breaking news
Rajanna Sircilla District Latest News
-
హోరెత్తిన డిజిటల్ ప్రచారం
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం ఈసారి సోషల్మీడియాలో హోరెత్తింది. యూత్ను టార్గెట్ చేస్తూ ఆకట్టుకునేలా వీడియోలు చేసి సోషల్మీడియాలో వదిలారు. వీరు.. వారు.. అనే తేడా లేకుండా అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారానికి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను వాడుకున్నారు. తమ వార్డులో చేయబోయే పనులు తెలుపుతూ యూట్యూబ్లో షార్ట్ వీడియోలను రిలీజ్ చేశారు. మరికొందరు తమ వార్డు పరిధిలోని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. ట్రెండింగ్ సాంగ్స్కు స్టెప్పులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా వీడియోలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ ప్రచార పద్ధతులూ మారుతున్నాయి. నిన్నటి వరకు వీధివీధి ప్రచారం, గోడలపై వాల్పోస్టర్లే ప్రధాన ఆయుధాలైతే ఇప్పుడు అభ్యర్థులు మొబైల్ స్క్రీన్నే ప్రచారవేదికగా మార్చేశారు. వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ పోస్టులు, ఇన్స్టాగ్రామ్ రీల్స్తో మున్సి పల్ ఎన్నికలకు డిజిటల్ రంగు పులుముకుంది. వార్డుకో గ్రూపు ప్రతీ వార్డుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు, రోజుకో వీడియో, గంటకో పోస్టు ఓటరిని నేరుగా కలవాల న్న ప్రయత్నంలో సోషల్మీడియాను వేదికగా చేసుకున్నారు. ‘నా పని చూడండి.. నా మాట వినండి’ అంటూ అభ్యర్థులు స్వయంగా వీడియోల్లో దర్శనమిస్తున్నారు. కొందరైతే కుటుంబసభ్యులతో కలిసి రీల్స్ తీస్తూ స్థానిక గ్రూప్లలో ప్రచారం చేస్తున్నా రు. ఇక రాజకీయ విమర్శలకు సైతం సోషల్మీడియానే వేదికగా నిలుస్తుంది. ఒకప్పుడు సభల్లోనే వినిపించిన హామీలు ఇప్పుడు స్టేటస్లుగా మారి ఓటర్ల చేతిలోని మొబైల్పోన్లలో కనిపిస్తున్నాయి. రీల్స్లో హామీలు యువ ఓటర్లే టార్గెట్ ట్రెండింగ్ సాంగ్స్తో ప్రజల్లోకి.. వీడియోలతో విజన్ చూపుతుండ్రు -
తడారిన గుండెలకు..పసిహృదయాల స్పర్శ
గంభీరావుపేట(సిరిసిల్ల): ఎవరూ లేరని ఆ గుండెలు తడారిపోయాయి. మలివయసులో అనాథ వృద్ధాశ్రమంలో సేద తీరుతున్న వారిని పసిహృదయాలు తట్టిలేపాయి. వృద్ధుల అనుభవాలు.. విద్యార్థుల పలకరింపులతో రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని మా అనాథ వృద్ధాశ్రమం అనుబంధాల వేదికగా నిలిచింది. మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యాసంస్థల్లో భాగమైన జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు ‘మా’ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని సోమవారం సందర్శించారు. ఆశ్రమంలోని వృద్ధులతో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించారు. పసిపిల్లల ఆప్యాయతను చూసిన ఆ వృద్ధులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్దమనసు చూస్తామని ఊహించలేదంటూ పలువురు కన్నీరుపెట్టారు. కుటుంబాలకు దూరంగా జీవి స్తున్న తమకు ఈ పిల్లల రాక ఓ పండుగలా మారిందన్నారు. వృద్ధులపై మన బాధ్యత ఏమిటో గుర్తు చేసేలా ఈ సందర్శన నిలిచిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి 25 కిలోల సన్నబియ్యం అందించారు. పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం భూస లక్ష్మణ్, తెలుగు సబ్జెక్టు టీచర్ శివకుమార్ పాల్గొన్నారు. అనాథ వృద్ధులను పలకరించిన విద్యార్థులు వృద్ధుల జ్ఞాపకాలు.. విద్యార్థుల పలకరింపులు అనుబంధాల వేదికగా మా అనాథ వృద్ధాశ్రమం -
పెట్టుబడులపై అవగాహన
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సోమవారం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో పెట్టుబడులపై అవగాహన సదస్సు నిర్వహించారు. అధ్యాపకులు మహేశ్, జగన్నాథం, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ, వక్త గణేశ్ మాట్లాడారు. భవిష్యత్లో డబ్బులు సంపాదించడం ఎలా, వాటిని ఏ విధంగా పొదుపు చేస్తే లాభాలు ఆర్జించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శాస్త్రవేత్తకు డాక్టరేట్కరీంనగర్రూరల్: ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పని చేసిన కల్వల శేఖర్కు వ్యవసాయ విద్యలో పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ సాత్నకోత్సవంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక నిపుణులు ప్రభు పింగళి పట్టాను అందించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్గా పని చేస్తున్న శేఖర్.. ఉత్తర తెలంగాణలోని నేలల్లో అధిక భాస్వరం తగ్గించి చేసే యాజమాన్య పద్ధతులు, ప్రధాన పంటలను ప్లాంటర్తో ఎత్తు మడుల్లో సాగు చేస్తే అధిక వర్షాలు, తేమ తక్కువగా ఉన్న సందర్భాల్లో కలిగే పంట నష్టాలను కచ్చితంగా తగ్గించొచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఫ్రొఫెసర్ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురించారు. విద్యుత్ షాక్తో యువకుడు మృతి జమ్మికుంట(హుజూరాబాద్): ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతిచెందాడు. టౌన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలు.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన అన్న వరుణ్ (26) సోలార్ సిస్టం కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి పట్టణంలోని ఓ వ్యక్తి ఇంటిపై సోలార్ సిస్టం అమర్చేందుకు స్లాబ్పైకి ఎక్కిన క్రమంలో ఇంటిపై నుంచి వెళ్లే 11 కేవీ వైర్లు తాకి విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన ఇంటి యజమాని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి అన్న వినయ్కుమార్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. బావిలో దూకి మహిళ ఆత్మహత్య మేడిపల్లి: బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తొంబర్రావుపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై కథనం ప్రకారం.. తొంబర్రావుపేటకు చెందిన సంగ రాజు (52) కొంతకాలంగా గొంతు క్యాన్సర్తో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు కుమారుడు రమేశ్, కూతురు ధరణి ఉన్నారు. సంగ రాజు భర్త చిన్న భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపారు. -
ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలి
కోనరావుపేట: ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చకుండా అలాగే కొనసాగించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఎంపీడీవోకు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12న దేశవ్యాప్త సమ్మెలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇక్కడ రమేశ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీవోకు సమ్మె నోటీసు అందజేత వీర్నపల్లి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఈనెల చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా మండల గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీలేఖకు నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా మండల కార్మిక సంఘం అధ్యక్షుడు నర్సయ్య, కార్మికులు కమల్, శ్రీను, శేఖర్, రమేశ్, నరేశ్, మల్లేశం, ఎల్లయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. కరపత్రం ఆవిష్కరణ బోయినపల్లి: మండలకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఈనెల 12న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని రూపొందించిన కరపత్రాలను సీఐటీయూ నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ మాట్లాడుతూ కార్మికులకు గుదిబండలా మారిన లేబర్ కోడ్లను రద్దు చేయడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రామంచ అశోక్, కార్మికులు లచ్చయ్య, అంజయ్య, శంకరవ్వ, రాములు పాల్గొన్నారు. -
శ్రీచైతన్య విద్యార్థులకు ఘన స్వాగతం
కరీంనగర్టౌన్: మంకమ్మతోటలోని శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్సీసీ విద్యార్థులకు కరీంనగర్లో ఘన స్వాగతం లభించింది. కళాశాలకు చెందిన బి.సంధ్య, కె.అజయ్ అనే విద్యార్థులు 2026 సంవత్సరానికి గాను ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే క్యాంపునకు ఎన్నికయ్యారు. సుమారు 40 రోజులపాటు శిక్షణ పొంది జనవరి 26న రాష్ట్రపతి, దేశ ప్రధాని సమక్షంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కళాశాలకు చెందిన సంధ్య కర్తవ్యపత్ ర్యాలీలో, అజయ్ పీఎం ర్యాలీలో పాల్గొన్నారు. సోమవారం క్యాంప్ పూర్తి చేసుకొని వచ్చిన ఆ ఇద్దరితో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు 9టీ బెటాలియన్ సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజధానిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక పరేడ్లో తమ విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సన్మానం చేసి యాజమాన్యం తరఫున రూ.25,000 చొప్పున నగదు బహుమతి అందజేసినట్లు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణారెడ్డి, ఎన్సీసీపీఐ స్టాఫ్ పి.అశోక్, కేర్ టేకర్ జి.రాజేందర్, 9 తెలంగాణ బెటాలియన్ సుబేదారు విజయ్కుమార్, హవల్దార్ పీవీరావు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
