breaking news
Rajanna Sircilla District News
-
నేడు సిరిసిల్లలో కృష్ణాష్టమి వేడుకలు
సిరిసిల్లటౌన్: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జిల్లా కేంద్రం సిరిసిల్లలో శుక్రవారం కన్నులపండువగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ఇన్చార్జి ప్రాణనాథ అచ్యుతదాస్ అన్నారు. గురువారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కళ్యాణలక్ష్మి గార్డెన్లో నిర్వహించే వేడుకల్లో గురుపూజ, హరేకృష్ణ మంత్ర జపాలు, రాధాకృష్ణులకు ఉయ్యాల సేవ, మహా నైవేద్యాలు, హారతి, కుంభహారతి, మహాభిషేకం, పుష్పాభిషేకం, సాంస్కృతిక కార్యక్రమాలు, సంకీర్తనలు జరుగుతాయన్నారు. ఇస్కాన్ ప్రతినిధులు నరుత్తమదాస్, హరిహరదాసు, మధుసూధన్దాస్, రసానంద ప్రియదాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ గద్దె దిగాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సిరిసిల్లటౌన్: దొంగ ఓట్లతో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ గద్దె దిగాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నా రు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల లోని పాత బస్టాండ్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కా ర్గే, సోనియా గాంధీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రజల ఓట్లను కొల్లగొడుతూ గెలుస్తున్న స్థితిగతులను కండ్లకు గట్టినట్లు వీడియో రూపంలో చూపించారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్, టీపీసీసీ పిలుపుమేరకు ఓటు చోర్ గద్దె చోడ్ నినాదంతో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్మన్ స్వరూపరెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి
● సామాజిక సమస్యలు ఇంకా నిర్మూలన కాలేదు ● మానవ వనరులను మరింత మెరుగుపర్చాలి ● స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ టాక్ షోలో విద్యార్థుల మనోగతంసిరిసిల్లకల్చరల్: ఏడున్నర దశాబ్ధాల స్వాతంత్య్ర భారతదేశంలో ఇప్పటికీ మానిపోని రుగ్మతలు ఎన్నో.. బంధుప్రీతి, అవినీతి, అశ్రిత పక్షపాతం తదితర సామాజిక సమస్యలు ఇంకా నిర్మూలన కాలేదు.. అనేక రంగాల్లో పురోగతి సాధించినా జరగాల్సినంతగా జరగలేదన్నది సుస్పష్టం.. అభివృద్ధి చెందిన భారతదేశంగా చూడాలని యువతరం కలలు గంటోంది.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈతరం యువత దేశం పురోగతిపై ఎలా ఆలోచిస్తుందనే అంశంపై సిరిసిల్లలోని వికాస్ డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న విద్యార్థులు తమ మనోభావాలను వెల్లడించారు.ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే కీర్తించబడుతోంది. అన్ని రంగాల్లో అవినీతిని నిర్మూలించి సమూలంగా ప్రక్షాళన చేయాలి. అభివృద్ధి చెందిన భారతదేశంగా అవతరిస్తే చూడాలని యువత ఆరాటపడుతోంది. అందుకు అనుగుణమైన పరిపాలన వ్యవస్థ రావాలి. – పోచవేని ఆర్తి, బీఎస్సీ ఫైనల్ దేశంలో నేర ప్రవృత్తి క్రమంగా పెరుగుతుండటం ప్రమాదకరం. కేసుల విచారణ త్వరితగతిన జరిగి నేరస్తులకు శిక్షలు పడే సమయం కుదించబడాలి. వేల సంఖ్యలో కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉంటున్నాయి. సత్వర విచారణ, కఠిన శిక్షలను అమలు చేయడం ద్వారా నేర ప్రవృత్తిని సమాజంలో నిర్మూలించాలి. – గజభీంకార్ రాంప్రసాద్, బీకాం దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల ప్రక్రియ స్వాతంత్య్రం వచ్చిన పదేశళ్ల వరకు మాత్రమే అనే నిబంధన ఉంది. వివిధ కారణాలతో ఇన్నేళ్లు కొనసాగిస్తున్నారు. మతం ఆధారంగా కాకుండా తెలివితేటల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసే ప్రయత్నాలు జరగాలి. – ఎండీ షానవాజ్, బీబీఏ దేశ రక్షణ విషయంలో రాజీ పడే పరిస్థితి ఉండొద్దు, దాయాది దేశాల కవ్వింపు చర్యల వల్ల అస్థిరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటేనే వణికిపోయేలా అత్యాధునిక రక్షణ పరికరాలు మరిన్ని తయారు కావాలి. దేశ రక్షణ యంత్రాంగం ఎంత పటిష్టంగా ఉంటే అంతగా అభివృద్ధికి మార్గం సులువవుతుంది. – గొడుగు నీరజ, బీఎస్సీ డేటా సైన్స్ దేశంలో అవినీతి పేరుకుపోయింది. సంబంధిత శాఖ తనిఖీలు జరుపుతున్నా నేరస్తుల జాబితా పెరుగుతూనే ఉంది. పేదవర్గాలు పుష్కలంగా ఉన్న దేశంలో ఆరోగ్యం అందని ద్రాక్షగా ఉంటోంది. నేర చరిత గల నేతలను ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించాలి. – సింగారం చందు, బీకాం ఫైనల్ దేశంలో టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ సామాన్యుల జీవితాల్లో పెద్దగా మార్పులేవీ లేవు. కనీసం నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులో ఉండడం లేదు. మంచినీళ్లు కొనుక్కొని తాగే దుస్థితి కనిపిస్తోంది. నాణ్యమైన విద్య అందించడం ద్వారా మానవ వనరులను సమర్థంగా వినియోగించుకునే వ్యవస్థ రావాలి. – కొట్టె శివభవాని, బీఎస్సీ ఫైనల్ నియంత్రిత సాంకేతికత అందుబాటులోకి రావాలి. మరిన్ని కొత్త ఆవిష్కరణలు జరగాలి. సాధారణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు చోటు చేసుకునేలా సాంకేతిక విజ్ఞానం అదుపులో ఉండాలి. సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ ఉండాలి. – గంగు మహేశ్, బీకాం పేద వర్గాలకు విద్య, వైద్యం ఉచితంగా అందేలా చూడాలి. ఉచిత పథకాలు అట్టడుగు వర్గాల వారికే పరిమితం చేయాలి. యువతకు నాణ్యమైన ఉచిత విద్య అందించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రణాళికలు రచించాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత రవాణ సౌకర్యం కల్పించాలి. – వేముల నిరోషా, బీఎస్సీ డేటా సైన్స్ -
పంద్రాగస్టుకు ముస్తాబు
సిరిసిల్ల: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పోలీసు ఆఫీస్ (డీపీవో) ఆవరణలోని పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. శుక్రవారం జరిగే వేడుకల ఏర్పాట్లను గురువారం సాయంత్రం సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్. వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సురభి మహేశ్కుమార్లు పర్యవేక్షించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొంటుండగా కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గితే, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరవుతారు. ఉదయం 9.30 గంటలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. 9.32 గంటలకు పోలీస్ గౌరవ వందనం, 9.40లకు ముఖ్యఅతిథి సందేశం, 9.55లకు సాంస్కృతిక కార్యక్రమాలు, 10.25 గంటలకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ప్రశంసా పత్రాల ప్రధానం, 11.02 గంటలకు కార్యక్రమం ముగుస్తుంది. శిథిలాల తొలగింపునకు ముహూర్తం ఖరారువేములవాడ: వేములవాడ మేన్రోడ్డు 80 ఫిట్ల విస్తరణ చేసే క్రమంలో రోడ్డుకు ఇరువైపులా దాదాపు 254 నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. జూన్ 15న ప్రారంభమైన ఈ ప్రక్రియ కోర్టు స్టేలతో కాస్త నిలిచినా చివరికి పూర్తిస్థాయిలో పూర్తయ్యాయి. కూల్చివేసిన శిథిలాలు అలాగే ఉండిపోయాయి. అధికారులు శిథిలాలల నుంచి వచ్చిన వ్యర్థాలను దూర ప్రాంతాలకు తరలించేందుకు రూ.22 లక్షలతో ఆన్లైన్ టెండర్లను పిలిచారు. 45.5 లెస్కు టెండర్ పైనల్ రూ. 22 లక్షలతో టెండర్లకు ఆహ్వానించిన మున్సిపల్ అఽధికారులకు ఆన్లైన్లో 12 మంది టెండర్లు దాఖలు చేశారు. ఈనెల 11తో గడువు ముగియడంతో గురువారం టెండర్ల ప్రక్రియను క్లియర్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తెలిపారు. 45.5 శాతం లెస్కు హైదరాబాద్కు చెందిన విజయ ఎర్త్ మూవర్స్ సంస్థకు టెండర్ను అప్పగించామని అన్నారు. శుక్రవారం నుంచి స్క్రాప్ను తొలగించే పనులు ప్రారంభించి నెల రోజుల్లోగా పూర్తిగా క్లీన్ చేసి ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. భవనాల శిథిలాలను ఎస్పీ కార్యాలయం ప్రాంతంలో డంప్ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కాగా పట్టణ శివారులోని కాలనీల్లో చాలా వరకు వర్షపు నీరు నిలుస్తూ కాలనీవాసులు నానాఅవస్థలు పడుతున్నారు. ఈక్రమంలో ఈవ్యర్థాలను శివారు కాలనీల్లోని రోడ్లలో వేయాలని స్థానికులు కోరుతున్నారు. సింగిల్విండోల పదవీకాలం పొడిగింపుసిరిసిల్ల అర్బన్: జిల్లాలోని 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14వ తేదీతో పాలకవర్గాల గడువు ముగియనున్న నేపథ్యంలో మరో ఆరునెలల గడువు పొడిగింపుతో సింగిల్విండోల అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 15న జెండాను ఎగుర వేసే అవకాశం లభించిందని పేర్కొంటున్నారు. యూరియా కోసం ఆందోళనవీర్నపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రం వీర్నపల్లిలో యూరియా కోసం రైతులు ఆందోళన చేశారు. సింధూర మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ షాపును గురువారం ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఏఎంసీ చై ర్మన్ రాములుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి అ ఫ్జల్ బేగం మాట్లాడుతూ షాపులో 225 యూ రియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని మిగతా స్టాకు త్వరలో ఏర్పాటు చేస్తామని తెలపడంతో యూరియా సరఫరా చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. నాలుగైదు రోజుల్లో యూరి యాను అందుబాటులోకి తీసుకొస్తామని అ ధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముక్తర్ పాషా, మండల అభివృద్ది అధికారి బీరయ్య, నాయకులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
● భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి ● నర్మాల ఎగువమానేరును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ గంభీరావుపేట(సిరిసిల్ల): భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టును గురువారం ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టులో నీటి నిల్వ, ఇన్ఫ్లో గురించి ఇరిగేషన్ అధికారుల నుంచి ఆరా తీశారు. పూర్తిస్థాయి నీటి మట్టం 2టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.3టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఎగువ నుంచి 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని తెలిపారు. ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే పది రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుందని ఇరిగేషన్ అధికారులు అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డ్యాం గేట్లను పరిశీలించి వాటి నిర్వహణను పర్యవేక్షించారు. డ్యాం పూర్తిస్థాయిలో నిండితే ఎక్కువైతే నీటిని సాగునీటి కాలువల ద్వారా విడుదల చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వీరి వెంట ఇరిగేషన్ జిల్లా అధికారి కిశోర్ కుమార్, ఈఈ ప్రశాంత్కుమార్, డీఈ నర్సింగ్, పోలీస్ అధికారులు ఉన్నారు. ఆక్రమించిన భూములు స్వచ్ఛందంగా అప్పగించాలి సిరిసిల్ల: జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో గురువారం ప్రభుత్వ భూమిని ఆక్రమించిన బీఆర్ఎస్ నాయకులు ఒజ్జెల అగ్గి రాములు 4.02 ఎకరాల భూమిని కలెక్టర్, ఎస్పీ మహేశ్ బి గితే సమక్షంలో ప్రభుత్వానికి సరేండర్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్దాపూర్కి చెందిన అగ్గి రాములు సర్వే నం.61/47లోని ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేస్తున్న 4 ఎకరాల 2 గుంటలను తిరిగి అప్పగించాడని తెలిపారు. ఇంకా ఎవరైన ఉంటే స్వచ్ఛందంగా అప్పగించాలని, లేకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేవిదంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో గురువారం నేషనల్ స్కాలర్ షిప్ స్కీమ్లో బీడీ కార్మికుల పిల్లలకు అందించే ఉపకార వేతనాలపై అధికారులతో సమీక్షించారు. కేంద్ర కార్మిక శాఖ ద్వారా బీడీ కార్మికులు, లైమ్ స్టోన్ డోలో మైట్ ఖనిజాల కార్మికులు, మైకా మైనింగ్ కార్మికులు, ఐరన్ ఓర్ , క్రోమ్ ఓర్ మైనింగ్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఆరు నెలల పాటు బీడీ కార్మికులుగా పని చేసి వార్షిక ఆదాయం రూ.1.20లక్షల లోపు ఉన్న వారంతా ఈ పథకానికి అర్హులని అన్నారు. ఆగస్ట్ 31లోగా పదో తరగతి లోపు చదివే పిల్లలు, అక్టోబరు 31వ తేదీలోగా ఇంటర్కు పైగా చదివే వారు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్ర ఉప సంక్షేమ కమిషనర్ సాగర్ ప్రధాన్, సీనియర్ మెడికల్ ఆఫీసర్లు మహేందేర్, మధూకర్, వెంకటేశ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్, జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, వివిధ మండలాల ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అధికారులు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్కుమార్ ఝా, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి గురువారం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావులు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో పరిస్థితిని కలెక్టర్కు వివరించారు. -
పొలిటికల్ బ్రాండ్.. మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్
కోరుట్ల/మెట్పల్లి: ఇక్కడి నేతలకు ఖాదీ బట్టలే స్ఫూర్తి. చాలా మందికి ఖాదీ రాజకీయంగా ఊపిరి పోసిందంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర పోరా టకాలంలో ఖాదీ ఉద్యమానికి వేదికగా నిలిచింది జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి. గాంధీ శిశ్యుడు అన్నాసాహెబ్ ఆధ్వర్యంలో మెట్పల్లిలో వెలిసిన ఖాదీ ప్రతిష్టాన్ ఖద్దరు ఆ కాలంలో ఖ్యాతి పొందింది. అప్పటి ఆనవాయితీని పుణికిపుచ్చుకుని మెట్పల్లి ప్రాంత రాజకీయ నాయకులు ఖాదీ వస్త్రాలు ధరించడం ఇప్పటికీ దూరం కాలేదు. కడక్ ఖాదీ బట్టలతో ఎవరైనా కనిపిస్తే చాలు ఈయన మెట్పల్లి లీడరని చెప్పొచ్చు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన వర్ధినేని వెంకటేశ్వర్రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కేవీ.రాజేశ్వర్రావు, జనతా పార్టీ నుంచి ఏకై క ఎమ్మెల్యేగా ఎన్నికై న కొమొరెడ్డి రామ్లు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఖాదీ ప్రతిష్టాన్ వస్త్రాలు ధరించి రాజకీయాల్లో కీలకంగా ఎదిగినవారే. 2009 అసెంబ్లీ పునర్విభజనలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంగా మారినప్పటికీ.. మెట్పల్లి ఖాదీ కార్ఖానా స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సంజయ్ ఇక్కడి ఎమ్మెల్యేలుగా కొనసాగడం గమనార్హం. -
భగీరథ.. ఇదేం వ్యథ
సిరిసిల్ల పెద్దూరు డబుల్బెడ్రూం ఇళ్లలో ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. 43 బ్లాకుల్లో నివసిస్తున్న 516 కుటుంబాలకు సరిపడా నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. నీటి కోసం మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేయడంతో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. వచ్చిన ట్యాంకర్ల నీటి సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో నీటి కోసం ఎగబడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల జిల్లా -
సూక్ష్మకళ.. భళా
ఓదెల(పెద్దపల్లి): మడక గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెన్సిల్ మొనపై 4 మి.మీ. పొడవు, 2 మి.మీ. వెడల్పుతో అతిచిన్న జాతీయ జెండా రూపొందించారు. ఇందుకోసం సుమారు గంట సమయం తీసుకున్నారు. చాక్పీస్పై 7 మి.మీ. పొడవు, 5 మి.మీ. వెడల్పుతో గంట పది నిమిషాలపాటు శ్రమించి చెక్కారు. చాక్పీస్పై హ్యాపీ ఇండిపెండెన్స్డే ఆంగ్ల అక్షరాలు చెక్కి శుభాకాంక్షలు చెక్కారు. వీటిని వివిధ బుక్ ఆఫ్ రికార్డులకు ప్రతిపాదించినట్లు రజనీకాంత్ తెలిపారు. -
ఏడాది అనంతరం మిడ్మానేరుకు ఎల్లంపల్లి నీరు
బోయినపల్లి(చొప్పదండి): ఏడాది అనంతరం శ్రీపాద ఎల్లంపల్లి నీరు ఎత్తిపోతల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్మానేరు ప్రాజెక్టులోకి తరలుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు గోదావరి జలాలు తరలిస్తున్నారు. గురువారం ప్రాజెక్టులో 8.084 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. గతేడాది జూలైలో 14టీఎంసీల ఎత్తిపోతలు గతేడాది వర్షాకాలం ఆరంభంలో సరైన వర్షాలు కురువక మిడ్మానేరులో నీటి నిల్వలు అడుగంటాయి. 2024 జూలై 28నుంచి ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్టు నుంచి వయా నందిమేడారం, లక్ష్మీపూర్ల నుంచి ఎత్తిపోతల ద్వారా వరద కాలువకు నీరు ఎత్తి పోశారు. సుమారు 14 టీఎంసీల మేర నీటిని వరదకాలువ మీదుగా మిడ్మానేరు ప్రాజెక్టుకు తరలించారు. ఫలించిన రైతన్నల ఆశలు ఆశించిన మేర వర్షాలు కరవకపోవడంతో ఎల్లంపల్లి నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంత్రి ఉత్తమమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎల్లంపల్లి జలాలు వరదకాలువ మీదుగా మిడ్మానేరు ప్రాజెక్టులోకి చేరుతుండడంతో ఈప్రాంత రైతులు హర్శం వ్యక్తం చేస్తున్నారు. -
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
వేములవాడ: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన 40 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.12.96లక్షల విలువ గల చెక్కులు అందజేశారు. వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని అన్నారు. పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పదేళ్లలో రూ. 400 కోట్లు పంపిణీ చేస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రూ.800 కోట్ల మేర లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
లీడింగ్ ఫైర్ ఆఫీసర్ వహిదుల్లాఖాన్కు రాష్ట్రపతి పతకం
మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లి ఫైర్ స్టేషన్లో లీడింగ్ ఫైర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న వహిదుల్లాఖాన్ అత్యున్నత పురస్కారమైన రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 1986లో ఫైర్మెన్గా అగ్ని మాపక శాఖలో చేరిన ఆయన.. ఆసిఫాబాద్, ఇచ్చోడ, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్లో పని చేసి.. రెండేళ్ల క్రితం మెట్పల్లికి బదిలీపై వచ్చారు. 2015లో లీడింగ్ ఫైర్మెన్గా పదోన్నతి పొందారు. మొదటి నుంచి అంకితభావంతో పనిచేసే ఆయన విపత్తుల సమయాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారనే పేరు సంపాదించారు. అత ని సేవలకు గుర్తింపుగా ఇప్పటివరకు ఆరు ప్రశంసపత్రాలు, ఒక సేవాపతకం ప్రదానం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి పతకానికి ఎంపిక కావడంపై ఆయనను ఉన్నతాధికారులు అభినందించారు. లీడింగ్ ఫైర్మెన్ గోపాల్రెడ్డికి.. జమ్మికుంట: జమ్మికుంట పట్టణ అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్మెన్గా విధులు నిర్వహిస్తున్న బీరెడ్డి గోపాల్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఫైర్మెన్గా విధుల్లో అత్యంత ఉత్తమ సేవలు అందించినందుకు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. ఫైర్ ఆఫీసర్గా విధుల్లో క్రమ శిక్షణ, నిబద్ధతతో పని చేసినందుకు అవార్డుకు ఎంపికై నట్లు గోపాల్రెడ్డి తెలిపారు. -
గుండుసూదిపై జాతీయ జెండాతో పరుగెడుతున్న యువతి
జగిత్యాలటౌన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గుండుసూది మొనపై జాతీయ జెండాతో పరుగెడుతున్న యువతి చిత్రాన్ని రూపొందించి ఔరా అనిపించాడు. పండుగలు, పబ్బాలు, జాతీయ పండుగలు వంటి ప్రత్యేక సందర్భంలో ఏదో సూక్ష్మరూప చిత్రం ద్వారా సమాజానికి సందేశం పంపించే దయాకర్.. ఈ స్వాతంత్య్ర వేడుకకు జాతీయ జెండాతో పరుగులు పెడుతున్న యువతి సూక్ష్మకళాకండాన్ని రూపొందించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ముందు వరుసలో నిలుస్తున్నారన్న సందేశాన్ని సమాజానికి అందించడమే ఈ చిత్ర ఉద్దేశమని దయాకర్ తెలిపారు. ఈ సూక్ష్మ కళారూపాన్ని తయారు చేసేందుకు మైనం పెన్సిల్ కలర్స్ ఉపయోగించానని, పది గంటల సమయం పట్టినట్టు తెలిపారు. చిత్ర రూపకర్త గుర్రం దయాకర్ గుండు సూది మొనపై జాతీయ జెండాతో యువతి సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అద్భుత సృష్టి -
రూ.1,947కే ఆరోగ్య పరీక్షలు
కరీంనగర్టౌన్: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని మెడికవర్ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీ ప్రవేశ పెట్టిందని ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ తెలిపారు. స్థానిక ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేమాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ పేరిట అందుబాటులోకి తీసుకొచ్చిన పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలను రూ.1,947 చెల్లించి పొందవచ్చన్నారు. కార్డియాలజీ, జనరల్ ఫిజీషియన్, డైటీషియన్ కన్సల్టేషన్తోపాటు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ), కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్(సీయూఈ), పాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్(ఎల్ఎఫ్టీ), ఎక్స్రే చెస్ట్ (విత్అవుట్ ఫిలిం), ఈసీజీ, 2డీ ఎకో, హెపటైటిస్బీఏ1సి, సీరం యూరియా, అల్ట్రాసౌండ్ స్కానింగ్ (అబ్డొమెన్– పెల్విస్), సీరం క్రియాటినిన్ పరీక్షలు ఈ ప్యాకేజీ ద్వారా నిర్వహిస్తామని వివరించారు. ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విషజ్వరంతో ఒకరి మృతిసారంగాపూర్: మండల కేంద్రానికి చెందిన మోతుకు గంగమల్లు (55) విషజ్వరంతో బాధపడుతూ గురువారం మృతిచెందాడు. గంగమల్లు రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. బంధువులు జిల్లాకేంద్రంలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలో గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
సేవలకు దక్కిన గౌరవం
జగిత్యాలక్రైం/మల్యాల: విధి నిర్వహణలో వారు ఎప్పుడూ ముందున్నారు. తమ సర్వీసులో ఏనాడూ మచ్చ కూడా ఎరగరు. వారి సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక పతకాలు అందించింది. తాజాగా ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్కు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై రాజేశుని శ్రీనివాస్, మల్యాల పోలీస్స్టేషన్ ఏఎస్సై రుద్ర కృష్ణకుమార్కు మెడల్ ప్రకటించింది. రాజేశుని శ్రీనివాస్ 1989లో కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరారు. 2012లో హెడ్ కానిస్టేబుల్గా, 2019లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2012లో రాష్ట్ర పోలీసు సేవా పథకం, 2019లో ఉత్తమ సేవా పథకం అందుకున్నారు. 36ఏళ్లుగా పోలీస్ పోలీసు శాఖకు చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక చేసింది. అలాగే రుద్ర కృష్ణ కుమార్ 1989లో కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరారు. 2017లో హెడ్కానిస్టేబుల్గా.. 2021లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2022లో రాష్ట్ర పోలీసు సేవా పథకానికి ఎంపికయ్యారు. 36 ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక చేశారు. ఇద్దరిని జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్ అభినందించారు. కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని తెలిపారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజేశుని శ్రీనివాస్ రుద్ర కృష్ణకుమార్ ఇండియన్ పోలీస్ మెడల్కు ఇద్దరు ఏఎస్సైలు -
యూరియా కొరత అబద్ధం
సిరిసిల్లటౌన్: జిల్లాలో లేని యూరియా కొరతను కొంతమంది అదేపనిగా అసత్య ప్రచారం చేస్తున్నారని సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే.మహేందర్రెడ్డి అన్నారు. గురువారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రా ష్ట్రానికి సరిపడా యూరియా నిల్వలున్నాయని రైతు లు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాకు ఈనెలాఖరు వరకు 22వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా.. ఇప్పటికే 13,500 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్ సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షు డు చొప్పదండి ప్రకాశ్, నాయకులు పాల్గొన్నారు. -
ఆదర్శ మండల సమాఖ్యకు అవార్డు ప్రదానం
ఇల్లంతకుంట: ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య అధ్యక్షురాలు కట్ట సౌమ్య, మాజీ అధ్యక్షురాలు బొడిగ వనజలు గురువారం రాత్రి ఢిల్లీలోని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులతో అవార్డు స్వీకరించారు. ఢిల్లీలోని భారతరత్న సుబ్రహ్మణ్యం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్, చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్, ఆధ్వర్యంలో అవార్డు అందజేశారు. ఆదర్శ మండల సమాఖ్య కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్భర్ సంగతన్ అవార్డుకు జాతీయస్థాయిలో ఎంపికై ంది. అవార్డు స్వీకరించేందుకు మండలి సమాఖ్య అధ్యక్షులు రెండు రోజుల క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వారితో పాటు డీఆర్డీవో శేషాద్రి కూడా వెళ్లారు. రుణాలు అందించడంలో, సకాలంలో రుణాలు రికవరీ చేయడంలో మీటింగులు సక్రమంగా నిర్వహించడంలో ఆదర్శ మండలి సమాఖ్య ఆదర్శంగా నిలిచింది. అవార్డు స్వీకరించడం పట్ల మండలి సమాఖ్య సభ్యులు ఇల్లంతకుంట మండల ప్రజలు ఆనందం వ్యక్తపర్చారు. -
పోరాటాల ‘గాలిపల్లి’
ఇల్లంతకుంట: పోరాటాల గ్రామంగా చరిత్రలో నిలిచిపోయింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. నిజాంపాలిత ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రానికి ఇంకా విముక్తి లభించలేదు. బద్ధం ఎల్లారెడ్డి ప్రాంతమైన గాలిపల్లి ప్రజలు నైజాం పాలనపై తిరగబడ్డారు. 1948 సెప్టెంబర్ మొదటి వారంలో రజాకార్లు గాలిపల్లికి వచ్చారు. తిరుగుబాటుదారులు వారిసైన్యంపై రాళ్లు విసిరారు. రజాకార్ల కాల్పుల్లో తిరుగుబాటుదారుల్లో ముందువరుసలో ఉన్న 11మంది చనిపోయారు. వీరిలో గాలిపల్లికి చెందిన వారు ఏడుగురు, బేగంపేట, సోమారంపేట, తాళ్లపల్లి, నర్సక్కపేట గ్రామాలకు చెందినవారు నలుగురు ఉన్నారు. రజాకార్ల పాలన నుంచి విముక్తి కలిగిన తరువాత గాలిపల్లిలో దాదాపు 20మందికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీడంఫైటర్ పింఛన్లు మంజూరు చేశాయి. -
మొదటి జెండా ఎగిరింది ధర్మపురిలోనే..
ధర్మపురి: నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపు పొందిన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన కేవీ.కేశవులు, మాణిక్యశాస్త్రి ప్రాణస్నేహితులు. కేశవులు ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు హయాంలో చేనేత జౌళిశాఖ మంత్రిగా కొనసాగారు. 1947లో ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ధర్మపురిలోని గోదావరి ఒడ్డునున్న కర్నెఅక్కెపెల్లి భవనంపై తన మిత్రుడైన మాణిక్యశాస్త్రితో కలిసి మొట్టమొదటి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఎగురవేయడం నిషేధమని అప్పటి నిజాం ప్రభుత్వం కేశవులను బంధించడానికి ప్రయత్నించగా.. నిండుగా ప్రవహిస్తున్న గోదావరిలోంచి వెళ్లి తప్పించుకున్నారు. ఏడాదిపాటు ముంబయిలో తలదాచుకున్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం రోజు తిరిగి ధర్మపురికి చేరుకున్నారు. 2019 జనవరి 30న అనారోగ్యంతో మృతి చెందారు. -
పిచికారీతో ప్రాణాలమీదకు..
● మోతాదు మించి రసాయన ఎరువుల వాడకం ● తప్పనిసరైతేనే పిచికారీ చేయాలంటున్న శాస్త్రవేత్తలు ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు జగిత్యాలఅగ్రికల్చర్: ఓ వైపు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అధిక దిగుబడినిచ్చే విత్తనాలను రూపొందిస్తుండగా, మరో వైపు ఆ పంటలపై ఆశించే చీడపీడల నుంచి పంటను కాపాడేందుకు రైతులు క్రిమిసంహారక మందులు వాడడం పరిపాటిగా మారింది. ఆయా పంటలకు జరిగే నష్టంలో దాదాపు 20–25 శాతం చీడపీడల వల్లే కలుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం వరిలో కాండంతొలుచు పురుగు నివారణకు రైతులు ఒక్కటికి రెండుసార్లు పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. కాగా, ఇటీవల ఖమ్మం జిల్లాలో పత్తి పంటపై పురుగుమందులు పిచికారీ చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైతం జరిగి కొందరు మృత్యువాత పడుతుండగా, మరికొందరు ఆస్పత్రుల పాలవుతున్నారు. ● అవసరమైతేనే.. పురుగుమందుల వాడకంపై రైతులకు పెద్దగా అవగాహన ఉండడం లేదు. గ్రామాల్లోని ఫెర్టిలైజర్ డీలర్లు, పురుగుమందుల వ్యాపారులు చెప్పే మందులనే పిచికారీ చేస్తున్నారు. ఒక్కో కంపెనీ తయారు చేసే మందు ప్రభావం ఒక్కో రకంగా ఉండి పిచికారీ చేసే వ్యక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంటుంది. ఏ పురుగుకు, యే మోతాదులో, ఏ మందు వాడాలో రైతులకు తెలియని పరిస్థితి. కొన్ని రసాయన మందులు ఘాటైన వాసన కలిగి ఉంటే, మరికొన్ని తేలికగా ఉంటాయి. రైతులు ఇవేమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులను పిచికారీ చేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ● పెడచెవిన పెడుతూ.. చాలా మంది రసాయన మందులు పిచికారీ చేసేటప్పుడు బీడీలు, సిగరెట్లు తాగడం, గుట్కా నమలడం, తంబాకు నోట్లో వేసుకోవడం చేస్తుంటారు. అలాగే, మధ్యాహ్న సమయంలో భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో కాకుండా కేవలం నీళ్లతో మీదమీద కడిగి భోజనం చేస్తుంటారు. దీంతో మందు ప్రభావం తమకు తెలియకుండానే వివిధ రూపాల్లో మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనిషి నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే గాలి ఏ వైపు నుంచి వీస్తుందో గమనించక ఇష్టమొచ్చినట్లు పిచికారీ చేస్తుంటారు. దీంతో రసాయన మందు గాలిలో కలిసి శ్వాస తీసుకుంటున్నప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లి, వాంతులు కావడం, తలతిప్పడం, శరీరమంతా చెమటలు పట్టడం, సరైన శ్వాస అందకపోవడం వంటివి జరుగుతుంటాయి. ● జాగ్రత్తలు పాటించాలి రైతులు, రైతు కూలీలు పిచికారీ సమయంలో తప్పనిసరిగా చేతులకు గ్లౌజ్లు వేసుకోవాలి. స్ప్రేయర్లకు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. మందు నీళ్లు శరీరంపై పడకుండా లూజూ దుస్తులు ధరించాలి. కళ్లకు అద్దాలు ధరించడం మంచిది. పిచికారీ పూర్తయిన తర్వాత తలభాగం నుంచి సబ్బుతో స్నానం చేయాలి. పిచికారీ చేసే వ్యక్తికి ఏవైనా గాయాలుంటే, అవి కనబడకుండా ప్లాస్టర్ వేసుకోవాలి. పిచికారీ సమయంలో ఏమైనా అనారోగ్యానికి గురైతే వెంటనే సమీపంలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. మందు ప్రభావం ఎంత గాఢతదో తెలుసుకునేందుకు డబ్బాను వైద్యుడికి చూపించాలి. ● ఎప్పుడు వాడాలంటే.. పురుగుమందులు ఏ సమయంలో వాడాలో చాలా మంది రైతులకు తెలియడం లేదు. ముందుగా సాగు చేసిన పంటను రెండుమూడు రోజులకోసారి పరిశీలించి, ఏ పురుగు వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందనే దానిపై అవగాహనకు వచ్చిన తర్వాత మందులు వాడాలి. అవసరమైతే వ్యవసాయాధికారి లేదా వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటను పరిశీలించిన తర్వాత వారి సిఫారసు మేరకు మందులు పిచికారీ చేయడం మంచిది. సిఫారసు మేరకు వాడాలి పురుగుమందులు ఎందుకు వాడుతున్నారో చాలా మంది రైతులకు తెలియడం లేదు. దీంతో ఖర్చు పెరుగుతుందే కానీ పంటల్లో పురుగులు చావడం లేదు. పంటలో ఏదైనా సమస్య వస్తే శాస్త్రవేత్తలు లేదా వ్యవసాయాధికారుల సూచనల మేరకు నాణ్యమైన సంస్థల పురుగుమందులు పిచికారీ చేయాలి. – డాక్టర్ హరీశ్కుమార్శర్మ, పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస జాగ్రత్తలు తీసుకోవడం లేదు పురుగు మందులు పిచి కారీ చేసేటప్పుడు రైతులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మందు గాలిలో కలిసి రైతు శ్వాస తీసుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తుంది. పిచికారీ చేసేటప్పుడు కనీసం మాస్క్ అయినా వాడాలి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ మల్లారెడ్డి, ఎండీ, ఫిజిషియన్, జగిత్యాల -
ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు
రాయికల్: సోదరికి ఆస్తి ఇస్తుందన్న కారణంతో తల్లిని హత్య చేశాడో కొడుకు. ఈ సంఘటన రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లె గంగరాజు(65)కు ఇద్దరు కుమారులు, కూతు రు సంతానం. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. భాగ్యను రామాజీపేటకు చెందిన ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. మొదటి కుమారుడు లక్ష్మణ్, రెండో కుమారుడు గంగారెడ్డి అదే గ్రామంలో వేర్వేరు కాపురాలు పెట్టారు. గంగరాజు భర్త ఎర్ర య్య ఐదేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో గంగరాజు తన పేరిట ఉన్న ఎకరం భూమితోపాటు రైతుభరోసా, పింఛన్ సొమ్మును కూతురు భాగ్యకు ఇస్తోంది. ఈ విషయమై గంగారెడ్డి తల్లిని పలుమార్లు మందలించాడు. అయినా ఆమె వినకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. అప్పటినుంచి తల్లిని వేధింపులకు పాల్పడుతున్నాడు. బుధవారం కూడా ఆమెను తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలో మృతిచెందింది. -
ఉపాధికి భరోసా ‘టీగేట్’
● ఏటీసీలు, పరిశ్రమలకు వారధిగా.. ● జగిత్యాలలో అందుబాటులోకి జగిత్యాలటౌన్: పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో (ఐటీఐ) చదువురు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించేందుకు.. వారిలో నైపుణ్య శిక్షణ (స్కిల్ ట్రైనింగ్) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ సంయుక్త భాగస్వామ్యంతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఐటీఐలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లకు స్థానిక పరిశ్రమలతో ఒప్పందం (ఎంఓయూ) కుదిర్చి.. తెలంగాణ గేట్ ఫర్ ఆడాప్టింగ్ అండ్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ (టీగేట్) జిల్లా కమిటీలను నియమించింది. కమిటీ వైస్ చైర్మన్గా జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, కన్వీనర్గా ఐటీఐ ప్రిన్సిపాల్, సభ్యులుగా జిల్లా ఉపాధి కల్పన అధికారి, ఒక ఎన్జీవో ఉంటారు. సీఎస్ఆర్ ఫండ్స్తో కళాశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రయోగ పరికరాలు తదితర వసతులు కల్పిస్తారు. టీగేట్ ద్వారా స్థానిక పరిశ్రమల్లో అప్రెంటిషిప్ పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. శిక్షణలో మెలుకువలు నేర్పించి మంచి పనితీరు కనబరిచిన వారికి ఉద్యోగం పొందడంలో ముఖ్య భూమిక పోషించనుంది. పారిశ్రామిక ప్రగతి దిశగా.. పారిశ్రామిక ప్రగతి పెంపు.. యువతకు వంద శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాల పెంపు లక్ష్యంగా ఇండస్ట్రీస్ 4.0 ప్రాజెక్టు కింద టాటా టెక్నాలజీస్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఏటీసీలను ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి లభించే కోర్సులను ప్రారంభించింది. భోదన, శిక్షణకు అవసరమైన భవనాల నిర్మాణం, యంత్ర పరికరాలు, ఇన్స్ట్రక్టర్ల నియామకం, ఆధునిక శిక్షణ, సామగ్రికి టాటా టెక్నాలజీస్ నిధులు సమకూర్చింది. రూ.5కోట్లతో జగిత్యాలరూరల్ మండలం నర్సింగాపూర్ శివారులో ఏటీసీ భవనం నిర్మించారు. రెండేళ్ల వ్యవధితో కొత్త కోర్సులు ప్రారంభించారు. ఉపాధి అవకాశాలు ఐటీఐలు, ఏటీసీల్లో ప్రవేశపెట్టిన కొత్త కోర్సులు అభ్యసించిన విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో టీగేట్ కీలకపాత్ర పోషించనుంది. మెరుగైన శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించాలి. సమాజ నిర్మాణంలో పాలుపంచుకోవాలన్నదే లక్ష్యం. – ఎం.సురేందర్, వైస్ చైర్మన్ టీగేట్ అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం అందిస్తున్న నూతన కోర్సులను అందిపుచ్చుకుని యు వత తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. కొత్త కోర్సుల్లో చేరిన వారు కొత్త విషయాలు తెలుసుకోవాలి. సమాజానికి ఉపయోగపడేలా పనిచేయాలి. గంట్యాల రవీందర్, కన్వీనర్ టీగేట్ కొత్త కోర్సులివే.. బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్(మెకానికల్) అడ్వాన్స్డ్ సీఎన్సి మిషనింగ్ టెక్నీషియన్ మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్ ఏడాది కోర్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆర్టీసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఈ కోర్సుల్లో ఏటా 172మంది విద్యార్థులు శిక్షణ పొందే వీలుంది. -
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
కరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రెండు చోరీ కేసుల్లో ఐదుగురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో సీపీ గౌస్ఆలం వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంకు చెందిన దినేశ్ రాజ్పురోహిత్ ప్రస్తుతం ఆశోక్నగర్లో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ జవహర్నగర్కు చెందిన కొత్తోజు సందీప్చారితో పీడీయాక్టులో చర్లపల్లి జైలులో పరిచయం ఏర్పడింది. కరీంనగర్ త్రీటౌన్ పరిధిలో ఈనెల ఆరోతేదీన వివేకానందపురికాలనీలోని భార్గవి ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో, వెంకటేశ్వర రెసిడెన్సిలో 32 తులాల బంగారం చోరీ చేశారు. కొంత సొత్తును ఎల్లారెడ్డిగూడలోని ఓ ఫైనాన్స్లో తాకట్టు పెట్టారు. పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి నిందితులను బుధవారం అరెస్టు చేశారు. 265.69 గ్రాముల బంగారం రికవరీ చేసి, కోర్టుకు తరలించారు. దినేశ్ రాజ్ పురోహిత్ 40 కేసుల్లో నిందితుడు. ఖమ్మం, సూర్యాపేట, కోదాడ, విశాఖపట్నం, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, సైబరాబాద్, కరీంనగర్, సిద్దిపేట స్టేషన్లలో కేసులున్నాయి. మానకొండూర్ కేసులో ముగ్గురు.. మానకొండూర్, లలితాపూర్లో జరిగిన చోరీలో నలుగురు నిందితులు ఉండగా, ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం డీకంపల్లి గ్రామానికి చెందిన టేకు గంగసాయిలు(55), టేకు భూమయ్య(45) అన్నదమ్ములు. తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీ చేస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు, గంగాధర, లక్ష్మీదేవిపల్లి, మానకొండూర్, లలితాపూర్, రాజాపూర్లో దొంగతనాలు చేశారు. సొత్తును ఉప్పుల వేణు, భార్త ఎక్నాత్ శేల్కేకు విక్రయించారు. పోలీసులు బుధవారం ముగ్గురిని అరెస్టు చేశారు. 59.3 గ్రాముల బంగారం, 940 గ్రాముల వెండి, రూ.1.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పుల వేణు త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. కేసులను ఛేదించిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీససీఎస్ ఏసీపీ నరసింహులు, త్రీటౌన్ సీఐ జాన్రెడ్డి, ఎస్సై చేరాలు, మానకొండూర్ సీఐ సంజీవ్, సీసీఎస్ సీఐ ప్రకాశ్, ఎస్సై స్వాతి, సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. వేర్వేరు కేసుల్లో ఐదుగురి పట్టివేత 325 గ్రాముల బంగారం, 940 గ్రాముల వెండి రికవరీ వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం -
పెరిగిన గోదావరి ప్రవాహం
● భక్తులను కాపాడిన పోలీసులు ధర్మపురి: కడెం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ధర్మపురి వద్ద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. అప్పటికే స్నానాలు చేసేందుకు గోదావరిలోకి దిగిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు నీటి ప్రవాహం నుంచి భక్తులను ఒడ్డుకు చేర్చారు. ఎస్సై ఉదయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రావు భక్తులను బయటకు రప్పించేందుకు కృషి చేశారు. చూస్తుండగానే గోదావరి ఉధృతి పెరగడం.. ఐదుగురు చిన్నారులు, ఏడుగురు పెద్దలు నదిలోనే ఉండిపోవడం.. పోలీసులు సకాలంలో చేరుకుని వారిని బయటకు తీసుకురావడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. -
జల్సాలకు అలవాటుపడి.. చోరీలు ఎంచుకుని..
