాప్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీఎం ప్రకాశ్రావు తెలిపారు. సిరిసిల్ల డిపోయార్డ్, గ్యారేజీలలో స్వీపింగ్, క్లీనింగ్ కాంట్రాక్టు వర్క్ కోసం టెండర్పత్రాలు డిపో మేనేజర్ ఆఫీసులో విక్రయిస్తున్నట్లు తెలిపా రు. 99493 73819, 86868 69005 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
బిల్లులు రావు.. దిగులు తీరదు !
సిరిసిల్లటౌన్: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా మారింది సిరిసిల్లలో కాంట్రాక్టర్ల పరిస్థితి. దాదాపు మూడేళ్ల క్రితం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.కోట్లాది పనులను టెండర్ల ద్వారా దక్కించుకుని నిర్మాణాలు పూర్తి చేశారు. అధికారులు నాణ్యతను పరిశీలించి నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి పంపించారు. దీంతో సుమారు రూ.6కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం ఇటీవల అందించింది. ప్రతీ రోజూ కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు అందడం లేదు. కాంట్రాక్టర్ల ఎదురుచూపులపై ‘సాక్షి’ ఫోకస్. బిల్లులపై కాలయాపన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల మంజూరులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.10కోట్లతో సిరిసిల్లలో మూడేళ్ల క్రితం పనులు చేపట్టినట్లు సమాచారం. వీటిని హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లికి చెందిన ఐదుగురు కాంట్రాక్టర్లు పనులు పొందారు. ప్రభుత్వ పనులే కదా బిల్లులు వస్తాయని కొందరు ఆస్తులు, ఆభరణాలు తాకట్టు పెట్టి పనులు చేయించగా.. మరికొందరు అప్పు చేసి పనులు పూర్తి చేయించారు. మూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో అధికారులు, ఆఫీసులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నెల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల మున్సిపాలిటీకి రూ.5.85కోట్లు టీయూఎఫ్ఐడీసీ నిధులు మున్సిపాలిటీకి చేరాయి. 22 పనులకు సంబంధించిన బిల్లులు వస్తున్నాయని నెల రోజులుగా కాంట్రాక్టర్లు గంపెడాశతో ఉంటున్నారు. జిల్లా కలెక్టర్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్లపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. కొత్తపనులకు ముందుకురాని కాంట్రాక్టర్లు పాతబిల్లులే మూడేళ్లుగా రాకపోవడంతో కొత్త పనుల కోసం టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఎస్డీఎఫ్ నిధుల ద్వారా పలు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో వాయిదా వేశారు. ఇక సిరిసిల్ల మున్సిపల్ పరిఽధిలో మూడేళ్ల క్రితం రోడ్లు, వరదకాల్వలు, డ్రెయినేజీలు, కమ్యూనిటీ భవనాలు, క్రీడాస్థలాల పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం అధికారులు టెండర్లు పూర్తి చేసి పనులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. సదరు పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని 2023లో అప్పటి కమిషనర్ ఎండీ అయాజ్ను, 2024లో దుబ్బాక లావణ్యను, నెల క్రితం సెలవులో వెళ్లిన కమిషనర్ ఎస్.సమ్మయ్య, ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న పోసు వాణిలకు విన్నవించారు. అయినా ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. మీరు చూస్తున్న ఈ చిత్రం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం. మైదానంలో గ్రావెల్ పనులు, సీటింగ్ గ్యాలరీ, పైకా భవనం, మరుగుదొడ్లు, మూత్రశాలలు పూర్తయ్యాయి. దీనిని అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల క్రితం టీయూఎఫ్ఐడీసీ రూ.3కోట్లు కేటాయించింది. వీటిలో రూ.కోటి వరకు బిల్లులు కాంట్రాక్టర్కు చెల్లించగా.. ప్రస్తుతం మరో రూ.70లక్షలు రెండో విడతగా నిధులు మంజూరయ్యాయి. మీరు చూస్తున్న ఈ ఫొటో జిల్లా కేంద్రంలోని వెంకంపేట ఆధునిక దోభీఘాట్ నుంచి పద్మనగర్ వరకు సుమారు 1.5 కిలోమీటర్లు నిర్మించిన ప్రధాన డ్రెయినేజీ. సుమారు రూ.6కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. మూడేళ్ల క్రితమే కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేశారు. గతంలో సగం నిధులు మంజూరుకాగా కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం రూ.1.4కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చేరలేదు. మూడేళ్లుగా కాంట్రాక్టర్లకు ఎదురుచూపులే సిరిసిల్ల బల్దియాలో వింత ధోరణి పట్టించుకోని అధికారులు ఆందోళనలో కాంట్రాక్టర్లుఉన్నతాధికారులకు విన్నవిస్తాం కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై చర్యలు తీసుకుంటాం. బిల్లుల విషయమై ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తాం. నెల రోజుల క్రితం టీయూఎఫ్ఐడీసీ నిధులు వచ్చాయి. పట్టణ ప్రగతి పనుల బిల్లులు కూడా కొన్ని అందాయి. త్వరలోనే బిల్లులను అందజేసేందుకు కృషి చేస్తాం. – పోసు వాణి, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
చందుర్తి(వేములవాడ): త్వరలోనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. చందుర్తిలో పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం పార్టీ నాయకులు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్రావులతో కలిసి ప్రారంభించారు. గోపి మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు గడపగడపకు తీసుకెళ్లాలని కోరారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. ప్రతీ కార్యకర్త స్థానికసంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు సైనికునిల్లా పనిచేయాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు మోకిలే విజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అల్లాడి రమేశ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కోల కిష్టస్వామి, నియోజకవర్గ కన్వీనర్ మార్త సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు పడాల గణేశ్, పోంచేటి రాకేశ్, నంద్యాడపు వెంకటేశ్, మారుతి, వేణుగోపాల్, రాపెల్లి శ్రీధర్, చిలుముల హనుమయ్య, తీపిరెడ్డి మనోహర్రెడ్డి, మట్కం మల్లేశం, చింతకుంట గంగాధర్ పాల్గొన్నారు. ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని పరీక్షలు చేయాలి
● రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాసిరిసిల్ల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వైద్యపరీక్షలు చేయాలని, ఆస్పత్రుల్లో వసతులు కల్పించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో 2డీ–ఇకో పరీక్షలతోపాటు అన్నీ పరీక్షలు చేయాలన్నారు. డయాగ్నోస్టిక్ హబ్లో అన్ని రకాల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, శాంపిల్స్ సేకరణ, రిపోర్ట్ వేగంగా అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, టెక్నీషియన్స్ తాత్కాలిక ప్రాతిపదికన ఎక్కువ వేతనం అందించి నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి చేపట్టిన పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించి, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సదరం క్యాంపులను ఎప్పటికప్పుడు నిర్వహించి దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు జారీ చేయాలని సూచించారు. వేములవాడ ఆస్పత్రిలో మోకాల ఆపరేషన్ విజయవంతంగా జరుగుతున్నాయని, సిరిసిల్ల ఆస్పత్రిలోనూ ఇలాంటి ఆపరేషన్లు జరగాలన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్.రజిత, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి సమీక్షించారు. జెండా ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్ధం చేయడంలో పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, కలెక్టరేట్ ఏవో రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయించాలని.. అనర్హులకు ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు వానాకాలం పంటలసాగు సన్నద్ధతపై కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఖరీఫ్ సీజన్లో ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను భాగస్వామ్యం చేస్తాం. ఎస్సారెస్పీ సామర్థ్యం సిల్ట్ కారణంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీసిల్టేషన్ ఆధునిక పద్ధతుల్లో పూర్తిచేసి పూర్వపు సామర్థ్యం తీసుకొస్తాం. కడెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో సిల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులను వినియోగిస్తాం. కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా.. ఇందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో ముందుకు వెళ్తా. సింగరేణి భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. బండ్ల వాగు ఎత్తిపోతల పథకాన్ని వారం రోజులలో ప్రారంభిస్తాం. పాలకుర్తి ఎత్తిపోతల పథకం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.● రోళ్లవాగు ప్రాజెక్టు అటవీ అనుమతులు వచ్చేలా ఉన్నతాధికారులతో జగిత్యాల కలెక్టర్ నిరంతరం సంప్రదింపులు చేయాలని మంత్రి సూచించారు. నారాయణపురం రిజర్వాయర్, కొండగట్టు ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలుచేస్తుందన్నారు. కలెక్టర్లు మరోవారం కొనుగోలు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అవసరమైనమేర ధాన్యం రవాణా కోసం వాహనాలు సిద్ధం చేసుకోవాలని.. లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు వాడాలన్నారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణలోని 84 శాతం జనాభాకు ఉచితంగా ఆరుకిలోల సన్నబియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది విప్లవాత్మక పథకమని.. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకై క రాష్ట్రం మనదే అని తెలిపారు.ఇళ్ల స్థలాలపై ఆందోళన వద్దు..మీడియా మిత్రులకు ఎస్సారెస్పీ సమీపంలో అందుబాటులో ఉన్న భూములు పంపిణీకి ఉన్న సమస్యలు పరిష్కరించి త్వరలోనే ఇంటి పట్టాలు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కరీంనగర్ మీడియా మిత్రులు ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో చర్చించి త్వరలో పట్టాలు అందించే కార్యక్రమం చేపడుతామని పేర్కొన్నారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగిందన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.51 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతుల నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. భూ భారతి చట్టంతో పట్టాదారులకు ఎటువంటి నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో రైస్ మిల్లులవద్ద తూకం పేరుతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడా ఇబ్బంది లేదన్నారు. మలకపేట, సూరమ్మ, మోతె నారాయణపూర్, గౌరవెల్లి, దేవాదుల వంటి ప్రాజెక్టుల పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోకి భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలు వస్తాయని.. ఆయా జిల్లా కలెక్టర్లను సైతం సమీక్ష సమావేశాలకు ఆహ్వానించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, చింతకుంట విజయ రమణా రావు, డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా, సత్య ప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ జె.అరుణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. -