ఇల్లంతకుంటకు బస్సు ప్రారంభం
ఇల్లంతకుంట(మానకొండూర్): వెంకట్రావుపల్లి మీదుగా ఇల్లంతకుంటకు సిద్దిపేట బస్సు సోమవారం ప్రారంభంకాగా వెంకట్రావుపల్లి, ఇల్లంతకుంట, గ్రామాల సర్పంచులు చల్ల నవీన్ రెడ్డి, మామిడి రాజు ప్రారంభించారు. మండల ప్రజలు కాంగ్రెస్ నాయకులు, ఇల్లంతకుంటకు బస్సు నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిద్దిపేట డిపో మేనేజరలకు పలుమార్లు విజ్ఞప్తి చేయగా నాలుగేళ్ల తర్వాత ఇల్లంతకుంటకు ిపునః ప్రారంభమైంది. బస్సు ప్రారంభం కావడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కే భాస్కర్ రెడ్డి, నాయకులు గుడిసె ఐలయ్య, మామిడి సంజీవ్, నాగరాజు శర్మ, మామిడి నరేశ్, బిళ్లవేని రమేశ్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మందరాజు, తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలక్రైం: జగిత్యాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్ల స్వామిరెడ్డిపై పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై సుప్రియ కథనం ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 35మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పనిచేసి.. ప్రస్తుతం అధికార దాహంతో కాంగ్రెస్ బీఫామ్లు తెచ్చుకుని.. కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం సరికాదని కరపత్రాలు ముద్రించి న్యూస్పేపర్ల ద్వారా పంపిణీ చేశారు. దీనిపై 23వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బోనగాని ఉషశ్రీ ఫిర్యాదు మేరకు స్వామిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇసుక లారీ పట్టివేతఇబ్రహీంపట్నం: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. మల్లాపూర్ మండలకేంద్రానికి చెందిన లారీ యజమాని ఇస్లావత్ శంకర్, డ్రైవర్ బూక్య వంశీ వేంపల్లి శివారు గోదావరి నది నుంచి లారీలో ఇసుకను అనుమతి లేకుండా నింపుకొని తరలిస్తుండగా ఇబ్రహీంపట్నంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద పట్టుకున్నామని, గ్రామ పంచాయతీ అధికారి సుంకం తిరుపతి ఫిర్యాదు మేరకు లారీ యజమాని, డ్రైవర్లపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మదర్ థెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో టాస్క్ ఆధ్వర్యంలో డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్క్యూఎల్ అనే అంశంపై మూడురోజుల వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్ క్యూ ఎల్కి సంబంధించి అత్యాధునిక ప్రయోగశాలలు కల్పించినట్లు రిసోర్స్ పర్సన్ రత్నప్రియ తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏవో పవన్కుమార్, అకడమిక్ ఇన్చార్జి ఇజాజ్ఖాన్, హెచ్వోడీ శశికాంత్, నవ్య, షాకీర్, శిరీష పాల్గొన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ ఫలితాలు విడుదల సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నవంబర్– 2025లో జరిగిన యూజీ (సీబీసీఎస్) (ఆర్19) మొదటి సెమిస్టర్ (బ్యాక్లాగ్), మూడవ, ఐదవ సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్లాగ్) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్కుమార్ తెలిపారు. www. satavahana.ac.in వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. -
మా నాన్నను కాపాడండి
చందుర్తి(వేములవాడ): రెక్కాడితేనే కాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఈ కుటుంబాన్ని కొద్ది రోజులుగా విధి వెంటాడుతోంది. పది నెలల క్రితం తల్లి కేన్సర్తో మృతిచెందగా.. ఇప్పుడు తండ్రి గుండె సంబంధిత వ్యాధితో ప్రభుత్వాస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఖరీధైన వైద్యం చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక, కుటుంబానికి అండగా నిలిచే దిక్కులేక ఆ ఇంటి పెద్దబిడ్డ తన తండ్రిని కాపాడాలని వేడుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన మ్యాదరి విజయ, లక్ష్మణ్ దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు పావని(16), కుమారులు నితిన్(12), రిషిత్(10). ఈ దంపతులు ఇద్దరు కూలీ పనిచేసి జీవించేవారు. గతేడాది తల్లి విజయకు నోటి కేన్సర్ వచ్చింది. వ్యాధి ముదిరి 10 నెలల క్రితం మృతిచెందింది. తండ్రి అన్నీతానై పిల్లలను సాదుకుంటున్నాడు. ఈక్రమంలో అనారోగ్యానికి గురయ్యాడు. రెండు రోజులుగా మంచం పట్టడంతో 16 ఏళ్ల కూతురు పావని సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి గుండె పంపింగ్ సరిగ్గా లేదని.. ఇక్కడ వైద్యం చేసేందుకు సౌకర్యాలు లేవని.. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యసిబ్బంది చెప్పారు. అయితే ఎలాంటి దిక్కులేని ఆ కుటుంబం చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వాస్పత్రిలో తండ్రి మంచం పక్కన కూర్చొని ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఎవరైనా దాతలు సాయం చేసి తన తండ్రి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటుంది. దాతలు 95423 96066లో సంప్రదించి, ఆదుకోవాలని కోరుతుంది. పది నెలల క్రితం కేన్సర్తో తల్లి మృతి నేడు ప్రాణాపాయ స్థితిలో తండ్రి ఆదుకోవాలని వేడుకుంటున్న కూతురు -
ప్రచారం బంద్.. ప్రలోభాలు షురూ !
సిరిసిల్ల: ఒక్కరోజు గడిస్తే.. చాలు.. పురపాలకులు ఎవరో తేలిపోనుంది. ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసే సమయం మొదలైంది. ప్రచార ఆర్భాటాలు ఎలా ఉన్నా ఈ ఒక్క రోజు రాత్రి పోల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్లే విజేతలవుతారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్లకు నజరానాలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికలను పంచభూతాలు శాసిస్తున్నాయి. ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎన్నికలకు ముందు రోజు రాత్రి ఎంతో కీలకమైంది. నమ్మకు నమ్మకు ఈ రేయిని అంటూ.. బరిలో నిలిచిన అభ్యర్థులను అనుచరులు.. ఆత్మీయులు హెచ్చరిస్తున్నారు. అంతులేని హామీలు ఎన్నికల్లో గెలిస్తే... మీ సామాజికవర్గానికి సంఘ భవనాలు నిర్మించి ఇస్తామని, మీ వాడకు సిమెంట్ రోడ్డు, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, ఆడబిడ్డ పుడితే రూ.10వేలు, బాబు పుడితే రూ.5వేలు ఇస్తామంటూ హామీలిచ్చారు. మద్యం మత్తు ఎన్నికల్లో మద్యం ప్రధాన ఇంధనంగా మారింది. ప్రచారంలో అలసి, సొలసిన నేతలకు, కార్యకర్తలకు మందుతోనే స్వాంతన లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల వేళ బీరు, బ్రాంది, విస్కీ, కల్లు పంపిణీ చేసి ఓటర్లను మత్తులో ముంచేందుకు అన్ని పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు సిద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లాలో మందు విక్రయాలు బాగా పెరిగి ద్వితీయశ్రేణి నాయకులు మత్తులో జోగుతున్నారు. ముంచెత్తుతున్న డబ్బు రాజకీయాలంటే ప్రజాసేవ అనే ధోరణి మారిపోయింది. లాభసాటి వ్యాపారంలా మారింది. ఎంత వెచ్చించాం... ఎంత సంపాదించామనే వ్యాపార లక్షణమే ఇప్పుడు కనిపిస్తుంది. దీంతో కాసులున్న వారికే పార్టీలు టికెట్ ఇవ్వగా.. ఎన్నికలకు ముందు రోజు రాత్రి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు డబ్బు పంపిణీనే నమ్ముకున్నారు. ఒక్కో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో వార్డులో అభ్యర్థులు రూ.40లక్షల నుంచి రూ.60లక్షల వరకు పంపిణీ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. వీధికో తీరు.. తాయిలాలు వేరయా కొందరు అభ్యర్థులు రోజూ బీరు, బిర్యాణీ అందిస్తున్నారు. ఎన్నికలకు ముందు రోజు ఓటర్లకు బంగారం ఉంగరాలను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు పెద్ద ఎత్తున చీరలు దిగుమతి చేసే మహిళలకు బహుమతిగా ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు ప్రతీ ఇంటికి 25 కిలోల జై శ్రీరాం బియ్యం బస్తాలను పంపిణీ చేస్తున్నారు. యువకులకు విహారయాత్రలకు తీసుకెళ్తామని చెబుతున్నారు. ఓటర్లకు వెండి వస్తువులను కానుకలుగా సమర్పిస్తున్నారు. మరికొందరు అనుచరులకు భవిష్యత్లో కాంట్రాక్టు పనులు ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నారు. బల్దియా ఎన్నికల్లో ధనప్రవాహం మరీ ఎక్కువైంది. గెలుపే లక్ష్యంగా అందరూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఏదీ ఏమైనా ఈసారి ఓటర్లను ఈ పంచభూతాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు.. ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్స్ల్లో నిక్షిప్తమవుతుంది. పురపోరులో ‘పంచ’భూతాలు -