పాలకుర్తి: జల్సాలకు అలవాటుపడి చోరీలు చేస్తూ కటకటాలపాలయ్యడు ఓ యువకుడు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ బసంత్నగర్ ఠాణాలో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అంతర్గాం మండలం పెద్దంపేటకు చెందిన పరకాల అశోక్ తన అమ్మమ్మ ఊరు పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లికి మే 18న ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. అదేరోజు రాత్రి దాడి నాగరాజు ఇంటితాళం పగులగొట్టి 2 తులాల పుస్తెలతాడు చోరీ చేశాడు. గతనెల 20 ఇదే గ్రామానికి చెందిన పెసరి మల్లేశ్.. పెద్దంపేటలోని తన అత్తగారింటికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. ఆ ఇంటి పక్కనే అశోక్ ఇల్లు ఉంది. దీంతో మల్లేశ్ తన గ్రామంలోనే ఉన్నాడని తెలుసుకుని అదేరోజు రాత్రి ఈసాలతక్కళ్లపల్లికి వెళ్లి మల్లేశ్ ఇంటితాళం పగులగొట్టి బీరువాలోని 3 తులాల బంగారుహారం దొంగిలించాడు. జూలై 26న సుల్తానాబాద్ శాసీ్త్రనగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లోకి దూరి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అశోక్ అభరణాలు ఎక్కడో పోగొట్టుకున్నాడు. అయితే, చోరీ చేసిన బంగారం, వెండి విక్రయించేందుకు వెళ్తున్న అశోక్ను బసంత్నగర్ బస్టాండ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారం, 35 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా బంగారాన్ని ఓ ఫైనాన్స్లో తనాఖా పెట్టాడని పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై స్వామి పాల్గొన్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ చూసిన సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై స్వామి, హెడ్కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుళ్లు శరత్, అనిల్కుమార్, శివకుమార్, శ్రీనివాస్, రవీందర్, అనిల్ను డీసీపీ, ఏసీపీలు అభినందించారు. కానిస్టేబుళ్లకు నగదు రివార్డు అందజేశారు. కటకటాలపాలైన యువకుడు 3 తులాల బంగారం, 35 తులాల వెండి స్వాధీనం పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ వెల్లడి -
అదుపులోకి వచ్చిన మంటలు
మెట్పల్లి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో మంటలు బుధవారం సాయంత్రం అదుపులోకి వచ్చాయి. ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో గోదాంలో మంటలు చెలరేగగా.. గమనించిన అక్కడి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అదించారు. వెంటనే ఆ శాఖ సిబ్బంది రెండు ఫైరింజిన్లతో హుటాహుటిన చేరుకొని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. కానీ క్రమంగా అవి గోదామంతా వ్యాపించడంతో అదుపు చేయడం కష్టమైంది. దీంతో అధికారులు మరికొన్ని ఫైర్ ఇంజిన్లను రప్పించారు. నిరంతరాయంగా సుమారు 80గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ ఆదేశాలతో పోలీస్, మున్సిపల్, సివిల్ సప్లయ్, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్ అక్కడే ఉండి వారికి అన్ని విధాలుగా సహకారం అందించారు. అగ్నిప్రమాదంతో రూ.1.67లక్షల నష్టం వాటిల్లిందని మార్కెటింగ్, సివిల్ సప్లయ్ శాఖలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టడంతో ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్, అగ్నిమాపక శాఖల విచారణలో ఏం తేలుతుందనేది ఆసక్తిగా మారింది. -
వివాహానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
వెల్గటూర్: అప్పటివరకూ స్నేహితుడి వివాహ వేడుకలో అందరితో కలిసి ఆనందంగా గడిపిన ఆ యువకులు.. వేడుక ముగించుకొని బుధవారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన ముచ్చకుర్తి అనిల్ (26), మేడి గణేశ్ (26) ఇద్దరు స్నేహితులు. ద్విచక్రవాహనంపై ఎండపల్లి మండలకేంద్రంలో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. రాత్రిపూట స్వగ్రామమైన ఇటిక్యాలకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. వెల్గటూర్ మండలం పాశిగామ స్టేజీ వద్ద లక్సెట్టిపేట నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వస్తోంది. అదే సమయంలో రోడ్డుపైకి ఓ గేదె రావడంతో బస్సు గేదెను ఢీకొంది. బస్సు డ్రైవర్ గేదెను తప్పించేక్రమంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అనిల్ ఇటీవలే కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉద్యోగం చేస్తున్నాడు. గణేశ్ హైదరాబాద్లో వండర్ లాలో పనిచేస్తున్నట్లు సమాచారం. గణేశ్కు సోదరి ఉంది. తల్లిదండ్రులు గ్రామంలో కూలీ పని చేసుకుని జీవిస్తున్నారు. సోదరికి వివాహమైంది. అనిల్ తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం ముంబయి వలస వెళారు. అనిల్కు సోదరుడు ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి మృతుల్లో ఒకరు కానిస్టేబుల్ -
రోగాల కూడు
● నిల్వ మాంసం.. కుళ్లిన కూరగాయలు ● నాసిరకం నూనెలు.. స్టోర్డ్ ఫుడ్ వినియోగం ● రంగులు, రసాయనాలతో ఆరోగ్యం చిత్తు ● ఫుడ్సేఫ్టీ ఉన్నతాధికారుల తనిఖీల్లో బహిర్గతం ● హోటళ్ల నిర్వాకం నియంత్రించలేని స్థానిక అధికారులు‘పద్మనగర్కు చెందిన ఓ పదిహేనేళ్ల విద్యార్థిని వారంలో రెండ్రోజులు చాట్, పానీపూరీలు తినేది. రెండునెలల క్రితం హఠాత్తుగా ఆకలి మందగించి ఆహారం తీసుకోవడం మానేసింది. శరీరంలో నిస్సత్తువ పెరగడంతో తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులకు అనుమానం వచ్చి హైదరాబాద్ ఆస్పత్రికి రెఫర్ చేయగా, అక్కడి వైద్యులు పరీక్షలు చేయడంతో హెపటైటీస్–ఏ నిర్ధారణ అయ్యింది. కారణాలు వెతికితే శుభ్రత కొరవడిన ఆహారం తీసుకోవడమేనని తేలింది’.ఇటీవల తనిఖీల్లో దొరికిన కుళ్లిన మాంసం నిల్వలు, ఇతర ఆహారపదార్థాలుహానికర రసాయనాలు జిల్లాలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాసిరకం ఆహారపదార్థాలు వాడుతున్నారు. రుచికోసం ఆహారంలో నిషేధిత రంగులు, రసాయనాలు కలుపుతున్నారు. గతంలో పలు హోటళ్లలో అధికారుల తనిఖీల్లో కలుషితనీరు, పాడైన ఆహార పదార్థాలు దొరికాయి. అప్పుడు నామమాత్రపు చర్యలు తీసుకోవడంతో నిర్వాహకులకు భయం లేకుండా పోయింది. స్థానిక అధికారులు శ్రీమామూళ్లుశ్రీగా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.సిరిసిల్లటౌన్: జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీధిసైడ్ బండిపై దొరికే ఆహారం నుంచి త్రీస్టార్ హంగులతో ఉండే హోటళ్లలో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. కుళ్లిన మాంసం, అపరిశుభ్ర పదార్థాలతో చేస్తున్న వంటలు పిల్లలు, పెద్దలు అన్నివర్గాల వారికి ప్రాణ సంకటంగా మారుతున్నాయి. నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. -
దేశ సమగ్రతే బీజేపీ లక్ష్యం
సిరిసిల్లటౌన్: దేశ సమగ్రతే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో నేతన్న విగ్రహం నుంచి గాంధీ వరకు ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. మన సైనికుల పరాక్రమంపై గర్వంతో జాతి సమైక్యతకు ప్రతీకగా అందరం మన ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేశ్, అల్లాడి రమేశ్, లింగంపల్లి శంకర్, మ్యాన రాంప్రసాద్, ఆడెపు రవీందర్, మల్లారెడ్డి, మార్త సత్తయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, నంద్యాడపు వెంకటేశ్, సిరికొండ శ్రీనివాస్, గూడూరి భాస్కర్, నవీన్యాదవ్, గజబింకర్ చందు, సురేందర్రావు, నాగుల శ్రీనివాస్, మహిళా మోర్చా అధ్యక్షురాలు అన్నపూర్ణ, సిరిసిల్ల, వేములవాడ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, రాపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
రాఖీ కట్నం
15.48కోట్లువిద్యానగర్(కరీంనగర్): రాఖీ పండుగ కరీంనగర్ రీజియన్కు కాసుల పంట పండించింది. ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రూ.15.48 కోట్ల ఆదా యం సమకూరింది. పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీనుంచి 11వ తేదీ వరకు రీజియన్ పరిధి లోని 11డిపోల్లో ఉన్న బస్సులు 21.50 లక్షల కిలో మీటర్లు తిరగగా.. 29,10,435 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వీరిలో 73శాతంపైగా (21,21,668) మహిళలు ఉండగా మహాలక్ష్మి పథ కం ద్వారా రూ.9.08 కోట్లు ఆదాయం వచ్చింది. రాఖీ పౌర్ణమి రోజున ఈనెల 9న రికార్డుస్థాయిలో 7.02 లక్షల మంది రాకపోకలు సాగించగా రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా గోదావరిఖని డిపో నుంచి 4,28,432 మంది ప్రయాణించారు. వీరిలో 3,21,821మంది మహిళలు ఉన్నారు. మొత్తం రూ.223.79 లక్షల ఆదాయం రాగా.. మహాలక్ష్మీ స్కీంకింద రూ.130.09 లక్షల ఆదాయం వచ్చింది. జగిత్యాల డిపో 3,67,855 మందిని చేరవేసి రెండోస్థానంలో నిలిచింది. వీరిలో 2,71,103 మంది మహిళలున్నారు. మొత్తం ఆదాయం రూ.178.57 లక్షలు రాగా.. జీరో టికెట్లు ద్వారా 104.38లక్షల ఆదాయం వచ్చింది. ఆర్టీసీకి కరీంనగర్ రీజియన్లో లాభాల పంట గోదావరిఖని డిపోకు మొదటిస్థానంఅందరి సహకారంతోనే కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోలకు చెందిన సిబ్బంది, డైవర్లు, కండక్టర్లులు, అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పేర్ బస్సులతో పాటు జేబీఎస్ నుంచి సిటీ బస్సులు నడిచేలా చూశాం. 29 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాం. – బి.రాజు, కరీంనగర్ రీజినల్ మేనేజర్ -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీమణికంఠ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని బుధవారం ప్రారంభించారు. దాదాపు 2 గంటలు అక్కడే ఉండి ఎరువుల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాలు పొందిన మహిళలు వ్యాపారాల్లో రాణించాలన్నారు. త్వరలో మహిళా సంఘాల సభ్యులకు రైసుమిల్లులు, సోలార్ ప్లాంట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళలు ఏర్పాటు చేసిన దుకాణాల్లో రైతులు ఎరువులు, పురుగుమందులు కొని వారి ఆర్థికాభివృద్ధికి మద్దతునివ్వాలన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, అనవసర ప్రచారాన్ని రైతులు నమ్మవద్దన్నారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, ఏఎంసీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, ఏవో సలావుద్దీన్, ఏఈవో ప్రవీణ్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఐకేపీ ఏపీఎం దేవయ్య పాల్గొన్నారు. భూపత్రాలు అందజేత ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని సిరికొండ గ్రామంలో 3.28 ఎకరాల ప్రభుత్వ భూమి పత్రాలను రెవెన్యూ అధికారులు బుధవారం జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాశ్కు అందజేశారు. గ్రామంలో వరిధాన్యం కొనుగోలుకు సదరు భూమిని ఉపయోగించనున్నట్టు మార్కెటింగ్ అధికారి తెలిపారు. సదరు స్థలంలో గ్రామస్తులు ఎలాంటి పనులు చేయకూడదని సూచించారు. ఆర్ఐ సంతోష్ కుమార్, ఏఎంసీ కార్యదర్శి హరినాథ్, గ్రామస్తులు పాల్గొన్నారు -
ముగింపా.. పొడిగింపా..?
● నేటితో ముగియనున్న సహకార సంఘాల పదవీకాలంసిరిసిల్లఅర్బన్/ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నెల 14తో ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తుంది. వీరిని కొనసాగించుడా లేదా ఎన్నికల్లోకి వెళ్లుడా.. అనే విషయమై ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడలేదు. దీంతో ప్రస్తుతం జిల్లాలోని 24 సంఘాల పాలకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 2019లో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ఐదేళ్ల తర్వాత వీటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఆరునెలల పాటు పదవీకాలం పొడిగించారు. అదికూడా గురువారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 15న సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్ల ఎదుట జాతీయజెండాను ఎగురవేయాల్సి ఉంటుంది. ఈ అవకాశం తమకు దక్కుతుందా లేదా అనే దానిపై అధ్యక్షుల్లో ఆసక్తి నెలకొంది. ఈ విషయమై డీసీవో రామకృష్ణను వివరణ కోరగా, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఏమైనా నిర్ణయం తీసుకుంటే అమలు చేస్తామన్నారు. నామినేటెడ్ విధానంలో..? వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రస్తుతం నామినేటెడ్ విధానంలో పదవులు భర్తీ చేస్తున్నారు. అయితే సహకార సంస్థల్లో కూడా ఇదే పద్ధతిని ప్రభుత్వం అనుసరించే యోచనలో ఉన్నట్లు జిల్లాలో కొంత ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వ్యయాన్ని తగ్గించుకోవడంతోపాటు, ప్రభుత్వ అనుకూల వర్గాలకు చెందినవారికి పదవులు కట్టబెట్టుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమన్నదానిపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిధిలోని సహకార సంఘాలు జిల్లా పరిధిలో మొత్తం 24 వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. అందులో సిరిసిల్ల, పెద్దూరు, నేరెల్ల, కోనరావుపేట, కొలనూర్, వేములవాడ, నాంపల్లి, రుద్రవరం, చందుర్తి, సనుగుల, మానాల, బోయినపల్లి, కోరెం, మాన్వాడ, నర్సింగపూర్, ఇల్లంతకుంట, గాలిపల్లి, ముస్తాబాద్, పోత్గల్, గంభీరావుపేట, కొత్తపల్లి, ఎల్లారెడ్డిపేట, అల్మాస్పూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో సంఘాలు ఉన్నాయి. -
పంద్రాగస్ట్ వేడుకలకు ముఖ్య అతిథిగా విప్ ఆది
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగే 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. కలెక్టరేట్ సముదాయంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేస్తారు. పంద్రాగస్ట్ వేడుకలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగువ మానేరుకు ఇన్ఫ్లోగంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. పరవళ్లు తొక్కడానికి మరో ఆరు అడుగుల నీరు చేరాల్సి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 2 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.27టీఎంసీల నీరుంది. 116 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. మిడ్మానేరుకు ఎల్లంపల్లి జలాలుబోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు ప్రాజెక్టులోకి వరదకాలువ ద్వారా ఎల్లంపల్లి జలా లు చేరుతున్నాయి. రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్ నుంచి ఎత్తిపోతల ద్వారా సుమారు 9,450 క్యూసెక్కుల నీరు మిడ్మానేరుకు తరలిస్తున్నారు. అలాగే మూలవాగు, మానేరు వాగుల్లోంచి ప్రాజెక్టులోకి 944 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో 7.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పాత ఇళ్లలో నిద్రించవద్దుసిరిసిల్ల: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా బుధవారం కోరారు. వర్షాల నేపథ్యంలో పాత ఇళ్లలో నివాసం ఉండవద్దన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం లేకుండా చూడాలన్నారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నంబర్ 93986 84240 సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దన్నారు. జిల్లాలో నమోదైన వర్షపాతం జిల్లా వ్యాప్తంగా బుధవారం వర్షం కురిసింది. అత్యధికంగా ఇల్లంతకుంటలో 60.6 మి.మీ వర్షం పడగా.. రుద్రంగి 27.2, చందుర్తి 24.8, వేములవాడరూరల్ 34.4, బోయినపల్లి 38.1, వేములవాడ 46.1, సిరిసిల్ల 24.3, కోనరావుపేట 23.4, వీర్నపల్లి 18.4, ఎల్లారెడ్డిపేట 19.7, గంభీరావుపేట 13.5, ముస్తాబాద్ 36.6, తంగళ్లపల్లిలో 36.7 మి.మీ వర్షం కురిసింది. 13 మండలాల్లో సగటు వర్షపాతం 31.0 మి.మీటర్లుగా నమోదైంది. యూరియా కోసం బారులు సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరు సింగిల్విండో కేంద్రం వద్ద రైతులు యూరియ కోసం బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియ అందుబాటులో ఉందని సీఈవో గౌరీశంకర్ తెలిపారు. ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని గ్రోమోర్ కేంద్రం వద్ద బుధవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 4.30 గంటలకే కేంద్రం వద్దకు చేరుకొని క్యూలైన్లో నిల్చున్నారు. 220 యూరియా బస్తాలు మాత్రమే వచ్చాయని తెలియడంతో అన్నదాతలు అసహనానికి గురయ్యారు. అలాగే ఐకేపీ గోదాంకు 440 బ్యాగులు మాత్రమే రాగా 500 వరకు రైతులు చేరుకున్నారు. యూరియా అందరికీ సరిపోయేలా లేకపోవడంతో రైతులు ఎగబడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు శాంతించారు. -
ప్రభుత్వ సాయంతో ఇళ్లు పూర్తి చేసుకోవాలి
● విప్ ఆది శ్రీనివాస్ కోనరావుపేట(వేములవాడ): పేద ప్రజల కలల సౌధమైన ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ సాయంతో పూర్తి చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని కొలనూరు పరిధి గొల్లపల్లి గ్రామంలో కలకుంట్ల లక్ష్మణ్రావు, రమణ దంపతులు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విప్ ముఖ్య అతిథిగా హాజరై రమణకు చీర సారే అందించారు. మండలంలోని గొల్లపల్లిని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరూ నిర్మాణాలు పూర్తి చేసుకొని రానున్న దసరా పండుగకు గృహప్రవేశాలు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీడీవో శంకర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మరో 7 మీ సేవ కేంద్రాలు సిరిసిల్ల/సిరిసిల్లకల్చరల్: ప్రజా ప్రయోజనార్థం జిల్లాకు మరో 7 మీ సేవ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా ప్రకటనలో తెలిపారు. చందుర్తి మండలం మూడపల్లి, గంభీరావుపేట మండల కేంద్రం, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, వేములవాడ అర్బన్ మండలం తెట్టెకుంట (అగ్రహారం), ముస్తాబాద్ మండలం చీకోడు, రుద్రంగి మండలం మానాల, జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19లోపు కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. అర్హతలు, ఇతర నిబంధనల కోసం https://rajannasiricilla. telangana.gov.in వెబ్సైట్లో సందర్శించాలని సూచించారు. -
సేవలకు పురస్కారం
ఇల్లంతకుంట(మానకొండూర్): మహిళా సంఘంలోని సభ్యుల ఆర్థికాభివృద్ధి.. రుణాల చెల్లింపుల్లో ఆదర్శం.. ఉపాధి కల్పనలో ముందుచూపు.. ఇవన్నీ తోడవడంతో ఇల్లంతకుంట ఆదర్శ మండలి సమాఖ్య ఆత్మనిర్భర్ సంఘతన్ పురస్కారానికి ఎంపికై ంది. ఇప్పటికే ప్రకటించిన ఈ అవార్డును స్వాతంత్య్ర వేడుకల్లో ఢిల్లీ అందజేయనున్నారు. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షురాలు, డీఆర్డీవో అధికారి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆదర్శం మహిళా మండలి సమాఖ్య ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా మండలి సమాఖ్య 2004లో ఏర్పాటైంది. 12,420 మంది సభ్యులు, 1,103 స్వశక్తి సంఘాలు, 46 గ్రామైక్య సంఘాలతో కొనసాగుతోంది. రుణాల పంపిణీ, రికవరీలో ఉత్తమ సేవలు, స్వయం ఉపాధి కల్పించడంలో విశేష కృషి, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేయడంతో ఈ సమాఖ్య కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రకటించిన ఆత్మనిర్భర్ సంఘతన్ అవార్డుకు ఎంపికై ంది. ఇప్పటి వరకు ఈ సమాఖ్య రూ.59కోట్ల రుణాలు పంపిణీ చేసి, 99 శాతం రికవరీ చేసింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళాశక్తి కింద మండలంలోని ఆయా గ్రామైక్య సంఘాలకు రూ.1.30కోట్లు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసింది. ఇందులో క్యాంటీన్లు, కుట్టుమిషన్లు, కోడిపిల్లల పెంపకం వంటివి కొనసాగుతున్నాయి. సభ్యులకు లోన్ బీమా సౌకర్యం కల్పించి 20 మందికి రూ.14.80 లక్షలు అందజేశారు. మండలి సమాఖ్య కేంద్రంలో వ్యవసాయ పరికరాలు వరిగడ్డి చుట్టే యంత్రం, రొటోవేటర్, విత్తనాలు చల్లే యంత్రములు కావలసిన రైతులకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. రబీ సీజన్లో గ్రామైక్య సంఘాలకు వడ్ల కొనుగోలు కేంద్రాల బాధ్యత అప్పగించడం ద్వారా సంఘాలకు రూ.కోటి కమీషన్ వచ్చింది. గ్యాస్ ఏజెన్సీ, బస్సు ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్యకు నిరంతరం ఆదాయం వచ్చేలా గ్యాస్ ఏజెన్సీ మంజూరు చేస్తానని కలెక్టర్ సందీప్కుమార్ ఝా హామీ ఇచ్చారు. రూ.36లక్షలతో బస్సు కొనుగోలు చేసి ఆర్టీసీలో అద్దెకు ఇవ్వగా నెలకు రూ.59వేలు ఆదాయం వస్తోంది. ఆత్మ నిర్భర్ పురస్కారానికి ఎంపిక ఆర్థిక క్రమశిక్షణతో గుర్తింపు ఢిల్లీకి వెళ్ల్లిన ఇల్లంతకుంట ఆదర్శ మండలి సమాఖ్య అధ్యక్షురాలు స్వాతంత్య్ర వేడుకల్లో అవార్డు ప్రదానం ఇందిరా మహిళా శక్తితో ఆదాయం నేను ఆదర్శ మండలి సమాఖ్యలో సభ్యురాలిని. నా భర్త గీతా కార్మికుడు. ఆయన చనిపోవడంతో ఇద్దరూ పిల్లలతో సంసారం ఎల్లుడు కష్టమైంది. ఇందిరా మహిళాశక్తి కింద రూ.3లక్షలు రుణం తీసుకొని క్యాంటీన్ పెట్టుకున్నాను. మంచి ఆదాయం వస్తోంది. రుణ వాయిదాలు చెల్లిస్తూ పిల్లలను చదివిస్తున్నాను. – బండారి స్వాతి, ఇల్లంతకుంట -
యూరియా కొరత లేదు
● మోతాదుకు మించి వాడొద్దు ● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగంసిరిసిల్ల: జిల్లాలో యూరియా కొరత లేదని, ఒక్క రోజు అటూ.. ఇటుగా రైతులకు అందుతోందని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం మంగళవారం తెలిపారు. జిల్లాలో సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. లారీల్లో సొసైటీలకు చేరేందుకు కొద్దిగా సమయం పడుతుందని వివరించారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో కొంతమంది రాజకీయాల కోసం రైతులను రెచ్చగొడుతూ ధర్నాలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సీజన్ మొత్తానికి 22వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. ఇప్పటికే జిల్లాకు 12,500 టన్నుల యూరియా వచ్చిందని స్పష్టం చేశారు. ఇంకా కావాల్సిన 11,500 టన్నుల యూరియా విడతల వారీగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. యూరియా గ్రాన్యూల్స్కి బదులుగా, నానో యూరియా వాడాలని కోరారు. -
సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులు సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉపయోగపడతాయన్నారు. ఎల్లారెడ్డిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ కానుకగా 100 సైకిళ్లను మండలంలోని 9 పాఠశాలల్లోని విద్యార్థులకు అందజేశారు. ఎంఈవో కృష్ణహరి, హెచ్ఎం మనోహరాచారి, బీజేపీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, నాయకులు పొన్నాల తిరుపతిరెడ్డి, మద్దుల బుగ్గారెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, గంట బాలకృష్ణాగౌడ్, దాసరి గణేష్, నంది నరేశ్, రాజిరెడ్డి, సంజీవరెడ్డి, ఆంజనేయులు, దాసరి పూర్ణిమ, బాలాగౌడ్, కిరణ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వదిలేశారు
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025వార్నింగ్తో● ‘ఫేక్ అటెండెన్స్’ ఇచ్చిన వారికి సర్క్యులర్ జారీ ● మరోసారి చెయొద్దని స్పష్టం ● ఊపిరి పీల్చుకున్న 33 మంది కార్యదర్శులుసిరిసిల్ల: గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహించకుండానే నిర్వహించినట్లుగా, క్షేత్రస్థాయిలో ఉండకుండానే.. ఉన్నట్లుగా ఫేక్ అటెంటెన్స్ ఇచ్చిన గ్రామపంచాయతీ కార్యదర్శులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 33 మంది పంచాయతీ కార్యదర్శులపై జిల్లా పంచాయతీ అధికారులు నివేదిక సిద్ధం చేసి కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు పంపించగా.. వార్నింగ్తో వారిని వదిలేశారు. మరోసారి తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పొరుగు జిల్లాలో ఫేక్ అటెండెన్స్ నమోదు చేసిన వ్యవహారంలో సదరు గ్రామపంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 33 మంది పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు గురయ్యారు. కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారని భయంతో వణికిపోయారు. పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ నమోదులో యాప్ లోపాలు వెల్లడి కావడంతో కలెక్టర్ లోతుగా విశ్లేషించారు. ఈమేరకు మొదటి తప్పిదంగా భావించి వార్నింగ్ ఇవ్వాలని సూచించారు. మరోవైపు మరోసారి ఈ తప్పు చేయకుండా కట్టడి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సాంకేతిక లోపమే కారణమైంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమయపాలన పాటిస్తూ.. విధులు నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసే చోటి నుంచి నిత్యం గ్రామపంచాయతీ కార్యదర్శులు డీఎస్ఆర్ (డైలీ శానిటేషన్ రిపోర్టు) యాప్లో సెల్ఫీ దిగి తమ హాజరు నమోదు చేయాలని నిర్దేశించింది. యాప్లో సాంకేతిక లోపాలను అలుసుగా తీసుకున్న కొందరు గ్రామపంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తూ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 32 మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేని రోజుల్లో అన్నీ తామై నడిపించాల్సిన పంచాయతీ కార్యదర్శులు ఇలా ఫేస్ రికగ్నిషన్ యాప్లో ఫేక్ వ్యక్తులతో అటెండెన్స్ నమోదు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. పంచాయతీరాజ్ డైరెక్టర్ సీరియస్ క్షేత్రస్థాయిలో ఫేక్ అటెంటెన్స్పై పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన సీరియస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముఖ గుర్తింపు యాప్లో నమోదైన పంచాయతీ కార్యదర్శులు ఫొటోలను పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా యాప్లను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని మండల పంచాయతీ అధికారులు(ఎంపీవో)లకు స్పష్టం చేశారు. నకిలీ హాజరు నమోదు చేసే పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన ఆదేశించారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ డీఎస్ఆర్ యాప్ను అధికారులు పరిశీలించి నివేదించగా కలెక్టర్ సూచనతో వార్నింగ్తో వదిలేశారు. అదే పొరుగు జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్లలో గ్రామపంచాయతీ కార్యదర్శుల పనితీరుపై నమ్మకంతో కలెక్టర్ సానుకూలమైన నిర్ణయంతో వార్నింగ్తో వదిలేయడం విశేషం.న్యూస్రీల్ -
నిధులు విడుదల చేయండి
● సీఎం రేవంత్రెడ్డికి ప్రభుత్వ విప్ విన్నపం వేములవాడ: నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విన్నవించారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో మంగళవారం కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. కలికోట సూరమ్మ చెరువు కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి భూసేకరణకు నిధులు, చందుర్తి–మోత్కురావుపేట రోడ్డు నిర్మాణానికి, మూలవాగుపై వంతెనల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం వద్దు సిరిసిల్లటౌన్: అత్యవసర వేళల్లో క్షతగాత్రులకు వైద్యసేవలు అందించే 108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారిణి రజిత సూచించారు. జిల్లాలోని 108 అత్యవసర సర్వీసుల సేవలను మంగళవారం పరిశీలించి మాట్లాడారు. వాహనంలోని అత్యవసర వైద్య పరికరాలను పరిశీలించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నయీమ్ జహ, 108 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్, జిల్లా మేనేజర్ అరుణ్కుమార్, 108 వాహన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.5 లక్షల విరాళం వేములవాడ: రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు జగిత్యాల జిల్లాకు చెందిన ముస్కు కార్తీక్రెడ్డి–సుష్మ దంపతులు వారి పిల్లలు ఆరుష్, కియాన్ల పేరిట రూ.5లక్షలు విరాళం ఆలయ ఈవో రాధాభాయికి మంగళవారం అందజేశారు. ప్రొటోకాల్ ఏఈవో అశోక్కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ, ప్రొటోకాల్ విభాగం సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేశ్ పాల్గొన్నారు. గ్రంథాలయాల్లో వసతులు కల్పిస్తాం ● జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్యనారాయణ ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో గ్రంథాలయాలలో వసతులు కల్పిస్తామని గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ పేర్కొన్నారు. ముస్తాబాద్ గ్రంథాలయాన్ని మంగళవారం సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. జిల్లాలోని లైబ్రరీలలో మరుగుదొడ్లు, నీరు, కరెంట్ సదుపాయాల కల్పనకు రూ.10లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, గజ్జెల రాజు, అనిత పాల్గొన్నారు. భూసార పరీక్షలు చేయించుకోవాలి గంభీరావుపేట(సిరిసిల్ల): భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేసుకోవాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు కోరారు. గంభీరావుపేట సింగిల్విండో కార్యాలయంలో క్రిభ్కో భారతి ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రవీందర్రావు మాట్లాడుతూ.. రైతులు మోతాదుకు మించి యూరియా వాడొద్దన్నారు. సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థ ద్వారా 13 జిల్లాలో వ్యవసాయ ఉత్సవం నిర్వహిస్తున్నామని సంస్థ రాష్ట్ర ఎండీ నితిన్ తెలిపారు. కేడీసీసీబీ డైరెక్టర్ భూపతి సురేందర్, క్రిభ్కో సంస్థ జిల్లా మేనేజర్ ప్రేమ్ తేజ, పెట్రోలియం సంస్థ ప్రతినిధులు దాన్విందర్ సింగ్, శ్రావణ్కుమార్, సెస్ మండల డైరెక్టర్ నారాయణరావు పాల్గొన్నారు. -
వర్షాలతో అప్రమత్తం
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● టోల్ఫ్రీ నంబర్ 93986 84240 ● ఉద్యోగుల సెలవులు రద్దుసిరిసిల్ల/వేములవాడఅర్బన్: కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ప్రకటించారు. కలెక్టరేట్లో మంగళవారం సమీక్షించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో వరదలు వచ్చే అవకాశం ఉందని.. ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్నంబర్ 93986 84240 ఏర్పాటు చేసి పోలీస్, రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, రాధాబాయి, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, డీఏవో అఫ్జల్బేగం, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అన్వేషన్, డీపీవో షరీఫొద్దీన్, ఇరిగేషన్ ఈఈ ప్రశాంత్, మిషన్ భగీరథ ఈఈ జానకీ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు కలెక్టరేట్లో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులతో రాత్రి సమీక్షించారు. ఆగస్టు 15న శుక్రవారం నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి విద్యార్థులకు నాణ్య మైన భోజనం అందించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. వేములవాడలోని మహా త్మా జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాసంస్థను మంగళవారం తనిఖీ చేశారు. కిచెన్, స్టోర్ రూమ్లను పరిశీలించారు. నాణ్యమైన భోజనం పెడుతున్నారా? లేదా?, వసతి ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కొందరు టీచర్లు సక్రమంగా పాఠాలు బోధించలేకపోవడం గమనించి, పలు సూచనలు చేశారు. పాఠశాలకు అవసరమైన 30 బెంచీలను ఇతర విద్యాలయాల నుంచి తెప్పించాలని సూచించారు. ప్రిన్సిపాల్ శ్యామల, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. -
ప్రతీ కూలీకి ‘ఉపాధి’ కల్పించాలి
● డీఆర్డీవో శేషాద్రిబోయినపల్లి(చొప్పదండి): జాబ్కార్డు ఉన్న ప్రతీ కూలీకి ఉపాధిహామీ పని కల్పించాలని డీఆర్డీవో శేషాద్రి పేర్కొన్నారు. మండల పరిషత్లో మంగళవారం మండలస్థాయి ఉపాధిహామీ 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. డీఆర్డీవో శేషాద్రి మాట్లాడుతూ ఏడాదిలో రూ.6.28 కోట్ల పనులు జరిగినట్లు తెలిపారు. వేతనాలు రూ.2.94 కోట్లుగా, మెటీరియల్ కాంపోనెంట్ రూ.4.37 కోట్లుగా పేర్కొన్నారు. సామాజిక తనిఖీలో ఉపాధిహామీ కూలీ మస్టర్పై సరైన సంతకం ఉందా లేదా అనే అంశం.. అలాగే మెజర్మెంట్ను డీఆర్పీలు తనిఖీ చేసి నివేదిక అందజేశారన్నారు. జరిమానాలు రూ.4 వేలు, రికవరీ రూ.12,162గా గుర్తించినట్లు తెలిపారు. జెడ్పీ సీఈవో వినోద్, ఎంపీడీవో జయశీల, డీవీవో రామారావు, అంబుడ్స్పర్సన్ రాకేశ్, ఎస్సార్పీ దేవేందర్, ఏపీవో సబిత తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన అన్నదాతలు
● మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు ● పొద్దంతా క్యూలైన్లోనే.. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): యూరియా కోసం రైతులు పొద్దంతా క్యూలైన్లోనే ఎదురుచూడాల్సిన పరిస్థితులు. తెల్లవారుజామునే గోదాంల వద్దకు వెళ్తున్న అన్నదాతలు క్యూలైన్లో తమ చెప్పులు, పాసుపుస్తకాలు పెట్టి అధికారుల రాక కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు వచ్చినా సకాలంలో పంపిణీ చేయడం లేదు. జిల్లాలో మంగళవారం ప్రతీ మండలంలో యూరియా కోసం రైతులు బారులు తీరడం కనిపించింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు రైతులతో కలిసి రోడ్డుపై బైటాయించారు. ● ఇల్లంతకుంట: మండల కేంద్రంలో జెడ్పీ మాజీ వైస్చైర్మన్ సిద్దం వేణు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ● కోనరావుపేట: స్థానిక క్రాసింగ్ వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ● ముస్తాబాద్: స్థానిక గ్రోమోర్ దుకాణం వద్ద యూరియా ఇవ్వాలని రైతులు కోరగా.. అధికా రుల నుంచి ఆదేశాలు రావని సిబ్బంది తెలపడంతో ఆగ్రహించి రోడ్డెక్కారు. కొత్తబస్టాండ్లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. ● వీర్నపల్లి: మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి నాయకులు ధర్నాకు దిగారు. ● రుద్రంగి: మండల కేంద్రంలో పోలీస్ బందోబస్తు మధ్య ఒక్కో రైతుకు ఒకటే యూరియా బస్తా పంపిణీ చేశారు. అడ్డుకున్న పోలీసులు ● చందుర్తి: యూరియా కొరతను నిరసిస్తూ ధర్నా, రాస్తారోకాకు సిద్ధమైన చందుర్తి బీఆర్ఎస్ నాయకులను పోలీసులు రోడ్డెక్కకుండా అడ్డుకున్నారు. తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి డిప్యూటీ తహసీల్దార్ శ్రీలతకు వినతిపత్రం ఇచ్చారు. చందుర్తి గోదాంకు సరఫరా చేసిన 888 బస్తాల్లో 638 పంపిణీ చేశారు. గోదాంలో 250 బస్తాలుంటే బుధవారం కోసం 350 మందికి టోకెన్లు ఇచ్చారు. సనుగుల సింగిల్ విండోకు 900 బస్తాలను సరఫరా చేస్తామని ప్రకటించిన వ్యవసాయాధికారులు ఒక్క బస్తాను సరఫరా చేయలేదని అక్కడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● వేములవాడరూరల్: మండలంలోని చెక్కపల్లిలో రైతులకు యూరియా అందడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి వినీతకు వినతిపత్రం అందజేశారు. -
పుస్తెలమ్మినా సరిపోతలేవు
మాది తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ. మొదటి సంతానం నార్మల్ డెలివరీ అయింది. రెండో సంతానం కోసం కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే పెద్ద ఆపరేషన్ చేశారు. తర్వాత కడుపు మధ్యలో కుట్లు ఊడిపోయి, రంద్రం పడిందని ఆసుపత్రికి వెళ్తే వారు నిర్లక్ష్యం చేశారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో సంప్రదించగా ఐదు సార్లు ఆపరేషన్ చేశారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న. అక్కడ ఆపరేషన్కు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికే ఆస్తులు అమ్మి ఆపరేషన్లకు పెట్టిన. మళ్లీ ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి ఆదుకోండి. – కొండ భవాని, ఇందిరమ్మకాలనీ -
యూరియా లేదయా!
