Rajanna Sircilla District News
-
వస్త్రపరిశ్రమలకు ప్రభుత్వం అండ
సిరిసిల్ల: వస్త్రపరిశ్రమకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కోటి ఇందిరా మహిళాశక్తి నూతన చీరల ఆర్డర్ను అందించామని, గడువులోగా అందించాలన్నారు. కలెక్టరేట్లో బుధవారం చేనేత, జౌళిశాఖ ఇందిరా మహిళాశక్తి కొత్త చీరల రంగులను ఆవిష్కరించి, ఆర్డర్లను వస్త్రోత్పత్తిదారులకు అందించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వస్త్రపరిశ్రమ సంక్షేమం, ఆర్థిక వృద్ధికి ఈ ఆర్డర్లు ఎంతో మేలు చేస్తాయన్నారు. గత ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్ పూర్తి చేసిన వస్త్ర పరిశ్రమ బాధ్యులను అభినందించారు. కొత్త చీరల ఆర్డర్లతో సిరిసిల్లలోని మ్యాక్స్ సంఘాలకు ఆరు నెలల పాటు ఉపాధి లభిస్తుందన్నారు. స్థానిక వస్త్రపరిశ్రమకు 25 హెచ్పీల వరకు 50 శాతం విద్యుత్ రాయితీ, కేటగిరీ మార్పు వంటి సమస్యలను పరిష్కరించామన్నారు. చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ చీరలు నాణ్యతగా ఉన్నాయని, రానున్న ఆర్డర్లు సైతం నాణ్యతతో తయారు చేయాలని సూచించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ స్థానిక వస్త్రపరిశ్రమలో తయారైన ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళలు ధరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్మికుల శ్రమ, పనితనానికి ఈ చీరలు గుర్తుగా నిలుస్తాయన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూప, రాములునాయక్, చేనేత జౌళి శాఖ జేడీ వెంకటేశ్వరరావు, ఏడీ సంతోష్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో వేగం పెంచాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి సమీక్షించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతీ మండలానికి ప్రత్యేకాధికారులను నియమించి ధాన్యం సేకరణ పూర్తి చేయాలన్నారు. ప్రత్యామ్నాయ గోదాముల్లో ధాన్యం దిగుమతికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. లారీల కొరత లేకుండా చూడాలని, వ్యాన్లు, ట్రాక్టర్లలోనూ ధాన్యం తరలించాలన్నారు. డీఆర్డీవో గీత, డీఏవో అఫ్జల్ బేగం, డీసీఎస్వో బుచ్చిబాబు, పౌరసరఫరాల శాఖ మేనేజర్ నరసింహ, డీటీవో లక్ష్మణ్ కుమార్, డీసీవో రామకృష్ణ, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. -
దోపిడీకి స్కెచ్!
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026● దేశవ్యాప్తంగా సుశిక్షితులైన 70 మందితో క్రిమినల్ నెట్వర్క్ ● బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కేసులు ● చోరీ చేసిన మొబైళ్లు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ (ఫేస్టైంతోసహా)తో జైలు నుంచే వీడియో కాల్స్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఆదేశాలు. ● గోల్డ్ లోన్ కంపెనీలు, నగల దుకాణాలు, జువెల్లరీ షోరూంలే టార్గెట్ ● అనుచరులకు వేతనాలు, నేరాల్లో ప్రతిభ కనబరిస్తే బోనస్లు ● పలు రాష్ట్రాల్లో తనిష్క్, మణప్పురం, ముత్తూట్ తదితర సంస్థల నుంచి 30కిలోలకు పైగా బంగారం తస్కరణ. ● పారిపోయేందుకు ప్రత్యామ్నాయాలు, దోపిడీకి ముందు రెక్కీ ఈ గ్యాంగ్ ప్రత్యేకత. ● ప్రస్తుతం బిహార్, వెస్ట్బెంగాల్లో కేసులు. బిహార్ జైలు నుంచిసాక్షిప్రతినిధి,కరీంనగర్ : జులాయి సినిమాలో విలన్ ఒక దొంగ.. చోరీ చేసిన ప్రతిసారీ పోలీసులకు తప్పుడు క్లూ వదిలి.. తాను మాత్రం మరో మార్గంలో పరారవుతుంటాడు. దీనినే పోలీసు పరిభాషలో ‘అటెన్షన్ డైవర్షన్’ అంటారు. ఈ టెక్నిక్నే కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ దోపిడీలో దొంగలు వినియోగించినట్లు తెలుస్తోంది. దేశంలోని అనేక జువెల్లరీ షాపులను నిలువుదోపిడీ చేసిన బిహార్కు చెందిన ‘గోల్డ్ థీఫ్’ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ గ్యాంగ్ ఉత్తర భారతంలో దోపిడీలు, కిడ్నాప్లు, అక్రమ వసూళ్లకు ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా గోల్డ్ థీఫ్కి క్రిమినల్ నెట్వర్క్ ఉంది. ఇతను కన్నేశాడంటే.. ఇతని అనుచరులు పథకం పన్ని బంగారం మొత్తం ఊడ్చి పారేస్తుంటారు. సుశిక్షితులైన దొంగలు కావడంతో ఇప్పటివరకు అన్నీ భారీ చోరీలే నమోదయ్యాయి. ప్రస్తుతం గోల్డ్ థీఫ్ బిహార్ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచే దోపిడీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మపురికి వచ్చింది మొత్తం ఆరుగురు.. ఈనెల 3న.. కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్లో దొంగతనం చేసింది ఐదుగురు కాదు.. ఆరుగురిగా పోలీసులు గుర్తించారు. ఈనెల ఒకటిన ఉదయం ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిలో తొలుత నలుగురు, తర్వాత మరొకరు వచ్చారు. ఇంకోవ్యక్తి సాయంత్రం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతడే ఈ ఽఐదుగురిని ధర్మపురి నుంచి ఛత్తీస్గఢ్ లేదా ఝార్ఖండ్ వైపు తప్పించి ఉంటాడని అనుమానిస్తున్నారు. జార్ఖండ్కు చెందిన సౌరభ్కుమార్మిశ్రా పేరుతో విజయలక్ష్మి లాడ్జిలో రూ.1200కు గది అద్దెకు తీసుకున్నారు. ధర్మపురిలో దైవదర్శనం కూడా చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఉత్తరభారతంలో దొంగలు చోరీకి ముందు పూజలు చేయడం ఆనవాయితీ. ఏప్రిల్ 27నుంచి 30వరకు దొంగలు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో బస చేశారు. అక్కడ నుంచే దొంగతనానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్కడ కూడా జార్ఖండ్కు చెందిన చిరునామాతో గుర్తింపుకార్డులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే వ్యక్తులు మార్చి నెలలోనూ ఇదే లాడ్జిలో బస చేసినట్లు కూడా దర్యాప్తులో తేలింది. చోరీకి ముందు సిద్దిపేట పరిసరాల్లోనూ ఈ ముఠా సంచరించినట్లు సమాచారం. ఘటనాస్థలంలో మహారాష్ట్రకు చెందిన బ్యాగు, గోదావరి తీరంలో బైక్ను అటెన్షన్ డైవర్షన్ కోసమే కావాలని వదిలేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్సర్ బైకు చాసీస్ను గుర్తించిన పోలీసులు అది ఢిల్లీదిగా తేల్చారు. బ్యాగు, బైకు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించి దర్యాప్తు జాప్యానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. అది అనుభవమున్న దొంగలకే సాధ్యం. చోరీలో పాల్గొన్న వారి ఆచూకీని ఇప్పటికే కనుగొన్న పోలీసులు బిహార్లోని నిందితుల ఇళ్లు, నిందితులు, స్నేహితుల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. ఎలాగైనా రెండు రోజుల్లో పట్టుకుంటామని ధీమాగా ఉన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై నిరసన
కోనరావుపేట(వేములవాడ): జిల్లాలో వడ్ల కొనుగోళ్ల జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. కోనరావుపేట క్రాసింగ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఇసుక తరలింపునకు వందల లారీలు వస్తున్నాయని, కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో లారీల కొరత లేకుండా చూశారన్నారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించి, ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్కుమార్ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధర్నాలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, మాజీ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య, సర్పంచ్ మల్లేశ్, ప్యాక్స్ వైస్ చైర్మన్ అనుపాటి భూంరెడ్డి, నాయకులు జవ్వాజి మల్లయ్య, కెంద గంగాధర్, తిక్కల నవీన్, రవీందర్గౌడ్, రమణారెడ్డి, శివతేజరావు, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోండి
● కరీంనగర్ గ్యాస్ లారీని అడ్డుకున్న డీలర్లు ● సివిల్ సప్లై అధికారికి ఫిర్యాదుసిరిసిల్లటౌన్: జిల్లాలో కరీంనగర్కు చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారని సిరిసిల్లలోని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఆరోపించారు. ఈమేరకు కరీంనగర్ నుంచి సిరిసిల్లకు బుధవారం వచ్చిన ఓ గ్యాస్ ఏజెన్సీ లారీని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పౌరసరఫరాలశాఖ డిప్యూటీ తహసీల్దార్ రజిత అక్కడికి చేరుకున్నారు. ఆమెతో స్థానిక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాట్లాడుతూ కరీంనగర్ నుంచి లారీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారన్నారు. ఈవిషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్వోకు నివేదించాం సంఘటనపై క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాం. ఇరువర్గాలకు పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి రావాలని సూచించాం. సిరిసిల్లలోని డీలర్ల ఫిర్యాదులను జిల్లా పౌర సరఫరాల అధికారికి నివేదించాం. ఉన్నతాధికారుల తదుపరి ఉత్తర్వులను అమలు చేస్తాం. – రజిత, సివిల్ సప్లై, డీటీ -
మిల్లర్లు హమాలీల సంఖ్య పెంచుకోవాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్బోయినపల్లి(చొప్పదండి): రైస్మిల్లర్లు హమాలీల సంఖ్య పెంచుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేయించుకోవాలని సూచించారు. మండలంలోని జగ్గారావుపల్లిలో సుహాస్ రైస్మిల్లును, కొదురుపాక కొనుగోలు కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. పౌరసరఫరాలశాఖ అధికారులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించిన రైతుల ఖాతాల్లో డబ్బులు వేగంగా జమయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఎల్.బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, డీఏవో అఫ్జల్బేగం, తహసీల్దార్ షరీఫ్ మొయినొద్దీన్, సర్పంచ్ సుద్దాల మధు పాల్గొన్నారు. లారీల సంఖ్యను పెంచాలి వేములవాడఅర్బన్: వేములవాడ అర్బన్ మండలం అనుపురంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గరీమా అగ్రవాల్ బుధవారం పరిశీలించారు. ఇప్పటి దాకా ఎంత ధాన్యం వచ్చింది, ఎంత కొనుగోలు చేశారు, రైస్మిల్లులకు ఎంత తరలించారు అని ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకానికి అనుగుణంగా లారీలు సమకూర్చాలని ఆదేశించారు. -
ఎక్కడి కుప్పలు అక్కడే!
● మొగులుతో గుబులు ● నెల రోజులుగా పడిగాపులు ● పట్టించుకోని అధికారులు ● తూకం వేయక ఆందోళనలో అన్నదాతలుసిరిసిల్ల అర్బన్: పంట పండించేందుకు ఎంత కష్టపడుతున్నారో అన్నదాతలు ధాన్యాన్ని విక్రయించుకునేందుకు అంతకుమించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటను కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించి ఇరువై రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. వాతావరణంలో కలుగుతున్న మార్పులతో రైతుల పడుతున్న ఆందోళన చెప్పలేనిదిగా ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తూకం వేసే సమయంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో ఎండిన పంటలు తడిసి ముద్దవుతున్నాయి. చేసేదేమి లేక మళ్లీ ఆరబోయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. 15 రోజులుగా కేంద్రాల్లోనే.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దబోనాల కొనుగోలు కేంద్రం పరిధిలోని మార్కెట్పల్లిలో ధాన్యం పోసుకొమ్మని మెప్మా అధికారులు చెప్పారు. దీంతో 70 మంది రైతులు ధాన్యం కుప్పలు పోశారు. 15 రోజుల క్రితం కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ తూకం వేయడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రంలో ఎక్కడి కుప్పలు అక్కడే పేరుకుపోయాయి. ఇప్పటికే తేమశాతం తగ్గి నష్టపోతున్నామని, వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి రంగు మారి, మొలకలు వచ్చి నష్టపోవాల్సి వస్తుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రెవెన్యూ అధికారుల బదిలీ
సిరిసిల్ల: జిల్లాలో రెవెన్యూ శాఖ భారీ కుదుపునకు గురైంది. ఖాళీగా ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా గ్రేటర్ హైదరాబాద్లో పనిచేస్తున్న వి.రమాదేవిని నియమించారు. సిరిసిల్ల ఆర్డీవోగా పనిచేస్తున్న సీ.హెచ్.వెంకటేశ్వర్లు జనగామ ఆర్డీవోగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో డిప్యూటేషన్పై తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీలో పనిచేస్తున్న ఎన్.రాజేందర్రెడ్డి(డిప్యూటీ కలెక్టర్)ని నియమించారు. వేములవాడ ఆర్డీవోగా డిప్యూటేషన్పై తెలంగాణ రాష్ట్ర వేర్హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కే.ఎస్.బి.కుమారిని నియమించారు. వేములవాడ ఆర్డీవో రాధాభాయి భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్గా పనిచేయనున్నారు. విధుల్లో చేరిన డీఎఫ్వోసిరిసిల్ల: జిల్లా ఫారెస్ట్ అధికారిగా ఎస్.సత్యనారాయణ మంగళవారం విధుల్లో చేరారు. ఇప్పటి వరకు డీఎఫ్వోగా ఉన్న బాలమణి కుమురంభీం ఆసిఫాబాద్ డీఎఫ్వోగా బదిలీ కాగా.. ఆమె స్థానంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారిగా సత్యనారాయణను నియమించారు. సిరిసిల్లలో బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్ప నాదేవి మొక్కను అందించి స్వాగతం పలికారు. ● టీటీడీ చైర్మన్తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో ఫోన్లో కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఆలయ కమిటీ మంగళవారం హైదరాబాద్లో కేటీఆర్ను కలిసి నిధుల విడుదల కోసం విన్నవించింది. ఈమేరకు కేటీఆర్ టీటీడీ చైర్మన్తోపాటు మంత్రి లోకేశ్తో ఫోన్లో మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట ఆలయానికి రూ.5 కోట్లు, సిరిసిల్ల ఆలయానికి రూ.7 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. ఆలయ నిర్మాణ నమూనాతోపాటు గతంలో మంజూరు ఇచ్చిన పత్రాలను చైర్మన్ బీఆర్ నాయుడుకి మెయిల్ పంపించారు. సర్పంచ్ ఎలగందుల నరసింహులు, ఆలయ కమిటీ చైర్మన్ గుండం సుధాకర్రెడ్డి, వైస్చైర్మన్, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు మీసం రాజం, నేవూరి వెంకట నరసింహారెడ్డి, ఎడ్ల సందీప్ ఉన్నారు. సిరిసిల్లటౌన్: కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజ య్కుమార్ బుధవారం జిల్లాలో పర్యటిస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. ఉదయం 9:30 గంటలకు పట్టణంలోని కార్గిల్లేక్ సుందరీకరణకు భూమిపూజ చేస్తారు. ఉదయం 10:30 గంటలకు సినారె కళామందిరంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేస్తారు. ఉదయం 11:30 గంటలకు వాసవి కల్యాణ మండపంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. గ్రామీణ మహిళలకు త్రోబాల్లో శిక్షణసిరిసిల్ల అర్బన్: గ్రామీణ మహిళల కోసం జిల్లాలో ఇషా త్రోబాల్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఇషా గ్రామోత్సవం నిర్వాహకులు వంగ అనిల్ తెలిపారు. ఖమ్మం, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనంలో ఈనెల 13 నుంచి 17 వరకు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పాల్గొనే వారికి రూ.5లక్షల వరకు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు 96664 44843లో సంప్రదించాలని కోరారు. -
దొంగల బస!
ధర్మపురిలో సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్లో భారీ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ నెల ఒకటిన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయ లక్ష్మి లాడ్జిలో బసచేసి, కరీంనగర్లో చోరీ అనంతరం 3వ తేదీన లాడ్జి ఖాళీచేశారు. అంతకన్నా ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ బసచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలాఉంటే దొంగలు వినియోగించిన నల్లరంగు పల్సర్ (220 సీసీ), హెల్మెట్ను ధర్మపురి గోదావరి తీరంలోని ఇటుకబట్టీల సమీపంలో మంగళవారం ఉదయం కనుగొన్నారు. టీఎస్ 08 ఎఫ్జీ 6876 నంబరు ప్లేటుతో ఉన్న ఈ బండిని దుండగులు చోరీ కోసం వినియోగించిందేనని ధ్రువీకరించారు. కానీ.. ఈ బైకుది ఫేక్ నంబరు ప్లేటుగా పోలీసులు తేల్చారు. హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన రమేశ్ అనే వ్యక్తికి చెందిన కారుదిగా గుర్తించారు. బండి చాసీస్ నంబరు ఆధారంగా ప్రయత్నించినా.. దాన్ని కూడా ముందే ధ్వంసం చేయడంతో బైకులను సెకండ్ హ్యాండ్లో కొన్నారా? లేక ఎత్తుకొచ్చారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రా లేదు. చోరీ కోసం వినియోగించిన మరో బైకు అపాచీ(తెలుపు) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దానికి పెట్టిన నంబరు ప్లేట్ కూడా ఫేక్గానే భావిస్తున్నారు. -
సమష్టిగా పనిచేసి మన్ననలు పొందాలి
వేములవాడ: సమష్టిగా పనిచేసి ప్రజల మన్ననలు పొంది విజయవంతం కావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికలో పాల్గొన్నారు. కమిషనర్ సంపత్రెడ్డి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. కో–ఆప్షన్ సభ్యులుగా కట్కూరి శ్రీనివాస్, ఫీర్ మహమ్మద్, దుర్గం విజయపర్శరాము, తుమ్మ జ్యోతిలను ఎన్నుకున్నారు. కమిషనర్ సంపత్రెడ్డి ఎన్నిక సర్టిఫికెట్ అందించడంతోపాటు ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో వేములవాడ మున్సి పాలిటీలో ఉన్న నాలుగు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికై న కోఆప్షన్ సభ్యులను సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. నూతనంగా ఎన్నికై న నలుగురు సభ్యులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ ఎదుట పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రజాసంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గంభీరావుపేటలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం హాజరయ్యారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. 99రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతీ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఇబ్బంది కలగకూడదని ఆదేశించారు. లారీల కొరతను సాకుగా చూపి ధాన్యం రవాణాను ఆపవద్దన్నారు. అవసరమైతే గ్రామాల్లో అందుబాటులో ఉండే ట్రాక్టర్లను ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని సూచించారు. పంట ఉత్పత్తుల కొనుగోలు సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. జూన్ 15 వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మైనర్ రిపేర్లు, తాగునీరు, రన్నింగ్ వాటర్ సౌకర్యాలు పూర్తి చేయించాలని సూచించారు. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న డైట్ చార్జీలను ఇప్పటికే క్రమబద్ధీకరించామని, ఇకపై ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తామన్నారు. రెసిడెన్షియల్ విద్యాలయాలను జిల్లా అధికారులు నిత్యం సందర్శించి, భోజనం నాణ్యత పరిశీలించాలని సూచించారు. వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యుత్ చార్జీలను యూ నిట్కు రూ.2 వరకు తగ్గించేలా ఎన్పీడీసీఎల్ అధి కారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ని ర్మాణంలో రాష్ట్రంలో ముందు ఉన్న సందర్భంగా అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచాలి : తుమ్మల నాగేశ్వర్రావు జిల్లాను అన్ని రంగాల్లో ముందుస్థానంలో ఉంచాలని జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బంది రావద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ తదితరులు పాల్గొన్నారు. ఒకే వేదికపై అన్ని శాఖలు జిల్లా కేంద్రం కాకుండా ఇతర ప్రాంతంలో అన్ని శాఖల అధికారులు ఒకే వేదికపై హాజరుకావడం తొలిసారి. -
లూజ్వైర్లకు మరమ్మతు
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని రంగంపేట, బంజేరు గ్రామాల్లోని ప్రమాదకర విద్యుత్ సమస్యలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించారు. శని, ఆదివారాల్లో రంగంపేటలో లూజ్వైర్లతో షార్ట్సర్క్యూట్ ఏర్పడి పశుగ్రాసం, పైపులు, స్టార్టర్లు కాలిపోయాయి. బంజేరు నుంచి బీరప్పతండాకు వెళ్లే దారిలో ఒక స్తంభం వంగిపోయి ప్రమాదకరంగా మారింది. ఏఈ రమేశ్ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. రంగంపేటలో లూజ్వైర్లను సరిచేశారు. వంగిపోయిన స్తంభం స్థానంలో కొత్త స్తంభం ఏర్పాటు చేశారు. సింగిల్ సిలిండర్లు : 78,907 డబుల్ సిలిండర్లు : 48,087 దీపం సిలిండర్లు : 21,481 సీఎస్ఆర్ : 50,280 ఉజ్వల : 20,409 వాణిజ్య సిలిండర్లు : 1,687 నిత్యం వినియోగమయ్యే సిలిండర్లు : 2500 -
మిల్లుల్లో వేగంగా ధాన్యం దింపుకోవాలి
● హమాలీలు, లారీల సంఖ్యను పెంచాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే లారీల నుంచి ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేయాలని రైస్మిల్లర్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ధాన్యం కొనుగోలు, రవాణా అంశాలపై పౌర సరఫరాల అధికా రులు, రైస్మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమీక్షించారు. రైస్మిల్లర్లు హమాలీల సంఖ్యను పెంచుకోవాలని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వేగంగా అన్లోడింగ్ చేయించాలని ఆదేశించారు. అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని ఆ దేశించారు. డీఆర్డీవో మచ్చ గీత, డీసీఎస్వో బుచ్చి బాబు, మేనేజర్ నరసింహ, డీసీవో టి.రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు. నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం తంగళ్లపల్లి(సిరిసిల్ల): వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే నేలల సంరక్షణ, ఎరువుల సమతుల్య వినియోగం కీలకమని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ’ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తంగళ్లపల్లి మండలం తాడూర్లో సోమవారం నిర్వహించిన రైతు వారోత్సవాల అవగాహన సదస్సులో మాట్లాడారు. రైతులు తమ పొలంలో భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే అవగాహన వస్తుందన్నారు. ఇష్టారీతిన రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడడం ద్వారా నేల ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తుందని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలన్నారు. సదస్సు ప్రారంభంలో ’జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపించి, నేలల సంరక్షణపై రైతులందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆదర్శ రైతులను సన్మానించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, సర్పంచులు రెడ్డిమల్ల సదానందం, గుండు ప్రేమ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, ఉద్యానవన అధికారి శరత్, డీపీవో షర్ఫుద్దీన్, ఏఎంసీ డైరెక్టర్లు పొన్నాల పర్శరాములు, కల్లెపల్లి తిరుపతిరెడ్డి, అరెపల్లి బాలు, శ్రీనివాస్రెడ్డి, ఎంపీవో మీర్జా అఫ్జల్ అహ్మద్ బేగ్, ఏవో సంజీవ్, ఆర్ఐ దినేశ్, నాయకులు లింగాల భూపతి, మిరాల శ్రీనివాస్, సురభి నవీన్రావు పాల్గొన్నారు. -
ఈ ప్రాంతానికి కేసీఆర్ సముద్రం తెచ్చారు
● సిరిసిల్ల స్వరూపం మార్చారు ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సిరిసిల్ల: మానేరు వాగులో సముద్రాన్ని తలపించేలా నీటిని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెచ్చారని, ఎట్లుండే సిరిసిల్ల ఎట్లా మారిందో మీ కళ్ల ముందే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో సోమవారం స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ బొల్గం వైష్ణవి–నాగరాజుగౌడ్లు వందలాది మంది కార్యకర్తలతో బీఆర్ఎస్లో చేరారు. వీరిని కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ మాట్లాడుతూ తాలూక కేంద్రంగా ఉన్న సిరిసిల్లను జిల్లాను చేసి, కరీంగనర్లో ఉండే కలెక్టర్ను, ఎస్పీని సిరిసిల్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్దేనన్నారు. మానేరువాగు ఎండిపోయి ఉండేదని, గోదావరి జలాల రాకతో రామప్పగుట్ట ఎక్కితే సముద్రాన్ని తలపిస్తుందని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరిగి పుట్ల కొద్ది పంటలు పండుతున్నాయన్నారు. కేసీఆర్ పాలనలతో భూముల రేట్లు ఎలా ఉండేవని, ఇప్పుడెలా ఉన్నాయని ప్రశ్నించారు. మల్కపేట రిజర్వాయర్ ద్వారా చిన్నబోనాల, పెద్దబోనాలకు నీళ్లు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. చిన్నబోనాల పోచమ్మ గుడికి సాయం చేస్తానన్నారు. ఊరు అన్నప్పుడు అనేక సమస్యలు ఉంటాయని, వాటిని పరిష్కరిస్తూ పోవాలన్నారు. కౌన్సిలర్ వైష్ణవి, నాగరాజుగౌడ్లు పార్టీలో చేరిక సందర్భంగా బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తెస్తామని, కేసీఆర్ సీఎం అయ్యేందుకు అంతఃకరణశుద్ధితో పని చేస్తామని ప్రతిజ్ఞ చేయడం ఆకట్టుకుంది. టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, ఉమ్మడి జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, పార్టీ నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం కళాచక్రపాణి, దార్ల సందీప్, మాజీ ఎంపీపీలు గజభీంకార్ రాజన్న, శ్రవణ్రావు, పార్టీ నాయకులు కుంబాల మల్లారెడ్డి, మ్యాన రవి, మంచె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిమ్ ప్రారంభం సిరిసిల్ల కొత్తచెరువు కట్ట వద్ద కేటీఆర్ జిమ్ను ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి పాల్గొన్నారు. అనంతరం సాయిమణికంఠ ఫంక్షన్హాల్ ఎర్రం శంకర్ కొడుకు రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. -
గంట ముందే స్పాట్కు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నగరంలోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎలాంటి బెరుకూ లేకుండా ఉదయాన్నే భారీ దోపిడీ చేసి, యథేచ్ఛగా పారిపోయిన వైనాన్ని సవాలుగా తీసుకున్నారు. దొంగల సంచారం, కదలికలు, వారి చిరునామా, నేరచరితపై కీలక సమాచారం సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను మహారాష్ట్ర, బిహార్కు పంపినట్లు సమాచారం. మరికొంతమంది పోలీసులు సీసీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. వారి ఫొటోల ఆధారంగా క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఏ) సాయంతో నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు పుణే, మరొకరు నందూర్బర్ జిల్లాలతో పాటు బిహార్కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీని ‘రివర్స్ మేనర్’(ఎలా వచ్చారు? అన్న విజువల్స్)లో విశ్లేషించినప్పుడు దొంగలంతా దోపిడీకి కేవలం గంట ముందే కరీంనగర్కు వచ్చినట్లు రికార్డు అయ్యింది. అంటే ముందు రోజు ఎక్కడా బస చేసిన దాఖలాలు లేవు. కొంతకాలంగా రెక్కీ నిర్వహించి, పారిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టే నింపాదిగా వచ్చారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర బ్యాగే పట్టిస్తోంది..? చోరీ సమయంలో నిందితుల్లో ఒకరి బ్యాగు కీలకంగా మారింది. ఆ బ్యాగుపై ‘ఐ లవ్ నందూర్బర్’ అని రాసి ఉంది. నందూర్బర్ ఉత్తర మహారాష్ట్రకు చెందిన జిల్లా. గుజరాత్ సరిహద్దులో ఉంటుంది. నిందితుల్లో మరొకరు పుణే జిల్లాలో నేరచరిత కలి గిన పఠాన్గా గుర్తించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు పారిపోవాలంటే పెద్దపల్లి, మంథని మీదుగా వెళ్లవచ్చు. కానీ.. ఆ మార్గంలో ట్రాఫిక్, చెక్పోస్టులు ఎక్కువ. అందుకనే చోరీ అనంతరం శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్, రామడుగు, లక్ష్మీపూ ర్, రుద్రారం, గుండి, పెగడపల్లి, జగిత్యాల మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లుగా సీసీ ఫుటేజీని పోలీసులు సంపాదించారు. ప్రధాన రహదారుల వెంట వెళ్తే సులువుగా పట్టుబడతామని, పోలీసుల కళ్లు గప్పేందుకు గ్రామీణ రహదారిని ఎంచుకున్నారు. వీరిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర, బిహార్కు బయల్దేరాయి. మరో నాలుగు బృందాలు (ఒక్కో బృందంలో నలుగురు చొప్పున సభ్యులు) కరీంనగర్ నుంచి జగిత్యాల మీదుగా మహారాష్ట్ర, బీహార్, ఇటువైపు హైదరాబాద్ వరకు వందలాది సీసీ కెమెరాల ఫుటేజీని వడపోస్తున్నారు. నిందితులు వాడిన అపాచీ, పల్సర్ బైకు నంబర్లు స్పష్టంగా లేకపోవడంతో గుర్తింపు కష్టంగామారింది. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లినట్టే వెళ్లి దారిమార్చి, వాహనాలనూ మార్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన్ని విస్తృతంగా వాడుతున్నారు. నిందితుల ఫొటోల ఆధారంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ (నాట్గ్రిడ్) సాఫ్ట్వేర్ సాయంతో వారి నేరచరిత, ఎఫ్ఐఆర్, జైలు జీవితం, ఫోన్నంబర్లు తదితర వ్యక్తిగత వివరాలతో సహా కీలక అంశాలను ఇప్పటికే సేకరించారు. బందిపోట్లు, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల డేటాను నాట్గ్రిడ్లో పొందుపరుస్తారు. ఇది తిరిగి సీసీటీఎన్ఎస్తో అనుసంధానంగా ఉంటుంది. ఈ డేటాబేస్ను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర జాతీయ దర్యాప్తు సంస్థలు వినియోగిస్తాయి. గతేడాది నుంచి ఈ డేటాబేస్ ఎస్పీ ర్యాంకు ఆఫీసర్లకు ఉగ్రవాద, ఇతర కీలక కేసుల్లో దర్యాప్తు కోసం యాక్సెస్ కల్పించారు. వచ్చిన వారు ఉగ్రవాదులు అయి ఉంటారన్న అంశాన్ని పోలీసులు కొట్టిపారేయకపోవడం గమనార్హం. నిందితులు వచ్చిన మార్గంలోని అన్ని సెల్టవర్ల పరిధిలో అనుమానిత సెల్ఫోన్ సంభాషణల కోసం డంప్ (సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్స్ వివరాలు)ను సీడాట్ పద్ధతిలో జల్లెడ పడుతున్నారు. ఇందులోనూ కొన్ని అనుమానిత నంబర్లను పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ల సంచారం ఆధారంగానే పోలీసులు దొంగలను వెంటాడుతూ వెళ్లారని సమాచారం. చోరీ అనంతరం దొంగలు ఆ నంబర్లను మార్చడం గమనార్హం. -
దొంగలను పట్టుకుంటాం
● రాజకీయం చేయడం బీఆర్ఎస్కు తగదు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కరీంనగర్ కార్పొరేషన్: జువెల్లరీ దొంగలను పట్టుకొని, ఆభరణాలను రికవరీ చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. దొంగతనం జరిగిన పీఎంఏ జువెల్లరీని సోమవారం ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. దొంగల దాడిలో గాయపడ్డ సిబ్బందిని హాస్పిటల్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గాయపడ్డ వారిని మెరుగైన చికిత్సకోసం అవసరమైతే హైదరాబాద్ తరలిస్తామన్నారు. దొంగతనంపై గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డిలు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. పోలీస్ శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ కల్చర్, పబ్కల్చర్, గంజాయిలపై ఈగల్ను తీసుకువచ్చి ఉక్కుపాదం మోపారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వామన్రావు దంపతులను నడిరోడ్డుపై చంపిన దిక్కులేదని, దిశలాంటి ఎన్నో కేసులు జరిగాయని గుర్తు చేశారు. ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం మూడు రోజుల్లో విరమింప చేస్తే కూడా బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుందన్నారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మా గోస పట్టించుకోండి