స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు
● జూన్ 2 నుంచి అమలు ● ఆన్లైన్లోనే స్టాంపు డ్యూటీ చెల్లింపులు ● సిరిసిల్లకు రోజుకు 48 స్లాట్లు సిరిసిల్ల: రిజిస్ట్రేషన్లు ఇకపై స్లాట్ బుకింగ్ విధానంలో చేయనున్నారు. ఆన్లైన్లో స్టాంపు డ్యూటీ, ఇతర ఫీజుల చెల్లింపు ఇప్పటికే అమలులో ఉండగా.. తాజాగా ప్రతీ రిజిస్ట్రేషన్కు ముందే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని జూన్ 2 నుంచి అమలు చేయనున్నారు. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ సబ్ రిజస్ట్రార్ ఆఫీస్లు ఉండగా.. ప్రస్తుతం రోజుకు 60 నుంచి 80 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఒక్క సిరిసిల్లలో 30 నుంచి 35 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. రోజుకు 48 స్లాట్లను కేటాయించారు. పనిదినాల్లో 48 డాక్యుమెంట్లకు మించి రిజిస్ట్రేషన్ చేయరాదు. regisrtration.telangana.gov. in వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సిరిసిల్ల, వేములవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ల్లోనూ ఈ స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనున్నారు. అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లకు చెక్ అర్ధరాత్రి వరకు ఆఫీస్ తెరిచి ఉంచి అక్రమాలకు తెరలేపే పద్ధతులకు చెక్ పెట్టేందుకే స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. స్లాట్బుకింగ్ చేసుకొని, ఆన్లైన్లో డబ్బులు చెల్లించి ఆలస్యంగా వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకునే అవకాశం లేదు. ఇప్పటికే వ్యవసాయ భూములకు సంబంధించి న రిజిస్ట్రేషన్లు పాస్బుక్కుల ద్వారా ఆయా మండలాల్లో తహసీల్దార్లు చేస్తున్నారు. ఇంటి నంబ రు, డాక్యుమెంట్లు, పట్టణ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు సబ్రిజిస్ట్రార్ ఆఫీస్ల్లో జరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో మరింత పారదర్శకంగా స్లాట్బుకింగ్తో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఆస్తుల క్రయ, విక్రయదారులు స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వస్తే సరిపోతుంది. గంటలోపు అన్ని పనులు పారదర్శకంగా జరగనున్నాయి.స్లాట్ బుకింగ్ తప్పనిసరి జూన్ 2 తర్వాత నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వస్తే రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు. ముందే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్లో తేదీ, సమయం ఉంటుంది. నిర్ధిష్టమైన వేళల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. స్లాట్ బుకింగ్లో ఇచ్చిన సమయానికి వస్తే చాలు. – ఆర్వీవీ స్వామి, సబ్ రిజిస్ట్రార్, సిరిసిల్ల -
రసాభాసగా రాజన్నపేట ఇళ్ల విచారణ
● పరిహారం ఇవ్వాలని పలువురి వాదన ● మరోసారి వాయిదాబోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం వరదవెల్లి అనుబంధ రాజన్నపేటలోని 9 ఇళ్ల పరిహారం చెల్లింపులపై గతంలో వచ్చిన ఆరోపణలపై గురువారం వరదవెల్లి గ్రామపంచాయతీలో చేపట్టిన విచారణ రసాభాసగా మారింది. ఈనెల 20న విచారణకు ఎవరూ హాజరుకాకపోవడంతో వాయిదాపడ్డ విషయం తెలిసిందే. గురువారం నాటి విచారణకు గ్రామానికి చెందిన పలువురు హాజరై తమ ఇళ్లకు పరిహారం రాలేదన్నారు. తమకు సైతం పరిహారం ఇవ్వాలని కోరారు. గతంలో పరిహారం తీసుకున్న వారికి మళ్లీ ఇస్తే తమకు సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న 9 మంది న్యాయవాదితో వచ్చారని డీఎల్పీవో నరేశ్ తెలిపారు. 2005 నుంచి గ్రామపంచాయతీ రికార్డులు సక్రమంగా లేవన్నారు. రికార్డులు సరిగ్గా తీసుకురావాలని ఆదేశించినట్లు తెలిపారు. సమావేశం రసాభాసగా మారడంతో వాయిదా వేస్తున్నట్లు డీఎల్పీవో ప్రకటించారు. సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్రావు, గతంలో పని చేసిన పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవో శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి శ్రీహిత హాజరయ్యారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
సిరిసిల్లటౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుమాల రమానాథ్రెడ్డి కోరారు. టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం గురువారం గీతానగర్ హైస్కూల్లో నిర్వహించారు. ప్రభుత్వాలు మారినప్పుడు విద్యావిధానాలు మారడం, నూతనంగా పాఠశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలు సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయన్నారు. 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల వేతనాలు, సమగ్ర సర్వే చేసిన ఉపాధ్యాయులకు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర కౌన్సిలర్ సత్తు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, ఉపాధ్యక్షులు పురం వాసుదేవరావు, మందాడి శ్రీనివాస్రెడ్డి, నూగురి దేవేందర్, కేవీ రజ నీరాణి, తాళ్లపల్లి శ్రీధర్, మైలారం తిరుపతి, చకినాల రామచంద్రం పాల్గొన్నారు.జాగ్రత్తలతో కరోనాను నివారించవచ్చు● వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి● జిల్లా వైద్యాధికారి ఎస్.రజితసిరిసిల్ల: జిల్లాలో కాలానుగుణంగా వ్యాపించే వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. ఈమేరకు గురువారం జిల్లా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ.. ప్రకటన విడుదల చేశారు. సాధారణ జలుబు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రయాణాలు, జనసమూహాల్లో ఉన్నప్పుడు మాస్క్లు ధరించాలని సూచించారు. కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల్లో నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే నిర్ధారణకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చికిత్సతోనే నయమవుతుందని తెలిపారు. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి తక్కువస్థాయి లక్షణాలే నమోదవుతున్నాయని వివరించారు. -
