ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ఎంపిక
ముస్తాబాద్(సిరిసిల్ల): ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన గండికోట రాజు ఎంపికయ్యాడు. శాతావాహన యూనివర్సిటీలో ఎంకాం సెకండియర్ చదువుతున్నాడు. శాతవాహన విశ్వవిద్యాలయం తరఫున నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటాడు. మైసూర్లో జరిగే సౌత్జోన్ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
ఆరు విద్యుత్ మోటార్లు చోరీ
జగిత్యాలరూరల్: జగిత్యాలఅర్బన్ మండలం తిప్పన్నపేట, గోపాల్రావుపేటలో ఆరుగురు రైతుల వ్యవసాయ మోటార్లు, ఓ రైతు ట్రాక్టర్ బ్యాటరీని ఆదివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. తిప్పన్నపేట, గోపాల్రావుపేటకు చెందిన దావ శంకర్, కొల్లూరి రవి, అత్తినేని గంగాధర్, పున్నం ప్రసాద్ విద్యుత్ మోటార్లు, కొల్లూరి రాజేశ్కు చెందిన ట్రాక్టర్ బ్యాటరీని అపహరించారు. బాధితులు సోమవారం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.