ఆర్థిక అవగాహన పెంపొందించాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ఆర్బీఐ రూపొందించిన ఆర్థిక అక్షరాస్యత పోస్టర్లను కలెక్టర్ సోమవారం జిల్లా సంప్రదింపుల కమిటీ(డీసీసీ) సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వర్గాలలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహనను కల్పించేందుకు ఆర్బీఐ ఈనెల 9 నుంచి 13 వరకు వారోత్సవం నిర్వహిస్తుందని తెలిపారు. ఆర్బీఐ, బ్యాంకులు ఎప్పుడూ మెయిల్స్, ఎస్ఎంఎస్లు పంపదన్నారు. ఖాతా వివరాలు, పాస్వర్డ్ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడిగే కాల్స్ చేయదని స్పష్టం చేశారు. లీడ్బ్యాంక్ మేనేజర్ ఎన్.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి మూడో విడత ర్యాండమైజెషన్ను ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్రీనివాస్రెడ్డితో కలిసి పూర్తి చేశారు. డీఈవో జగన్మోహన్రెడ్డి, నోడల్ అధికారి భారతి, ఈడీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేయాలి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వేములవాడ, కొండాపూర్, మద్దికుంట, బద్దెనపల్లి, తంగళ్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో ఆరా తీశారు. హౌసింగ్ డీఈఈ సాజిద్, ఆర్అండ్బీ ఈఈ నరసింహాచారి, డీఈఈ శాంతయ్య, జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ కిశోర్కుమార్ పాల్గొన్నారు. పోలింగ్ రోజున పబ్లిక్ హాలిడే సిరిసిల్ల, వేములవాడల్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లకు మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఈనెల 11న సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. వేములవాడలో మహాశివరాత్రి జాతర సందర్భంగా పారిశుధ్యం పనులు మెరుగ్గా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఆలయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వేములవాడ మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈనెల 14 నుంచి 16 వరకు వేములవాడను 20 జోన్లుగా విభజించి ప్రతీ జోన్కు ఒక పంచాయతీ కార్యదర్శిని ఇన్చార్జీగా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అందరూ ఈనెల 13 నుంచి 17 వరకు వేములవాడలో సేవలు అందించాలని ఆదేశించారు. డీఆర్డీవో మచ్చ గీత, డీపీవో షరీఫొద్దీన్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ/వేములవాడరూరల్: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో సోమవారం ఇంటింటా ప్రచారం చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో పనులు చేయకుండా పడావుపడ్డ పనులను పట్టాలెక్కించానన్నారు. రాజన్న ఆలయం, పట్టణాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బైక్పై తిరిగి.. డోలు వాయించి విప్ ఆది శ్రీనివాస్ పార్టీ నాయకులతో కలిసి గల్లీల్లో బైక్పై తిరిగి ప్రచారం చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. విలీన గ్రామం శాత్రాజుపల్లిలో కార్నర్ మీటింగ్ సందర్భంగా డోలు వాయించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. -
పటిష్ట బందోబస్తు
● స్వేచ్ఛగా ఓటేయాలి ● మూడు అంచెల్లో పోలీస్ రక్షణ ● 811 మంది పోలీసులు, రెండు ప్లటూన్ల బలగాలతో భద్రత ● అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ● 131 మంది పాత నేరస్తుల బైండోవర్ ● ‘సాక్షి’తో ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. మూడు అంచెల్లో పోలీసు రక్షణ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు బుధవారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో బందోబస్తు ఏర్పాట్లు, జిల్లా పోలీసులు తీసుకున్న చర్యలను, ఎన్నికల నిర్వహణ ప్రణాళికను ‘సాక్షి’కి సోమవారం వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై నిఘాసిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డుల్లో 117 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 34 సెన్సిటివ్, 11 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వేములవాడలో 28 వార్డుల్లో 58 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 14 సెన్సిటివ్, 6 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సున్నితమైన కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. రెండు మున్సిపాలిటీల్లోని 175 పోలింగ్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. మొబైల్ఫోన్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించం. నిరంతరం తనిఖీలుఎన్నికల షెడ్యూల్ వెలువడగానే జనవరి 27 నుంచి జిల్లాలో ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేశాం. సిరిసిల్ల పరిధిలో మూడు, వేములవాడ పరిధిలో మూడు చెక్పోస్టుల్లో రేయింబవళ్లు తనిఖీలు నిర్వహించాం. మరో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఒక్కో పట్టణంలో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేశాం. ఎన్నికల విధులు నిర్వహించే పోలీసులకు నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించాం. ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించాం. డబ్బులు, మద్యం ప్రభావాన్ని కట్టడి చేసేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, రూట్ మొబైల్ పార్టీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. అనుమానితుల బైండోవర్నేరచరిత గల అనుమానితులను 131 మందిని ముందుజాగ్రత్తగా బైండోవర్ చేశాం. చెక్పోస్టు తనిఖీల్లో ఇప్పటికే రూ.31.70 లక్షల నగదు, 2.4 కిలోల వెండిని సీజ్ చేశాం. 21 కేసులు మద్యం(238 లీటర్లు) పట్టుకున్నాం. పట్టణాల పరిధిలో పలు బెల్ట్షాపులను సీజ్ చేశాం. జిల్లాలో లైసెన్స్ ఉన్న వారి ఆయుధాలను డిపాజిట్ చేయించుకున్నాం. మూడు అంచెల్లో బందోబస్తుమూడు అంచెల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశాం. జిల్లాలో 811 మంది పోలీసులు, రెండు ప్లటూ న్ల టీజీఎస్ఎఫ్ సాయుధ బలగాలతో ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల వరకు ఎవ రూ ప్రచారం చేయరాదు. రెండు, మూడు పో లింగ్ కేంద్రాలను కలిపి ఒక్క ఎస్సై పర్యవేక్షణ లో ఉంటుంది. సిరిసిల్లలో 8, వేములవాడలో 6 జోన్లుగా విభజించాం. సీఐల పర్యవేక్షణలో స్ట్రై కింగ్ఫోర్స్ ఉంటుంది. సిరిసిల్ల, వేములవాడల్లో డీఎస్పీల ఆధ్వర్యంలో రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది. స్వేచ్ఛగా ఓటేయాలిఓటర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓట్లు వేయాలి. ఎన్నికల నేపథ్యంలో 163 బీఎన్ఎస్ఎస్ యాక్టు అమలులో ఉంటుంది. ఎన్నికలు జరిగే 11వ తేదీ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు పోలీస్ ఆంక్షలు అమలులో ఉంటాయి. డయల్ 100కు ఫిర్యాదు చేయవచ్చు. ఎస్పీ ఆఫీస్లో ఒకటి, కలెక్టరేట్లో మరో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశాం. ఇది 24 గంటలూ పనిచేస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులైనా చేయవచ్చు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు పోలీసులకు సహకరించాలి. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల సిబ్బందితో కలిసి పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ భద్రతసిరిసిల్ల, వేములవాడల్లోని సినారె కళామందిరాల్లో స్ట్రాంగ్రూమ్లు ఏర్పాటు చేశాం. ఎన్నికలు ముగియగానే అక్కడే బ్యాలెట్ బాక్స్లను భద్రపరుస్తాం. 13వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశాం. అక్కడ సైతం మూడు అంచెల్లో పోలీస్ రక్షణ చర్యలు తీసుకుంటాం. ఎన్నికల అధికారులు జారీ చేసిన పాసులు ఉన్న వారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తాం. -
ప్రతిభ ముందు వైకల్యం చిన్నబోయింది
● అంధ విద్యార్థికి పీహెచ్డీలో అడ్మిషన్ ● సోదరులిద్దరూ అంధులే.. ఇల్లంతకుంట(మానకొండూర్): పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు అంధ విద్యార్థి అజిత్కుమార్. పీహెచ్సీ ప్రవేశ పరీక్షలో 75 శాతంతో ఉత్తీర్ణత సాధించి పీహెచ్డీ అడ్మిషన్కు అర్హత సాధించాడు. ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన ఎలగందుల అజిత్కుమార్ పుట్టుకతో అంధుడు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సోషియలాజీలో పోస్టు గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత సాధించి పీహెచ్డీ అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష రాశారు. ఇతని తమ్ముడు ఎలగందుల రంజిత్కుమార్ కూడా అంధుడే. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఇతను పదో తరగతిలో రాష్ట్రంలో అంధ విద్యార్థులలో 8.7 గ్రేడ్ సాధించారు. అప్పుడు మంత్రి సీతక్క చేతుల మీదుగా రూ.5వేల ప్రభుత్వ పారితోషకం అందుకున్నారు. వీరిద్దరూ ఇల్లంతకుంట ఏఎంసీ వైస్చైర్మన్ ఎలగందుల ప్రసాద్ కుమారులు. -
రూట్ మార్చిన దొంగలు