చెప్పుల క్యూలైన్లురాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో రైతులు ఉదయం 6 గంటల నుంచి క్యూలో ఉన్నారు. తమ చెప్పులను వరుసగా పెట్టి యూరియా కోసం గంటల తరబడి ఎదురుచూశారు. ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి మండలాల్లోనూ ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ ఎరువుల కోసం రైతులు అనేక పాట్లు పడుతుంటే అధికారులు మాత్రం ఎరువుల కొరతే లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది.ముందస్తు ప్రణాళిక కరువుకరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సాగు అయ్యే పంటల విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువుల నిల్వలను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాల్సిన అధికారులు విఫలమైనట్లుగా భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో సాగయ్యే 1,84,860 ఎకరాల పంటలకు యూరియా 3,460 టన్నులు, డీఏపీ 22,390 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం ఉండగా ముందుస్తు ప్రణాళిక లేకనే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.● కరీంనగర్ జిల్లాలో 3,34,127 ఎకరాల పంటలకు యూరియా 28,493 టన్నులు యూరియా అవసరం ఉండగా 13,732 టన్నులు మాత్రమే జిల్లాకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లాలో 1.90,850 ఎకరాలలో పంటలు సాగు కాగా 32,447 టన్నులు ఎరువులు అవసరం. కానీ జిల్లాకు ఇప్పటి వరకు 17,036 టన్నులు మాత్రమే వచ్చింది. జగిత్యాల జిల్లాలో 4,22,725 ఎకరాలలో పంటలు సాగవగా 34,679 టన్నులు ఎరువులు కావాలి. కానీ ఇప్పటి వరకు చేరింది 20,729 టన్నులు మాత్రమే. అంటే ఎక్కడ కూడా అవసరంలో సగం మాత్రమే ఎరువులు జిల్లాలకు చేరాయి.రైతులు తొందరపడొద్దురైతులు తొందరపడొద్దు. అవసరాల మేరకు యూరియా ఉంది. ఇప్పుడు మార్కెట్లో 500 మెట్రిక్ టన్నుల మేరకు యూరియా సిద్ధంగా ఉంది. మొత్తం సీజన్కు అవసరమైన మేరకు తెప్పిస్తున్నాం. సిరిసిల్ల అపెరల్ పార్క్లో కలెక్టర్ చొరవతో కొత్తగా గోదాము ఏర్పాటు చేసి ఎరువులను నిల్వ చేస్తున్నాం. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. – అఫ్జల్బేగం, జిల్లా వ్యవసాయాధికారి -
ఆస్తి అమ్ముకొనుటకు అనుమతివ్వండి
నాకు ఐదుగురు ఆడపిల్లలు, ఒక్క కొడుకు కొండూరి శ్రీనివాస్. 20 ఏళ్ల క్రితం పెండ్లి చేశాను. కొద్ది రోజులకే వేరు పడ్డారు. నాకున్న కిరాణ దుకాణం, వేములవాడలో మూడున్నర గుంటల స్థలం, రూ.50వేల డిపాజిట్, రూ.16 లక్షల ఎల్ఐసీ ఇన్సూరెన్స్లు ఇచ్చాను. అప్పటి నుంచి నన్ను, నా భార్య పోషణ చూడడం లేదు. నా పేరిట ఉన్న భూములను మా జీవనోపాధి కోసం అమ్ముకోవాలని చూస్తే నా కొడుకు అడ్డు పడుతున్నాడు. కాబట్టి వయోవృద్ధుల పోషణ చట్టం కింద అమ్ముకొనుటకు అనుమతి ఇవ్వండి. – కొండూరి రాజమౌళి, వేములవాడ -
కిక్కిరిసిన బస్టాండ్
వేములవాడ బస్టాండ్లో ప్రయాణికులు వేములవాడఅర్బన్: ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు సోమవారం కిక్కిరిసిపోయారు. రాఖీపౌర్ణమి, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో పట్టణంలోని ప్రజలు పల్లెలకు చేరుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణంలో వేములవాడ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. టీఎస్ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్స్ అసోసియేషన్సిరిసిల్ల సర్కిల్ ఇంజినీర్ల అసోయేషన్ ప్రతినిధులు సిరిసిల్ల: టీఎస్ఆర్డబ్ల్యూఎస్ జిల్లా సర్కిల్ మిషన్ భగీరథ విభాగం ఇంజినీర్ల అసోసియేషన్ ఎన్నికలు సోమవారం జరిగాయి. అధ్యక్షుడిగా సి.విశ్వన్, ఉపాధ్యక్షుడిగా బి.అభిషేక్, ప్రధాన కార్యదర్శిగా ఎ.రామారావు, సంయుక్త కార్యదర్శిగా పి.హరిప్రియ, టెక్నికల్ కార్యదర్శిగా బి.శ్రీమాన్, మహిళా కార్యదర్శిగా ఎం.శ్రావ్యపటేల్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఈ.మధు, కోశాధికారిగా ఎన్.సాయికిరణ్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా పి.హారిక వ్యవహరించారు. హెచ్హెచ్ఆర్పీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానంసిరిసిల్ల: ఆర్డీవో ఆఫీస్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా సోమవారం ప్రకటనలో తెలిపారు. హ్యాండ్ హోల్డింగ్ రిసోర్స్ పర్సన్(హెచ్హెచ్ఆర్పీ) ఒక్క పోస్టు ఉందని పేర్కొన్నారు. జిల్లా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ఫారమ్ పొంది ఆన్లైన్లో ఈనెల 18లోగా దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన బీటెక్(సీఎస్సీ), బీటెక్(ఐటీ), ఎంసీఏ చదివిన అభ్యర్థులు అర్హులని వివరించారు. కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలి కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన రామలక్ష్మణపల్లి గ్రామస్తులు సిరిసిల్లఅర్బన్: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని కోరుతూ ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. గ్రామ శివారు నుంచి చంద్రమౌళి అనే వ్యక్తి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని, జేసీబీ సహాయంతో టిప్పర్లు, ట్రాక్టర్, పికాక్లు నింపుతూ అడ్డువచ్చిన వారిని బెదిస్తున్నాడని వారు ఆరోపించారు. ఇసుక రవాణా కోసం పాక అంజయ్య పొలం నుంచి ప్రత్యేకంగా రోడ్డు నిర్మించుకున్నారన్నారు. రవీందర్, ఎల్లయ్య, రాజు, రాజశేఖర్, రాములు, మాఽ దవి, పద్మ, మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
వాగుల్లో జలధారలు
సిరిసిల్ల: వర్షాకాలం సీజన్లో సమృద్ధిగా వానలు కురువలేదు. జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి పెద్దగా నీరు చేరలేదు. రెండు, మూడు రోజులుగా జిల్లాలో అడపాదడపా కురిసిన వానలకు సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలవాగుల్లో నీటిపాయలు సాగుతున్నాయి. నర్మాల ఎగువ మానేరు, నిమ్మపల్లి మూలవాగు జలాశయాలు అలుగు పారలేదు.. కానీ పడువాటు నీళ్లతో మానేరు, మూలవాగుల్లో సోమవారం నీటి ధారలు సాగాయి. వాగుల్లో నీరు పారితే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి. మరో రెండు, మూడు గట్టి వానలు పడితే జలాశయాలు నిండి వాగులు పారేందుకు ఈ నీటిధారలు సూచిక. పడువాటు నీటితోనే వాగుల్లో జలసిరులు పరుగు తీయడం రైతుల్లో ఆనందాన్ని నింపింది. జిల్లాలోని ప్రధానమైన వాగుల్లో సోమవారం కనిపించిన దృశ్యాలు ఇవీ.. -
అది చిరుత కాదు.. హైనా
ధర్మపురి: ధర్మపురిలో మూడు రోజులుగా చిరుత సంచరిస్తోందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అది చిరుత కాదని, హైనా అని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనాథ్ తెలిపారు. పట్టణంలోని ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ధర్మపురి పరిసర ప్రాంతంలో చిరుతపులి కనిపించిందని కొందరు జిల్లా అధికారులకు సమాచారం అందించారని, దీంతో ఫారెస్టు సిబ్బందితో సమీప పొలాలు, చెట్లపొదల మాటున గాలింపు చేపట్టామని, ఓ జంతువు పాదముద్ర లభించగా.. అది చిరుత పాదముద్రలని భావించి హైదరాబాద్ ఫోరెన్సికు పంపించామని తెలిపారు. అక్కడ చిరుత పా దముద్రలు కావని, హైనా అడుగులుగా గర్తించారని తెలిపారు. హైనాతో మనుషులకు ఎలాంటి ప్రాణనష్టమూ జరగదని, మేకలు, గొర్రెల కోసం వస్తుంటుందని తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సదాశివుడు, సిబ్బంది తదితరులున్నారు. కాపర్వైర్ దొంగల అరెస్టు ఎల్కతుర్తి: పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైరును అపహరిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన బండి కుమారస్వామి, బండి సతీశ్ కొంతకాలంగా ఎల్కతుర్తి, వేలేరు, భీమదేవరపల్లి, సైదాపూర్, హుజూరాబాద్, శంకరపట్నం ప్రాంతాల్లో రాత్రివేళల్లో 27 ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి వాటిలోని కాపర్ వైర్ను అపహరించారు. దానిని అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ఈక్రమంలో ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తన సిబ్బందితో సోమవారం భీమదేవరపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అడ్డుకున్నారు. వారి వద్ద కాపర్వైరు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టేందుకు ఉపయోగించే వస్తువులు ఉండడాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా సులువుగా డబ్బులు సంపాదించేందుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్ను దొంగిలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. దొంగిలించిన కాపర్ వైర్ను ముల్కనూర్ గ్రామానికి చెందిన రుద్రాక్ష తిరుపతికి అమ్మినట్లు విచారణలో తేలింది. వెంటనే తిరుపతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో నిందితులపై 2012 నుంచి 53 కేసులు నమోదైనట్లు ఏసీపీ వెల్లడించారు. కాగా, నిందితుల నుంచి రూ.2.50లక్షల విలువ గల 250 కిలోల కాపర్ వైర్, మోటర్ సైకిల్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సీఐ పులి రమేష్, ఎస్సైలు సాయిబాబు, ప్రవీణ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కాజీపేట – బల్హార్ష రైలుకు ఆదరణ కరువు
రామగుండం: కాజీపేట – బల్హర్ష మధ్య నడిచే బల్హర్ష ఎక్స్ప్రెస్ రైలు అర్ధరాత్రి ప్రారంభమవుతోంది. వేకువజామున గమ్యస్థానం చేరుకుంటోంది. దీంతో ప్రయాణికులు లేక బోగీలు బోసిపోయి కనినిపస్తున్నాయి. కాజీపేటలో రాత్రి 10.50 గంలకు ప్రారంభమైతే.. ఉప్పల్కు రాత్రి 11.09 గంటలకు, జమ్మికుంటకు రాత్రి 11.18 గంటలకు, ఓదెలకు రాత్రి గం.11.32 గంటలకు, పెద్దపల్లికి రాత్రి 11.41గంటలకు, రాఘవాపురానికి రాత్రి 11.47 గంటలకు, రామగుండానికి రాత్రి 11.54గంటలకు, బల్హర్షకు వేకువజామున 3.10గంటలకు చేరుకుంటోంది. తిరుగు ప్రయాణంలో బల్హార్షలో వేకువజామున 3.50గంటలకు ప్రారంభమై రామగుండానికి ఉదయం 5.47గంటలకు, పెద్దపల్లికి ఉదయం 6.15 గంటలకు, ఓదెలకు ఉదయం 6.34లకు, జమ్మికుంటకు ఉదయం 7.20గంటలకు కాజీపేటకు ఉదయం 8.50 గంటలకు చేరుకుంటోంది. దీనికి అర్ధగంట ముందే భాగ్యనగర్ నడవడంతో హైదరాబాద్ మార్గంలో ప్రయాణించేవారంతా అందులోనే వెళ్తున్నారు. దీంతో బల్హర్ష రైలుకు ప్రయాణికుల నుంచి ఆదరణ ఉండడంలేదు. మరోవైపు.. అర్ధరాత్రివేళ రాకపోకలు సాగించే ఈ రైలులో ప్రయాణించే కొద్దిమంది మహిళా ప్రయాణికులకు కూడా భద్రత కరువైంది. వారిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. రాత్రివేళలోనే ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం వేకువజామున గమ్యస్థానం చేరిక పదిమంది కూడా ప్రయాణించని వైనం తిరుగు ప్రయాణంలోనూ స్పందన కరువు రాకపోకల సమయాలు మార్చాలని డిమాండ్ సికింద్రాబాద్ వరకు పొడిగించాలని విన్నపాలు -
పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా తంగళ్లపల్లి(సిరిసిల్ల): పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సోమవారం నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ చేతులు పరిశుభ్రంగా కడుక్కోకపోవడం, పాదరక్షలు లేకుండా మట్టిలో ఆడుకోవడం, బహిరంగ మలవిసర్జన చేయడం వంటి వాటితో నులిపురుగులు సంక్రమిస్తాయన్నారు. నులి పురుగులు కడుపులో చేరడంతో కడుపునొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, ఆకలి లేకపోవడం, బలహీనత, రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి శారీరక మానసిక అభివృద్ధి మందగిస్తుందన్నారు. పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత, హెచ్ఎం సిలుముల శంకర్, తంగళ్లపల్లి పీహెచ్సీ వైద్యురాలు దీప్తి, ఏఎన్ఎంలు ప్రమీల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. లక్ష్యానికి మించి ట్యాక్స్ వసూలు● జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ సిరిసిల్ల: జిల్లాలో రవాణాశాఖ లక్ష్యానికి మించి ట్యాక్స్ వసూలు చేసిందని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ సోమవారం తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 293 కేసులు నమోదు చేసి రూ.96.96 లక్షలు వసూలు చేశామని వివరించారు. జిల్లాకు రవాణాశాఖ రూ.64 లక్షల లక్ష్యం నిర్ణయించగా.. 151 శాతం మేరకు ట్యాక్స్ వసూలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇంకా ట్యాక్స్ చెల్లించని సరుకు రవాణా వాహనాలు, ట్రాక్టర్ ట్రైలర్లు, ఇతర వాహనాలు 5,088 ఉన్నట్లు వివరించారు. వాహన యజమానులు స్వచ్ఛందంగా చెల్లిస్తే ఎలాంటి జరిమానా ఉండదని, రవాణా శాఖ అధికారులు పట్టుకుంటే 200 శాతం జరి మానా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్, ఆఫీస్ నిర్వాహకురాలు కల్పన, సాంకేతిక సహా యకులు కరుణాకర్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని ట్రినిటి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎడ్యూనెట్ ఫౌండేషన్ ద్వారా సాప్ కార్యక్రమాన్ని ఎడ్యునెట్ ప్రాజెక్టు మేనేజరు అఫ్సర్ పాషా, ప్రోగ్రాం మేనేజర్ దేవీసేన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ట్రినిటి విద్యాసంస్థల వ్యవస్థాపకులు దాసరి మనోహర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎడ్యునెట్ ఫౌండేషన్ ద్వారా అందించే సాప్ కోర్స్ను ఎంబీఏ విద్యార్థులు సద్వి నియో గం చేసుకోవాలన్నారు. చైర్మన్ దాసరి ప్ర శాంత్రెడ్డి, ప్రిన్సిపాల్ నాగేంద్రసింగ్, వైస్ ప్రిన్సిపాల్ కిశోర్, ఏవో రాజశేఖర్రెడ్డి, హెచ్వోడీ ప్రవీణ్కుమార్, సంతోషి, రజితరెడ్డి, ఇలియాస్అలీ, అజారుద్దీన్, సుప్రియ పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలం గూడెంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. గూడెంకు చెందిన పిట్ల దేవయ్య(60) సోమవారం ఉదయం ఇంట్లో మృతిచెంది ఉన్నాడు. దేవయ్య ముఖం, శరీరంపై గాయాలు ఉన్నాయి. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోదరుడు లస్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సీఐ మొగిలి, ఎస్సై గణేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దేవయ్య ఆయన కుమారుడు చందు తరచూ గొడవ పడేవారని, అర ఎకరం భూమి విషయంలో తండ్రీకొడుకుల మధ్య వివాదం తలెత్తిందని తెలిపారు. ఆ కోణంలో చందును ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. జ్వరంతో యువకుడు..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగుండారం గ్రామానికి చెందిన లకావత్ శివ(23) జ్వరంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాచర్లగుండారం గ్రామానికి చెందిన లకావత్ జయరాం–సోబి దంపతుల కుమారుడు శివ చిన్నతనం నుంచి మూర్ఛవ్యాధితో బాధపడుతుండే వాడు. గత నాలుగు రోజు లుగా జ్వరంతో బాధపడుతున్న శివకు ఆర్ఎంపీల వద్ద వైద్యం అందించారు. జ్వరం తగ్గకపోగా.. పరిస్థితి విషమించి మండల కేంద్రంలోని ప్రైవే ట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. డిష్ రిపేర్ చేస్తూ ఒకరు.. సారంగాపూర్: మండలంలోని పెంబట్ల గ్రామంలో ఓ ఇంటిపై డిష్ రిపేర్ చేస్తూ.. కిందపడి పల్లికొండ మహేశ్ (40) మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై గీత కథనం ప్రకారం.. జగిత్యాలలోని పోచమ్మవాడకు చెందిన మహేశ్ పెంబట్లలోని చొప్పరి రాజేందర్ ఇంట్లో డిష్ రాకపోవడంతో మహేశ్ వైర్ను సరిచేసేందుకు ఇంటిపైకి ఎక్కాడు. మహే్శ నిలబడి ఉన్న సజ్జ విరిగి కింద పడిపోయాడు. మహే్శ తల బండరాయిపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మత్తుకు అలవాటై.. ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): జల్సాలకు అలవాటుపడ్డ యువకులు క్రమంగా గంజాయి మత్తుకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం గంజాయి విక్రయిస్తుండగా పోలీసులకు చిక్కారు. ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాలు.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పందిమడుగుకు చెందిన మలావత్ రామ్కుమార్, వీర్నపల్లి మండలం సీతారాంనాయక్ తండాకు చెందిన బానోత్ అజయ్కుమార్, అజ్మీరా సాయివిశాల్ జల్సాలకు అలవాటుపడ్డారు. ఈక్రమంలోనే గంజాయికి అలవాటుపడ్డారు. డబ్బు సంపాదించేందుకు గంజాయిని తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు విక్రయించాలనుకున్నారు. వీర్నపల్లి మండలం రంగంపేటలోని జంపన్న చెరువు వద్ద గంజాయి విక్రయించేందుకు రాగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. వారి నుంచి 50 గ్రాముల గంజాయి, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడం చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై లక్ష్మణ్, పోలీస్ సిబ్బందిని సీఐ అభినందించారు. ద్విచక్ర వాహనం నుంచి పడిపోయిన బంగారం బ్యాగుజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట–పొరండ్ల శివారులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తల వద్దనున్న బంగారం బ్యాగు పడిపోయిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. రాయికల్ మండలం వీరాపూర్కు చెందిన స్వామిరెడ్డి తన భార్యతో కలిసి సోమవారం జగిత్యాల మార్కెట్లో కూరగాయలు కొనుక్కుని వెళ్తుండగా వారి వద్దనున్న బంగారం బ్యాగు హన్మాజీపేట–పొరండ్ల మధ్యలో పడిపోయింది. పొరండ్లకు వెళ్లేసరికి బంగారు బ్యాగుతోపాటు, సెల్ఫోన్ కన్పించకపోవడంతో రోడ్డు వెంట పరిశీలించుకుంటూ వచ్చినా బ్యాగు దొరకలేదు. బాధితులు రూరల్ పోలీస్ష్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలిస్తున్నారు. -
ఆలకించి.. ఆదేశించి
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్కు చెందిన నాకు గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం మంజూరైంది. అప్పులు చేసి స్లాబ్ లెవల్ వరకు నిర్మించిన. అప్పటి నుంచి అద్దె ఇంట్లో ఉంటూ బిల్లు కోసం తిరిగాను. బిల్లు రాలేదు. ప్రభుత్వం మారిపోయింది. కనీసం ప్రస్తుత ప్రభుత్వమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే అసంపూర్తిగా ఉన్న ఇంటిని పూర్తి చేసుకుంటాను. – బాలసాని లచ్చవ్వ, అంకుసాపూర్ నా కూతురిని ఆదుకోండి మాది ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్. నా కూతురు మిడిదొడ్డి సాత్విక పదోతరగతి చదువుతుంది. కొద్ది రోజు లుగా వెన్ను పూస వ్యాధితో బాధపడుతోంది. ఆపరేషన్కు రూ.3లక్షలు అవుతాయని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం ద్వారా నా కూతురు వైద్యం కోసం ఆర్థిక సహాయం చేసి ఆదుకోండి. – మిరుదొడ్డి భాగ్య, రాచర్ల బొప్పాపూర్ -
సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష
వేములవాడ: నియోజకవర్గంలోని ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్లో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కలికోట నుంచి కుడి, ఎడమ కాల్వల నిర్మాణ పనులు, కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ ఎడమ కాలువ కోసం భూసేకరణ, వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి ప్రాజెక్టు పనులు, కోనరావుపేట మండల పరిధి లోని లచ్చాపేటతండా రిజర్వాయర్ కాలువ పనులు, చందుర్తి మండల పరిధిలోని ఆశిరెడ్డిపల్లి కొచ్చెరువు, సనుగుల ఎర్ర చెరువు పటేల్ చెరువులోకి నీటిని నింపే ఏర్పాట్లపై చర్చించారు. ప్రాధాన్యత ను దృష్టిలో పెట్టుకుని, రైతులకు సాగునీరు సకా లంలో అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పె ట్టుకుని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఈ సుధాకర్రెడ్డి, ఈఈ సంతు ప్రకాశ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లో చర్చించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరైన నీటిపారుదల శాఖ అధికారులు -
ఊరట...ఉపాధి
● స్థానికంగానే మిర్చినారు పెంపకం ● నాడు గుంటూరు.. నేడు ఉప్పట్ల ● వంద ఎకరాలకు సరిపడా సాగు ● అన్నదాతలకు తప్పిన రవాణా భారం ● పది మంది కూలీలకు ఉపాధి అవకాశం మంథనిరూరల్: ఒకరైతు ఆలోచన అనేకమంది అన్నదాతలకు ఊరటనిస్తోంది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి నారు తీసుకొచ్చి పంట సాగు చేసేవారికి ఎంతోప్రయోజనం కలిగిస్తోంది. మరికొందరు కూలీలకూ ఊపాధి చూపిస్తోంది. ఒకప్పుడు గుంటూరు వెళ్లి మిర్చినారు తీసుకువచ్చే రైతులకు ఇప్పడు తమ స్వగ్రామంలోనే నారు పెంచుకునే అవకాశం కల్పించాడో రైతు. ఉప్పట్ల గ్రామానికి చెందిన రైతు పోగుల తిరుపతి ఆరేళ్లుగా మిర్చినారు సాగు చేస్తూ రైతులపై భారం తగ్గించేలా చేశాడు. గ్రామ శివారులోని కొంత భూమిని కౌలుకు తీసుకుని డ్రిప్ పద్ధతిన నారు సాగు చేస్తున్నాడు. ఒకప్పుడు గుంటూరు వెళ్లి.. ఉప్పట్ల గ్రామంలో అత్యధికంగా మిర్చి సాగు చేస్తుంటారు. ఇందుకోసం రైతులు ఏపీలోని గుంటూరుకు వెళ్లి ఆండ్రాడ్, ఎండ్పై లాంటి రకాల నారును తీసుకువచ్చి ఇక్కడ సాగు చేసేవారు. ప్రస్తుతం గ్రామంలోనే మిర్చినారు సాగు చేసుకునే అవకాశం లభించడంతో ఉప్పట్ల, గుంజపడుగు, విలోచవరం, పోతారంతోపాటు సమీప గ్రామాల మిర్చి రైతులకు ఊరట లభించింది. తగ్గిన భారం.. నాణ్యమైన రకం మిర్చిసాగు చేసే రైతులు గుంటూరు వెళ్లి నారు తీసుకురావడం తలకు మించిన భారమయ్యేది. ఉప్పట్లలోనే రైతులు కలిసి మిర్చినారు సాగు చేసుకోవడంతో అదనపు భారం తగ్గుతోంది. నాణ్యమైన రకాన్ని ఎంచుకునే అవకాశం లభించింది. గుంటూరు నుంచి తీసుకువచ్చే నారు ఎలాంటిదో తెలియక రైతులు అనేకసార్లు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. రైతుకు ఇష్టమైన విత్తనాలను.. మిర్చి సాగుచేసే రైతులు తమకు ఇష్టమైన విత్తనాలను తీసుకువచ్చి ఇస్తే వాటిని అలికి నారు అయ్యే వరకు పెంచుతాడు. ఇందుకు ప్యాకెట్కు రూ.300 నుంచి రూ.400 వరకు చార్జీ తీసుకుంటాడు. సుమారు 45 నుంచి 50రోజుల వరకు మిర్చినారు నాటే స్థాయికి చేరుతుంది. ఇలా విత్తనాలను అలికి నారును ఇస్తుండటంతో స్థానిక రైతులకు ఉపశమనం లభించినట్లయింది, ఆరేళ్లుగా నారు పెంచుతున్న రైతులకు ఇష్టమైన వంగడాలు లేకపోవడంతో వారే విత్తనాలు తీసుకవస్తే అలికి నారు రెడీ చేసి ఇస్తా. అందుకయ్యే కూలీల ఖర్చులు తీసుకుంటా. ఉప్పట్లతో పాటు ఇతర ప్రాంతాల రైతులు ఇక్కడికే వచ్చి విత్తనాలు ఇచ్చి వెళ్తుంటారు. నాతో పాటు మరో పది మంది కూలీలకు ఉపాధి లభిస్తుంది. – పోగుల తిరుపతి, రైతు, ఉప్పట్ల ట్రాన్స్పోర్టు ఖర్చులు తగ్గాయి మిర్చినారు కోసం ఏటా గుంటూరు వెళ్లే వాళ్లం. ఇందుకోసం మూడు, నాలుగు రోజుల సమయం పట్టేది. ఆ నారు నాణ్యత కూడా తెలిసేదికాదు. దిగుబడిపై ఆశలు ఉండేవికావు. తిరుపతి ఆలోచనతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, సమయం మిగులుతోంది. నాలుగు ఎకరాలకు సరిపడా మిర్చినారు సాగు చేయిస్తున్న. – ముచ్చకుర్తి శేఖర్, రైతు, గుంజపడుగు -
ఆ తండ్రికదే చివరి వేడుక
కరీంనగర్రూరల్: ఆ తండ్రికదే చివరి వేడుక అయింది.. కొడుకు పుట్టినరోజునే గుండెపోటుతో మృతిచెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాఖీపండుగ, కొడుకు పుట్టినరోజు, కుటుంబసభ్యుల వివాహం కోసం సింగాపూర్ నుంచి మూడు రోజులక్రితమే వచ్చి అనూహ్యరీతిలో మృత్యువాత పడడం గ్రామస్తులను కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ మండలం చామనపల్లికి చెందిన దావు మధుకర్రెడ్డి(46) ఉపాధి నిమిత్తం సింగాపూర్ వెళ్లాడు. మూడురోజులక్రితం గ్రామానికి వచ్చిన ఆయన శనివారం కుటుంబసభ్యులతో కలిసి రాఖీపండుగ జరుపుకున్నాడు. ఆదివారం కొడుకు సాత్విక్రెడ్డి పుట్టినరోజు వేడుకల అనంతరం రాత్రి విందులో పాల్గొన్న మధుకర్రెడ్డికి ఆకస్మికంగా గుండెపోటురావడంతో కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాఖీ పండుగ, కొడుకు పుట్టినరోజు, కుటుంబసభ్యుల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సింగాపూర్ నుంచి వచ్చిన మధుకర్రెడ్డి మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సింగాపూర్ నుంచి రాకపోయినా బతికేవాడంటూ విలపించారు. మృతుడికి భార్య స్రవంతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు పుట్టినరోజున గుండెపోటుతో మృతి మూడురోజుల క్రితం సింగాపూర్ నుంచి రాక -
రెండు ఆటోలు ఢీకొని విద్యార్థులకు గాయాలు
జగిత్యాలక్రైం/సారంగాపూర్: జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట, సారంగాపూర్ మండలం అర్పపల్లి శివారుల్లో ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు స్పల్పంగా గాయపడ్డారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు నిత్యం జగిత్యాల రూరల్ మండలం గుల్లపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఆటోలో వెళ్లి వస్తుంటారు. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్తుండగా గుల్లపేట, అర్పపల్లి శివారులో ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొంది. ఈ ఘటనలో గుల్లపేటకు చెందిన గంగాధర సిద్దార్థ, పాలెపు శివానీ చేతులు విరిగాయి. వీరితోపాటు గాయపడిన విద్యార్థులను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ఆటో డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్ ఎస్సై గీత చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి సంఘటనపై ఆరా తీశారు. -
అగ్ని ప్రమాదంతో రూ.1.67కోట్ల నష్టం
మెట్పల్లి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గో దాంలో జరిగిన అగ్ని ప్రమాదంతో భారీ నష్టం సంభవించింది. ఈ గోదాంలో సివిల్ సప్లయ్ శాఖ గన్నీ సంచులను నిల్వ ఉంచిన సంగతి తెలిసిందే. ఆ శాఖకు చెందిన రూ.97లక్షల విలువైన 9,07, 527 పాత గన్నీ సంచులు దగ్ధమయ్యాయి. అలాగే మంటల ధాటికి 2వేల టన్నుల గోదాం ధ్వంసమైంది. దీనివల్ల రూ.70వేల నష్టం వాటిల్లినట్లు మార్కె ట్ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై ఇరు శాఖలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం పది గంటలకు చెలరేగిన మంటలు.. సోమవారం రాత్రి వరకు కూడా అదుపులోకి రాకపోవడం గమనార్హం. టెండర్లో జాప్యం..భారీ నష్టం ● సివిల్ సప్లయ్ శాఖ గన్నీ సంచులను 2018లో ఈ గోదాంలో నిల్వ చేసింది. ఇందుకు గాను మార్కెటింగ్ శాఖకు ప్రతినెలా రూ.38వేలు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ● ఆ సంచులను ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా టెండర్ ద్వారా విక్రయించాలి. ఈ విషయంలో ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ● తద్వారా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. ప్రమాదంలో సంచులన్నీ కాలి బూడిదై భారీ నష్టానికి దారి తీసింది. భద్రతపై మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం ● గోదాంల భద్రత విషయంలో మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం చూపుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● మార్కెట్ కార్యాలయానికి దూరంగా ఉన్న ఈ గోదాంల ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో ప్రతిరోజు వాటి వద్ద బయటి వ్యక్తులు పేకా ట ఆడడం, మద్యం సేవించడం చేస్తున్నారు. ● గోదాంలో విద్యుత్ సదుపాయం లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్కు అవకాశముండదు. ● అక్కడ పేకాట, మద్యం సేవించే వ్యక్తుల్లో ఎవరైనా ఈ ప్రమాదం చోటు చేసుకునే చర్యలకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రమిస్తున్న ఐదు శాఖల అధికారులు ● గోదాంలో చెలరేగిన మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి పోలీస్, రెవెన్యూ, సివిల్, మార్కెటింగ్, అగ్నిమాపక శాఖల అధికారులు సోమవారం ఉదయం నుంచి అక్కడే ఉండి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ● ఆ గోదాం పక్కనే మరో మూడు గోదాంలు ఉండడమే కాకుండా నివాస గృహాలు ఉన్నాయి. ● మంటలు ఎగిసిపడినా.. వాటికి వ్యాపించకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ● గోదాంకు మూడు వైపులా ఉన్న గోడకు పలు చోట్ల పెద్ద రంధ్రాలు చేశారు. అందులో నుంచి పెద్ద సంఖ్యలో సంచులను బయటవేసి మంటల ఉధృతిని కొంతమేర తగ్గించారు. ● రాత్రివేళలో కూడా మంటలను ఆర్పేందుకు అక్కడ తగిన ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం వరకు పూర్తిగా ఆదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. రెండోరోజూ అదుపులోకి రాని మంటలు పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్పరిశీలించిన కలెక్టర్ అగ్ని ప్రమాదం జరిగిన గోదాంను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నా రు. సాధ్యమైనంత తొందరంగా మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నించాలని అధికా రులకు సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, డీఎస్పీ రాములు, అర్డీఓ శ్రీనివా స్, సివిల్ సప్లయ్ శాఖ డీఎం జితేంద్రప్రసాద్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సైదులు, సీఐ అనిల్కుమార్, ఆయా శాఖల సిబ్బంది ఉన్నారు. -
No Headline
మాది తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ. మొదటి సంతానం నార్మల్ డెలివరీ అయింది. రెండో సంతానం కోసం కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే పెద్ద ఆపరేషన్ చేశారు. తర్వాత కడుపు మధ్యలో కుట్లు ఊడిపోయి, రంద్రం పడిందని ఆసుపత్రికి వెళ్తే వారు నిర్లక్ష్యం చేశారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో సంప్రదించగా ఐదు సార్లు ఆపరేషన్ చేశారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న. అక్కడ ఆపరేషన్కు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికే ఆస్తులు అమ్మి ఆపరేషన్లకు పెట్టిన. మళ్లీ ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి ఆదుకోండి. – కొండ భవాని, ఇందిరమ్మకాలనీ -
దంచికొట్టిన వాన
సిరిసిల్ల: జిల్లాలో ఆదివారం వర్షం దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచే ముసురు మొదలై.. క్రమంగా పెరిగింది. సిరిసిల్లలోని పాతబస్టాండు నేతన్నచౌక్ వద్ద వరద నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సంజీవయ్యనగర్ రోడ్డు వరదతో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో అత్యధికంగా ఇల్లంతకుంటలో 61.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుద్రంగిలో 23.4, చందుర్తిలో 24.0, వేములవాడ రూరల్లో 1.9, బోయినపల్లిలో 5.5, వేములవాడలో 9.8, సిరిసిల్లలో 29.4, కోనరావుపేటలో 3.2, వీర్నపల్లిలో 4.4, ఎల్లారెడ్డిపేటలో 15.7, గంభీరావుపేటలో 58.3, ముస్తాబాద్లో 50.5, తంగళ్లపల్లిలో 27.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పొంగిపొర్లుతున్న అంపు ఒర్రె ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని తాళ్లపల్లి, బెజ్జంకి మండలం గూడెం గ్రామాల మధ్య ఉన్న అంపు ఒర్రె పొంగి ప్రవహిస్తోంది. దీంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా వర్షాలు బెజ్జంకి మండలం ప్రాంతంలో కురువడంతో ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లి చెరువు నిండి మత్తడి దుంకుతోంది. చెరువు నీటితోపాటు తాళ్లపల్లి గ్రామ పొలాల నీరు ఈ ఒర్రె గుండా ప్రవహిస్తోంది. ఇల్లంతకుంట నుంచి బెజ్జంకి మండలం గూడెం, బేగంపేట, కాసీంపేట, గుండ్లపల్లి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లాలంటే దగ్గర దారి ఇది. తాళ్లపల్లి, గాలిపల్లి రైతులు తమ పొలాల వద్దకు ఈ ఒర్రె దాటి వెళ్లాల్సిందే. ఒర్రైపె బ్రిడ్జి నిర్మించకపోవడంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆదివారం వరద పారడంతో కాసీంపేట మానసదేవీ ఆలయానికి వెళ్లే భక్తులు వెనుదిరిగారు. ఇళ్ల చుట్టూ చేరిన వర్షపు నీరు తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని గండిలచ్చపేట పరిధిలో ప్రభుత్వ పాఠశాల సమీపంలోని లోతట్టు ప్రాంతంలోని నివాసాలను వరదనీరు చుట్టుముట్టింది. ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణను శ్రీసాక్షిశ్రీ వివరణ కోరగా లోతట్టు ప్రాంతంలో ఉండడంతో వర్షపు నీరు వచ్చిందన్నారు. బాధిత కుటుంబానికి గ్రామంలోని మహిళా సంఘం భవనంలో తాత్కాళిక వసతి ఏర్పాటు చేసేందుకు పంచాయతీ కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిపారు. పొంగిపొర్లిన వాగులు, వంకలు ఇల్లంతకుంటలో అత్యధికంగా 61.1 మిల్లీమీటర్లు -
సర్కారు భూమి హస్తగతం
● రూ.60కోట్ల విలువైన స్థలం రికవరీ సాక్షిప్రతినిధి, కరీంనగర్: పరాధీనంలో ఉంటున్న రూ.కోట్లాది విలువైన భూమిని కలెక్టర్ చొరవతో అధికారులు తిరిగి హస్తగతం చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రం శివారులోని చంద్రగిరి సమీపంలో సర్వేనంబరు 25, 26లోని ప్రభుత్వ భూమిలో చాలా ఏళ్లు ఇటుకబట్టీలను తిప్పాపూర్కు చెందిన ఓ వ్యక్తి నడిపించాడు. జిల్లా కలెక్టర్గా సందీప్కుమార్ ఝా వచ్చినప్పటి నుంచి పరాధీనంలో ఉంటున్న ప్రభుత్వ భూములను రికవరీ చేస్తున్నారు. గతంలో కొంతమందిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే చంద్రగిరి శివారులో ఉన్న భూమి ప్రస్తుతం రూ.60కోట్ల వరకు పలుకుతోంది. ఇటుక బట్టీలు నడిపించిన వ్యక్తి ఇతరుల వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ప్రభుత్వ భూమి కావడంతో సదరు భూమిలో ఇటుకబట్టీలు నడిచి పరాధీనంలో ఉంటున్నాయన్న విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో రెవెన్యూ అధికారులతో విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూములుగా తేలడంతో వెంటనే రికవరీకి ఆదేశించినట్లు సమాచారం. అధికారులు ఆదివారం సదరు భూమిలో ఉన్న కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చేశారు. రూ.60కోట్ల విలువైన భూమి ప్రభుత్వపరం కావడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. -
బీసీ రిజర్వేషన్ల చట్టం చేయాలి
● ముస్లింల పేరు చెప్పి బీజేపీ అడ్డుకోవద్దు ● సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో బీసీల విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ మోకాలు అడ్డుతోందని ఆరోపిస్తూ ఆదివారం సిరిసిల్ల లోని అంబేడ్కర్చౌరస్తాలో ధర్నా చేపట్టారు. 42 శాతం బిల్లులు ఆమోదించి కేంద్రం బీసీలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోడం రమణ, జిల్లా నాయకులు మిట్టపల్లి రాజమౌళి, రాపల్లి రమేశ్, నక్క దేవదాస్, సిరిసిల్ల సత్యం, ఒగ్గు గణేశ్, ఉడుత రవి, దాసరి రూప, బెజిగం సురేష్, బండి శ్రీనివాస్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు. -
రియల్ ఢమాల్
సిరిసిల్ల: రెండేళ్లలోనే రియల్ ఎస్టేట్ తారుమారైంది. రాజన్నసిరిసిల్ల ఆవిర్భావంతో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండేళ్ల వరకు జిల్లాలో ఎటూ చూసిన నూతన వెంచర్ల వెలుస్తూ కనిపించేవి. కానీ రెండేళ్లుగా ఉన్న వెంచర్లకే దిక్కులేదు. కొత్త వాటి ఊసే లేదు. ఇప్పటికే వెలసిన వెంచర్లలో ప్లాట్లు అమ్ముడు పోకపోవడంతో పెట్టుబడిదారులు అప్పులపాలవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. పెరిగి..పడిన ధరలు సిరిసిల్ల పట్టణానికి రెండు వైపులా బైపాస్రోడ్లు రావడంతో ఆ ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వేములవాడ పట్టణం టెంపుల్ సిటీ కావడంతో చుట్టూరా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ఇటీవల సిరిసిల్ల, వేములవాడ పట్టణాల చుట్టూ రియల్ ఎస్టేట్ దందాలు వెనక్కి తగ్గాయి. ఇప్పటికే కొనుగోలు చేసిన భూముల విక్రయ ఒప్పందాలు రద్దవుతున్నాయి. ప్లాటు కోసం అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బులు వాపస్ ఇవ్వాలని కొన్నవారు, ఇచ్చిన డబ్బులు వాపస్ ఇచ్చేది లేదు.. జరిమానా కింద అడ్వాన్స్గా డబ్బులు రద్దుగా భావించాలని అమ్మిన వారు గొడవకు దిగుతున్నారు. ఈ పంచాయితీలు అటు పోలీస్స్టేషన్కు, పెద్ద మనుషుల వద్దకు చేరుతున్నాయి. అమ్మకాలు లేక.. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. 200 గజాల ప్లాటు కొనా లన్నా కనీసం రూ.15 లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రాంతాన్ని బట్టి ధరలు ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి, బొప్పాపూర్ సర్కిల్ వద్ద గజం స్థలం రూ.లక్షల్లో ఉండడం విశేషం. అన్ని ప్రాంతాల్లో నివాస స్థలాల ధరలు ఎక్కువగా ఉండడంతో రీసేల్ ఆగిపోయింది. నిజానికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల సంఖ్య ఎక్కువై.. వాళ్లే.. కమీషన్ల కో సం ధరలను పెంచుతూ వెళ్లారు. వాస్తవిక మార్కెట్ ధరలను దాటి లాభాల కోసం అమాంతం పెంచడంతో రియల్ ఎస్టేట్ దందా కుప్పకూలింది. ప్లాట్ల క్రయ, విక్రయాలు పెద్దగా జరగకపోవడంతో ఇప్పుడు స్థబ్తత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా అనుమతి పొందిన వెంచర్లు పది లోపే ఉండగా.. లే– అవుట్ అనుమతి లేని వెంచర్లు వందల్లో ఉన్నాయి. స్థల వివాదాలు సిరిసిల్ల పట్టణ శివారు గ్రామాలు పెద్దూరు, రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగింది. ఒకప్పుడు తక్కువ ధరకే భూములు దొరకడంతో క్రయ, విక్రయాలు సాగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గడంతో విక్రయాలు లేక.. ఆయా గ్రామాల్లో స్థల వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆ గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థబ్తత నెలకొంది. వేములవాడలో విలీనమైన తిప్పాపూర్, నాంపల్లి, కోనాయపల్లి, అయ్యోరుపల్లి, శాత్రాజ్పల్లిలోనూ ఇదే పరిస్థితి ఉంది. స్థల వివాదాలతో ప్లాట్ల క్రయ, విక్రయాలపై ప్రభావం ఉంది. రెండేళ్ల కిందట ఉన్న భూముల అమ్మకాలు, కొనుగోళ్ల సందడి ఇప్పుడు కనిపించడంలేదు. ఇది సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దబోనాల బైపాస్రోడ్డుకు వెళ్లే దారిలోని ప్లాట్లు. రెండేళ్ల కిందట ఇక్కడ గజం ధర రూ.15వేలు ఉండేది. ఎకరం భూమి విలువ రూ.కోట్లలో ఉండేది. కానీ ఇప్పుడు కొనేవారు లేక.. ప్లాట్లు అమ్మకపోవడంతో ముందుగానే పెట్టుబడి పెట్టినవారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుపోయారు. సిరిసిల్ల మున్సిపల్లో విలీనమైన గ్రామాలను మళ్లీ గ్రామపంచాయతీలు చేస్తారనే ప్రకటనతో ఒక్కసారిగా భూముల ధరలు పడిపోయాయి. విలీన గ్రామాల్లో రియల్ ఎస్టేట్ దందా వెనక్కి తగ్గింది.ఇది సిరిసిల్ల శివారులోని శాంతినగర్లో మూడేళ్ల క్రితం వెలసిన రియల్ ఎస్టేట్ వెంచర్. దీన్ని డీటీసీపీ అఫ్రూవల్తో రోడ్డు వేసి, మౌలిక వసతులు కల్పించారు. భూపట్టాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారి సంయుక్త భాగస్వామ్యంతో వెంచర్ వెలసింది. ఇక్కడ ప్లాట్లు అమ్మకపోవడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి పెట్టిన పెట్టుబడి మీద పడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్లాటు కొనేందుకు ఏడాదిన్నరగా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది.ఇది వేములవాడ అర్బన్ మండల శివారులోని తిప్పాపూర్– జయవరం రోడ్డు పక్కన వ్యవసాయ భూమి. ఇక్కడ రెండేళ్ల కిందట ఎకరం వ్యవసాయ భూమి రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకు పలికింది. కానీ ఇప్పుడు కొనేవారు లేక.. వ్యవసాయ భూములు మూలనపడ్డాయి. నిజానికి వ్యవసాయ భూములకు ఎప్పుడూ ధర ఉంటుంది. కానీ ఈ ఏడాదిన్నరగా వ్యవసాయ భూముల ధరల పెరగకపోవగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో అమ్మే వారే తప్ప కొనేవారు లేక వ్యవసాయ భూముల విక్రయాలు పడిపోయాయి. -
ప్రజా సమస్యల సాధనకు పోరాటం
● బీజేపీ పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ సిరిసిల్లటౌన్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని 23వ వార్డులో ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ‘ఇందిరమ్మ పథకం’ పేరుతో ఇల్లు ఇస్తున్నామని చెబుతున్నారు కానీ ఇసుక లేకుండా నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ రెండేళ్లలో ఎన్నిసార్లు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాడని ప్రశ్నించారు. జనాలకు అందుబాటులో లేకుండా, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నాడని విమర్శించారు. హర్ ఘర్ తిరంగాతో జాతీయభావం పెంపు ● బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ చందుర్తి(వేములవాడ): ప్రజల్లో జాతీయభావం పెంపొందించుటకే బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున పేర్కొన్నారు. చందుర్తిలో భగత్సింగ్ చిత్రపటానికి ఆదివారం పూలమాలలు వేసి, జాతీయ జెండా ఎగురవేశారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మార్త సత్తయ్య, పార్టీ మండలాధ్యక్షుడు మోకిలే విజేందర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ పోంశెట్టి రాకేశ్, మండల ప్రధాన కార్యదర్శులు మర్రి మల్లేశం, పెరుక గంగరాం, సేరుక గంగరాజు, మొత్కపల్లి రాజశేఖర్, మట్కం మల్లేశం, చింతకుంట సాగర్ పాల్గొన్నారు. పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్లు వేములవాడఅర్బన్: అగ్రహారం శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రవేశం పొందుటకు చివరి అవకాశం ఈనెల 11 వరకు ఉందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి తెలిపారు. డిప్లామా మెకానికల్ ఇంజినీరింగ్, డిప్లామా టెక్స్టైల్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్లో సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ అవకశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రూ.6 వేలు ఫీజు తీసుకుని కళాశాలకు రావాలని సూచించారు. రాజన్నకు రూ.2లక్షల విరాళం వేములవాడ: రాజన్నకు భక్తుల నుంచి రూ.2 లక్షల విరాళం ఆదివారం ఆలయ ఏఈవో అశోక్, ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంత్చారీలకు అందజేశారు. గోశాల సంరక్షణ ట్రస్ట్కు సిద్దిపేట జిల్లాకు చెందిన వంగ రాజేశ్వర్రెడ్డి తన కుమార్తె ఆర్తిరెడ్డి పేరిట రూ.లక్ష అందించారు. నిత్యాన్నదాన సత్రానికి రూ.లక్షను హైదరాబాద్కు చెందిన ఐటీ ఉద్యోగి కట్టంగూర్ రాజవంశీధర్రెడ్డి కుటుంబ సభ్యులు విరాళంగా అందజేశారు. -
ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవం
వేములవాడరూరల్: ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో ఇందిరమ్మ ఇల్లును ఆదివారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే బేస్మెంట్ పూర్తి చేసుకొని పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, నాయకులు అడ్డిక జైపాల్రెడ్డి, సోమినేని బాలు, కరుణాకర్, సందీప్, శ్రీనివాస్, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
రేషన్కార్డు.. అన్నింటికీ ఆధారం
● అర్హులందరికీ అందజేస్తాం ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఎల్లారెడ్దిపేట(సిరిసిల్ల): రేషన్కార్డు పేదల ఆత్మగౌరవ ప్రతీక అని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మణికంఠ గార్డెన్స్లో ఆదివారం నూతన రేషన్కార్డులు పంపిణీ చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా పేదలకు ప్రతీ నెల రేషన్ అందుతుందన్నారు. మండలంలో నూతనంగా 1,494 కొత్త కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 2,999 మంది కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా నమోదు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలు అన్నింటికీ రేషన్కార్డు కీలక డాక్యుమెంట్ అని పేర్కొన్నారు. నూతన రేషన్కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్ర్సన్ సావేరా బేగం, డిప్యూటీ తహసీల్దార్ మురళీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ గుండాడి రామ్రెడ్డి, నాయకులు మహేందర్, రామచంద్రం, చిన్ని బాబు, పందిర్ల లింగంగౌడ్, గిరిధర్రెడ్డి, గంట బుచ్చగౌడ్, రాములు పాల్గొన్నారు. -
రండి ‘నులి’పేద్దాం
● నేడు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ సిరిసిల్ల: కంటికి కనిపించని నులిపురుగులు పిల్లలను బలహీనపరుస్తాయి. ఇది పిల్లల రక్తహీనతకు, అజీర్తి, వాంతులు, విరోచనాలకు కారణమవుతుంటాయి. ఏడాది వయసు పిల్లల నుంచి 19 ఏళ్ల యువకుల వరకు కడుపులో పెరిగే నులిపురుగులు పీల్చి పిప్పి చేస్తుంటాయి. బడికెళ్లేందుకు సిద్ధమైన పిల్లలు అప్పుడే కడుపునొప్పి అంటూ తల్లడిల్లిపోతుంటారు. నులిపురుగుల నివారణకు ప్రభుత్వం ఏటా రెండు సార్లు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం నులి పురుగుల నిర్మూలనకు మాత్రలు వేస్తున్నారు. నులిపురుగుల్లో రకాలు కడుపులో పెరిగే నులిపురుగుల్లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో బద్దె, నట్టలు, కొంకి, కొరడా, ఏలిక పాములు, దారపు, నీరుగడ్డ వంటి రకాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా చిన్నారుల పొట్టల్లో స్థావరం ఏర్పరచుకుంటాయి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కలుషిత ఆహారం తినడం, ఈగలు వాలుతూ దుమ్ముధూళి పడిన పదార్థాలు తినడం, పిల్లలు మట్టిలో పాదరక్షలు లేకుండా ఆడుకున్నప్పుడు, చేతులు కడుక్కోవడం మరిచిపోయినప్పుడు, ఆకుకూరలు, కూరగాయలను శుభ్రమైన నీటితో కడుగకపోవడం, తినే ముందు, తిన్న తరువాత చేతులను శుభ్రంగా కడుగకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడంతో వంటి కారణాలతో నులిపురుగుల లార్వాలు జీర్ణకోశంలోకి ప్రవేశిస్తాయి. పేగు పురుగులు గుడ్లు శరీరంలో పెరిగి అనారోగ్యం కలిగిస్తాయి. ఏం జరుగుతుంది నులిపురుగులు కడుపులో చేరడంతో కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, ఆకలి లేకపోవడం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ సార్లు మూత్ర విసర్జన సమస్య, బరువు తగ్గడం, చదువు పై ఏకాగ్రత లేకపోవడం, ఎదుగుదల తగ్గడం, మలంలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ చర్యలు భోజనానికి ముందు, ఆటలు ఆడిన తరువాత, మలవిసర్జన తరువాత కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రతను పాటించడంతోపాటు కాచి చల్లార్చిన నీటిని తాగాలి. తీపి పదార్ధాలు పిల్లలకు దూరంగా ఉంచాలి. మలబద్ధకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మాత్రలు వాడే విధానం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి. అనారోగ్యంగా ఉన్న వారు పూర్తిగా కోలుకున్న తరువాతే మాత్రలు వేసుకోవాలి. పుట్టుకతో గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారికి, ఉదర సంబంధ కేన్సర్ ఉన్న వారికి, కాలేయ వ్యాధిగ్రస్తులకు ఈ మాత్రలు వేయవద్దు. ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలకు సగం గోళీ, రెండు నుంచి మూడేళ్ల పిల్లలకు ఒక్క మాత్రను పొడి చేసి నీటిలో కలిపి తాగించాలి. 3 నుంచి 19 ఏళ్లలోపు వారికి గోలిని నమిలిమింగేలా చూడాలి. జిల్లాలో మాత్రల పంపిణీ గ్రామాలు : 260 మున్సిపాలిటీలు : సిరిసిల్ల, వేములవాడ అంగన్వాడీ కేంద్రాలు : 587 పిల్లలు : 30,475 పాఠశాలలు : 626 పిల్లలు : 77,921 జూనియర్ కాలేజీలు : 47 పిల్లలు : 7,664 మాత్రలు వేసే సిబ్బంది : 168 సహాయక ఆశవర్కర్లు : 456తప్పనిసరిగా వేసుకోవాలి నులిపురుగు నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాలతో జిల్లాలో మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేశాం. సోమవారం జిల్లా అంతటా వైద్యసిబ్బంది మాత్రలు వేస్తారు. ఎవరైనా మిగిలిపోతే ఈనెల 18న(సోమవారం) మ్యాప్ డే నాడు మాత్రలు ఇస్తాం. అపోహలకు పోకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు నులి పురుగు నివారణ మాత్రలు వేయించాలి. – డాక్టర్ ఎస్.రజిత, జిల్లా వైద్యాధికారి -
● పడిపోయిన వ్యవసాయ భూముల అమ్మకాలు ● భూ విక్రయ ఒప్పందాలు రద్దు ● సిరిసిల్ల, వేములవాడల్లో తగ్గిన ప్లాట్ల విక్రయాలు ● జిల్లాలో రిజిస్ట్రేషన్లు అంతంతే..