● కలెక్టరేట్ బాట పడుతున్న బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● 220 దరఖాస్తుల స్వీకరణసిరిసిల్ల అర్బన్: క్షేత్రస్థాయిలో పట్టించుకునే వారు లేక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు కలెక్టరేట్ బాట పడుతున్నారు. సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరీమా అగ్రవాల్ అర్జీలు స్వీకరించి భరోసానిస్తున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి 220 దరఖాస్తులు స్వీకరించారు. మాది ఇల్లంతకుంట మండలం రేపాక. ఇక్కడ ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో సన్నవడ్లు గత నాలుగేళ్లుగా కొనుగోలు చేయడం లేదు. నేను 70 క్వింటాళ్ల వరకు సన్నవడ్లు పండించాను. ఈ వడ్లను కొనుగోలు చేసి తగిన మద్దతు ధర కల్పించాలి. – రోండ్ల భూపతిరెడ్డి, రేపాకమాది సిరిసిల్లలోని శివనగర్. నా భర్త 9 ఏళ్ల క్రితం నన్ను, నా పిల్లలను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇద్దరి పిల్లల పోషణ ఇబ్బందిగా ఉంది. నాకు ఏదైనా పని కల్పించి, పెన్షన్ మంజూరు చేయండి. – మడత రాధిక, సిరిసిల్లమాది బోయినిపల్లి మండలం కొదురుపాక. నా భర్త అనారోగ్యంతో గతేడాది మృతిచెందాడు. మాకు ఇద్దరు చిన్న పిల్లలు. వారి చదువు, పోషణ ఇబ్బందిగా మారింది. నాకు జిల్లాలో ఎక్కడైనా ఏధైనా ఉపాధి కల్పించండి. – సంగీతమాది తంగళ్లపల్లి మండలం బాలమల్లుపల్లె. మా గ్రామంలోని ఇండ్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసింది. నిర్మాణాన్ని ఓ కాంట్రాక్టర్కు అప్పగించింది. అప్పులు తీసుకొచ్చి నిర్మాణాలు పూర్తిచేశాం. బిల్లులు రాకపోవడంతో వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికై నా బిల్లులు వచ్చేలా చూడాలి. – బాలమల్లుపల్లె గ్రామస్తులుఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కొంతకాలంగా మానువాడ నుంచి ఇసుకను రవాణా చేశాం. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్లో మన ఇసుక మన వాహనం ద్వారా మాకు ఇల్లంతకుంట మండలం పొత్తూరు క్వారీ నుంచి అనుమతి ఇచ్చారు. ఇల్లంతకుంట మండలం వారు మా ట్రాక్టర్లను అనుమతించడం లేదు. కాబట్టి మానువాడ నుంచి ఇసుకకు అనుమతి ఇవ్వాలి. – బోయినపల్లి మండల ఇసుక ట్రాక్టర్ల యజమానులు -
బయోగ్యాస్ ప్లాంట్కు భూమి పూజ
● నేడు గంభీరావుపేటకు డిప్యూటీ సీఎం ‘భట్టి’ రాకగంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. గంభీరావుపేటలో బయోస్ట్రాటమ్ టె క్నాలజీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ఆధ్వర్యంలో భూమి పూజ చేయనున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం పాల్గొననున్నారు. పర్యటనను విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు గంభీరావుపేట మండలంలో మంత్రుల పర్యటనను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీని వాస్ కోరారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్ద కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ గంభీరావుపేటలో ఏర్పాటు కాబోతుందని తెలిపారు. ఉపాధి కేంద్రంగా ప్లాంట్ దోహదపడనుందన్నారు. పర్ష హన్మండ్లు, మల్లుగారి నర్సాగౌడ్ తదితరులు ఉన్నారు. మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు వివిధ శాఖల మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. మంత్రుల పర్యటన దృష్ట్యా భద్రత ఏర్పాట్లు, హెలిప్యాడ్ను ఎస్పీ సోమవారం పరిశీలించారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేశ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రవి, ఆర్ఐలు మధుకర్, రమేశ్, ఎస్సై అనిల్ ఉన్నారు. -
గ్రీవెన్స్ డేలో 19 ఫిర్యాదులు
సిరిసిల్ల: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా 19 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి వేగంగా పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. అర్జీదారుల వినతులను స్వీకరించిన ఎస్పీ, సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఫిర్యాదులను చట్టపరంగా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. గంభీరావుపేట(సిరిసిల్ల): రైసుమిల్లుల దోపిడీని అరికట్టాలని, రైతులకు అన్యాయం చేస్తున్న రైసుమిల్లుల లైసెన్స్లను రద్దు చేయాలని కోరుతూ గంభీరావుపేట మండలం దమ్మన్నపేట, నాగంపేటలకు చెందిన రైతులు సోమవారం పెద్దమ్మ స్టేజీ వద్ద ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల వరి ధాన్యాన్ని అధికంగా తూకం వేయిస్తూ అన్నదాతలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నా కోనరావుపేట: ధాన్యం కొనుగోలు చేయాలని మండలంలోని సుద్దాలలో రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. నెల రోజులుగా కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్నామన్నారు. వేములవాడ: బంగారం విక్రయిస్తున్న దుకాణాల నిర్వాకంతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ పట్టణ స్వర్ణకారులు తమ దుకాణాలను సోమవారం బంద్ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ తీశారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు గిన్నెల శ్రీనివాస్ మాట్లాడుతూ జ్యువెల్లరీ దుకాణాల యజమానులు వారి వద్ద బంగారం కొనుగోలు చేసే వినియోగదారులకు తామే ఆభరణాలు కూడా తక్కువ ధరకు తయారు చేసి ఇస్తామంటూ తమ పొట్ట కొడుతున్నారని వాపోయారు. బంగారం విక్రయించే వరకు బాగానే ఉన్నా తమ పనిని కూడా వారే తీసుకొని ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా వైఖరి మార్చుకోకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి కత్రోజు వెంకటేశ్, రాము, ప్రసాద్, శంకరయ్య, కట్ట రమేశ్, రాజేశ్, అరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. ‘పెద్దింటి’కి కథా పురస్కారంసిరిసిల్ల అర్బన్: జిల్లాకు చెందిన సినీ కథా రచయిత పెద్దింటి అశోక్కుమార్కు ఎస్జీ ఫౌండేషన్ కథా పురస్కారం లభించినట్లు ఫౌండేషన్ చైర్మన్ పి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ నెల చివరి వారంలో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో నగదుతోపాటు అవార్డు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సాహిత్యరంగంలో విశిష్ట కృషి చేసిన అశోక్కుమార్ ఇప్పటి వరకు 300 కథలు, 7 నవలలు, 5 నాటికలు రచించారు. 12 కథా సంకలనాలను ప్రచురించారు. అలాగే పది సినిమాలకు రచన అందించారు. కథా సాహిత్యంలో చేసిన కృషికి గుర్తింపుగా పెద్దింటికి ఈ పురస్కారం లభించడం విశేషం. సిరిసిల్ల: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈనెల 5న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి అజ్మీర రాందాస్ సోమవారం తెలిపారు. జిల్లాలోని యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని పలు ప్రైవేటు కంపెనీలు ఈ జాబ్మేళాకు వస్తాయని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఈ–మెయిల్ ద్వారా పొంది హాజరుకావాలని కోరారు. నేడు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికవేములవాడ: వేములవాడ మున్సిపల్లో నలుగురు కో–ఆప్షన్ సభ్యులను మంగళవారం ఎన్నుకోనున్నారు. ఇందులో భాగంగా సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చైర్మన్, వైస్చైర్మన్, కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. సభ్యుల ఎన్నిక కోసం అభిప్రాయ సేకరణ నిర్వహించారు. సభ్యులంతా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూనే తుది నిర్ణయం తమదేనని విప్నకు చెప్పినట్లు తెలిసింది. -
స్విమ్మింగ్.. ట్రైనింగ్
ఎండలు మండుతున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ పార్క్లోగల స్విమ్మింగ్పూల్లో విద్యార్థుల సందడి నెలకొంటుంది. ఈత నేర్చుకునేందుకు చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు. నిర్వాహకులు ఉదయం, సాయంత్రం వేళల్లో బ్యాచ్ల వారీగా స్విమ్మింగ్లో శిక్షణ ఇస్తున్నారు. కొందరు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు స్విమ్మింగ్పూల్ను ఆశ్రయిస్తున్నారు. అన్ని రకాల రక్షణ చర్యలు పాటిస్తూ ఈత కొడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల -
మిల్లర్ల దోపిడీ అరికట్టాలి
ఎల్లారెడ్డిపేట( సిరిసిల్ల): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధర ఇస్తారనే ఆశతో కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే మిల్లర్లు తూకంలో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆదివారం మండలంలోని పదిర గ్రామానికి చెందిన అన్నదాతలు సిరిసిల్ల– కామారెడ్డి రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ, తాము పండించిన ధాన్యాన్ని 15రోజుల క్రితం కేంద్రానికి తీసుకువస్తే, నిర్వాహకులు 40 కిలోలకు బదులు 42.500 కిలోలు తూకం వేస్తున్నారని ఆరోపించారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. తూకంలో రెండున్నర కిలోల మోసం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న రైతులకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సై రాహుల్రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన విరమించాలని కోరగా, రైతులు, నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారులతో మాట్లాడుతామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, నాయకులు సల్ల సత్యంరెడ్డి, కంచర్ల పరుశరాములు, వినయ్, రైతులు పాల్గొన్నారు. -
పంచాయతీల్లో నిధుల కొరత
సిరిసిల్లఅర్బన్/వేములవాడరూరల్: జిల్లాలోని గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ముఖ్యంగా ఆదాయ వనరులు అంతగా లేని చిన్న పంచాయతీల్లో కనీసం కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. వచ్చే వర్షాకాలానికి సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన పనులకు నిధులు లేక కార్యదర్శులు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచులు సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేపట్టగా బిల్లులు మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సుమారు 1,244 మంది కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి మూడునెలలుగా వేతనాలు రావడం లేదని వాపోతున్నారు. విడుదల కాని ఎస్ఎఫ్సీ నిధులు ఈ ఏడాది జనవరిలో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు కొద్దిమేర గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ కాగా, అవి ప్రత్యేక అధికారుల పాలనలో అయిన ఖర్చులకే సరిపోవడం లేదని పలు వురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావల్సిన ఎస్ఎఫ్సీ నిధులు విడుదల కాక కార్మికులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసినా నిధులు రావాయే.. ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సర్పంచ్లు దృష్టి పెట్టారు. రెండేళ్లుగా గ్రామాల్లో ఉన్న పలు పెండింగ్ పనులకు పెట్టుబడి పెట్టారు. ప్రభుత్వం మంజూరు చేసిన పనులు, కరెంట్ బోర్లు తదితర పనులను సొంత ఖర్చులతో చేపట్టినా ఐదు నెలలుగా బిల్లులు రావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కనిపించని సన్నద్ధత ఈ ఏడాది వరుసగా ఎన్నికల హడావుడి కనిపిస్తుండడంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో జిల్లాలోని పలు పంచాయతీల్లో అపరిశుభ్రత, అస్తవ్యస్థంగా మురుగు కాల్వలు, తాగునీటి వెతలు తదితర సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మరో నెల రోజుల్లో వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. నిధుల లేమితో అధికారులు ముందస్తు సన్నద్ధత కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. మాది గంభీరావుపేట మండలం పొన్నాలపల్లె గ్రామం. ఇక్కడ ఇద్దరం పనిచేస్తాం. నేను ఏడేళ్లుగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నా. ఆరునెలలుగా జీతాలు రావ డం లేదు. అధికారులను అడిగితే వారి నుంచి సరైన సమాధానం లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. పెండింగ్ జీతాలు అందజేయాలి. – భగవంతం, పంచాయతీ కార్మికుడు, పొన్నాలపల్లె జిల్లాలో.. మండలాలు 12 గ్రామపంచాయతీలు 260 సిబ్బంది 1,244 (సుమారు) -
యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
చందుర్తి(వేములవాడ): యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజక వర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంటులో పాల్గొన్న మండలంలోని 10 జట్లు, రుద్రంగి మండలం 5 జట్లకు ఆదివారం మండలకేంద్రంలోని పెరుక కమ్యూనిటీ హాల్లో క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, తిరుపతి, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, రుద్రంగి మాజీ ఎంపీపీ గంగం స్వరూపరాణి, కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్రావు, చందుర్తి సింగిల్విండో మాజీ అధ్యక్షుడు తిప్పని శ్రీనివాస్, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు ఏనుగుల శ్రీనివాస్, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నిధులు మంజూరు కాగానే..
నిధులు మంజూరు కాగానే పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు అందజేస్తాం. చిన్న పంచాయతీల్లో కొంత ఇబ్బంది ఉన్నా వారికి కూడా త్వరలోనే వేతనాలు మంజూరు చేస్తాం. – షరీఫొద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి ముస్తాబాద్ మండలం రామ్రెడ్డిపల్లె గ్రామం. నేను ఐదేళ్లుగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నా. మూడునెలలుగా జీతం రావడం లేదు. అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతనం మంజూరు చేయాలి. – గద్దల సుధాకర్, కార్మికుడు, రామ్రెడ్డిపల్లె, ముస్తాబాద్ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయా లి. కొన్ని పంచాయతీల్లో మూడు నుంచి ఆరునెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. అధికారులు స్పందించి త్వరగా మంజూరు చేయాలి. – అన్నల్దాస్ గణేశ్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా బాధ్యులు -
సెంట్రల్ బోర్డ్ ఫిలిం ప్యానల్ మెంబర్గా వైశాలి
సిరిసిల్లటౌన్: సెంట్రల్ బోర్డ్ ఫిలిం ప్యానల్ మెంబర్గా జిల్లా కేంద్రానికి చెందిన వేముల వైశాలి నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైశాలి మాట్లాడుతూ, తన నియామకంతో మరింత బాధ్యత పెరిగిందని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీకి, కేంద్ర మంత్రి సంజయ్కి కృతజ్ఞతలు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లుసిరిసిల్లఅర్బన్: పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు అన్నారు. ఆదివారం పట్టణంలోని 12వ వార్డు చంద్రంపేట, 2వ వార్డు శాంతినగర్లో లబ్ధిదారులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరై నూతనవస్త్రాలు అందజేశారు. ఇందిరమ్మ పథకం ద్వారా అనేక మంది నిరాశ్రయులకు సొంతింటి కల సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మడుపు శ్రీదేవి, కౌన్సిలర్ వెంగళ లీల, లక్ష్మీనారాయణ, సూర నిర్మల, నూనే శ్రీనివాస్, ఎల్లయ్య, శంకర్, పర్శరాములు, నర్సయ్య పాల్గొన్నారు. సీడీఎంఏకు వేములవాడ కమిషనర్వేములవాడ: వేములవాడ మున్సిపల్లో విధులు నిర్వహిస్తున్న కమిషనర్ సంపత్కుమార్ను సీడీఎంఏకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయన బదిలీ కాస్త ఆగినట్లే ఆగి తిరిగి మళ్లీ బదిలీ కాక తప్పలేదు. సంపత్కుమార్ను రిలీవ్ చేసి సీడీఎంఏలో జాయిన్ కావాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆయన హైదరాబాద్కు వెళ్లగా, అతడి స్థానంలో ఇన్చార్జి కమిషనర్గా మేనేజర్ సంపత్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు సంపత్రెడ్డి శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. కాగా, మంచిర్యాలలో విధులు నిర్వహిస్తున్న కమిషనర్ అన్వేశ్ వేములవాడకు రావాల్సి ఉండగా అక్కడి ఎమ్యెల్యే అన్వేశ్ అక్కడే ఉండాలని కోరడంతో ఆయన బదిలీ ఆగిపోయిన విషయం తెలిసిందే. సిరిసిల్లఅర్బన్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 10న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చే యాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి పి లుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి రూ.7,800 కోట్లకు పైగా నిధులతో పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డంకులు పె ట్టిందన్నారు. రైతు సమస్యల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలమయ్యాయని ఆరోపించారు. సభను విజయవంతం చేయాడానికి ప్రతీ కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. సభ రాష్ట్రానికి కీలక మలుపు కావాలని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్రావు, మీసాల చంద్రయ్య, జిల్లా ఇన్చార్జి గంగాడి మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
30 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధం
● రంగంపేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని రంగంపేటలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి పడిన నిప్పురవ్వలతో దాదాపు 30 ఎకరాల్లో కోసి పెట్టిన పశుగ్రాసం కాలిపోయింది. విద్యుత్ తీగలు తగిలి షార్ట్సర్క్యూట్ కావడంతో ఎగిసిపడిన నిప్పురవ్వలు ఎండిన వరికట్టలపై పడడంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పంటతోపాటు పొలాల వద్ద ఉన్న పైపులు, స్టార్టర్లు, విద్యుత్ వైర్లు కాలిపోయాయి. లూజ్ వైర్లతోనే ఏటా షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరుగుతున్నాయని, తీగలను సరిచేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నాయకులు ప్రభుత్వానికి విన్నవించారు. -
కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు
● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోనరావుపేట(వేములవాడ): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పేర్కొన్నారు. మండలంలోని కొలనూర్, ధర్మారం గ్రామాల్లోని సింగిల్విండో కొనుగోలు కేంద్రాలను, కనగర్తిలోని మారుతి, కనకదుర్గ, కొలనూర్లోని సరస్వతి రైస్మిల్లులను శనివారం తనిఖీ చేశారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం, ట్యాబ్ ఎంట్రీపై ఆరా తీశారు. సరిపడా హమాలీలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలన్నారు. అనంతరం కోనరావుపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంకు వెళ్లే దారిలో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. -
● మానేరువాగులో ఒకే చోట దహనం ● ఐదు రథాలు.. రెండు కాష్టాలు.. ఆరు శవాలు ● ఘెల్లుమన్న సిరిసిల్ల
సిరిసిల్ల: కార్మిక క్షేత్రం కన్నీటి సంద్రమైంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు.. బాధ్యతగా కుటుంబాలను పోషించే ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సిరిసిల్లలో కన్నీరు ఉబికింది. అయ్యో దేవుడా.. ఏమిటీ దారుణం అంటూ గుండెలు బాదుకుంటూ కుటుంబ సభ్యులు రోదించారు. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగురోడ్డులో పెద్ద గోల్కొండ–తొండుపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల సర్ధార్నగర్కు చెందిన రెండు కుటుంబాల్లోని ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఉ స్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగించుకుని ఆరు మృతదేశాలు శనివారం సిరిసిల్లకు తీసుకొ చ్చారు. రెండు కుటుంబాలకు చెందిన ఆరు శవాలు రావడంతో సర్ధార్నగర్ శోకసంద్రంలో మునిగింది. అతివేగంతో నిండు ప్రాణాలు బలి సిరిసిల్లకు చెందిన బొల్లి రాజు బీడీ కంపెనీ టేకేదార్. అతనికి ముగ్గురు పిల్లలు. శివకుమార్, స్వేత, శిరీష్. పెద్దకొడుకు, కోడలు శివకుమార్, లాస్య దంపతులు, వాళ్ల పాప రిషిత హైదరాబాద్ సనత్నగర్లో నివాసం ఉంటారు. చెల్లెలు స్వేత, కోడం శ్రీనివాస్, అల్లుళ్లు కృష్ణచంద్ర, మాధవ్లు గురువారం సనత్నగర్లోని ఇంటికి వెళ్లారు. వీరంతా యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాలను సందర్శించుకుని చిలుకూరి బాలాజీ ఆలయ దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వ్యాగనార్ కారు ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టడంతో ఆరు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. స్వేత ఒక్కరే మాత్రం చావుబతుకుల్లో ఆస్పత్రిపాలైంది. ఆ కారుపై అప్పటికే అతివేగంగా వెళ్లినట్లు రెండు ఈ–చలానాలు ఆన్లైన్లో పెండింగ్లో ఉన్నాయి. ఆరు శవాలు.. ఐదు రథాలు.. రెండు కాష్టాలు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని నాలుగు వైకుంఠ రథాలతోపాటు, కోనరావుపేటకు చెందిన మరో వైకుంఠరథాన్ని తెప్పించి, ఆరు శవాలను ఐదు రథాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. మానేరువాగులో ఒక్క కాష్టంపై బొల్లి శివకుమార్, అతని భార్య లాస్య, కూతురు రిషిత మృతదేహాలను ఉంచి శివకుమార్ తండ్రి బొల్లి రాజు చితికి నిప్పు అంటించా రు. మరో కాష్టంపై కోడం శ్రీనివాస్, అతని ఇద్దరు కొడుకులు కృష్ణచంద్ర, మాధవ్ మృతదేహాలను ఉంచారు. శ్రీనివాస్ తల్లి కోడం మల్లవ్వ గుండెల నిండా దుఃఖంతో ఒక్కగానొక్క కొడుకు చితికి నిప్పటించారు. బాధిత కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ కుటుంబాన్ని హైదరాబాద్లో ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించగా.. సిరిసిల్లలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, ట్రాక్టర్ యజమానులు, బీడీ కంపెనీ టేకేదార్లు సందర్శించి నివాళి అర్పించారు. సిరిసిల్ల చరిత్రలో మూడో పెద్ద ఘటన సిరిసిల్ల పట్టణ చరిత్రలో మూడో పెద్ద ఘటన ఇది. ఆరు శవాలను ఒకేసారి ఊరేగించడం, అదీ ఐదు వైకుంఠ రథాలపై తీసుకెళ్లడం చూపరులను కలచివేసింది. మూడున్నర దశాబ్దాల కిందట కొండ నారాయణ కుటుంబం దైవదర్శనానికి వెళ్తూ ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం. సిరిసిల్లకు చెందిన ప్రముఖ డాక్టర్ పూర్ణచందర్ కుటుంబం మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ రెండు ఘటనల తరువాత శుక్రవారం నాటి ఔటర్ రింగురోడ్డు ప్రమాదమే పెద్దది. ప్రేమ పెళ్లి.. ప్రమాదంలో బలి బొల్లి శివకుమార్ కులాంతర వివాహం చేసుకున్నారు. కామారెడ్డికి చెందిన రెనికిండి రాజేశ్వరి అలియాస్ లాస్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి రిషిత అనే కూతురు ఉంది. లాస్య కేంద్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే లాస్య, బీడీ కంపెనీని నిర్వహించే శివకుమార్, వారి కూతురు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మరణించగా.. వారిని ఒకే చితిపై దహనం చేయడం కలచివేసింది. కోడం శ్రీనివాస్, అతని ఇద్దరు కొడుకులతో సహా ఒకే చితిపై దహనం చేశారు. -
పేదలకు పథకాలు అందిస్తున్నాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: పేదలకు ప్రభుత్వ పథకా లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, గత ప్రభుత్వ హయాంలోని ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నా రు. పట్టణంలోని ఎస్సారార్ ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. గ్రామ, మండల సభల్లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. కార్పోరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు. రాజన్న ఆలయాన్ని రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, త్వరలోనే కుడి, ఎడమ కాలువల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టర్ గరీ మా అగ్రవాల్తో కలిసి లబ్ధిదారులకు పరికరాలు అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్చైర్మన్ నరాల శేఖర్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, ఆర్డీవో రాధాభాయి, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. స్టాళ్లు పరిశీలన మహిళా సంఘాల ఫుడ్స్టాల్, వ్యవసాయ, ఉద్యానవనశాఖ ఆయిల్పామ్ ఉత్పత్తులు, సన్న వరి సాగు, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖీ కేంద్రం, పోషణ మాసం, బాలల భద్రత.. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల స్టాళ్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు సన్నరకం వడ్లు, ఆయిల్పామ్ సాగు చేయాలని సూచించారు. వేములవాడ నియోజకవర్గంలో వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను వెల్లడించారు. మర్రిపల్లి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయండి వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి మినీ ప్రాజెక్టు పనులు వర్షాకాలంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మర్రిపల్లి ప్రాజెక్టును కలెక్టర్ గరీమా అగ్రవాల్తో కలిసి శనివారం పరిశీలించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంత ప్రజల నీటి కష్టాలను గుర్తించి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలని ఆలోచించారన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కుడి, ఎడమ కాల్వల ద్వారా మల్లారం, నాగాయపల్లి, పోచెట్టిపల్లి, కొనాయపల్లి, కాశాయపల్లి, ఎదురుగట్ల, చెక్కపల్లి, అచ్చన్నపేట, వెంకటాంపల్లి, బాలరాజుపల్లి గ్రామాలకు సుమారు 3,600 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. భూసేకరణకు సంబంధించిన కొంతమంది రైతులకు ఇంకా ఇవ్వాల్సిన నష్టపరిహారం పంపిణీ చేయాలని కలెక్టర్కు సూ చించారు. మర్రిపల్లిలోని ప్రభుత్వ స్థలంలో మార్కెట్యార్డు, రైతువేదిక, గోదాముల నిర్మాణానికి 12.20 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ అబుబాకర్, మండల పార్టీ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వార్పిన్ కార్మికుల కూలి పెంచాలి
సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రోత్పత్తి రంగంలోని వార్పిన్ కార్మికుల కూలి పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి కోరారు. సిరిసిల్లలోని చేనేత, జౌళిశాఖ ఆఫీస్ వద్ద శనివారం కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. వార్పిన్ కార్మికుల కూలి పెంపు కోసం ఈనెల 4న కలెక్టర్ ఆఫీసు వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు సిరిమల్ల సత్యం, ఉడుత రవి, మచ్చ వేణు, ప్రవీణ్, నర్సయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. లారీల కోసం రైతుల రాస్తారోకో కోనరావుపేట(వేములవాడ): కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ క్రాసింగ్ వద్ద బైఠాయించారు. లారీలు వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. రైతులు మాట్లాడుతూ నిజామాబాద్లోని ఐకేపీ కేంద్రంలో 4వేల బస్తాలు తూకం వేసి పెట్టారన్నారు. అధికారులు స్పందించి వెంటనే లారీలు పంపించి ధాన్యాన్ని తరలించాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి లారీలు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. విద్యార్థులు ఉన్నతంగా రాణించాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్లోనూ కష్టపడి చదివి ఉన్నతంగా రాణించాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, ఎంఈవో కృష్ణహరి సూచించారు. మండలంలోని నారాయణపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన సూర స్నేహలత 572, కాసారపు శ్రీకర్ 569, దీప్తి 567 మార్కులు సాధించి మండల స్థాయిలో ఉత్తమంగా నిలిచారు. వీరిని డీఈవో, ఎంఈవోలు అభినందించారు. హెచ్ఎం చంద్రశేఖర్ర్ తదితరులు పాల్గొన్నారు. పదో తరగతి టాపర్లకు ఎస్పీ సన్మానం తంగళ్లపల్లి: పదోతరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన శ్రీసరస్వతి, ప్రగతి విద్యాలయ విద్యార్థులు ఎల్.ప్రదీప్(577), ఈ.సంజన(570)లను ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. కరస్పాండెంట్ ఎం.శ్రీనివాస్యాదవ్, మనోహ ర్, సాయిప్రియ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలను విస్మరించిన బీఆర్ఎస్ సిరిసిల్లటౌన్: గతంలో పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఏఐసీసీ మైనార్టీ శాఖ పరిశీలకులు మహ్మద్ ఫయాజ్ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మైనార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. మొదటి నుంచి మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. అహ్మద్ఖాన్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
● డీవైఎస్వో అజ్మీరా రాందాస్ సిరిసిల్ల: భారత ప్రభుత్వం 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ఇచ్చేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాందాస్ శనివారం తెలిపారు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ వివిధ రంగాలలో నిష్ణాతులైన యువతీ యువకులకు పద్మ అవార్డులను ఇచ్చేందుకు దరఖాస్తులను కోరుతున్నట్లు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని, ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆఫీస్ను సంప్రదించాలని కోరారు. విద్యుత్ అంతరాయ నివారణకు ప్రత్యామ్నాయ లైన్లు సిరిసిల్ల: జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలకు ఏర్పడే విద్యుత్ అంతరాయాలను నివారణకు ప్రత్యామ్నాయంగా 33 కేవీ ఇంటర్లింక్ విద్యుత్లైన్లు ఏర్పాటు చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ శనివారం తెలిపారు. జిల్లా పరిధిలో నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. విద్యుత్ లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి 13 కొత్త సబ్స్టేషన్లు మంజూరైనట్లు వివరించారు. స్థిరమైన విద్యుత్ సరఫరా కోసం 19 బంచ్డ్ బ్రేకర్ల విభజన పనులు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటికే లక్ష్మీపూర్ సబ్స్టేషన్లో ఒక బ్రేకర్ చార్జ్ చేశామని, ఇల్లంతకుంట మండలం గాలిపల్లి సబ్స్టేషన్లో 11 కేవీ నర్సక్కపేట ఫీడర్ చార్జ్ చేసినట్లు వివరించారు. రైతులకు 902 నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదల చేసినట్లు తెలిపారు. లోడ్ డిమాండ్కు అనుగుణంగా 55 కొత్త అదనపు డీటీఆర్లు(ట్రాన్స్ఫార్మర్లు) ఒక కెపాసిటర్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ అంతరాయాలను అరికట్టడానికి భారీ ఎత్తున మరమ్మతు పనులు చేస్తున్నామని, 20 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్ల నిర్వహణ పనులు పూర్తి చేసి 105 మధ్య స్థంబాలను ఏర్పాటు చేసి, 54 దెబ్బతిన్న స్తంభాల పునరుద్ధరణ చేశామని వేణుమాధవ్ వివరించారు. అంతరాయాన్ని వెంటనే గుర్తించేందుకు ‘ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు’ లైన్లలో అమర్చమన్నారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఊరటనిస్తూ 166 పవర్లూమ్ సర్వీసులను కేటగిరీ–3 నుంచి కేటగిరీ–4 మార్చినట్లు తెలిపారు. నెల రోజుల్లో జిల్లాలో విప్లవాత్మక మార్పులకు ఎన్పీడీసీఎల్ శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. -
కూరగాయలే ఆధారం
మాకున్న కొద్దిపాటి భూమిలో కూరగాయలు సాగు చేసుకుంటాం. మేము పండించిన కూరగాయలను వేములవాడకు తీసుకొచ్చి విక్రయిస్తుంటాం. స్వయంగా అమ్ముకోవడం ద్వారా లాభాలు వస్తాయి. కూరగాయలే మా కుటుంబానికి ఆధారం. – కడుదుల లక్ష్మి, రైతు, కోనాయపల్లి మాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నప్పటికీ 20 గుంటల్లో కూరగాయలు సాగుచేస్తాం. అందులో అన్ని రకాల పంటలను వేసి సొంతంగానే విక్రయిస్తాం. సీజన్ల వారీగా కూరగాయలు సాగుచేస్తాం. మంచి లాభాలు వస్తున్నాయి. – కాసారపు పుష్పలత, రైతు, 13వ వార్డు, వేములవాడ -
కూరగాయల ముల్లెలు