బోయినపల్లి(చొప్పదండి)/ఇల్లంతకుంట(మానకొండూర్): దొంగలు రూట్ మార్చారు! సాధారణంగా తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడడం పరిపాటి. కానీ ఇటీవల తమ టార్గెట్ వ్యవసాయబావులు, బోర్లు, ఆలయాలను ఎంచుకుంటున్నారు. గ్రామంలో ఉండే ఇళ్ల కంటే శివారు ప్రాంతాల్లోని ఆలయాల్లో చోరీ చేయడం సులభంగా భావించి ఉంటారు. జిల్లాలో ఇటీవల జరిగిన పలు సంఘటనలు పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. వరుస చోరీలు బోయినపల్లి మండలంలోని తడగొండకు చెందిన చెట్టుకింది చంద్రశేఖర్, గోగూరి దామోదర్రెడ్డి, దయ్యాల చంద్రశేఖర్, కొమురయ్య, గంగారెడ్డి వంటి దాదాపు 20 మంది రైతుల విద్యుత్తీగలను ఈనెల 2న గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ● వారం క్రితం విలాసాగర్ జీపీ స్టార్టర్ డబ్బ నుంచి 50 మీటర్ల వైరు చోరీ చేశారు. అదే గ్రామానికి చెందిన పైండ్ల చందు పొలం వద్ద వంద మీటర్ల వైరు ఎత్తుకెళ్లారు. బాలపోచయ్యకు చెందిన విద్యుత్తీగలు చోరీ చేశారు. సెస్ సంస్థకు రూ.లక్ష వరకు నష్టం వచ్చింది. ● కొదురుపాక, వెంకట్రావుపల్లి పరిసరాల్లో 2025 ఏప్రిల్లో 6వేల మీటర్లకు పైగా అల్యూమినియం విద్యుత్ వైర్ ఎత్తుకెళ్లారు. నీలోజిపల్లి శ్మశానవాటిక, ఎస్సీకాలనీల్లో విద్యుత్పోల్స్కు బిగించిన వైరును సైతం ఎత్తుకెళ్లారు. విద్యుత్ తీగలు ఎత్తుకెళ్లడంతో దహన సంస్కారాల సమయంలో ఇబ్బంది అవుతుందని గ్రామ సర్పంచ్ అనుముల భాస్కర్ సెస్ చైర్మన్, ఎండీ దృష్టికి తీసుకెళ్లడంతో కొత్త వైర్ను బిగింపజేశారు. ఆలయాలే టార్గెట్ ఇల్లంతకుంట మండలంలోని ఆలయాలను టార్గెట్ చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఆలయాలు ఊరి శివారులో ఉండడం.. అక్కడ ఎవరూ ఉండకపోవడంతో దొంగలకు కలిసొస్తుంది. దొంగల బెడదను తట్టుకోలేక పలు గ్రామాల్లో రాత్రి వేళ కాపలా ఉంటున్నారు. మండలంలోని వెల్జీపురంలో 15 రోజుల క్రితం ఎల్లమ్మగుడి, అదే గ్రామంలోని పెద్దమ్మగుడిలో దొంగలుపడ్డారు. అమ్మవార్ల పుస్తెలు, మెట్టెలు ఎత్తుకెళ్లారు. హుండీలను కూడా దొంగలించారు. అదే గ్రామంలోని నలుగురు రైతుల వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్ల నుంచి బోరుమోటార్ వరకు ఉండే విద్యుత్తీగలను కట్ చేసి ఎత్తుకెళ్లారు. వారం క్రితం ముస్కానిపేటలో ఓ ఇంటిలో పట్టపగలే దొంగలు పడి మూడు తులాల బంగారం, రూ.50వేల నగదు దోచుకెళ్లారు. గత జనవరి 25వ తేదీ రాత్రి ఎర్రనర్సుపల్లెలోని పెద్దమ్మగుడిలో పుస్తె, మెట్టెలు ఎత్తుకెళ్లారు. అదేరోజు ఎర్రనర్సుపల్లి, రహీంఖాన్పేట గ్రామపంచాయతీల నల్లాల బావి మోటార్వైర్తోపాటు గ్రామంలోని ఐదుగురు రైతుల వ్యవసాయ బోరు మోటర్ల వైర్ కట్ చేసి తీసుకెళ్లారు. తాజాగా జనవరి 31వ తేదీ రాత్రి రహీంఖాన్పేట ఎల్లమ్మగుడి, ఇల్లంతకుంట పెద్దమ్మ గుడిలో దొంగలు పడి పుస్తె, మెట్టెలు ఎత్తుకెళ్లారు. -
గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు
సిరిసిల్ల క్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ఫిర్యాదులను సంబంధిత ఠాణాల అధికారులకు పంపించి, చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు సిరిసిల్ల/వేములవాడ: జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సోమవారం పరిశీలించారు. సిరిసిల్లలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్ను, వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందించాలని, మౌళిక వసతులు కల్పించాలన్నారు. ఆయన వెంట సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు సీ.హెచ్.వెంకటేశ్వర్లు, రాధాబాయి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్ పాల్గొన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): వసతిగృహాల్లోని విద్యార్థుల చదువుపై దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పోతుగల్ జెడ్పీ ఉన్నత పాఠశాలను డీఈవో సోమవారం పరిశీలించారు. పోతుగల్ హాస్టల్లో ఉండి పదోతరగతి చదువుతున్న 18 మంది విద్యార్థుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడ్డ విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి, హెచ్ఎం రాధాకిషన్రావు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా మల్లన్న కల్యాణం కోనరావుపేట(వేములవాడ): మండలంలోని ధర్మారంలో మల్లికార్జునస్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఉండ్రుగుట్ట మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలను ఈనెల 3 నుంచి నిర్వహిస్తున్నారు. సోమవారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా పెద్దపట్నం ఆకట్టుకుంది. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నామని మిషన్ భగీరథ ఇంట్రా ఏఈ దివ్య అన్నారు. మండలంలోని మొర్రాయిపల్లె, చీకోడు, నామాపూర్ గ్రామాలను సోమవారం సందర్శించారు. ఆయా గ్రామాల్లో ఉన్న నీటి వనరులను పరిశీలించామని తెలిపారు. నీటి సరఫరాకు కావాల్సిన మెయింటెన్స్కు నిధులు అందించాలని సర్పంచులు కోరారు. కార్యక్రమంలో ఎంపీవో వాహిద్, సర్పంచులు మెంగని శ్రీనివాస్, బొమ్మెన అంజనేయులు, అనిల్, పంచాయతీ కార్యదర్శులున్నారు. సిరిసిల్ల అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రెండో ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025–26 జిల్లా స్థాయి పోటీలు ఈనెల 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడలశాఖ అధికారి రాందాస్ తెలిపారు. పట్టణ పరిధిలోని రాజీవ్నగర్ మినీస్టేడియంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీలు కొనసాగుతాయని వివరించారు. చెస్, బాల్ బ్యాడ్మింటన్, షిటిల్ బ్యాడ్మింటన్, యోగామ్యాట్స్, క్యారం కై న్స్, సైకిల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు సంబంధిత పరికరాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. వివరాలకు 94402 39783లో సంప్రదించాలని కోరారు. -
కార్మికులే కీలకం!
● నేత, బీడీకార్మికుల చుట్టూ నేతల ప్రదక్షిణలు ● గెలుపోటముల నిర్ణేతలు వీరే.. ● రెండు మున్సిపాలిటీల్లో ప్రభావంసిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో నేతల గెలుపోటములను నేత, బీడీకార్మికులు శాసించే స్థాయిలో ఉన్నారు. కార్మికక్షేత్రంగా పేరొందిన సిరిసిల్లలో నేతకార్మికులు, బీడీ కార్మికులు అత్యధిక సంఖ్యలో ఉండగా, ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడలో బీడీకార్మికులు, బీసీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పురపోరులో బరిలో నిలిచిన అభ్యర్థుల తలరాతలను మార్చడంలో కార్మికులు కీలకంగా మారారు. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు కార్మికుల ఇళ్లకు క్యూ కట్టారు. సిరిసిల్లలో అన్ని వార్డుల్లోనూ... సిరిసిల్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లోను నేతకార్మికులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మున్సిపాలిటీలో ఏడు గ్రామాలను విలీనం చేయగా.. ఐదు గ్రామాలు మినహా చంద్రంపేట, రాజీవ్నగర్లోనూ పవర్లూమ్ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పవర్లూమ్స్ నడిపే నేతకార్మికులు ఉండడంతో వాళ్ల ఓట్లు కీలకంగా మారాయి. పట్టణంలో మొత్తం ఓటర్లు 81,959 మంది ఉండగా నేతకార్మిక కుటుంబాలవి 36,093 ఓట్లు, బీడీ కార్మికులవి 23,811 ఓట్లు ఉన్నాయి. నేతకార్మికులతోపాటు బీడీ కార్మికులు ప్రభావం చూపనుండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు వారి ఇళ్లకు వెళ్లి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సిరిసిల్లలో పద్మశాలీ సామాజికవర్గం ఓటర్లే ఎక్కువ ఉండడంతో ప్రతీసారి ఎన్నికల ఫలితాలను వారే శాసిస్తారు. కార్మికుల సమస్యలే ఎజెండాగా... రెండు మున్సిపాలిటీల్లో కీలకమైన కార్మికుల ఓట్ల కోసం అభ్యర్థులు ప్రయత్నిస్తుండగా వారి సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేశారు. సిరిసిల్లలో బీడీకార్మిక ఆస్పత్రి ప్రతిపాదనలోనే ఉండగా, వేములవాడ శివారులోని బీడీ కార్మిక ఆస్పత్రి పూర్తిస్థాయి సేవలు అందించలేకపోతుంది. నేతకార్మికులు ప్రధానంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అద్దె ఇంటి సమస్యలు నేత, బీడీకార్మికులను వేధిస్తున్నాయి. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకంపై కార్మికులు కోటి ఆశలు పెట్టుకున్నారు. బీడీ, నేతకార్మికులకు ఆసరా పెన్షన్ వస్తుండగా ఇంకా కొందరికి రావడం లేదు. దీంతో పెన్షన్ల కోసం క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో బీడీ కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మున్సిపాలిటీలో మొ త్తం 40,877 మంది ఓటర్లు ఉండగా.. బీసీ ఓటర్లు 25,771 మంది, 11,028 మంది బీడీ కార్మికులు ఉన్నారు. వీరితోపాటు మున్నూరుకాపు సామాజికవర్గం ఇక్కడ ప్రభావం చూపే శక్తిగా ఉంది.మున్సిపాలిటీ మొత్తం బీడీ నేత సిరిసిల్ల 81,959 23,811 36,093 వేములవాడ 40,877 11,028 – బరిలో ఇలా.. మున్సిపాలిటీ వార్డులు అభ్యర్థులు సిరిసిల్ల 39 170 వేములవాడ 28 113 -
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
వేములవాడ: ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని ఏఎస్పీ రుత్విక్సాయి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం వేములవాడలో స్పెషల్ పోలీసు బలగాలతో తిప్పాపూర్ బస్టాండ్ నుంచి మేయిన్రోడ్డు గుండా మార్కెట్యార్డు జంక్షన్ వరకు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి ఫ్లాగ్మార్చ్ నిర్వహించామన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా మద్యం, డబ్బు, ఇతర వస్తువులు రవాణా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. టౌన్ సీఐ వీరప్రసాద్, ఆర్ఐ సురేశ్, ఎస్సైలు రామ్మోహన్, రాజు, శ్రావణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
కళకు జీవితమిస్తే..