రిజిస్ట్రేషన్లు నిలకడగా సాగుతున్నాయి రిజిస్ట్రేషన్లు నిలకడగా సాగుతున్నాయి. సిరిసిల్ల సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలో 48 స్లాట్లు ఉండగా.. సగటున నిత్యం 30 నుంచి 40 వరకు సాగుతున్నాయి. గతంలో ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లు వచ్చేవి. ఇప్పుడు పెద్దగా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడం లేదు. మార్టిగేజ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏడాది కాలంగా ఇదే పరిస్థితి ఉంది. – ఆర్.వీ.వీ స్వామి, సబ్ రిజిస్ట్రార్, రాజన్నసిరిసిల్ల ● -
వైభవంగా యజ్ఞోపవీతధారణ
నాగిరెడ్డి మండపంలో యజ్ఞోపవీత ధారణలో యజుర్వేద బ్రాహ్మణులు వేములవాడ: శ్రావణమాసం.. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని రాజన్న ఆలయంలో రుగ్వేద, యజుర్వేద బ్రాహ్మణులు శనివారం యజ్ఞోపవీతధారణ నిర్వహించారు. ప్రత్యేక హోమం జరిపిన తర్వాత శ్రావణ నక్షత్రం సందర్భంగా రుగ్వేదులు అద్దాల మంటపంలో, పౌర్ణమి తిథి అనుసారం నాగిరెడ్డి మంటపంలో యజుర్వేదులు ఉపాకర్మ నిర్వహించి సామూహికంగా నూతన యజ్ఞోపవితధారణ గావించారు. అయితే ఈసారి రుగ్వేదులు, యజుర్వేదులకు ఒకే రోజు కలిసి రావడంతో ఆలయం బ్రాహ్మణులతో సందడిగా మారింది. మార్కండేయనగర్లో స్థానిక పద్మశాలీ కులస్తులు నూతన జంధ్యాలు ధరించారు. -
భక్తిశ్రద్ధలతో నూలుపౌర్ణమి
సిరిసిల్లకల్చరల్: పద్మశాలీయుల ఆరాధ్య దైవం మార్కండేయుని శోభాయాత్ర జిల్లా కేంద్రంలో శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఏటా నూలు పౌర్ణమి పర్వదినంగా జరుపుకోవడం ఆనవాయితీ. రాష్ట్రంలో సిరిసిల్లలో మాత్రమే నూలుపౌర్ణమి వేడుక నిర్వహిస్తారు. కదిలే వాహనంపై మగ్గం ఉంచి వస్త్రం నేసి ఇలవేల్పు మార్కండేయునికి సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. మార్కండేయ మందిరంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అదే ప్రాంగణంలో సామూహిక యజ్ఞోపవీత ధారణ, రక్షాబంధన్ నిర్వహించారు. అనంతరం స్వామి వారి శోభాయాత్ర పట్టణ ప్రధాన వీధుల గుండా నిర్వహించారు. పాతబస్టాండ్లోని చేనేతన్న విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేశారు. గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, యెల్లె లక్ష్మీనారాయణ, తాటిపాముల దామోదర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆడెపు రవీందర్, గూడూరి ప్రవీణ్, పద్మశాలీ నేతలు మోర రవి, మండల సత్యం, గాజుల బాలయ్య, కాముని వనిత, ఆడెపు చంద్రకళ, గుజ్జె తార, పిస్క మధు, పలువురు వస్త్రోత్పత్తిదారులు పాల్గొన్నారు. -
రేపు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సిరిసిల్ల: జిల్లాలో నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తామని జిల్లా వైద్యధికారి ఎస్.రజిత శనివారం తెలిపారు. ఏడాది వయసున్న పిల్లల నుంచి 19 ఏళ్ల వరకు మాత్రలు అందిస్తామన్నారు. పిల్లలు ఆల్బెండజోల్ మాత్రను నమిలి మింగేలా చూసుకోవాలని తల్లిదండ్రులను కోరారు. మానవ పేగులలో జీవించే పేగు పురుగులతో కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ఆగస్టు 11న మాత్రలు అందని పిల్లలకు 18వ తేదీన అందజేస్తారని తెలిపారు. సాహిత్యోత్సవంలో జిల్లా కవులు సిరిసిల్లకల్చరల్: బుక్ బ్రహ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నాటక రాష్ట్రం బెంగళూర్లో ఈనెల 8 నుంచి మూడు రోజులపాటు దక్షిణ భారత స్వరాలు శీర్షికన సాహిత్యోత్సవం నిర్వహిస్తున్నారు. రెండో రోజు శనివారం 35 మంది పాల్గొన్నారు. ఇందులో మన జిల్లా నుంచి కథారచయిత పెద్దింటి అశోక్కుమార్, బాలసాహిత్యవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్ పాల్గొన్నారు. ప్రాంతీయ అస్తిత్వం సదస్సులో ప్రాంతీయ భాష అస్తిత్వ చేతన అంశంపై పెద్దింటి, బాలసాహిత్యం, రచన కళ సదస్సులో తెలుగు బాల సాహిత్యం, భాష, నాడు–నేడు అనే అంశంపై పత్తిపాక మోహన్ చర్చించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ఆరా వేములవాడ: రాజన్న ఆలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో అవకతవకలు జరిగి, భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆడియో టేప్ వైరల్ కావడంతో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్ సీరియస్గా వ్యవహరించారు. రాష్ట్ర స్థాయి అధికారులు వేములవాడలో విచారణ చేపట్టి బాధ్యుడైన లక్ష్మీనారాయణ అనే ప్రైవేట్ సూపర్వైజర్పై కేసు నమోదు చేశారు. దీంతో ఈవో రాధాభాయి ఆలయంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, వారి పనితీరు, నియామకంపై ఆరా తీస్తున్నారు. ఆలయంలో పనిచేస్తున్న ఏఈవో, పర్యవేక్షకుడి స్థాయి ఉన్న అధికారులు ముడుపులు తీసుకుని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించినట్లు సమాచారం అందడంతో విచారణ తీవ్రతరం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న, గతంలో ఇక్కడ పనిచేసి ఇతర దేవాలయాలకు బదిలీపై వెళ్లిన అధికారుల గుండెల్లో గుబులు మొదలైందని సమాచారం. రాశిగుట్ట తండాలో ఇంటింటా జ్వర సర్వే వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని భూక్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని రాశిగుట్టతండాలో పీహెచ్సీ వైద్యుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటా జ్వరసర్వే చేపట్టారు. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఘనంగా క్విట్ ఇండియా ఉద్యమ వేడుకలు సిరిసిల్లటౌన్: క్విట్ ఇండియా ఉద్యమ వేడుకలను శనివారం సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ పట్ట ణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు పాల్గొన్నారు. -
వెన్ను కదులుతోంది..
● అడుగుకో గుంతతో అధ్వానంగా రోడ్లు ● పట్టించుకోని అధికారులు ● వర్షం నీటితో కనిపించని గుంతలు ● తెలియక వెళ్లి ప్రమాదాలు ● జిల్లాలో దారుణంగా 52 రోడ్లు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అడుగుకో గుంత.. కళ్లు మూసి తెరిచేలోపే మలుపులతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు ప్రమాదకరంగా మారాయి. అసలే వర్షాకాలం.. చిన్నపాటి జల్లులకే రోడ్లు చిత్తడిగా మారిపోతున్నాయి. ఈ రోడ్లపై నీళ్లు నిలిచి ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులకు బ్యాక్ పేన్(నడుమునొప్పులు) పక్కాగా వస్తున్నాయి. ఇటీవల నడుము నొప్పులతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, వీర్నపల్లి, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, గంభీరావుపేట మండలాల్లోని గ్రామీణ రోడ్లు గుంతలతో అధ్వానంగా మారాయి. జిల్లాలోని వివిధ రూట్లలో సుమారు 52 రోడ్లు భారీ గుంతలతో భయంకరంగా కనిపిస్తున్నాయి. గుంతల రోడ్ల దుస్థితిపై అధికారులకు ఎలాంటి పట్టింపులు లేకుండా పోయాయి. కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదు. నడుం నొప్పులతో ఆస్పత్రులకు.. గుంతల రోడ్లపై ప్రయాణాలు చేసే వారిలో 75 శాతం మంది వివిధ రకాల నడుం నొప్పులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఆటో డ్రైవర్లతోపాటు ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వెన్నుపూస కదలడం, డిస్క్, పక్కటెముకలు, మోకాళ్లు, మెడలు పట్టుకోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మారై, సీటీస్కాన్, ఎక్స్రే ఇతరత్ర పరీక్షలతో కలిసి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. నడవలేక, కదలలేక, నిలబడలేక, కూర్చుండలేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకోని అధికారులు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని రోడ్లు అధ్వానంగా మారినా పట్టించుకునే వారు కరువయ్యారు. వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లను సైతం పరిశీలించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాత్కాళికంగా మరమ్మతులు చేసే అవకాశాలున్నా పట్టించుకోవడం లేదు. డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తరచూ ప్రయాణించే వారిలో ఎక్కువగా డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్ గుర్తించేందుకు ఎమ్మారై వంటి పరీక్షలకు కరీంనగర్ తరలిస్తున్నాం. తరచూ ప్రయాణించే వారు మెడ, నడుం బెల్టులను పెట్టుకోవాలి. దీని ద్వారా దీర్ఘకాలిక సమస్యలు రాకుండా నిరోధించవచ్చు. నొప్పుల ఉపశమనానికి ఫిజియోథెరపీకి పంపిస్తున్నాం. అలా కూడా నయం కాకపోతే వెన్నుపూస ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. – సునీల్, ఆర్థోపెడిక్ వైద్యుడు, ఎల్లారెడ్డిపేట ఇది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని రాపెల్లివాగు వంతెన వద్ద గల గుంతలరోడ్డు. ఈ రోడ్డు వర్షం నీటితో గుంతలుగా తయారైంది. గుంతలరోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. వాహనాలు పాడవుతున్నాయి. ఆటోడ్రైవర్లు, ప్రయాణికులు నొప్పులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వాహనాలు మరమ్మతులు చేసుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రాపెల్లివాగు వంతెన వద్దనే కాకుండా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 52 రోడ్ల పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. -
ప్రభుత్వ ఆఫీస్లపై సోలార్ ప్యానెల్స్
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ ఆఫీస్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్ నుంచి శనివారం మాట్లాడారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామపంచాయతీ నుంచి కలెక్టరేట్ వరకు అన్ని ఆఫీస్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్డీవో శేషాద్రి పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వీడియో కాన్ఫరెన్స్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుపై సమీక్షించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదు జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో ఎరువుల కొరత ఉందని గంటల తరబడి రైతులు వేచి చూసి ఇబ్బంది పడుతున్నారని జరిగిన ప్రచారాన్ని ఖండించారు. కొందరు కావాలనే రైతులతో మాట్లాడించి తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సిరిసిల్ల శివారులోని అపెరల్ పార్క్లో గోదాము ఏర్పాటు చేశామని వివరించారు. -
క్రిప్టోకు రెక్కలు!
దేశం దాటుతున్న రూ.వందల కోట్లు ● మూడేళ్ల క్రితమే కేంద్రం హెచ్చరికలు ● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ● తాజాగా నెక్ట్స్ బిట్ పేరుతో రూ.300 కోట్ల టోకరా? ● గతంలో రెక్సిట్, మెటా పేరుతో రూ.కోట్ల దందాలు ● ఉమ్మడి జిల్లాలో ఇంకా పెట్టుబడి పెడుతున్న అత్యాశపరులు ● క్రిప్టో వసూళ్లపై రాచకొండ పోలీసుల ఉక్కుపాదం ● కరీంనగర్లో రెవెన్యూ, పోలీసులవే అధిక పెట్టుబడులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘క్రిప్టోలో ఒక్కసారి పెట్టుబడి పెట్టండి. ప్రతీ రోజూ సాయంత్రానికి మీ ఖాతాల్లో రూ.వేలు చూసుకోండి. నెలకు రూ.లక్షల సంపాదన. రెండుమూడు నెలల్లో మీ జీవితం మారిపోతుంది, హోదా పెరుగుతుంది’ అంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి.. అమాయకుల నుంచి రూ.లక్షలు పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఒకరిద్దరికి సరిగానే ఇచ్చి.. మిగిలిన వారికి టోకరా వేస్తున్నారు. అలా వసూలు చేసిన డబ్బులు రూ.వందల కోట్లు దేశం దాటుతున్నాయి. క్రిప్టో పేరిట తెలంగాణలో పలు నకిలీ యాప్లు పుట్టుకొస్తున్నాయని, అమాయకులు పెట్టుబడి పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారని మూడేళ్ల క్రితమే కేంద్ర నిఽఘా వర్గాలు రాష్ట్ర పోలీసులను హెచ్చరించాయి. ఈ తరహా యాప్లను రాష్ట్ర పోలీసులు నియంత్రించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక క్రిప్టో మోసాలకు వేదికవుతున్నా.. పోలీసులు చర్యలు చేపట్టిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. జిల్లాలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ యాప్లలో పెట్టుబడులు పెట్టడం శోచనీయం.దేశం దాటుతున్న రూ.వందల కోట్లు భారీగా లాభాలు ఆశ చూపి, వసూలు చేసిన మొత్తాన్ని జగిత్యాల కేంద్రంగా కొంచెం హవాలా మార్గంలో, క్రిప్టోలోకి కొంచెం మార్చి దేశం దాటిస్తున్నారు. విదేశాల్లో ఆస్తులు కొని, వ్యాపారాలు ప్రారంభించి అక్కడే స్థిరపడేలా ‘లక్కీ భాస్కర్’సినిమాను తలపించేలా భారీ స్కెచ్ వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జీబీఆర్ క్రిప్టో కరెన్సీ పేరుతో రమేశ్గౌడ్ అనే వ్యక్తి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.95 కోట్లు కొల్లగొట్టాడు. దీనిపై సీఐడీ విచారణ జరపుతోంది. ఇందులో లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై ఓ డీఎస్పీని అటాచ్ చేశారు. రమేశ్ గౌడ్ ఆ డబ్బును దుబాయ్లో పెట్టుబడులు పెట్టి, పదేళ్ల గోల్డెన్ వీసా సంపాదించినట్లు బాధితులు తెలిపారు. ఇటీవల మెటా ఫండ్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్లకుపై వసూలు చేసిన లోకేశ్, కె.సతీశ్ ఆ డబ్బును దేశం దాటించారని, వీరికి ఓ బీజేపీ నాయకుడు సాయం చేశాడన్న ప్రచారం సాగుతోంది. వాస్తవానికి లోకేశ్ ఎప్పుడో థాయ్లాండ్ వెళ్లాడని బాధితులు చెబుతున్నారు. తాజాగా హిమాన్ష్ అనే యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. ఇతను రాష్ట్రవ్యాప్తంగా 400 మంది వద్ద రూ.19 కోట్లు నెక్ట్స్బిట్ యాప్ పేరుతో వసూలు చేశాడని రాచకొండ పరిధిలోని మేడిపల్లి పీఎస్లో కేసు నమోదైంది. ఈ యాప్ బారిన పడ్డవారిలో అత్యధికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లావారే. గతంలోనూ హిమాన్షు రిక్సో యాప్ను నిర్వహించి రూ.కోట్లలో వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ముఠా దాదాపు రూ.300 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం.పట్టించుకోని కరీంనగర్ పోలీసులు నెక్ట్స్బిట్ యాప్పై రహస్య సమాచారం మేరకు రాచకొండ పోలీసులు ఆగస్టు 1వ తేదీన హిమాన్షును అరెస్టు చేశారు. ఈ కేసులో రికీఫామ్ (ఫారిన్ ఆపరేటర్), అశోక్ శర్మ (థాయ్లాండ్ ఆపరేటర్), డీజే సొహైల్ (రీజనల్ రిక్రూటర్), మోహన్ (సహాయకుడు), అశోక్కుమార్ సింగ్ (హిమాన్షుకు సహాయకుడు)ను నిందితులుగా చూపించారు. వీరంతా నెక్ట్స్ బిట్యాప్లో పెట్టుబడి పెట్టించి ప్రజలను మోసగించారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో రామగుండం, కరీంనగర్ కమిషనరేట్లు, జగిత్యాల, సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. రాచకొండ పోలీసుల తరహాలో వీరూ చర్యలకు దిగితే రూ.వందల కోట్ల దందా బయటికి వస్తుందని బాధితులు అంటున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీసుస్టేషన్లలో ఈ విషయమై ఫిర్యాదులు ఇస్తే సెటిల్మెంట్ చేసుకోండని తిప్పి పంపుతున్నారని, కేసులు నమోదు చేయకుండా నిందితుల వైపు ఉంటున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. కేసులు ఎందుకు నమోదు చేయడం లేదంటే బాధితులు ముందుకు రావడం లేదని పోలీసులు సమాధానం ఇస్తున్నారు. -
రైతుల అవసరాలకే గోదాం
● జిల్లాలో అందుబాటులో సరిపడా ఎరువులు ● ఆయిల్పామ్ సాగుతో లాభాలు ● సలహాలు, సూచనలకు టోల్ ఫ్రీ 93986 84240 ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్: జిల్లాలో అత్యవసర సమయంలో రైతులు వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. పెద్దూరు గ్రామ శివారులోని అపెరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఎరువుల గోదాంను సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూపారెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎప్పడైనా ఎక్కడైనా అత్యవసర పరిస్థితిలో ఎరువుల కొరత ఏర్పడినప్పుడు అందజేసేందుకు ముందస్తుగా గోదాంను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఎంఏవో, ఏఈవోలు పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగుతో రైతుకు మేలు ఆయిల్పామ్ సాగుతో రైతులకు, దేశానికి మేలు జరుగుతుందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. ఆయిల్పామ్ సాగుపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశ అవసరాలకు సరిపడా వంట నూనె మన దగ్గర లేదని, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరిగితే రైతులకు లాభం జరగడంతోపాటు దేశానికి మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం సబ్సిడీలు సైతం ఇస్తుందని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 2వేల ఎకరాలలో సాగు విస్తీర్ణం లక్ష్యం కాగా 1,135 ఎకరాల్లో 322 రైతులు సాగుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. ఇప్పటికే 99 ఎకరాలలో ప్లాంటేషన్ పూర్తయిందని తెలిపారు. ఆయిల్పామ్ సాగులో సలహాలు, సూచనల కోసం టోల్ఫ్రీ 93986 84240 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
నాకు నీడగా.. నీకు తోడుగా..
● ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్ ● ఎక్కడున్నా రాఖీని మరువని రక్త సంబంధాలు ● మార్కెట్లో పండుగ సందడికలెక్టర్కు పోషణ బంధం రాఖీ63 ఏళ్లుగా పండుగ సంతోషం..సోదరి కోసం సౌదీ నుంచి..అన్నంటే ధైర్యం.. తమ్ముడంటే ప్రేమ.. అమ్మగర్భాన్ని పంచుకుని.. నాన్న చూపిన బాటలో నడుచుకుని.. ఏళ్లకాలం తోడునీడగా నిలిచేది సోదర, సోదరీమణుల బంధం. రక్తం పంచుకుని పుట్టి.. చివరి అంకం వరకు ప్రేమ, ఆప్యాయతలు పంచుకునే ప్రేమబంధం. ఇలాంటి బంధానికి ప్రతీకగా నిలుస్తోంది రాఖీ పండుగ. నేను నీకు రక్షా.. నీవు నాకు రక్షా అంటూ.. అన్నా.. తమ్ముళ్లకు అక్కాచెల్లెల్లు కట్టేది రక్షాబంధన్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీలు బట్వాడా చేస్తుండగా.. మరికొందరు పండక్కి స్వదేశానికి వచ్చేశారు. కొందరు వృద్ధులు శుక్రవారం నుంచే సోదరుల ఇళ్లకు పయనమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో పండుగ రద్దీ కనిపిస్తుండగా.. మార్కెట్లలో వివిధ డిజైన్లలతో రాఖీలు మెరుస్తున్నాయి. స్వీట్ల దుకాణాల్లో వివిధ రకాల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. నేడు రాఖీ పండుగ సందర్భంగా కథనం..– మరిన్ని కథనాలు 8లోu పెద్దపల్లిరూరల్: కలెక్టర్ కోయ శ్రీహర్షకు శుక్రవారం పెద్దపల్లి సీడీపీవో కవిత పోషణ బంధం రాఖీ కట్టారు. రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేకంగా పోషణ రాఖీలు తయారు చేయించి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేశామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. అంగన్వాడీ టీచర్లు విధిగా గర్భిణులు, బాలింతలు, పిల్లల ఇళ్లకు వెళ్లి రాఖీ కట్టి పోషకాహార ప్రాధాన్యత గురించి వివరించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 15 వేల ఇళ్లకు వెళ్లి ఇలా అవగాహన కల్పిస్తారని వివరించారు.ఇల్లంతకుంట: చిత్రంలో కనిపిస్తున్న వీరు సార మల్లేశం, అంతటి లక్ష్మి. అక్కా తమ్ముళ్లు. సొంతూరు ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట. తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు. ముగ్గురు మగపిల్లలు. అంతటి లక్ష్మి అన్న నర్సయ్య ఐదేళ్లక్రితం చనిపోయాడు. ప్రతీ రాఖీ పండక్కి అక్క లక్ష్మినర్సవ్వతో కలిసి అంతటి లక్ష్మి ముస్కానిపేటకు నడుచుకుంటూ వెళ్లి అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టేవారు. ప్రస్తుతం ముగ్గురూ ఇల్లంతకుంటలోనే వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ‘మా తమ్ముడు మల్లేశానికి నేను మా అక్క ప్రతీ ఏటా రాఖీ కడతాం. తమ్ముడికి రాఖీ కడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. 63ఏళ్లుగా రాఖీ కడుతున్నా. ఆరోజు మా ఇళ్లంతా పండుగ వాతావరణం ఉంటుంది. గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం’ అని అంతటి లక్ష్మి తెలిపింది.16 ఏళ్లుగా స్పీడ్ పోస్ట్లో..జమ్మికుంట: చిన్నతనం నుంచి తన చేతులతో రాఖీ కట్టించుకున్న సోదరుడు ఇప్పుడు సప్తసముద్రాల అవతల ఉన్నా రాఖీ పంపించడం మరవడం లేదు ఆ సోదరి. అమెరికాలో స్థిరపడిన సోదరుడికి 16ఏళ్లుగా ఇంటర్నేషనల్ స్పీడ్పోస్టు ద్వారా రాఖీ పంపుతోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సుజాతకు ఇద్దరు సోదరులు పొనగంటి సంపత్, రమేశ్ ఉన్నారు. సంపత్ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. రమేశ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా జీవనం సాగిస్తున్నాడు. సుజాత ఏటా రాఖీ పండుగ సందర్భంగా 15రోజుల ముందుగానే రమేశ్కు ఇంటర్ నేషనల్ స్పీడ్పోస్ట్ ద్వారా రాఖీ పంపిస్తోంది. పండుగ రోజున రమేశ్ రాఖీ కట్టుకొని ఫోన్ ద్వారా సుజాతతో మాట్లాడి తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు.కథలాపూర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన బీమనాతి శ్రీధర్ ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా స్వదేశానికి రాలేదు. రాఖీ పండుగ సందర్భంగా తన సోదరి మౌనికతో రాఖీ కట్టించుకోవాలని అనిపించింది. గల్ఫ్ దేశంలో కంపెనీ యజమానితో విషయం చెప్పాడు. వారు ఒప్పుకోవడంతో బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. సోదరితో రాఖీ కట్టించుకుంటే ఆ సంతోషం వర్ణించలేనిదని శ్రీధర్ అంటున్నాడు. -
రావమ్మా మహాలక్ష్మీ
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025శ్రావణ శుక్రవారం జిల్లాలోని మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నోముకున్నారు. వేములవాడలోని మహాలక్ష్మీ ఆలయంలో జరిగిన వ్రతాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. స్థానాచార్యులు ఉమేశ్శర్మ నేతృత్వంలో అర్చకుల బృందం రాజన్న గుడి నుంచి బైపాస్రోడ్డులోని మహాలక్ష్మీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకున్నారు. ఈవో రాధాభాయి, ఏఈవోలు అశోక్, శ్రవణ్, జయకుమారి, సెస్ డైరెక్టర్ నామాల ఉమ తదితరులు పాల్గొన్నారు. – వేములవాడ/ సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్లన్యూస్రీల్ -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
సిరిసిల్ల: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల అగ్నిమాపక అధికారి ఎన్.నరేందర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదాలు–నివారణ చర్యలపై శుక్రవారం అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్క అగ్గి రవ్వ అపారమైన ఆస్థి, ప్రాణ నష్టానికి కారణమవుతుందన్నారు. ముందుజాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలు జరగవని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే 101, 87126 99258 నంబర్లలో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రి డాక్టర్ వంశీగౌడ్, అగ్నిమాపక, ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్పై విచారణఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని సిరికొండ ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్పై వచ్చిన ఆ రోపణలపై జిల్లా అధికారులు శుక్రవారం గ్రామంలో విచారణ చేపట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్ తడిసిన సత్తయ్య ఐదెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని గత నెల 28న ప్రజావాణిలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహులు, ఇల్లంతకుంట ఎంపీడీవో శశికళ, ఆర్ఐ సంతోష్కుమార్ గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. -
‘ప్రజల మద్దతు కాంగ్రెస్ వైపే’
ఇల్లంతకుంట(మానకొండూర్): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ వైపే ఉండాలని ప్రభుత్వానికి ప్రజల అండదండలు అవసరమని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. స్థానిక మండల పరిషత్లో శుక్రవారం 125 మంది లబ్ధిదారులకు సీఎమ్మార్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎంపీడీవో శశికళ, డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్రెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ ఎలగందుల ప్రసాద్, మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు పుష్పలత తదితరులు పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి సిరిసిల్లటౌన్: ప్రజలు తమ ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖధీర్పాషా కోరారు. స్థానిక 17వ వార్డు గాంధీనగర్లో శుక్రవారం డ్రై డేలో పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం దృష్ట్యా ఇంట్లో దోమల నివారణ తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిలువలు లేకుండా చూడాలని కోరారు. అధికారులు ఎడ్ల శేఖర్, మేఘన, మమత, ఏఎన్ఎం అన్నపూర్ణ, ఆశవర్కర్లు శ్రీవాణి, మమత, వార్డు జవాన్ దేవయ్య పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలి ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని, అందుకోసం ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. మండలంలోని అల్మాస్పూర్, దుమాల గ్రామాల్లో శుక్రవారం పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. మండలంలో అత్యధిక స్థానాలు గెలుపొంది కేటీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నెరవేర్చని హామీలను ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మ ణ్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ గుల్లపల్లి నర్సింహరెడ్డి, నాయకులు నర్సాగౌడ్, నమిలికొండ శ్రీనివాస్, శరవింద్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మండలంలోని నీలోజిపల్లికి చెందిన పలువురు నిర్వాసితులు శుక్రవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను కలిసి వినతిపత్రం అందించారు. గత బీ ఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వాసితుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కొండం శ్రీని వాసరెడ్డి, చెంచు నాగరాజు, ఆవుల లక్ష్మణ్, రాజేంద్రప్రసాద్, ఎర్ర శ్రీకాంత్, మోహన్ ఉన్నారు. చిరుజల్లులుసిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా వీర్నపల్లి మండలంలో 34.6 మిల్లీమీటర్ల వర్షం పడింది. రుద్రంగిలో 24.4, చందుర్తిలో 3.4, వేములవాడ రూరల్లో 0.1, వేములవాడలో 0.4, సిరిసిల్లలో 12.5, కోనరావుపేటలో 4.7, ఎల్లారెడ్డిపేటలో 32.1, గంభీరావుపేటలో 18.0, ముస్తాబాద్లో 19.4, తంగళ్లపల్లిలో 31.0, ఇల్లంతకుంటలో 18.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బోయినపల్లిలో పెద్దగా వర్షం పడలేదు. -
డెంగీకి సర్కార్ వైద్యమే బెస్ట్
సిరిసిల్లటౌన్: డెంగీ జ్వరం వచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దని.. సర్కార్ వైద్యంతోనే నయం చేయవచ్చని జిల్లా వైద్యాధికా రిణి రజిత పేర్కొన్నారు. డెంగీ కేసులు నమోదైన గ్రామాల్లో వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి, జ్వరాలు విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డెంగీ, వైరల్ ఫీవర్స్పై భయాందోళన చెందవద్దని సూచించారు. జిల్లాలో డెంగీ, వైరల్ జ్వరాలు వస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ గురువారం నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.● సీజనల్ వ్యాధులపై అప్రమత్తం ● యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడొద్దు ● అకారణంగా ప్లేట్లెట్స్ ఎక్కించుకోవద్దు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా వైద్యాధికారిణి రజితప్రశ్న: డెంగీ, వైరల్ ఫీవర్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?డీఎంహెచ్వో: జిల్లాలో డెంగీ, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో డ్రై డే కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ విషయంలో కలెక్టర్ కూడా గ్రామపంచాయతీ, మున్సిపల్, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఫాగింగ్ చేయడం, నీటి నిలువ గుంతలలో రసాయనాలు చల్లిస్తున్నాం. సాయంత్రం 5 నుంచి 7 గంటల ప్రాంతంలో మెష్లు ఉన్నవాళ్లు వాడాలి. లేని వారు తలుపులు, కిటికీలు మూసి దోమలు ఇంట్లోకి రాకండా జాగ్రత్తపడాలి. ప్రశ్న: డెంగీ జ్వరం లక్షణాలు, నిర్ధారణ ఎలా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?డీఎంహెచ్వో: హఠాత్తుగా తలనొప్పి, తీవ్ర జ్వరం, కళ్ల నొప్పి, ఒంటినొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. జ్వరపీడితులు సర్కారు ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేయించుకుంటే ఏ జ్వరం అనేది తెలుస్తుంది. జ్వరం తగ్గినా పక్షం రోజుల వరకు అలసటగా ఉంటుంది. పండ్లు, రసాలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఓఆర్ఎస్, కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిది. నిలువ ఉన్న నీటి గుంతల్లో దోమల మందు స్ప్రే చేయిస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ చేయొద్దు. వారు కూడా లక్షణాలున్న రోగి రక్తనమూనాలు ప్రభుత్వ ఆస్పత్రి, టీ–హబ్లోనే పరీక్షలు చేయించాలి. ప్రశ్న: ప్లేట్లెట్స్ ఎక్కించడం ఎప్పుడు అవసరం? డీఎంహెచ్వో: రోగులకు రక్తస్రావం జరగకుండా ప్లేట్లెట్స్ 10వేల వరకు పడిపోయినా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మే నెల నుంచి జిల్లాలో 28 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ జ్వరం ఐదు రోజుల వరకు ఉంటుంది. వారం తర్వాత రోగికి రక్తస్రావమైతే పరిస్థితి సీరియస్గా ఉందని భావించొచ్చు. వెంటనే దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలి. రోగికి ఫ్లూయిడ్స్ మాత్రమే ఇవ్వాలి. జిల్లాలో ఇప్పటి వరకు హైరిస్క్ కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఎన్ఎస్–1 టెస్టులు 1,758, ర్యాపిడ్ టెస్టులు 1,686, మలేరియా 1,880 టెస్టులు నిర్వహించాం. చికున్గున్యా కేసులు నమోదుకాలేవు. ప్రశ్న: జిల్లాలో జ్వరాల పరిస్థితి, నివారణ చర్యలు వివరించండి?డీఎంహెచ్వో: అన్ని మండలాల్లో వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే చేపడుతున్నారు. డెంగీతో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణహాని కాలేదు. అత్యవసర చికిత్సను జిల్లా ఆస్పత్రిలో పలువురికి చేయించగా వారు కోలుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల కన్నా ప్రభుత్వాస్పత్రుల్లో ట్రీట్మెంట్ ప్రొటోకాల్ ప్రకారం జరుగుతుంది. ప్రజలు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి కుండీలు, టైర్లు, కూలర్లు తదితరాల్లో దోమలు ఆవాసం లేకుండా చూడాలి. ఇందుకు వారంలో రెండు రోజులు డ్రై డే పాటించాలి. వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రశ్న: డెంగీ, వైరల్ ఫీవర్స్కు చికిత్స వివరాలు?డీఎంహెచ్వో: డెంగీ, వైరల్ ఫీవర్స్ నిర్మూలనకు జిల్లా వైద్యశాఖ సన్నద్ధంగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 53 వైద్యశిబిరాలు నిర్వహించాం. జ్వర పీడితులు జిల్లాలోని సర్కారు ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాలి. జిల్లాలో మెడికల్ కాలేజీ, జిల్లా జనరల్ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, సీహెచ్సీ–2, యూహెచ్సీ–2, పీహెచ్సీ–16, బస్తీ దవాఖానాలు–2 ఉన్నాయి. వీటిల్లో 24 గంటలపాటు నిరంతర వైద్యం అందుతుంది. అత్యవసర పరిస్థితులు ఉంటే ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రికి రోగులను తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందిస్తాం. డెంగీ, వైరల్ ఫీవర్స్కు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడొద్దు. ప్రభుత్వ వైద్యుడి సంరక్షణలో చికిత్స పొందడం మంచిది. -
రోడ్లు మూసివేతలు కూల్చేశాం
శ్రీనగర్కాలనీ సమీపంలోని జీపీ లేఅవుట్ వెంచర్లో వ్యవసాయం చేయకుండా మా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. త్వరలోనే వెంచర్లో రోడ్లను మార్కింగ్ చేయిస్తాం. వెంచర్లో రోడ్ల విక్రయాలపై విచారణ చేపట్టి నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వెంచర్లో పొందుపరిచిన రోడ్లు మూసేసిన వాటిని కూల్చేయడం జరిగింది. జ్యోతినగర్లో ఓ వ్యక్తి తన ఇంటి మెట్లు రోడ్డుపై వచ్చాయన్న విషయంలో నోటీసులు ఇచ్చాం. రోడ్లు అన్యాక్రాంతమైతే ఫిర్యాదు అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎంఏ. ఖదీర్పాషా, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల -
గురుకులం విద్యార్థులకు జ్వరాలు
● రక్తనమూనాల సేకరణ ● వైరల్ ఫీవర్స్ : ఎంఈవోఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాల ఏకలవ్య గురుకులంలోని విద్యార్థులు జ్వరాల బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు కలిసి గురువారం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు తరలించారు. ఇద్దరు విద్యార్థులు వాంతులు, విరోచనాలతో బాధపడుతుండగా, వారికి పరీక్షలు చేసి వైద్యం అందించారు. మిగతా విద్యార్థుల రక్త నమూనాలను సేకరించి వారిని హాస్టల్కు తరలించారు. కొందరికి వైరల్ ఫీవర్స్ వచ్చాయని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంఈవో కృష్ణహరి తెలిపారు. -
పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి
సిరిసిల్ల/ముస్తాబాద్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): పల్లెల్లో పారిశుధ్య నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో గురువారం సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వైద్యాధికారులు, వైద్యసిబ్బందితో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ డెంగీ కేసులు నమోదైన ప్రాంతంలో ప్రత్యేకంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి బాధ్యతగా పనిచేయాలన్నారు. మంగళ, శుక్రవారా లలో డ్రై డే చేపట్టాలని సూచించారు. డెంగీ కేసులను తక్కువ చేసి చూపించొద్దని, ఎన్ని కేసులు గుర్తించి, చికిత్స అందిస్తే అంత బాగా పని చేసినట్లుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఆస్తి పన్ను వసూలు చేయాలి ప్రతీ గ్రామంలో ఆస్తిపన్ను వసూలు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. అన్ అకాడమీ ఆన్లైన్ క్లాస్లు ప్రారంభం సిరిసిల్లలోని ఎంజేపీటీబీసీ బాలికల గురుకులం, ముస్తాబాద్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయం, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సోషల్ వెల్ఫేర్, సారంపల్లి ట్రైబల్ వెల్ఫేర్, నేరెళ్ల తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలల్లో అన్ అకాడమీ ఆన్లైన్ క్లాసులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే.మహేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ముస్తాబాద్ ఇందిరమ్మకాలనీలో అంగన్వాడీ కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఆన్లైన్లో సీనియర్ సిటిజన్ మెయింటనెన్స్ కేసులు జిల్లాలో సీనియర్ సిటిజన్స్(వయోవృద్ధులు) మెయింటనెన్స్ కేసులు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కేసులు ఆఫ్లైన్లో కాకుండా, ఆన్లైన్ పోర్టల్ https://tgseniorcitizens.cgg.gov.inలో నమోదు చేయాలని తెలిపారు. మీసేవ కేంద్రాల్లో సీనియర్ సిటిజన్ కేసుల ఆన్లైన్ ఫైలింగ్ చేపట్టాలన్నారు. కేసు పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు తె లుస్తాయని స్పష్టం చేశారు. డీఎంహెచ్వో రజిత, డీ పీవో షరీఫొద్దీన్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం ఉన్నారు. -
వేడుకగా జాతీయ చేనేత దినోత్సవం
సిరిసిల్ల: జాతీయ చేనేత దినోత్సవాన్ని సిరిసిల్లలో గురువారం వేడుకగా నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్లోని నేతన్నచౌక్ వద్ద గల నేతన్న విగ్రహానికి కలెక్టర్ సందీప్కుమార్ ఝా, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కె.కె. మహేందర్రెడ్డి పూలమాలలు వేశారు. వస్త్రపరిశ్రమకు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ఆర్డర్లు, యార్న్ బ్యాంకు ద్వారా నూలు, స్కూల్ యూనిఫాం, విద్యుత్ సబ్సిడీ అంశాలను గుర్తు చేశారు. చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, వస్త్రోత్పత్తిదారులు దూడం శంకర్, తాటిపాముల దామోదర్, వేముల దామోదర్, యెల్దండి శంకర్, గుండ్లపల్లి గౌతమ్, మండల బాలరాజు, బూర కనకరాజేశం, బూట్ల నవీన్, బీజేపీ నాయకులు ఆడెపు రవీందర్, నాగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో.. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోనూ జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. పద్మశాలి సంఘం నాయకులు మండల సత్యం, డాక్టర్ గాజుల బాలయ్య, మోర రవి, గోసిక అనిల్కుమార్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో... బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనూ నేతన్న విగ్రహానికి, విద్యానగర్ చౌరస్తాలో కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పార్టీ నాయకులు గూడూరి ప్రవీణ్, మంచె శ్రీనివాస్, ఆకునూరి శంకరయ్య, దార్నం అరుణ, అడ్డగట్ల మురళి, బత్తుల వనజ, మ్యాన రవి, సబ్బని హరీశ్, గెంట్యాల శ్రీనివాస్, దార్ల సందీప్, అన్నారం శ్రీనివాస్, కల్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు.● నేతన్న విగ్రహానికి పూలమాలలు -
విద్యార్థుల్లో సాధించాలనే తపన ఉండాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థుల్లో సాధించాలనే తపనకు కృషి తోడైతే ఎంతటి లక్ష్యాన్నైనా అవలీలగా చేరుకుంటారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ పేర్కొన్నారు. నారాయణపురం సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని ప్రతీ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను, తల్లిదండ్రులను గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నలిమెల భాస్కర్ మాట్లాడుతూ ఊరు పేరును నిలబెట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. రిటైర్ట్ ఐఏఎస్ ఆఫీసర్ రమణాచారి, తిరుమల శ్రీనివాసాచారీలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. పదో తరగతి విద్యార్థుల్లో ఎంత మంది అన్ని సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులతో మొత్తం 550 సాధిస్తే రూ.10వేల చొప్పున ప్రోత్సాహకంగా అందజేస్తానని ప్రకటించారు. అనంతరం సేవా సంస్థ తరఫున విద్యార్థులకు డైరీలు, నోట్బుక్స్ అందజేశారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం మనోహరాచారి, హెచ్ఎంలు చంద్రశేఖర్, దేవరాజు, నారాయణపురం సేవా సంస్థ సలహాదారులు పాత లింగన్న, నారాయణరెడ్డి, కిషన్, సుధాకర్రావు, సభ్యులు దేవిరెడ్డి, సుదర్శన్, దేవారెడ్డి, రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.నానో ఎరువులతో అధిక దిగుబడి● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగంసిరిసిల్లఅర్బన్: నానో ఎరువులతో పంటల్లో అఽధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని చంద్రంపేట రైతువేదికలో వ్యవసాయశాఖ, భారతీయ రైతాంగ సహకార సంస్థ (ఇఫ్కో) సంయుక్తంగా నానో యూరియా ప్లస్, నానో డీఏపీ ఎరువుల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇఫ్కో సంస్థ అభివృద్ధి చేసిన నానో యూరియా ద్రవం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది అన్నారు. కరీంనగర్ జిల్లా ఇఫ్కో ఏరియా మేనేజర్ బాలాజీ, జిల్లా మేనేజర్ డి.నరేశ్, ఏవో సందీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.అవార్డు అందుకున్న రేఖ● తొలి మహిళా చేనేత కార్మికురాలుసిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన వెల్ది రేఖ జాతీయ చేనేత దినో త్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో కొండా లక్ష్మణ్ బాపూజీ అవా ర్డును గురువారం హైదరాబాద్లో అందుకున్నారు. చేనేత మగ్గంపై రాజన్న సిరిపట్టు పితాంబరం చీరను నేసి అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అవార్డు పొందిన తొలి మహిళా చేనేత కార్మికురాలిగా రేఖకు గుర్తింపు లభించింది. రేఖ భర్త వెల్ది హరిప్రసాద్ సూక్ష్మమగ్గంతో గుర్తింపు పొంది చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేశారు.గెస్ట్ టీచర్ల పోస్టుకు దరఖాస్తులుసిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో గెస్ట్ టీచర్ల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారిణి పావని గురువారం ప్రకటనలో తెలిపారు. సీఆర్టీ, హిందీ సబ్జెక్టుల్లో బోధించడానికి అర్హత గల అభ్యర్థులు ఈనెల 8 నుంచి 11 వరకు పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.రద్దీ రోజుల్లో అభిషేకాలు రద్దువేములవాడ: శ్రావణమాసం, వరుస సెలవుల నేపథ్యంలో అభిషేకం పూజలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో రాధాభాయి గురువారం తెలిపారు. ఈనెల 8, 9, 15, 16 తేదీల్లో అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నపూజలు సమయానికి అనుగుణంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తులు సహకరించాలని కోరారు. -
యజమానుల దోపిడీపై పోరాడుతాం
● బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సూరం పద్మసిరిసిల్లటౌన్: బీడీ కంపెనీ యాజమాన్యాలు శ్రామి క దోపిడీపై పోరాటం చేస్తామని బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరం పద్మ పేర్కొన్నారు. సిరిసిల్లలోని అమృత్లాల్ శుక్లా కార్మి క భవనంలో బుధవారం అధ్యక్షురాలు దాసరి రూప అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పద్మ మాట్లాడుతూ బీడీ కంపెనీ యాజమాన్యం కార్మికుల నుంచి నెలకు రెండు వెయ్యిల బీడీల కూలీని దోచుకుంటున్నాయని ఆరోపించారు. రేయింబవళ్లు పనిచేసిన కార్మికులకు నెలకు రూ. 3వేల వరకు కూలీ వస్తే అందులో నుంచి రూ. వెయ్యి వరకు యజమానులే దోచుకుంటున్నారన్నా రు. నగదు బీడీ కంపెనీలు పుట్టగొడుగుల పుట్టుకొ స్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకో వడం లేదన్నారు. యూనియన్ నాయకులు జిందం కమలాకర్, బెజ్గం సురేష్, బోనాల లక్ష్మి పాల్గొన్నారు. -
నడుమునొప్పి పక్కా..