పాలిస్టర్ వస్త్రానికి కూలి పెంచాలి
సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి కార్మికుల కూలి పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ కోరారు. యజమానులతో చర్చలు జరిపించి కూలి పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్కు గురువారం వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కార్మికుల కూలి ఒప్పందం 2024 ఏప్రిల్తోనే ముగిసిందన్నారు. ఈమేరకు యజమానులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పెంచకుంటే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.‘ఆలయ అభివృద్ధికి వ్యతిరేకం కాదు’వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఈవో తమకు హైకోర్టు ద్వారా కేవియట్ నోటీస్ పంపించమేంటని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రశ్నించారు. భీమేశ్వర గార్డెన్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి ప్రణాళిక లేకుండానే ఆలయాన్ని మూసివేస్తామనడం సమంజసం కాదన్నారు. తాము సైతం కోర్టులను ఆశ్రయించి భక్తుల మనోభావాలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రాపెల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.గోశాలలో దిద్దుబాటు చర్యలువేములవాడఅర్బన్: తిప్పాపూర్లోని రాజన్న గోశాలలో దిద్దుబాటు చర్యలకు ఆలయ అధికారులు గురువారం దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గోశాలలో పరిశుభ్రత లోపించడం, వరిగడ్డి కట్టలు తడిసిపోయాయన్న విమర్శలకు అధికారులు స్పందించారు. ఆలయ సిబ్బంది, అధికారులు, సేవాసమితి సభ్యులు గోశాలలోని వరిగడ్డి కట్టలను ఆరబెట్టి, వాటిని ఒక చోట పేర్చి టార్పాలిన్ కవర్లు కప్పించారు. అంతేకాకుండా బురదతో నిండిపోయిన గోశాలలో వర్షం నీటిని తీయించి బురద కాకుండా చర్యలు తీసుకున్నారు. మరిన్ని సౌకర్యాలు క ల్పిస్తామని ఈవో వినోద్రెడ్డి తెలిపారు. ఈఈ రాజేశ్, ఏఈ రామకృష్ణారావు, గోశాల పర్యవేక్షకులు విజయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రైతుల కష్టం వరదపాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అధికారుల నిర్లక్ష్యం మూలంగా వరదపాలైంది. అకాల వర్షాలు దండికొట్టడంతో 45రోజులుగా తూకం వేయకుండా కేంద్రాల్లోనే ఉన్న ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తింది. దీంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ఐకేపీ అధికారులు, నిర్వహకుల నిర్లక్ష్యం వల్ల మాయిచ్చర్ వచ్చి 45 అయినప్పటికీ రైతులు కేంద్రాలకు తెచ్చిన వడ్లను తూకం వేయలేదు. కేంద్రాల్లో హమాలీలు లేక, నిర్వహకులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. తడిసి మొలకెత్తిన ధాన్యం -
సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు
● రూ.2కోట్లు ప్రకటించిన సీఎండీ బలరామ్ ● ప్రత్యేక సంస్థతో ప్రతిపాదనల రూపకల్పన ● త్వరలో తుదిరూపం వచ్చే అవకాశం ● సింథటిక్ ట్రాక్తోపాటు స్టేడియం విస్తరణకు చర్యలు ● కొన్ని సంగరేణి క్వార్టర్లను కూడా తొలగించే అవకాశంగోదావరిఖని: క్రీడాకారులకు అనుగుణంగా సింగరేణి స్టేడియాన్ని ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని యాజమాన్యం నిర్ణయించింది. సింథటిక్ వాకింగ్ట్రాక్తో పాటు క్రికెట్ ప్లే గ్రౌండ్, వాలీబాల్ కోర్టు, ట్రాక్ విస్తరణ కోసం మైదాన్ని విస్తరించాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం సీఎండీ బలరాం ఇటీవల రూ.2కోట్లు ప్రకటించారు. దీంతో రాబోయే తరానికి ఉపయోగపడేలా సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం స్టేడియంలోని కట్టడాలు, రాబోయే రోజుల్లో విస్తరిస్తే ఎలా మార్చాల్సి ఉంటుందనే అంశంపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు స్పోర్ట్స్ అథారిటీ కంపెనీ ప్రతినిధులు మంగళవారం స్టేడియాన్ని పరిశీలించారు. సింథటిక్ ట్రాక్పైనే దృష్టి.. ప్రధానంగా సింథటిక్ వాకింగ్ ట్రాక్పై యాజమాన్యం దృష్టి సారించింది. 400 మీటర్ల వాకింగ్ ట్రాక్ లేదా 800మీటర్ల వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మైదానం చుట్టూ సింథటిక్ వాకింగ్ట్రాక్, మధ్యలో క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్వార్టర్ల తొలగింపుపై ఆలోచన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం విస్తరణలో భాగంగా మైదానాన్ని ఆనుకుని ఉన్న సీఈఆర్క్లబ్ ఎదుట గల సింగరేణి క్వార్టర్లను తొలగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే స్టేడియం వెనకాల ఉన్న కొన్ని క్వార్టర్లను కూడా తొలగించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అభివృద్ధి కోసం రూ.2కోట్లు కేటాయిస్తారు. ఈప్రాంత క్రీడాకారులతోపాటు సింగరేణి ఉద్యోగులకు అనుకూలంగా స్టేడియంలో అన్నిఏర్పాట్లు చేస్తాం. సింథటిక్ వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎమ్మెల్యే సూచనల మేరకు ఈప్రాంత క్రీడాకారుల కోసం స్టేడియం విస్తరణ పనులు శరవేగంగా సాగుతాయి. – లలిత్కుమార్, ఆర్జీ–1 జీఎం -
లక్ష్మీపూర్లో మున్నాభాయ్ ఎంబీబీఎస్!