ఆ పల్లెలు.. ● తోటల పెంపకంతో ఆర్థికంగా స్థిరత్వం ● సొంతంగా మార్కెట్లో విక్రయాలు ● ఆదర్శంగా నిలుస్తున్న పల్లె రైతులువేములవాడరూరల్: ఏటా సంప్రదాయ పంటలు సాగుచేస్తూ లాభాలు అంతంతే రావడంతో ఆ పల్లె రైతులు తమ తీరు మార్చుకున్నారు. పంటల మార్పిడి చేపట్టారు. కూరగాయలు సాగుచేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. తమకున్న భూమిలో పలు రకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. అంతేకాకుండా వాటిని దళారులకు ముట్టజెప్పకుండా మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారు. ఇలా అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల్లో ఎటూ చూసిన కూరగాయల తోటలే కనిపిస్తున్నాయి. ఎటూ చూసిన తోటలే.. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లి, అయ్యోరుపల్లి, నాంపల్లి, శాలరామన్నపల్లి, హన్మక్కపల్లిల్లో కూరగాయల తోటలు సాగుచేస్తూ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వేములవాడరూరల్ మండలం నాగాయపల్లి, పోచెట్టిపల్లి, మర్రిపల్లి, ఎదురుగట్ల, మల్లారం, హన్మాజిపేట, లింగంపల్లి, చెక్కపల్లితోపాటు బోయినపల్లి మండలంలోని కొదురుపాక, నీలోజిపల్లి, రత్నంపేట గ్రామాల రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. -
డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: డ్రగ్స్ను నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్ను అందించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో క్రీడాకారులు యువకులు విద్యార్థులతో కలిసి 2కే రన్ నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి విద్యార్థి, యువకుడు ‘యాంటీ డ్రగ్ సోల్జర్’గా మారి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని కోరారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో హెల్ప్లైన్ నంబర్ 87126 71111కు, సమీప పోలీస్ స్టేషన్కు అందించాలని సూచించారు. ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువతతో డ్రగ్స్కు దూరంగా ఉండేలా ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్ఐలు శ్రీకాంత్, డీసీపీఓ కవిత పాల్గొన్నారు. -
‘క్రిటికల్ కేర్’
మెడికల్ కాలేజీలోఇది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవుట్ పేషెంట్(ఓపీ) విభాగం. ఇక్కడ నిత్యం సగటున వెయ్యి నుంచి 1,400 మంది రోగులు ఓపీ చిట్టీలు తీసుకొని వివిధ రకాల వైద్య నిపుణుల వద్దకెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. సిరిసిల్ల నడి బొడ్డున అంబేడ్కర్ సర్కిల్లోని ఈ ఆస్పత్రిలో 330 పడకలుండగా.. నిత్యం 200 నుంచి 300 మంది రోగులు అడ్మిట్ అవుతుంటారు. 50 పడకల ఆస్పత్రిగా ఉన్న ఆ సర్కారు దవాఖానను 330 పడకలకు పెంచుతూ పోవడం, మెడికల్ కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా మార్చడంతో రోగుల సంఖ్య పెరిగి ఇలా రద్దీగా మారింది. ఉదయం 10 గంటలకు ఆస్పత్రికెళ్తే.. కాలు పెట్ట సందు లేకుండా రోగులు, వారి బంధువులు, వాహనాల రద్దీతో జిల్లా జనరల్ ఆస్పత్రి కిటకిటలాడుతుంది.ఇది పట్టణ శివారులోని పెద్దూరు బైపాస్ రోడ్డు పక్కన నిర్మించిన మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి. ఈ ఆస్పత్రి భవనాన్ని సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు ప్రవీణ్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(సివిల్ సర్జన్) సుమన్మోహన్రావు, మెడికల్ కాలేజీ డాక్టర్ల బృందం క్షేత్రస్థాయిలో ఇటీవల పరిశీలించారు. ఇక్కడ ఉన్న వసతులు, ఇంకా అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వానికి ఈ బృందం నివేదిక పంపించింది. ఈ ఆస్పత్రిలో 50 పడకల వసతులతో కూడిన భవనం సిద్ధమైంది. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇరుకిరుకుగా కొనసాగుతున్న క్రిటికల్ కేర్ యూనిట్ ఐసీయూ, అత్యవసర చికిత్స కేంద్రం(ఎమర్జెన్సీ సెంటర్) వంటి వాటిని మెడికల్ కాలేజీ పరిధిలోని క్రిటికల్ కేర్ యూనిట్కు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మెడికల్ కాలేజీలో వసతులను కల్పిస్తున్నారు. -
ఆరు గ్యారంటీలను ఆవిష్కరించాలి
● ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ఆవిష్కరిస్తూ సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలస్థాయి సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గస్థాయి సభల నిర్వహణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలతో కరపత్రం రూపొందించి పంపిణీ చేయాలని, ఈ సభలకు మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, రైతులు, వివిధ పథకాల లబ్ధిదారులను ఆహ్వానించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు సీహెచ్ వెంకటేశ్వర్లు, రాధాభాయ్, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీఆర్డీవో మచ్చ గీత, సీపీవో పీబీ శ్రీనివాసాచారి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫోద్దీన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా పాల్గొన్నారు. నూతన ఇసుక రీచ్లపై సమీక్షసిరిసిల్ల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర నిర్మాణాలు, స్థానిక అవసరాల కోసం గుర్తించిన నూతన ఇసుక రీచ్లపై కలెక్టర్ డిస్ట్రిక్ట్ లెవెల్ సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. -
కార్మిక సంక్షేమమే ధ్యేయం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● మండేపల్లి ఏటీసీలో ఘనంగా మేడే వేడుకలు ● హాజరైన కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గితేతంగళ్లపల్లి(సిరిసిల్ల): అన్ని రంగాల కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం మేడే సందర్భంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గితేతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ ఫోన్ ద్వారా కార్మికులకు తన శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ సమాన గౌరవం గాంధీజీ ఆశయాల ప్రకారం ప్రతీ కార్మికుడికి సమాన గౌరవం దక్కాలని కలెక్టర్ అన్నారు. భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖలో పేర్లు నమోదు చేసుకొని పథకాలను పొందాలని సూచించారు. అండగా పోలీస్ శాఖ వివిధ పరిశ్రమల్లో, రోజూవారీ కూలీలుగా పని చేస్తున్న కార్మికులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ అన్నారు. డీఎస్పీ నాగేంద్రాచారి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, పరిశ్రమల అధికారి హనుమంతు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. బాలల భద్రత.. వేములవాడఅర్బన్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల భద్రత.. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా బాల భరోసాపై వేములవాడ ఏరియా ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులందరికీ ‘ఇందిరమ్మ’వేములవాడ: అర్హులైన పేదలకు సొంతిల్లు అప్పగించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలో పూర్తయిన పలు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో వేగం పెంచాలి
● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు వేగం పెంచాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. రాచర్లతిమ్మాపూర్లోని శ్రీసాయి ఇండస్ట్రీస్ మిల్లును శుక్రవారం తనిఖీ చేశారు. ధాన్యం దిగుమతి, ఇతర అంశాలపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వెంటవెంటనే దించుకొని లారీలు పంపాలని సూచించారు. ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. తహసీల్దార్లు మారుతిరెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పోలీస్ యాక్ట్సిరిసిల్ల: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం మే 1 నుంచి 31 వరకు జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ మహేశ్ బిగితే వెల్లడించారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని స్పష్టం చేశారు. డీజే సౌండ్ సిస్టమ్ వినియోగం కూడా నిషేధితమని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టొద్దని హెచ్చరించారు. జిల్లా ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారమందించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ఇల్లంతకుంట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పొత్తూరు గ్రామంలో మంచే లక్ష్మి, చిక్కుడువానిపల్లెలో కంకటి రేవతి–రమేశ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి శుక్రవారం గృహప్రవేశం చేయగా.. ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పేదవారికి సొంతింటి కల నెరవేరుతోందన్నారు. అర్హులు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్పంచులు పట్నం అశ్విని, చింతమడక కళ్యాణ్, చొప్పరి భూమయ్య, మామిడి రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ పాశం రాజేందర్రెడ్డి, పసుల వెంకటి, ఉప సర్పంచ్ చిక్కుడు సత్యం తదితరులు పాల్గొన్నారు. ఎక్కడి కమిషనర్లు అక్కడే..?వేములవాడ: వేములవాడ మున్సిపల్ కమిషనర్గా మంచిర్యాల కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న అన్వేశ్ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు వెలువరించింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సంపత్కుమార్ను హైదరాబాద్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమేరకు శుక్రవారం వీరు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ రాజకీయ జోక్యంతో మంచిర్యాల కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న అన్వేశ్ను అక్కడే ఉండేలా అక్కడి ప్రధాన నాయకుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే అన్వేశ్ మొన్నటివరకు వేములవాడ కమిషనర్గా సేవలందించడంతో ఆయన సేవలను ఇక్కడ వినియోగించుకునేందుకు ఇక్కడి నాయకత్వం సైతం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అక్కడి నాయకుడు ఇక్కడి నాయకుడితో మాట్లాడి వీరి సేవలను ఎక్కడికక్కడే వినియోగించుకునేందుకు ఫైనల్ చేసినట్లు సమాచారం. దీంతో అన్వేశ్ మంచిర్యాలకు, సంపత్కుమార్ వేములవాడకు పరిమితం కానున్నారు. ప్రభుత్వం మరో ఆర్డర్ వెలువరించనుంది. -
బండ్ల ప్రదక్షిణ
ఇల్లంతకుంట: రేపాకలో శుక్రవారం సాయంత్రం మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా బండ్ల ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. ఆలయం చుట్టూ ఎడ్లబండ్లు, మేకపోతుల బండి, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు ప్రదక్షిణ చేయించారు. ప్రతి ఏటా జాతర నిర్వహిస్తామని సర్పంచ్ కాత మల్లేశం తెలిపారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జాతరలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తాళళ్లపల్లి సర్పంచ్ కనకరాజు, ముస్కాన్పేట సర్పంచ్ భాస్కర్రెడ్డి, ఇల్లంతకుంట సర్పంచ్ రాజు, కాంగ్రెస్ నాయకుడు రాజయ్య పాల్గొన్నారు. -
పోరాటాలతోనే కార్మిక హక్కులు సాధ్యం
● మేడే వేడుకల్లో నాయకులుసిరిసిల్లటౌన్: పెత్తందార్ల పెట్టుబడి వ్యవస్థపై పోరాడితేనే కార్మికుల హక్కులు సాధిస్తామని వక్తలు స్పష్టం చేశారు. శుక్రవారం మేడే వేడుకలు కార్మిక క్షేత్రం సిరిసిల్లలో ఘనంగా జరిగాయి. అన్ని ప్రధాన ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహించారు. సిరిసిల్ల డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్టీసీ కార్మిక నాయకులు చింతకింది బాణయ్య, చొప్పదండి ప్రకాశ్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు వెంగల శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించారు. ఉత్తమ కార్మికులను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖదీర్పాషా, స్థానిక కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణ, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక బీవైనగర్ సీపీఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రమేశ్ జెండా ఆవిష్కరించారు. జిల్లా నాయకులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల కార్మిక భవనం సీపీఐ కార్యాలయంపై జిల్లా కార్యదర్శి సుదర్శన్ జెండా ఎగరేశారు. స్థానిక పెద్దబజారులో హిందు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. సిరిసిల్ల డైయింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిపారు. ఏఐఎఫ్టీయూ న్యూ ఆధ్వర్యంలో జాతీయ నాయకుడు ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు ధశరథం జెండా ఎగరేశారు. -
ఖాళీ బిందెలతో వార్డు సభ్యురాలి ధర్నా
● పంచాయతీ కార్యాలయంలో ఆందోళనముస్తాబాద్: ముస్తాబాద్ మేజర్ పంచాయతీ కార్యాలయంలో తొమ్మిదో వార్డు సభ్యురాలు బండి సుమలత ఖాళీ బిందెలతో శుక్రవారం ధర్నా చేపట్టారు. స్వయంగా వార్డు సభ్యురాలే నీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. వార్డు సభ్యురాలు మాట్లాడుతూ.. తన వార్డులో నెల రోజుల క్రితం బోరు మోటారు కాలిపోయిందన్నారు. దానిని మరమ్మతు చేసేందుకు పంచాయతీ సిబ్బంది ఇప్పటివరకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా వార్డు ప్రజలకు నిత్యం ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుండగా, కొంతమంది దానిని అడ్డుకున్నారన్నారు. బోరు మోటారు బాగు చేయక, ట్యాంకర్ను పంపించక వార్డు ప్రజలపై ఎవరు కక్ష కట్టారో తేలాలని పట్టుబట్టారు. స్టోర్రూమ్లో అదనంగా మోటారు ఉన్నా.. దానిని పంపించలేదని అన్నారు. కార్యదర్శి రమేశ్ స్పందిస్తూ.. త్వరలోనే మోటారును పంపిస్తామని, సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. -
‘ఆది’ ఆశీస్సులు ఎవరి‘కో’
● ఈనెల 4న వేములవాడ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక?వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. గతనెల 22న నామినేషన్ ప్రక్రియ ముగియగా, స్క్రూటినీలో మొత్తం 22 నామినేషన్లకు 8 తిరస్కరణకు గురవడం చర్చనీయాంశమైంది. 14 మంది పోటీలో ఉండగా, తుది ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 4 వరకు నలుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నికోవాల్సి ఉంటుంది. విప్ చేతుల్లో తుది నిర్ణయం కో ఆప్షన్ ఎంపికలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాత్ర కీలకంగా మారింది. అధికార పార్టీ ఆధిపత్యం ఉన్న కౌన్సిల్ కావడంతో, ఆయన సూచనల మేరకే తుది ఎంపిక జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికార పాలకవర్గాలు చెబుతున్నాయి. అందుకే అభ్యర్థులు విప్ మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 4న ఎన్నిక? ఈనెల 4న కోఆప్షన్ ఎన్నిక నిర్వహించేందుకు మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. కౌన్సిల్ సమావేశం ద్వారా ఈ ఎన్నిక జరగనుంది. దీంతో అప్పటివరకు రాజకీయ లాబీయింగ్ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. టెన్షన్..టెన్షన్ మొత్తం నాలుగు స్థానాల్లో 2 మైనార్టీ, 2 స్పెషల్ నాలెడ్జ్ పర్సన్స్కు కేటాయింపు ఉన్న నేపథ్యంలో వర్గాల మధ్య సమతుల్యత సాధించడం అధికార పార్టీకి సవాల్గా మారింది. ఒకవైపు అర్హతలు, మరోవైపు రాజకీయ నిబద్ధతం రెండు అంశాలను బేరీజు వేసుకుంటూ తుది జాబితా ఖరారు చేసే ప్ర క్రియ సాగుతోంది. దీంతో విప్ నిర్ణయం మేరకు అ భ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరి పేర్లు బయటికి రాకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ‘ఆది’ చుట్టూ ఆశావహులు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ గడువు పూర్తికావడంతో ఇక ఎన్నిక ఒక్కటే మిగిలింది. ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు ఆశావహులు విప్ ఆది శ్రీనివాస్ మన్ననల కోసం ఆయన వద్దకు చేరుకుంటున్నారు. తమకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. శీనన్న ఎవరికి అవకాశం కల్పిస్తారోనని పార్టీ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. -
భవిష్యత్లో ఉన్నతస్థాయిలో నిలవాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత స్థాయిలో నిలవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఇల్లంతకుంట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని మాందాడి హనీ పదో తరగతిలో 586 మార్కులతో సొసైటీ స్థాయిలో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించడంతో మంత్రి గురువారం హైదరాబాద్లో సన్మానించారు. క్రమశిక్షణతో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు అభినందించారు. నిరసన దీక్ష విజయవంతం చేయాలిసిరిసిల్ల: ఉద్యోగుల డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే దీక్ష సమరాన్ని విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు. జిల్లా కేంద్రంలోని అర్బన్బ్యాంకులో గురువారం ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఉద్యమ ఖిల్లాగా పేరుందని, ఆ పేరును నిలబెట్టుకునేలా దీక్షలు చేపట్టాలన్నారు. నిరసన దీక్షలలో ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. జేఏసీ చైర్మన్ ఎలుసాని ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై నిరసన దీక్షను విజయవంతం చేస్తామన్నారు. జేఏసీ కార్యదర్శి సమరసేన, టీజీవో, టీఎన్జీవో నాయకులు సయ్యద్ జబీ, అహ్మద్రసూల్, గాజుల సుదర్శన్, ఎండీ రియాజ్, మెట్టు శ్రీకాంత్, ఆర్.శేఖర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెన్షనర్స్ పాల్గొన్నారు. బోయినపల్లి(చొప్పదండి): అనాథలకు అండగా మిషన్ వాత్సల్య విభాగం కృషి చేస్తుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. పజా పాలన ప్రగతి ప్రణాళిక, బాలల భద్రత డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని కొదురుపాకలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో తల్లిదండ్రుల సపోర్ట్ లేని వారి వివరాలు సేకరించగా మొత్తం 302 మంది పిల్లలు ఉన్నారని గుర్తించడం జరిగిందన్నారు. వీరికి జనన ధ్రువీకరణ, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, కులము, ఆదాయం, బ్యాంక్ అకౌంట్, ఆధార్ లాంటివి అందించడానికి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. పిల్లల దత్తతకు చట్ట ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. అక్రమంగా పిల్లలను కొనుగోలు చేసినా, విక్రయించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలను పెంచడానికి ఏవైనా సంస్థలు ముందుకు వస్తే వారి వివరాలు ప్రభుత్వానికి పంపి ఆన్లైన్లో నమోదు కోసం సాయం అందిస్తామన్నారు. అడిషనల్ సీడీపీవో సుచరిత, జిల్లా విమెన్ హబ్ కోఆర్డినేటర్ రోజా, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కవిత, లీగల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అంజయ్య, తహసీల్దార్ షరీఫ్ మోయినొద్దిన్, ఎంపీడీవో జయశీల, ఎస్సై రమాకాంత్, సర్పంచు కత్తెరపాక మంజుల, ఉపసర్పంచు గోపాల్, ఎంఈవో శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి మూడు స్టడీ ప్రాజెక్టులు ఎంపిక గంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుంచి మూ డు జిజ్ఞాస స్టూడెంట్ ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ఇంగ్లిష్, కెమిస్ట్రీ, బోటనీ సబ్జెక్టుల నుంచి ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. సంబంధిత విద్యార్థులను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. -
శుక్రవారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2026
కల్యాణ వైభోగమే..వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న దత్తత ఆలయం నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో రమాదేవి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం 10.30 గంటలకు శ్రీభూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కన్యదాతలుగా రాచకొండ రామాచార్యులు సంధ్య, కల్యాణోత్సవ దాతలుగా కరీంనగర్కు చెందిన కోటోజు శ్రీనివాస్ సుష్మ వ్యవహరించారు. స్వామివారిని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. -
ప్రభుత్వం సైలెన్స్
‘సెస్’ లైసెన్స్..● కోర్టుపైనే ‘సెస్’ పాలకవర్గ ఆఖరు ఆశలు ● ఎన్పీడీసీఎల్ స్వాధీనం చేసుకుని నేటికి నెల ● విద్యుత్ వినియోగదారుల మిశ్రమ స్పందనసిరిసిల్ల: జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ (సెస్) పాలకవర్గం ఆశలన్నీ కోర్టుపైనే ఉన్నాయి. ఐదేళ్లకోసారి ‘సెస్’ వ్యాపార లైసెన్స్ను రెన్యువల్ చేయాల్సిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) లైసెన్స్ ఇవ్వకుండా ఎన్పీడీసీఎల్ పరిధిలోకి ‘సెస్’ను మార్చుతూ ఏప్రిల్ 1న ఆదేశాలు జారీ చేశారు. ‘సెస్’ను రద్దు చేస్తున్నట్లు టీజీఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ‘సెస్’ సేవలు రద్దయి.. ఎన్పీడీసీఎల్ సేవలు మొదలై శుక్రవారం నాటికి (మే 1వతేదీ) నెల రోజులు అవుతుంది. విద్యుత్ వినియోగదారుల నుంచి ‘సెస్’ రద్దుపై విశ్రమ స్పందన వస్తుంది. 56 ఏళ్లుగా సేవలు అందించే ‘సెస్’ ఉండాలని కొందరు భావిస్తుండగా, ఎన్పీడీసీఎల్ సేవలే బాగున్నాయని మరికొందరు భావిస్తున్నారు. ‘సెస్’ ఉనికి కరువై నెల 2026 మార్చి 31తో ‘సెస్’ లైసెన్స్ గడువు ముగియడంతో సిరిసిల్ల ప్రాంతంలో విద్యుత్ పంపిణీ సేవలను ఉత్తర డిస్కంలో విలీనం చేశారు. ‘సెస్’ను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుని వ్యాపార కార్యక్రమాల నిర్వహణకు వీలుగా ఎన్పీడీసీఎల్కు టీజీఈఆర్సీ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 1న ‘సెస్’ను ఎన్పీడీసీఎల్ అధికారులు ఆధీనంలోకి తీసుకుని విద్యుత్ పంపిణీ సేవలు అందిస్తున్నారు. సెస్ పాలకవర్గం పదవీ కాలం మరో 20 నెలలు ఉండగా, నోటీసు కూడా ఇవ్వకుండా, లైసెన్స్ రెన్యూవల్ చేయకుండా సంస్థను రద్దు చేయడాన్ని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, వినియోగదారులు ఓట్లు వేసి ఎన్నుకున్న పాలకవర్గ పదవీ కాలం ఉండగానే, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ‘సెస్’ ఉసురు తీస్తున్నారని పేర్కొంటూ కోర్టులో కేసు వేశారు. జస్టిస్ వై.రేణుక ఈ కేసు విచారణకు స్వీకరించారు.. ‘సెస్’ విషయంలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులు ఒక్క మాటైనా మాట్లాడకుండా నెల రోజులుగా సైలెంట్గా ఉండటం విశేషం. సంస్థను ఎన్పీడీసీఎల్లో విలీనం చేసిన అంశాన్ని వినియోగదారులు పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. సిరిసిల్లపైనే ఫోకస్ ‘సెస్’ను ఎన్పీడీసీఎల్లో విలీనం చేసుకుంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 3 లక్షల మందికిపైగా వినియోగదారులున్న సంస్థను టేకోవర్ చేస్తే అవాంఛనీయ ఘటనలను ఏమైనా చోటు చేసుకుంటాయని అంచనా వేశారు. ఈ మేరకు ఏప్రిల్ 1న సంస్థను ఆధీనంలోకి తీసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎంతో బిజీగా ఉంటే ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి ‘సెస్’లో సమీక్షలు నిర్వహించి విద్యుత్ పంపిణీలో వినియోగదారులకు ఇబ్బందులు రానీయొద్దని అన్ని స్థాయిల అధికారులకు స్పష్టం చేశారు. నెల రోజుల్లో సిరిసిల్ల ప్రాంతాన్ని నాలుగు సార్లు సందర్శించి విద్యుత్ సేవలపై ఫోకస్ పెంటారు. ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లోనే పర్యటించారు. ‘సెస్’ ఎండీ భిక్షపతిని బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో ఎస్ఈగా వేణుమాధవ్ నియమించారు. కొత్త విద్యుత్ సబ్స్టేషన్లకు భూసేకరణలో నిమగ్నమయ్యారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమలోని పవర్లూమ్స్ కేటగిరిని మార్చుతూ రూ.10 కోట్ల విలువైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను స్టోర్స్కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న విద్యుత్ విధానాలను అమలు చేస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వినియోగదారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ముందుచూపుతో జిల్లాపై ఫోకస్ పెట్టారు. జిల్లాలో కొత్త తరహా విద్యుత్ పంపిణీ సేవలు అందుబాటులోకి రావడంతో ఒక వర్గం వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పెద్దలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. మరో వైపు సంస్థ ఉసురు తీయొద్దని మరో వర్గం కోరుతున్నారు. వేసవి సెలవుల గండం ‘సెస్’ విలీనంపై హైకోర్టు సోమ, మంగళవారాల్లో విచారించే అవకాశం ఉంది. కోర్టు విచారణపైనే పాలకవర్గం ఆశలు సజీవంగా ఉన్నాయి. కానీ, ఆ రెండు రోజుల్లో హైకోర్టులో విచారణకు రాకుంటే.. కోర్టుకు వేసవి సెలవులు కావడంతో మళ్లీ జూన్లో విచారణ ఉండే అవకాశం ఉంది. ‘సెస్’ను ఎన్పీడీసీఎల్ అధికారులు స్వాధీనం చేసుకుని నెల అవుతుండగా, ఎన్పీడీసీఎల్ అధికారులు ఆ సంస్థ’ యంత్రాంగంతోనే పనులు చేయిస్తుండగా, పాలకవర్గం మాత్రం ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. -
వేములవాడ మున్సిపల్ కమిషనర్గా అన్వేశ్
వేములవాడ: వేములవాడ మున్సిపల్ కమిషనర్గా అన్వేశ్ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ఇక్కడ పని చేస్తున్న సంపత్కుమార్ను హైదరాబాద్ కార్యాలయానికి, మంచిర్యాలలో పని చేస్తున్న అన్వేశ్ను వేములవాడకు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో అన్వేశ్ను మంచిర్యాలకు బదిలీ చేశారు. తిరిగి ఆయన సేవలను వినియోగించుకునేందుకు వేములవాడకు బదిలీ చేశారు. గతంలో పని చేసిన అనుభవం ఉండడంతో పట్టణంలో మెరుగైన సేవలందుతాయని పాలకవర్గ సభ్యులు, అధికారులు, స్థానికులు భావిస్తున్నారు. -
ఫలించిన కూలి పోరాటం
సిరిసిల్లటౌన్: పవర్లూమ్స్, వైపని కార్మికుల కూలి పోరాటం ఫలించింది. గురువారం యజమానులతో జరిగిన చర్చలు ఫలించాయి. గురువారం పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘంలో యజమానులు, పవర్లూమ్ వార్పిన్, వైపని కార్మికుల కూలిపై చర్చలు జరిపారు. అనంతరం పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ మాట్లాడుతూ, పవర్లూమ్, వైపని కార్మికుల కూలి పెంపు అగ్రిమెంట్ జరిగిందని, వార్పిన్ కార్మికుల కూలి సమస్య పరిష్కారం కాలేదన్నారు. పవర్లూమ్ కార్మికులకు చిన్న పన్నకు 28 పైసలు, పెద్దపన్నకు 29 పైసలు ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగిందన్నారు. వైపని కార్మికులకు పాలిస్టర్ వెయ్యి పోగులకు రూ.100 ఇవ్వడానికి అంగీకారం కుదిరిందన్నారు. ఇట్టి కూలి మే 1 నుంచి అమలుకు యజమానులు సమ్మతించారని పేర్కొన్నారు. వార్పిన్ కార్మికుల కూలి అగ్రిమెంటు జరగని నేపథ్యంలో వారి సమ్మె యథాతథంగా కొనసాగిస్తామన్నారు. యజమానుల సంఘం అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, కార్యదర్శి ఆంకారపు రవి, గోవింద్ రవి, దూడం శంకర్, దూస భూమయ్య, బండారి అశోక్, మండల బాలరాజ్, శ్రీరామ్ సత్యం, కోడం రమణ, సిరిమల్లె సత్యం, ఉడుత రవి, మచ్చ వేణు, ఒగ్గు గణేశ్, ఎలిగేటి శ్రీనివాస్, కుసుమ గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అచ్చయ్యకుంటకు ఎల్లంపల్లి నీరు
రుద్రంగి(వేములవాడ): రుద్రంగిలో తాగునీటి కొరత రాకుండా విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు నాగారం చెరువు, అచ్చయ్యకుంటకు ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు, సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి పేర్కొన్నారు. అచ్చయ్య కుంటకు నీరు తరలించే ఎల్లంపల్లి కాలువను గురువారం పరిశీలించారు. ఎండిపోతున్న పంట పొలాలకు మూడుసార్లు, ఇప్పుడు తాగునీటి కోసం మందుచూపుతో ఎల్లంపల్లి నీటిని విడుదల చేయిస్తున్న విప్ ఆదికి రుద్రంగి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీ కార్యదర్శి గడ్డం శ్రీనివాస్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ సిరిసిల్ల
సిరిసిల్లటౌన్: ప్రజల బాధ్యతాయుత భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సిరిసిల్ల సాధ్యమైందని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. గురువారం బల్దియా ఆధ్వర్యంలో స్థానిక రిసోర్స్ పార్క్లో నిర్వహించిన వేస్ట్ టు కంపోస్ట్ విండ్రో– వర్మి కంపోస్టింగ్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఇంటింటా తడి చెత్త సేకరణ నుంచి కంపోస్ట్ తయారీ వరకు అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. పట్టణాలను స్వచ్ఛతగా తీర్చిదిద్దడంలో పారిశుధ్య కార్మికులది చాలా కీలకమైన పాత్రన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో తడి పొడి, హానికరమైన చెత్తలను వేరు చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో వేయడాన్ని పూర్తిస్థాయిలో అరికట్టామని వివరించారు. కార్యక్రమానికి వివిధ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు హాజరై సిరిసిల్ల బల్దియా పరిధిలో నిర్వహిస్తున్న పద్ధతులను పరిశీలించి అభినందించారు. కంపోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హేమలత పాల్గొన్నారు. -
ఆదమరిస్తే అంతే..
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట ప్రమాదం పొంచి ఉంది. మున్సిపల్ డ్రైనేజీపై వేసిన సిమెంట్ మూతలు శిథిలం కావడంతో ఆదమరిస్తే.. చాలు.. కాలు విరగడం ఖాయమన్నట్లుగా ఉంది. ఇప్పటికే పలువురు ఆ శిథిలాల్లో పడి గాయపడ్డారు. మున్సిపల్ అధికారులు షాపుల అద్దైపె ఆసక్తి చూపుతున్నారే తప్ప.. ఆ షాపుల ముందు పొంచి ఉన్న ప్రమాదాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కొనుగోలు కేంద్రాల్లోనే గిట్టుబాటు ధర
● కలెక్టర్ గరీమా అగ్రవాల్తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా టార్పాలిన్లు, గన్నీ సంచులు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే ముందే ప్యాడీ క్లీనర్లను ఉపయోగించి నాణ్యతను పెంచుకోవాలని పేర్కొన్నారు. కేటాయించిన మిల్లులకు మాత్రమే ధాన్యం పంపాలని, సేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ విజయ్ప్రకాశ్రావు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
బోయినపల్లిలో..
బోయినపల్లి(చొప్పదండి): గంగాధరలో నడిచే బోయినపల్లి గురుకులం విద్యార్థి మాచర్ల ఉమేశ్చంద్ర 575 మార్కులతో మండల టాపర్గా నిలిచాడు. కొదురుపాక హైస్కూల్ విద్యార్థి మహేశ్వరి 565, విలాసాగర్ హైస్కూల్ నుంచి ఆర్.హారిక 558, బోయినపల్లి కేజీబీవీ విద్యార్థి కె.మన్మిత 551, ఎ.సంజనాశ్రీ 545, మోడల్స్కూల్ విద్యార్థులు డి.గాయత్రి 547, బి.శరణ్య 545 మార్కులు సాధించారు. మండలంలో మొత్తం 301 మందికి 299 మంది ఉత్తీర్ణులు అయ్యారని ఎంఈవో ఎన్.శ్రవణ్కుమార్ తెలిపారు. ఉమేశ్చంద్ర ఆర్.హారికమహేశ్వరి -
గంభీరావుపేటలో..
గంభీరావుపేట: మండలంలోని నర్మాల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన సంజన 568, లింగన్నపేట జెడ్పీహెచ్ఎస్కు చెందిన ప్రణవి 565, కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ నుంచి న ర్మద 564 మార్కులు సాధించారు. మండలంలో 15 ఉన్నత పాఠశాలలు ఉండగా కొత్తపల్లి, లింగన్నపేట, మల్లారెడ్డిపేట, ముచ్చర్ల, గోరింటాల, నర్మా ల గురుకుల పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. నర్మద ప్రణవి సంజన -
తంగళ్లపల్లిలో..
తంగళ్లపల్లి: మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థి ఎ.నిక్షిత 579, నేరెళ్ల గురుకులం విద్యార్థి ఎం.హారిక 577, మండెపల్లి మోడల్ స్కూల్ నుంచి పి.కౌశిక్ 575, కె.సృహిత్కుమార్ 571, ఎల్.నవీన్ 568, బద్దెనపల్లి గురుకులం విద్యార్థులు పి.భావన 569, జి.రిషిత 562, జి.శ్రీనిధి 557, పి.తేజస్విని 557, పి.సంజనప్రియ 555, తాడూరు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు గొడుగు అరవింద్ 555, గడప లక్ష్మీప్రణవిక 554, కోస్ని అలేఖ్యశ్రీ 553, బోయిని శివ 538, మీస నిహాల్ 533, బొల్గం సిరిచందన 523, గొట్ల వికాస్ 517, ఆయేషా సిద్దికా 515, పల్లాపు హారిక 509 మార్కులు సాధించారు. మండలంలో 663 మందికి 638 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో బి.రాజునాయక్ తెలిపారు. -
సర్కారు బడి పిల్లలు..