ఇరవై ఐదేళ్లు.. ఇదొక సాధారణ కాలం కాదు. కళనే శ్వాసగా, పాటనే ఆయుధంగా మలుచుకుని సాగించిన పోరాట కాలం. కమాన్పూర్ మండలం రొమ్మికుంట గ్రామానికి చెందిన పులిపాక బాలయ్య అనే కాళాకారుడు కళాకారుడిగా అనేక సేవలు చేశాడు. పాటలు రాయడం నుంచి వేదికలపై పాడటం వరకూ ప్రజల మధ్య చైతన్యం నింపే కార్యక్రమాల నుంచి సామాజిక సందేశాల వరకూ అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉద్యమ గీతాల ద్వారా ప్రజల గుండెల్లో స్పందన రేపాడు. ఉద్యమాల వేడి వేదికలపై కనిపించినా.. జీవితంలో కష్టాలే ఎదురయ్యాయి. ఇంతకాలం కళకు అంకితమై ఉన్నా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి వెంటాడుతోంది. ప్రస్తుతం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ,చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కళాకారుడి ప్రతిభను చూసే సమాజం, అతడి బతుకును చూడడం మరిచిపోతుందంటున్నాడు. ఉద్యమాల సమయంలో అవసరమైన కళాకారులు.. ఆ ఉద్యమం ఫలించిన తర్వాత పక్కన పడిపోవడం బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రభుత్వం స్పందించాలని, కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరుతున్నాడు. – పులిపాక బానయ్య, పాటల రచయిత, కమాన్పూర్ -
అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం
రామగుండం: కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్రావు అన్నారు. ఆదివారం అబాది రామగుండంలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ లింగాపూర్ గ్రామం కార్పొరేషన్లో విలీనం కావడంతో పట్టణీకరణలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన ఇతరత్రా అభివృద్ధి పనులు అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమన్నారు. అబాది రామగుండం, లింగాపూర్ గ్రామ రైతులకు శాశ్వతంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. -
సిరిసిల్ల అభివృద్ధి మా బాధ్యత
సిరిసిల్ల/వేములవాడ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకరించడం లేదు.. ఇబ్బందుల పాలు చేస్తుంది.. అయినా.. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కసిగా పని చేస్తుందని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నామని రాష్ట్ర వ్యవసా య, సహకార, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ని అంబేడ్కర్ సర్కిల్ వద్ద మున్సిపల్ ఎన్నికల ప్ర చార సభలో బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్తో కలిసి ప్రసంగించారు. నేతకార్మిక సంక్షేమానికి నిధులు విడుదల చేయకుండా గత ప్ర భుత్వం నిర్లక్ష్యం చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.350 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. నేతన్న సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్కు ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఇది కేటీఆర్ అహంకారానికి, పేదల ఆత్మగౌరవానికి పోటీ అని మంత్రి అన్నారు. కాంగ్రెస్కు పట్టంకట్టి ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి గౌరవాన్ని కాపాడాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నేతన్నలకు దీర్ఘకాలిక మేలు జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, సిరిసిల్ల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి సీఎంకు గిఫ్ట్ ఇవ్వాలన్నారు. విప్ ఆది మాట్లాడుతూ, పద్మశాలీ భవనం, మార్కండేయ ఆలయం పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సీఎం తర్వాత అధికారం మీ సీనన్నకే ‘సీఎం తర్వాత మీ ఆది సీనన్నదే అధికారమని, వే ములవాడ అభివృద్ధికి ఆది అడిగితే ఎవరైనా చేయాల్సిందే’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అ న్నారు. ఆదివారం పట్టణంలోని సుభాష్నగర్ చౌరస్తాలో రోడ్షోలో ప్రసంగించారు. వచ్చే మూడేళ్లలో ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అ ధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ వెల్ము ల స్వరూపారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, అభ్యర్థులు ఇప్పపూల మమత, నీలం మమత, సిరిగిరి సంగీత, సాగారం వెంకటస్వామి, మస్తాన్, నాయకులు శ్రీనాథ్, నర్సయ్య, సూర దేవరాజు, చక్రధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి
సిరిసిల్ల: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయింది.. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఏం అభివృద్ధి పనులు చేసిందో చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మాట్లాడారు. రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం మంచి పనులు చేయకుండానే ఓట్లు అడిగే నైతిక హక్కుల ఆ పార్టీ అభ్యర్థులకు లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, మొన్నటి గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ మరోసారి అదే రుజువైందన్నారు. అయినా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మూడు రోజులు ఇక్కడే ఉండి, వార్డుల్లో ప్రచారం చేస్తూ.. బీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి సాధ్యమంటున్నారని, నిజానికి కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్తో అభివృద్ధి ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మున్సిపాలిటీలకు 14,15వ ఆర్థికం సంఘం ద్వారా నిధులు ఇస్తున్నారని, ఉచితంగా సన్న బియ్యం పంపుతున్నారని, అమృత్ పథకంతో తాగునీటి పథకాలకు నిధులు మంజూరు చేశారని స్పష్టం చేశారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను బీజేపీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం, కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ఇచ్చిన భరోసాతో ఓటర్లు కమలం గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని వివరించారు. నాయకులు తిరుపతిరెడ్డి, నటరాజ్గౌడ్, సంజీవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేను.. నా పోరాటం
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: ‘విప్లవ పార్టీలో దళ సభ్యుడిగా మొదలైన నా ప్రయాణం గడ్చిరోలికి చేరింది. ఇస్రోజీవాడి నుంచి గడ్చిరోలి వరకు విప్లవ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు.. అంతకు మించి సంతృప్తి.. కాలక్రమంలో గడ్చిరోలి నుంచి.. అబూజ్మడ్ అడవులకు చేరి.. అక్కడే గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వైనం.. తాడిత, పీడిత ప్రజల పక్షాన నిలిచిన ఘటనలకు సాక్ష్యం చందర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ జీవిత చరిత్ర. నక్సలైట్ ఉద్యమంలో తొలి ఆత్మకథ చందర్దే కావడం విశేషం. ఎన్కౌంటర్కు ముందు తాను రాసుకున్న విప్లవ ఆత్మకథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది’. ఈనెల 5న ఎన్కౌంటర్లో చనిపోయిన సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్– మహారాష్ట్ర వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్రావు(57) అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ మృతదేహం కామారెడ్డి జిల్లాలోని ఆయన సొంత ఊరు ఇస్రోజివాడికి ఆదివారం తీసుకొచ్చారు. ఆయన అంత్యక్రియలకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు మాజీ నక్సలైట్లు హాజరయ్యారు. ఎర్రజెండాలు, విప్లవ నినాదాలు, పాటలతో ఆయన అంత్యక్రియలు సాగాయి. ప్రభాకర్ ఆత్మకథలోని కొన్ని ముఖ్య ఘటనలు.. ● మావోయిస్టు ఉద్యమకారుడు స్వామి తన ఆత్మకథలో పలు ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించారు. ఇస్రోజీవాడిలో జరిగిన ఒక సంఘటన చందర్ను అడవిబాట పట్టేలా చేసింది. గ్రామంలోని మాలి పటేల్, ఇతర పెత్తందార్లకు వ్యతిరేకంగా చేస్తున్న విప్లవ కార్యకలాపాలకు చెక్ పెట్టాలని పోలీసులతో గ్రామస్తులను పోలీస్స్టేషన్లో బంధించారు. పోలీసులకు లొంగిపోవాలని, లేదా అడవిబాట పట్టాలని సభ్యులపై ఒత్తిడి తేగా.. ఆ కుట్రను ఛేదించారు. ● 1991లో పూర్తిస్థాయిలో అప్పటి పీపుల్స్వార్లో చేరిపోయారు. 1991 నుంచి 33 నెలలపాటు కామారెడ్డి దళంలో పనిచేశారు. తర్వాత దళ అవసరం రీత్యా సిర్నాపల్లి దళంలో సభ్యుడికి చేరి, కమాండర్, డివిజన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ● రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ఎస్సైగా పని చేస్తున్న శ్రీనివాస్రావును 1998లో మందుపాతర పేల్చి చంపిన ఘటనలో ముగ్గురితో కలిసి తాను అంబూష్లో పాల్గొన్నారు. నిజానికి ఈ ఘటన రాంచందర్ చేసినట్లు ప్రచారం జరగ్గా.. ఆ రాంచందర్ వన్పల్లి ఎన్కౌంటర్లో మరణించాడు. కానీ, లోకేటి చందర్రావు అలియాస్ స్వామి నాయకత్వంలోనే ఈ ఘటన జరిగినట్లు ఆయన ఆత్మకథలో పేర్కొన్నారు. ● 1999లో కోనరావుపేట మండలం మరిమడ్లలో పోలీసులను గుర్తించడంలో విఫలమైన తమ సెంట్రీ విఫలమయ్యాడని, దీంతో పోలీసులు సమీపించగానే ముందుగా కాల్పులు జరపడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రాణనష్టం, కిట్బ్యాగుల నష్టం ఏమీ కాలేదని, మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్స్టేషన్పై దాడి చేసిన ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించారు. ● 1999 నుంచి 2000 వరకు కామారెడ్డి ఏరియాకు ఇన్చార్జిగా, 2000 నుంచి 2003 వరకు సిరిసిల్ల ఏరియాకు జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ నిర్ణయం మేరకు 2003లో దండకారణ్యం వెళ్లారు. అక్కడ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2006లో ఎజేడ్సీలోకి, 2011లో దక్షిణ సబ్ జోన్ నుంచి పశ్చిమ సబ్ జోన్కు వెళ్లారు. ఇక్కడే 2020 వరకు సబ్ జోనల్ బ్యూరో మెంబర్గా, పశ్చిమ సబ్ జోనల్ కమాండర్ ఇన్ చీఫ్గా, ఉత్తర గడ్చిరోలి డివిజన్కు సబ్ జోనల్ బ్యూరో నుంచి ఇన్చార్జిగా పనిచేశారు. 