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాగా నకిలీ వైద్యుడి లీలలు బుధవారం వెలుగు చూశాయి. గ్రామంలో వంగరి గోవర్దన్ అనే వ్యక్తి ఒక ఇంటిని అద్ధెకు తీసుకుని మెడికల్ ప్రాక్టీషనర్ పేరుతో క్లినిక్ను ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా తన కొడుకు పేరుతో ఎంబీబీఎస్ లెటర్ హెడ్తో వైద్యం ప్రారంభించాడు. పేషంట్లకు ఇంజక్షన్లు, సైలెన్లు పెట్టడం, ఎంబీబీఎస్ లెటర్ హెడ్పై మందులు వ్రాయడం మొదలెట్టాడు. వస్తున్న కాసులు సరిపోవడం లేదని అనుకున్నాడో ఎమో తెలియదు కానీ ఏకంగా మహిళలకు సంతానం కలిగిస్తానంటూ కొత్త వైద్యం ప్రారంభించాడు. సాధారణంగా గైనకాలజీ డాక్టర్లు మహిళలకు సంతానోత్పత్తి కొరకు హెచ్సీజీ ఇంజక్షన్లను అన్ని వైద్య పరీక్షల అనంతరం అవసమైతేనే ఇస్తుంటారు. ప్రథమ చికిత్సలకు పరిమితం కావాల్సిన మెడికల్ ప్రాక్టీషనర్లు ఏకంగా అర్హతగల డాక్టర్ల మాదిరిగా చికిత్సలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నకిలీ వైద్యుడి వైద్యంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజితను ‘సాక్షి’ వివరణ కోరగా వారం రోజుల క్రితమే అతడికి నోటీసులు ఇచ్చామని, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొడుకు పేరుతో తండ్రి వైద్యం అద్దె ఇంటిలోనే పేషంట్లకు సైలెన్లు, ఇంజక్షన్లు ఇస్తున్న వైనం -
కోర్టు ఆవరణలో ఆటో దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కోర్టు ఆవరణలో పార్కింగ్ చేసిన ఆటోను దొంగిలించిన నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని గౌతమినగర్కు చెందిన జిలకర ప్రసాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం బుట్టపూర్కు చెందిన మగ్గిడి కృష్ణ ఈనెల 26న జగిత్యాల కోర్టు ఆవరణలో ఆటోను పార్కింగ్ చేశాడు. దానిని ప్రసాద్ చాకచక్యంగా దొంగిలించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఈనెల 27న పట్టణ ఎస్సై గీత జిల్లాకేంద్రంలోని గాంధీనగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ప్రసాద్ ఆటోలో వస్తూ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిన ఉంచి ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, కానిస్టేబుళ్లు జీవన్, అనిల్, వంశీ పాల్గొన్నారు. ఉద్యమకారులను ఆదుకోవాలి పెద్దపల్లిరూరల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి అన్నివిధాలా ఆదుకోవాలని ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఐలయ్య కోరారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద బుధవారం ఉద్యమకారులతో కలిసి నివాళి అర్పించారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత తమకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశపడితే అప్పటి సీఎం ఉద్యమకారులను విస్మరించారని విమర్శించారు. కేవలం తమ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు మేలు కలిగేలా చూడాలని కోరారు. ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సారయ్య, నల్ల మనోహర్రెడ్డి, రాజేశం, జ్యోతి, చంద్రకళ, సురేందర్రెడ్డి, భాస్కర్, సదాశివ, రాజిరెడ్డి, రాజు, కృష్ణ, సదయ్య తదితరులు ఉన్నారు. ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి ఆనవాళ్లువేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈవిషయంపై వేములవాడ ఎఫ్ఆర్వో కలీలొద్దీన్ను వివరణ కోరగా వేములవాడ, కొడిమ్యాల, చందుర్తి ఫారెస్ట్ ప్రాంతంలో పులి తిరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజుకు పులి 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, అది ఫారెస్టు ప్రాంతంలో అనుకూలమైన ప్రాంతానికి వెళ్తుందని తెలిపారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
రాయికల్: మండలంలోని అల్లీపూర్కు చెందిన సిరిపురం శ్రీహరి (47) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. శ్రీహరి బీడీ ప్యాకర్గా పనిచేస్తున్నాడు. కుటుంబపోషణకు కొంత అప్పు చేశాడు. ఇటీవలే కూతురు పెళ్లి చేశాడు. మొత్తం రూ.8లక్షల వరకు అప్పు ఉందని, దానిని ఎలా తీర్చలోనని నిత్యం మనస్తాపం చెందుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీహరి భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పరారైన ఖైదీ కోసం లుక్ ఆఫ్ నోటీస్జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోర్టు నుంచి మంగళవారం సాయంత్రం పరారైన జున్ను ప్రసాద్ కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ను పట్టుకునేందుకు పోలీసు శాఖ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు విదేశాలకు పారిపోకుండా బుధవారం ఉదయమే దేశంలోని అన్ని ఎయిర్పోర్టులకు లుక్ ఆఫ్ నోటీసు జారీ చేశారు. సిరిసిల్లలో కోవిడ్ పాజిటివ్ కేసులు?● ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్ధారించని వైద్యులు సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జ్వరంతో బాధపడుతున్న ఓ దంపతులు బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లారు. కోవిడ్ పరీక్షలు చేయడం లేదని ల్యాబ్ నిర్వాహకులు వెనక్కి పంపించినట్లు సమాచారం. సదరు దంపతులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. నోరు రుచి, ముక్కు వాసన పోవడంతో మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ దంపతులు కోవిడ్గా అనుమానించి ప్రభుత్వ ఆస్పత్రికి రాగా.. పరీక్షలు చేయకపోవడం గమనార్హం. -