ఫలితాల్లో మెరికలు పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు పదో తరగతి ఫలితాలు బుధవారం వెలువడగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అత్యుత్తమ మార్కులు సాధించారు. వివరాలు.. ముస్తాబాద్లో.. ముస్తాబాద్: మండలంలోని నామాపూర్ మోడల్స్కూల్కు చెందిన 94 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా, వందశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ కొండల్రెడ్డి తెలిపారు. సాయిత్రైలోక్ 572 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచాడు. కె.శ్రీహర్ష, జి.తేజస్విని 570, వి.శ్రీనిధి 567, జె.శ్రీనిధి 565 మార్కులు సాధించారు. నామాపూర్ జెడ్పీ స్కూల్ విద్యార్థి బూస ప్రణవి 576 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయం విద్యార్థులు ఎ.వర్షిత్ 571, ఎం.సాయిరామ్ 568, భవిత్ 557,కస్తూరిబా బాలికల విద్యాలయంలో లాస్య 550, ఆవునూర్ జెడ్పీస్కూల్లో గంగాడి స్నేహిత 571, గన్నె హరిక 568, కొత్తపల్లి లక్ష్మీప్రసన్న 559, రేగుల సాహిత 558, ముస్తాబాద్ జెడ్పీ స్కూల్లో ఎన్.వైష్ణవి 556, కె.అక్షిత 555, బందనకల్లో అయోషా 544, హర్షవర్థిని 544, శ్రీజ 527, లిఖిత 517, కొండాపూర్లో అనన్య 540, ప్రశాంత 527, పోతుగల్ బాలుర పాఠశాలలో భూక్య రాకేశ్ 523, బొడ్డు సాత్విక్ 520, గూడెంలో అశ్విత 536, రాధిక 531, చీకొడులో పి.సౌమ్య 564, భవాని 522 మార్కులు సాధించారు. మండలంలో మొత్తం 555 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 554 మంది ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి తెలిపారు. కె.శీరిషా సాయి త్రైలోక్ గంగాడి స్నేహిత తేజస్విని గన్నె హరిక లాస్య -
చందుర్తి సీఐకి డీఎస్పీగా పదోన్నతి
సిరిసిల్ల/చందుర్తి: జిల్లాలోని చందుర్తి సీఐగా పని చేస్తున్న గాండ్ల వెంకటేశ్వర్లుకు డీఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీగా పదోన్నతి పొందిన వెంకటేశ్వర్లుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఐటీఐ కాలేజీలో అడ్మిషన్లుసిరిసిల్ల: జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లి ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ కవిత తెలిపారు. 2026–27 సంవత్సరానికి (ఒకటి, రెండు సంవత్సరాల) కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రకటించారు. ఎలక్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్మెన్ సివిల్, వెల్డర్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్సెస్సీ మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్స్, టీసీ, ఆధార్కార్డు, రెండు పాస్పోర్టుసైజ్ ఫొటోలు, మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రస్తో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పని చేసేవారికి గుర్తింపువేములవాడ: పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని ఈవో రమాదేవి అన్నారు. ఆలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న వెంకటలక్ష్మికి పర్యవేక్షకులుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఉద్యోగులపై మరింత బాధ్యత పెరుగుతుందన్నారు. డీఈవో భాస్కరశర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల కమీషన్ విడుదల ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో మహిళా సంఘాలు చేపట్టిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రెండు సీజన్ల కమీషన్ డబ్బులు గ్రామైక్య సంఘాల ఖాతాల్లో జమ చేశామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.గీత బుధవారం ప్రకటనలో తెలిపారు. 2024–25లో రబీ, ఖరీఫ్ సీజన్లలో చేపట్టిన ధాన్యం సేకరణలో మహిళా సంఘాలకు చెల్లించాల్సిన కమీషన్లు రూ.7.59 కోట్లు విడుదల చేశామన్నారు. సమాచార లోపంతో మహిళా సంఘాల బాధ్యులు బ్యాంక్ ఖాతాలు చూసుకోలేదని పేర్కొన్నారు. ట్రాక్టర్ను ఢీకొన్న బైక్.. యువకుడి పరిస్థితి విషమంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఇంటికి బైక్పై వస్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ గ్రామానికి చెందిన సుల్తాని అంజిరెడ్డి కుమారుడు సాకేత్రెడ్డి హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం ఇంటికి హైదరాబాద్ నుంచి తన బైక్పై వస్తుండగా, రాచర్లగొల్లపల్లి పెట్రోల్ పంపు సమీపంలో ట్రాక్టర్ రోడ్డుకు అడ్డు రావడంతో ఢీకొని కిందపడగా తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాదులోని హాస్పిటల్కు తరలిస్తున్నట్లు సమాచారం. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వేములవాడఅర్బన్: రోడ్డు ప్రమాదంతో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. బోయినపల్లి మండలం విలాసాగర్కు చెందిన ఎస్.రవి (35)బుధవారం వేకువజామున వేములవాడకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా నాంపల్లి శివారులోని సిరిసిల్ల– కరీంనగర్ రహదారిలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. రవి ఇటీవలే గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతవేములవాడరూరల్: వేములవాడ మండలం లింగంపల్లి ఇసుక రీచ్ నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై వెంకట్రాజం తెలిపారు. చెక్కపల్లికి చెందిన ట్రాక్టర్ 27వ తేదీ ఆన్లైన్లో అనుమతులు తీసుకుని 29వ తేదీ బుధవారం ఇసుక తీసుకెళ్తుండగా గ్రామ శివారులో తనిఖీ చేసి పట్టుకున్నట్లు ఎస్సై వివరించారు. వ్యక్తిపై కేసు చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కళాజ్యోతి సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జిల్లెల్ల రమేశ్ తెలిపారు. వివరాలు.. మండలంలోని నర్సింగపూర్కు చెందిన నాగుల తిరుపతి తన ఇంటిపై బ్యాంకు రుణం తీసుకునేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం పంచాయతీ కార్యదర్శి కళాజ్యోతి సంతకాన్ని ఫోర్జరీ చేసి హౌజింగ్ లోన్కు దరఖాస్తు చేసుకున్నాడు. రుణం మంజూరు చేసే బ్యాంక్ ప్రతినిధి వెరిఫికేషన్ కోసం పంచాయతీ కార్యదర్శి వద్దకు రాగా, సంతకం ఫోర్జరీ అని తేలింది. దీంతో తిరుపతి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నకిలీ స్టాంపులు, డ్యాకుమెంట్ తయారు చేసిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
ఇల్లంతకుంటలో..
ఇల్లంతకుంట: మండలంలోని రహీంఖాన్పేట మోడల్స్కూల్ విద్యార్థి మెడకొక్కుల హర్షిని 588 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. బోడ సాయిహర్షితకు 586 మార్కులు వచ్చినట్లు ప్రిన్సిపాల్ గంగాధర్ తెలిపారు. రేపాక ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బొడ్డు వర్షినికి 587 మార్కులు సాధించింది. బాలికల గురుకులం నుంచి మాందాడి హనీ 586, బాలసాని రుచిత 580 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ సంధ్యారాణి తెలిపారు. కేజీబీవీ నుంచి వాడే లాస్యరెడ్డి 575, బి.సహస్ర 572 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ శిరీష పేర్కొన్నారు. మండలంలో 506 మందికి 505 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో శ్రీనివాస్గౌడ్ తెలిపారు.బోడ సాయిహర్షిత బాలసాని రిషితమెడకొక్కుల హర్షిని బొడ్డు వర్షిని -
కూలి పెంచే వరకు పోరాడుతాం
సిరిసిల్లటౌన్: కూలి పెంచే వరకు పవర్లూమ్, వార్పిన్, వైపని కార్మికుల పోరాటం కొనసాగుతుందని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ అన్నారు. బుధవారం మూడో రోజు సమ్మెలో భాగంగా సిరిసిల్ల బీవైనగర్లోని చేనేత, జౌళిశాఖ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టి మాట్లాడారు. మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా యజమానులు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే కూలి పెంచేలా చర్యలు తీసుకోవాలని లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేనేత, జౌళిశాఖ ఏడీకి వినతిపత్రం అందించారు. నాయకులు అన్నల్దాస్ గణేశ్, సిరిమల్ల సత్యం, ఉడత రవి, కుమ్మరికుంట కిషన్, ఎక్కల్దేవి జగదీశ్, సబ్బని చంద్రకాంత్, భాస శ్రీధర్, గడ్డం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రైస్మిల్ కార్మికుని ఇంటా ఎస్సెస్సీ టాపర్
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని నామాపూర్కు చెందిన బూస మల్లేశ్, మణేమ్మ దంపతుల రెండో కూతురు ప్రణవి పదో తరగతిలో 576 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. నామాపూర్ జెడ్పీ పాఠశాలలో చదివింది. మల్లేశ్ ఓ రైస్మిల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మణేమ్మ బీడీ కార్మికురాలు. డాక్టర్ చదివి ఊర్లో వైద్యం అందించాలన్నదే తన టార్గెట్ అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది ప్రణవి. కేవీ రమణాచారి స్ఫూర్తి.. ఎల్లారెడ్డిపేట: తమ గ్రామానికి చెందిన రిటైర్డ్ కలెక్టర్, ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారిని ఆదర్శంగా తీసుకొని సివిల్స్ సాధించడమే లక్ష్యంగా చదువు కొనసాగిస్తానని పదో తరగతిలో 572 మార్కులు సాధించిన సూర స్నేహలత తెలిపింది. మండలంలోని నారాయణపూర్కు చెందిన సూర చంద్రయ్య– గంగ దంపతుల కూతురు స్నేహలత స్థానిక జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదివింది. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ తమ కూతురును ఉన్నతంగా చూడాలనే లక్ష్యంతో చదివించారు. వారి ఆశలను నెరవేర్చాలని ముందు నుంచి చదువులో కష్టపడుతూ 572 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. -
‘పది’లో ‘అల్ఫోర్స్’ విద్యార్థుల హవా
కొత్తపల్లి(కరీంనగర్): పదోతరగతి 2025–26 వార్షిక పరీక్షల ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులతో హవా కొనసాగించారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించినవారిని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్రెడ్డి అభినందించారు. అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కు చెందిన ఆర్.సాత్విక్ 589/600 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ఓ.ఆద్య, టి.రాజు, బి.అక్షిత్ రెడ్డి 588 మార్కులు సాధించినట్లు తెలిపారు. 1,274 మందికి 1,026 మంది 500 మార్కులు, ఆపై సాధించడం అభినందనీయమన్నారు. 48 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా సాధించగా. 334 మంది విద్యార్థులు 560 మార్కులు పైగా సాధించి సత్తాచాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నేత కుటుంబంలో మండల టాపర్
కోనరావుపేట: మండలకేంద్రానికి చెందిన బోగ చక్రపాణి–స్వాతి దంపతుల కుమారుడు విజయ్కుమార్ 573 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచాడు. చక్రపాణి టేలరింగ్ వృత్తి చేసుకుంటుండగా తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. విజయ్కుమార్ను స్థానిక మోడల్ స్కూల్లో చదివిస్తున్నారు. కనగర్తికి చెందిన జిల్లెల్ల తిరుపతిరెడ్డి– రేఖ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి కుమారుడు వరుణ్ కోనరావుపేట మోడల్ స్కూల్లో చదువుతూ 570 మార్కులు సాధించి మండలంలో సెకండ్ టాపర్గా నిలిచాడు. వరుణ్ సోదరి వర్ష 2024లో 9.7 జీపీఏ సాధించి బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికై ంది. -
భీమన్న ఆలయంలో కమిషనర్ పూజలు
వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా భీమేశ్వర సదన్ అతిథి గృహానికి చేరుకున్న కమిషనర్కు ఆలయ ఈవో రమాదేవి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకోగా, అర్చకులు, వేద పండితులు స్వస్తివాచకంతో స్వాగతం పలికారు. తర్వాత స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకుని, ఆలయ మండపంలో తీర్థప్రసాదం, ఆశీర్వచనం స్వీకరించారు. ఆలయ ఈవో స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈసందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై కమిషనర్ ఆరా తీశారు. క్యూలైన్లు, శానిటేషన్ ఏర్పాట్లు పరిశీలించి, ఎండాకాలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన చర్యలను సమీక్షించారు. లడ్డూ తయారీ కేంద్రం, ఆలయంలో నిర్వహిస్తున్న ఈ–టికెటింగ్ సేవలను పరిశీలించారు. గోశాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. పశుగ్రాసాన్ని స్వయంగా కోడెలకు అందించి, అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు. కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు పరిశీలించారు. ఎండోమెంట్ అడ్వైజర్ గోవిందహరి, క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, ఆలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో నకిలీ విత్తనాల నియంత్రణ, సన్న వడ్లు, ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంపు, ఫార్మర్స్ రిజిస్ట్రీ అంశాలపై కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు రూపొందించిన కరపత్రాలను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా వ్యవసాయ, పోలీస్ శాఖ సంయుక్తంగా దాడులు చేయాలని, ఏమైనా విక్రయాలు ఉంటే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నేరుగా వచ్చి విత్తనాలు విక్రయించే వారి వద్ద రైతులు తీసుకోవద్దని కలెక్టర్ సూచించారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ పూర్తి చేయండి జిల్లాలో ఫార్మర్స్ రిజిస్ట్రీ ఇప్పటిదాకా 73 శాతం పూర్తి చేశారని కలెక్టర్ వెల్లడించారు. వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలు, రైతులను నేరుగా కలిసి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో సన్న వడ్లు సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. ఆయిల్పాం సాగు ద్వారా అధిక దిగుబడి, దీర్ఘకాలంపాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్బాబు, జిల్లా సహకార అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. -
డీపీఆర్వోకు అభినందనలు
సిరిసిల్ల: జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఏడుకొండలు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. డీపీఆర్వో ఆఫీస్లో మంగళవారం రాష్ట్ర గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డీపీఆర్వోకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ విద్యుత్ ఉపకేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫీడర్ బ్రేకర్ పనులను టీజీఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ అన్నపూర్ణ మంగళవారం పరిశీలించారు. ‘విద్యుత్ ప్రజా బాట’లో భాగంగా గ్రామ సర్పంచ్, రైతులు కోరిన మేరకు పరిశ్రమలకు, గ్రామానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్త ఫీడర్ బ్రేకర్ మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. రైతులకు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఈ గోపికృష్ణ, డీఈలు చంద్రమౌళి, అంజయ్య, ఏడీఈలు ప్రశాంతి, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలిసిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి అవకాశాలను ట్రాన్స్జెండర్స్ సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హన్మంతు అన్నారు. మంగళవారం సిరిసిల్ల కోర్టు ఆవరణలో జిల్లా పరిశ్రమల శాఖ, ఇన్ఫోసెమ్ సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్స్కు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఉపాధి అవకాశాలు కనిపించని స్థితిలో చాలామంది ట్రాన్స్జెండర్స్ భిక్షాటన వంటి పరిస్థితుల్లో గడుపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల(పీఎంఎఫ్ఎంఈ)తో ఉపాధి పొందాలన్నారు. ఇందుకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు మార్కెటింగ్ మద్దతు కలిగిస్తుందన్నారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలు దేశాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయని, వాటికి కూడా ప్రభుత్వం రుణాలు, సబ్సిడీ అందిస్తుందని, యువత, ట్రాన్స్జెండర్స్ ప్రభుత్వ చేయూతను అందిపుచ్చుకోవాలని కోరారు. సదస్సులో అసిస్టెంట్ మేనేజర్ శివసాయికృష్ణ, ఇన్ఫోసెమ్ అధ్యక్షులు మహేశ్, దినేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎఫ్డీపీతో మత్స్యకారులకు మేలురుద్రంగి: ఎన్ఎఫ్డీపీతో మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా ఫిషరిష్ ఆఫీసర్ సౌజన్య పేర్కొన్నారు. మంగళవారం నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ (ఎన్ఎఫ్డీపీ)పై మండలకేంద్రంలోని సంఘ భవనంలో గంగపుత్రులకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన గంగపుత్ర ఆడ, మగ సభ్యులు ఎన్ఎఫ్డీపీ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. లేకుంటే మత్స్యకార సంక్షేమ పథకాలు, ప్రమాద బీమా అందయని వివరించారు. ఈ నెల 30 వరకు పోర్టల్లో నమోదుకు అవకాశం ఉందన్నారు. ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్, అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్ కిరణ్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ధర్మేందర్, సభ్యులు పాల్గొన్నారు. -
అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా
● ఎస్పీ మహేశ్ బి గితే సిరిసిల్ల: జిల్లాలో అసాంఘిక శక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, కేసు ఏదైనా నిందితులకు శిక్ష పడేలా సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ఆఫీస్లో జరిగిన నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రజలు, వ్యాపారస్తులను భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పెట్రోలింగ్ సమయాల్లో రౌడీ, హిస్టరీ షీట్స్ ఉన్నవారిని తనిఖీ చేయాలని ఆదేశించారు. గంజాయి రవాణా చేసే వ్యక్తులతో పాటు సేవించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను తప్పించుకుని తిరుగుతున్న నిందితులను పట్టుకోవాలన్నారు. పోలీస్స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, పెండింగ్ అంశాలను సమీక్షించారు. ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణలో వాహనాల పాత్ర కీలకం జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా నేర సమాచారం అందిన వెంటనే బ్లూకోల్ట్, పెట్రోకార్ సిబ్బంది ఘటన స్థలానికి వేగంగా చేరుకోవడం ఎంతో కీలకమని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్ ఆవరణలో పోలీస్ వాహనాల కోసం నూతనంగా నిర్మించిన షెడ్ను ప్రారంభించి మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు రక్షణ కల్పించడంలో వాహనాలు ఎంతో అవసరమన్నారు. పోలీసులు క్షేత్రస్థాయిలో తక్షణమే స్పందించించేందుకు పెట్రోకార్, బ్లూ కోల్ట్ వాహనాల కండిషన్ బాగుండాలన్నారు. పోలీసు అధికారులతో కలిసి షెడ్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్లకు కేటాయించిన పెట్రోకార్ వాహనాలను తనిఖీ చేసి వాటి నిర్వహణపై ఆరా తీశారు. -
ఇంటర్ బోర్డు నిఘా పెట్టాలి
ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పేరుతో టీచర్లు, అధ్యాపకులను మానసికంగా వేధించడం మానుకోవాలి. సెలవు దినాల్లోనూ పనులు చేయించుకునే పద్ధతికి స్వస్తి చెప్పాలి. టీచర్లు, అధ్యాపకులను బోధనేతర పనులకు ఉపయోగించుకోవడం సరికాదు. వర్క్షాపుల పేరుతో మానసిక ఇబ్బందులకు గురి చేస్తే స హించేదిలేదు. ఇన్ని చేస్తున్నా చాలా విద్యాసంస్థల్లో జీతాలు కూడా సరిగా ఇవ్వ డం లేదు. ఇలాంటి యాజమాన్యాలపై ఇంటర్బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలి. – కె.రాణాప్రతాప్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి -
డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రచారం చేయాలి
సిరిసిల్ల: డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగంతో దుష్ప్రభావాలపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డీ అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభించామని, డ్రగ్స్ బాధితులకు చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఏఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ, డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలపై పోలీస్, ఎకై ్సజ్, విద్య, వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నామన్నారు. వివిధ షాపులలో నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష పేర్కొన్నారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు, ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, కార్మికశాఖ అధికారి నజీర్అహ్మద్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ పాల్గొన్నారు. -
బతుకు పోరాటం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘మీ ఇంట్లో పిల్లలు ఎంత మంది. ఏం చదువుతున్నారు. ఎక్కడ చదువుతున్నారు.. మా పాఠశాల/కళాశాలలో చేర్పించండి. నాణ్యమైన బోధన ఉంటుంది. ఫలితాలు చూడండంటూ’ పేపర్లు చూపుతున్నారు. సీటు ఇప్పుడు కన్ఫార్మ్ చేసుకుంటే ఫీజులో రాయితీ ఇప్పిస్తామంటూ చెబుతున్నారు. తల్లిదండ్రుల నంబర్లు తీసుకుని రోజూ నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తున్నారు. తమకు టార్గెట్లు ఉన్నాయంటూ వేడుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు లేక 45 డిగ్రీల సెల్సియస్ ఎండల్లో ఉదయం, సాయంత్రం యాజమాన్యాలు ఇచ్చిన టార్గెట్ల కోసం కష్టపడుతున్నారు. మండే ఎండలు ఒకవైపు, వీధి కుక్కలు మరోవైపు, పిల్లల కోసం తలుపులు తడితే ఛీత్కరించుకునే ఇంటి యజమానుల మాట లను భరించుకుంటూ బతుకు బండి లాగేందుకు ప్రయాసపడుతున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు టీచర్లు. సెలవులు లేని కొలువు పనిచేసేది పాఠశాలలోనైనా సెలవనే మాట ఉండదు. ఆదివారమైనా.. వేసవి సెలవులైనా, పండుగలైనా.. పాఠశాల కోసం పని చేయాల్సిందే. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. యాజమాన్యం ఇచ్చి న టార్గెట్ చేయించకపోతే ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. అందుకే వేసవి సెలవుల్లోనూ ఇంటింటికి తిరుగుతూ ‘మీ పిల్లలను మా విద్యాసంస్థల్లో చేర్పించండి.. ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తాం’ అంటూ తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. మెడపై అడ్మిషన్ల కత్తి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు భారీగా చేయాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఆ సంఖ్యను బట్టే జీతా ల చెల్లింపు.. ఇంక్రిమెంట్లు, ఉద్యోగభద్రత ఉంటుందని చెప్పడంతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. యాజమాన్యాలు టార్గెట్లు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని, ఉదయం, సాయంత్రం సమావేశాలు నిర్వహించి దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో 15 వేల మందికిపైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా అందరిదీ అదే పరిస్థితి.ఉద్యోగులతో వెట్టిచాకిరీ... అడ్మిషన్ల టార్గెట్లే కాకుండా.. యాజమాన్యాలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 10 నుంచి 12గంటలు పని చేయాలని, శని, ఆదివారం, జాతీయ సెలవు దినాలు, పండుగ రోజుల్లోనూ స్కూళ్లు, కళాశాలలకు వెళ్లాల్సిందేనని వాపోతున్నారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదంటున్నారు. టీటీసీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ, ఎంబీఏ తదితర కోర్సులు చేసి ఉపాధి కోసం పని చేస్తున్నామని, ఇక్కడ ఉద్యోగ భద్రత లేకపోగా పని ఒత్తిడి చేస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయులు కరీంనగర్ 298 6,254 రాజన్న సిరిసిల్ల 132 1,555 పెద్దపల్లి 192 4,224 జగిత్యాల 292 3,480 -
చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేయాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. కోడిగుడ్ల పరిమాణం, నాణ్యతను పరిశీలించారు. హబ్ కోఆర్డినేటర్ రోజా, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఈవో వనిత, సర్పంచ్ ఎలగందుల నర్సింలు తదితరులు పాల్గొన్నారు. కిశోర బాలికల సంరక్షణ అందరి బాధ్యత కిశోర బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్లో బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలను నిర్వహించగా, ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకటి నుంచి 18 ఏళ్ల లోపు బాలికల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. తల్లిదండ్రుల సత్ప్రవర్తన, క్రమశిక్షణపైనే బాలికల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ, తహసీల్దార్ ఫారూక్, ఎంపీడీవో లచ్చాలు, ఏఎస్సై ఘనీ, సీడీపీవో ఉమారాణి, షీటీం ఇన్చార్జి ప్రమీల, సఖీ ఇన్చార్జి రోజా, సూపర్వైజర్ అనూష, ఉపసర్పంచ్ కృష్ణ, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షుడు ధర్మేందర్, శ్రీనివాస్, రాజు, వెంకట్రావు పాల్గొన్నారు. -
డబ్బు ఇప్పించాలి
hÌêÏ-ÌZ 2024&-25ÌZ ÐólçÜÑ, Ðé¯éM>ÌS… ïÜf¯ŒS-ÌSMýS$ çÜ…º…«¨…_ 189 IMóSï³ «§é¯]lÅ… Mö¯]l$-VøË$ MóS…{§é-ÌS¯]l$ HÆ>µr$ ^ólÔ>Æý‡$. hÌêÏ A«¨M>Ç ¯]lÐ]l$Ã-M>°² Ð]lÐ]l¬Ã ^ólĶæ$-MýS$…yé Ð]l$íßæ-âýæ-Ë$ A…™ól _™èl¢-Ô¶æ$-¨®™ø «§é¯éÅ-°² ò³§ýlª G™èl$¢¯]l õÜMýS-Ç…_ ÇM>Æý‡$z çÜ–íÙt…^éÆý‡$. MìSÓ…sêÌŒæMýS$ {糿¶æ$-™èlÓ… Æý‡*.32 MýSÒ$çÙ¯ŒS CçÜ$¢…¨. Æð‡…yýl$ ïÜf¯ŒS-ÌSMýS$ çÜ…º…«¨…_ 24,54,196 MìSÓ…sêâýæÏ «§é¯]lÅ… õÜMýS-Ç…-^éÆý‡$. C…§ýl$MýS$ V>¯]l$ Ððl¬™èl¢… MýSÒ$çÙ¯ŒS Æý‡*.7,85,34,186 ò³…yìl…-VŠæ-ÌZ E…¨. వేసవి సీజన్ కమీషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన కమీషన్ బకాయిలపై అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. 2024–25 వేసవి సీజన్ మొత్తాన్ని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని గ్రామైక్య సంఘాలకు నిధులు జమ చేశామని స్పష్టం చేశారు. కేవలం ఖరీఫ్ సీజన్ కమీషన్ మాత్రమే బకాయి ఉంటుందని వివరించారు. ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశామని స్పష్టం చేశారు. సివిల్ సప్లై నుంచి వచ్చిన కమీషన్ రూ.6.22కోట్లు త్వరలోనే గ్రామైక్య సంఘాలకు బదిలీ చేస్తామన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు డీపీఎంకు చేరినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు స్పష్టం చేశారు. భారంగా నిర్వహణ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అంతా ఆషామాషీ కాదు. కేంద్రంలో చలువ పందిళ్లు, తాగునీటి ఏర్పాటు, ట్యాబ్, రోజువారీగా ఏడుగురు మహిళలకు వేతనాలు, మాయిశ్చర్ యంత్రాలు, కేంద్రంలో భూమి చదును వంటి పనులు నిర్వాహకులే చూసుకోవాలి. ఏఎంసీలు టార్పాలిన్లు, వేయింగ్ మిషన్లు అందిస్తారు. ఒక్కో కేంద్రం నిర్వహణకు ఖర్చు రెండునెలల్లో రూ.2.50 లక్షల నుంచి రూ.3లక్షల వరకు వస్తుంది. ఇదంతా ముందుగా మహిళా సంఘాలే భరించాలి. ప్రభుత్వం ఇచ్చే కమీషన్ ఆలస్యం కావడంతో అది వారికి భారంగా మారింది. అధికారులు ఇచ్చినప్పుడే కమీషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండడంతో గ్రామైక్య సంఘాలు నిర్వాహణ భారం మోయాల్సి వస్తోంది.పోతుగల్లో గత సీజన్లో మేము ఏడుగురు మహిళలం ధాన్యం సేకరణ కేంద్రం నిర్వహించాం. 23వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించి ఇచ్చాం. దానికి సంబంధించిన కమీషన్లు ఇంకా అందలేదు. ప్రభుత్వం కమీషన్ డబ్బులు ఇచ్చి వీవోలను ఆదుకోవాలి. నిర్వహణకు ఇబ్బంది పడుతున్నాం. – సరిత, గ్రామైక్య సంఘం, పోతుగల్ -
చార్ధామ్ యాత్రికులు వైద్యపరీక్షలు చేయించుకోవాలి
సిరిసిల్ల: జిల్లా నుంచి ఉత్తరాఖంఢ్లోని చార్ధామ్కు వెళ్లే యాత్రికులు వైద్యపరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత కోరారు. ఉత్తరాఖంఢ్ పర్వత ప్రాంతాలు కావడంతో విపరీతమైన చలి ఉంటుందని, ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందక శ్వాసక్రియలో ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. విపరీతమైన చలిగాలి, మంచు వర్షాలతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. శ్వాసక్రియలో భాగంగా గాలి బాగా పీల్చి, వదలడం కనీసం నిత్యం 5–10 నిమిషాలు వ్యాయామం చేయాలని, కనీసం 30 నిముషాలు నడవాలని, రెండు లీటర్ల తాగునీటిని వెంట ఉంచుకోవాలని సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారు, బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు డాక్టర్ సలహా మేరకే చార్ధామ్యాత్రకు వెళ్లాలని స్పష్టం చేశారు. కోనరావుపేట(వేములవాడ): తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం మండల వ్యాప్తంగా ఎరువుల దుకాణా లు పూర్తిగా మూసివేశారు. ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ బంద్ నిర్వహించినట్లు కోనరావుపే ట మండల ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షు డు శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మండలంలో డీలర్లతో కలిసి బైక్ ర్యాలీ తీశారు. సిరిసిల్ల అర్బన్: గ్రామీణ ప్రాంతాల్లోని 10 కేంద్రాలు, రాజీవ్నగర్ మినీస్టేడియంలో నిర్వహించే ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎ.రాందాస్ కోరారు. ఈనెల 28 నుంచి జూన్ 7 వరకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 14 ఏళ్లలోపు బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 72071 91123, 76809 51259లో సంప్రదించాలని తెలిపారు. కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తిలో పంచాయతీ పాలకవర్గం, మహిళా సంఘాల ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని తీర్మానించారు. గ్రామపంచాయతీలో సర్పంచ్ మల్యాల స్వామిదాసు ఆధ్వర్యంలో సోమవారం సమావేశమైన పాలకవర్గం సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు తీర్మానించారు. ఈమేరకు గ్రామంలోని బెల్ట్షాపుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. మే 10 నుంచి గ్రామంలో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం అమలులోకి వస్తుందని తెలిపారు. మద్యం విక్రయిస్తే రూ.10వేలు జరిమానా, సమాచారం ఇస్తే రూ.5 వేలు నజరానా అందించనున్నట్లు తెలిపారు. ఉపసర్పంచ్ వంగపెల్లి శేఖర్, కార్యదర్శి కవితారెడ్డి, వీవో అధ్యక్షురాళ్లు బెంద్రపు జ్యోతి, పుట్ట సంపూర్ణ, సీఏ శోభ, సంఘాల ప్రతినిధులు వసంత, లావణ్య పాల్గొన్నారు. 108లో ఈఎంఈ ఉద్యోగాలుసిరిసిల్లటౌన్: జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసుల్లో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈమేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, సంబంధిత పోస్టులో కనీసం మూడేళ్ల అనుభవంతోపాటు ఆటోమొబైల్ రంగంలో పనిచేసిన అనుభవం గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీతోపాటు, అనుభవ ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. మే 2వ తేదీ కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు 91007 99699లో సంప్రదించాలని కోరారు. -
ప్రజావాణి అర్జీలు పెండింగ్లో పెట్టవద్దు
సిరిసిల్ల అర్బన్: ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్లో పెట్టవద్దని, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 225 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. వేములవాడ మండలం సంకెపల్లిలో పెండింగ్లో ఉన్న 45 ఇండ్లకు నష్టపరిహారంతోపాటు 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు ప్యాకేజీ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కలెక్టర్ స్పందించి నష్టపరిహారంతోపాటు ప్యాకేజీ ఇప్పించాలి. – సంకెపల్లి గ్రామస్తులు -
స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): జూకీ కుట్టుమిషన్లతో స్వయం ఉపాధి పొంది మహిళలు ఆర్థికంగా ఎ దగాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరుగురికి జూకీ కుట్టు మిషన్లను సోమవారం కలెక్టరేట్లో పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మరిన్ని మెలకువలు నేర్చుకుంటూ యూనిఫాంలు, ఆధునిక డిజైన్లతో డ్రెస్సులు కుట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి కలెక్టర్ గరీమా అగ్రవాల్ తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్టైల్ పార్కులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కొనసాగుతుండగా గతంలో పరిశీలించారు. కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. ఆ సమయంలోనే నిరుపేదలకు కుట్టుమిషన్లు ఇస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈమేరకు రామిడి లక్ష్మి, బత్తిని అశ్విని, పోతూరి లావణ్య, దొరగొల్ల ప్రేమలత, పోతూరి నిర్మల, మంద సుమలతకు జూకీ కుట్టుమిషన్లు అందించారు. చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.సంతోష్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి పిల్లలు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, సోషల్మీడియాకు దూరంగా ఉండాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవుల్లో తల్లిదండ్రులకు పనుల్లో సాయం చేస్తూనే, నచ్చిన క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి రజిత, తహసీల్దార్ విజయ ప్రకాశ్రావు, ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, సర్పంచ్ గాధగోని సాగర్, సీడీపీవో ఉమారాణి ఉన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంతోనే పోలీస్శాఖపై నమ్మకం
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● గ్రీవెన్స్ డేకు 36 ఫిర్యాదులు సిరిసిల్ల: ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదును సానుకూలంగా స్వీకరించి ఆ సమస్యను పరిష్కరించాలని, అప్పుడే పోలీస్శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్డేకు 36 మంది బాధితులు వచ్చారు. తమ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఠాణాకు వచ్చిన ఫిర్యాదుదారులతో మార్యదగా ప్రవర్తించాలని సూచించారు. సమస్య పరిష్కారమైతే పోలీస్శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును డీపీవో ఆఫీస్లో ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు సమస్యలు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఎస్పీ వివరించారు. ఫిర్యాదులపై ఆయా పోలీస్స్టేషన్ల ఎస్హెచ్వోలతో ఫోన్లో మాట్లాడి, చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. -
ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
సిరిసిల్లటౌన్: భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ వేడుకలను సోమవారం సిరిసిల్లలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష బంగారు తెలంగాణ సాధించే వరకు పార్టీ కృషి చేస్తుందన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధకుడు కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన ఉంటూ.. సమస్యల సాధనకు పోరాడుతుందని స్పష్టం చేశారు. అనంతరం కొత్త బస్టాండులోని తెలంగాణ తల్లికి పూలమాలలు వేశారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్చైర్మన్ దార్ల సందీప్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీఎస్పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు. వాడవాడల్లో గులాబీ పండుగ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని వార్డుల్లో కౌన్సిలర్లు, పార్టీ వార్డు కమిటీల ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న 3వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు. -
భద్రాచలం బస్సు ప్రారంభం
● జెండా ఊపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడఅర్బన్/వేములవాడరూరల్: వేములవాడ నుంచి భద్రాచలం వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతులమీదుగా ప్రారంభించారు. విప్ మాట్లాడు తూ త్వరలోనే బాసరకు బస్సు ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. డిపో మేనేజర్ శ్రీనివాస్, మున్సి పల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్ ఎలా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు మారుపాకలోని రైతువేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, రైతులకు అవగాహన కార్యక్రమం విప్ ప్రా రంభించి మాట్లాడారు. భూసార పరీక్షలు చేసుకు ని, పంటలు వేసుకోవాలని సూచించారు. డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, సాయికుమార్, సునీతాదేవి, మధుకర్రావు, సాయికిరణ్ ఉన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవా డ రూరల్ మండలం పోచెట్టిపల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరై మాట్లాడారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, సర్పంచ్ చింతపంటి మల్లేశం, రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కూలీ పెంచే వరకు పోరాడుతాం
● యజమానులు వెంటనే కూలీ ఒప్పందం చేపట్టాలి ● పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రోత్పత్తిరంగంలోని కార్మికులు, వైపని, వార్పిన్, అనుబంధ రంగాలు, ఆసాములు కూలీ పెంచే వరకు పోరాడుతామని పలువురు స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ స్థానిక బీవైనగర్లో సోమవారం నిరవధిక సమ్మె శిబిరం ప్రారంభించారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికుల కూలి చర్చలు మాత్రమే జరిగినాయని అగ్రిమెంటు జరగలేదన్నారు. వార్పిన్, వైపని కూలీ చర్చలు జరగాల్సి ఉందన్నారు. కార్మికులు, ఆసాములు అందరి కూలి అగ్రిమెంట్ జరిగే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. పవర్లూమ్ కార్మికులకు 10 పిక్కులకు రూ. 0.28 పైసలు ఇస్తామని యజమానులు ఒప్పుకొని అగ్రిమెంట్ చేయలేదన్నారు. నాయకులు కోడం రమణ, సిరిమల్ల సత్యం, కుమ్మరికుంట కిషన్, కుడిక్యాల కనకయ్య, ఉడుత రవి, ఎలిగేటి శ్రీనివాస్, సబ్బని చంద్రకాంత్, బాస శ్రీధర్, గడ్డం రాజశేఖర్, బెజిగం సురేష్, సర్గం శేఖర్, గోవిందు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ల రవాణాకు సొంత వాహనాలు
సిరిసిల్ల: జిల్లా పరిధిలోని రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఎన్పీడీసీఎల్ డిపార్టుమెంట్ ట్రాన్స్ఫార్మర్ వాహనాలను అందుబాటులో ఉంచినట్లు సిరిసిల్ల సర్కిల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ సోమవారం తెలిపారు. జిల్లా పరిధిలో ఏడు వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు సత్వర సహాయం అందించేందుకు ఉపయోగపడతాయన్నారు. ప్రతీ డివిజన్, సబ్డివిజన్ పరిధిలో డిపార్టుమెంట్ ట్రాన్స్ఫార్మర్ వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన వెంటనే సంబంధిత అధికారికి తెలియజేస్తే డిపార్టుమెంట్ వాహనం ద్వారానే ట్రాన్స్ఫార్మర్ను వంద శాతం తరలిస్తామని తెలిపారు. వ్యవసాయ సీజన్లలో రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు. ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే 1912కు ఫోన్చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అకాల వర్షం.. తడిసిన ధాన్యంబోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం దేశాయిపల్లిలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కురిసిన వర్షంతో ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసిన సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో పలువురు రైతులు ధాన్యం తడిసిందని తెలిపారు. ధాన్యంపై పరదాలు కప్పినా గాలికి లేచిపోయాయి. -
మాజీ మంత్రికి రైతులపై కపట ప్రేమ
● ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొసలి కన్నీరు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రైతుల పట్ల కపట ప్రేమ ఒలకబోస్తే వారు నమ్మే పరిస్థితిలో లేరని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. చందుర్తి మండలం బండపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆదివారం హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరి వేస్తే ఉరి అని ప్రచారం చేసిన విషయాన్ని మరిచి.. కేటీఆర్ శనివారం తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి కొనుగోలు కేంద్రంలో రైతులకు వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కార్చడాన్ని విశ్వసించడం లేదన్నారు. పదేళ్ల అధికారంలో కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 25 వరకు ప్రారంభించిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. రైతుల మనోధైర్యం దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయన్న సంగతి కేటీఆర్ వైఖరితో బహిర్గతమవుతోందని పేర్కొన్నారు. రైస్మిల్లుల్లో స్థలాభావం ఉందని 24 మిల్లుల్లో 1.42 లక్షల టన్నుల, మిగులు ధాన్యం నిలువకు గోదాంలు, అపెరల్ పార్క్ గోదాంలను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బండపల్లి, కిష్టంపేట సర్పంచులు కటకం మల్లేశం, మోకనపల్లి దేవరాజం, పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, జిల్లా ప్రదాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, డైరెక్టర్లు ఏనుగు లచ్చి రెడ్డి, ఖరీం, నాయకులు ముస్కు మల్లారెడ్డి, డాక్టర్ అజీమ్, ఎండీ అన్వర్, తీపిరెడ్డి కరుణాకర్, పురంశెట్టి శేఖర్, ఉపసర్పంచ్ పల్లపు ఇసాక్ పాల్గొన్నారు. -
నీళ్లు తెచ్చుకుంటున్నాం
ఎండలో పనులు చేయాలి. కనీసం టెంట్ సౌకర్యం లేదు. నీళ్లు కూడా లేవు. ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఆ నీళ్లు పని పూర్తయ్యే వరకు సరిపోవడం లేదు. దప్పికతోనే పని చేస్తున్నాం. అధికారులు స్పందించి పనిప్రదేశాల్లో చలువ పందిర్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలి. – దాదే ప్రమీల, ఉపాధిహామీ కూలి సౌకర్యాలు కల్పిస్తున్నాం ప్రస్తుత వేసవిలో ఉపాధిహామీ పనులు చేసే కూలీలకు పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పిస్తున్నాం. కొన్ని గ్రామాల్లో తప్ప అంతటా చలువపందిర్లు వేశాం. అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఉంచుతున్నాం. నీటిబాటిళ్లను కూలీలు ఇంటి నుంచి తెచ్చుకోవాలని సూచిస్తున్నాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తాం. – కొమురయ్య, ఏపీవో, ఎల్లారెడ్డిపేట -
నీడలేని ఉపాధి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): భానుడు భగభగ మండిపోతున్నాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. బయటకు వెళ్లాలంటే జంకే పరిస్థితులు ఉన్నాయి. ఉపాధిహామీ కూలీలు మాత్రం ఎండలోనే పనులు చేస్తున్నారు. అధికారులు నిబంధనలు పాటించడం లేదు. దీంతో జిల్లాలో ఇటీవల ఒక ఉపాధిహామీ కూలీ మరణించగా, ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు. పనిచేసే చోట నీడ లేక.. నీళ్లు లేక.. కూలీలు అల్లాడుతున్నారు. ఉపాధిహామీ కూలీల ఇక్కట్లపై సాక్షి ‘ఫోకస్’. కనీస సౌకర్యాలు కరువు ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలనే నిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదు. కూలీలకు నీడ కోసం టెంట్లు, చలువ పందిర్లు వేయాలి. మెడికల్ కిట్లు, తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. కొన్ని గ్రామాల్లో మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుతున్నా చాలా గ్రామాల్లో కనిపించడం లేదు. నీడ సౌకర్యం లేకపోవడంతో కూలీలు చెట్ల కిందనే సేద తీరుతున్నారు. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అనేక మంది కూలీలు పని చేసే చోటనే చర్మ సమస్యలు, అలసట, తలనొప్పి వంటి ఇబ్బందులకు గురవుతున్నారు. కూలీల దాహం తీర్చేందుకు నీటి వసతి కల్పించడం లేదు. కూలీలే ఇంటి నుంచి బాటిళ్లలో తాగునీటిని తెచ్చుకుంటున్నారు. కానీ వారు తెచ్చుకుంటున్న నీరు సరిపోక ఇబ్బంది పడుతున్నారు. ఓఆర్ఎస్ ప్యా కెట్లు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలలుగా అందని వేతనాలు ఉపాధిహామీ కూలీలు మండుటెండల్లో పనులు చేస్తున్నప్పటికీ రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వేతనాలు రాలేవని కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ఉపాధిహామీ పథకంలో పనులు చేసే కూలీలకు పని ప్రదేశంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. -
డీడీలు చెల్లించినా రావడం లేదు
మేము మూడు రోజుల కిందటే డీజిల్, పెట్రోల్ కోసం బ్యాంకు ద్వారా డీడీలు తీసి పంపించాం. కంపెనీ ఆఫీసర్లతో మాట్లాడుతున్నాం. వస్తుందంటూనే పంపడం లేదు. మా బంకును ఎప్పుడూ మూసివేయకుండా సమర్థంగా నడపాలని భావిస్తాం. వాహనదారులకు మా పెట్రోల్ బంకుపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నాం. – పుల్లూరి కృష్ణమూర్తి, పెట్రోల్ బంకు యజమాని, సిరిసిల్ల కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతాం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇంధన కొరత ఉన్నట్లు మాకు సమాచారం లేదు. ఎక్కడైనా సమస్య ఉంటే.. సకాలంలో ఇంధన కంపెనీలకు డబ్బులు చెల్లించకపోతేనే ఈ సమస్య వస్తుంది. అయినా ఇంధన కంపెనీల సేల్స్ ఆఫీసర్లతో మాట్లాడుతాం. జిల్లాలోని పెట్రోల్, డీజిల్ బంకుల్లో కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. – ఎల్.బుచ్చిబాబు, డీసీఎస్వో -
నేటి నుంచి పాలిస్టర్ పరిశ్రమలో సమ్మె
సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్ర పరిశ్రమలో సమ్మైసెరన్ మోగింది. సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ ఆదివారం ప్రకటించారు. కార్మికులు, ఆసాము ల కూలీ పెంపు ఒప్పందం రెండేళ్లకు పైగా జరగడం లేదన్నారు. ఈమేరకు వస్త్రోత్పత్తిదారులకు, అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు. శని వారం డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్, చేనేత జౌళి శాఖ ఏడీ సమక్షంలో నిర్వహించిన చర్చలు ఫలించకపోవడంతో కూలీపోరు తథ్యమని స్పష్టం చేశారు. కోడం రమణ తదితరులున్నారు. స్వీయ జనగణనలో భాగస్వామ్యం కావాలి సిరిసిల్లటౌన్: జనగణనలో పౌరులు విధిగా పాల్గొనాలని ఎస్పీ మహేశ్ బీ గీతే, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ కోరారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా మాట్లాడుతూ ఆదివారం నుంచి మే 10 వరకు వెబ్సైట్ https://se.census.gov.in లో ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ దార్ల సందీప్ తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు షురూ సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎల్.బుచ్చిబాబు ఆదివారం తెలిపారు. జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, 48 కేంద్రాల వద్ద ఆదివారం నాటికి 456 మంది రైతుల నుంచి 2,440.300 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఈసారి కొత్తగా ఆన్లైన్ సిస్టం ద్వారా రియల్ టైండేటా ఎంట్రి అమలు చేస్తున్నామని బుచ్చిబాబు వివరించారు. తూకం వేసి ధాన్యం బస్తాలను రైస్మిల్లులకు తరలిస్తున్నామని వివరించారు. మిల్లుల్లోనూ ఇబ్బందులు లేకుండా ధాన్యం దిగుమతులు జరుగుతున్నాయని బుచ్చిబాబు తెలిపారు. రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్బంక్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గత ఆదివారం స్థానికులు కలెక్టర్ గరీమా అగ్రవాల్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్అండ్బీ ఏఈ అనూజ ఆధ్వర్యంలో సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై జీబ్రా లైన్స్ వేశారు. ఆలయ అభివృద్ధికి విరాళం వేములవాడ: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనుల కోసం హైదరాబాద్కు చెందిన శంకర్రావు–ప్రసూన దంపతులు రూ.10లక్షల విరాళం ఆదివారం అందజేశారు. స్వామివారి ఆశీర్వాదాలు అందజేశారు. -
అంతిమ సంస్కారాలకు వాగే దిక్కు
వేములవాడరూరల్: ఆధ్యాత్మిక పట్టణం వేములవాడ మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో అంతిమసంస్కారాలకు అవస్థలు తప్పడం లేదు. శ్మశానవాటికలు అందుబాటులో లేక మూలవాగు, గంజివాగులు దిక్కవుతున్నాయి. మున్సిపాలిటీలో ఏడేళ్ల క్రితం నాంపల్లి, తిప్పాపూర్, కోనాయపల్లి, శాత్రాజుపల్లి, అయ్యోరుపల్లి ఐదు గ్రామాలను కలిపారు. అప్పటి నుంచి ఆయా గ్రామాల్లో శ్మశానవాటికల పనులు పూర్తి చేయలేదు. స్థలాలు కరువు మరణిస్తే అవస్థలే.. మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని ఆందోళనలు చేపట్టాం. అయినా విలీనం చేశా రు. 3వ వార్డుగా ఏర్పాటు చేసినప్పటికీ కనీసం శ్మశానవాటిక ఏర్పాటు చేయలేదు. ఎవరైనా మరణిస్తే సొంత స్థలాలు లేదా గంజివాగులోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం. – ఉల్లెందుల అంజయ్య, అయ్యోరుపల్లి మాజీ సర్పంచ్వేములవాడ పట్టణంలోని మూడోవార్డులో విలీనమైన లక్ష్మీపురంలో చిట్యాల చంద్రయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అంతిమ సంస్కారాల కోసం మృతదేహాన్ని ఆ ప్రాంతంలో ఉన్న శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఎలాంటి పనులు ప్రారంభించలేదు. స్థలాన్ని గుర్తించి ప్రహరీ మాత్రమే ఏర్పాటు చేశారు. అందులో పిచ్చిమొక్కలు పెరిగి వెళ్లడానికి వీలు లేకుండా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబసభ్యులు బయట ప్రాంతంలోనే దహన సంస్కారాలు పూర్తిచేశారు. -
ఘనంగా వాసవీమాత జయంతి
సిరిసిల్ల: వాసవీ కన్యకా పరమేశ్వరీ మాతా జయంతిని ఆదివారం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే ముందుగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి రాందాస్, సీపీవో శ్రీనివాసాచారి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి స్వప్న, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బుస్స దశరథం, మాజీ అధ్యక్షుడు కటుకం సత్తయ్య, వైశ్య సంఘం ప్రతినిధులు సిద్ధంశెట్టి వేణు, అల్లాడి శ్రీనివాస్, కటుకం శ్రీనివాస్, పబ్బ నాగరాజు, రంగ రాజేందర్, రాజూరి వాసుదేవరాయలు, ఆర్ఐ యాదగిరి, ఎస్ఐ కిరణ్కుమార్, ఆర్ఎస్ఐ సాయికిరణ్ పాల్గొన్నారు. -
స్వీయ గణనను విజయవంతం చేయాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరీమా అగ్రవాల్ కోరారు. ఈనెల 26 నుంచి వచ్చే నెల 10 వరకు నిర్వహించే స్వీయ గణన(సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను ఆదివారం కలెక్టర్ స్వీయ గణన చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెబ్సైట్ ద్వారా లాగిన్ కావాలని, వెబ్ సైట్ పూర్తి స్థాయిలో సురక్షితమని స్పష్టం చేశారు. ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు గుర్తింపు కార్డులు, ఇతర వివరాలు ఇచ్చామని తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వీయ గణన చేసుకోవాలని పేర్కొన్నారు. జనాభా గణనకు సంబంధించి 1,025 మంది ఎన్యూమరేటర్లు, 173 మంది సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి జనగణన అని, డిజిటల్ విధానంలో చేయనున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు 1117 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ గుర్తించామని తెలిపారు. సీపీవో శ్రీనివాసాచారి, ఈడీఎం శ్రీనివాస్, ఎస్వో సంపత్కుమార్ పాల్గొన్నారు. -
నో స్టాక్ బోర్డు
ఊరెళ్లేందుకు సిద్ధమయ్యాం. కారులో డీజిల్ పోయించేందుకు బంకుకు వస్తే నో స్టాక్ బోర్డు ఉంది. ఎప్పుడూ పద్మనగర్లోనే డీజిల్ పోయిస్తాం. కానీ ఈసారి నో స్టాక్ బోర్డు ఉండడంతో మరో బంకులో డీజిల్ పోయించేందుకు వెళ్తున్నాం. నమ్మకంతో ఇంత దూరం వస్తే బంక్లో డీజిల్, పెట్రోల్ లేదని తెలిసి నిరాశతో వెళ్తున్నాం. మేం ఒక్కరిమే కాదు.. చాలా మంది ట్రాక్టర్లు, బైక్ల యజమానులు వాపస్ పోతున్నారు. – పిల్లి కిశోర్, సారంపల్లి పెట్రోల్ కోసం వచ్చాను బండిలో పెట్రోల్ పోయించేందుకు వస్తే నో స్టాక్ బోర్డు ఉంది. బంకులోకి వాహనాలు రాకుండా అడ్డంగా తాడు కట్టారు. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. బంకు ఉందనే నమ్మకంతో వస్తే ఇలా లేకుంటే ఎలా. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వాహనదారులు పెట్రోల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. – పయ్యావుల లక్ష్మణ్, తంగళ్లపల్లి -
కొడుకు హత్యకు తల్లి ప్లాన్
మంథనిరూరల్: కన్న కొడుకునే మరో కొడుకుతో అంతం చేయాలని చూసిందో తల్లి.. అర్ధరాత్రి నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన కొత్త రఘుపై అతడి తమ్ముడు అనిల్ పెట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించారు. బాధితుడి సోదరి పాలడుగు సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. రఘు తండ్రి 15 ఏళ్ల క్రితం చనిపోయాడు. తల్లి జ్యోతి తన తమ్ముళ్లతో కలిసి గ్రామంలోనే ఉంటున్నారు. తల్లి ప్రవర్తన బాగా లేకపోవడంతో తరచూ పెద్ద తమ్ముడు గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి సైతం గొడవ జరగడంతో తనకు అడ్డుగా వస్తున్నాడని భావించిన తల్లి.. తన చిన్న కొడుకుతో పెద్ద కొడుకును చంపాలని పథకం వేసింది. ఈక్రమంలో అంతకుముందే తెచ్చుకున్న పెట్రోల్ను నిద్రిస్తున్న రఘుపై పోసి నిప్పంటించాడు. మంటల తీవ్రతకు అరవడంతో స్థానికులు గమనించి వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విచారణ జరిపి తన పెద్ద తమ్ముడిపై హత్యాయత్నం చేసిన చిన్నతమ్ముడు అనిల్, తల్లి జ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని సౌజన్య తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్నట్లు మంథని పోలీసులు తెలిపారు. ● చిన్న కొడుకును ప్రేరేపించిన తల్లి ● పెట్రోల్పోసి నిప్పంటించిన వైనం ● చావుబతుకుల్లో పెద్దకుమారుడు ● లక్కేపూర్ గ్రామంలో ఘటన -
నీళ్ల కోసం పశువుల విలవిల
సిరిసిల్ల: మండుతున్న ఎండల్లో పశువులు, పక్షులు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో పశువులకు, పక్షులకు తాగునీరు లభిస్తుంది. కానీ పట్టణ ప్రాంతాల్లో విలవిల్లాడుతున్నాయి. సిరిసిల్లలోని శ్రీసెస్శ్రీ ఆఫీస్ పక్కన చికెన్ సెంటర్ నిర్వాహకుడు బైరగోని వెంకన్నగౌడ్ తన షాపు ముందుకు వచ్చే ఆవులు, ఎద్దులకు ఇలా నీళ్లు పెడుతుంటాడు. ఓ గిన్నెతో ఐదారు సార్లు వాటి దాహం తీరే వరకు నీళ్లు పట్టి పెట్టడం విశేషం. ఎండాకాలంలో పశువుల తాగునీటి ఇబ్బందులకు ఈ దృశ్యం అద్దం పడుతుంది. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు పశువులకు తాగునీటి తొట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. -
మిషన్ భగీరథ ఉన్నా బోరు నీరే
వీర్నపల్లి(సిరిసిల్ల): గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీమిషన్ భగీరథశ్రీ పథకం లక్ష్యం పక్కదారి పడుతోంది. ఇంటింటికీ స్వచ్ఛమైన సురక్షిత జలాలు అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి పైప్లైన్లు వేసినప్పటికీ అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు అందడం లేదు. కలుషిత నీరే దిక్కు గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సకాలంలో రాకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు మళ్లీ పాత పద్ధతులనే ఆశ్రయిస్తున్నారు. పాతబోర్ల ద్వారా వచ్చే నీటిని, మిషన్ భగీరథ నీటిని కలిపి వాటర్ ట్యాంకులకు ఎక్కించి సరఫరా చేస్తున్నారు. దీంతో పైప్లైన్ ద్వారా వచ్చే నీరు పూర్తిగా కలుషితమవుతోంది. ఇంటింటికీ శుద్ధి చేసిన నీరు అందిస్తామన్న హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. రక్షిత తాగునీరు రాకపోవడంతో ప్రజలు గత్యంతరం లేక ఈ శ్రీమిక్సింగ్శ్రీ నీటినే వాడుకోవాల్సి వస్తోంది. జేబుకు చిల్లు.. ఆరోగ్యానికి ముప్పు ప్రభుత్వ నీటిపై నమ్మకం లేక గ్రామస్తులు అదనపు భారమైనా సరే ప్రైవేటు ఆర్వో ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. రూ.10 వెచ్చించి 20 లీటర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. మళ్లీ ట్యాంకర్ల కాలం వేసవి సమీపిస్తున్న తరుణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన అధికారులు మిషన్ భగీరథ నిర్వహణను గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో సర్పంచులు కొత్తగా బోర్లు వేయించడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పైప్లైన్ల లీకేజీలు, మోటార్ల మరమ్మతులపై పర్యవేక్షణ కరువైందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మిక్సింగ్ నీటి సరఫరాను అరికట్టి, స్వచ్ఛమైన భగీరథ జలాలను అందించాలని పల్లె ప్రజలు కోరుతున్నారు. -
వెనకడుగు వేయొద్దు
పట్టుదలగా చదువాలి. చదువును నిర్లక్ష్యం చేయొద్దు. వెనకడుగు వేయొద్దు. నిజా నికి బీట్ ఆఫీసర్గా ఉండగా మళ్లీ చదువు ఎందుకు అని చాలా మంది సలహా ఇచ్చా రు. ఉన్న ఉద్యోగం పోతుందన్నారు. అప్పటికే పోటీపరీక్షల పేపర్లు లీక్ కావడం, రాసిన పరీక్షలు రద్దు కావడం జరిగింది. దీంతో చాలా మంది ఉన్న ఉద్యోగంలోనే చేరమన్నారు. కానీ మనపై మనకు నమ్మకం ఉంటే.. ఇది పోతే ఇంకోటి వస్తుందిలే అనే ధీమాతో రెండేళ్లు ఇంటి ముఖం చూడకుండా హైదరాబాద్లోనే ఉండి చదువుకున్న. కృషికి తోడుగా.. పట్టుదల ఉంటే.. ఏదైనా సాధిస్తామనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతోనే మూడు ఉద్యోగాలు సాధించాను. అన్ని ఖాకీ యూనిపామ్ సర్వీసులే కావడం ఆనందం అనిపించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. చదువును మరువద్దు. – పృథ్వీరాజ్వర్మ, ఏఎంవీఐ, రాజన్న సిరిసిల్ల -
ముచ్చటగా మూడు కొలువులు
● చదువు.. పట్టుదల.. విజయం● అన్నీ ‘యూనిఫామ్’ సర్వీసులే● ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టు ఏఎంవీఐసిరిసిల్ల: ప్రభుత్వ ఉద్యోగం ఒకటి సాధించడమే కష్టంగా ఉన్న నేటి పోటీ ప్రపంచంలో పట్టుదలకు ప్రయత్నం తోడైతే విజయాలు క్యూ కడతాయని నిరూపిస్తున్నారు సిరిసిల్ల అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఏఎంవీఐ) బేర పృథ్వీరాజ్వర్మ. ఒక్కటి కాదు...రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. చదువు ఒక్కటే మనల్ని ముందుకు నడిపిస్తుందని.. సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఏఎంవీఐగా పనిచేస్తున్న పృథ్వీరాజ్వర్మ గ్రామీణ నేపథ్యంలో ఎదిగి వచ్చి శ్రీఖాకీశ్రీ యూనిఫామ్పై ఉన్న మక్కువతో మూడు ఉద్యోగాలు సాధించారు. ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం ఖాకీ దుస్తులకే ఉందని నమ్మారు. ఉద్యోగ అన్వేషణలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న నేటితరం యువతకు స్ఫూర్తినిస్తున్న పృథ్వీరాజ్వర్మ విజయగాథపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ● మధ్యతరగతి కుటుంబంమంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లికి చెందిన బేర శ్రావణి, రాజమౌళి దంపతులకు ఇద్దరు కొడుకులు పృథ్వీరాజ్వర్మ, భరద్వాజ్. లక్షెట్టిపేటలో ఎస్ఎస్సీ వరకు చదివిన పృథ్వీరాజ్వర్మ పదోతరగతిలో 526 మార్కులు సాధించారు. హైదరాబాద్లో ఇంటర్, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ (మెకానికల్) పూర్తి చేశారు. 2017లో బీటెక్ పట్టాతో బయటకు వచ్చిన పృథ్వీరాజ్వర్మ హోండా కంపెనీలో సర్వీసు ఇంజినీరుగా రెండేళ్లపాటు పనిచేశారు. అనంతరం మరో సిమెంట్ కంపెనీలో పనిచేశారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలగా ఖాళీ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.● బీట్ ఆఫీసర్గా ప్రస్తానం2019లో పోటీపరీక్షలు రాసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా తొలి ఉద్యోగం సాధించారు. శిక్షణ అనంతరం జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్లో ఉద్యోగం. అడవిని, వన్యప్రాణులను రక్షించే ఉద్యోగం. బీట్ ఆఫీసర్గా పనిచేస్తూ పోటీ పరీక్షలకు సిద్దమయ్యారు. 2023లో తెలంగాణ ప్రభుత్వం నేరుగా అసిస్టెంట్ మోటార్ వాహన తనిఖీ అధికారి(ఏఎంవీఐ) ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. ఆ పరీక్షలకు పట్టుదలగా ప్రిపేర్ అయ్యారు. ఆ పరీక్షల ఫలితాలు రాక ముందే 2024లో పోలీస్ కానిస్టేబుల్(సివిల్) ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. కానిస్టేబుల్ ఉద్యోగం చేరకుండా.. ఏఎంవీఐ ఉద్యోగ ఫలితాల కోసం నిరీక్షించారు. ఉద్యోగం పోతుందని, వెంటనే చేరాలని అనేక మంది సలహా ఇచ్చినా అప్పటికే ఓ ఉద్యోగం ఉంది, మరో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను అనే ధీమాతో ఉండగా.. ఏఎంవీఐగా ఎంపికయ్యారు. మూడు ఖాకీ డ్రెస్ వేసుకునే ఉద్యోగాలు రావడంతో చివరగా.. ఏఎంవీఐగా ఉద్యోగంలో చేరారు.● తమ్ముడూ.. భార్యా ఇంజినీర్లేపృథ్వీరాజ్వర్మ తమ్ముడు భరద్వాజ ఆర్అండ్బీలో ఏఈఈగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కీర్తి ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నారు. ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడంతో తల్లిదండ్రులు శ్రావణి, రాజమౌళి దంపతుల ఆనందానికి అవధుల్లేవు. చిన్నప్పటి నుంచి చదువు ఒక్కటే దారి చూపుతుందని నమ్మిన ఆ తల్లిదండ్రులు పిల్లలను ప్రయోజకులను చేశామని ఆత్మసంతృప్తితో ఉన్నారు. -
జడ్జి పోస్టు ముళ్ల కిరీటం
వేములవాడ: జడ్జి పోస్టు ముళ్ల కిరీటంలాంటిదని, ఒక్కో రోజు కేసులు పూర్తిస్థాయి పరిష్కరించేందుకు రాత్రి అవుతుందని, కేసుల్లో బ్యాలెన్స్ చేయడంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుందని సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ పేర్కొన్నారు. వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా మూడేళ్లపాటు విధులు నిర్వహించి ఖమ్మంకు బదిలీపై వెళ్తున్న జ్యోతిర్మయిని బార్ అసోసియేషన్ హాలులో శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా అజయ్కుమార్ జాదవ్ మాట్లాడుతూ ఎంతో మంది అభాగ్యులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తారని, ఈక్రమంలో తమపై ఎంతో బాధ్యత ఉంటుందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ మాట్లాడుతూ జడ్జిగా విధులు నిర్వహించిన సమయంలో జూనియర్లకు ఎంతో అవకాశం కల్పించారని, బార్ అండ్ బెంచ్ సత్సంబంధాలతో కొనసాగాయన్నారు. మహిళలకు ఆదర్శం వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే ఆగస్టు 16న వేములవాడ ప్రభుత్వాస్పత్రిలో నార్మల్ డెలివరీతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి సర్కార్ ఆస్పత్రులపై నమ్మకం పెంచారన్నారు. ఇలా మహిళలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏ ఆడపిల్లకై నా మొదటి డెలివరీ తల్లిగారింట్లో జరుగుతుందని.. అందుకే జడ్జి జ్యోతిర్మయికి వేములవాడ పుట్టినిల్లులాంటిదన్నారు. ఈక్రమంలో తమ సోదరికి వీడ్కోలు పలుకుతున్నట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ జూనియర్ సివిల్ జడ్జికి వీడ్కోలు కంటతడి పెట్టిన జడ్జి జ్యోతిర్మయి కంటతడి పెట్టిన జడ్జి జ్యోతిర్మయి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులైన జ్యోతిర్మయి వేములవాడను తన పుట్టినిల్లుగా మార్చుకున్నారంటూ పలువురు అడ్వకేట్లు కొనియాడడంతో భావోద్వేగానికిలోనయ్యారు. జడ్జి జ్యోతిర్మయి మాట్లాడుతుండగా కంటతడి పెట్టుకున్నారు. బార్ అసోసియేషన్ హాలులో శనివారం జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆమె తన అనుభవాలను వివరిస్తూ వేములవాడను మరచిపోలేనని, తనను ఇంతగా ఆదరించిన వేములవాడ అడ్వేకేట్ల సేవలు గుర్తుండిపోతాయన్నారు. ఈక్రమంలో పలువురు అడ్వకేట్లు, కోర్టు సిబ్బంది సైతం భావోద్వేగానికి లోనయ్యారు. -
‘దేవి పుత్రిక’ అభినందనీయం
కరీంనగర్: ఆడపిల్ల పుడితే భారమనే వివక్షను వీడి, లక్ష్మిదేవిలా భావించినప్పుడే సమాజంలో లింగనిష్పత్తి తేడాలు తొలగుతాయని జిల్లా అదనపు, సెషన్స్ జడ్జి నీరజ అన్నారు. కరీంనగర్లో రోహన్ ఆసుపత్రి ప్రారంభించి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ‘దేవిపుత్రిక’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఆడపిల్ల పుడితే నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా సంవత్సరం పాటు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ఎనమల్ల శ్రీదేవి, ఎనమల్ల నరేశ్ ముందుకొచ్చారు. శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీఎన్ రావుతో కలిసి ‘దేవిపుత్రిక’ పోస్టర్ ఆవిష్కరించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆడపిల్లల విషయంలో ఉన్న వివక్షను తొలగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. జిల్లా అదనపు, సెషన్స్ జడ్జి నీరజ -
అద్దె భవనంలో పల్లె దవాఖానా
ఇల్లంతకుంట: మండలంలోని జవారిపేట పల్లె దవాఖానా అద్దె భవనంలో కొనసాగుతోంది. భవనంలోని గోడలు కూలిపోవడంతో అందులోని సా మగ్రి రెడ్డి సంఘం భవనంలోని గదిలో, పాల ఉత్పత్తిదారుల సంఘం భవనంలోకి ఫర్నిచర్, ఇతర సామగ్రిని సిబ్బంది తరలించారు. ఇరుకు గదుల్లోనే వైద్యసేవలు అందిస్తున్నారు. సిబ్బంది సౌకర్యాలు కల్పించకపోవడంతో విధులు నిర్వర్తించేందుకు ఇ బ్బంది పడుతున్నారు. జవారిపేటపల్లె దవాఖాన కేంద్రం పరిధిలో పొత్తూరు, నర్సక్కపేట, గ్రామాలున్నాయి. పల్లె దవాఖానాలో ఎంఎల్హెచ్పీ డాక్టర్, ఇద్దరు ఏఎన్ఎంలు, నలుగురు ఆశా కార్యకర్తలున్నారు. నిరుపయోగంగా భవనం జవారిపేట గ్రామంలో నూతనంగా పల్లె దవాఖాన భవనాన్ని నిర్మించి రెండేళ్లు గడుస్తున్నా విద్యుత్, నీటి సౌకర్యం, లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. నూతన భవనంలో అసంపూర్తి పనులు పూర్తిచేసి పల్లె దవాఖానను నూతన భవనంలోకి మార్చాలని ప్రజలు కోరుతున్నారు. -
ఈతకు వెళ్లి నీటమునిగిన యువకుడు
రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివారులోని చెరువుకట్ట సమీపంలో నివాసముండే బుడిగజంగాల కుటుంబానికి చెందిన పస్తం పవన్(18) శనివారం ఈతకొడుతుండగా పిట్స్ రావడంతో నీటమునిగి చనిపోయాడు. మరోఇద్దరు యువకులతో కలిసి చెరువులో ఈదుతుండగా పిట్స్ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. యువకుడు కొన్నేళ్లుగా పిట్స్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పస్తం రాంచందర్కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పవన్ ఉన్నాడు. రాంచందర్కు ఉన్న ఏకై క కుమారుడు పవన్ మృత్యువాత పడడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు. జగిత్యాలక్రైం: బీర్పూర్ మండలకేంద్రంలో ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అదేగ్రామానికి చెందిన చీర్నేని బుచ్చన్నకు తీవ్రగాయాలయ్యాయి. బుచ్చన్న తన ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా.. జన్నారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బుచ్చన్న తలకు తీవ్రగాయాలుకాగా.. స్థానికులు 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బీర్పూర్ ఎస్సై రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్జగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో, కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేసి నింది తుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. హౌసింగ్బోర్డు కాలనీలో ని వాసముంటున్న మనువాడ విష్ణువర్దన్ కొద్దిరోజు ల క్రితం పట్టణానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చే సి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యా దు మేరకు నిందితుడిని రిమాండ్కు పంపించినట్లు సీఐ తెలిపారు. దాడి చేసిన వ్యక్తి రిమాండ్చందుర్తి(వేములవాడ): పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని దాడిచేసిన చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన ఓ వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్సై జిల్లెల్ల రమేశ్ తెలిపారు. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాలు. చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన గొంటి లక్ష్మణ్ రోడ్డుపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన నామాల ఉరఫ్ మ్యాదరి నర్సయ్య ఈనెల 5న గొడ్డలి కామతో దాడి చేశాడు. బాధితుడు లక్ష్మణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. దొంగతనం కేసులో వ్యక్తి అరెస్టుగంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల పరిధిలోని పలు ఆలయాలు, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేశ్ తెలిపారు. గంభీరావుపేట మండలకేంద్రానికి చెందిన అక్కపల్లి సంతోష్ను రిమాండ్కు తరలించినట్లు వివరించారు. రోడ్డుపై కందకాలు..ఇల్లంతకుంట: మండలకేంద్రం నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారి పొత్తూరు సమీపంలోని రోడ్డుకు అడ్డంగా కందకాలు ఉండడంతో ప్రయాణికులు ప్రమాదాలబారిన పడుతున్నారు. కందకం దగ్గరకు వచ్చేంతవరకు తెలియకపోవడంతో ప్రమాదాలబారిన పడుతున్నామని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. పొత్తూ రు రోడ్డుపై రెండు మూడుచోట్ల కందకాలు న్నాయి. ఆర్అండ్బీ అధికారులు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలబారిన పడకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. -