2020 నుంచి 2024 వరకు పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ప్రభారిగా పనిచేశారు. ● ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలో ఆయన పని చేసిన కాలంలో జరిగిన ఘటనలు, నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం పడ్కల్లో జరిగిన ఎన్కౌంటర్ను, తన 35 ఏళ్ల అజ్ఞాత జీవితం, భార్యాపిల్లల జీవనం, సాయుధ పోరాటం, పేదల ప్రజలపై దండకారణ్యంలో చేసిన ప్రజాపోరాటాలను తన ఆత్మకథలో సమగ్రంగా వివరించారు. కొసా దాదా అంత్యక్రియలకు హాజరైన స్వామి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెలో సెప్టెంబరు 25న జరిగిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కొసా దాదా అలియాస్ కడారి సత్యనారాయణరెడ్డి అంత్యక్రియల్లో స్వామి పాల్గొని కడసారి చూపులు చూసుకున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో సెప్టెంబరు 21న పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో కొసా, ఆయనతో పాటు మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మరణించారు. సెప్టెంబరు 25న గోపాల్రావుపల్లెలో కొసా దాదా అంత్యక్రియల్లో అంత్యంత రహస్యంగా స్వామి పాల్గొని అగ్రనేతకు నివాళి అర్పించడం విశేషం. పోలీసుల నిఘా మధ్య, ఆయన గోపాల్రావుపల్లెకు చేరుకుని అంత్యక్రియల్లో ఎవరూ గుర్తించకుండా పాల్గొని వెళ్లడం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పోరాట క్షేత్రంగా ఆత్మకథ పోరాట క్షేత్రంగా తన కళ్ల ముందే చనిపోయిన సహచరుల పేర్లు, వారి కులాలు, నేపథ్యాలను స్వామి గుర్తు పెట్టుకుని ఆత్మకథలో రాశారు. ముఖ్యంగా తన గార్డుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన మానస గురించి రాసిన తీరు ఆయన సహచర ప్రేమను చాటుతోంది. కరుడుగట్టిన విప్లవకారుడి లోపల కూడా ఒక సున్నితమైన మనిషి ఉంటాడని స్వామి ఆత్మకథ స్పష్టం చేస్తుంది. కన్నీటి వీడ్కోలు మా ఊరు ఇస్రోజివాడి అంటూ.. స్వామి తన అజ్ఞాత జీవితాన్ని ఆవిష్కరించారు. తల్లి పేరు లోకేటి కిష్టాబాయి, తండ్రి వీరన్న, నలుగురు సంతానంలో నేను నాలుగో వాడిని. మా పెద్ద అక్క గంగబాయి, ఆ తరువాత ఇద్దరు అన్నలు రాజేశ్వర్రావు, మానిక్రావు, నేను చిన్నోడిని చందర్రావును. నేను 1969లో జన్మించాను. అంటూ.. తాను 6వ తరగతి పాస్ అయ్యాయని.. రాడికల్ యూత్ లీగ్(ఆర్వైఎల్)లో పని చేస్తూ.. మావోయిస్టు ఉద్యమంలో చేరిన కళ్లకు కట్టినట్లు వివరించారు. ఛత్తీస్గఢ్లో కూంబింగ్కు వచ్చిన హెలీకాప్టర్ను కూల్చడం నుంచి మొదలు పెడితే.. అనేక హింసాత్మక ఘటనలను ఉటంకించారు. 35 ఏళ్ల పాటు సాయుధ పోరాటం సాగించిన స్వామి తుదకు ఎన్కౌంటర్లో అమరుడై.. సొంత ఊరికి చేరితే కన్నీటితో వీడ్కోలు పలికింది ఇస్రోజివాడి. 22 ఏళ్ల ప్రాయంలో అడవిబాట దళ సభ్యుడిగా మొదలైన ప్రయాణం ఎన్నెన్నో దాడులు.. యుద్ధరీతులు ముందే ఆత్మకథలో ఆవిష్కరించిన స్వామి సోషల్ మీడియాలో వైరల్ -
మౌనమే అయితే..
కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థుల ప్రచారంతో మొదలైన నా వాయిస్ ఓవర్ ప్రయాణం.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకూ విస్తరించింది. ప్రధాన పార్టీలే కాదు.. స్వతంత్ర అభ్యర్థులూ శ్రీఈ వాయిస్ కావాలిశ్రీ అంటున్నారు. రామగుండమే కాదు.. మంథని, మంచిర్యాలలోనే నా గొంతు వినిపించింది. ఎన్నికల ప్రచారానికే కాకుండా.. ఆలయాల ప్రారంభం, బ్రహ్మోత్సవాలు, పుష్కరాలు, సమ్మక్క – సారలమ్మ జాతర, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వ్యాపార–వాణిజ్య ప్రకటనల వరకూ ప్రత్యక్ష వ్యాఖ్యాతగా, వాయిస్ ఓవర్గా సేవలందించాను. 1986 నుంచి దాదాపు 40 ఏళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్నా. సుమారు 4వేల వరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను. దివంగత సీఎం వైఎస్సార్ హాజరైన 4 బహిరంగ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం, పెద్దపల్లి జిల్లా ఆవిర్భావ సభకు వాయిస్ ఇవ్వడం నా జీవితంలో మైలు రాళ్లు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అప్పటివరకు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేశా. అరకొర జీతంతోపాటు, కళా రంగం ఇచ్చిన ఆదాయం నా కుటుంబ జీవనాన్ని పెద్దగా ఇబ్బందులు లేకుండా నడిపించింది. ఇప్పుడు రిటైర్ అయ్యాను. అనుభవం, సేవాభావం, అంకితభావం ఉన్న కళాకారులను గుర్తించి, గౌరవంతోపాటు స్థిరమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజానిదే. ఎందుకంటే కళాకారుడి గొంతు మౌనమైతే.. చరిత్రే మౌనమవుతుంది. – మేజిక్రాజా, వాయిస్ ఓవర్ కళాకారుడు, గోదావరిఖని -
పెద్దపులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలి
చిగురుమామిడి: కోహెడ మండల పరిధిలో పెద్దపులి సంచరిస్తుందన్న సమాచారంతో చిగురుమామిడి మండలంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఎం.రమేశ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కోహెడ మండల అటవీప్రాంతంలో పెద్దపులి తిష్టవేసినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారని తెలిపారు. పులి కదలికలు చిగురుమామిడి మండల సరిహద్దులకు చేరువలో ఉండటంతో రానున్న రెండు రోజులు రైతులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైతులు పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని, చుట్టుపక్కల రైతులతో కలిసి వెళ్లాలని సూచించారు. పులికదలికలు కనిపించినా, పశువులపై దాడిచేసి చంపినట్లు కనిపించినా తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇస్రో సైంటిస్టుగా కొడిమ్యాల యువకుడుకరీంనగర్టౌన్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మాడి రాజసింహ ఇస్రో సైంటిస్ట్గా ఎంపికయ్యాడు. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజశేఖర్, ఉమారాణిల కుమారుడు రాజసింహ జగిత్యాలలో 10 వ తరగతి, వరంగల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశా డు. జేఈఈ అడ్వాన్స్ ద్వారా కేరళ తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏరో స్పేస్ ఇంజినీరింగ్ సీటు సాధించాడు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇస్రో సైంటిస్టుగా ఎంపికయ్యాడు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు రాజసింహను అభినందించారు. -
ఓటరు మహాశయులారా
కోల్సిటీ(రామగుండం): పొద్దున లేచించి మొదలు.. రాత్రి వరకూ గల్లీలన్నీ పాటలతో మార్మోగుతున్నాయి. మైకుల శబ్దం, వాహనాల గర్జన మధ్య శ్రీపలానా గుర్తుకే మన ఓటుశ్రీ అని వినిపించే జానపద పాటలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. వాటికి చిన్నారులు స్టెప్పులు వేస్తుంటే.. పెద్దలు చిరునవ్వుతో తలూపుతున్నారు. అయితే, అభ్యర్థుల పేర్లకన్నా ముందే ఓటర్ల చెవుల్లో నాటుకుపోయే స్వరాల వెనుక ఉన్నవారు ఎవరు? ఒక్క పాటతో గల్లీని కదిలించే ఆ గొంతులు ఎలా ఉంటాయి? ఎన్నికల రణరంగంలో వాహనాలపై తిరుగుతూ రాత్రింబవళ్లు స్వరం వినిపిస్తూ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసే గాయకుల కథ ఇదే. ఓటు రాజకీయాల మధ్య నడిచే కళాకారుల కనబడని ప్రయాణమిది. కళను కాపాడాలంటే కళాకారులను నిలబెట్టాల్సిందే అంటున్నారు. లేదంటే పాట మిగులుతుంది కానీ.. పాట పుట్టిన గొంతు కష్టాల్లోనే కరిగిపోతుంది. మూడు దశాబ్దాలుగా కళనే శ్వాసగా, జీవనాధారంగా నమ్ముకున్నాడు. డప్పు ప్లేయర్గా, గాయకుడిగా, నృత్య మాస్టర్గా, రచయితగా తనదైన ముద్ర వేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి చైతన్య గీతాలు, ఉద్యమ గీతాలు అందించారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతిబింబించే బహుజన గీతాలు, ప్రజల్ని కదిలించే ప్రచార గీతాలు రచించి పాడారు. కళను నమ్ముకున్నా.. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించే ఆదాయం సమకూరడంలేదు. అవార్డులు, రివార్డులు వచ్చాయి. సన్మానాలు, సత్కారాలు జరిగాయి. అవి జీవనానికి భరోసా ఇవ్వలేకపోయాయి. – గాజుల రమేశ్, డప్పు కళాకారుడు, గోదావరిఖని -
అభ్యర్థుల ఆఖరి పోరాటం