ఇది వేములవాడలోని సుభాష్నగర్ రోడ్డు. ఈ రోడ్డు గుండా భక్తులు, స్థానికులు తిరుగుతూనే ఉంటారు. రద్దీగా ఉండే ఈ రోడ్డులో యాభైకి పైగా గుంతలు ఏర్పడి వాహనదారులు వెళ్లలేకుండా మారింది. ఇంతటి రద్దీగా ఉండే రోడ్డును అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ రోడ్డుపై బీటీరోడ్డు వేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని జనం కోరుకుంటున్నారు. ఇది సెస్ ఆఫీస్ ఎదుట ఉన్న ప్రధాన రహదారి. ఈ రోడ్డుపై ఏర్పడిన ఓ గొయ్యిని మున్సిపల్ అధికారులు పూడ్చారు. కానీ ఇక్కడ వర్షం కురిసినప్పుడల్లా గుంతలుగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణంలోని రహదారులపై అడుగుకో గుంత పడింది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం జరుగుడు ఖాయం. కండ్లు మూసి తెరిచేలోపే ద్విచక్రవాహనాలు గుంతల్లో పడిపోతున్నాయి. చాలా మంది పట్టణ ప్రజలు ఈ రోడ్లపై ప్రయాణిస్తూ నడుము నొప్పులతో బాధపడుతున్నారు. రద్దీ పట్టణం.. రోడ్లు అధ్వానం వేములవాడ పట్టణంలో ప్రసిద్ధ శ్రీరాజరాజేశ్వరస్వామి కొలువుదీరడంతో రాష్ట్రంతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటా రు. ఇలా నిత్యం 30 వేల వరకు భక్తులు వేములవాడకు వచ్చి పోతుంటారు. వీరితో పాటు స్థానికులు ఇవే రోడ్లపై తిరుగుతుంటారు. ఇంతటి రద్దీ ఉండే పట్టణంలో రోడ్లు చూస్తే దారుణంగా ఉన్నాయి. తిప్పాపూర్ వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపడుతుండడంతో శిథిలాలతో నడవలేకుండా మారింది. మిగతా రోడ్లు గుంతలుపడ్డాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి వేములవాడ పట్టణంలోకి వచ్చే ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లను బాగు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వేములవాడలో అధ్వానంగా రోడ్లు అడుగుకో గుంతతో అవస్థలు మరమ్మతు చేయని అధికారులుఇది వేములవాడ పట్టణంలోని పాపన్నచౌక్. ఉదయం 3 నుంచి 8 గంటల వరకు కూరగాయల మార్కెట్ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలకు అనేక పల్లెలకు చెందిన వేలాది మంది జనం వస్తుంటారు. ఈ గుంతల రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని జనం కోరుతున్నారు. రోడ్లు బాగుచేస్తాం వేములవాడలోని రోడ్లను బాగుచేస్తాం. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచాం. త్వరలోనే పనులు చేపట్టి ప్రజలకు సౌకర్యవంతంగా మార్చుతాం. తెలంగాణచౌక్ నుంచి పాపన్నచౌక్ వరకు బీటీ రోడ్డు వేస్తున్నాం. మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు ఆర్అండ్బీ అధికారులు 80 ఫీట్లతో రోడ్డు పనులు చేపట్టబోతున్నారు. సుభాష్నగర్ రోడ్డును బాగు చేయిస్తాం. – అన్వేశ్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ -
బీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమ
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. సిరిసిల్ల లోని పార్టీ ఆఫీస్లో బుధవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. స్థానికసంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని, అయినప్పటికీ 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా బీసీ రిజర్వేషన్లు ముందుకు తెచ్చి బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 12 శాతం ఉన్న ముస్లింలకు 10 శాత రిజర్వేషన్ ఎందుకు కల్పించాలో వివరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలపై ప్రేమే ఉంటే బీసీ విద్యార్థులకు రావాల్సిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. ముస్లిం రిజర్వేషన్లు తీసేసి 42 శాతాన్ని బీసీలకే కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేస్తే బీజేపీ ఆమోదిస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కరెండ్ల మల్లారెడ్డి, పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, నంద్యాలపు వెంకటేశ్, రాగుల రాజిరెడ్డి పాల్గొన్నారు. -
పట్టు పరిశ్రమతో రైతుల ఆర్థిక స్థితి మెరుగు
వేములవాడరూరల్: పట్టు పరిశ్రమతో రైతుల ఆర్థిక స్థితి మెరుగవుతుందని జిల్లా సెరీకల్చర్ ఆఫీసర్ జగన్రావు పేర్కొన్నారు. వేములవాడ మండలం వెంకటాంపల్లిలో మేరా రేషమ్ మేరా అభిమాన్–2025లో భాగంగా బుధవారం రైతులకు శిక్షణ ఇచ్చారు. మల్బరీ తోట నిర్వహణ, నాణ్యమైన ఆకు ఉత్పత్తికి కత్తిరింపు పద్ధతులు, ఎరువుల మోతాదు, నాణ్యమైన కాయ ఉత్పత్తికి క్రిమిసంహారక విధానం గురించి, మల్బరీ వ్యాధి, తెగులు నిర్వహణపై చర్చించారు. శాస్త్రవేత్త మల్లికార్జున, రాఘవేంద్ర, డీహెచ్ఎస్వో లత, పంచాయతీ కార్యదర్శులు మనీశ, రాము పాల్గొన్నారు.తల్లిపాలతో అనేక లాభాలువేములవాడ: తల్లిపాలే శ్రేష్టమని ఫాగ్సీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ నాగమల్ల పద్మలత పేర్కొన్నారు. కరీంనగర్ ఆబ్సే్ట్రటీక్స్ అండ్ గైనకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం బాలింతలకు అవగాహన సదస్సులో మాట్లాడారు. తల్లిపాలతో కలిగే లాభాల గురించి వివరించారు. బిడ్డలకు పాలివ్వడం వల్ల ప్రసూతి తర్వాత ఏర్పడే శారీరక మార్పులను క్రమబద్ధీకరిస్తుందన్నారు. వైద్యులు శోభారాణి, లీలావతి, ఉష, ఏఎన్ఎంలు ప్రభావతి, సత్యవేద పాల్గొన్నారు.సైబర్ నేరాలపై నాటక ప్రదర్శనవేములవాడరూరల్: ప్రతీ ఒక్కరికి సైబర్ నేరాలపై అవగాహన ఉన్నప్పుడే మోసాలకు గురికామని వేములవాడ రూరల్ ఎస్సై అంజయ్య పేర్కొన్నారు. వేములవాడ మండలం చెక్కపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం సైబర్ జాగరుక్తా దివస్లో భాగంగా నాటక ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించా రు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన ఉంటే వారి కుటుంబం మొత్తానికి తెలుస్తుందన్నారు. ఎంఈవో కిషన్, జిల్లా సైబర్ సెల్ కానిస్టేబుల్ శ్రీకాంత్, వేములవాడ రూరల్ సైబర్ వారియర్ రాజశేఖర్గౌడ్ పాల్గొన్నారు.సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలికోనరావుపేట/వీర్నపల్లి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి రజిత సూచించారు. స్థానిక పీహెచ్సీని, వీర్నపల్లి మండలం రాసిగుట్టతండా, భూక్యతండాలలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను బుధవారం తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలన్నారు. డెంగీ తదితర జ్వరాల నివారణపై దృష్టి సారించాలన్నారు. గ్రామీణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ప్రోగ్రాం అధికారి అనిత, వైద్యులు వేణుమాధవ్, బాలకృష్ణ, సీహెచ్వో కృష్ణమూర్తి, హెచ్ఈవో లింగం, సూపర్వైజర్లు రషీద్, ఇందిర, పద్మ తదితరులు పాల్గొన్నారు.భీమేశ్వరాలయంలో ఏర్పాట్లు షురూ..వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు ప్రారంభించే ముందు భీమన్న ఆలయంలో భక్తులకు స్వామి వారి దర్శనాలు కల్పించేందుకు వీలుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. షెడ్లు వేసేందుకు అడ్డుగా ఉన్న భారీ చెట్లను బుధవారం తొలగించారు. -
మహిళలకు బస్సు డ్రైవింగ్లో శిక్షణ
● నేడు జెడ్పీ ఆఫీస్లో ఇంటర్వ్యూలు సిరిసిల్ల: జిల్లాలోని ఆసక్తి గల మహిళలకు ఉచితంగా బస్సు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు డీఆర్డీఏ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. బస్సు డ్రైవింగ్ శిక్షణను సెర్ప్, ఎంవోడబ్ల్యూవో ఆధ్వర్యంలో మూడు నెలలు ఇవ్వనున్నారు. 21–40 ఏళ్ల మధ్య వయసు, పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులని పేర్కొన్నారు. 160 సెంటిమీటర్ల ఎత్తు, ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఆసక్తి గల మహిళలు జిల్లా సమాఖ్యలో గురువారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అధికారులు కోరారు. జెడ్పీ ఆఫీస్లోని మహిళా సమాఖ్య భవనంలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. -
అర్హులకు రేషన్కార్డులు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతంగళ్లపల్లి(సిరిసిల్ల): అర్హులకు రేషన్కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. మండలంలోని బద్దెనపల్లి ఎస్ఎస్ గార్డెన్స్లో బుధవారం నూతన రేషన్ కార్డులను కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కెకె.మహేందర్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో నూతనంగా 1,397 కొత్త రేషన్కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 2,224 మంది కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసినట్లు తెలిపారు. నూతన రేషన్కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని స్పష్టం చేశారు. అంతకముందు చీర్లవంచలో రెండు అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. చీర్లవంచ జెడ్పీ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలతోపాటు మండల కేంద్రంలోని ట్రైబల్డిగ్రీ కళాశాలను తనిఖీ చేశారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రెండు పశువుల చొప్పున 14 మందికి పంపిణీ చేశారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ జయంత్కుమార్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఏఎంసీ వైస్చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ప్రవీణ్ జె.టోని తదితరులు పాల్గొన్నారు. -
వినూత్నంగా.. ఉపాధి పక్కాగా..
సిరిసిల్లకల్చరల్: పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి.. అని పెద్దలు చెప్పిన మాటలను నమ్మి ముందుకెళ్లి విజయం సాధించాడు భైరి మధు. తన తప్పేమి లేకున్నా చేస్తున్న వ్యాపారంలో నష్టం రాగా.. అదే రంగంలో వినూత్నంగా ఆలోచించి ఉపాధి పక్కాగా చేసుకున్నాడు. మరో 40 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన మధు తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం భీవండిలో స్థిరపడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి సిరిసిల్ల సమీపంలోని చంద్రంపేటకు వచ్చాడు. తన రెక్కల కష్టంతో రెండు కార్ఖానాలు నిర్వహించే స్థాయికి ఎదిగాడు. అయితే కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయాడు. పడిన చోటే తిరిగి లేవాలని భావించి.. చేనేత రంగంలోని వినూత్నంగా ఆలోచించాడు. ఇప్పుడు 40 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కరోనాతో కొత్త జీవితం కరోనా నియంత్రణకు మాస్కులు ధరించడం తప్పనిసరైన నేపథ్యంలో మాస్కుల తయారీపై దృష్టి సారించిన మధు కరీంనగర్, వరంగల్ జిల్లాల వరకు సరఫరా చేశాడు. సంక్షోభం ముగిసి సమాజం సాధారణ స్థితికి చేరేసరికి మధుకు ప్రత్యామ్నాయ వ్యాపారం జాడ దొరికింది. జాతీయ జెండాల రూపకల్పన, బ్యానర్లతోపాటు పండుగల సందర్భంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న కండువాలు తయారు చేయడం ప్రారంభించాడు. గత ఐదేళ్లుగా వస్త్రం కొనుగోలు చేయడం, రంగులు అద్దించడంతోపాటు వాటిని ఆర్డర్ల మేరకు కండువాలు, తయారు చేయిస్తున్నాడు. కృష్ణాష్టమి, వినాయక చవితి వంటి సామూహిక ఉత్సవాల్లో ఉపయోగించే లాల్చీలు, కుర్తాలు కుట్టించి విక్రయిస్తున్నాడు. వివాహాది శుభకార్యాల సందర్భంగా ఆయా కార్యక్రమాల నిర్వాహకులు ఏకరీతిగా ఉండే కుర్తాలు ధరిస్తుంటారు. అదే అదనుగా హల్దీ, సంగీత్ వంటి ఉత్సవాలకు అవసరమైన కుర్తాలు తయారు చేయించి అమ్ముతున్నాడు. మరో 40 మందికి ఉపాధి మధు తాను ఉపాధి పొందడంతోపాటు మరో 40 మందికి కుర్తాలు కుట్టే పనిలో ఉపాధి ఇస్తున్నాడు. ఒక్కొక్కరు వారి పని తీరు ఆధారంగా రోజుకు కనీసం రూ.300 సంపాదిస్తున్నారు. మధు చేస్తున్న పనికి ఆయన సతీమణి శ్యామల సైతం తోడుగా నిలుస్తోంది. కుర్తాలు, లాల్చీల తయారీ మరో నలభై మందికి ఉపాధి స్వయంకృషితో రాణిస్తున్న మధు కరోనా నేర్పిన దారి కోవిడ్ మహమ్మారి కారణంగా చేస్తున్న వ్యాపారం నష్టపోయాను. మాస్కులు ధరించడం తప్పనిసరి అనే ప్రచారంతో మాస్కులు త యారు చేయించి ఊరూరూ తిరిగి అమ్మేవాన్ని. టీవీఎస్ ఎక్సెల్ బండిమీద పలు జిల్లాల్లో మాస్కులు విక్రయించాను. మెల్లగా కరోనా పీరియడ్ తరువాత ఈ కుర్తాలు, జెండాలు, కండువాలు తయారు చేయించి విక్రయిస్తున్నాను. – భైరి మధు, తయారీదారుడు కొన్నేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా కొంతకాలంగా కుర్తాలు, లాల్చీలు కుట్టడం కోసం ఇక్కడే పనిచేస్తున్నాను. రోజుకు 30 నుంచి 40 వరకు లాల్చీలు కుట్టగలుగుతున్నాను. రోజుకో రూ.400 చొప్పున నెలకు రూ.12వేలు వరకు ఆదాయం వస్తోంది. – సిరిపురం లక్షణ -
కొత్తబస్టాండ్లో గుర్తుతెలియని మృతదేహం
జగిత్యాలక్రైం: జగిత్యాల కొత్తబస్టాండ్లో గుర్తుతెలియని మృతదేహం కనిపించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. వేములవాడ బస్ ప్లాట్ఫాం సమీపంలోని మరుగుదొడ్ల పక్కన వ్యక్తి మృతదేహం ఉందని, బూడిద రంగు టీషర్ట్, తెల్లపంచ కట్టుకుని ఉన్నాడని, మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని పేర్కొన్నారు. అతని సమాచారం తెలిసినవారు 87126 56815నంబర్లో సంప్రదించాలని కోరారు. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యశంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామంలో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శంకరపట్నం ఎస్సై శేఖర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రావ్య(27)కు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కొడుకు శ్రేయాన్స్నందన్ ఉన్నాడు. ధర్మతేజ్ రెండేళ్లక్రితం దుబాయ్ వెళ్లాడు. అప్పటినుంచి శ్రావ్య పుట్టింట్లో ఉంటోంది. సోమవారం రాత్రి దుబాయ్ నుంచి ధర్మతేజ్ శ్రావ్యతో వీడియోకాల్లో మాట్లాడాడు. ఇద్దరిమధ్య గొడవ జరగడంతో మంగళవారం వేకువజామున ఇంట్లో శ్రావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రావ్య సోదరుడు గొట్టె శివకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మానసికవేదనతో ఒకరు.. చిగురుమామిడి: చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన బల్ల బాలయ్య(50) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. బాలయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గుండె సంబంధిత ఆపరేషన్ సైతం జరిగింది. కొద్దిరోజులుగా మానసిక వేదనకు గురవుతూ.. మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కాళేశ్వరం’పై బూటకపు నివేదిక● కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు గంభీరావుపేట(సిరిసిల్ల): కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలను నిలిపివేసి ఆ ప్రాజెక్టుపై బూటకపు నివేదికలతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను గంభీరావుపేట బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఎల్ఈడీలో వీక్షించారు. అనంతరం మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత 20 నెలలుగా ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్టీ మండలాధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ నారాయణరావు, దయాకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
నెలలో నలుగురు కార్యదర్శులు
● ఇల్లంతకుంట గ్రామపంచాయతీలో వింత పరిస్థితి ● అంతుచిక్కని బదిలీల వ్యవహారం ● ఈ సమయంలో వెలుగులోకి ఫేక్ అటెండెన్స్ ● స్థానికంగా చర్చనీయంగా ట్రాన్స్ఫర్లు ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో నెల రోజుల్లో నలుగురు కార్యదర్శులు బదిలీ కావడం చర్చనీయాంశమైంది. విధుల్లో చేరుతున్న వారు పట్టుమని పది రోజులు కూడా ఇక్కడ పనిచేయడం లేదు. మళ్లీ బదిలీపై ఇతర గ్రామానికి వెళ్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. వరుస బదిలీలు.. ఈనెల 2వ తేదీన రహీంఖాన్పేట గ్రామపంచాయతీ కార్యదర్శి పులి సంధ్య ఇల్లంతకుంట గ్రామపంచాయతీకి బదిలీపై వచ్చారు. విధుల్లో చేరి మూడు రోజులు గడవకముందే మంగళవారం తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు బదిలీ అయ్యారు. గత నెల 28న ఇల్లంతకుంట గ్రామపంచాయతీ కార్యదర్శి ఎస్.వరుణ్కుమార్ బోయినపల్లి మండలం కొదురుపాకకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి నలుగురు పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరడం, అంతలోనే బదిలీపై వెళ్లడం జరిగిపోతోంది. వరుణ్కుమార్ స్థానంలో మండలంలోని వెంకట్రావుపల్లి నుంచి చంద్రశేఖర్ను కేటాయించారు. అతను కూడా పదిహేను రోజులు గడువక ముందే జూలై 23న సోమారంపేటకు బదిలీ చేశారు. ఇల్లంతకుంటకు సంధ్యకు పోస్టింగ్ ఇవ్వగా ఆరు రోజులకే మరోచోటుకు స్థాన చలనం చేశారు. సోమారంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ను ఇల్లంతకుంట గ్రామపంచాయతీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టు ఎంపీవో శ్రీనివాస్ తెలిపారు. ఇల్లంతకుంట జీపీ కార్యదర్శి ఎస్.వరుణ్ బదిలీ అయిన సమయంలో ఆయన స్థానంలో వచ్చిన వెంకట్రావుపల్లి కార్యదర్శి చంద్రశేఖర్ను తిరిగి రెండోసారి కార్యదర్శిగా నియమించడం గమనార్హం. స్థానికంగా చర్చ ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నెల రోజుల్లోనే నలుగురు కార్యదర్శులు బదిలీ కావడం చర్చనీయాంశమైంది. అయితే ఈ సమయంలోనే రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ పలువురు పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్తో మోసం చేస్తున్నట్లు వెలుగుచూసింది. దీంతో స్థానికంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు చర్చకు దారితీసింది. -
గుండెపోటుతో ముగ్గురు మృతి
● మృతుల నేత్రాలు దానం ● ఆరుగురు అంధులకు చూపు కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలో సోమవారం రాత్రి ముగ్గురు గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ పెద్దను కోల్పోయిన విషాదంలో కూడా ఆ మూడు కుటుంబాలు.. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి వాసు ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో ముగ్గురి నేత్రాలను దానం చేశారు. ఆరుగురు అంధులకు కంటి వెలుగులు ప్రసాదించేలా సహకరించారు. ఈ ముగ్గురిలో సమీప బంధువు తాండూరి శ్రీనివాస్ పార్థివదేహాన్ని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం సందర్శించి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ముగ్గురి చూపు.. ఆరుగురికి కంటి వెలుగులు.. జవహర్నగర్కు చెందిన తాండూరి శ్రీనివాస్(49) సింగరేణిలోని ఎస్ఎంఎస్ ప్లాంట్లో స్టేనోగా పనిచేస్తున్నాడు. ఛాతీలో నొప్పి ఉందంటూ కుప్పకూలిపోయాడు. వెంటనే గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. శ్రీనివాస్ నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ కార్పొరేటర్ ఎండీ ముస్తాఫా నివాళి అర్పించారు. అదేవిధంగా దుర్గానగర్కు చెందిన సీనియర్ వ్యాపారి అమృత్లాల్ చౌడ(78) హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన 55 ఏళ్లుగా హార్డ్వేర్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మృతుడి నేత్రాలను కుమారుడు, కోడలు జయప్రకాశ్ చౌడ–కవిత, మనమలు కౌశల్, నివేద్ దానం చేశారు. మరోవైపు.. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి వేల్పుల సాయిలు(70) సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేశారు. మృతుల కుటుంబాలను సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్, స్ఫూర్తి క్లబ్ ప్రతినిధులు అభినందించారు. -
మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి
మానకొండూర్: ఇసుక లారీ ఢీకొని చనిపోయిన మానకొండూర్ మండలం మద్దికుంట గ్రామానికి చెందిన కెక్కర్ల సురేశ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని, ప్రమాదానికి కారణమైన ఊటూరు ఇసుకక్వారీ యజమానులు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై కేసు నమోదు చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. మానకొండూర్లో మంగళవారం మాట్లాడుతూ.. కెక్కర్ల సురేశ్ కరీంనగర్లోని ఓ ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండేవాడన్నాడు. పోచంపల్లి వద్ద ఇసుక లారీని ఢీకొని చనిపోయాడాని తెలిపారు. సురేశ్ను అంబులెన్సులో కరీంనగర్ తీసుకెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. రహదారి వెంట ఇసుక లారీలు నిలిపేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కనీసం పరామర్శించలేదన్నారు. మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్గౌడ్, రవీందర్రెడ్డి, దేవేందర్రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, నెల్లి శంకర్, గుర్రం కిరణ్ గౌడ్, గడ్డం సంపత్, నెల్లి మురళి, అశోక్రెడ్డి పాల్గొన్నారు. క్వారీ యజమాని, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ -
ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ప్రథమ బహుమతి
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని బిర్లా ఓపెన్మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన 3వ తరగతి విద్యార్థి మరియం భాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ప్రథమ బహుమతి సాధించినట్లు పీడీ సుంకరి మురళీధర్ తెలిపారు. ఈ నెల 3న స్వదేశ్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి ప్రథమ బహుమతి, రూ.10వేల నగదు గెలుచుకున్నట్లు వివరించారు. మంగళవారం విద్యార్థిని పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, ప్రిన్సిపాల్ బబితా విశ్వనాథన్ అభినందించారు. -
ఘనత సాధించిన తండ్రీకొడుకులు
పెద్దపల్లిరూరల్: యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఎల్బ్రోస్ 5,642 మీ ఎత్తు (18,150 అడుగులు) పర్వతశిఖరాన్ని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన వివేకానందరెడ్డి, ఆయన తండ్రి మహిపాల్రెడ్డి అధిరోహించారు. దీంతో కలెక్టరేట్లో మంగళవారం తండ్రీకొడుకులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. తండ్రిబాటలో తనయుడు.. మాజీ సైనికోద్యోగి అయిన లెంకల మహిపాల్రెడ్డి ఇప్పటికే పలు దేశాల్లోని 12 పర్వతాలను అధిరోహించి ఇంటర్నేషనల్ మౌంటనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. తన బాటలోనే తనయుడు వివేకానందరెడ్డిని కూడా పర్వతారోహకుడిగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో గతేడాది శిక్షణ ఇచ్చారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని పతాల్సు పర్వతాన్ని వివేకానందరెడ్డి అధిరోహించారు. తండ్రి ఇచ్చిన శిక్షణతోనే యూరప్లో అత్యంత ఎత్తయిన పర్వతాన్ని ఈనెల 3న అధిరోహించారు. సే నో టు డ్రగ్స్ బ్యానర్ ఆవిష్కరణ యూరప్లోని పర్వతాన్ని అధిరోహించిన వివేకానందరెడ్డి.. అక్కడ సే నో టు డ్రగ్స్ అనే బ్యానర్ ఆవిష్కరించారు. గతనెల 28న రష్యాకు చేరుకుని అక్కడే ఐదురోజుల పాటు శిక్షణ పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణంలోనూ మాస్టర్ వివేకానందరెడ్డి ధైర్యసాహసాలతో పర్వతాన్ని అధిరోహించడం అభినందనీయమని కలెక్టర్ అభినందించారు. భవిష్యత్లో మరెన్నో పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించి తెలంగాణ రాష్ట్రానికి, భారతావనికి కీర్తిప్రతిష్టలు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. యూరప్లో ఎత్తయిన శిఖరం అధిరోహణ అభినందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష -
ఆలయ అభివృద్ధి పనులు మొదలుపెట్టాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝావేములవాడఅర్బన్: అంజన్న ఆలయంలో అభివృద్ధి పనులు మొదలుపెట్టాలని అధికారులను కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారంలోని హనుమాన్ ఆలయం వద్ద రూ.31లక్షలతో ఆర్చి, ప్రాకారం, కమాన్ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశారు. కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఆలయ ఈవో శ్రీనివాస్కు, అధికారులకు పలు సూచనలు చేశారు. సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారి మధ్య నుంచి 50 ఫీట్ల దూరం నుంచి ఆర్చి, ప్రాకారం సాలహారంతో కలిసి కమాన్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. టెండర్ ప్రక్రియ ఇటీవల పూర్తయిందని వెల్లడించారు. ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు కోనరావుపేట(వేములవాడ): ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా హెచ్చరించారు. కో నరావుపేటలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం, గౌరీశంకర్ ఫర్టిలైజర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాములలో మంగళవారం తనిఖీ చేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉండాలని సూచించారు. యూరియాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి వివరించాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు. స్వశక్తి మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాలు ఏర్పాటు చేసుకున్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆకాంక్షించారు. ఇందిరా మహిళాశక్తి కింద మర్తనపేటలో విశ్వదర్శనీ గ్రామ సమైక్య ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం కొలనూర్లో కలకుంట రమణ నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. త్వరగా పూర్తి చేసుకుంటుండడంపై అభినందించారు. బేస్మెంట్, రూఫ్లెవల్ కింద ఇప్పటికే రూ.2లక్షలు జమయ్యాయని, ఆర్సీ లెవల్ పూర్తయినందున చివరి బిల్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. తన భర్తకు కంటి సమస్య ఉందని, ఆదుకోవాలని రమణ కోరగా సిరిసిల్లలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్యం చేయించాలని అధికారులకు సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్లపెల్లి ప్రభాకర్, మాజీ సర్పంచ్ వెన్నమనేని వంశీకృష్ణారావు పాల్గొన్నారు. 11 నుంచి నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సిరిసిల్లకల్చరల్: జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. 19 ఏళ్లలోపు పిల్లలతోపాటు వివిధ విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఈనెల 11న ఆల్బెండజోల్ మాత్రలు అందజేయాలని సూచించారు. ఈనెల 18న ముగింపు రోజున ఇంటింటికి వెళ్లి మాత్రలు అందజేయాలన్నారు. డీఎంహెచ్వో రజిత, వేములవాడ ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ పెంచలయ్య, విద్యాధికారి వినోద్కుమార్, సంక్షేమాధికారి లక్ష్మీరాజం, డీపీఆర్వో శ్రీధర్, డీపీవో షరీఫొద్దీన్ పాల్గొన్నారు. -
ఇలాగైతే పాఠాలు వినేదెలా?