రైస్మిల్లులో అగ్నిప్రమాదం
ఇల్లంతకుంట(మానకొండూర్): షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం ఏర్పడి రూ.20 లక్షల విలువైన గన్నీ బ్యాగులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు, మిల్లు ఆపరేటర్ రజినీష్ తెలిపిన వివరాలు. మండలంలోని రహీంఖాన్పేటలోని వరలక్ష్మి రైస్మిల్లులో శుక్రవారం మధ్యాహ్నం కరెంటు సరఫరా లేదు. సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ ఫీజు వేయగానే లైట్లు వచ్చాయి. ఆ సమయంలోనే రైసుమిల్లులోని కిటికీల ద్వారా మంటలు కనిపించాయి. వెంటనే షట్టర్ తెరిచి చూడగా అప్పటికే గన్నీ బ్యాగులు మంటల్లో కాలిపోతున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేవు. దీంతో ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వగా రాత్రి 9:30 గంటలకు మిల్లు వద్దకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే 30 వేల గన్నీ బ్యాగులు కాలిపోయాయి. వీటిని రెండు రోజుల క్రితమే తెప్పించారు. ఫైర్స్టేషన్ ఆఫీసర్ నరేందర్, లీడింగ్ ఫైర్ ఫైటర్ నరసింహచారి, ఫైర్ సిబ్బంది గడ్డమీది సాయి, గణేశ్ మంటలను ఆర్పివేశారు. ప్యాడీ కూడా స్వల్పంగా కాలిపోయింది. సకాలంలో ఫైరింజన్ చేరుకొని మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సంఘటన స్థలానికి ఇల్లంతకుంట పోలీసులు వచ్చి సమాచారం సేకరించారు. -
పార్టీ మారగానే జీవన్రెడ్డి కొత్త పల్లవి
● అభివృద్ధి.. సంక్షేమం కనిపించడం లేదా ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం గల వ్యక్తి పార్టీ మారగానే కొత్త పల్లవి అందుకున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి.. సంక్షేమం కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ ఆఫీస్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే.. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును మీరే తప్పుపడుతూ.. ఇచ్చిన స్టేట్మెంట్లు మరిచిపోయారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ అధికారంలో ఉండగా రూ.36వేల కోట్లతో పూర్తి అయ్యే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు పేరు, ఊరు, అంచనాలు మార్చి అప్పులు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాపాల చరిత్రను వదిలిపెట్టి ప్రజాపాలన సాగిస్తున్న రేవంత్రెడ్డిని నిందించడానికి నోరెలా వస్తుందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలవుతున్నాయని వివరించారు. ప్రజాపాలన పోవాలని కోరుకుంటున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు జాబితాలో కొత్తగా జీవన్రెడ్డి చేరారని ఎద్దేవా చేశారు. అప్పుల కుప్పను చేశారు 2014 మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని రూ.8లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి నెలకు రూ.6వేల కోట్ల వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితికి తెచ్చిన కేసీఆర్ పా పాల పాలన మళ్లీ రాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఎన్డీఎస్సీ నివేదిక ఆధారంగా మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. అసెంబ్లీకి రాని పెద్దమనిషి గురించి మాట్లాడటం అనవసరమన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ప ట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, పార్టీ నాయకులు ఆడెపు చంద్రకళ, గడ్డం నర్సయ్య, కాముని వనిత, బొప్ప దేవయ్య, కల్లూరి చందన, యెల్లె లక్ష్మీనారాయణ, సూర దేవరాజు, వేముల దామోదర్, బూట్ల నవీన్కుమార్, యెల్దండి దేవదాస్ పాల్గొన్నారు. -
మోసం చేసిన ఉద్యోగిపై కేసు
వేములవాడరూరల్: కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగిపై బాధితులు వేములవాడ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్ ఆఫీస్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖలో ఎస్–31లో పనిచేస్తున్న రాజుకుమార్ అనే అధికారి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికారు. అతని మాటలు విశ్వసించి వేములవాడకు చెందిన రాగుల నాగమణి కొడుకు రుమేందర్కు మండల పరిషత్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తాననడంతో రూ.1.10లక్షలు ముట్టజెప్పారు. ఈ డబ్బులను 2025 మార్చి 22 నుంచి 2025 జూలై 17 వరకు విడతల వారీగా పంపారు. మరో బాధితుడు ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన మొగ్గం పద్మ కుమారుడు ప్రశాంత్కు కూడా ఇలాగే ఉద్యోగం ఇప్పిస్తానంటూ వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతోపాటు తిరిగి డబ్బులు ఇవ్వలేదు. ఇలా కొన్ని నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. కూలీ పని చేసుకుని బతుకుతున్న తమను మోసం చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. జిల్లాలో వీరే కాకుండా మరికొందరు బాధితులు ఉన్నట్లు సమాచారం. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఉమ్మడి జిల్లాలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ల బదిలీ
జగిత్యాలజోన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న జ్యుడీషియల్ మెజి స్ట్రేట్లను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్లో పనిచేస్తున్న షీరీనాను రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్, జగిత్యాలలో పనిచేస్తున్న శ్రీనిజ కోహిర్కర్ను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మెట్పల్లిలో పనిచేస్తున్న ఎన్.అరుణ్కుమార్ను రంగారెడ్డి జిల్లా అమన్గల్, వేములవాడలో పనిచేస్తున్న కె.జ్యోతిర్మయిని ఖమ్మం, సిరి సిల్లలో పనిచేస్తున్న ఎ.ప్రవీణ్ను ఖమ్మం, గో దావరిఖనిలో పనిచేస్తున్న డి.వెంకటేశ్ను గ ద్వాలకు బదిలీ చేశారు. ఖమ్మంలో పనిచేస్తు న్న మాధవిని మెట్పల్లి, రంగారెడ్డి జిల్లా ఇ బ్రహీంపట్నంలోని యశ్వంత్సింగ్ను కరీంనగర్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పనిచేస్తున్న అపర్ణను పెద్దపల్లి జిల్లా మంథనికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నేడు కేటీఆర్ పర్యటన తంగళ్లపల్లి(సిరిసిల్ల): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ శనివారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తంగళ్లపల్లి మండలంలోని రామన్నపల్లెలో మధ్యాహ్నం 3:30 గంటలకు, తంగళ్లపల్లి పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణానికి 4:30, సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేసీఆర్ కప్ విజేతలకు బహుమతులు అందజేస్తారు. సీఎం ఇంటికి పాదయాత్ర సిరిసిల్లటౌన్: విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్, ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ సీఎం ఇంటికి పాదయాత్ర చేస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుర్ర రాకేశ్, మంద అనిల్కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని కార్మిక భవనంలో ఈనెల 28న చేపడుతున్న కార్యక్రమ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఫీజులపై హైకోర్టు తీర్పును పునర్ సమీక్షించాలని కోరారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. నాయకులు బర్రెంకల శ్రీహరిక, పెండెల ఆదిత్య, శశికుమార్, వంశీ పాల్గొన్నారు. సహకార బ్యాంక్ ఉద్యోగుల ధర్నా ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్లో కేంద్ర సహకార బ్యాంక్ ఎదుట భోజన విరామ సమయంలో ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. బ్యాంక్ మేనేజర్ సురభి ప్రవీణ్రావు మాట్లాడుతూ సహకార బ్యాంక్ ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటీవ్స్ను ప్రభుత్వం రికవరీ చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. గత రెండేళ్లలో ఎంతో మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చెందారని గుర్తు చేశారు. ప్రభుత్వం, సహకారశాఖ, నాబార్డు తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం పునారలోచన చేయాలని కోరారు. కూలీ పెంచేలా చర్యలు తీసుకోండి సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, ఆసాములకు, వార్పిన్, వైపని కార్మికులకు కూలీ పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కోడం రమణ తెలి పారు. కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ గరీమా అగ్రవాల్ను కలిసి వినతిపత్రం అందించారు. కూలీ ఒప్పందం ముగిసి రెండేళ్లు గడిచినా కొత్త కూలీ ఒప్పందం చేయడం లేదన్నారు. ఈమేరకు యజమానుల సంఘానికి పలు మార్లు వినతిపత్రాలు అందించినా స్పందించడం లేదన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 27 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. మూశం రమేశ్ తదితరులున్నారు. -
మహిళల అభివృద్ధికి పెద్దపీట
వేములవాడ: మహిళల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. పట్టణంలోని 7, 8 వార్డులలో అసంపూర్తిగా ఉన్న భవనాలను శుక్రవారం పరిశీలించారు. గతంలో ఈ భవనాల పనులు ప్రారంభమైనప్పటికీ వివిధ కారణాలతో మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. కౌన్సిలర్లు ఎల్ల శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్లతో కలిసి భవన నిర్మాణ పురోగతిని, మిగిలి ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణం పనులకు అవసరమైన నిధులను త్వరలోనే మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఏఈ అనన్య తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ది ప్రభుత్వ హత్యే
సిరిసిల్లలో ఆర్టీసీ డ్రైవర్కు నివాళి అర్పిస్తున్న బీజేపీ, ఏఐటీయూసీ నాయకులు శంకర్గౌడ్ సంతాపసభలో బీఆర్ఎస్ నేతలు ఆగయ్య, చక్రపాణిఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమాదేవిసిరిసిల్లటౌన్/వేములవాడఅర్బన్: డ్రైవర్ శంకర్గౌడ్ది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగా బీఆర్ఎస్, బీజేపీ, కార్మిక సంఘాల పార్టీల నాయకులు విమర్శించారు. సిరిసిల్ల కొత్తబస్టాండులో శుక్రవారం నిర్వహించిన శంకర్గౌడ్ సంతాపసభకు హాజరై మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్చైర్మన్ దార్ల సందీప్ పాల్గొన్నారు. శంకర్గౌడ్కు నివాళి ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులతోపాటు జిల్లా కేంద్రంలో సంఘీభావ ర్యాలీలో మాట్లాడారు. శంకర్గౌడ్ చిత్రపటానికి నివాళి అర్పించారు. మూడో రోజు మిన్నంటిన నిరసనలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు మూడో రోజు నిరసనలు హోరెత్తించారు. కార్మిక సంఘాలు సిరిసిల్ల డిపోతోపాటు కొత్తబస్టాండ్, పాత బ స్టాండ్ ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాయి. ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభు త్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఎస్ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు కాళిదాసు, రీజినల్ వైస్చైర్మన్ కొమురయ్య, డిపో అధ్యక్షుడు సీహెచ్.బాణయ్య, ఉపాధ్యక్షులు జే.ఎస్.ఎన్.రావు, శ్రీనివాస్నాయక్, ప్రశాంత్, సుమలత, రాంప్రసాద్ పాల్గొన్నారు. సొమ్మసిల్లి పడిపోయిన కార్మికురాలు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ వేములవాడ ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట శుక్రవారం మౌ న దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చి న హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు. మౌన దీక్షలో కండక్టర్ రమాదేవి అస్వస్తతకు గురై కిందపడిపోయారు. వెంటనే వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమెను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. -
బీఆర్ఎస్వీ నిరసన
సిరిసిల్ల అర్బన్: బీఆర్ఎస్ మాజీ మంత్రుల అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్వీ నాయకులు సిరిసిల్ల నేతన్నచౌక్ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ వినోద్కుమార్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్లిన ప్రజాప్రతినిధులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. వినయ్కుమార్, కిరణ్, ప్రవీణ్, శేఖర్, హైదర్, శశి, రాజు పాల్గొన్నారు. రైస్మిల్లర్లు ధాన్యం త్వరగా దించుకోవాలి వేములవాడఅర్బన్/బోయినపల్లి: ధాన్యం లోడ్తో వచ్చిన వాహనాలను ఆలస్యం చేయకుండా దింపుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ రైస్మిల్లర్లకు సూచించారు. వేములవాడ మండలం అనుపురం, బోయినపల్లి మండలం విలాసాగర్, జగ్గారావుపల్లి, కొదురుపాకలోని కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు. విలాసాగర్లోని రైస్మిల్లులను తనిఖీ చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. తహసీల్దార్ ఎండీ.షరీఫ్ మొయినొద్దీన్ ఉన్నారు. -
హుందాతనం ప్రదర్శించాలి
● సిరిసిల్ల ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి సిరిసిల్లటౌన్: రైతుల పండుగలో హుందాగా ప్రవర్తించాల్సింది పోయి రాజకీయకక్షతో అనవసరపు రాద్దాంతం చేయడం సరికాదని బీఆర్ఎస్ నేతలపై ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో శుక్రవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. రెండు రోజుల క్రితం వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య జరిగిన గొడవకు బీఆర్ఎస్ నేతలే కారణమన్నారు. మున్సిపల్ చైర్పర్సన్కు తాము గౌరవం ఇచ్చామని కానీ వారు రాజకీయ దురుద్దేశ్యంతోనే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, కూరపాటి శ్రీశైలం, ఎలుక తిరుపతి, దుబాల వెంకటేశం, మార్గం లక్ష్మణ్, బూర దశరథం, పిస్క మధు, ఆడెపు జగన్, ఖాజా, కోడం అరుణ తదితరులు పాల్గొన్నారు. -
నడుం నొప్పి.. కంటి సమస్య
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్) ప్రక్రియ నమోదు సిబ్బందికి కొత్త సమస్యలు తీసుకొస్తోంది. సర్ దరఖాస్తు పత్రంలో 2003నాటి ఎస్ఐఆర్ ప త్రంలో ప్రచురితమైన ఓటరు వ్యక్తిగత వివరాలను అతడు లేదా ఆమె, తాతతండ్రుల పేర్లను కాని ఇవ్వాలి. ఈ మేరకు 2003 నాటి ఓటరు జాబి తాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచారు. ఏ ఓటరుకై నా 2003జాబితాలోని తన అసెంబ్లీ నియోజకవర్గం కానీ, పోలింగ్ బూత్ కానీ స్పష్టంగా తెలియకపోతే పెద్ద చిక్కే వస్తుంది. దీంతో ఆ ఓట రు వివరాల కోసం ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ల్లో వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఓటరు దీర్ఘకాలంగా ఒకేచోట నివసిస్తున్నా, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం మారిపోయిన వారి వివరాలను వెతకడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఆయా ఓటర్ల వివరాలను 2003 జాబితా ఆధారంగా సేకరించలేక బీఎల్వోలకు కొత్తగా కంటి స మస్యలు, నడుం నొప్పి వస్తోందని వాపోతున్నారు.సర్ అంటే -
అమ్మానాన్న.. ఇద్దరు ఉంటేనే పిల్లలకు తోడునీడ. కుటుంబానికి భరోసా. స్కూల్ నుంచి వస్తుండగా అమ్మ ఎదురుగా రాకపోతే ఆ చిన్నారుల ఆందోళనకు అంతుండదు. అదే శాశ్వతంగా కనిపించకుండా పోతే ఆ గుండె లయతప్పుతుంది. సాయంత్రానికి నాన్న కనిపించకపోతే పిల్లల ఆతృత పెరిగిపోతుంది. అద
నాన్న.. నీవే నా ధైర్యం అనుకున్న నాన్న.. నేను స్కూల్ నుంచి రాగానే ప్రతి రోజూ నా కోసం ఎదురుచూసే వాడివి. ఇప్పుడు నువ్వు కనిపించడం లేదు. నువ్వు ఉన్నావనే ధైర్యంతో అందరితో నవ్వుతూ తిరిగేవాడిని. ఇప్పుడు నా వెనుక నువ్వు లేవని తెలిసి కన్నీళ్లు ఆగడం లేదు. మా నాన్న లాగా క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. పిల్లలను అనాథలుగా చేయకండి. మమ్మల్ని వదిలి వెళ్లిపోకండి. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. – జంగునాయక్, శాంతినగర్(గుగులోత్ గోపాల్ కొడుకు)వీరు రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్కు చెందిన గుగులోతు గోపాల్ కుటుంబ సభ్యులు. అప్పుల బాధ భరించలేక గత మార్చి 21న తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని మరణించాడు. ఇప్పుడు వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఇద్దరు బిడ్డలు, కొడుకు, భార్య నిర్మల ఏం చేయాలో తెలియడం లేదు. ఆ ఇల్లాలికి పిల్లలను ఎట్ల పెంచుకోవాలో తెలియక భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర మనోవేదనకు గురవుతోంది.నేలవాలిన వరి.. రాలిన మామిడి -
బాలల హక్కులను రక్షిస్తేనే భవిష్యత్
చందుర్తి(వేములవాడ): బాలల హక్కులను రక్షిస్తేనే వారి భవిష్యత్ను బలంగా నిర్మించవచ్చునని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన అభిప్రాయపడ్డారు. మండలంలోని సనుగుల గంగిరెద్దులకాలనీని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు, సంకల్ప ఫౌండేషన్ డైరెక్టర్ రోజి గురువారం సందర్శించారు. దత్తత తీసుకున్న గంగిరెద్దుకాలనీలో పలు అభివృద్ధి, బాలల సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. కాలనీలోని పిల్లలకు 50 రోజులపాటు విద్యాబోధనకు టీచర్ను, పిల్లల వ్యక్తిగత పరిశుభ్రతకు బార్బర్ను ఏర్పాటు చేశారు. మహిళల ఉపాధి కోసం కుట్టుశిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంగిరెద్దులకాలనీలోని సుమారు 100 మంది పిల్లలకు బట్టలు, చెప్పులు, టూత్పేస్టులు, సబ్బులు తదితర వస్తువులు అందజేశారు. సర్పంచ్ బొడిగే లావణ్య–అనిల్గౌడ్, జిల్లా శిశు మహిళ సంక్షేమాధికారి లక్ష్మీరాజం, వెల్ఫేర్ కమిటీ సభ్యులు అంజయ్య, డీసీపీవో కవిత, ఏసీడీపీవో సుచరిత, ఐసీడీఎస్ సూపర్వైజర్ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానంసిరిసిల్ల అర్బన్: జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లోని 10 కేంద్రాల్లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు అనుభవం గల వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ కోచ్లు, జాతీయ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి రాందాస్ తెలిపారు. అథ్లెటిక్స్, కరాటే, యోగా, వాలీబాల్, హ్యాండ్బాల్, నెట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ, కబడ్డీ, ఖోఖో, పట్టణ స్థాయి మినీస్టేడియంలో అథ్లెటిక్స్, కరాటే, యోగా, వాలీబాల్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ, కబడ్డి, ఖోఖో, బాస్కెట్బాల్, క్యారం, చెస్ క్రీడలలో శిక్షణకు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని సూచించారు. వివరాల కోసం 94402 39783, 75692 07411లో సంప్రదించవచ్చని తెలిపారు. -
ముందుకొస్తున్న బాధితులు
వేములవాడరూరల్: కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు వద్ద ఓ ఉద్యోగి డబ్బులు వసూలు చేసిన వైనంపై గురువారం శ్రీసాక్షిశ్రీలో కథనం ప్రచురితం కావడంతో తీవ్ర చర్చకు దారితీసింది. పంచాయతీరాజ్శాఖలో ఉన్నత స్థానంలో పనిచేసే ఓ అధికారి ‘ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా’ అనే కథనం ప్రచురితమైంది. అధికారికి డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సదరు ఉద్యోగి వారితో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గురువారం కార్యాలయానికి బాధితులు వస్తున్నట్లు తెలుసుకున్న ఉద్యోగి రెండు రోజులపాటు సెలవు పెట్టినట్లు తెలిసింది. సదరు ఉద్యోగి బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగి గతంలో మరొక ప్రాంతంలో విధులు నిర్వహించినప్పుడు కూడా ఇలాంటి మోసానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సదరు ఉద్యోగిపై పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలి
● ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇల్లంతకుంట(మానకొండూర్): కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండలంలోని వల్లంపట్లకు చెందిన వార్డుమెంబర్లు మందాల నరేందర్, కర్ల సులోచన, ఎర్రవెల్లి వెన్నెల, మరొకరు కర్ల అరుణ్ కాంగ్రెస్లో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్రెడ్డి, వల్లంపట్ల సర్పంచ్ నేరెళ్ల విజయ్గౌడ్, ఏఎంసీ వైస్చైర్మన్ ఎలగందుల ప్రసాద్ పాల్గొన్నారు. స్థల దాతకు సన్మానం వల్లంపట్లలో అంగన్వాడీ భవన నిర్మాణానికి, మహిళా స్వశక్తి భవన నిర్మాణానికి 3 గుంటల స్థలం అందజేసిన మండల గ్రామైక్య సంఘాల అధ్యక్షురాలు కట్ట సౌమ్య శ్రీకాంత్రెడ్డిని ఎమ్మెల్యే సన్మానించారు. ఆన్లైన్లో నమోదు చేయాలి వేములవాడరూరల్: కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి, మల్లారం, వేములవాడలోని బాలానగర్లో ప్రాథమిక వ్యవసాయ సహకా రం సంఘం కొనుగోలు కేంద్రాలను పరిశీ లించారు. మర్రిపల్లిలోని మణికంఠ, మారుతి ఇండస్ట్రీస్, వేములవాడలోని శ్రీరామలింగేశ్వర రైస్మిల్లులను తనిఖీ చేశారు. నేడు ఠాణా భవన పనులకు భూమి పూజరుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రంలో ఠాణా భవన నిర్మాణానికి శుక్రవా రం చేసే భూమి పూజ ఏర్పాట్లను ఎస్పీ మహే శ్ బీ గీతే గురువారం పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి, ప్రభు త్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతులమీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ శ్రీనివాసులు, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఆర్ఐ రమేశ్, ఎస్సైలు మోతీరాం, రమేశ్, యాదగిరి, పోలీస్ హౌసింగ్ బోర్డు ఏఈ రాజశేఖర్ పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్లో 1,206 ర్యాంక్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రానికి సాన రాజు– రజిత దంపతుల కొడుకు రోహిత్ జేఈఈ మెయిన్స్లో 1,206 ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మిత్ర యూత్ సభ్యులు స్వామిగౌడ్, నేవూరి వెంకట నరసింహారెడ్డి, నాగుల ప్రదీప్గౌడ్, నంది నరేశ్, జవ్వాజి సంజీవ్, రాఘవేందర్, బాధ రమేష్, శేషు సన్మానించారు. డీపీఆర్వోగా ఏడుకొండలుసిరిసిల్ల: జిల్లా సమాచార, ప్రజాసంబంధాలశాఖ అధికారిగా ఏడుకొండలు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం జిల్లా ఇన్చార్జి డీపీఆర్వోగా పనిచేస్తున్న లక్ష్మణ్ కరీంనగర్ డీపీఆర్వోగా కొనసాగనున్నారు. సంగారెడ్డి డీపీఆర్వోగా పనిచేస్తున్న ఏడుకొండలు జిల్లా డీపీఆర్వోగా విధుల్లో చేరారు. ఆయనకు డీపీఆర్వో ఆఫీస్ సిబ్బంది కవిత, రవి, వెంకటేశ్లు స్వాగతం పలికారు. ఎన్యుమరేటర్లకు జీతభత్యాలు ఇవ్వాలిసిరిసిల్ల: ప్రభుత్వం 2024లో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని, ఆ సర్వే చేసిన ఎన్యుమరేటర్లకు ఇప్పటి వరకు జీతభత్యాలు ఇవ్వలేదని ఓయూ విద్యార్థి నాయకుడు, అడ్వకేట్ రజనీకాంత్ గురువారం తెలిపారు. జిల్లాలో రూ.1.50కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా రూ.150 కోట్లు పెండింగ్ ఉన్నాయన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేలు రావాల్సి ఉందని తెలిపారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటకు మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. మండలంలోని గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. కేంద్రంలో రైతులకు కల్పించిన వసతులను పరిశీలించారు. నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం సేకరణ, గన్నీ బ్యాగుల నిల్వ తదితర వివరాలు ఆరా తీశారు. కొనుగోలు కేంద్రం వద్ద పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించాలి. జిల్లా పౌరసరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయప్రకాశ్రావు, ఏపీఎం చంద్రయ్య, ఏవో సంజీవ్ పాల్గొన్నారు. -
ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం
వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధికి హైదరాబాద్కు చెందిన నీలారపు పద్మజ–శివకుమార్ దంపతులు రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి సిరిసిల్ల అర్బన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ కోరారు. జిల్లా గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఇండోర్ క్రీడా పోటీలను డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు పాల్గొన్నారు. -
అభివృద్ధి.. సంక్షేమంలో కాంగ్రెస్ విఫలం
● బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్రెడ్డి సిరిసిల్ల: ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల హా మీలు అమలు చేయడంతో విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. కల్యాణలక్ష్మీకి తులం బంగారం రాలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని, సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా ఇవ్వడం లే దని, పింఛన్లు పెంచలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరుకు సంబంధించి భూసారపరీక్షలు కూడా రేవంత్రెడ్డి చేయించలేద ని ఆరోపించారు. కొండూరి రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం కళాచక్రపాణి, న్యాలకొండ అరుణ, సిద్ధం వేణు, దార్ల సందీప్, కుంబాల మల్లారెడ్డి, ఏనుగు తిరుపతిరెడ్డి, అంజిరెడ్డి, రాఘవరెడ్డి, గజభీంకార్ రాజన్న పాల్గొన్నారు. -
ఎన్నికల హామీని అమలు చేస్తాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడరూరల్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం ఎదురుగట్ల, లింగంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రవేశ కార్యక్రమానికి గురువారం హాజరయ్యారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ఉచిత విద్యుత్, ఉచిత బస్, సన్నబియ్యం, నూతన రేషన్కార్డు, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు వంటి ఎన్నో పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విప్ను గృహ యజమానులు శాలువాతో సత్కరించారు. సర్పంచులు తిరుపతిరెడ్డి, రంగు వెంకటేశంగౌడ్, నాయకులు సోయినేని కరుణాకర్, రాంరెడ్డి, పొన్నం మల్లేశం, బండ శ్రీనివాస్, పాలకుర్తి పర్శరాం, సోయినేని లహరి, కడారి తిరుపతి పాల్గొన్నారు. -
రెండో రోజు.. నిరసనల జోరు
సిరిసిల్లటౌన్/వేములవాడఅర్బన్: సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు చేపట్టిన సమ్మె రెండో రోజు గురువారం కొనసాగింది. తెల్లవారుజామునే కార్మిక సంఘాలు సిరిసిల్లడిపోతోపాటు కొత్తబస్టాండ్, పాత బస్టాండ్, వేములవాడ బస్టాండ్ ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. టీఎస్ఆర్టీసీ జేఏసీ అధ్యక్షుడు సీహెచ్.బాణయ్య, ఉపాధ్యక్షులు జే.ఎస్.ఎన్.రావు, శ్రీనివాస్నాయక్, ప్రశాంత్, సుమలత, రాంప్రసాద్ పాల్గొన్నారు. రాజకీయ పార్టీల సంఘీభావం సిరిసిల్ల కొత్త బస్టాండులో ఆర్టీసీ జేఏసీ కార్మికుల నిరసన దీక్ష శిబిరంలో మద్దతు ప్రకటించారు. బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ఎనగందుల వెంకన్న, సీపీఎం నేతలు కోడం రమణ, అన్నల్దాస్ గణేశ్, సీపీఐ నాయకులు గుంటి వేణు, కడారి రాములు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ సంఘీభావం పలికారు. ప్రజల ఇబ్బందులు గమనించండి ఆర్టీసి జేఏసీ చేపడుతున్న నిరవధిక సమ్మెతో ప్రజలు పడుతున్న కష్టాలను కార్మికులు గమనించాలని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కోరారు. జేఏసీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. కార్మికుల 32 డిమాండ్లలో 29 నెరవేర్చడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. కార్మికులు సమ్మె విరమిస్తే.. కాంగ్రెస్ సర్కారు కడుపులో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు తదితరులున్నారు. డిమాండ్లు నెరవేర్చాలి గౌరవ అధ్యక్షుడు పిప్పరి రాజయ్య, జేఏసీ చైర్మన్ జీపీ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. డిపోలోని కంట్రోలర్లు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతూ తెలిపారు. శ్రీనివాస్, శ్రీకాంత్, లక్ష్మన్, ప్రవీన్, తదితరులు ఉన్నారు. బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు భీమన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయణంలో బస్సులు లేకపోవడంతో బస్టాండ్లో పడిగాపులు కాశారు. ఆలస్యంగా ప్రవేటు అద్దె బస్సులు రావడంతో సీట్ల కోసం పరుగులు తీశారు. వేములవాడ డిపో నుంచి గురువారం 23 ప్రైవేటు అద్దె బస్సులు, 8 ఆర్టీసీ బస్సులు నడిచినట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ బస్టాండ్లో కిక్కిరిసిన ప్రయాణికులు సిరిసిల్ల డిపో ఎదుట ఆర్టీసీ నేతల గేట్ ధర్నా -
● గాలివాన బీభత్సం ● రైతులకు తీవ్ర నష్టం
సిరిసిల్లటౌన్: జిల్లా వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పంట పొలాల్లోనే ఉన్న వరిధాన్యం నేలవాలగా.. మామిడికాయలు రాలిపోయాయి. గాలితో కూడిన వర్షం రావడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండు, లోతట్టు ప్రాంతాలైన కార్మికవాడల్లో వరద నీరు పారింది. గాంధీనగర్లో గాలివానకు పెంకుటిల్లు పైకప్పు కూలింది. బైపాస్రోడ్డు ప్రాంతంలో భారీ వృక్షాలు నేలకూలాయి. కొట్టుకుపోయిన వడ్లు తంగళ్లపల్లి: మండల కేంద్రానికి చెందిన దీకొండ అశోక్ పవర్లూమ్ కార్ఖాన షెడ్డు గోడ కూలడంతో మిషనరీ ధ్వంసమైంది. దీంతో రూ.6 లక్షల నష్టం వాటిల్లింది. అంకుసాపూర్లో ఆరబోసిన వడ్లు కొట్టుకుపోయాయి. తంగళ్లపల్లిలో మామిడితోటలకు తీవ్రనష్టం జరిగింది. రైతు ఎడమల బాల్రెడ్డి తోటలో మామిడికాయలు రాలిపోయాయి. నేలకొరిగిన వరి పంట ఇల్లంతకుంట: మండలంలోని రామాజీపేట, ఇల్లంతకుంట గ్రామాల్లో వరిచేనులు నేలకొరిగాయి. ఇల్లంతకుంట, జంగారెడ్డిపల్లె, ముస్కానిపేట, పెద్దలింగాపురం, రామాజీపేట, చిక్కుడువానిపల్లె, రహీంఖాన్పేటల్లో వర్షం కురిసింది. రామాజీపేటలోని పెండల కనకయ్య ఇంటిపై చెట్టు విరిగిపడడంతో పెంకుటిల్లు స్వల్పంగా ధ్వంసమైంది. అనంతారం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి 23 రోజులవుతున్నా కొనుగోలు చేయలేదని వెలమల మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షం.. తడిసిన ధాన్యం ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంతోపాటు రాచర్లబొప్పాపూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి అధికారులు టార్ఫాలిన్ కవర్లను కూడా అందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రెండు గ్రామాల్లో కురిసిన వర్షం గంభీరావుపేట: మండలంలోని గజసింగవరం, సముద్రలింగాపూర్ గ్రామాల్లో గురువారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా రైతులు టార్ఫాలిన్లతో రక్షించుకున్నారు. తంగళ్లపల్లిలో కూలిన పవర్లూమ్ గోడరామాజీపేటలో నేలకొరిగిన వరి చేను -
నీటి ఇబ్బందులు రానీయొద్దు
● నిత్యం పరిశీలించాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: రెండు మున్సిపాలిటీలతోపాటు అన్ని గ్రామాల్లోనూ వేసవిలో నీటి ఇబ్బందులు రానీయొద్దని, నిత్యం నీటి సరఫరాను పరిశీలించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నీటి సరఫరాపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ, గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రానున్న 45 రోజులు చాలా కీలకమని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ ద్వారా లక్ష్యం మేరకు నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలోని ప్రతీ వార్డు, విలీన ప్రాంతాలు, అన్ని మండలాల్లోని చివరి ప్రాంతాలకు నీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. నీటిని రోజూ క్లోరినేషన్ చేయించాలని, ప్రతీ పది రోజులకోసారి నీటిటాంక్లు శుభ్రం చేయించాలని ఆదేశించారు. అమృత్ పథకంలో నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అంతకుముందు సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు, మండలాలవారీగా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా లక్ష్యం.. ఎంత సరఫరా అవుతుందని కలెక్టర్ ఆరా తీశారు. మిషన్ భగీరథ ఎస్ఈ అమరేందర్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, డీఆర్డీవో మచ్చ గీత, సీపీవో పీ.బీ.శ్రీనివాసాచారి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, డీపీవో షరీఫొద్దీన్ పాల్గొన్నారు. రైల్వేలైన్ పనులు పూర్తి చేయాలి జిల్లా పరిధిలో కొనసాగుతున్న కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని క్యాబినెట్ సెక్రటరీ(కోఆర్డినేషన్) సెంట్రల్ సెక్రటేరియట్ ఆదేశించారు. రైల్వేలైన్ పనులు, భూసేకరణ, ఇతర అంశాలపై క్యాబినెట్ సెక్రటరీ(కోఆర్డినేషన్) సెంట్రల్ సెక్రటేరియట్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ గరీమా అగ్రవాల్, అటవీ శాఖ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమలశాఖ హనుమంతు, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు కల్పనాదేవి, ఖలీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నిర్ధేశిత సమయంలో అనుమతులు జారీ చేయాలి జిల్లాలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించేందుకు టీజీఐ–పాస్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ధేశిత సమయంలో అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. టీ–ప్రైడ్లో 27 వచ్చిన దరఖాస్తులకు అనుమతులు జారీ అయ్యాయని, టీజీ ఐ–పాస్లో 49 దరఖాస్తులు రాగా.. 31 అనుమతులు జారీ చేసినట్లు వివరించారు. పరిశ్రమలశాఖ జీఎం హనుమంతు, జిల్లా రవాణాశాఖ అధికారి వి.లక్ష్మణ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సంగీత, కార్మికశాఖ అధికారి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా !
● లక్షలు వసూలు చేసినట్లు సమాచారం ● ఎవరినీ నమ్మొద్దంటూ ప్రభుత్వ విప్ కరపత్రం విడుదలవేములవాడ/వేములవాడరూరల్: కలెక్టరేట్లో పనిచేసే ఓ అధికారి కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసుకొని, కాలయాపన చేస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగాల విషయమై సదరు ఉద్యోగిని నిరుద్యోగులు నిలదీస్తే రేపు, మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏడాదికాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు సదరు ఉద్యోగిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్శాఖ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ అధికారి కలెక్టరేట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశాడు. అతని బాధితులు వేములవాడతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. అయితే ఏడాదికాలంగా ఉద్యోగాలు ఇప్పించకపోగా తప్పించుకు తిరుగుతుండడంతో సదరు ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు. డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి నియోజకవర్గంలో కొందరు నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని తన పేరు చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈమేరకు బుధవారం ఓ కరపత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రాజన్నగుడి, కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల పేరుతో మోసాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మొద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
తెరుచుకున్న మూత్రశాలలు
ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రంలోని మూత్రశాలల తాళం తీశారు. ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఇల్లంతకుంట గ్రామపంచాయతీ సిబ్బంది మూత్రశాలల తాళాలు బుధవారం తీశారు. బాటసారులు ప్రయాణికులు గ్రామపంచాయతీ సిబ్బందికి, ‘సాక్షి’ దినపత్రికకు ధన్యవాదాలు తెలియజేశారు. వరదలతో ఎగువ మానేరు ఎఫ్రాన్కు నష్టంముస్తాబాద్(సిరిసిల్ల): భారీ వరదలతో ఎగువ మానేరు ప్రాజెక్టు ఎఫ్రాన్ దెబ్బతిందని ప్రాజెక్టు ఈఈ ప్రశాంత్కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ‘సాక్షి’లో ‘ఎగువ మానేరుకు ముప్పు’ శీర్షికన కథనానికి ఈఈ స్పందించారు. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిశాయని, భారీ వరదలతో ప్రాజెక్టుకు ఫ్లాష్ఫ్లడ్ వచ్చిందన్నారు. డౌన్స్ట్రీమ్తో ఎఫ్రాన్ దెబ్బతిందన్నారు. నిపుణుల కమిటీ సర్వే కోసం తాము ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిపుణుల కమిటీ సిఫారసుతో తక్షణ, దీర్ఘకాలిక చర్యలను చేపట్టామన్నారు. చీఫ్ ఇంజినీర్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సూచనలు అందిన తర్వాత నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఆర్టీసీ సమ్మె.. బస్సులు సగమే
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్టౌన్: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు బుధవారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు దిగడం ఉమ్మడి జిల్లా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్–1, కరీంనగర్–2, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని మొత్తం 11 డిపోల్లోని ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3,057 మంది ఆర్టీసీ సిబ్బంది పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 99 శాతం మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. కేవలం 40 మంది డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం విధులకు హాజరు కాగా, మిగతా వారంతా సమ్మెలో పాల్గొన్నారు. అన్ని డిపోల వద్ద కార్మికులు నిరసనలకు దిగగా.. ముందు జాగ్రత్త చర్యగా తెల్లవారుజాముకు ముందే పోలీసు బలగాలు మోహరించారు. కరీంనగర్ రీజియన్లో దాదాపు 1,000 బస్సులు అందుబాటులో ఉండగా.. బుధవారం 401 బస్సులను హైదరాబాద్, వరంగల్, వేములవాడ, గోదావరిఖని, మెట్పల్లి, తదితర అన్ని రూట్లలో నడిపారు. 330 అద్దెబస్సులు, వాటి డ్రైవర్లు విధుల్లో పాల్గొన్నారు. ప్రయాణికుల ఇక్కట్లు జిల్లాలో రైల్వే మార్గాలు అంతగా అభివృద్ధి చెందకపోవడంతో సింహభాగం ప్రజారవాణాకు ఆర్టీసీ మీదే ఆధారపడాలి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజారవాణా దాదాపుగా స్తంభించింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం డిగ్రీ, ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లు, ట్యాక్సీలు ఽచార్జీలు అమాంతంగా పెంచారు. హైదరాబాద్, వరంగల్ రూట్లలోనూ ట్యాక్సీ డ్రైవర్లు చార్జీలు రూ.500 నుంచి రూ.800 వరకు ముక్కుపిండి మరీ వసూలు చేశారు. మరోవైపు కార్పూలింగ్, కార్ షేరింగ్ యాప్లకు డిమాండ్ పెరిగింది. వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కరీంనగర్ బైపాస్ వద్ద ప్రమాదం జరగడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అనుభవం లేని ప్రైవేటు డ్రైవర్కు బస్సులు ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగింది ఆర్టీసీ ఐకాస నాయకులు ఆరోపించారు.కరీంనగర్ రీజియన్ పరిధిలో.. డిపోలు 11ఆర్టీసీ బస్సులు 550అద్దె బస్సులు 330ఎలక్ట్రికల్ బస్సులు 100ఆర్టీసీ డ్రైవర్లు 984ఆర్టీసీ కండక్టర్లు 1,354ఇతర సిబ్బంది 719 (ఆఫీసు, డిపో,వర్క్షాపులు కలిపి) -
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోయినపల్లి(చొప్పదండి): రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయినపల్లి, తడగొండల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. తహసీల్దార్ షరీఫ్ మొయినొద్దీన్, ఎంఏవో ప్రణిత, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, భీంరెడ్డి మహేశ్రెడ్డి ఉన్నారు. దళారులకు ధాన్యం అమ్ముకోవద్దు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బుచ్చి బాబు, ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేర బేగం, సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య కోరారు. ఎల్లారెడ్డిపేట సింగిల్విండో ఆధ్వర్యంలో నారాయణపూర్, వెంకటాపూర్ రైతుల సౌకర్యార్థం వరి కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. డీఎంఎస్ నరసింహ, ఏఎంసీ వైస్చైర్మన్ గుండాడి రాంరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ షఫీయొద్దీన్, ఉపసర్పంచ్లు మోతె మధుసూదన్రెడ్డి, గొట్టె శ్రీకాంత్, సెక్రెటరీ అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాంటెడ్ డ్రైవర్స్..కండక్టర్స్ సిరిసిల్లటౌన్/వేములవాడ అర్బన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ డిపోలలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్, కండక్టర్గా పనిచేయుటకు ఆసక్తి గల యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎం ప్రకాశ్రావు తెలిపారు. డ్రైవర్కు హెవీ లైసెన్స్తో 18 నెలల అనుభవం ఉండాలని, ఒరిజినల్ లైసెన్స్, ఆధార్కార్డు, 2 ఫొటోలు, కండక్టర్కు ఎస్సెస్సీ ఉత్తీర్ణులై, ఒరిజినల్ మెమో, ఆధార్కార్డు, 2 ఫొటోలతో సిరిసిల్ల బస్సు డిపోలో సంప్రదించాలని కోరారు. డ్రైవర్కు రోజుకు రూ.1000, కండక్టర్కు రోజుకు రూ.800 వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. వివరాలకు 99592 25929, 86868 69005, 81783 71273 నంబర్లలో సంప్రదించాలని కోరారు. స్వీయ జనగణనలో పాల్గొనాలి సిరిసిల్లటౌన్: జనగణన–2027 స్వీయ ఎన్యూమరేషన్లో సిరిసిల్ల పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ ఎం.ఏ.ఖదీర్పాషా కోరారు. ఈమేరకు బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ జనగణన అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సౌకర్యం ద్వారా ప్రతీ కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకింగ్, ఐటీరంగ ఉద్యోగులు, కాలనీ సంక్షేమ సంఘాలు పాల్గొనాలని కోరారు. htt ps://se.census.gov.in వెబ్ పోర్టల్ను సందర్శించి కుటుంబ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. మేలో సదరం శిబిరాలు సిరిసిల్ల: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మే నెలలో నిర్వహించే సదరం శిబిరాల తేదీలను ఖరారు చేసినట్లు ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్ బుధవారం తెలిపారు. మే 2, 4, 5 ఆర్థోపెడిక్, 5, 6 వినికిడి(చెవుడు), 6న మానసిక దివ్యాంగులకు, 7, 12న కంటిచూపు పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. మే 13న జనరల్ వైద్యపరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. -
ఈత సరదా విషాదంగా మారొద్దు
● మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు ● వేసవి సెలవుల్లో జాగ్రత్తగా ఉండాలి ● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల: వేసవి సెలవుల్లో ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. ఈత నేర్చుకోవాలన్న సరదా విషాదం కాకుండా చూసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈత రాని వారు బావులు, చెరువులు, కాలువల వద్దకు ఒంటరిగా వెళ్ల వద్దని, తల్లిదండ్రుల సమక్షంలోనే నేర్చుకోవాలని సూచించారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు సైతం నిఘా పెట్టాలన్నారు. ఈత సరదాపై పోలీస్ శాఖ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకండి తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ఎస్పీ సూచించారు. ఒక వేళ వాహనం ఇస్తే, తెలిసీ, తెలియని డ్రైవింగ్తో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ వాహనంతో పట్టుబడితే వాహన యజమానిపై కేసు నమోదు చేస్తారని హెచ్చరించారు. -
రేషన్ పక్కదారి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్బియ్యం పక్కదారి పడుతున్నాయి. చౌకధరల దుకాణంలోని సన్నబియ్యం ప్రైవేట్మార్కెట్కు చేరుతున్నాయి. డీలర్లే దుకాణాల్లో ధర కడుతున్నారు. ఇలా పేదలకు అందాల్సిన పౌష్టికాహారం ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో పడి అధిక ధరలకు విక్రయాలు జరిగిపోతున్నాయి. చౌకధరల దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ ఫోకస్ కథనం. దుకాణాల్లోనే కట్టబెడుతున్నారు రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 345 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో ప్రతీ నెల 3,700 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే చాలా మంది రేషన్కార్డు లబ్ధిదారులు రేషన్బియ్యాన్ని తినడం లేదు. దీంతో అత్యధికులు డీలర్లతోనే మాట్లాడుకుని కిలోకు రూ.15 వరకు తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్న బియ్యాన్ని డీల ర్లు గ్రామాల్లోని ప్రైవేట్ వ్యక్తులకు కిలోకు రూ.20 చొప్పున విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. అర్ధరాత్రి తరలింపు జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీల్లోని రేషన్డీలర్లు సన్నబియ్యాన్ని అత్యధిక మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నారు. పొద్దంతా వినియోగదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్లు అర్ధరాత్రి వరకు దుకాణాల్లోనే ఉంటున్నారు. అక్కడే అర్ధరాత్రి దాటే వరకు స్నేహితులతో కలిసి మందుపార్టీలు చేసుకుంటున్నారు. డీలర్లు అర్ధరాత్రి పూట గ్రామాల్లో చక్కర్లు కొట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జనం గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ట్రాలీ ఆటోలలో బియ్యం బస్తాలను తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీల్లో రేషన్డీలర్లకు కోటా ఎక్కువగా వస్తుండడం.. కొంత ఆర్థికంగా ఉన్న వారు రేషన్బియ్యాన్ని తినేందుకు ఇష్టపడకపోవడం వీరికి కలిసి వస్తుంది. ఎంతో కొంత నగదును సదరు లబ్ధిదారులకు ముట్టజెప్పి ఆ బియ్యాన్ని తెల్లవారుజామున ఇతర ప్రాంతాలకు తరలిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. సమయపాలన కరువు జిల్లాలోని చాలా చౌకధరల దుకాణాల వద్ద కనీసం బోర్డులు కూడా కనిపించడం లేదు. అంతేకాకుండా సమయపాలన లేకుండా దుకాణాలు మూసివేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డీలర్లకు కుదిరినప్పుడు దుకాణాలు తీస్తూ బియ్యం పంపిణీ చేస్తుండడం వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. ఊరికో బ్రోకర్రేషన్దందా పెద్ద మాఫియాగా ఏర్పడింది. ఊరికో బ్రోకర్ను ఏర్పాటు చేసుకొని బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యం కామారెడ్డి, సిరిసిల్ల పట్టణాల్లోని రైస్మిల్లులకు చేరుతున్నాయి. ఇక్కడ ప్రాసెస్ చేసి సరికొత్త బ్రాండెడ్ ప్యాకెట్లలో నింపి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా పేదల బియ్యం ప్రైవేట్ మార్కెట్లో వ్యాపారవస్తువుగా మారుతుంది. పల్లెల్లో వినియోగదారుల నుంచి రేషన్బియ్యాన్ని సేకరిస్తున్న బ్రోకర్లు ఇటీవల కామారెడ్డి, సిరిసిల్ల పట్టణాలకు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఊరికి ఐదారుగురు బ్రోకర్లు రేషన్బియ్యాన్ని సేకరించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల వారం రోజుల్లో రేషన్ బియ్యం తరలిస్తున్న మూడు వాహనాలను, బ్రోకర్లను పోలీసులు పట్టుకున్నారు. -
‘సాయ్’ పిలుస్తోంది
కరీంనగర్స్పోర్ట్స్: క్రీడా రంగానికి భారత క్రీడాప్రాధికారిక సంస్థ మార్గదర్శకంగా నిలుస్తుంది. పంజాబ్ రాష్ట్రం పటియాలలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ యువ క్రీడాకారులకు సువర్ణావకాశాన్ని అందించింది. 2026–27 సంవత్సరంలో పలు కోర్సుల్లో శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రీడలను వృత్తిగా తీసుకోవాలనుకునే యువతకు గొప్ప అవకాశం. కోర్సులు కేవలం శిక్షణకు మాత్రమే కాకుండా, శాసీ్త్రయ ధృక్పథంతో ప్రొఫెషనల్గా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడనున్నాయి. కోర్సులు పూర్తి చేసిన క్రీడాకారులు దేశవ్యాప్తంగా కోచ్లుగా, ఫిట్నెస్ ట్రైనర్లు, అనలిస్ట్, క్రీడా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో అవకాశాలు పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా అవకాశాలు దొరుకుతాయి. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత https:// www. dipsc. nsnis. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా పలు కోర్సుల వివరాలతో కథనం. కోర్సుల వివరాలు 42వ ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ (2 ఏళ్లు), 64వ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, 5వ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్, 4వ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ సైకాలజీ, 4వ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, 4వ పీజీ డిప్లొమా ఇన్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ (ఒక సంవత్సరం). కాగా 64వ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్కు దరఖాస్తులు ఈ నెల 23 లోపు, మిగిలిన కోర్సులకు ఈ నెల 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సీట్లు ఇలా.. 64వ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ ఒక ఏడాది నిర్వహిస్తారు. 26 క్రీడాంశాల్లో 785 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్చరీ 30, అథ్లెటిక్స్ 75, బ్యాడ్మింటన్ 20, బ్యాడ్మింటన్ 20, బాస్కెట్బాల్ 30, బాక్సింగ్ 50, కానోయింగ్ కయాకింగ్ 15, సైక్లింగ్ 30, ఫెన్సింగ్ 30, ఫుట్బాల్ 50, జిమ్నాస్టిక్స్ 20, హ్యాండ్బాల్ 20, హాకీ 50, జూడో 30, కబడ్డీ 30, ఖోఖో 20, రోయింగ్ 10, షూటింగ్ 20, స్విమ్మింగ్ 20, టేబుల్ టెన్నిస్ 40, తైక్వాండో 20, టెన్నిస్ 20, వాలీబాల్ 30, వెయిట్లిఫ్టింగ్ 30, రెజ్లింగ్ 50, వుషూ 25, యోగాసన 20 సీట్లు ఉన్నాయి. క్రీడల కోర్సుకు దరఖాస్తులు ప్రొఫెషనల్ ట్రైనింగ్తో భరోసా క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి చాన్స్ 42వ ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ క్రీడలివే.. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్ లిప్టింగ్, రెజ్లింగ్. ఆధునిక క్రీడల్లో డేటా విశ్లేషణ కీలకం. పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ వంటి కోర్సులు చేయడం ద్వారా ప్రత్యర్థుల బలహీనతలను పసిగట్టే నైపుణ్యం లభిస్తుంది. ఇది క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతుంది. కోర్సులు పూర్తి చేసినవారు పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ క్లబ్లలో ఫిట్నెస్ నిపుణులుగా స్థిరపడి, ఆరోగ్యవంతమైన క్రీడా సమాజాన్ని నిర్మించగలరు. – నాగిరెడ్డి సిధారెడ్డి, శాట్స్ అసిస్టెంట్ రిటైర్డ్ డైరెక్టర్ -
కోర్సులపై దృష్టి పెట్టాలి
ప్రభుత్వం అందిస్తున్న కోర్సులు యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. క్రీడారంగంలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇవి కీలకం. గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా మంచి అవకాశాలు అందిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా ఇవి చాలా సహాయపడతాయి. ప్రతీ క్రీడాకారుడు కోర్సులపై దృష్టి పెట్టాలి. – బుర్ర మల్లేశ్గౌడ్, కబడ్డీ సంఘం కార్యదర్శి శిక్షణ ద్వారా క్రీడాకారులు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు శిక్షణ ఇచ్చే మెలకువలు నేర్చుకుంటారు. శాసీ్త్రయ శిక్షణ పద్ధతులు నేర్పుతారు. ట్రైనింగ్ తీసుకున్నవారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోచ్గా ఎదిగి, దేశానికి పతకాలు తెచ్చే క్రీడాకారులను తయారు చేయొచ్చు. – బసరవేణి లక్ష్మణ్, హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి ఈ కోర్సులు క్రీడాకారులకు కొత్త దిశను చూపుతాయి. శిక్షణతో పాటు శాసీ్త్రయ పరిజ్ఞానం అందించడం గొప్ప విషయం. ప్రస్తుతం ప్రొఫెషనల్ కోచ్లకు డిమాండ్ పెరుగుతోంది. కోర్సులు పూర్తి చేసినవారు దేశానికి మంచి సేవ చేయగలరు. – గెల్లు మధుకర్యాదవ్, ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ కోచ్ -
కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం రసాభాస
● మున్సిపల్ చైర్పర్సన్ వర్సెస్ ఏఎంసీ చైర్పర్సన్సిరిసిల్ల అర్బన్: మున్సిపల్ పరిధిలోని పెద్దూరు, రగుడు, సర్ధాపూర్ గ్రామాల్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఇద్దరు చైర్పర్సన్ల మధ్య బుధవారం ఘర్షణ వాతావరనం చోటుచేసుకుంది. పెద్దూరులో స్థానిక కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి రాక ముందే కేంద్రాన్ని ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలోని మెప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఇటు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, అటు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూపరెడ్డి చేరుకున్నారు. పెద్దూరు, సర్ధాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇద్దరి మధ్య రసాభాస చోటుచేసుకుంది. చివరికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపరెడ్డి ప్రారంభించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో మున్సిపల్ వారికే బాధ్యత ఉంటుందని అధికారులు పేర్కొనడం విశేషం. మెప్మా ఏవో ఫసహత్ అలీ బేగ్, నాయకులు తిరుపతిరెడ్డి, అశోక్రావు, రెడ్డినాయక్, నక్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
కులసంఘాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: కులసంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేములవాడలో అన్ని కులసంఘాలకు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని రెండో బైపాస్రోడ్డులో మున్నూరుకాపు కల్యాణ మండపాన్ని బుధవారం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్చైర్మన్ నరాల శేఖర్, మున్నూరుకాపు సంఘం నాయకులు కొండ దేవయ్య, కోయినేని బాలయ్యలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు సమానంగా చేస్తున్నట్లు వివరించారు. -
వడదెబ్బతో వలస కూలీ మృతి
ధర్మపురి: జీవనోపాధి కోసం వలస వచ్చిన కూలీ వడదెబ్బ తగిలిమృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన యోహన్ అలియాస్ మహేష్ (28) కూలీ పనుల కోసం ధర్మపురి వచ్చాడు. మండలంలోని కమలాపూర్లో బుధవారం అతిగా మద్యం సేవించాడు. వడదెబ్బకు గురై మృతి చెందాడు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి విక్రేత అరెస్ట్ధర్మపురి:గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన ప్రణీత్కుమార్ గంజాయికి అలవాటు పడ్డాడు. పైగా విక్రయించేందుకు సిద్ధమయ్యారు. పట్టణంలోని పెట్రోల్ పంప్ వద్ద అనుమానాస్పదంగా వెళ్తుండడంతో పోలీసులు సోదా చేయగా అతని వద్ద 60 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని సీజ్ చేసి యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై తెలిపారు. ముగ్గురికి జైలుకరీంనగర్క్రైం: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురికి కరీంనగర్ కోర్టు 4 రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. మొగ్గ ప్రశాంత్, బోయిని గంగరాజు, భానోతు జయరాంకు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. మహిళ ఆత్మహత్యాయత్నంకరీంనగర్క్రైం: కరీంనగర్కు చెందిన ఓ మహిళ కుటుంబ గొడవలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంటానని పద్మనగర్లోని వాటర్ ట్యాంక్ ఎక్కింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమందించారు. వెంటనే స్పందించిన టూటౌన్ సీఐ సృజన్రెడ్డి, డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాస్రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మహిళకు నచ్చజెప్పి కిందకు తీసుకొచ్చారు. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. గుడుంబా విక్రేతలపై కేసువీర్నపల్లి: మండలంలోని భావుసింగ్నాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని గొన్యనాయక్తండాలో గుడుంబా స్థావరాలపై పోలీ సులు బుధవారం దాడి చేశారు. గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరు పట్టుబడ్డట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన సుమారు 100 లీటర్ల బెల్లం, సారాయికి ఉపయోగించే ముడి పదార్థాలను ధ్వంసం చేశారు. -
గుండెపోటుతో వైద్యుడి హఠాన్మరణం
భైంసాటౌన్/ఎల్లారెడ్డిపేట: నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన వైద్యుడు, నర్సాపూర్(జి) ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ జీడి సురేందర్(50) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. బైంసాలోని తన ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఓ రోగికి వైద్యసేవలు అందిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. పేద కుటుంబం నుంచి.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్దాస్పేటకు చెందిన జీడి సాయిలు, పోశవ్వ దంపతుల కుమారుడు జీడి సురేందర్. పదో తరగతి వరకు స్థానిక జెడ్పీ పాఠశాల, ఇంటర్ సిరిసిల్లలో, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతుండగానే వెటర్నరీ శాఖలో ఉద్యోగం పొందారు. అనంతరం వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. 2011లో భైంసాలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఎంతో మంది పేదలకు వైద్యసేవలందించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి కష్టపడి చదివిన సురేందర్ ఎల్లారెడ్డిపేట నుంచి మొట్టమొదటి డాక్టర్గా పట్టా అందుకున్నారు. బైంసా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యం అందించే పేదల డాక్టర్గా పేరు గడించారు. సురేందర్కు భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు ప్రీతి, అవంతిక. ఒకరు హైదరాబాద్లో మెడిసిన్ చదువుతుండగా, చిన్న కూతురు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. డాక్టర్ హఠాన్మరణంపై పట్టణ ప్రముఖులతోపాటు వైద్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఉద్యమకారుల ఎంపిక విధానం సరిగా లేదు
అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ కరీంనగర్ టౌన్: తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక విధివిధానం సరిగా లేదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ అన్నారు. బుధవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబాలను, దివ్యాంగులైన ఉద్యమకారులను, జైలుకెళ్లిన ఉద్యమకారులను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం కమిటీని ప్రకటిస్తే.. ఆ కమిటీకి సంబంధించిన జీవో కాలపరిమితి విధివిధానాలు బహిర్గతం చేయాలని అన్నారు. వివిధ సంఘాలకు నాయకత్వం వహిస్తూ ఉద్యమంలో పాల్గొన్న వారి పత్రిక వార్తలు, వీడియోల ఆధారంగా గుర్తించాలన్నారు. ఉద్యమకారుల మనోభావాలను గుర్తించి కమిటీ విధివిధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి, చొప్పరి సుధాకర్, గరిగే కోటేశ్వర్, మేకల మాధవి, కారుపాకల మున్న, గర్షకుర్తి ఉమారాణి, మహాదేవుని భార్గవి, బాలామణి, వనజ, పద్మ, కనకలక్ష్మి, సంధ్య, కోమల, శారద, సుజాత, దేవేంద్ర, గాలి రమేశ్, బూడిద వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో ఎన్పీడీసీఎల్ కీలకపాత్ర పోషిస్తోందని ఎస్ఈ వేణుమాధవ్ పేర్కొన్నారు. జిల్లా సర్కిల్ పరిధిలో 1,427 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రెండు అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేశారు. డీఈ వెంకటరమణ, చంద్రమౌళి, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్, ఆనంద్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి ఎండాకాలం దృష్ట్యా వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని జిల్లా సూపరింటెండింగ్ ఇంజినీర్ టి.వేణు మాధవ్ కోరారు. ఎల్లారెడ్డిపేటలోని 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను తనిఖీ చేశారు. ఆయిల్ లెవల్స్, కూలింగ్ సిస్టమ్ను ఎస్ఈ పరిశీలించారు. లైన్మెన్లు ఫీల్డ్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. డివిజినల్ ఇంజినీర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: పోటీ పరీక్షలకు ప్రణాళికతో సిద్ధం కావాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని సినారె జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో కలెక్టర్ మంగళవారం మాట్లాడారు. విద్యార్హతలు, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు? ఏయే పుస్తకాలు చదువుతున్నారని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులు ప్రణాళిక ప్రకారం ప్రతీ అంశం క్షుణ్ణంగా చదవాలన్నారు. కరెంట్ అఫైర్స్, ఇతర అన్ని అంశాలపై అవగాహనతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా రిఫరెన్స్గా తీసుకోవాలని సూచించారు. జనగణన పూర్తి చేయాలి సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు జనగణన– 2027ను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. జనగణన హౌస్ లిస్టింగ్ బ్లాక్స్, సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ విధానం, స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్)పై సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు శిక్షణ కొనసాగుతుండగా చివరి రోజు మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. జనగణనకు సంబంధించిన కిట్లను పంపిణీ చేశారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారన్నారు. ప్రతీ కుటుంబం వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. సీపీవో శ్రీనివాసాచారి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, తహసీల్దార్ మహేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్లటౌన్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అధ్యక్షుడు గుండమనేని మహేందర్రావు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన 12 వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సి న బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఏక మొత్తంగా రూ.10,000 కోట్లు కేటాయించి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి, కేజీబీవీ, సమగ్ర శిక్షా ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మే 2న యుటీఎఫ్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి 10వ వర్ధంతి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, కోశాధికారి అంబటి రమేశ్, జిల్లా కార్యదర్శులు కొత్వాల్ ప్రవీణ్, పాముల స్వామి, ఆడెపు శివకుమార్, తిరుపతి జాదవ్, అరవింద్ పాల్గొన్నారు. -
కో ‘ఆప్షన్’కు నాలుగు నామినేషన్లు
● వేములవాడ కో ఆప్షన్ ఎన్నికలకు నేడు చివరి గడువు వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నామినేషన్లకు గడువు 22వ తేదీతో ముగియనుండగా, ఇప్పటి వరకు కేవలం నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన చీకోటి శ్రీహరి, తోట లహరి, అబ్దుల్ రజాక్, నామాల వరలక్ష్మి నామినేషన్లు దాఖలు చేసినట్లు మేనేజర్ సంపత్ తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నలుగురికి ఆప్షన్ వేములవాడ మున్సిపాలిటీలో మొత్తం నాలుగు కో ఆప్షన్ పోస్టుల్లో రెండు మైనార్టీలకు, రెండు స్పెషల్ నాలెడ్జ్ పర్సన్స్కు కేటాయించిన విషయం తెలిసిందే. ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఎవరి పేరును ఫైనల్ చేయాలన్న దానిపై అధికార పార్టీ ఇంకా స్పష్టతకు రాలేదు. అయితే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎవరికి ఆప్షన్ ఇస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది. విప్ బిజీ.. నిర్ణయం పెండింగ్ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో తుది నిర్ణయం పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా విప్ ఆది శ్రీనివాస్ బిజీ షెడ్యూల్ కారణంగా అభ్యర్థుల ఎంపికపై ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆశావహులు ‘చివరి నిమిషం’ వరకు వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. మంగళ, బుధవారాల్లో వీటిని ఫైనల్ చేసే అవకాశాలున్నాయని పాలకవర్గ సభ్యులు అంటున్నారు. లాబీయింగ్ జోరు ఇప్పటికే ఆశావహులు పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు ముమ్మరం చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకుల ద్వారా తమ పేర్లు ముందుకు తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చివరి రోజునే నామినేషన్ల వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయన్న చర్చ సాగుతోంది. శీనన్న ఆశీస్సులు ఎవరికి ఉంటాయోనని చర్చించుకుంటున్నారు. తలనొప్పిగా ఎంపిక ప్రక్రియ మైనార్టీ కోటాలో వర్గాల మధ్య సమతుల్యత, స్పెషల్ నాలెడ్జ్ కేటగిరీలో అర్హతల ఎంపిక వంటి అంశాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఒకరికి అవకాశం ఇస్తే, మరో వర్గం అసంతృప్తి చెందే పరిస్థితి ఉండడంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. నామినేషన్ల గడువు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కాగా, కో ఆప్షన్ పదవులు ఎవరిని వరిస్తాయోనని ఆసక్తి నెలకొంది. -