సిరిసిల్ల: జిల్లాలో పురపోరు తుది అంకానికి చేరుకుంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అన్ని రాజకీయ పక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు ఆరు రోజులుగా మైకులతో ఇంటింటా ప్రచారం సాగించారు. మున్సిపల్ ఎన్నికలు బుధవారం జరుగుతుండగా.. ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెర పడుతుంది. అసలు వ్యూహాల అమలుకు ఇప్పుడే రంగం సిద్ధమవుతుంది. ఓటర్లను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేశారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు ఓటర్లకు ‘త్రీ–ఎం’ఫార్ములాను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఓటర్ల ప్రసన్నం కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులంతా పోటీ పడుతున్నారు. ఎవరికీ వారు గల్లీల్లో తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసిపోనుంది. దీంతో త్రీ–ఎం ఫార్ములా.. నేరుగా ఓటర్ల ఇంటికే మద్యం(ఎం), మాంసం(ఎం), మనీ(ఎం) అందించేందుకు సిద్ధమయ్యారు. వార్డుల్లో ప్రచారం ఎలా ఉన్నా.. చివరి రెండురోజుల్లో వ్యూహత్మకంగా ‘త్రీ–ఎం’ ఫార్ములను అనుసరించేందుకు రెడీ అయ్యారు. సిరిసిల్లలో 14 వార్డుల్లో త్రిముఖ పోటీ ఉండగా, 10 వార్డుల్లో చతుర్ముఖ, మరో తొమ్మిది వార్డుల్లో పంచముఖ, ఆరు వార్డుల్లో బహుముఖ పోటీ సాగుతుంది. వేములవాడలోని 28 వార్డుల్లోనూ పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఎన్నికలను చాలెంజ్గా తీసుకున్న అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఓటర్లకు గిప్ట్లు, పార్టీ గుర్తులతో కూడిన ఖరీదైన బొమ్మలను పంపించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రచారంలో పోటా పోటీ.. ఇప్పటికే సిరిసిల్ల, వేములవాడల్లో ప్రచారాన్ని అన్ని పార్టీలు జోరుగా సాగిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్తో ప్రచార సభలు నిర్వహించగా.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ వార్డుల్లో రోడ్ షోలు నిర్వహించారు. బీజేపీ నుంచి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ సిరిసిల్ల, వేములవాడలో ప్రచారం చేశారు. విప్ ఆది శ్రీనివాస్ వేములవాడలో ఉండి ఎన్నికల ప్రచారం చేసి, వ్యూహాలు రచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేశారు. పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డి విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యంత సన్నిహితులతో అభ్యర్థులు ఆఖరి ప్రయత్నంగా ఓటర్లకు త్రీ–ఎం పార్మూలా అమలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మున్సిపల్ వార్డులు బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ స్టేషన్లు ఓటర్ల సంఖ్య సిరిసిల్ల 39 170 117 81,959 వేములవాడ 28 113 58 40,877 -
● వేములవాడలో మాంసం మాయ
పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): కార్పొరేషన్ పరిధిలోని ఫెర్టిలైజర్సిటీ(ఎఫ్సీఐ)టౌన్షిప్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ 2000–01 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 25ఏళ్ల రీయూనియన్ సమావేశం ఆదివారం హైదరాబాద్లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్లో నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన వారంతా ఒకేవేదికపైకి చేరారు. బాల్యంలోని స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ పాఠశాలలో గడిపిన మధురమైన క్షణాలను ఆనందంగా పంచుకున్నారు. ఎఫ్సీఐ టౌన్షిప్లో గడిపిన రోజులను శ్రీభూమిపై స్వర్గంశ్రీగా అభివర్ణిస్తూ స్నేహాలు, ఆటలు, ఉత్సాహభరితమైన వాతావరణాన్ని స్మరించుకున్నారు. తరగతి గదులు, ఆటస్థలాలు, గురువుల మార్గదర్శనం, స్నేహితులతో గడిపిన చిరునవ్వుల రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం వారికి అపూర్వమైన ఆనందాన్ని ఇచ్చింది. సభ్యులంతా తమ జీవిత ప్రయాణాలు, వత్తిపరమైన అనుభవాలు, విజయాలను పంచుకుంటూ భవిష్యత్లో ఇలాంటి సమావేశాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. గ్రానైట్ లారీ నుంచి పడిన బండరాయిచిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ స్టేజీ వద్ద హుస్నాబాద్– కరీంనగర్ ప్రధాన రహదారిపై గ్రానైట్ లారీ నుంచి బండరాయి పడిపోయింది. ఆదివారం మధ్యాహ్నం బొమ్మనపల్లి గ్రానైట్ క్వారీ నుంచి ఆసిఫ్నగర్కు కటింగ్ నిమిత్తం లారీలో తీసుకెళ్తుండగా కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న కారును తప్పించబోయిన, డ్రైవర్ బ్రేక్ వేయడంతో గ్రానైట్ రాయి లారీ నుంచి రహదారిపై పడింది. గ్రానైట్ రాయి పడినచోట రహదారి పూర్తిగా ధ్వంసమైంది. చిగురుమామిడి ఏఎస్సై తిరుపతి ఘటనా స్థలానికి వెళ్లి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. గుంతపడిన చోట మట్టితో పూడ్చివేయించారు. వేములవాడ: ఆదివారం అంటే చికెన్, మటన్ ప్రియులు ప్రత్యేకంగా రుచి వైపు మగ్గుతారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు ఈ ఆదివారమే చివరిది కావడంతో మటన్, చికెన్ బిర్యాని పొట్లాలతో అభ్యర్థులు తమ వార్డుల్లో హడావుడి చేస్తూ వారి అనుయాయులు, ఓటర్లకు ముందస్తు పండుగ చూపించారు. మున్సిపల్ ఎన్నికలు ఈనెల 11న జరగనున్న నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఇంటింటి ప్రచారంతోపాటు, ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం వేములవాడలోని పలు వార్డుల్లో మటన్, చికెన్ పొట్లాల పంపిణీ జోరుగా సాగింది. ఒకవైపు అభివృద్ధి హామీలు, మరోవైపు సంక్షేమ పథకాల మాటలు వినిపిస్తుండగా మరోవైపు పొట్లాల రాజకీయాలు చర్చకు దారితీస్తున్నాయి. ఓటు వేయించే ముందు కడుపు నింపితే సరిపోతుందా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. అయినా ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు కొత్తేమీ కాదని పలువురు పేర్కొంటున్నారు. బ్యాలెట్ బాక్స్ దగ్గర ఫలితం ఎలా ఉంటుందో చూడాలి కానీ, ఆదివారం మాత్రం చాలా ఇళ్లలో రాజకీయ రుచితో భోజనాలు జరిగాయని మాత్రం చెప్పొచ్చు. పంపకాలకు ప్లాన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఇక అసలు పంపకాలపై దృష్టి సారించనున్నారు. కుల సంఘాలు, యూత్, మహిళా సంఘాలు, గ్రూపులవారీగా పంపకాలు జరిపేందుకు ప్లాన్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్: వారంతా బంధువులు. ఒకే కులానికి చెందిన వివిధ పార్టీల నాయకులు. మున్పిపల్ ఎన్నికల్లో మాత్రం వైరివర్గాలుగా మారిపోయారు. ఆయా పార్టీల నుంచి కార్పొరేటర్ స్థానానికి పోటీపడుతున్నారు. నగరపాలకసంస్థలో సం్ఙకులశ్రీ సమరానికి వేదికగా మారింది 23వ డివిజన్. పోటీలో ఉన్న ప్రత్యర్థులంతా మున్నూరుకాపులు కావడమే ఆ డివిజన్ స్పెషల్. నగరంలోని 23వ డివిజన్ స్థానానికి మున్నూరు కాపు కులస్తులే పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్, బీజేపీ నుంచి పాదం శివరాజ్, కాంగ్రెస్ నుంచి గుమ్మడి రాజ్కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా ఎడ్ల శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. వీరంతా కూడా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. పైగా బంధువులు కావడంతో ఆ డివిజన్ ప్రస్తుత ఎన్నికల్లో స్పెషల్గా మారింది. 1, 2, 36వ డివిజన్లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. కాకపోతే 1వ డివిజన్లో ఐదుగురు అభ్యర్థులకు గాను నలుగురు, 2వ డివిజన్లో ఆరుగురిలో ఐదుగురు, 36వ డివిజన్లో ఏడుగురిలో ఆరుగురు మున్నూరుకాపులే పోటీలో ఉండడం విశేషం. నగరంలో ఈ సం‘కుల’ సమరం ఆసక్తి రేపుతోంది. కరీంనగర్ కార్పొరేషన్: ‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. మా ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు. మేము పన్నులుకట్టడం లేదా. మేం చెల్లించిన పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయి. మీకు ఎందుకు ఓటు వేయాలి. మా ఇంటికి రాకండి’.. అంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కరీంనగర్ నగరపాలకసంస్థ 36వ డివిజన్లోని మారుతినగర్కు చెందిన కోటేశ్వర్ అనే వ్యక్తి తన ఇంటికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాలనీలో చర్చనీయాంశంగా మారింది. తమ ప్రాంతంలో రోడ్లు బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నాయని... మీకు ఎందుకు ఓటువేయాలంటూ ఆయన ఫ్లెక్సీ ద్వారా ప్రశ్నలు సంధించారు. మున్సిపల్ పోరు.. నాన్వెజ్ జోరుబంధువులే ప్రత్యర్థులు -
నిరుద్యోగులకు అండగా కోడింగ్ ట్యూటర్
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు కోడింగ్ ట్యూటర్ అండగా ఉంటుందని కోడింగ్ ట్యూటర్ నిర్వాహకులు ఫణిరాజ్ జాలిగామ అన్నారు. ఐటీ రంగంలోకి రావాలనుకునే అభ్యర్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులకు కోడింగ్, స్కిల్ మేనేజ్మెంట్పై ఆదివారం కరీంనగర్లోని శ్వేత హోటల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ఫణిరాజ్ జాలిగామ మాట్లాడుతూ యువతకు ఐటీ రంగంపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే ఐటీ జాబ్మేళా, ఇంటర్న్షిష్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు, గ్రాడ్యుయేషన్ పూర్తయి నాలుగైదేళ్లు గ్యాప్ ఉన్న వారు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కోచింగ్ ఇచ్చి మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఏఐ ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో కోడింగ్ నేర్చుకునేందుకు ఇంటర్న్షిప్ చేస్తే లాభా లేంటనే అంశంపై వివరించారు. కోడింగ్, స్కిల్స్ కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కోడింగ్ట్యూటర్ ఆఫీస్కు 9 నెలల పాటు వచ్చి నేర్చుకోవాల్సి ఉంటుందని సూచించారు. కోచింగ్ పూర్తయిన తర్వాత ఎంప్లాయీమెంట్ రాకపోయినా తమ కంపెనీలోనే అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. -