దళిత యువకుడిని చితకబాదిన పోలీసులు
సైదాపూర్: డ్రంకెన్డ్రైవ్లో సహకరించడం లేదని ఓ దళిత యువకుడిని 20 రోజుల క్రితం చితకబాదిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. జరిగిన ఘటనపై దళిత సంఘాలు వివిధ రూపాల్లో బాధితుడికి న్యాయం చేయాలని ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బాధితుడు కరీంనగర్ సీపీ, మానవ హక్కుల కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపూర్లో ట్రైనీ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న అగస్త్య భార్గవ్గౌడ్ తోటి సిబ్బందితో కలిసి మండలంలోని లస్మన్నపల్లి శివారులో డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తున్నాడు. పోలీసులు ఆపారు. టెస్టు చేసి చలాను వేసిన తర్వాత అతడి వివరాలు రాసుకున్నారు. ఇంతలో మహేందర్కు ఇంటి వద్ద నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న బాధితున్ని సహకరించడం లేదని ఫోన్ తీసుకొని ఎస్ఐ అగస్త్య భార్గవ్గౌడ్తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే చితకబాదారు. చెవి కర్ణభేరి దెబ్బతిని చెవి నుంచి రక్తం కారుతున్నా వదల్లేదని, తర్వాత పోలీస్ స్టేషన్కు పిలిచి తనతో క్షమాపణ పత్రం రాయించుకున్నారని మహేందర్ కమిషన్లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై విచారించాలని కరీంనగర్ సీపీ హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ను ఆదేశించారు. బాధితుడి వాగ్మూలం తీసుకున్న మర్నాడే ఏసీపీ శ్రీనివాస్ బదిలీ కావడంతో పోలీసుల విచారణలో జాప్యం జరుగుతోందని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్ మాత్రం అడిషనల్ డీజీపీ, కరీంనగర్ సీపీకి విచారణ నివేదికను 20 రోజుల్లో అందజేయాలని నోటీసులు జారీ చేసింది. తాను పీజీ బీఈడీ చేసి, నిరుద్యోగిగా కూల్డ్రింకులు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, అకారణంగా చితకబాదడంతో అవమానంతో మానసికంగా భరించలేకపోతున్నాని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మహేందర్ అప్పటికే వేరే సంఘటనలో ఇతరులతో తగాదా పడి దెబ్బలు తిని వస్తున్నాడని, డ్రంకెన్డ్రైవ్ టెస్టులో సహకరించకుండా పోలీసులలో దుర్భాషలాడారని, అందుకు క్షమాపణ పత్రం రాసి ఇచ్చాడని పోలీసులు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. దెబ్బతిన్న బాధితుడి చెవి కర్ణభేరి హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు విచారించి నివేదిక ఇవ్వాలని అడిషనల్ డీజీపీ, సీపీకి నోటీసులు -
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సిరిసిల్ల: జిల్లాలో యాసంగి(రబీ) సీజన్లో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా బుధవారం తెలిపారు. 242 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 37,223 మంది రైతుల వద్ద రూ.578 కోట్ల విలువైన 2,49,372మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. వీటిలో 2,16,258 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు ఆన్లైన్ చేశామని, 34,479 మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.447 కోట్లు జమ అయ్యాయని వివరించారు. మిగతా రైతులకు త్వరలో డబ్బులు జమ అవుతాయని ప్రకటించారు. జిల్లాలో ధాన్యం సేకరణ తుది దశకు వచ్చిందని, ఇప్పటికే 133 కొనుగోలు కేంద్రాలను మూసివేశామన్నారు. ఇంకా 109 కేంద్రాల్లో కొద్దిగా ధాన్యం ఉందన్నారు. జిల్లాలో చివరి గింజ వరకు దాన్యం సేకరిస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం సైతం సేకరిస్తామని రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మూడేళ్లలో ధాన్యం సేకరణ తీరిదీ జిల్లాలో రబీ(యాసంగి) సీజన్లో మూడేళ్ల ధాన్యం సేకరణ తీరును కలెక్టర్ గణాంకాలతో వెల్లడించారు. 2022–2023లో మే 28వ తేదీ నాటికి 1,64,044 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, అదే 2023–2024 రబీ సీజన్లో ఇదే రోజు నాటికి 2,49,514 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మే 28వ తేదీ నాటికి 2,49,372 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అన్నారు. జిల్లాలో కొనుగోళ్లు పూర్తి అయ్యేనాటికి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు నమోదు అవుతాయని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పటికే 2,49,372 మెట్రిక్ టన్నుల సేకరణ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
సంఘం స్థలం స్వాహాకు యత్నం?