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025నెత్తిన బోనాలతో ఆలయంలో భక్తులుబద్దిపోచమ్మ ఆలయం ముందు భక్తులు సిరిసిల్లలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు సాఫీగా పాఠాలు వినలేకపోతున్నారు. పక్కనే ఉన్న రైతుబజార్లో కుళ్లిన కూరగాయలను స్కూల్ ప్రహరీని ఆనుకుని పడేస్తుండడంతో ఆ దుర్వాసన స్కూల్లోకి వ్యాపిస్తోంది. ఫలితంగా ఆ వాసనకు విద్యార్థులు సరిగా పాఠాలు వినడం లేదు. అంతేకాకుండా తెల్లవారుజామున రైతుబజార్కు వచ్చే వ్యాపారులు, రైతులు మూత్ర విసర్జన కూడా స్కూల్ గోడను ఆనుకుని కానిచ్చేస్తుండడంతో మరింత దుర్వాసన వస్తోంది. మున్సిపల్ అధికారులు స్పందించి ఈ దుర్వాసనను దూరం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల న్యూస్రీల్ -
ప్రభుత్వ వైద్యులుగా అన్నదమ్ములు
సిరిసిల్లటౌన్: పుట్టి పెరిగిన ఊరిలోనే ఇద్దరు అన్నదమ్ములు వైద్యులుగా కొలువుదీరారు. సిరిసిల్ల పట్టణం విమల్ థియేటర్ ప్రాంతానికి చెందిన గోల్డ్స్మిత్ పొలాస సురేష్కు ఇద్దరు కుమారులు ఆదిత్య, ఆకాశ్. జిల్లా ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యులుగా మంగళవారం విధుల్లో చేరారు. ఇటీవల ప్రభుత్వం వైద్యుల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎండీ రేడియాలజీ చదివిన ఆదిత్య, ఎండీ జనరల్ మెడిసిన్ చదివిన ఆకాశ్ ప్రభుత్వ వైద్యులుగా ఉద్యోగం సాధించారు. ఇద్దరికీ జిల్లా జనరల్ ఆస్పత్రిలో పోస్టింగ్ రావడంతో తమ పుట్టిన ఊరిలో వైద్యసేవలు అందించే అవకాశం రావడం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పకడ్బందీ విచారణతోనే నేరస్తులకు శిక్ష● ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి వేములవాడ: పకడ్బందీ విచారణతోనే నేరస్తులకు శిక్ష పడే అవకాశం ఉంటుందని ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి పేర్కొన్నారు. పెండింగ్ కేసులు, ప్రస్తుత కేసుల పురోగతి, సబ్డివిజన్ పరిధిలో నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం దిశ నిర్దేశం చేశారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. తరచూ నేరాలకు పాల్పడే వరిపై రౌడీషీట్స్ తెరవాలన్నారు. గంజాయి రవాణా, వినయోగాన్ని అడ్డుకోవాలన్నారు. సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యకు ఊతం
గంభీరావుపేటలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలగంభీరావుపేట(సిరిసిల్ల): పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మెరుగైన వసతుల కల్పన.. బోధన సిబ్బంది కొరత లేకుండా చూస్తుంది. ఇందులో భాగంగా గంభీరావుపేట కేజీ టు పీజీ విద్యాలయంలో వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం శ్రీపీఎం ఉష పథకంశ్రీ(ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్ష అభియాన్) కింద గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు రూ.5కోట్లు మంజూరు చేసింది. కళాశాలలో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గదుల కొరత ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం మంజూరైన నిధులతో నూతన తరగతి గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో గదుల కొరత తీరనుంది. తరగతి గదులు, ల్యాబ్లు తదితర విభాగాల్లో అభివృద్ధి పనులు జరిగి బోధన సౌకర్యాలు మెరుగుపడే మార్గం సుగమమైంది. పెరుగుతున్న విద్యార్థులు గంభీరావుపేట డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వివిధ విభాగాల్లో సుమారు 900 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఓపెన్ యూనివర్సిటీ విభాగంలో మరో 600 మంది చదువుతున్నారు. ఈక్రమంలో పాత భవనంలో తరగతి గదులు, బోధన సామగ్రి సరిపోవడం లేదు. ల్యాబ్లలో సైతం బోధన తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాల శ్రేణి పెంపునకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల అభివృద్ధికి బలమైన బూస్ట్ లభించినట్లయిందని అభిప్రాయపడుతున్నారు. గదుల నిర్మాణానికి రూ.4.30 కోట్లు ప్రస్తుతం ఉన్న భవన సముదాయంపై జీప్లస్ వన్గా కొత్తగా మరో భవన సముదాయం నిర్మించనున్నారు. పీజీ కళాశాల విద్యార్థుల బోధన కోసం నాలుగు తరగతి గదులు, కాన్ఫరెన్స్ల నిర్వహణకు సెమినార్ హాల్ నిర్మించడానికి రూ.4.30 కోట్లు వెచ్చించనున్నారు. పనులు సైతం ప్రారంభమయ్యాయి. బోధన సామగ్రికి రూ.70లక్షలు డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బోధన సామగ్రి సమకూర్చడానికి రూ.70లక్షలు మంజూరయ్యాయి. వీటితో కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, ల్యాబ్ సామగ్రి కొనుగోలు చేయనున్నారు. కళాశాలలో సాంకేతికత, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఈ–లెర్నింగ్ వంటి సాధనాలను ఏర్పాటు చేయనున్నారు. గంభీరావుపేట డిగ్రీ కళాశాల అభివృద్ధికి రూ.5కోట్లు తీరనున్న గదుల కొరత పెరుగనున్న బోధన సిబ్బంది దరిచేరనున్న వసతులుకొత్త కోర్సులు ప్రారంభిస్తాం కొత్తగా వృత్తి నైపుణ్య కోర్సులు, పీజీ కోర్సులు ప్రారంభిస్తాం. నిధుల మంజూరుతో ఇవి ప్రారంభించడానికి అవకాశం ఏర్పడింది. అదే విధంగా తరగతి గదుల సమస్య తీరనుంది. కాన్ఫరెన్స్లు నిర్వహించడానికి ప్రస్తుతం చాలా కష్టంగా ఉంది. సెమినార్ హాల్ పూర్తయితే సమస్య తీరుతుంది. – ప్రొఫెసర్ విజయలక్ష్మి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల -
ఎస్టీడీ బూత్బాయ్ ప్రస్థానం ఆదర్శం
● ‘ఎల్లలు దాటిన పోతుగల్ స్వీట్లు’పై కేటీఆర్ ఎక్స్లో పోస్టు ముస్తాబాద్(సిరిసిల్ల): సాధించాలనే పట్టుదల.. చేసే పనిపై ప్రేమ ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని ఎస్టీడీ బూత్ బాయ్ నుంచి పలు రెస్టారెంట్లకు యజమాని అయిన బాలకృష్ణ ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ‘ఎక్స్’లో మంగళవారం పోస్టు చేశారు. ‘సాక్షి’లో ‘ఎల్లలు దాటిన పోతుగల్ స్వీట్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కేటీఆర్ స్పందించారు. స్వీటెస్టు న్యూస్ ఈరోజు ఉదయమే చూశానని, ఆ కథనం చదవుతుంటే బాలకృష్ణ సాధించి న విజయంపై గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు. ఎస్టీడీలో బూత్బాయ్గా పనిచేసి పోతుగల్.. సిరిసిల్ల నుంచి దుబా య్ వరకు ఎదిగి ఎన్నో రెస్టారెంట్లు స్థాపించి 600 మందికి ఉపాధి కల్పిస్తున్న పోతుగల్ బిడ్డ బాలకృష్ణ సక్సెస్ స్టోరీ అద్భుతమని కొనియాడారు. నిజా యితీతో చేసే ఏ పనైన విజయం వైపు తీసుకెళ్తుందన్నారు. బాలకష్ణ కథనం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. -
విద్య జీవితాన్ని మారుస్తుంది
ఇల్లంతకుంట(మానకొండూర్): విద్య జీవితాన్ని మారుస్తుందని, వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని ఇంటర్మీడియెట్ విద్యామండలి ప్రత్యేకాధికారి రమణారావు పేర్కొన్నారు. ఇల్లంతకుంటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ దేవరాజం ఉన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వర్షాకాలంలో సీజ నల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రజిత సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ఆరోగ్యకేంద్రంలోని రికార్డులు పరిశీలించారు. జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వంద శాతం లక్ష్యాలు సాధించాలన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మండల వైద్యాధికారి సారియా అంజుమ్ పాల్గొన్నారు. మండల పరిషత్లో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల ప్రజాపరిషత్ లో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రారంభమైంది. తంగళ్లపల్లి మండల పరిషత్లోని ఉద్యోగులు మంగళవారం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ వేశారు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ● భవిత సెంటర్ నిర్వాహకురాలు జయలక్ష్మి వేములవాడరూరల్: దివ్యాగులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని భవిత సెంటర్ నిర్వాహకురాలు కత్తి జయలక్ష్మి సూచించారు. వేములవాడ మండల పరిషత్లోని భవిత సెంటర్లో మంగళవారం దివ్యాంగుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. జయలక్ష్మి మాట్లాడుతూ భవిత సెంటర్లో పిల్లలకు ప్రత్యేకంగా అవగాహన, శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టి పెడితే వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంగవైకల్యం ఉన్న పలువురికి భవిత సెంటర్లో ఫిజియోథెరపీ చేయిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ మయూరి, గర్ల్స్ హైస్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం బన్నాజీ తదితరులు పాల్గొన్నారు. గెస్ట్ టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలుసిరిసిల్లటౌన్: జిల్లాలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమ అతిథి ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్సీవో అంజలి తెలిపారు. ఈనెల 11న ఇంటర్వ్యూ, డెమో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జేఎల్ జువాలజి(మహిళ), జేఎల్ కెమిస్ట్రీ(మహిళ), జేఎల్ ఇంగ్లిష్(జనరల్), పీజీటీ మ్యాథ్స్(జనరల్ మహిళ), పీజీటీ ఫిజికల్ సైన్స్(జనరల్, మహిళ), పీజీటీ ఇంగ్లిష్(మహిళ), టీజీటీ ఇంగ్లిష్(జనరల్) సబ్జెక్టుల్లో బోధించేందుకు దరఖాస్తులు కోరుతున్నామన్నారు. బీఎడ్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 11న కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెనకాల మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల పాఠశాలలో ఉదయం 10గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. -
వామ్మో.. వానరదండు
● వణుకుతున్న సిరిసిల్ల ప్రజలు ● ఇళ్లలోకి చొరబడి.. దాడి చేస్తున్న కోతులు ● భయాందోళనలో జిల్లా ప్రజలు ● అధికారులు పట్టించుకోవాలని విన్నపంసిరిసిల్లఅర్బన్: కండ్లుమూసి.. తెరిచేలోపే ఇళ్లలోకి ప్రవేశించి.. దొరికిన వస్తువును ఎత్తుకెళ్తున్నాయి. తరుముదామని ప్రయత్నిస్తే తిరిగి దాడి చేస్తున్నాయి. ఇలా కోతుల దాడులో జిల్లాలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. పల్లె..పట్నం తేడా లేకుండా కోతుల భయాందోళన వీడడం లేదు. కోతులను ఊళ్ల నుంచి తరిమికొడుదామని గత ప్రభుత్వం చేపట్టిన మంకీ ఫుడ్ కోర్టులు జిల్లాలో మొక్కలు లేకుండా మారిపోయాయి. దీంతో కోతులు ఊళ్ల నుంచి వెళ్లిపోవడం కాదు కదా.. వాటి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. జిల్లాలో కోతుల మంద దాడులపై ప్రత్యేక కథనం. దాడులు.. గాయాలు ● సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్, గణేశ్నగర్, బీవైనగర్, పద్మనగర్ ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో పలువురిపై దాడి చేశాయి. ● ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లో ఓ వృద్ధురాలిపై దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. మరో సంఘటనలో కోతులు వెంబడించడంతో ఓ వృద్ధురాలు పరుగెత్తగా ప్రమాదవశాత్తు చేదబావిలో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కాపాడారు. ● ముస్తాబాద్ మండలంలోనూ కోతుల మంద దాడి చేయడంతో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. వానర విధ్వంసం గుంపులుగా వస్తున్న కోతులు పెంకుటిండ్లు కనిపిస్తే చాలు పెంకులు తీసి కింద పడేస్తున్నాయి. ఒకప్పుడు ఏళ్లకేళ్లు మన్నిక వచ్చే పెంకుటిండ్లు నేడు రెండు, మూడేళ్లలోనే ఉరుస్తున్నాయి. పెంకులు పగిలిపోతున్నాయి. అంతేకాకుండా ఇండ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయి. కోతుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు చాలా కుటుంబాలు ప్రధాన ద్వారాలు ఎప్పుడూ మూసివేసి ఉంచుతున్నాయి. మరికొందరేమో జాలీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది అదనపు ఖర్చు అయినా కోతుల బెడద నుంచి రక్షణకు తప్పనిసరిగా పెట్టుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్, రాచర్లగొల్లపల్లిల్లో పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్కో కోతికి రూ.500 చొప్పున చెల్లించి పట్టించారు. దీని ద్వారా ఆయా గ్రామాల్లో ఏడాది, రెండేళ్లపాటు కోతుల బెడద లేకుండా పోయింది. ఇలాంటి చర్యలు మిగతా గ్రామాల్లోనూ తీసుకుంటే కోతుల నుంచి కొంత మేరకు రక్షణ కల్పించుకున్న వారవుతారు. కోతుల బెడదపై అటవీశాఖ అధికారికి ఫోన్ చేయగా స్పందించలేదు.భయపడుతున్నాం ఆడవుల నుంచి కోతులు పట్టణాలు, పల్లెల్లోకి వస్తున్నాయి. ఇంటి ముందు పండ్ల చెట్లు ఉంటే చాలు గంటల తరబడి వాటిపైనే ఉంటున్నాయి. కోతులతో అందరం భయపడుతున్నాం. ఎండాకాలంలో మాత్రమే వచ్చే కోతులు ఇప్పుడు అన్ని కాలాల్లో కనిపిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి. – ప్రశాంత్, అభికానగర్, సిరిసిల్లఇంట్లోకి చొరబడుతున్నాయి మా పద్మనగర్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఉదయాన్నే ఇండ్లపైకి చేరుకుంటున్నాయి. డోరు తీసి ఉంటే చాలు ఇంట్లోకి చొరబడి ఏది కనిపిస్తే దాన్ని ఎత్తుకెళ్తున్నాయి. నిత్యావసర సరుకులు దక్కడం లేదు. వాటిని బెదిరిస్తే మీదికొస్తున్నాయి. కోతుల బెడద లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – బంక శంకర్, పద్మనగర్, సిరిసిల్ల -
మార్కెట్యార్డు నిర్మించాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలో సమీకృత మార్కెట్యార్డు నిర్మించాలని కోరుతూ బీజేపీ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. మార్కెట్యార్డు కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.50లక్షలు మంజూరు చేసిందని, అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ రూ.50లక్షలు మంజూరు చేసి ర్యాలీలు నిర్వహించి క్షీరాభిషేకాలు చేసి శిలాఫలకం ఏర్పాటు చేశారన్నారు. నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదన్నారు. మండలాధ్యక్షుడు కోడె రమేశ్, జిల్లా అధికార ప్రతినిధులు దేవసాని కృష్ణ, ప్రసాద్రెడ్డి, ప్రధాన కార్యదర్శి విగ్నేష్గౌడ్ ఉన్నారు. -
బీసీ బిల్లుకు మోకాలడ్డుతున్న బీజేపీ
● 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రంతో కొట్లాడుతాం ● ధర్నాకు ఢిల్లీ వెళ్తున్నాం ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సిరిసిల్లటౌన్: బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్రంలో అధికార పార్టీ మోకాలడ్డుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. బీసీలకు విద్య, ఉపాధి రంగాల్లో 42శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మూడు రోజులపాటు ఢిల్లీలో నిరసన తెలపనున్నట్లు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలో సై అంటూనే కేంద్రంలో నై అంటున్న బీజేపీ నాయకుల వైఖరిని తప్పుబట్టారు. బీసీల మద్దతుతో సాగుతున్న కాంగ్రెస్ పోరాటం ఫలిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బుర్ర నారాయణగౌడ్, ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించండి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● ప్రజావాణిలో 189 దరఖాస్తుల స్వీకరణసిరిసిల్ల అర్బన్: ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 189 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో పెట్టవద్దని సూచించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మపూర్కు చెందిన కొలకాని శంకరయ్య, లస్మయ్య ఇద్దరు అన్నదమ్ములకు చెందిన 28 గంటల వారసత్వ భూమిని లస్మయ్య కొడుకు రవి..శంకరయ్యకు తెలియకుండా 2016లో ధరణిలో పట్టా చేసుకున్నాడు. దీంతో శంకరయ్య గతేడాది కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారసత్వ భూమిపై విచారణ చేసి ఇద్దరికీ సమానంగా పంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదికను సిరిసిల్ల ఆర్డీవోకు పంపగా అక్కడ పెండింగ్లో ఉంది. ఈక్రమంలో తన భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు సోమవారం ప్రజావాణిలో శంకరయ్య ఫిర్యాదు చేయగా వెంటనే సిరిసిల్ల ఆర్డీవోను పిలిచి తాను ఆదేశించినా భూ సమస్యను పరిష్కరించరా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.తీగలను తొలగించాలి మాది వేములవాడ రూరల్ మండలం మల్లారం. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నా సొంత స్థలంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించగా పై నుంచి హైటెన్షన్ కరెంట్ తీగలు వెళ్తుండడంతో ఇంటి నిర్మాణం నిలిచిపోయింది. నా ఇంటిపైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లను తొలగించి నాకు న్యాయం చేయండి. – మారుమొకం దేవరాజు, మల్లారంసారూ పెన్షన్ ఇప్పించరూ.. నాకు చీమకుట్టి కాలుకు పుండుగా మారి ఇన్ఫెక్షన్ అయింది. ఫలితంగా నా ఎడమ కాలు మోకాలు వరకు తొలగించారు. సొంతిల్లు లేక అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. సంవత్సరం నుంచి పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నాను. ఇప్పటికై నా నాకు పెన్షన్ ఇప్పించి నా కుటుంబాన్ని ఆదుకోవాలి. – అడ్డగట్ల పద్మ, సాయినగర్, సిరిసిల్ల -
బాధితులకు భరోసాగా గ్రీవెన్స్ డే
● ఎస్పీ మహేశ్ బి గీతే సిరిసిల్ల క్రైం: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మ హేశ్ బి గీతే పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 28 ఫిర్యాదులు సోమవారం స్వీకరించినట్లు వివరించారు. డీటీవో ఆఫీస్ ఎదుట నిరసన సిరిసిల్లటౌన్: చర్యలు తీసుకోవడంలో జిల్లా రవాణాశాఖ అధికారి జాప్యం చేస్తున్నారంటూ పౌర సంక్షేమ సమితి ప్రతినిధులు సోమవారం డీటీవో ఆఫీస్ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ సిరిసిల్ల సెస్ చైర్మన్ తన ప్రైవేటు వాహనంపై ప్రభుత్వ వాహనంగా బోర్డు పెట్టుకోవడంపై గత జూన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు సెస్చైర్మన్కు నోటీస్ ఇచ్చినా బోర్డు తీయకుండా వాహనాన్ని వాడుకుంటున్నట్లు వెల్లడించారు. డీటీవో నోటీస్తో సరిపెట్టకుండా వెంటనే స్పందించి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్, ప్రతినిధులు కుసుమ గణేష్, వేముల వెంకటేశం, సిద్దిరాల సారయ్య పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నిలకు సిద్ధంగా ఉండాలి బోయినపల్లి/వేములవాడరూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పోలీస్ అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి సూచించారు. బోయినపల్లి, వేములవాడరూరల్ పోలీస్ స్టేషన్లను సోమవారం తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, వారికి కేటాయించిన కిట్ ఆర్టికల్స్, జనరల్ డైరీ, స్టేషన్ రికార్డులు పరిశీలించారు. వాహనాల తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజకుమార్, ఏఎస్సైలు రాజయ్య, మల్లేశం సిబ్బంది ఉన్నారు. బాధిత వృద్ధుడిని పరిశీలించిన వైద్యాధికారులు రుద్రంగి(వేములవాడ): పీఎంపీ ఇంజక్షన్ వేయడంతో చేతికి సెప్టిక్ అయిన వృద్ధుడిని ప్రభు త్వ వైద్యాధికారులు సోమవారం పరిశీలించారు. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘పీఎంపీ నిర్లక్ష్యం.. వృద్ధుడికి శాపం’ కథనానికి వైద్యాధికారులు స్పందించారు. రు ద్రంగిలోని రోమాల గంగారాం ఇంటికి వెళ్లిన గాయాన్ని పరిశీలించారు. సెప్టిక్కు గల కారణాలు, వృద్ధుడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రపోటీల్లో ప్రతిభ సిరిసిల్లటౌన్: బీవైనగర్ షాదీఖానాలో సమూరై గోజుర్యో కరాటే అకాడమీ ఆధ్వర్యంలో రెండో రాష్ట్ర స్థాయి కరాటే టోర్నీ రెండు రోజుల క్రితం జరిగాయి. సిరిసిల్ల ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు కటాస్లో బంగారు, వెండి పతకాలు సాధించారు. వీరిలో వి.హరిణి, ఆర్.వర్షిత, ఇ.శ్రీచంద్ర బంగారు పతకాలు గెలుపొందగా వై.రీత్య, వై.శాన్వి వెండి పతకాలు సాధించారు. స్కూల్ హెచ్ఎం చకినాల శ్రీనివాస్ సోమవారం విద్యార్థుల అభినందన సభలో మాట్లాడుతూ విద్యార్థులు మ రిన్ని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని మెరుగైన ప్రతిభ కనబరుస్తూ చదువులో కూడా ముందుండాలని కోరారు. విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ నాగుల కనకయ్యను, ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. పీడీ డేవిడ్ సన్, ఉపాధ్యాయులు అభినందించారు. -
చిక్కితే చిలుము వదులుతోంది!
● అక్రమ మైనింగ్పై అధికారుల ఉక్కుపాదం ● వాహనాలపై కేసులు.. జరిమానాలు ● నిఘా పెట్టి.. కట్టడి చేస్తున్న అధికారులు ● అయినా మారని అక్రమార్కులుసిరిసిల్ల: జిల్లాలో అక్రమంగా సాగుతున్న మైనింగ్పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గతానికి భిన్నంగా జిల్లాలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, టాస్క్ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేస్తున్నారు. రాత్రి వేళల్లోనూ దాడులు చేస్తూ అక్రమార్కులను కట్టడి చేస్తున్నారు. వేములవాడ అర్బన్ మండలం పరిధిలో గుట్టల్లో రాత్రి వేళల్లో ‘పుష్ప’ సినిమా తరహాలో భారీ ఎత్తున టిప్పర్లు, ట్రాక్టర్లలో జేసీబీలతో మట్టి, మొరం నింపుతూ.. అక్రమ రవాణాకు తెరలేపారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సిరిసిల్ల టాస్క్ఫోర్స్ సీఐ నటేశ్ ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు దాడి చేసి అక్రమ మైనింగ్ గుట్టును రట్టు చేశారు. భారీ ఎత్తున వాహనాలు పట్టుబడ్డాయి. జిల్లా వ్యాప్తంగా సహజ వనరులు ధ్వంసమైపోతుంటే కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గీతే ఆదేశాలతో అక్రమ మైనింగ్పై ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనల మేరకు అనుమతులు జిల్లాలో ప్రభుత్వ పథకాలకు, నిర్మాణాలకు నిబంధనల మేరకు పరిమితుల్లో అనుమతులు ఇస్తున్నా రు. మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతులతో రవాణా జరగాల్సి ఉండగా.. అనుమతులు లేని మ ట్టి, మొరం దందా సాగుతోంది. విచ్చలవిడిగా సాగే అక్రమ దందాను కట్టడి చేసే లక్ష్యంతో జిల్లా అధి కారులు అక్రమమైనింగ్పై కఠిన చర్యలు తీసుకుంటుంది. సెలవు రోజుల్లో అనుమతులు ఇవ్వవద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు పని దినాల్లోనే రవాణాకు అనుమతులు ఇస్తున్నారు. ఎక్కడికక్కడే పట్టివేత ● జూన్ 28న ఇందిరమ్మ ఇళ్లకు అని వాహనాలకు బ్యానర్ కట్టి వేములవాడ రూరల్ మండలంలోని కొడిముంజ–అనుపురం పరిసరాల్లో అక్రమ రవాణా చేస్తున్న 10 టిప్పర్లు, రెండు ట్రాక్టర్లు, రెండు జేపీబీలు, రెండు హిటాచి యంత్రాలను పట్టుకున్నారు. ● జూలై 21న ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో హిటాచి యంత్రాన్ని పట్టుకున్నారు. ● 12న ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో జేసీబీ, ఐదు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ● 10న ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో జేసీబీ, ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ● జూలై 22న ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో హిటాచీ, జేసీబీ, ఒక్క టిప్పర్ను సీజ్ చేసి ఎస్పీ ఆఫీస్కు తరలించారు. జంకని అక్రమార్కులు అనుమతి లేకుండా మొరం, మట్టి తరలిస్తున్న 691 వాహనాలను మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. వాహనాలను సీజ్ చేసి నెలల తరబడి విడుదల చేయకుండా కట్టడి చేస్తేనే అక్రమార్కులు ఆర్థికంగా నష్టపోయి, వాహనాలు చెడిపోయి ఇబ్బందులు పడుతున్నారు. కానీ అధికారులు విధించిన జరిమానాలకు జంకడం లేదు. జిల్లాలో అక్రమార్కులకు గతంలో రూ.1,02,026 మేరకు జరిమానా విధించారు. మరో సందర్భంలో నలుగురు అక్రమార్కులకు రూ.2,87,515 జరిమానా విధించి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. అయినా అక్రమార్కుల్లో మార్పు రాకపోవడంతో వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇవీ సీజ్ చేయబడిన వాహనాలు. వీటిని ఎస్పీ ఆఫీస్ ఆవరణలో ఉంచారు. ట్రాక్టర్లు, జేసీబీలు, టిప్పర్లు, వ్యాన్లు ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇటీవల పట్టుకుని సీజ్ చేశారు. అక్రమంగా మట్టి, మొరం తరలిస్తే జరిమానాలు విధించకుండా వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలు సైతం నెలల తరబడి విడుదల కావడం లేదు. ఎస్పీ ఆఫీస్, ఠాణాల్లో ఉంటున్న వాహనాల టైర్లలో గాలిపోయి, చిలుముపడుతున్నాయి.ఎవరిని వదిలిపెట్టం అనుమతి లేకుండా మైనింగ్కు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టేది లేదు. అనుమతి తీసుకుని మట్టి, మొరం, ఇసుక తరలించాలి. కానీ సెలవు రోజుల్లో, రాత్రి వేళల్లో అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఇందిరమ్మ ఇళ్లకు అని బ్యానర్ కట్టి అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాం. అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా అక్రమ మైనింగ్ నిరోధానికి చర్యలు తీసుకుంటుంది. అనుమతులు లేకుంటే సీజ్ చేస్తాం. – సందీప్కుమార్ ఝా, కలెక్టర్ఇది వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం వద్ద గుట్ట నుంచి అక్రమంగా మొరం తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడిన ట్రాక్టర్లు. ఇక్కడ అనుమతి లేకుండానే జేసీబీతో మొరం నింపుతూ తరలిస్తున్నారు. పోలీసులు ఈ సమాచారం అందుకుని గుట్టల్లో సాగుతున్న అక్రమదందాను అడ్డుకున్నారు. వాహనాలను సీజ్ చేసి, మొరం రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● అంబేడ్కర్నగర్ అర్బన్ పీహెచ్సీ తనిఖీసిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిపించాలని, డెలివరీల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, మందుల రిజిస్టర్, వ్యాక్సిన్ గది, మందులు ఇచ్చే గదిని, అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలు ప్రభుత్వ దవాఖానాల్లో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ఆసుపత్రికి వచ్చే వారికి వివరించాలని సూచించారు. ఆస్పత్రి డాక్టర్ అభినయ్, వైద్య సిబ్బంది ఉన్నారు. -
కోడెలు.. రాజన్న ప్రసాదం
పెద్దచెరువు కెనాల్తో సాగునీరు● జూన్లో 570 జతలు పంపిణీ ● అర్హత గల రైతులకు అందజేత ● నిరంతర ప్రక్రియ అంటున్న అధికారులు ● ఆసక్తి చూపుతున్న రైతులుముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ పెద్ద చెరువు ద్వారా సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని నీటిపారుదలశాఖ డీఈఈ రవికుమార్ పేర్కొన్నారు. ముస్తాబాద్లో పెద్దచెరువు ఎడమ కాల్వమరమ్మతు పనులను సోమవారం అధికా రులు పరిశీలించారు. డీఈ రవికుమార్ మాట్లాడుతూ పెద్ద చెరువు ఎడమ కెనాల్ మరమ్మతు పనులు చేపట్టామన్నారు. దీని ద్వారా 200 ఎకరాలకు సాగునీటిని అందించవచ్చన్నారు. పనులు శరవేగంగా పూర్తి చేసి, వానకాలం పంటలకు నీటిని విడుదల చేస్తామన్నారు. గత ఇరవై ఏళ్లుగా కెనాల్ లేకపోవడంతో సాగునీటిని అందించే పరిస్థితిలో లేదన్నారు. ఏఈ వంశీకృష్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ రాజు ఉన్నారు.● డీఈఈ రవికుమార్ -
మూడు పంటలకు సాగునీరు
● రామగుండం ఎత్తిపోతల ప్రారంభం ● అంతర్గాంలో గోదాంల నిర్మాణానికి కృషి ● మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిరామగుండం/ధర్మారం: రామగుండం ఎత్తిపోతల ద్వారా ఏటా మూడు పంటలకు సాగునీరు అందుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ శివారులో రూ.75 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతలను మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివా రులో రూ.45.15 కోట్లతో చేపట్టిన ఐటీఐ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు, పంపుహౌస్లను రా మగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నిర్మించార ని, ఒక్క ఎకరాకూ నీటిని వినియోగించుకోలేదన్నా రు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ రా మగుండాన్ని పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మా ట్లాడుతూ అంతర్గాంలో గోదాంల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం సంపూర్ణంగా అమలవుతోందన్నారు. ప్రయాణికుల అవసరం మేరకు మరో 16 బస్సులు కేటాయించాలని మక్కాన్సింగ్ కోరగా సానుకూలంగా స్పందించారు. ధర్మారంలో ఏర్పాటు చేసిన మరో కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. మంత్రి లక్ష్మణ్కుమార్ విన్నపం మేరకు పత్తిపాక శివారులో శ్రీలక్ష్మీనర్సింహస్వామి రిజర్వాయర్ నిర్మిస్తామని, డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు కేటాయించిందని తెలిపారు. -
డుమ్మాలకు చెక్ పడేనా !
● ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరుకు కొత్త సాఫ్ట్వేర్ ● ఎఫ్ఆర్ఎస్తో ఇష్టారీతి సెలవులకు స్వస్తి ● మూడేళ్ల క్రితం విద్యార్థులకు.. ఇప్పుడు టీచర్లకు అమలుసిరిసిల్ల ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం.. నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సన్నబియ్యం మధ్యాహ్నభోజనం.. ఉచిత పుస్తకా లు.. నోట్బుక్స్ అందిస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మూడేళ్ల క్రితం విద్యార్థుల హాజరును ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టగా.. తాజాగా టీచర్ల హాజరును సైతం ఆన్లైన్ విధానం ఎఫ్ఆర్ఎస్(ఫేజ్ రికగ్నిషియన్ సిస్టమ్)ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా సమయానికి స్కూల్కు రావడంతోపాటు సమయం ముగిసే వరకు పాఠశాలలోనే ఉండాల్సి ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందనుందని ప్రభుత్వం భావిస్తోంది. 511 స్కూళ్లలో.. జిల్లాలోని 511 స్కూళ్లలో 39,087 మంది విద్యార్థులకు, 2,312 మంది ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానం అమలులో ఉంది. దీని ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పక్కాగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది ఫిబ్రవరి నుంచి పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎఫ్ఆర్ఎస్ హాజరును అమలు చేస్తున్నారు. అక్కడ విజ యవంతం కావడంతో జిల్లాలో రెండు రోజుల నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్స్కూల్స్, యూఆర్ఎస్, టీజీఆర్ఈఐఎస్లలో అమలు చేస్తున్నారు. డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు తీసుకుంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్) యాప్ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్ ద్వారా హెచ్ఎంలు, టీచర్లు, నాన్టీచింగ్ ఉద్యోగుల హాజరు అమలు చేస్తున్నారు. హెచ్ఎంలు తమ సెల్ఫోన్లోని డీఎస్ఈ యాప్లో టీ చింగ్ మాడ్యుల్ టీచర్స్, నాన్టీచింగ్ మాడ్యుల్లో నాన్టీచింగ్ సిబ్బందిని రిజిస్ట్రేషన్ చేయాలి. ఫొటో తీసి వారి వివరాలు, పాఠశాల సమయం అప్లోడ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది తమ సెల్ఫోన్లలో సంబంధిత యాప్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తీసుకోవచ్చు. పాఠశాల ఆవరణలో ఉండి హాజరువేసేలా జియోట్యాగింగ్ చేశారు. సెలవు పెడితే తప్పనిసరిగా యా ప్లో రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించిన సమయానుసారంగానే ఈ యాప్లో హాజరు నమోదు చేసుకోవచ్చు. హాజరుపై రోజువారీ సమీక్ష ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ను జిల్లా విద్యాధికారితోపాటు కలెక్టర్ ప్రతీరోజు సమీక్ష చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కలెక్టర్ ప్రతిరోజు ఏదో ఒక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పుడు టీచర్ల ఎఫ్ఆర్ఎస్ హాజరును పర్యవేక్షించే అవకాశం మెండుగా ఉన్నాయని ఏదైనా తప్పు జరిగితే అప్పటికప్పుడే చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. డీఈవో కార్యాలయాల్లో డ్యాష్బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల పనివేళలు ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు -
‘పత్తిపాక’కు అడుగులు
● డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు ● 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవకాశంసాక్షి, పెద్దపల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని జిల్లాకు అందించేందుకు ప్రతిపాదనలో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీటి స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కోసం ప్రతిపాదించిన పత్తిపాక రిజర్వాయర్ డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీకి ప్రభుత్వం రూ.1.10 కోట్లు మంజూరు చేసింది. 7.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. అక్కడినుంచి నేరుగా కాకతీయ కాలువలోకి పంపిస్తారు. రేవెల్లి సమీపంలోని హెడ్రెగ్యులేటర్ ద్వారా ఎస్సారెస్సీ డీ–83, డీ–86 కాలవలకు అందిస్తారు. తద్వారా ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2.40లక్షల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 10వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాథమిక అంచనాలు సిద్ధం.. ప్రతిపాదిత ప్రాజెక్టును మంత్రులు శ్రీధర్బాబు, అ డ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణా రావు, మక్కాన్సింగ్ అధికారులతో కలిసి గతంలోనే పరిశీలించి సమీక్షించారు. రిజర్వాయర్ ఎంత సా మర్థ్యంతో నిర్మించాలి..? ఎన్ని ఎకరాలు ముంపునకు గురవుతాయి..? ప్రభుత్వ భూములు, పట్టా భూములు ఎన్ని..? తదితర అంశాలపై ఇప్పటికే నీటి పారుదల శాఖ అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించారు. 7.78 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే 1,700 ఎకరాలు ముంపునకు గురవుతాయని అంచనాకు వచ్చా రు. ఇందులో 400 ఎకరాలు అటవీ, 1,300 ఎకరాలు పట్టా భూములు సేకరించాల్సి ఉంటుంది. -
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
● ఈవో రాధాభాయి వేములవాడ: ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఆలయ ఈవో రాధాభాయి ఉద్యోగులను హెచ్చరించారు. ఆలయంలోని పలు విభాగాలను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రధానాలయంలోని చెక్పోస్టులు, ప్రసాదాల తయారీ విభాగం, ప్రసాదాల విక్రయ విభాగం, ప్రొటోకాల్ విభాగం, సెంట్రల్ గోదాం, బుకింగ్ కౌంటర్, ప్రచారశాఖ, భక్తుల సమాచార కేంద్రాల్లో నిర్వహణను పరిశీలించారు. రికార్డులు సరిగ్గా నిర్వహించాలని సూచించారు. -
వాహనాల రాకపోకలపై నియంత్రణ
సిరిసిల్ల: కలెక్టరేట్లో వాహనాల రాకపోకలపై నియంత్రణ, నిఘా ఏర్పాటు చేశారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా చొరవతో సెక్రటేరియట్ తరహాలో కలెక్టరేట్లో వాహనాల రాకపోకలు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్లోని వచ్చే ప్రతీ వాహనం నంబరును ప్రవేశద్వారం వద్దనే సెక్యూరిటీ సిబ్బంది బుక్లో నమోదు చేస్తారు. వారు అనుమతి ఇస్తూ ప్రధాన బారీకేడ్ను తెరిస్తేనే వాహనం కలెక్టరేట్లోకి ప్రవేశిస్తుంది. సెక్యూరిటీ సిబ్బంది బారీకేడ్లను తిరిస్తేనే వాహనాలు లోనికి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు వీలవుతుంది. సెల్లార్లో పార్కింగ్ గతంలో సెల్లార్లోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు మూడు మార్గాలు ఉండేవి. నేరుగా వాహనాలు లోనికి వెళ్లి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పార్కింగ్ చేసేవారు. కానీ ఇప్పుడు లోనికి వెళ్లేందుకు ఉండే రెండు మార్గాలను మూసివేశారు. ఒకే మార్గం ద్వారా లోనికి వాహనాలను అనుమతిస్తున్నారు. అదీ కూడా ఐరన్ గేటును ఏర్పాటు చేశారు. ఐరన్ గేటు మూసి వేస్తే లోనికి వెళ్లేందుకు వీలు లేదు. బయటకు వచ్చే మూడు మార్గాల్లో రెండింటిని మూసివేసి, ఒకే మార్గాన్ని ఐరన్ గేటుతో కట్టడి చేశారు. సెల్లార్లో ద్విచక్రవాహనాలు, కార్ల పార్కింగ్కు ప్రత్యేక స్థలాలు కేటాయించారు. అధికారుల వాహనాలకు క్యూఆర్ కోడ్ కలెక్టరేట్లోకి నిత్యం వెళ్లే అధికారుల వాహనాలకు క్యూఆర్ బార్ కోడింగ్తో కూడిన స్టిక్కర్లను జారీ చేయనున్నట్లు సమాచారం. అధికారుల వాహనాలు రాగానే ప్రధాన గేటు వద్దనే ఆటోమేటిక్గా స్కానింగ్ చేసి బారీకేడ్ తెరుచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజిటర్స్ వాహనాలపై నిఘా, నియంత్రణ ఉంటుందని తెలుస్తోంది. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్లకు ఒకే మార్గం ఉండడంతో కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. జిల్లా అధికారుల వాహనాల రాకపోకలు, ఉద్యోగుల వాహనాల రాకపోకలు, విజిటర్స్ వాహనాలపై పక్కాగా నిఘా ఉండేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేని విధంగా సచివాలయం తరహాలో కలెక్టరేట్లో ప్రత్యేకమైన రక్షణ ఏర్పాట్లు చేయడం విశేషం. కార్లు, బైక్ల పార్కింగ్కు ప్రత్యేక స్థలం అధికారుల వాహనాలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు కలెక్టరేట్లో పటిష్ట ఏర్పాట్లు -
పోస్టర్లు ఆవిష్కరణ
సిరిసిల్లటౌన్: ఆమెరికా నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సోషలిస్టు క్యూబా ప్రజలకు అండగా నిలుద్దామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ క్యూబాకు అండగా సంఘీభావం తెలిపాలని కోరారు. గురజాల శ్రీధర్, అన్నల్దాస్ గణేశ్, గడ్డం రాజశేఖర్, బింగి సంపత్, పాల్గొన్నారు. రేషన్కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ సిరిసిల్లఅర్బన్: కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో రేషన్కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూపరెడ్డి పేర్కొన్నారు. పెద్దూరులో ఆదివారం ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ రేషన్కార్డు రాకపోతే సంబంధిత రేషన్డీలర్ల వద్ద పేర్లు నమోదు చేసి, మీసేవ కేంద్రం ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నాయకులు చెన్నమనేని కీర్తి కమలాకర్రావు, ర్యాకం రమేశ్, కమలాకర్రావు పాల్గొన్నారు. పింఛన్ల పెంపుపై పోరాటం ఆగదు బోయినపల్లి(చొప్పదండి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఆవునూరి ప్రభాకర్ కోరారు. మండల కేంద్రంలో ఆదివారం వృద్ధులు, వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విధంగా వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత కార్మికులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. పింఛన్ల సాధనకు ఈనెల 13న మంద కృష్ణ మా దిగ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపడుతున్నట్లు తెలిపారు. ఖానాపూర్ లక్ష్మణ్, ఎలగందుల భిక్షపతి, జిల్లా కో–కన్వీనర్ కత్తెరపాక ర వీందర్, అక్కనపల్లి పరశురాములు, కన్నం సాగర్, ఇల్లందుల రాజు, కొంకటి రమేశ్ పాల్గొన్నారు. బీసీ నినాదం హోరెత్తిస్తాం సిరిసిల్లటౌన్: బీసీ నినాదాన్ని దేశవ్యాప్తంగా హోరెత్తిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో జిల్లా అధ్యక్షుడు వీరబోయిన మల్లేశ్యాదవ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 7న గోవాలో జరిగే ఓబీసీ పదో మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈమేరకు కరపత్రాలు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తడక కమలాకర్, బండారి బాల్రెడ్డి, బట్టు ప్రవీణ్, బోయిన శ్రీనివాస్, ప్రసాద్, కొండయ్య, విఠల్, రవీందర్ పాల్గొన్నారు. -
కార్తెలు కరిగిపోతున్నాయ్
● ఎగువమానేరు నిండేదెన్నడో.. ● ఆకాశం వైపు అన్నదాతల చూపు ● ఆగస్టుపైనే ఆశలుగంభీరావుపేట(సిరిసిల్ల): కార్తెలు కరిగిపోతున్నాయి. వర్షాలు కురవడం లేదు. కాలం కలిసిరావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం కమ్ముకుంటున్న మేఘాలు వర్షించకపోవడంతో రైతులు నైరాశ్యంలో మునిగిపోయారు. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అప్పుడప్పుడు వానలు కురుస్తున్నా వరదలు రాక చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి నీరు చేరడం లేదు. బావులు, బోర్లు ఆధారంగా కొంతమంది రైతులు పొలాలను దున్ని నాటువేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎలాంటి నీటి ఆధారం లేని రైతులు మిన్నకుండిపోతున్నారు. వర్షాలు లేకపోతే బావులు, బోర్లు కూడా ఇంకిపోయి పంటలు ఎండిపోతాయేమోనని భయాందోళన చెందుతున్నారు. ఆగస్టులోనైనా వర్సాలు కురుస్తాయేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. వరప్రదాయిని ఎగువమానేరు గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాలకు నర్మాల ఎగువమానేరు ప్రధాన ఆధారం. దీనిపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు వర్షాలు అంతంతే కురిశాయి. వచ్చే నెలరోజుల్లో ప్రాజెక్టు నిండితేనే పంటల సాగుకు ఢోకా ఉండదని భావిస్తున్నారు. లేకపోతే వానాకాలం సాగు లేనట్టేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 31 అడుగులు కాగా ప్రస్తుతం 20 అడుగుల నీరు మాత్రమే ఉంది. రెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల జలాశయంలో ప్రస్తుతం ఒక టీఎంసీ మాత్రమే ఉంది. ఎగువ ప్రాంతాలైన కూడవెల్లి, పాల్వంచవాగుల నుంచి వరద రావడం లేదు. గతంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా కాళేశ్వరం జలాలు వచ్చాయి. దీంతో ప్రాజెక్టు జలకళతో ఉండేది. కానీ ఈసారి మల్లన్నసాగర్ రిజర్వాయర్లోనూ నీరు లేదు. -
సొంతూరిపై మమకారంతో..