పెండింగ్ కేసులపై అలసత్వం వద్దు
బోయినపల్లి(చొప్పదండి): సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ మహేశ్ బీ గితే ఆదేశించారు. మంగళవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎస్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దని, పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసి, చట్టపరంగా నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం తాగి వాహనం నడపడం, మెనర్ డ్రైవింగ్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కోరారు. డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రమాకాంత్, సిబ్బంది ఉన్నారు. -
వైభవంగా శంకర జయంతి
వేములవాడ: రాజన్న సన్నిధిలో శంకర జయంతి మహోత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. వైశాఖ శుద్ధ పాఢ్యమి నుంచి పంచమి వరకు జరిగిన మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు మూలమూర్తులైన లక్ష్మీగణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు చేశారు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేద సదస్సు నిర్వహించారు. నాలుగురోజులుగా జరుగుతున్న శంకర జయంతి ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ స్థానాచార్యులు ఉమేశ్శర్మ తెలిపారు. ఈవో రమాదేవి, అర్చకులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైతులకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి బుగ్గరాయేశ్వర తండాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు నేరుగా వారి ఖాతాలోనే వారం రోజుల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత, ఏఎంసీ చైర్మన్ సబేరాబేగం, ప్రత్యేక అధికారి షఫీ, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రామ్రెడ్డి, సర్పంచులు ఇల్లందుల గీతాంజలి, అజ్మీరా తిరుపతినాయక్, అందే సుభాష్, కొండ రమేశ్గౌడ్, నాయకులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యం తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యమని ఎస్ఈ టి.వేణుమాధవ్ అన్నారు. మంగళవారం మండలంలోని అంకిరెడ్డిపల్లిలో నిర్వహించిన ‘ప్రజా బాట’ కార్యక్రమంలో వినియోగదారుల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో వోల్టేజీ సమస్య తలెత్తకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ప్రమాదకరంగా వేలాడుతున్న లూజ్ లైన్లు సరిదిద్దడం, స్తంభాల ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యూనిఫాం సర్వీస్ లైన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. విద్యుత్ వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు స్వయంగా ప్రయత్నించకుండా వెంటనే సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ఆపరేషన్ డీఈ అంజయ్య, ఏడీఈ గోపీనాథ్, ఏఈ మధుకర్, సర్పంచ్ రాగుల రాజిరెడ్డి, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయాలిసిరిసిల్లటౌన్: ఆర్టీసీ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని జేఏసీ చైర్మన్ బాణయ్య కోరారు. రాష్ట్ర కమిటీ సమ్మె సన్నాహక పిలుపులో భాగంగా మంగళవారం సిరిసిల్ల డిపో ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ అందించాలని కోరారు. జేఏసీ వైస్ చైర్మన్లు జేఎస్ఎన్ రావు, బి. శ్రీనివాస్, కన్వీనర్ రమేశ్, గ్యారేజ్ కో కన్వీనర్ మల్లేశం, నాగసాగర్, భూమయ్య, మల్లయ్య, సత్తయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులు స్వయం ఉపాధి సాధించాలిసిరిసిల్ల: జిల్లాలో నిరుద్యోగులు స్వయం ఉపాధి సాధించి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ టి.హనుమంతు కోరారు. కలెక్టరేట్లోని జిల్లా పరిశ్రమల కేంద్రంలో మంగళవారం నిరుద్యోగ యువకులు, మహిళా సంఘాలకు, ఆసక్తి గల వ్యాపారులకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జననేషన్ (పీఎంఈజీపీ) పథకంలో తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవల రంగానికి రూ.20 లక్షలు, రూ.10లక్షల వరకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణవసతి ఉందన్నారు. ఇందులో 15 నుంచి 35 శాతం మేరకు సబ్సిడీ ఉందన్నారు. పీఎంఎఫ్ఎంఈ (ఫుడ్ ప్రాసెసింగ్) యూనిట్లకు వ్యక్తిగతంగా రూ.10లక్షలు, ఎస్హెచ్జీ గ్రూపులకు రూ.3కోట్ల వరకు రుణ వసతి ఉందని, ఇందులో 35 శాతం సబ్సిడీ వస్తుందన్నారు. ఆసక్తి గల వారు జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. -
వాణిజ్య పంటలు సాగు చేయాలి
కోనరావుపేట/వేములవాడఅర్బన్: రైతులు వాణిజ్య పంటలు సాగు చేయాలని, పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం, వేములవాడ మండలం అనుపురం గ్రామంలో నాంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. కోనరావుపేట మండలకేంద్రంలో జరిగిన ఎల్లమ్మ సిద్ధోగంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మెరుగైన విత్తనాలు అందిస్తున్నారని వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, ఆయిల్పాం సాగు చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ వరలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, కౌన్సిలర్ కాశ శ్రీనివాస్, సర్పంచులు బోయిని దేవరాజు, శేర్ల రాజేశ్వరి, కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్పాషా, నందూగౌడ్, కర్రోళ్ల భాస్కర్, బాలరాజు, కార్తీక్, మల్లేశం, ఎర్రం రాజు, సత్తయ్య, ఆగయ్య, ప్రదీప్, సల్మాన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు చందుర్తి(వేములవాడ): అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం చందుర్తి రైతు వేదికలో 90 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మండలంలో సాగు నీటి కోసం ఆశిరెడ్డిపల్లె కొత్త చెరువులోకి ఎల్లంపల్లి నీటిని మళ్లించేందుకు రూ.23లక్షలతో కాలువ పనులు కొనసాగుతున్నాయన్నారు. కలికోట సూరమ్మ చెరువు పనులకు రూ.320 కోట్లు అవసరం ఉండగా, ప్రస్తుతం పనులు ప్రారంభించేందుకు రూ.250 కోట్లు మంజూరయ్యాయని, పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, సర్పంచ్ పులి సత్తయ్య, తహసీల్దార్ గొట్టే భూపతి, ఎంపీడీవో లెంకల రాధ, పార్టీ అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, నాయకులు పాల్గొన్నారు. -
ప్రజావాణి సమస్యలు పరిష్కరించండి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● 218 దరఖాస్తులు స్వీకరణసిరిసిల్ల అర్బన్: ప్రజావాణిలో అర్జీలను పెండింగ్ పెట్టకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి స్వీకరించారు. మొత్తం 218 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించాలని సూచించారు. పింఛన్ ఇప్పించండి మాది ఇల్లంతకుంట మండలం సిరికొండ. నా భర్త మల్లయ్య నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. నా వ యసు 85 ఏళ్లు. నాకు ఇప్పటి వరకు పింఛన్ రా వడం లేదు. పింఛన్ ఇప్పించి, న్యాయం చేయండి. – దనుల బుచ్చవ్వ, సిరికొండ పశువైద్య భవనం నిర్మించండి వేములవాడ మండలం చింతల్ఠాణా ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్మించిన పశువైద్యశాల భవనాన్ని అంగన్వాడీ కేంద్రానికి వాడుతున్నారు. పశువైద్యశాల భవనం నిర్మించి, గ్రామంలో గాలికుంటూ వ్యాధి టీకా కార్యక్రమం ఏర్పాటు చేసి, పశువులకు నీటికుండీలు నిర్మించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. – చింతల్ఠాణా, ఆర్అండ్ఆర్ కాలనీ న్యాయం చేయండి మాది సిరిసిల్ల పట్టణంలోని ఇందిరానగర్. నేను ఐకేఎఫ్ ప్రైవేట్ బ్యాంకు నుంచి రూ.9లక్షలు లోన్ తీసుకున్నాను. నా ఆరోగ్యం బాగా లేకపోవడంతో నాలుగు ఈఎంఐలు కట్టలేకపోయాను. షుగర్తో కాలు తీసివేశారు. కొంచెం సమయం ఇవ్వండి కడుతామని చెప్పినా వినకుండా మమ్మల్ని ఇంటి నుంచి బయటకు గెంటివేశారు. ఇంటికి వేసిన తాళం ఇప్పించి న్యాయం చేయండి. – బాగం గోపాల్, సిరిసిల్ల ‘డబుల్’ ఇళ్లు ఇప్పించండి సిరిసిల్ల పట్టణంలోని 29వ వార్డుకు చెందిన మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల డ్రాలో 18 మంది పేర్లు వచ్చినవి. రెండేళ్లుగా ఇస్తామంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. అద్దె ఇండ్లలో ఉంటూ ఇబ్బంది పడుతున్నాం. ఎలాగైనా మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పించండి. – డ్రాలో పేర్లు వచ్చిన లబ్ధిదారులు -
అంబేడ్కర్ సంస్కరణలకు కాంగ్రెస్ తిలోదకాలు
సిరిసిల్లటౌన్: అంబేడ్కర్ సంస్కరణలకు కాంగ్రెస్ తిలోదకాలిచ్చిందని బీజేపీ జిల్లా ఇన్చార్జి గంగాడి మోహన్రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని బీ జేపీ జిల్లా ఆఫీస్లో సోమవారం నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ అంబేడ్కర్ జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా స్మారక స్థలాలు అభివృద్ధి చేశారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాయకులు లింగంపల్లి శంకర్, అల్లాడి రమేశ్, ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీ నివాస్, ఉపాధ్యక్షుడు మల్లారపు సంతోష్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాజాసింగ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు అన్నపూర్ణ పాల్గొన్నారు. ‘డబుల్’ ఇళ్లు పరిశీలన వేములవాడ/వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను మున్సి పల్ చైర్మన్ పుల్కం రాజు సోమవారం పరిశీలించారు. అనంతరం పట్టణంలోని బాలానగర్లో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుతో కలిసి ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, వైస్ చైర్మన్ నరాల శేఖర్, వైస్చైర్మన్ కనికరపు రాకేశ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యా సదస్సును విజయవంతం చేయండి వేములవాడఅర్బన్: తెలంగాణ ప్రోగెసిస్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 30న హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర విద్యాసదస్సును విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్కుమార్ కోరా రు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లోని జెడ్పీ హైస్కూల్లో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ను సోమవారం ఆవిష్కరించా రు. జిల్లా అధ్యక్షుడు రమానాథ్, దేవేందర్, కిష న్, రజనీరాణి, తిరుపతి, బొజ్జ కృష్ణ ఉన్నారు. -
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో..
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ‘బస్ కా పయ్యా నహి ఛలేగా’ అనే నినాదంతో సమ్మెకు వెళ్తున్నాం. ప్రభుత్వం హామీ ఇచ్చి రెండున్నర ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఎలాంటి న్యా యం చేయలేదు. అన్ని డిపోలలో అధికారుల వేధింపులు, అధిక పనిభారం, అధిక కిలోమీటర్లతో ఇబ్బందులు పెడుతున్నారు. – జేఎస్ఎన్.రావు, జేఏసీ వైస్చైర్మన్ పనిభారం తగ్గించాలి ఆర్టీసీ డిపోల్లో ఉద్యోగులకు పనిభారం ఎక్కువైంది. కార్మికుల పని గంటలు పెంచుతుండ్రు. యూనియన్లు లేవని ఇబ్బందులు పెడుతుండ్రు. వేధింపులు తట్టుకోలేకనే సమ్మెకు వెళ్లాల్సి వచ్చింది. రెండు పీఆర్సీలు ఇవ్వడం లేదు. బతుకుపోరాటంగా పరిగణించి హక్కులు సాధించుకుంటాం. – శ్రీనివాస్నాయక్, వైస్చైర్మన్ -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
ముస్తాబాద్(సిరిసిల్ల): పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని నామాపూర్లో ఎస్డీఎఫ్ నిధులు రూ.31లక్షలతో నిర్మించిన ఇరిగేషన్ భవనాన్ని కలెక్టర్ గరీమా అగ్రవాల్తో కలిసి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు ఉత్తమ సేవలు అందించేందుకు నీటిపారుదలశాఖ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. అనంతరం ముస్తాబాద్లోని కస్తూర్భా బాలికల విద్యాలయంలో నిర్వహించిన సంక్షేమ వారోత్సవాల్లో పాల్గొన్నారు. డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచామని గుర్తు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించారన్నారు. వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు మండడల కేంద్రంలోని పురాతన శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ధ్వజస్తంభ ప్రతి ష్ఠాపనోత్సవాల్లో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యే క పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్యనారాయణ, ఏఎంసీ చైర్పర్స న్ తలారి రాణి, ఎస్ఈ కిశోర్, ప్రత్యేకాధికారి రాఘవేందర్, సర్పంచ్లు మాదాస్ అనిల్, మట్ట వెంకటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీవో లచ్చాలు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, చక్రధర్రెడ్డి, రాజిరెడ్డి, విజయ్రెడ్డి, గజ్జెల రాజు, మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, సెస్ మాజీ డైరెక్టర్ విజయరామారావు, గజ్జెల రాజు పాల్గొన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు చందుర్తి/వేములవాడరూరల్: ఇళ్లు లేని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి మండలం రామన్నపేట, వేములవాడ రూరల్ మండలం వెంకటాంపల్లి, మర్రిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. పార్టీ మండలా అధ్యక్షులు చింతపంటి రామస్వామి, వకుళాభరణం శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, సనుగుల సింగిల్విండో మాజీ అధ్యక్షుడు ముష్కు ముకుందరెడ్డి, సర్పంచులు ఆవునూరి లక్ష్మి, ఇల్లందుల లాస్య పాల్గొన్నారు. -
మద్దతు ధర అందించడమే లక్ష్యం
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం తాడూర్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రాల వద్ద నీడ కోసం టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో గీత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, వైస్చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, సర్పంచ్ రెడ్డిమల్ల సదానందం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ టోని పాల్గొన్నారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నూతన భవనంలోకి మార్చిన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్పంచ్ మోర లక్ష్మీరాజం, ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ విజయ ప్రకాశ్రావు, ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, ఏఎంసీ వైస్చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్ పాల్గొన్నారు. విద్యుత్ సబ్స్టేషన్లకు స్థలం కేటాయించండి జిల్లాలో విద్యుత్ లోడ్కు అనుగుణంగా కొత్తగా ఐ దు సబ్స్టేషన్లకు స్థలం కేటాయించాలని కలెక్టర్ గరీ మా అగ్రవాల్ను ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ కోరారు. ఇటీవల జిల్లా ఎన్పీడీసీఎల్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్గా విధుల్లో చేరిన వేణుమాధవ్ మర్యాద పూర్వకంగా కలెక్టర్ను కలిశారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
సిరిసిల్లటౌన్: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. నిర్విరామంగా పరుగులు తీస్తున్న బస్సు చక్రాలకు బ్రేక్ పడనుంది. జిల్లాలోని రెండు డిపోలలో బుధవారం నుంచి బస్సులు నిలిచిపోనున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. ఫలితంగా ఏడేళ్ల క్రితం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణీకులు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ మొదలుకానున్నాయి. డిమాండ్లు ఇవీ.. మేనిఫెస్టోలోని అంశాన్ని అడుగుతున్నాం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆర్టీసీ రెండు విభాగాలుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇదే విషయాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అమలు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే ఇక్కడి ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. విద్య, వైద్యంతోపాటు రవాణా సంస్థను సైతం లాభనష్టాలతో పరిగణించొద్దు. – బాణయ్య, జేఏసీ చైర్మన్ -
రైతును రాజు చేయడమే లక్ష్యం
రుద్రంగి(వేములవాడ): రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం అడిషనల్ కలెక్టర్ నగేశ్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా సూరమ్మ ప్రాజెక్టును సందర్శించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. యాసంగిలో పంట లు ఎండిపోకుండా ఉండేందుకు ఇప్పటికే మూడుసార్లు ఎల్లంపెల్లి నీటిని నాగారం చెరువులోకి విడుదల చేసినట్లు తెలిపారు. వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రుద్రంగి అచ్చయ్యకుంట, నాగారం చెరువులను నింపినట్లు పేర్కొన్నారు. రుద్రంగి సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాశ్, మోహన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, గంగనర్స య్య, మీనయ్య, శంకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరికలు వేములవాడ: కోనరావుపేట మండలం నిమ్మపల్లి, గొల్లపల్లి, మరిమడ్ల సర్పంచులు కమ్మరి స్వప్న–నాగరాజు, మాడుగుల ఆమని–శ్రీకాంత్, కోల స్వాతి–శ్రీనివాస్లు విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిమ్మపల్లి వార్డుసభ్యులు మ్యాదరి రాఘవేందర్, దేవయ్య, పూజారి లావణ్య లింబయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. -
పకడ్బందీగా జనగణన చేయాలి
● జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పీబీ శ్రీనివాసాచారి సిరిసిల్ల: పకడ్బందీగా జనగణన పూర్తి చేయాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పి.బి.శ్రీనివాసాచారి కోరారు. హౌస్లిస్టింగ్ బ్లాక్స్, సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ విధానం, స్వీయగణనపై సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, గంభీరావుపేట, తంగళ్లపల్లి, కోనరావుపేట, వేములవాడరూరల్ మండలాల్లో ఆదివారం శిక్షణ ఇచ్చారు. వేసవి నేపథ్యంలో ఇన్చార్జ్ అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో శిక్షణకు హాజరయ్యే వారికి భోజనం, ఇతర వసతులు సరైన విధంగా కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బాధ్యతల నిర్వహణ ఎంతో కీలకమని శ్రీనివాసాచారి స్పష్టం చేశారు. జనగణన జిల్లా ఇన్చార్జి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యంబోయినపల్లి(చొప్పదండి): గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని కోరెం కొండపోచమ్మ ఆలయం వద్దకు రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, ఆలయం వరకు 21 స్తంభాలు అమర్చిన సింగిల్ఫేజ్ విద్యుత్ పనులను, కొదురుపాకలో పలు అభివృద్ధి పనులను ఆదివారం ప్రారంభించారు. కొండపోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంగన్వాడీలకు సెల్ఫోన్లు పంపిణీ చేశారు. పీఆర్ డీఈ విష్ణువర్ధన్, ఎంపీడీవో జయశీల, సెస్ ఏఈ ప్రశాంత్, పీఆర్ ఏఈ సాయితేజ, జోగినపల్లి వెంకట్రామారావు, ముదుగంటి సురేందర్రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్ పాల్గొన్నారు. -
మహిళలే బుద్ధి చెప్తారు
సిరిసిల్లటౌన్: పార్లమెంటులో రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలకు మహిళలే బుద్ధి చెబుతారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో ఆదివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. దేశవ్యాప్తంగా మహిళలు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తుంటే, పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టిన తరుణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు వ్యవహరించిన తీరు శోచనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి మహిళా సాధికారతపై చిత్తశుద్ధి లేదన్నారు. అటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఇటు కాంగ్రెస్ ప్రతినిధి ఆది శ్రీనివాస్ ఇద్దరూ మహిళా బిల్లు విషయంలో తమ స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లును విడిచిపెట్టబోదని, 33 శాతం రిజర్వేషన్ల ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు బర్కం లక్ష్మీనవీన్యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండ వర్షిని, మేర్గు మంజుల, ఊరగొండ లక్ష్మి, వేమనపల్లి శోభ, గుర్రం అనసూర్య, వేముల వైశాలి, రామలింగారెడ్డి, భాగయ్య, వంతడుపుల సుధాకర్ పాల్గొన్నారు. -
కురిసిన వాన.. తడిసిన ధాన్యం
వీర్నపల్లి/తంగళ్లపల్లి/సిరిసిల్లఅర్బన్/చందుర్తి: జిల్లాలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఈదురుగాలులకు పొలంలోనే పంట నేలవా లింది. ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్లు కొట్టుకుపోయాయి. వీర్నపల్లి మండలం శాంతి నగర్లో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను లైన్మన్ వెంకటి ఆధ్వర్యంలో పునరుద్ధరించారు. కూలిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. సిరిసిల్ల శివారులో.. పెద్దూరు, రగుడు, చంద్రంపేట, బోనాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. పెద్దూరు కేంద్రంలో సుమారు వెయ్యి క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను నాయకులు లింగంపల్లి సత్యనారాయణ, అశోక్రావు పరిశీలించారు. చెట్ల కొమ్మలు తొలగించిన గ్రామస్తులు, పోలీసులు చందుర్తి మండలం మూడపల్లిలోని రోడ్డుపై కూలిన చెట్లతో శనివారం అర్ధరాత్రి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు చెట్లకొమ్మలు తొలగించేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ భర్త చిలుక అంజిబాబు, కొందరు గ్రామస్తులను తీసుకెళ్లి కొమ్మలను గొడ్డలితో నరికి తొలగించారు. -
ఆదివారం.. అక్రమ దందా
సిరిసిల్ల: జిల్లాలో ఆదివారం వస్తే చాలు అక్రమ మైనింగ్ జోరందుకుంటుంది. అధికారులు ఎవరూ ఉండబోరని యథేచ్ఛగా మట్టి, మొరం తరలిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. జిల్లాలో మొరం తవ్వకానికి అనుమతులు లేవు. సెలవు రోజుల్లో పొద్దంతా అక్రమంగా తవ్వకాలు చేస్తుండగా, సాధారణ రోజుల్లో చీకటిపూట టిప్పర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలో అధికారులు రాకపోకలను గమనించేందుకు ఓ టీమ్ను రోడ్డు వెంట నిఘా కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికారుల రాకను గమనిస్తే వీరు వెంటనే సమాచారం అందిస్తున్నారు. ఇలా అధికారులకు చిక్కకుండా.. మొరం, మట్టిని హిటాచీలతో తవ్వుతూ టిప్పర్లలో తరలిస్తున్నారు. అక్రమం.. అధికంగా వసూలు ఇళ్ల నిర్మాణంలో బరంతికి అవసరమైన మట్టిని, ఇతర అవసరాలకు మొరాన్ని ఈ మాఫియా చేరవేస్తుంది. ఒక్కో టిప్పర్కు రూ.4వేల నుంచి రూ.5వేలు వరకు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.1000 నుంచి రూ.1500 వసూలు చేస్తున్నారు. రాత్రీ, పగలు తేడా లేకుండా గుట్టలను గుల్ల చేస్తున్నారు. వీరి ఆగడాలతో వన్యప్రాణుల నివాసాలకు విఘాతం కలుగుతుంది. గుట్టలే కనుమరుగవుతున్నాయి. పట్టుకుంటే రాజకీయ ఒత్తిళ్లు మైనింగ్ అధికారులు ఈ అక్రమదందాను గుర్తించి అప్పుడప్పుడు టిప్పర్లను సీజ్ చేస్తూ, కేసులు నమోదు చేస్తున్నారు. పట్టుకున్న ప్రతీసారి మైనింగ్ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు వస్తుండడంతో చేసేదేమీ లేక జరిమానాలతో వాహనాలను వదిలేస్తున్నారు. మైనింగ్ మాఫియాతో కొందరు అధికారులకు సంబంధాలు ఉండడంతో అక్రమదందా యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. వెంకటాపూర్, పెద్దబోనాల, చిన్నబోనాల ప్రాంతలతోపాటు ఇంకా కొత్త ప్రాంతాల్లో మొరం తవ్వేందుకు దారులు చేస్తూ గుట్టల్లో చీకటి వ్యాపారం సాగుతోంది. ‘ఇది ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులోని గుట్ట వెనకాల ప్రాంతం. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జేసీబీ ఏర్పాటు చేసి మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. సెలవు రోజు కావడంతో అడిగేవారు లేరని జేసీబీతో మట్టిని, మొరం పది ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఇలా రోజంతా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.’ -
హిందూ ధర్మ రక్షణకు నడుం బిగిద్దాం
● విష్ణు సేవ నందగిరిస్వామీజీ ఇల్లంతకుంట(మానకొండూర్): హిందూ ధర్మ రక్షణకు హిందువులు నడుం బిగించాలని నందగిరి స్వామీజీ కోరారు. మండలంలోని గాలిపెల్లి వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో మాట్లాడారు. హిందుత్వం మానవాళి హితం కోరే ధర్మమన్నారు. మతం వేరు ధర్మం వేరు అని పేర్కొన్నార. హిందువులు సమైక్యంగా కలిసి జీవించాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ సామల కిరణ్ మాట్లాడుతూ హిందువులు స్వాభిమానం దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు మల్లుగారి దేవేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, కోశాధికారి అయ్యన్నగారి హరికృష్ణరెడ్డి, సర్పంచులు బద్దం శేఖర్రెడ్డి, శంకరమ్మ, సింగిరెడ్డి రచన, సభ్యులు బాలనాగాచారి, వంశీ, బత్తిని ఆంజనేయులు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘మహిళాబిల్లుకు డీలిమిటేషన్ ముసుగు ఎందుకు? ’ సిరిసిల్లటౌన్: మహిళా బిల్లు ముసుగులో కేంద్రం ప్రభుత్వం డీలిమిటేషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని డీసీసీ ఆఫీసులో ఆదివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. 2023లో పాసైన మహిళా బిల్లును యథాతథంగా ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ ఆడెపు చంద్రకళ, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, కౌన్సిలర్లు వెంగల లీల, లాయక్ సుల్తాన, బొద్దుల శ్రీనివాస్, కూరపాటి శ్రీశైలం, నాయకులు చొక్కాల రాము, రాగుల జగన్, వెంగల లక్ష్మినర్సయ్య, కంసాల మల్లేశం, ఆడెపు భాను పాల్గొన్నారు. సీఎం సభను విజయవంతం చేయండి ఇల్లంతకుంట(మానకొండూర్): మంథని నియోజకవర్గంలోని కాటారంలో సోమవారం నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కోరారు. మండలంలోని ముస్కానిపేటలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి మాట్లాడారు. సీఎం సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలిరా వాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు భా స్కర్రెడ్డి, నాయకులు అంతగిరి వినయ్కుమార్, జుట్టు శేఖర్, సూర దేవరాజు, చింతలపల్లి ర వీందర్రెడ్డి, కాసుపాక రమేశ్, భూపతిరెడ్డి, మల్లారెడ్డి, వంశీ, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. హామీలు నెరవేర్చాలి సిరిసిల్లటౌన్: ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ఆర్టీసీ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని జేఏసీ చైర్మన్ బానయ్య కోరారు. రాష్ట్ర కమిటీ సమ్మెమ సన్నాహక పిలుపులో భాగంగా ఆదివారం సిరిసిల్ల డిపో ఎదుట గేట్ ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఆర్టీసిని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. జేఏసీ వైస్చైర్మన్లు జె.ఎస్.ఎన్.రావు, బి.శ్రీనివాస్, కన్వీనర్ రమేశ్, గ్యారేజ్ కో–కన్వీనర్ మల్లేశం, నాగసాగర్, భూమయ్య, మల్లయ్య, సత్తయ్య, భిక్షపతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా గైడ్స్ దీక్షా స్వీకారోత్సవం తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని నేరెళ్లలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో ఆదివారం స్కౌట్స్ అండ్ గైడ్స్ దీక్షా స్వీకారోత్సవం నిర్వహించారు. పాఠశాలకు చెందిన 32 మంది గైడ్స్ విద్యార్థినులకు అధికారికంగా గైడ్స్ దుస్తులను(యూనిఫాం) పంపిణీ చేశారు. అనంతరం గైడ్స్ ప్రమాణ స్వీకారం చేసి దీక్షను స్వీకరించారు. జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ రాజా భానుప్రకాశ్, మండల విద్యాధికారి భూక్య రాజు, పాఠశాల ప్రిన్సిపాల్ జి.రాధ, సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
● గులాబీమయంగా మారిన జగిత్యాల జగిత్యాలటౌన్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హాజరుకానున్న ప్రజా ఆశీర్వాద సభకు జగిత్యాలలోని వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో పట్టణం గులాబీమయంగా మారింది. సభావేదికపై కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, సభ ఇన్చార్జి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, దావ వసంత తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జీవన్రెడ్డి ఫ్లెక్సీ చించివేత.. అనుచరుల నిరసన మరికొన్ని గంటల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనున్న నేపథ్యంలో కేసీఆర్, జీవన్రెడ్డి కలిసి ఉన్న ఫ్లెక్సీలో జీవన్రెడ్డి ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం కలకలం రేపింది. సభ విజయవంతం కోసం బీఆర్ఎస్ నాయకులు, జీవన్రెడ్డి అనుచరులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా రు. ఇందులో భాగంగా పాత బస్టాండ్ చౌరస్తాలో కేసీఆర్, జీవన్రెడ్డి ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం జీవన్రెడ్డి ఫొటోను మాత్రమే చించివేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్రెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. మరోవైపు ప్రజాఆశీర్వాద సభ కోసం మినీస్టేడియం గోడలు కూల్చివేయడం చర్చనీయాంశమైంది.