వేములవాడ: పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ స్థలం విషయంలో వివాదం ఏర్పడి పంచాయితీ ఎస్పీ వద్దకు చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 1800 సభ్యుల సంకల్పంతో 2011లో సర్వే నం.977లో 968 గజాల స్థలం కొనుగోలు చేశారు. సంఘం అధ్యక్షుడు, కార్యవర్గం పేరుపై ఉండాల్సిన భూమిని 12 మంది ప్రముఖులు ఓ ట్రస్టుగా ఏర్పడి తమ పేరుతో రిజిస్త్రేషన్ చేయించుకోవడంతో వివాదం చెలరేగింది. సంఘ సభ్యుల హితాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో సేవా కార్యక్రమాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొన్న ఈ స్థలంలో 12 మంది ప్రముఖులు తామే యజమానులమని గత డిసెంబర్లో తమ పేతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెలుగు చూసింది. దీంతో సంఘ సభ్యులంతా తీవ్ర ఆగ్రహానికి లోనై ఇది కేవలం ఆస్తిపై మాత్రమే కాదు మన ఆర్యవైశ్యుల ఆత్మగౌరవంపై దాడి అంటూ పట్టణానికి చెందిన 1800 మంది సభ్యుల నమ్మకాన్ని, ఆశలను తాకట్టు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ అంశంతో ఆర్యవైశ్య ప్రముఖులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్దారులు కాంప్రమైజ్ అవుతామనీ, తమపై ఉన్న రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుని తిరిగి సంఘానికి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదం బుధవారం వేములవాడలో సామాజికంగా కీలకమైన అంశంగా మారింది. వైశ్య సంఘం న్యాయబద్ధంగా తమ హక్కులను తిరిగి పొందుతుందా? లేక ఈ ప్రయత్నం వ్యర్థమవుతుందా? అన్న చర్చ కొనసాగింది. వేములవాడలో ఆర్య వైశ్య సంఘ భూవివాదం ఎస్పీ వద్దకు చేరిన పంచాయితీ -
హ్యాకర్ల చేతికి ఓదెల ఆధార్ కేంద్రం
పెద్దపల్లిరూరల్: ఆన్మోసాలు ఆగడంలేదు. సైబర్ నేరగాళ్లు, ఆన్లైన్ మోసగాళ్లు రోజుకో రూట్ మార్చుతూ ప్రజలకు ఎరవేస్తున్నారు. తాజాగా ఓదెల మండల కేంద్రంలోని మీసేవ ఆపరేటర్ తన ఆధార్ కేంద్రానికి సంబంధించి అప్డేట్ చేస్తామంటూ సైబర్ మోసగాళ్లు (సెల్ నంబరు 07427069687) నుంచి చేసిన ఫోన్కాల్కు స్పందించడంతో ఆధార్ సెంటర్ను హ్యాక్ చేశారు. కొద్ది నిమిషాల్లోనే ఆ ఐడీ ద్వారా నాలుగు ఆధార్కార్డులు డౌన్లోడ్ చేసినట్లు ఆపరేటర్కు సమాచారం రావడంతో అవాక్కయ్యాడు. ఆ వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. స్పందించిన అధికారులు యూఐడీఏఐ అధికారులను అప్రమత్తం చేశారు. వారు ఆధార్సెంటర్ హ్యాకర్ల చేతికి చిక్కినట్లు నిర్ధారించారు. ఇలాంటి ఘటన ఇదివరకు నాగర్కర్నూల్ జిల్లాలోనూ జరిగినట్లు సమాచారం. జిల్లాలోని పలు ఆధార్కేంద్రాల నిర్వాహకులకు సైతం ఇలాంటి ఫోన్కాల్స్ వచ్చినట్లు ఆపరేటర్లు తెలిపారు. కొంతకాలంగా ఓదెల మీసేవ కేంద్రంలో గల ఆధార్ సెంటర్ ద్వారా సేవలు నిలిపి వేశారు. కొద్ది రోజుల క్రితమే అధికారులు అనుమతినివ్వడంతో సేవలు పునరుద్ధరించారు. ఈ క్రమంలో హ్యాకర్ల నుంచి ఫోన్కాల్ రావడంతో ఆధార్ కేంద్రం అనుమతులిచ్చే కార్యాలయ అధికారుల నుంచే ఫోన్కాల్ వచ్చిందని భావించి ఎనీడెస్క్ను హ్యాకర్లకు అప్పగించి మోసపోయినట్లు తెలిసింది. పీఈసీ కిట్లను అప్పగించొద్దు.. ఆధార్ కేంద్రాలను నిర్వహించే ఆపరేటర్లు అనధికారిక అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్కాల్స్కు స్పందించొద్దని యూఐడీఏఐ అధికారులు బుధవారం రాష్ట్రంలోని ఆధార్ ఆపరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఆధార్కేంద్ర నిర్వాహకులు తమ సెంటర్లలో వినియోగించే కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్, లేదా ఇతర రిమోట్యాక్సెస్ ఇచ్చి మోసపోతున్నారని, ఇది ఆధార్ డేటా భద్రతకు ముప్పు తెస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనీడెస్క్, టీంవ్యూయర్ ఇతర రిమోట్ యాక్సెస్ సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు. యూఐడీఏఐ భద్రతా విధానాలకు అనుగుణంగా అవసరం లేని రిమోట్ యాక్సెస్ టూల్స్ని అన్ఇన్స్టాల్ చేయాలన్నారు. అపరిచితుల ఫోన్కాల్స్కు స్పందించొద్దు యూఐడీఏఐ కార్యాలయ అధికారుల ఆదేశం -
ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి
రామగిరి(మంథని): భర్త అనారోగ్యం.. ఆర్థికలేమి.. ముగ్గురు పిల్లలు పోషణ.. కూలీ పనులతో కుటుంబాన్ని నెట్టుకు రావడం ఆ గృహిణికి తలకుమించిన భారంగా మారింది. దాతలు సాయం చేస్తే భర్తకు మంచి వైద్యచికిత్స అందిస్తామని, పిల్లల పోషణ చూసుకుంటానని అంటోంది ఆ గృహిణి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన దుబ్బాక కుమార్ – విజయ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం కిరణ్, మహేందర్, చెర్రీ ఉన్నారు. అనారోగ్యానికి గురైన కుమార్.. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. అయినా నయం కాలేదు. తనకున్న స్థోమత వరకు ఖర్చుచేశాడు. చేతిలో ఉన్న సొమ్మంతా ఖర్చు కావడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లడానికి చిల్లిగవ్వకూడా లేకుండాపోయింది. కనీసం ప్రయాణానికి కూడా డబ్బులు లేని దీనస్థితిలో ఆ కుటుంబం ఉంది. విజయ కూలీ పనులకు వెళ్లి అంతోఇంతో సంపాదిస్తున్నా కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదు. దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని విజయ కోరుతోంది. రెండు కిడ్నీలు పనిచేయక యువకుడి నరకయాతన -
సీపీఐని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లండి