రుద్రంగి(వేములవాడ): విద్య..ఉద్యోగం..ఉపాధి కోసం పట్నం బాట పట్టిన వారంతా.. పల్లెల్లో గూడు నిర్మించుకుంటున్నారు. పుట్టిన ఊరు.. సొంత మనుషుల మధ్య గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. నెలలో ఒక్కసారైన సొంతూరికి వస్తూ అందరిని పలకరిస్తూ.. ఆనందంగా గడుపుతున్నారు. హైదరాబాద్, ముంబయి, విదేశాలల్లో స్థిరపడిన వారు రుద్రంగి మండలంలోని గిరిజనతండా గ్రామాల్లో అందమైన భవంతులు నిర్మించుకుంటున్నారు. ఉండేందుకు నివాసాలతోపాటు ఊరి అభివృద్ధికి తోడ్పాటుగా నిలుస్తున్నారు. పట్నంలో ఉద్యోగం చేస్తూ.. పల్లెలపై మమకారం చూపుతున్న వారిపై ప్రత్యేక కథనం. సొంత మనుషుల మధ్య ఉండాలనే.. రుద్రంగి మండలం బడితండా గ్రామం తూక్యతండాకు చెందిన గుగులోతు రఘుపతి నాయక్ జాదవ్ వృత్తి రీత్య వైద్యుడు. హైదరాబాద్లో వైద్యసేవలు అందిస్తూ అక్కడే స్థిరపడ్డారు. సొంతూరిపై ప్రేమతో గ్రామాభివృద్ధికి ఆర్థికంగా తోడ్పాటుగా నిలుస్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు గ్రామం నుంచి ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. సర్పంచ్ తండాగా పేరు మార్పు ● రుద్రంగి మండలం సర్పంచ్తండాకు చెందిన నరహరినాయక్ ప్రభుత్వ ఇంజినీర్గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందారు. గ్రామానికి సేవ చేయాలని ఉద్దేశం, చిన్ననాటి మిత్రులతో గడపాలనే లక్ష్యంతో సొంతూరిలో ఇల్లు నిర్మించుకున్నాడు. 1987 నుంచి 1993 వరకు ఉమ్మడి మానాల గ్రామపంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. నరహరినాయక్ సర్పంచ్ కావడంతో వారి గ్రామానికి సర్పంచ్తండాగా పేరు పెట్టారు. పదవీకాలం ముగిసిన తర్వాత ఉద్యోగంలో చేరారు. ఉద్యోగ విమరణ పొందిన తర్వాత సొంతూ రిలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఊరి సేవలో.. ● ఇటీవల గ్రామంలో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు వైద్యుడు గుగులోతు రఘుపతినాయక్జాదవ్ దాదాపు రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. మానాలలోని బడితండాలో యువకులకు ప్రోత్సాహం అందించేందుకు క్రీడాపోటీలు నిర్వహించారు. రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ప్లానింగ్ ఆఫీసర్ నరహరినాయక్ సైతం గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరి స్ఫూర్తితో గ్రామానికి చెందిన మరింత మంది సేవా కార్యక్రమాలకు ముందుకొస్తున్నారు. పట్నంలో జాబు.. పల్లెల్లో గూడు పుట్టిన ఊరిపై ప్రేమతో పల్లెబాట గ్రామాభివృద్ధికి సహకారం ఇది బడితండా గ్రామపంచాయతీ పరిధిలో డాక్టర్ గుగులోతు రఘుపతినాయక్ జాదవ్ నిర్మించుకుంటున్న ఇల్లు. రఘుపతినాయక్జాదవ్ హైదరాబాద్లో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పుట్టిన ఊరితో అనుబంధాన్ని మరింత పదిలం చేసుకునేందుకు తన సొంత భూమిలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. పండుగలు, వారాంతపు రోజుల్లో ఊరికి వచ్చి వెళ్తుంటారు. ఈ ఇల్లు రుద్రంగి మండలంలోని సర్పంచ్తండాకు చెందిన రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నరహరి నాయక్ది. ఉద్యోగరీత్య వివిధ ప్రాంతాలకు వెళ్లిన నరహరి సొంత గ్రామంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ఊరిలోనే వ్యవసాయం చేస్తూ గ్రామస్తులతో కలిసి వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
మట్టి అక్రమ రవాణాపై కఠిన చర్యలు
● అనుమతి లేకుండా తరలించవద్దు ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో మట్టి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల బ్యానర్లో సెలవు రోజుల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని వివరించారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి తరలిస్తే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. వేములవాడ అర్బన్ మండలం శాత్రాజుపల్లిలో అక్రమ మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ను ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి సీజ్ చేశారని ఆయన వివరించారు. క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్న ఆర్డీవోను కలెక్టర్ అభినందించారు. ఇందిరమ్మ ఇండ్లకు పనిదినాలలో ప్రభుత్వం ఇసుక, మట్టి తరలించేందుకు అనుమతులు ఇచ్చిందని, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అక్రమ మట్టి రవాణా జరుగుతోందని సమాచారంతో క్షేత్రస్థాయిలో ఆదివారం తనిఖీలు నిర్వహించగా.. నాలుగు ట్రాక్టర్లు, ఒక్క జేసీబీ పరారయ్యాయని ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి తెలిపారు. జిల్లాలో అక్రమంగా ఇసుక, మట్టి రవాణా ఎవరు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
ఆప్తమిత్రుడి స్ఫూర్తితో..
జగిత్యాల: స్నేహబంధం గొప్పది. ఆ బాండింగే వేరు. స్నేహితులు మంచి కోరుతుంటారు. సూచనలు ఇస్తుంటారు. నాకు కడలి జయకృష్ణ మంచి స్నేహితుడు. బీటెక్ పూర్తయ్యాక అమెరికా వెళ్లి స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయంలో జయకృష్ణ ఐఏఎస్కు ప్రిపేర్ కావాలని సలహాలు, సూచనలు ఇచ్చాడు. అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ వెళ్లి జయకృష్ణ వాళ్ల అక్కయ్య ప్రోత్సాహంతో సివిల్స్కు ప్రిపేర్ అయ్యాను. ఐఏఎస్ రావడంలో ఒకింత జయకృష్ణ పాత్ర ఉంది. ఐఏఎస్ అయిన తర్వాత ఎంతో మంది స్నేహితుల్లాగా కొలీగ్స్గా ఉంటారు. కానీ చిన్నతనంలో ఉన్న స్నేహితులను ఎప్పటికీ మరిచిపోం. – సత్యప్రసాద్, కలెక్టర్, జగిత్యాల -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
● ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ/రుద్రంగి(వేములవాడ): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్హౌస్ను శనివారం అధికారులతో కలిసి ప్రారంభించారు. రైతును రాజును చేసేందుకు రుణమాఫీ, వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందజేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుపేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, పంచాయతీ కార్యదర్శి రాందాస్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు గండి నారాయణ, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, తర్రె లింగం తదితరులు పాల్గొన్నారు. 144 మందికి పట్టాలు వేములవాడలో సొంత ఇల్లు, గజం జాగ లేని పేదలు 144 మందికి బస్డిపో పక్కన గల డబు ల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలంలో పట్టాలు ఇస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. లబ్ధి దారులకు శనివారం పట్టాలు పంపిణీ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పేదలకు ఇళ్లు పంపిణీ చేయాలని ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థలంలో పేదలకు పట్టాలు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. 12 బ్లాకులలో జీప్లస్ 2తో 144 ఇండ్లు ఉంటాయన్నారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్చైర్మన్ కనికరపు రాకేశ్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ పాల్గొన్నారు. -
బెస్ట్ ఫ్రెండ్ శివం ఉపాధ్యాయ
సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పడం చాలా కష్టం. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, కెరీర్లో అనేక మంది ఫ్రెండ్స్ అయ్యారు. నా కంటే సీనియర్ ఆఫీసర్ అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా చాలా క్లోజ్గా ఉంటారు. నాకు మంచి ఫ్రెండే. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే.. 2021 ఐపీఎస్ బ్యాచ్మెట్ శివం ఉపాధ్యాయ. అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పవచ్చు. అతనితో ఐదేళ్లుగా ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. చాలా మంచి సలహాలు ఇస్తారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఏఎస్పీగా పని చేస్తున్నారు. – మహేశ్ బి గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
ఫేక్ అటెండెన్స్ పంచాయితీ
● విధులకు రాకుండానే వచ్చినట్లు నమోదు ● సాంకేతిక లోపం.. వారికి వరం ● గ్రామపంచాయతీ కార్యదర్శుల లీలలు ఎన్నో.. ● 33 మంది కార్యదర్శులపై కలెక్టర్కు నివేదికవివరాలు ఇలా..సిరిసిల్ల: సాంకేతిక లోపాలను అలుసుగా తీసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఇంటిలోని ఉండి యాప్లో హాజరు నమోదు చేసుకుంటుండగా..మరికొందరు తమ స్థానంలో మరొకరితో అటెండెన్స్ కోసం సెల్ఫీ ఫొటో తీయిస్తున్నారు. ఇలా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారు జిల్లాలో 33 మంది కార్యదర్శులు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. వీరిపై కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేని రోజుల్లో అన్నీ తామై నడిపించాల్సిన పంచాయతీ కార్యదర్శులు ఇలా ఫేస్ రికగ్నిషన్ యాప్లో ఫేక్ వ్యక్తులతో అటెండెన్స్ నమోదు చేయించడం చర్చనీయాంశమైంది. ఏం జరిగిందంటే.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చంద్రయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి టి.రాజన్న సీఎం రేవంత్రెడ్డి ఫొటోతో డీఎస్ఆర్ యాప్లో అటెండెన్స్ నమోదు చేస్తున్నట్లు తేలింది. దీంతో సదరు పంచాయతీ కార్యదర్శిని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో యాప్లో నమోదైన పంచాయతీ కార్యదర్శుల ఫొటోలను పరిశీలించాలని ఆదేశించింది. యాప్లో తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన మండల పంచాయతీ అధికారులు(ఎంపీవో)లను ఆదేశించారు. ఒక్కో ఎంపీవో విధిగా 20 మంది హాజరు రికార్డులను పరిశీలించాలని స్పష్టం చేశారు. నకిలీ హాజరు నమోదు చేసే పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని సూచించారు. ఈ మేరకు జిల్లాలోనూ డీఎస్ఆర్ యాప్ను అధికారులు పరిశీలించారు. 32 మంది కార్యదర్శులది అదే బాట జిల్లాలోని 32 మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. కోనరావుపేట మండలంలోనే 11 మంది కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేశారు. బావుసాయిపేట, ధర్మారం, ఎగ్లాస్పూర్, గొల్లపల్లె(వట్టిమల్ల), జై సేవాలాల్ తండా, కమ్మరిపేటతండా, కనగర్తి, కోనరావుపేట (వెంకట్రావుపేట ఇన్చార్జి), కొండాపురం, నిజామాబాద్, వట్టిమల్ల కార్యదర్శులు ఇలా ఫేక్ అటెండెన్స్ నమోదు చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. బోయినపల్లి, స్తంభంపల్లి, చందుర్తి మండలంలో దేవునితండా, కట్టలింగంపేట, నర్సింగాపూర్, ఇల్లంతకుంట మండలంలో దాచారం, తెలుగువానిపల్లి, గంభీరావుపేట మండలంలో లక్ష్మీపూర్, పొన్నాలపల్లె, ముస్తాబాద్ మండలంలో మోహినికుంట, మొర్రాపూర్, రాంరెడ్డిపల్లి, సేవాలాల్తండా, తంగళ్లపల్లి, చిన్నలింగాపూర్, రామన్నపల్లి, వీర్నపల్లి, వేములవాడరూరల్ మండలంలో జయవరం, లింగంపల్లి, మల్లారం, మర్రిపల్లి, ఎల్లారెడ్డిపేట మండలంలో బుగ్గరాజేశ్వర్తండా పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ వేసినట్లు గుర్తించారు. తంగళ్లపల్లి, సారంపల్లి పంచాయతీ కార్యదర్శి మహ్మద్ సమీర్ అర్ధనగ్నంగా యాప్లో అటెండెన్స్ వేసినట్లు నమోదైంది. ఇతనితోపాటు మొత్తం 33 మంది పంచాయతీ కార్యదర్శులున్నారు. యాప్లో లోపం వీరికి వరం డీఎస్ఆర్(డైలీ శానిటేషన్ రిపోర్టు) యాప్లో సాంకేతికలోపం ఫేక్ అటెండెన్స్ నమోదుకు అవకాశం లభించింది. నిజానికి క్షేత్రస్థాయిలో ఉండి.. పంచాయతీ కార్యదర్శి డీఎస్ఆర్ నమోదు చేయాలి. కానీ మరో వ్యక్తి ముఖచిత్రాన్ని గుర్తించకుండా హాజరు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. యాప్ వైఫల్యంతోనే ఇది సాధ్యమైందని అధికారులు పేర్కొంటున్నారు. గ్రామాలు : 260 వార్డులు : 2268 గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులు : 12 గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శులు : 12 గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులు : 20 గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులు : 169 అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు : 24 పంచాయతీ కార్యదర్శుల ఖాళీలు : 23ఉన్నతాధికారులకు నివేదించాం పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్ఆర్ యాప్ను అధికారులు పరిశీలించారు. ఎంపీవోలు అందించిన నివేదికల మేరకు జిల్లాలో 33 మంది పంచాయతీ కార్యదర్శులను గుర్తించాం. ఫేక్ అటెండెన్స్ నమోదైనట్లు ఆధారాలు లభించాయి. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు, కలెక్టర్కు పంపించాం. – షరీఫొద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి -
స్నేహబంధమే శాశ్వతం
సాక్షి, పెద్దపల్లి: స్నేహబంధమే అన్నింటికన్నా శాశ్వతమైనది. నేను ఇప్పటికీ నా స్కూల్మేట్స్ను కలుస్తుంటా. చిన్నప్పుడు ఖమ్మం పాఠశాలలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నం. చదువులు పూర్తయ్యాక చిన్ననాటి మిత్రులందరూ వివిధ దేశాలు, పట్టణాల్లో డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, వ్యాపారులుగా స్థిరపడ్డారు. ఎవరెక్కడ ఉన్నా మేమంతా ఒకరికొకరు తోడుగా ఉన్నామన్న భరోసా ఇస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం. 30 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతోంది. వాట్సప్ గ్రూప్ ద్వారా నిత్యం టచ్లో ఉంటాం. ఏడాదికోసారి ఒకచోట కలిసి యోగక్షేమాలు తెలుసుకుంటాం. – కోయ శ్రీహర్ష, కలెక్టర్, పెద్దపల్లి -
రెండు వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు
సిరిసిల్ల: జిల్లాలో ఈ ఏడాది రెండు వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ప్రణాళిక రూపొందించామని, ఈమేరకు రైతులతో మాట్లాడి సాగుచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శనివారం ఆయిల్పామ్ సాగుపై సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 772 మంది రైతులు 2,280 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేశారని, మరో రెండు వేల ఎకరాలు సాగు లక్ష్యం సాధించాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు కలిగే ప్రయోజనా లు వివరించాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న రైతులకు డ్రిప్ అందించాలని సూచించారు. అసైన్డ్ భూములను సాగుచేస్తున్న రైతులు ఆయిల్పామ్ సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. మొక్కలు సరఫరాకు ప్రీ యూనిక్యూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కేటాయించినట్లు తెలిపారు. పెద్దబోనాల వద్ద రెండు ఎకరాల్లో ఏడాది వయసు ఉన్న మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉద్యానవనశాఖ డీడీ శేఖర్, జిల్లా ఉద్యానవన అధికారి లత, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
బాల్య మిత్రుడి జ్ఞాపకాలతో స్కూల్కు శ్రీకారం
సిరిసిల్ల: ‘అరేయ్ మన మిత్రుడు దయానంద్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడిని అందరూ గుర్తుంచుకునే విధంగా ఏదైనా చేద్దాం’ అంటూ.. బాల్య స్నేహితులు ఏకమయ్యారు. ఓ స్కూల్ను ఏర్పాటు చేశారు. 19 ఏళ్ల కిందటే రూ.30లక్షలు వెచ్చించి శాశ్వత భవనాన్ని నిర్మించారు. వందలాది మంది పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తున్నారు. సిరిసిల్లలోని పద్మనగర్కు చెందిన గోసికొండ దయానంద్ 2002లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్నేహితుడు గాజుల శ్రీనివాస్ యూఎస్ఏ సాప్ట్వేర్ ఇంజినీరు. దయానంద్పై ఉన్న అభిమానంతో స్నేహితులతో కలిసి పట్టణ శివారులో 22 గుంటల భూమిని కొనుగోలు చేశారు. 19 ఏళ్ల కిందట సుమారు రూ. 30 లక్షలు వెచ్చించి స్కూల్ను 2006లో స్థాపించారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. రాజీవ్నగర్లోని పేదలందరూ తమ పిల్లలను దయానంద్ మెమోరియల్ స్కూల్కు పంపిస్తున్నారు. ప్రస్తుతం స్కూల్లో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఏటా 25 మంది జెడ్పీస్కూళ్లకు వెళ్తున్నారు. నిర్వహణకు ఏటా రూ.6 లక్షలు ఖర్చవుతోంది. ట్రస్ట్ అధ్యక్షుడిగా గాజుల శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ స్నేహితులు భీమేశ్వర్ అంకతి, రాంబాబు చేబ్రోలు, జి.రాజశేఖర్, ప్రసన్న పోల్సాని, విజయ్కృష్ణ భరాతం, మురళీకృష్ణ సింగారం, రవీందర్ నాగంకేరి, రవి వూరడి, గణేశ్ గోసికొండ భాగస్వాములుగా ఉన్నారు. -
చట్టాల గురించి తెలుసుకోవాలి● సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైశ్వాల్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రతీ ఒక్కరు చట్టాల గురించి తెలుసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ రాధిక జైశ్వాల్ కోరారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో శని వారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. జస్టిస్ రాధిక జైశ్వాల్ మా ట్లాడుతూ రాజ్యాంగం, చట్టాలు, న్యాయవ్యవస్థ గురించి తెలుసుకోవాలన్నారు. లోక్ అ దాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, అడ్వకేట్ ఆడెపు వేణు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జె.పర్శరాములు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎస్.మల్లేశ్యాదవ్, సీనియర్ అడ్వకేట్ కుంట శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డాక్టర్ జయ, వైస్ ప్రిన్సిపాల్ రెహానా ఇఫ్ఫత్ పాల్గొన్నారు. భూగర్భ జలాలను కాపాడాలి రుద్రంగి(కోనరావుపేట): మండలంలోని నిమ్మపల్లి మూలవాగులో భూగర్భ జలాలను కాపాడాలని కోరుతూ ఆ గ్రామస్తులు డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్కుమార్కు శని వారం వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ నిమ్మపల్లి మూలవాగు నుంచి నిమ్మపల్లి, వట్టిమల్ల, మరిమడ్ల, బావుసాయిపేట, కోనరావుపేట, కొండాపూర్, వెంకట్రావుపేట గ్రామాలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక అనుమతులు ఇచ్చారన్నారు. ఆయా గ్రామస్తులు ఇసుక తోడుతుండడంతో భూగ ర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోగు ప్రతాపరెడ్డి, దొంతరవేణి శ్రీనివాస్గౌడ్ తదితరులు ఉన్నారు. బిల్లులు విడుదల చేయాలి సిరిసిల్ల అర్బన్: రాష్ట్రంలో తాజా, మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తాజా, మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కనిపల్లి కరుణాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో జిల్లా అధ్యక్షుడు దుమ్మ అంజయ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయడం లేదన్నారు. జనహిత పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ గ్రామాల్లోని మాజీ సర్పంచులు చేసిన పనులు తెలుసుకొని బిల్లులను విడుదల చేయించా లని కోరారు. ఉపాధ్యక్షుడు గున్నాల లక్ష్మణ్, ఆరె మహేందర్, సిరికొండ శ్రీనివాస్, రవినాయక్, శ్రీనివాస్, రాజేశ్ పాల్గొన్నారు. త్రిఫ్ట్ డబ్బులు ఇప్పించాలి ● చేనేత, జౌళిశాఖ జాయింట్ డైరెక్టర్కు వినతి సిరిసిల్లటౌన్: నేతన్నలకు రావాల్సిన త్రిఫ్ట్ పథకం డబ్బులు చేనేత దినోత్సవం రోజున అందించేలా చూడాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. సిరిసిల్లలోని బీవై నగర్ చేనేత, జౌళి శాఖ ఆఫీస్లో జేడీ ఎన్వీ రావును శనివారం కలిసి ఈమేరకు విన్నవించారు. పవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న 10 శాతం యారన్ సబ్సిడీ, త్రిఫ్ట్ పథకం, వర్కర్ టు ఓనర్, కార్మికుల ఉపాధి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. వార్పిన్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, బెజుగం సురేష్, చింతకింది సుదర్శన్, దోమల రామ్ ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు మట్టి కొరత లేకుండా చూడాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): ఇందిరమ్మ ఇళ్లకు ఎలాంటి కొర్రీలు లేకుండా మట్టి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. చందుర్తిలోని రైతువేదికలో శుక్రవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు రూ.7.35 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం పంపిణీ చేశారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను శరవేగంగా పూర్తి చేసుకోవాలన్నారు. బేషిమెంటు లెవల్ నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు త్వరలో బిల్లుల చెల్లింపు జరుగుతోందన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, రుద్రంగి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్, సనుగుల సింగిల్విండో మాజీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు ఏగోళపు శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ చేశారు. నేరెళ్ల, జిల్లెల్ల, మండెపల్లి గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో సైకిళ్లు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు తుపాకుల సత్తయ్య, మండల ప్రధాన కార్యదర్శులు ఇటికల రాజు, కోస్నీ వినయ్ యాదవ్, ఉపాధ్యక్షుడు రెడ్డిమల్ల ఆశీర్వాద్, కాసుగంటి రాజు, బూత్ అధ్యక్షుడు రేగుల రాజు, నాగుల శ్రీనివాస్, కట్కం మధుసూదన్, కట్ట తిరుపతి, ఆసాని లక్ష్మారెడ్డి, బక్కశెట్టి రాజు, ముత్యం యాదవ్, బోయినీ రాజు, సందీప్, దూడం నవీన్, ఇంద్రనగర్ సంతోష్, గంధం రాజు, పొన్నం అనిల్, దాసరి రమేశ్ పాల్గొన్నారు. -
ఎఫ్ఆర్ఎస్కు సర్వర్ ప్రాబ్లమ్
● టీచర్ల అటెండెన్స్కు మొదటి రోజు కష్టాలు ● మొబైల్ సిగ్నల్ లేక తిప్పలుఇల్లంతకుంట(సిరిసిల్ల): ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఎస్(ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్)లో మొదటి రోజులు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. మారుమూల పల్లెల్లో మొబైల్ సిగ్నల్స్ సరిగా లేకపోవడం, మరికొన్ని గ్రామాల్లో సర్వర్ ప్రాబ్లమ్స్తో అటెండెన్స్ నమోదుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉపాధ్యాయులు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎఫ్ఆర్ఎస్ యాప్ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, యూపీఎస్, హైస్కూల్ టీచర్లకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4.15 వరకు పనివేళలు. శుక్రవారం మొదటి రోజు కావడంతో యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ చేసుకొని అటెండెన్స్ నమోదు చేసుకున్నారు. ఉదయం స్కూల్ లోకేషన్లో ఉండి తమ మొబైల్ ఫోన్ నుంచి యాప్కు లాగిన్ కావాలి. పాఠశాల పనివేళలు ముగిసిన తర్వాత మొబైల్లోనే లాగౌట్ కావాలి. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో సిగ్నల్, సర్వర్ ప్రాబ్లమ్స్తో రిజిస్ట్రేషన్, అటెండెన్స్ ప్రక్రియలో జాప్యమైనట్లు తెలిసింది. ఇల్లంతకుంట మండలంలో గురుకుల, మోడల్స్కూల్, కేజీబీవీలతో కలిపి 37 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. గతేడాది నుంచి విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ అమలులో ఉండగా.. ఇప్పుడు ఉపాధ్యాయులకూ అమలు చేస్తున్నారు. -
మహిళలు వ్యాపారంలో ముందుకెళ్లాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్లఅర్బన్/తంగళ్లపల్లి/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మహిళలు వ్యాపారంలో స్వయం సమృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరులో మహాలక్ష్మి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డెయిరీ యూనిట్, కోడిపిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేశామన్నారు. ఇటీవల పెట్రోల్బంక్ను సైతం ప్రారంభించుకున్నట్లు తెలిపారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు స్వరూపారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్బేగం తదితరులు పాల్గొన్నారు. ఇసుక కొరత లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదని కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్పష్టం చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరులో కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. ఇసుకకు ఇబ్బంది అయితే పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ట్రాక్టర్ యజమానులు లేబర్, వాహన చార్జీలు కలిపి ట్రిప్పునకు రూ.1500 మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ భవనాలు ప్రారంభం తంగళ్లపల్లిమండల కేంద్రంలోని వివేకనందకాలనీ, పాతవాడలోని రెండు అంగన్వాడీ భవనాలు, ఎల్లారెడ్డిపేట మండలం కిషన్దాస్పేట ప్రాథమిక పాఠశాల ఆవరణలో అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. కాంగ్రెస్ తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు ప్రవీణ్ జే టోని, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు. పోటీపరీక్షల్లో రాణించేందుకు మంచి అవకాశం అన్ అకాడమీ ద్వారా అందించే ఉచిత శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని పోటీపరీక్షల్లో రాణించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. ఎల్లారెడ్డిపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే ఇంటర్, డిగ్రీ కళాశాలలో అన్ అకాడమీ ఆన్లైన్ తరగతులను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతీ రోజు కనీసం 2 గంటలపాటు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలని సూచించారు. విద్యార్థి జీవితంలో 10, 11, 12వ తరగతులు కీలకమని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరా బేగం, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నేరాల విచారణలో శాసీ్త్రయ ఆధారాలు కీలకం
● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్లక్రైం: ఆధునిక ఫోరెన్సిక్, శాసీ్త్రయ ఆధారాలతో నేరాలను సమర్థంగా పరిష్కరించవచ్చని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. సంఘటన స్థలంలో ఆధారాల సేకరణ, భద్రతలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా కేసుల దర్యాప్తులో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మెడికల్ కళాశాల వైద్యనిపుణుల ఆధ్వర్యంలో జిల్లాలోని ఇన్వెస్టిగేషన్ అధికారులకు, స్టేషన్ రైటర్లకు శుక్రవారం శిక్షణ ఇచ్చారు. హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాల ఘటనల్లో ఏయే ఆధారాలు ఎలా సేకరించాలి అనేదానిపై అవగాహన కల్పించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరీ, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, వైద్యులు నిర్వీశ, వినయ్, సీఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్ఐలు యాదగిరి, మధుకర్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
‘గీతకార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం’
బోయినపల్లి(చొప్పదండి): గీతకార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని మల్కాపూర్లో ఈజీఎస్, ఎకై ్సజ్, గౌడసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవంలో ఈతమొక్కలు నాటారు. అనంతరం తడగొండ ప్రైమరీ పాఠశాలను తనిఖీ చేశారు. తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఏపీవో సబిత, ఎంఏవో ప్రణిత, సిరిసిల్ల ఎకై ్సజ్ ఇన్చార్జి సీఐ శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, సెస్ డైరెక్టర్ సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్ ఉన్నారు. ప్రతీరోజు పర్మిషన్లు ఇవ్వాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇందిరమ్మ ఇండ్లు, ప్రైవేటు నిర్మాణాల కోసం ప్రతీ రోజు ఇసుక, మట్టికి అనుమతులు ఇవ్వాలని భవన నిర్మాణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కోరారు. మండలంలోని బద్దెనపల్లిలో శుక్రవారం మాట్లాడారు. వారానికి రెండుసార్లు మాత్రమే అనుమతులు ఇవ్వడంతో భవన నిర్మాణాలకు ఇసుక, మట్టి సరిపోవడం లేదన్నారు. నాయకులు బద్దెనపల్లి సుదర్శన్, సారుగు ప్రమోద్, గడ్డం ఆంజనేయులు, షేర్ల సుధీర్, విక్రమ్, రవి, అరవింద్, వెంకటేశ్, బాలయ్య, సత్తయ్య పాల్గొన్నారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి సిరిసిల్లటౌన్: జిల్లా ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఉద్యమకారులు కోరారు. కరీంనగర్ జిల్లా కోర్టుకు శుక్రవారం హాజరై మాట్లాడారు. తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డిలను కోరినట్లు తెలిపారు. రెండేళ్లుగా జిల్లాలో ఉన్న కేసులను కరీంనగర్ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారన్నారు. తమపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఉద్యమకారులు చొక్కాల రాము, కంసాల మల్లేశం, వీరవేణి మల్లేశం, మైలారం తిరుపతి తదితరులు కోరారు. రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపిక సిరిసిల్లఅర్బన్: జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సాయికృష్ణ ఫంక్షన్హాల్లో జిల్లాస్థాయి సీనియర్ విభాగంలో యోగా పోటీలు నిర్వహించినట్లు యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎలిగేటి కృష్ణ తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన భానోతు రశ్మిత, జి.చందన, బి.అంగురి, బి.బిందు, ఎన్.స్వాతి, ఎం.సుమలత, బి.బేల, జి.శ్రావణి, సీహెచ్.హారతిసాగర్, ఎస్.సౌమ్య, బి.పద్మ, ఎల్.శ్రీనివాస్, ఎస్.అఖిల్సాగర్, రామకృష్ణ, ఎన్.కనకయ్య ఎంపికై నట్లు తెలిపారు. డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. వీరు ఈనెల 7, 8వ తేదీల్లో ఆదిలాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గౌరవ సలహాదారు కరుణాల భద్రాచలం, కార్యవర్గ సభ్యులు రాజయ్య, రామకృష్ణ, కనకయ్య, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. ముగిసిన ఆపరేషన్ ముస్కాన్● 97 మంది బాలబాలికల సంరక్షణ ● ఎస్పీ మహేశ్ బి గీతే సిరిసిల్లక్రైం: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ముగిసిందని ఎస్పీ మహేశ్ బి గీతే శుక్రవారం తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలతో పనిచేయిస్తున్న వారిపై 14 కేసులు నమోదు చేశామన్నారు. సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపర్చి 97 మంది బాలబాలికల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించినట్లు పేర్కొన్నారు. వీధి బాలలను కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
పేరుకే పట్టాదారులు!
● లావణీ పట్టా ఉన్నా.. లేనట్టే ! ● వ్యవసాయానికి అనుకూలించని భూములు ● వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని విన్నపం ● 1971–72లో 11,138 ఎకరాలకు పట్టాల పంపిణీ ● అనుమతులు లేకుండానే ఇంటి నిర్మాణాలుఈ ఫొటోలోని వ్యక్తి గుగులోతు మోహన్నాయక్. రుద్రంగి మండలం సర్పంచ్తండా గ్రామస్తుడు. ప్రభుత్వం పంపిణీ చేసిన లావణీ పట్టా(ప్రభుత్వ) భూమిలో మినీ రైస్మిల్ ఏర్పాటుకు అనుమతుల కోసం అధికారుల వద్దకు వెళ్లాడు. లావణీ పట్టాగా ఉండడడంతో అనుమతులు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక మినీ రైస్మిల్ ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ఇలా ఇతను ఒక్కడే కాదు వ్యవసాయానికి సాగునీరు లేక, పంటలు పండని భూమి పట్టాలు పొందిన వేలాది మంది గిరిజనులు వాణిజ్య నిర్మాణాలు చేపట్టాలనే ప్రయత్నాలు విస్మరించుకున్నారు. అనుమతులు లభించక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు.రుద్రంగి(వేములవాడ): దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నేడు పంటలు పండే పరిస్థితులు లేక గిరిజనుల వాణిజ్య నిర్మాణాల కోసం పెట్టుకున్న అనుమతులను అధికారులు రద్దు చేస్తున్నారు. లావణీ పట్టాగా ఉండడంతో వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో రైతుల వద్ద భూమి ఉన్నా పంటలు పండించుకోలేక.. వాణిజ్య నిర్మాణాలు చేపట్టుకోలేక ఖాళీగా ఉంటున్నారు. 1971–72లో పట్టాలు మెట్టప్రాంతం మానాల, గిరిజనతండాల్లోని గిరిజనులు పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవించేవారు. 1971–72 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం నిరుపేద గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు పంపిణీ చేసింది. సాగునీటి వసతి లేక వర్షాధార వంటలు సాగుచేసుకుంటున్నారు. పంటలు సరిగ్గా పండకపోవడంతో పలు వురు గిరిజనులు వాణిజ్య నిర్మాణాలు చేపట్టి వ్యా పారం చేసి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తామని అనుమతుల కోసం అధికారుల వద్దకు వెళ్తే స్పందించ డం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోతున్న జీపీలు, ప్రభుత్వం మానాల, గిరిజన తండా గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టే వారు అనుమతుల కోసం గ్రామపంచాయతీ కార్యాలయాలకు వెళ్తే లావణీ పట్టా భూములు కావడంతో అధికారులు అనుమతులకు నిరాకరిస్తున్నారు. దీంతో పలువురు గిరిజనులు అనుమతులు లేకుండానే ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో గ్రామపంచాయతీలు ఇంటిపన్ను రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతున్నాయి. వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వంకు వచ్చే రెవెన్యూ పన్నులు కోల్పోతుంది. గిరిజనులకు వాణిజ్య నిర్మాణాలకు అనుమతుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి ఉపాధి లేని నిరుపేద గిరిజనులకు వారు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు పంపిణీ చేసింది. కానీ మెట్టప్రాంతం మానాల, గిరిజనతండా గ్రామాల్లో సాగునీటి వసతి లేక వర్షాధార పంటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వారు పేదరికంలోనే ఉంటున్నారు. ప్రభుత్వం గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి. – నరహరి నాయక్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సర్పంచ్తండా గ్రామస్తుడువ్యవసాయానికే పట్టాలు ఉపాఽధి లేని నిరుపేదలు వ్యవసాయం చేసుకొని ఉపాధి పొందుతారని లావణీ పట్టాలను ప్రభత్వం పంపిణీ చేసింది. లావణీ పట్టా భూమిలో ఇళ్లు, వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. – పుష్పలత, తహసీల్దార్, రుద్రంగి -
మిద్దైపె సూర్యోదయం
● ఇంటి మేడపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి ● ప్యానెళ్ల ఏర్పాటుకు సబ్సిడీ ● ఆసక్తి చూపుతున్న ప్రజలు ● విస్తరిస్తున్న యూనిట్లు‘అది 1998.. సిరిసిల్ల ప్రాంతంలో జర్మనీకి చెందిన జీఎస్ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పర్యటించారు. ఈ ప్రాంతంలో సేవ్స్ ద్వారా తాగునీటి ట్యాంకులు నిర్మిస్తూ, బోర్లు వేశారు. ఆ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జర్మనీకి చెందిన పలువురు ఇంజినీర్లు ఇక్కడికొచ్చారు. సిరిసిల్ల ప్రాంతంలో పర్యటిస్తూ.. ఇక్కడ ఎండలను, వేడిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఎండలు.. ఇక్కడి సూర్యరశ్మిని మాకు జర్మనీలో ఉంటే అద్భుతాలు సృష్టించేవారిమని చెప్పారు..’ అంటే.. 27 ఏళ్ల కిందట జర్మనీ ఇంజినీర్లు అన్న మాటలను ఇప్పుడు జిల్లాలో ప్రజలు సోలార్ ప్యానెల్స్ ద్వారా సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలో మిద్దైపె సూర్యోదయాన్ని ఆవిష్కరిస్తున్నారు. ‘జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన కాముని నళినీకాంత్ తన ఇంటిపై రూ.7.50లక్షలు వెచ్చించి ఏడాది కిందట 10 కిలోవాట్స్ సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ ఆశించలేదు. పొద్దంతా ఎండతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ బ్యాటరీల్లో స్టోర్ అయి రాత్రి వేళల్లో ఏసీలు, ఫ్యాన్లు, బల్బులు, లిఫ్ట్తో సహా అన్నింటికీ వినియోగమవుతుంది. ప్రతీ నెల వచ్చే రూ.15వేల విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ఎండాకాలంలో విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ఎండలు కూడా తీవ్రంగా కొడుతుండడంతో అదే స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇలా సిరిసిల్లలో పెట్రోల్బంక్, ప్రాసెసింగ్, వస్త్రోత్పత్తి యూనిట్తోపాటు పలువురు ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నారు. సిరిసిల్ల: సౌరశక్తిని సద్వినియోగం చేసుకుంటూ జిల్లా ప్రజలు సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. తమ అవసరాలకు సౌరశక్తిని సద్వినియోగం చేసుకుంటున్నారు. సూర్యకాంతిని వినియోగించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయించాలని ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్ బిజిలీ యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో ఇంటి మేడపై ఒక్కో యూనిట్ ఏర్పాటుకు రూ.78వేలు సబ్సిడీ ఇస్తోంది. ఇతర పరికరాలకు 7 శాతం వడ్డీతో 90 శాతం మేరకు బ్యాంకు రుణం ఇస్తున్నారు. పదేళ్లపాటు సులభ వాయిదాల పద్ధతిలో అప్పు చెల్లించే వసతి కల్పించారు. 25 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తికి గ్యారంటీ ఇస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీ పథకంతో జిల్లాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు విస్తరిస్తున్నాయి. నాలుగు సౌరశక్తి విద్యుత్ ప్లాంట్లు జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల అవసరాలను సౌరవిద్యుత్ తీర్చుతోంది. ఇంటిపైనే కాదు.. వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సహజ సిద్ధమైన సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు జిల్లాలో నాలుగు ఉన్నాయి. ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను నేరుగా సబ్స్టేషన్లకు అనుసంధానం చేశారు. ఇల్లంతకుంట మండలం రామాజిపేటలో 150 ఎకరాల్లో, పెద్దలింగాపూర్లో 120 ఎకరాలు, వేములవాడ మండలం నూకలమర్రిలో 100 ఎకరాలు, ముస్తాబాద్ మండలం నామాపూర్లో 200 ఎకరాలలో సూర్యరశ్మి ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 55 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒక్క మెగావాట్ వెయ్యి కిలోవాట్స్తో సమానం. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్లతో అనుసంధానం చేసి గ్రిడ్కు సౌరవిద్యుత్ సరఫరా అవుతోంది. టెక్స్టైల్ పార్క్లోని యూనిట్లపైనా.. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్లోని వస్త్రోత్పత్తి యూనిట్లపైన సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. 10 యూనిట్లపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మండెపల్లి శివారులోని ప్రాసెసింగ్ యూనిట్లోనూ 440 కేవీ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. -
కొత్త కోర్సులు.. కాలేజీలు.. హాస్టళ్లు
● శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అభివృద్ధి పనులు షురూ ● హుస్నాబాద్లో ఇంజినీరింగ్, క్యాంపస్లో లా కళాశాల ● ఎల్ఎండీ, క్యాంపస్లో ఎంసీఏ కోర్సు మంజూరు ● మూడు ఆడిటోరియంల ఆధునీకరణ ● ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని క్యాంపస్ భూముల రక్షణకు ప్రహరీ ● మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి ఈ నెల 4న శంకుస్థాపనసాక్షిప్రతినిధి,కరీంనగర్: గత వైస్ చాన్స్లర్ హయాంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శాతవాహన యూనివర్సిటీ.. ఇప్పుడు అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. కొత్త కళాశాలలు, కోర్సులతో మరింత విస్తరిస్తోంది. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన 9 నెలల్లోనే కొత్త కళాశాలలు, కోర్సులకు అనుమతులు పొందడంతోపాటు అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ, క్యాంపస్లో లా కాలేజీతోపాటు ఫార్మసీ కాలేజీలో ఎంఫార్మసీ కోర్సు, క్యాంపస్లో ఎంసీఏ కోర్సు, అకడమిక్ బ్లాక్, రెండు కొత్త హాస్టళ్లు మంజూరయ్యాయి. ఇంజినీరింగ్, లా కాలేజీ నిర్వహణకు 120 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ‘బండి’ సహకారంతో లా కాలేజీకి గుర్తింపు ఎస్యూ క్యాంపస్లో మూడేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులతో లా కాలేజీ ప్రారంభం కాబోతోంది. మూడేళ్ల లా కోర్సులో ఒక్కో సెక్షన్లో 60 అడ్మిషన్ల చొప్పున 120 సీట్లు(2 సెక్షన్లు), ఎల్ఎల్ఎం(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా)లో 20 సీట్లు మంజూరు చేశారు. లా కాలేజీలో బోధనకు 14 టీచింగ్, 19 నాన్ టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. లా కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గుర్తింపు తప్పనిసరి కావడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో అతి తక్కువ కాలంలో అనుమతులు లభించాయి. ఫార్మసీ కళాశాలకు మహర్దశ ఎల్ఎండీ సమీపంలోని ఫార్మసీ కళాశాలలో ఇ న్నాళ్లు బీఫార్మసీ కోర్సు మాత్రమే ఉండేది. తాజాగా ఎంఫార్మసీ ప్రారంభించేందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆ ఫ్ ఇండియా అనుమతిచ్చింది. ఫార్మసీ కళాశాలలో పీఎం ఉష నిధులు రూ.7.28 కోట్లతో చేపట్టిన అకడమిక్ బ్లాక్ నిర్మాణ పనులకు గత నెల 22న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు శంకుస్థాపన చేశారు. ఫార్మసీ కళాశాల భూములు ఆక్రమణకు గురికాకుండా రూ.2.85 కోట్ల వర్సిటీ నిధులతో ప్రహరీ పనులు ప్రారంభించారు. సదుపాయాలకు పెద్దపీట వర్సిటీలో సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాం. కొత్తకాలేజీలు, హాస్టళ్లు, ఆడిటోరియాలు నిర్మిస్తున్నాం. క్యాంపస్లో శాతవాహన విగ్రహం ప్రతిష్టించనున్నాం. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు యూనివర్సిటీ విషయంలో సానుకూలంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. త్వరలో వర్సిటీకి న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. – ఉమేశ్ కుమార్, వీసీ, శాతవాహన యూనివర్సిటీహుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈ విద్యాసంవత్సరంలో హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభం కాబోతోంది. ఇందులో సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు మంజూరు చేశారు. ఇందుకోసం 54 టీచింగ్ పోస్టులు, 33 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేశారు. బీటెక్లో ఒక్కోబ్రాంచ్లో 60అడ్మిషన్ల చొప్పున 240 సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఎప్సెట్ కౌన్సెలింగ్లో ఇప్పటికే 110మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు.మరెన్నో పనులు గోదావరిఖని పీజీ కాలేజీలో అకడమిక్ బ్లాక్, ప్రహరీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి ఎంబీఏ బ్లాక్ వరకు అప్రోచ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాలలో గతంలో ఉన్న పాత సెమినార్ హాల్ను సరికొత్త సీటింగ్, సౌండ్ సిస్టంతో ఆధునీకరించి మంత్రి పొన్నం చేతుల మీదుగా ప్రారంభించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కాలేజీలో కొత్త కంప్యూటర్ ల్యాబ్, అన్ని డిపార్ట్మెంట్లు, ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని పీజీ కాలేజీలో డిజిటల్ స్మార్ట్ క్లాస్రూమ్స్ ఏర్పాటు చేశారు.మరో రెండు కొత్త హాస్టళ్లు శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులకు మరో రెండు కొత్త హాస్టళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. యూనివర్సిటీలో అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో క్యాంపస్లో ఒకటి, ఫార్మసీ కాలేజీలో మరొకటి గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని నిర్ణయించారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంజూరు చేసిన రూ.20 కోట్ల నిధులతో ఈ హాస్టళ్ల పనులకు ఈ నెల 4న శంకుస్థాపన చేసేందుకు జిల్లా ఇన్చార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఆహ్వానించినట్లు వీసీ ఉమేశ్ కుమార్ వెల్లడించారు. త్వరలో రూ.18 కోట్లతో లా కాలేజీతో పాటు, సెంట్రల్ లైబ్రరీలో సెమినార్ హాల్ ఆధునీకరణ, పరిపాలన భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న నూతన సెమినార్ హాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. -
రోడ్డు ఎప్పుడు వేస్తారో..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సీసీ రోడ్డు నిర్మాణానికి నాలుగు నెలల క్రితం శంకుస్థాపన చేసి మరిచిపోయారంటూ ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గరాజేశ్వరతండావాసులు గురువారం నిరసన తెలిపారు. తండాపరిధిలోని టీక్యాకాలనీలో 11 కుటుంబాలు నివసిస్తున్నాయి. తండాకు వెళ్లడానికి సరైన రోడ్డు లేదు. దీనికితోడు ఈమార్గంలోనే ఒర్రె ఉండడంతో వారి తిప్పలు చెప్పుకోలేనివిగా ఉన్నాయి. ఇటీవల రూ.5లక్షలతో 100 మీటర్ల రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేసినా నాయకులు పనులు మాత్రం చే యడం లేదు. దీంతో తండావాసులు నిరసనకు దిగారు. ఇప్పటికైనా రోడ్డు వేయాలని కోరుతున్నారు. -
రేషన్కార్డులొచ్చాయ్..
● ఎదురుచూపులకు తెర ● 14వేలకు పైగా కొత్త కార్డులు ● కొత్త కోడళ్లు.. పిల్లలకు కార్డుల్లో చోటు ● సెప్టెంబర్ నుంచి బియ్యం పంపిణీబోయినపల్లి(చొప్పదండి): ఎదురుచూపులకు తెరపడింది. పెళ్లయి, సంతానం కలిగినా రేషన్కార్డులు రాకపోవడంతో ఆందోళన చెందిన వారి మనసులు ఉప్పొంగుతున్నాయి. కొత్త రేషన్కార్డులను ప్రభుత్వం మంజూరు చేయడంతో పేదల ఎదురుచూపులు ఫలించాయి. జిల్లాకు కొత్తగా 14,075 రేషన్కార్డులు మంజూరయ్యాయి. మరో 30,376 మందిని రేషన్కార్డుల్లో కొత్తగా నమోదు చేశారు. సెప్టెంబర్ నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా 14వేల రేషన్కార్డులు జిల్లాలోని 13 మండలాల్లో ఇప్పటి వరకు 1,74,304 రేషన్కార్డులు ఉన్నాయి. వీటి కింద ప్రతీ నెల సుమారు 3,300 టన్నుల బియ్యం సరఫరా అవుతుంది. జిల్లాలో కొత్తగా 14,075 రేషన్కార్డులు మంజూరయ్యాయి. మరో 30,376 మంది పేర్ల ను ఇప్పటికే ఉన్న కార్డుల్లో నమోదు చేశారు. కొత్తకార్డులు మంజూరుకావడంతో జిల్లాలో అదనంగా 200 టన్నుల బియ్యం సరఫరా కానున్నాయి. కొత్త కోడళ్లకు.. పిల్లలకు చాన్స్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021లో ఒకసారి రేషన్కార్డులు మంజూరు చేశారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కొత్తకార్డులు వచ్చాయి. ఇటీవల చాలా గ్రామాల్లో ఎంతో మంది కొత్తగా వివాహం చేసుకున్నారు. కొత్త కోడళ్ల పేర్లు రేషన్కార్డుల్లో లేక బియ్యం, సరుకులు రావడం లేదు. అలాగే కొత్తగా జన్మించిన పిల్లల పేర్లు నమోదు కావడం లేదు. ఇప్పుడు కొత్తకార్డులు మెజార్టీగా కొత్త కోడళ్లకే మంజూరయ్యాయి. రేషన్కార్డుల వివరాలు మండలం పాతకార్డులు కొత్తకార్డులు బోయినపల్లి 11,911 1,070 చందుర్తి 10,932 818 ఇల్లంతకుంట 15,628 887 గంభీరావుపేట 14,472 947 కోనరావుపేట 13,814 889 ముస్తాబాద్ 14,518 1,499 రుద్రంగి 4,845 88 సిరిసిల్ల 26,784 2,610 తంగళ్లపల్లి 14,346 1,407 వీర్నపల్లి 4,229 329 వేములవాడ 19,393 1,405 వేములవాడరూరల్ 7,509 632 ఎల్లారెడ్డిపేట 15,823 1,494రేషన్కార్డుల సమాచారం ఇప్పటి వరకు ఉన్న కార్డులు 1,74,304 పాతకార్డుల్లో ఉన్న సభ్యులు 5,22,967 పాతకార్డుల ద్వారా వచ్చే బియ్యం 3,300 టన్నులు కొత్తగా మంజూరైన రేషన్కార్డులు 14,075 కొత్తగా రానున్న బియ్యం 200 టన్నులు -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● లింగన్నపేటలో పెట్రోల్బంక్ ప్రారంభంగంభీరావుపేట(సిరిసిల్ల): మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీషిర్డీ సాయిబాబా గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్బంక్ను గురువారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా మూడు పెట్రోల్ బంక్లు నడుస్తున్నాయన్నారు. పేదల సంక్షేమం ఎజెండాగా ఇందిరమ్మ పాలన కొనసాగుతోందన్నారు. గత పాలకులు ప్రజల ప్రయోజనాలు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్, మానేరు, నాగార్జునసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నేటికి ప్రజలకు సేవలందిస్తున్నాయన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాల పథకం ప్రారంభించి ఇప్పటికే రెండుసార్లు చెల్లించినట్లు గుర్తు చేశారు. మహిళల ఆదాయం పెంచేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పాడిపశువుల పెంపకం, ఇందిరాశక్తి క్యాంటీన్, ఆర్టీసీకి అద్దె బస్సులు, పాఠశాలలకు ఏకరూప దుస్తులు కుట్టడం వంటి అనేక మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఏఎంసీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హమీద్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, ఐకేపీ ఏపీఎం సుదర్శన్, సీసీ దోమకొండ సురేందర్ పాల్గొన్నారు. విద్యతోనే ఉన్నత లక్ష్యాలు సాధ్యం గంభీరావుపేట/తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్య ద్వారానే ఉన్నత లక్ష్యాలు సాధ్యమని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. దమ్మన్నపేట, మండెపల్లి మోడల్స్కూళ్లలో ఆన్ అకాడమీ ద్వారా ఆన్లైన్ తరగతులను కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఢిల్లీ విద్యార్థులకు అందే శిక్షణ నేడు సాంకేతికతను వినియోగించుకొని రాజన్నసిరిసిల్ల జిల్లా విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్లు మారుతిరెడ్డి, జయంత్కుమార్, ప్రిన్సిపాల్స్ శ్రీలత, విఠల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ పాల్గొన్నారు. -
రాజన్న సేవలో ఎస్పీ
వేములవాడ: రాజన్నను ఎస్పీ మహేశ్ బి గీతే గురువారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఎస్పీకి వేదమంత్రాలతో స్వాగతం పలికారు. కళ్యాణ మండపంలో వేదోక్త ఆశీర్వచనాలు, పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ లడ్డూ ప్రసాదం అందజేశారు. టౌన్ సీఐ వీరప్రసాద్ ఉన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలోని ప్రధాన రహదారుల్లోని జంక్షన్ల వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్లే దారిలో వేములవాడ మండలం నాంపల్లి, రుద్రవరం, ఆరెపల్లి, బోయినపల్లి మండలం కొదురుపాక, వెంకట్రావుపల్లి వరకు ప్రమాదాలు జరిగే స్పాట్లను గురువారం పరిశీలించారు. ప్రమాదాలు జరిగే రోడ్డు పరిసరాల్లో రంబుల్ స్ట్రిప్, స్టడ్స్లైట్స్, సోలార్ లైట్లు, అజార్డ్ మార్కర్స్ అమర్చేందుకు స్థలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్, జిల్లా రవాణాశాఖ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, ట్రాఫిక్ ఎస్సై రాజు, ఆర్అండ్బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఏఈఈ నవ్య తదితరులు ఉన్నారు. రేపు జావలిన్ డే పోటీలు సిరిసిల్లటౌన్: నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా ఆగస్టు 2న జావెలిన్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కర్యాదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. అండర్ 8, 10, 12, 14, 16, 18, 20 మెన్ అండ్ ఉమెన్స్కు జావెలిన్, పరుగుపందేల ఎంపిక పోటీలు శనివారం సిరిసిల్ల జూనియర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారిని ఆగస్టు 7న జనగాంలో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తహసీల్దార్ జారిచేసిన డేట్ ఆఫ్ బర్త్, పదో తరగతి సర్టిఫికెట్లు ఒరిజినల్, జిరాక్స్లతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 79014 64456, 94414 56385, 93928 80231లలో సంప్రదించాలని కోరారు. ఉద్యోగుల సేవలు గుర్తుండిపోతాయి వేములవాడ: ఉద్యోగులు చేసిన సేవలు గుర్తిండిపోతాయని ఈవో రాధాభాయి పేర్కొన్నా రు. రాజన్న ఆలయంలో సహాయక ఇంజినీర్(సివిల్)గా పనిచేసిన ఆర్.లక్ష్మణ్రావు, ఇటీవల బదిలీపై వచ్చిన జి.లక్ష్మణ్ గురువారం ఉద్యోగ విరమణ పొందారు. వారిని ఉద్యోగుల సంఘం నాయకులతో కలిసి ఈవో రాధాభాయి సన్మానించారు. యూనియన్ అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్ పాల్గొన్నారు. చక్కగా చదివి.. గొప్పగా ఎదగాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చక్కగా చదివి గొప్పగా ఎదగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆకాంక్షించారు. మండలంలోని ఓబు లాపూర్ ప్రభుత్వ పాఠశాలలోని పదోతరగతి విద్యార్థులు 24 మందికి మోదీ గిఫ్ట్ పేరుతో గురువారం సైకిళ్లు పంపిణీ చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, హెచ్ఎం బండి ఉపేందర్, నాయకులు సందెవేని రాజు, రాగుల లక్ష్మణ్రెడ్డి, ఆసాని రాంలింగారెడ్డి, సిరిసిల్ల వంశీ, కాసుగంటి రాజు, పంచాయతీ కార్యదర్శి రఘువీరారెడ్డి పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
● జన్నారం కేంద్రంగా కార్యకలాపాలు ● కాంబోడియా దేశం నుంచి సూచనలు ● వివరాలు వెల్లడించిన డీసీపీ భాస్కర్ జన్నారం: జన్నారం కేంద్రంగా సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సైబర్ నేరాలకు వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆయన కార్యాలయంలో బుధవారం వెల్లడించారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్(వీ) గ్రామానికి చెందిన భావు బాపయ్య 2024 జూలైలో కాంబోడియా దేశానికి వెళ్లి రెస్టారెంట్లో పనికి కుదిరాడు. బాపయ్యకు కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన పాలవల్సుల సాయికృష్ణ ఉరఫ్ జాక్ ఉరఫ్ రాజు విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తుండగా 2023లోనే ఛండీఘర్లో పరిచయమయ్యాడు. 2024లో రాజు కాంబోడియా వెళ్లి బాపయ్యను రెస్టారెంట్లో కలిశాడు. ఈ ఏడాది ఏప్రిల్లో బాపయ్య ఇండియాకు తిరిగి వచ్చాడు. ఓ రోజు వాట్సాప్లో బాపయ్యను సాయికృష్ణ సంప్రదించి.. జన్నారం ప్రాంతంలో తనకు ఒక అద్దె ఇల్లు కావాలని కోరాడు. దీనికి బాపయ్య తన చెల్లెలి భర్త, జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రాజేశ్తో కలిసి కలమడుగు గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఏడాది మేలో సాయికృష్ణ వాట్సాప్లో బాపయ్యను సంప్రదించి.. ఓ వ్యక్తి ద్వారా సామగ్రి పంపిస్తున్నానని, దానిని జగిత్యాల బస్టాండ్కు వెళ్లి తీసుకుని అద్దె గదిలో ఉంచాలని సూచించాడు. ఆ సమయంలో బాపయ్య అందుబాటులో లేకపోవడంతో అతడి తమ్ముడు మధుకర్ సామగ్రిని తీసుకెళ్లి కలమడుగులోని అద్దె గదిలో ఉంచారు. తర్వాత నెట్ కనెక్షన్, ఇన్వర్టర్, ల్యాప్టాప్ సమకూర్చుకున్నారు. తాను చెప్పినట్లు చేయాలని, ఇందుకు నెలకు రూ.30వేల చొప్పున ఇస్తానని, పైగా వచ్చిన సొమ్ములో వాటా కూడా ఇస్తానని బాపయ్య, మధుకర్, గొట్ల రాజేశ్ను సాయికృష్ణ పనికి కుదుర్చుకున్నాడు. వీరితోపాటు అప్పటికే ఆన్లైన్ గేమ్స్ ఆడి రూ.లక్షలు పోగొట్టుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన యాండ్రాపు కామేశ్ను నెలకు రూ.70వేల జీతం, వాటా ఇస్తానని ఉద్యోగానికి కుదుర్చుకున్నాడు. కామేశ్కు ఢిల్లీలోని ఓ వీల్స్ కంపెనీలో డీజిల్ సేల్స్లో అకౌంట్ కీ మేనేజర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ క్రమంలో బాపయ్య, మధుకర్, గొట్ల రాజేశ్, కామేశ్ కలిసి అద్దె గదిలో డీలింక్ రూటర్లు, ల్యాప్టాప్, సిమ్ ప్యానల్ ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించారు. ఆధారాలు లేని సిమ్కార్డులు 350 కొనుగోలు చేశారు. సాయికృష్ణ టెలిగ్రాం యాప్ ద్వారా చెప్పినట్లు ఈ నలుగురు ప్యానెల్లో సిమ్లు అమర్చి, కొంత సమయం తర్వాత తీయడం, కొత్త సిమ్లు పెట్టడం చేస్తూ ఉండేవారు. సిమ్బాక్స్ పరికరాలు ఏర్పాటు చేసి వివిధ రకాలైన ఐఎంఈఐ నంబర్లు, లింకులు తయారు చేసి సైబర్ నేరాలు పాల్పడుతూ అమాయక ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. పట్టుబడింది ఇలా.. ఢిల్లీకి చెందిన టెలి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సాంకేతిక పరిజ్ఞానంతో వీరి బండారాన్ని గుర్తించింది. రామగుండం సైబర్ క్రైం, పోలీసులు టెక్నికల్ సహాయంతో బుధవారం కలమడుగు చేరుకుని సోదాలు నిర్వహించారు. సోదాల్లో కామేశ్, భావు బాపయ్య, మధుకర్, గొట్ల రాజేశ్ పట్టుబడ్డారు. వారిని అరెస్ట్ చేసి సైబర్ నేరాలకు వినియోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ కాల్స్ లింక్స్ ఉన్నందున లోతైన విచారణ చేస్తున్నామని డీసీపీ వివరించారు. నిందితులను పట్టుకున్న మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సైబర్ క్రైం డీసీపీ వెంకటరమణరెడ్డి, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ అలెన్, అనురాగ్, సైబర్ క్రైమ్ సీఐలు కృష్ణమూర్తి, శ్రీనివాస్, ఎస్సైలు గొల్లపెల్లి అనూష, సురేశ్, తహసీనోద్దీన్ను రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీ అభినందించారు. -
మతోన్మాదం రేపడమే బీజేపీ లక్ష్యం
సిరిసిల్లటౌన్: దేశంలో మతోన్మాదం రేపుతూ, ఓట్లు దండుకోవడమే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ వి.హన్మంతరావు అన్నారు. బీసీల కులగణన చేయాలని ఉద్యమిస్తున్న రాహుల్గాంధీ ఆకాంక్షను హర్షిస్తూ బుధవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కులగణన జరగలేదని, బీసీలకు అనేక బాధలు ఉన్నాయని, ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తాము ప్రధాని మోదీని కోరినా పట్టించుకోలేదన్నారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే బీసీ కులగణన జరగాలని రాహుల్గాంధీ ప్రగాఢంగా నమ్మి ఆ దిశగా ఉద్యమిస్తున్నారని, ఇందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. దేశంలో యాభైశాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తారని ఇది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. రాహుల్గాంధీ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్కు తగ్గట్టుగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ముస్లిం రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ హిందూదేశంగా మార్చాలని కుట్రపూరితంగా ఉన్నాయన్నారు. బీసీ కులగణన కోసం ఆగస్టులో జంతర్మంతర్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పీసీసీ కార్యవర్గ సభ్యుడు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, సూర్య దేవరాజు, వెలుముల స్వరూపరెడ్డి, బొప్ప దేవయ్య, రాపల్లి కళ్యాణ్, గుండ్లపెళ్లి గౌతమ్, ఆడెపు చంద్రకళ, మడుపు శ్రీదేవి, కల్లూరి చందన తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ హనుమంతరావు -
డాబాపై కూరగాయల సాగు
జగిత్యాలఅగ్రికల్చర్: రసాయనాల నుంచి తప్పించుకునేందుకు చాలామంది పట్టణవాసులు ఇంటిపై.. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు పండించుకుంటున్నారు. తద్వారా ఆరోగ్యమైన ఆహారం పొందడంతోపాటు మనస్సుకు ఆనందం, ఆహ్లాదం అందించుకుంటున్నారు. గృహిణులు ఒకప్పుడు ఖాళీ ప్రదేశాల్లో పువ్వులు, అలంకరణ మొక్కలకు ప్రాధాన్యమిస్తే.. ఇప్పుడు రోజువారీ ఆహారంలో ఉపయోగించే ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. ● ఆహ్లాదకర వాతావరణంలో.. కూరగాయలు పండిస్తున్న రైతులు ఎక్కువగా క్రిమిసంహారక మందులు వినియోగిస్తుండటంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కొందరు వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి రసాయనాలు లేకుండా.. ఇంటికి అవసరమైన కూరగాయలను ఇంటి డాబాపై, ఖాళీ ప్రదేశాల్లో పండించుకునేందుకు గృహిణులు ముందుకొస్తున్నారు. ఇంటి వాతావరణం మారిపోవడంతోపాటు చల్లని గాలి, పచ్చని మొక్కల మధ్య సేద తీరుతున్నారు. ● తేలికపాటి కుండీల ఎంపిక డాబాపై కూరగాయల పెంపకానికి తేలికపాటి కుండీలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ కుండీలు, పైబర్తో తయారు చేసిన గ్రోబ్యాగ్స్ ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ బకెట్లు, వాటర్ క్యాన్లు, సింక్ తొట్టీలు, పాత టైర్లు.. ఇలా అన్నింటిని కూరగాయల పెంపకానికి ఎంపిక చేసుకుంటున్నారు. నిటారుగా ఉండే అంతస్తుల కుండీలు, వేలాడేదీసే కుండీలను కూడా వాడుకోవచ్చు. ఇనుపకుండీలైతే మొక్క వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. లోతు వేరు వ్యవస్థ గల మొక్కలకు ఎక్కువ లోతు కుండీలు.. తక్కువ వేరు వ్యవస్థ గల మొక్కలకు తక్కువ లోతు కుండీలను ఎంచుకోవాలి. బొప్పాయి, అరటి వంటి పెద్ద మొక్కలకు పెద్ద పరిమాణం గల ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగించవచ్చు. ● గ్రోబ్యాగ్స్ అనుకూలం గ్రో బ్యాగ్స్.. తక్కువ బరువు ఉండి, డాబాపై కూరగాయల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న మొక్కలకు అనుగుణంగా గ్రోబ్యాగ్స్ వినియోగించాలి. మార్కెట్లో వివిధ పరిమాణాలు, ఆకారాల్లో దొరుకుతాయి. వీటిలో మట్టి పరిమాణం తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలి. మట్టి మిశ్రమం అధికంగా ఉంటే డాబాపై బరువు పెరుగుతుంది. ఎర్రమట్టి, కోకోపీట్, పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు వంటి తేలికపాటి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని కుండీల్లో నింపాలి. మార్కెట్లో రెడీమేడ్ కుండీ మిశ్రమం కూడా దొరకుతోంది. మట్టి మిశ్రమాన్ని నింపేటప్పుడు పైభాగంలో కొంత ఖాళీ వదలాలి, ● మొక్కల ఎంపిక ప్రధానం డాబాపై మొక్కల పెంపకానికి కూరగాయల ఎంపిక ప్రధానం. కాలానుగుణంగా పండే కూరగాయలను ఎంపిక చేసుకోవాలి. శీతాకాలంలో దాదాపుగా అన్ని రకాల కూరగాయలను పండించవచ్చు. వేసవిలో క్యాబేజీ, కాలీప్లవర్, క్యారెట్, ఆలుగడ్డ మినహాయించి మిగతా కూరగాయలు పండించవచ్చు. తీగజాతి వాటికి పందిరి వేసుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి షేడ్నెట్ వేసుకోవాలి. ఈ పద్ధతిలో కుటుంబ అవసరాలకు అనుగుణంగా నాలుగు రకాల కూరగాయలు, రెండు లేదా మూడు రకాల ఆకుకూరలు పండించవచ్చు. ● నీటి యాజమాన్యం కీలకం దాబా తోటల్లో నీటిని క్యాన్ ద్వారా అందించవచ్చు. స్వయంగా మొక్క వయస్సు, ఎదుగుదలను బట్టి ఎంత నీరు అవసరముంటే అంత నీరు ఇవ్వవచ్చు. ఇంట్లోని వ్యర్థాల నుంచి కంపోస్టు తయారు చేసి మొక్కలకు పోషకాలు అందించవచ్చు. మొక్కల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి చీడపీడలు వస్తే చేతి ద్వారా తీసివేయవచ్చు. తీగజాతి కూరగాయల్లో పండు ఈగ వస్తే లింగాకర్షక బుట్టలు వాడి నివారించవచ్చు. ఎక్కువ చీడపీడలు వస్తే వేప నూనెను లీటర్ నీటికి 5 మి.లీ పిచికారీ చేస్తే సరిపోతుంది. రసాయనాలు లేని ఆకుకూరలు, కూరగాయలు అవగాహనతో ఆరోగ్యం కాపాడుకుంటున్న జనం కొన్నేళ్లుగా సాగు చేస్తున్న కొన్నేళ్లుగా ఇంటి పరిసరాలతోపాటు డాబాపై కూరగాయలు సాగు చేస్తున్నాను. మార్కెట్కు వెళ్లే అవసరం లేకుండాపోయింది. పూత నుంచి పిందె, కాత వరకు జరిగే చర్యలు కూడా ఆసక్తికరంగా ఉంటుండటంతో ప్రతిరోజు ప్రతి మొక్కనూ పరిశీలిస్తాను. – సముద్రాల జ్యోతి, గృహిణి, జగిత్యాల చాలా కూరగాయలు పెంచొచ్చు ఇంటి ఖాళీ ప్రదేశాలు, డాబాలపై కూరగాయలు పెంచుకోవచ్చు. ఆసక్తి గల గృహిణులు గ్రూపుగా ముందుకొస్తే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తాం. కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలతోపాటు చిన్నపాటి సంచుల్లో టమాట, మిర్చి వంటి కూరగాయలు సాగు చేయవచ్చు. మా శాఖ తరఫున అవగాహన కల్పిస్తున్నాం. – స్వాతి, ఉద్యానశాఖాధికారి, జగిత్యాల -
ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ
జగిత్యాలక్రైం: ప్రభుత్వ పనులు చేపట్టిన సివిల్ కాంట్రాక్టర్కు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన జగిత్యాల పంచాయతీ రాజ్ శాఖలో విజిలెన్స్ క్వాలిటీకంట్రోల్ విభాగం ఏఈ అనిల్ బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కోరుట్ల మండలం చిన్నమెట్పల్లికి చెందిన పంచరి వెంకటేశ్ సవిల్ కాంట్రాక్టర్. ఐదేళ్ల క్రితం కోరుట్లలో రూ.13.80 లక్షలతో ఎల్లమ్మ (గౌడ) కమ్యునిటీ హాల్ నిర్మించాడు. ఎంబీ రికార్డు కూడా పూర్తయింది. అలాగే రెండేళ్ల క్రితం రూ.4.50 లక్షలతో చిన్నమెట్పల్లిలో హనుమాన్ కమ్యునిటీ హాల్ నిర్మించాడు. కోరుట్లలోని ఆర్డీవో కార్యాలయం ప్రహరీని రూ.5లక్షలతో పూర్తి చేసి ఎంబీ రికార్డు పూర్తి చేయించాడు. మొత్తం మూడు పనులను రూ.23.30లక్షలతో పూర్తి చేశాడు. వాటికి సంబంధించిన బిల్లుల కోసం ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఏఈ అనిల్కుమార్ను కొన్నాళ్లుగా కోరుతున్నాడు. రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చిన అనిల్.. గత శనివారం రూ.18 వేలు డిమాండ్ చేశాడు. దీనికి వెంకటేశ్ రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుని అదేరోజు రూ.3వేలు అడ్వాన్స్గా ఇచ్చాడు. అనంతరం ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం కరీంనగర్రోడ్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖ విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం వద్ద కాపుకాశారు. వెంకటేశ్ నుంచి అనిల్ రూ.7వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేశారు. అనిల్ను కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నంబరు 1064లో సంప్రదించాలని డీఎస్పీ వివరించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు పున్నం చందర్, కృష్ణకుమార్, తిరుపతి, సిబ్బంది శ్రీకాంత్, విష్ణు, బాలు, మొగిలయ్య పాల్గొన్నారు. రూ.7వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టివేత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్తో డబ్బుల డిమాండ్ ఏసీడీ డీఎస్పీ విజయ్కుమార్ వెల్లడి -
సౌదీలో భూషణరావుపేట యువకుడు ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం భూ షణరావుపేటకు చెందిన స ంగెం వినోద్ (30) సౌదీ అరేబియా దేశంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రా మస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సంగెం గంగరా జం– సరోజన దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వినోద్ పెద్ద కుమారుడు. ఆయన కొంతకాలంగా గల్ఫ్ దేశం వెళ్లి వస్తున్నా డు. ఏడాదిన్నర క్రితం సౌదీ వెళ్లాడు. ఈనెల 22న వినోద్ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి వారు కుటుంబసభ్యులకు బుధవారం ఫోన్లో సమాచారం ఇచ్చారు. వినోద్కు ఇంకా పెళ్లి కాలేదు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని బంధువులు పేర్కొన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదుజగిత్యాలక్రైం: భార్యను హత్య చేసిన భర్తకు జీ విత ఖైదుతోపాటు, రూ.2 వేల జరిమానా విధి స్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నారా యణ బుధవారం తీర్పునిచ్చారు. కోరుట్ల మండలం యెకిన్పూర్కు చెందిన ఎర్ర చంద్రయ్య, భార్య గంగరాజు కూలీలు. చంద్రయ్య మద్యాని కి బానిసై గంగరాజుతోపాటు కొడుకును వేధించేవాడు. 2022 అక్టోబర్ 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో భార్యతో ఘర్షణ పడి ఆమెను హత్య చేసి.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని మృతదేహాన్ని మూ టకట్టి యెకిన్పూర్ శివారులో పడేశాడు. మృతురాలి కుమారుడు సుధీర్ ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసి చంద్రయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు కోర్టులో సాక్షులను హాజరుపర్చారు. దీంతో చంద్రయ్యకు జడ్జి శిక్ష ఖరారు చేశారు. హాస్టల్ నుంచి పారిపోయిన విద్యార్థులు● స్థానికులు పట్టుకుని తిరిగి అప్పగింత ● ఘటన ఆలస్యంగా వెలుగులోకి.. మల్యాల: మండలకేంద్రం శివారులోని జగిత్యా ల అర్బన్ గురుకులం విద్యార్థులు హాస్టల్ గోడ దూకి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకులాన్ని గతేడాది జగిత్యాల నుంచి మండలకేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్కు తరలించారు. ప్రస్తుతం ఇక్కడ 6, 7, 8 తరగతుల విద్యార్థులు 40మంది ఉన్నారు. ఈ ఏడా ది అడ్మిషన్ తీసుకున్న ఇద్దరు ఆరు, ఎనిమిదో తరగతి విద్యార్థులు సోమవారం రాత్రి హాస్టల్ గోడ దూకి పారిపోయారు. వారిని మండలకేంద్రంలో గుర్తించి తిరిగి వార్డెన్కు అప్పగించారు. హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఇరువర్గాలపై కేసు సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): భూ సమస్యపై గొడవపడగా ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్కుమార్ బుధవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన ఏరుకొండ సరోజన, భర్త తిరుపతి, కరీంనగర్ జిల్లా చర్లబూత్కూర్కు చెందిన బుర్ర రేణుక, భర్త రాములు, అల్లిపూర్కు చెందిన బండ రాణి, భర్త భూమయ్య, రేగడిమద్దికుంటకు చెందిన ముంజాల అశోక్, ఏరుకొండ వినోద్తోపాటు మరోవర్గం ముంజల శ్యామల, భర్త సతీశ్ భూసమస్యపై మంగళవారం గొడవ పడ్డారు. ఇదేసమయంలో పెట్రోలింగ్కు వెళ్లిన బ్లూకోల్ట్స్ సిబ్బంది వారిని సముదాయించినా వినకుండా పోలీస్స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. బుధవారం ఇరువర్గాలను సీఐ సుబ్బారెడ్డి ఠాణాకు పిలిపించి నోటీసులు అందించారు. గొడవ పడొద్దని కౌన్సెలింగ్ ఇస్తుండగా, ఏరుకొండ వినోద్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో వినోద్పై కేసు నమోదు చేశా రు. ఈ విషయమై సీఐని సంప్రదించగా భూ సమస్యపై ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యా దుతో ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతిగొల్లపల్లి: చదువు ఇష్టం లేక మనస్తాపంతో ఈనెల 25న క్రిమి సంహారక మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని గోవిందుపల్లికి చెందిన బోనగిరి సూర్య బుధవారం మృతిచెందినట్లు ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. సూర్యను ఇంటర్ చదువు నిమిత్తం తల్లిదండ్రులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. అక్కడ చదువుకోవడం ఇష్టం లేక ఇంటికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు మందలించడంతో ఈనెల 25న ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. వెంటనే తల్లిదండ్రులు అతడిని చికిత్స నిమిత్తం కరీంనగర్కు తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. సూర్య తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ట్రాక్టర్ యజమానుల బైండోవర్
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరు వాగునుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మహేశ్, అశోక్ను బుధవారం తహసీల్దార్ రాజేశ్ ఎదుట బైండోవర్ చేసినట్లు కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. మరోసారి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లయితే రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించేలా సొంత పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు వివరించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సెల్ఫోన్ అప్పగింత కరీంనగర్ గోదాంగడ్డకు చెందిన బోయిని రాజేశ్ పోగోట్టుకున్న సెల్ఫోన్ను సీఈఐఆర్ టెక్నాలజీ ద్వారా పట్టుకుని బుధవారం బాధితుడికి అప్పగించినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. జనవరి 6న మొగ్ధుంపూర్లో రాజేశ్ సెల్ఫోన్ పోగొట్టుకోగా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఈఐఆర్ టెక్నాలజీతో నిజామాబాద్లో గుర్తించి పట్టుకున్నట్లు వివరించారు. -
కొడుకు, కోడలు మధ్య మనస్పర్థలు
జూలపల్లి(పెద్దపల్లి): తన కొ డుకు, కోడలు మధ్య మనస్పర్థలు తలెత్తాయనే మనస్తాప ంతో జెన్కో ఉద్యోగి మేడుదుల రాజన్న (49) బుధవారం తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్ర ం లోనే ఉరివేసుకుని ఆత్మ హ త్య చేసుకున్నాడు. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన రా జన్న జూలపల్లి మండలం కాచాపూర్ 14వ మైలురా యి వద్ద గల జెన్కో జలవిద్యుత్ కేంద్రంలో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయనకు కుమారుడు సాయికుమార్, ఒక కూతురు ఉన్నారు. సాయికుమార్ 2020లో మేకల కావ్యను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు(3) ఉన్నాడు. అయితే, ఎంబీఏ చదువుకునేందు కు సాయికుమార్ 2022లో యూకేకు వెళ్లాడు. ఆ త ర్వాత ఆయన భార్య కావ్య తనతల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటోంది. 2024లో ఇండియాకు తిరిగి వచ్చిన సాయికుమార్.. తన భార్యను కాపురానికి రమ్మని అనేకసార్లు కోరినా ఆమె తిరస్కరించింది. దీంతో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడి పంచాయితీలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే తన కుమారుడి సంసారం సాఫీగా సాగడం లేదనే మనస్తాపానికి గురైన తండ్రి రాజన్న.. తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్రంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య జలవిద్యుత్ కేంద్రంలో బలవన్మరణం -
వడ్డీ రావడం సంతోషం
సీ్త్రనిధి ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించగా, ఆరునెలల వడ్డీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరునెలల డబ్బుల కోసం కొంత జాప్యం జరిగింది. మొత్తానికి డబ్బులు రావడంతో అందరు సంతోషంగా ఉన్నారు. – వెన్నెల, వీవో, రాజన్నపేట సకాలంలో చెల్లించాం ప్రభుత్వం నుంచి సీ్త్రనిధి ద్వారా రుణం తీసుకున్నం. వడ్డీ వస్తుందనే సభ్యులు స క్రమంగా సకాలంలో రుణాలు చెల్లించారు. ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా వడ్డీ డబ్బులు వస్తే అందరూ ఆర్థికంగా బలపడుతారు. – కొల బాలలక్ష్మి, సింగారం ఖాతాల్లో జమచేశాం ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాగానే సభ్యుల ఖాతాల్లో జమ చేశాం. సభ్యులు వడ్డీ డబ్బుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన మహిళా సంఘాలకు క్రమం తప్పకుండా ప్రతి ఆరునెలలకు ఒకసారి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి వడ్డీ తీసుకోవడం అభినందనీయం. – మల్లేశం, ఏపీఎం, ఎల్లారెడ్డిపేట -
పరిసరాలు శుభ్రంగా ఉంచాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రభుత్వ పాఠశాలల్లో పరి సరాల పరిశుభ్రత చాలా ముఖ్య మని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. బుధవారం ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉ న్నత, ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థుల హాజరును స్వయంగా తీసుకున్నారు. జెడ్పీ స్కూల్ ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంపై అ సంతృప్తి వ్యక్తం చేశారు. చెత్త, గడ్డిని తొలగించాలని ఆదేశించారు. తరగతి గదులు, మధ్యా హ్న భోజనం తయారీని పరిశీలించారు. పాఠశాలకు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలని, డైనింగ్ హాల్లో బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల మైదానంలో సీసీ వేయాలని, డ్రైనేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఒకే చోటికి తీసుకురావాలని సూచించారు. మ ధ్యాహ్న భోజనం కట్టెల పొయ్యిలపై వండరాద ని, అవసరమైన గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాలని ఎంఈవోను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి, హెచ్ఎం రవీందర్రెడ్డి, నాయకులు విజయ్రెడ్డి, భాను, తదితరులున్నారు. -
కలెక్టర్ ఆర్థిక చేయూత
సిరిసిల్లకల్చరల్/కోనరావుపేట: ఆపన్నులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆర్థిక చేయూత అందించారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన దుంపెట దక్షిత మధ్యప్రదేశ్లోని కత్నిలో సైనిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఇందుకోసం రూ.2.5లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంది. పేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఆదుకోవాలని దక్షిత తండ్రి నాగరాజు అభ్యర్థన మేరకు కలెక్టర్ రూ.లక్ష చెక్కును బుధవారం కలెక్టరేట్లో అందజేశారు. అలాగే ముస్తాబాద్ మండలం ఆవునూర్కు చెందిన తస్లీమా అనారోగ్యంతో, చిన్నలింగాపూర్కు చెందిన అనంతలక్ష్మి కంటి సమస్యతో బాధపడుతుండగా, తస్లీమాకు రూ.20వేలు, అనంతలక్ష్మికి రూ.10 వేలు అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. లింగ నిర్ధారణ చేస్తే చర్యలుసిరిసిల్లకల్చరల్: గర్భస్థ పిండ ఆరోగ్య స్థితి తెలుసుకునే స్కానింగ్ పరీక్షలను జిల్లాలో కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారని, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత హెచ్చరించారు. బుధవారం నిర్వహించిన జిల్లా అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆడపిల్ల అని తెలిసి గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిరూపణ అయిన స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. రేడియాలజిస్టు, డాక్టర్ పట్టా రద్దు కోసం సిఫారస్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, డాక్టర్ సంతోష్, చింతోజు భాస్కర్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేటలో విషజ్వరాలు కోనరావుపేట(వేములవాడ): మండలకేంద్రంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కొద్దిరోజు లుగా వడ్డెరకాలనీలో సుమారు 20 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. వీరిలో ఇద్దరికి డెంగీ నిర్ధారణ అయినట్లు తెలిసింది. కాగా, వడ్డెరకాలనీలో పారిశుధ్య పనులు సక్రమంగా లేకపోవడం సమస్యగా మారింది. రహదారులపై, ఇళ్ల సమీపంలో మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి కాలనీవాసులు జ్వరాల బారిన పడుతున్నారు. పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో స్థానికులు జ్వరాలబారిన పడుతున్నట్లు భావిస్తున్నారు.