కరీంనగర్: జిల్లాలో సీపీఐకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా మహాసభలు రెండోరోజు కొనసాగాయి. నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మూడేళ్లలో జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐకి జిల్లాలో ఘనమైన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ దశాదిశా నిర్దేశించేలా క్రియాశీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆర్ఎన్ఎన్ శక్తుల విజృంభన కొనసాగిస్తూ బీజేపీ ప్రమాదకరంగా మారిందన్నారు. రాష్ట్రంలో పెన్షన్, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మఇళ్లు పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, మర్రి వెంకటస్వామి, పొనగంటి కేదారి, బోయిని అశోక్, కొయ్యడ సృజన్కుమార్, అందె స్వామి, బత్తుల బాబు, గూడెం లక్ష్మి పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి -
ఒక్క ఏడాదిలోనే 818 ఇళ్లు
బోయినపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోగా బోయినపల్లి మండలానికి 818 ఇళ్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం హైస్కూల్ మైదానంలో కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి 709 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, 98 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. అత్తగారి మండలానికి అల్లుడిగా మాజీ సీఎం కేసీఆర్, మనవళ్లుగా కేటీఆర్, సంతోశ్కుమార్లు ఇచ్చింది పెద్ద గుండుసున్న అని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో మిడ్మానేరు ముంపు గ్రామాలకు త్వరలో మరో వెయ్యి ఇళ్లు మంజూరు కానున్నాయని తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మా ట్లాడుతూ మంజూరు పత్రాలు పొందిన వారు ఇళ్లు నిర్మించి వచ్చే దసరా, దీపావళి పర్వదినాలను సొంత ఇళ్లలో జరుపుకోవాలని అన్నారు. లబ్ధిదారులకు ఇసుక అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 90 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకుంటే రద్దు చేస్తామన్నారు. జెడ్పీ సీఈవో వినోద్, ఎంపీడీవో జయశీల, తహసీల్దార్ నారాయణరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్ పాల్గొన్నారు. -
డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!
● మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన కరీంనగర్వాసి ● చర్యలు తీసుకోవాలని మరిన్ని ఫిర్యాదులు ● క్రమంగా వెలుగులోకి జనార్దన్రావు వ్యవహారాలు ● ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లుగా కరీంనగర్లో విధులు ● కలెక్టర్ కార్యాలయం తీరుపైనా విమర్శలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్రావు వ్యవహారం మరింత ముదిరింది. ‘భర్తలకు వంట రాకపోతే.. భార్యలు లేచిపోతారు.. తాను రెండు సంసారాలు ఈదుతున్నాను’ అంటూ తలతిక్క వ్యాఖ్యలతో శిక్షణ శిబిరాల్లో టీచర్లను బెంబేలెత్తించిన డీఈవో జనార్దన్రావుపై విమర్శలు, ఆరోపణలు ఆగడం లేదు. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ.. కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చినా.. టీచర్లు శాంతించడం లేదు. ఆయన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడుతుండగా.. సామాజిక ఉద్యమకారుడు షాబుద్దీన్ మహిళా కమిషన్కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. డెమొక్రాటిక్ టీచర్ ఫెడరేషన్ (డీటీఎఫ్) నాయకులు జనార్దన్రావుపై హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) కూడా అతనిపై చర్యలకు డిమాండ్ చేసింది. బుధవారం కూడా సోషల్ మీడియాలో, మెయిన్స్ట్రీమ్ మీడియాలో విషయం ప్రాధాన్యం సంతరించుకోవడంపై చర్చ నడుస్తోంది. డీఈవో జనార్దన్ సిరిసిల్లకు కూడా డీఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో కామారెడ్డి డీఈవో ఎస్. రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ డైట్ ప్రిన్సిపాల్ మొండయ్య నూతన డీఈవోగా బుధవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. దండిగా పెద్దల దన్ను.. జనార్దన్రావుకు ప్రభుత్వ పెద్దల నుంచి దండిగా సహకారాలు ఉన్నాయని సమాచారం. కరోనా నుంచి డీఈవోగా కొనసాగుతున్న ఈయనపై ఎన్ని విమర్శలు వచ్చినా చర్యలు తీసుకోవడంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ● జిల్లాలో టీచర్లకు అకారణంగా, అత్యధికంగా మె మోలు ఇచ్చిన డీఈవో అన్న ఆరోపణలు ఉన్నాయి. యూనియన్ నాయకులకు ఇంక్రిమెంట్లలో కోత విధించారన్న విమర్శలు తెలిసిందే. ● వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో పనిచేసిన ప్రతీ ఉన్నతాధికారి ఎన్నికల నియమావళి ప్రకారం.. బదిలీపై వెళ్లారు. కానీ, ఈయనను కదపలేదు. ● హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్, ఇటీవల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయినా ఇతని బదిలీ జరగకపోవడం అతని పలుకుబడికి నిదర్శనం. ● ఇవన్నీ తెలిసీ.. కలెక్టర్ కార్యాలయం కూడా ఆయన బదిలీ విషయంలో అలసత్వం వహించి విమర్శలను మూటగట్టుకుంది. ● 317 జీవో సమయంలోనూ పలువురు టీచర్లు ప్రొడ్యూస్ చేసిన మెడికల్ సర్టిఫికెట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ● హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయలో అప్పటి సీఎం సభను విజయవంతం చేయాలని ఆదేశాలివ్వడం, రూటు బాధ్యతలను టీచర్లకు అప్పగించడం తీవ్ర దుమారం రేపింది. ● ఇప్పుడూ తన స్వయంకృతాపరాధంతో వేటు పడిందే.. ఆయన్ను ఇక్కడ నుంచి ఎవరూ కదపలేకపోవడం గమనార్హం.