దుబాయ్లో కంచర్ల యువకుడి ఆత్మహత్య
వీర్నపల్లి(సిరిసిల్ల): ఉపాధి కోసం ఏడాది క్రితం గల్ఫ్ వెళ్లిన యువకుడు అక్కడ తనువు చాలించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో విషాదం నింపింది. మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన వరికుప్పల రాకేశ్ (22) దుబాయ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాకేశ్ ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగా లేక, ఇంటి నిర్మాణానికి చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆశించిన స్థాయిలో జీతం రాకపోవడం, అప్పులు తీరే మార్గం కనిపించక కొంతకాలంగా మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందిన కొడుకు విగతజీవిగా మారాడన్న వార్త విన్న తల్లి లక్ష్మి, సోదరుడు సతీశ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సర్పంచ్ సామర్ల దేవరాజు, వడ్డెర సంఘం నాయకులు గోగుల రమేశ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాకేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాలక్రైం: జగిత్యాలలోని టీఆర్నగర్కు చెందిన షేక్ నయూం(43) ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నయూం ఈనెల 6న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. తల్లి జరీనాబేగం ఈనెల 7న రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో నయూం నర్సింగాపూర్ శివారు ఎస్సారెస్పీ కాలువలో శవమై కనిపించాడు. నయూంకు భార్యతో కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తల్లి వద్దే ఉంటున్న ఆయన మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు. గుండెపోటుతో వృద్ధుడి మృతికొడిమ్యాల(చొప్పదండి): మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కొడిమ్యాల మండలం సంద్రాలపల్లి గ్రామానికి చెందిన చిన్న శంకరయ్య అనే వృద్ధుడు అస్వస్థతకు గురైన అతన్ని చికిత్స కోసం హాస్పిటల్కు తీసుకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా కొడిమ్యాల బస్టాండ్ ఆవరణలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే అంబులెన్న్స్కు స్థానికులు సమాచారం అందించగా 108 సిబ్బంది శంకరయ్యను పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. -
సుస్థిరం.. రామగుండం
రామగుండం: శ్రీరాముడు అరణ్యవాసంలో ఉండగా.. రామగుండం ప్రాంతంలో పర్యటించారని, ఆయన అడుగుజాడలతో జలఊటలు ఏర్పడ్డాయని, అవే రామునిగుండాలు కావడంతో దీనికి రామగుండంగా పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ముడిసరుకుల లభ్యతతో విద్యుత్ కేంద్రాలకు నిలయంగా మారింది. విద్యుత్ రంగంలో దేశవ్యాప్త ఖ్యాతి గడిచింది. భిన్నవర్గాల ఓటర్ల సమ్మేళనంగానూ అవతరించింది. రామగుండంలో ఒకే రైల్వేస్టేషన్ ఉన్నా.. గోదావరిఖనిలో పోలీస్ కమిషరేట్, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నా.. వాటిపేరు రామగుండంపైనే ఉంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం రామగుండం అంటేనే గుర్తింపు లభిస్తుంది. మద్యం పట్టివేతసిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణంలోని భావనరుషినగర్లో రామగిరి దిలీప్ అక్రమంగా రూ.4,537 విలువ గల మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు. అతడి నుంచి మద్యం సీసాలు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. -
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
● కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదివారం వెల్లడించారు. ఎన్నికల కోడ్ విడుదల అయిన వెంటనే పక్కా ప్రణాళికతో అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని వివరించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని సినారె కళామందిరాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎస్పీ మహేశ్ బి గితేతో కలిసి ఏర్పాట్లు పరిశీలించామని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే, సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో కలిపి జోనల్ ఆఫీసర్స్ 21, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు 4, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ లు 12 ఏర్పాటు చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు 140, వేములవాడలో 70 మందిని నియమించారు. ఓపీవో 630 మందిని నియామకం చేశారు. రెండు పట్టణాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది 700 మందిని నియమించారు. ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తదితర గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. బల్దియా ఎన్నికలపై పటిష్ట నిఘాసిరిసిల్లక్రైం: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు చెక్పోస్టులు, వీడియో సర్వైలెన్స్ బృందాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, డబ్బు, మద్యం పంపిణీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వ్యక్తులు 5 గంటలలోపు మున్సిపల్ పరిధిని విడిచిపోవాలని సూచించారు. మంత్రుల వాహనాలు తనిఖీ వేములవాడఅర్బన్/సిరిసిల్లఅర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ– కరీంనగర్ ప్రధాన రహదారిలోని సంకెపల్లిలో చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఆదివారం మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు వాహనాలను సంకెపల్లి, రగుడు చెక్పోస్టుల వద్ద పోలీసులు తనిఖీ చేశారు. -
ఎలక్షన్ స్నాక్స్
సిరిసిల్లటౌన్: పదేళ్లుగా వంటలతో జీవనం సాగిస్తున్న నేత కుటుంబానికి ఎన్నికల వేళ ఉపాధి లభిస్తోంది. సిరిసిల్ల అనంతనగర్ ప్రాంతానికి చెందిన అల్లాడి లక్ష్మి–చంద్రశేఖర్, కుందారపు పుష్పలత కుటుంబాలు ఎన్నికల నేపథ్యంలో వస్తున్న వంటల ఆర్డర్లతో బిజీగా ఉంటున్నారు. ఆదివారం కావడం, మరోవైపు ఎన్నికల ప్రచారానికి ఒక్క రోజుతో తెరపడనుండటంతో పెద్దసంఖ్యలో వచ్చిన ఆర్డర్లను ఇలా కస్టమర్లకు అందిస్తున్నారు. వాడకట్టులో ఎన్నికల వేడి రగులుతున్న తరుణంలో వీరి ఇంట్లో వంటల గుమగుమలు ఆ ప్రాంత వాసులను ముగ్దులు చేయడం కనిపించింది. -
ఎవరికెవరు ఏమవుతారో..?!
జగిత్యాలటౌన్: జగిత్యాల బల్దియా ఎన్నికల ప్రచారంలో వింత పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్రెడ్డి తన అనుచరులైన స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీఎర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారంలో నిమగ్నమయ్యారు. దీంతో ఓట ర్లు విస్తుపోతున్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ పా ర్టీ ఫిరాయింపుపై ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత పిటిషన్ను కొట్టేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని మీడియా ముఖంగా ప్రకటించిన ఎమ్మె ల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అధికార పార్టీ సీనియర్ నాయకుడు స్వతంత్రులకు మద్దతుగా ప్రచారం చేస్తుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ‘ఉపాధి’ ప్రచారం పెద్దపల్లిరూరల్: మున్సిపల్ ఎన్నికలు అనేకమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పెద్దపల్లిలో పలువురు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. చైర్పర్సన్ అభ్యర్థిగా ముందుకొచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్బ్లాక్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కళాబృందాలతో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయన ప్రచారశైలిని చూసిన ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థులు.. మంథని ప్రాంతం నుంచి కళాకారులను రప్పించి ప్రచారం హోరెత్తిస్తున్నారు. వార్డుల్లో ప్రచారం చేస్తే రూ.200 పలువురు అభ్యర్థులు తమగుర్తుతో వార్డుల్లో ప్రచారం చేసేందుకు అదేవార్డుకు చెందిన వారితోనే తిరుగుతున్నారు. వీధుల్లో జెండాలు పట్టుకుని రెండుగంటల పాటు ఇలా తిరిగితే ఒక్కొక్కరికి రూ.200 ఇస్తున్నారు. ఇలాంటి ప్రజలు పొద్దున ఒకరికి, మధ్యాహ్నం మరొకరిని, రాత్రిపూట ఇంకొకరికి వారివారి జెండాలు, గుర్తులు పట్టుకుని ‘జై అభ్యర్థి.. జై పార్టీ’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయం గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు జనాల్ని పోగేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. మీరు మాతో ప్రచారానికి రండి అని అడిగితే.. ‘ఇప్పుడు పలానా అభ్యర్థికి మద్దతుగా వెళ్తున్నాం.. మీరు రెండు గంటల తర్వాత ప్రచారం చేసుకోండి’ అంటూ అభ్యర్థులకు స్థానిక ప్రజలు సూచిస్తున్నారు. ఓట్ల పండుగ పుణ్యాన మహిళలకు ఇలా రోజుకు కనీసం రూ.600 వరకు కూలి గిట్టుబాటు అవుతోంది. పెద్దపల్లిరూరల్: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎత్తులు, పైఎత్తులు వేస్తుంటారు. కానీ పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఓ అభ్యర్థి.. తమకు మద్దతుగా 150 మందిని సమీకరించారు. తన వార్డులో శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. కానీ, వారందరినీ సమీపంలోని మరోవార్డు అభ్యర్థి.. తన మద్దతుదారుల కోసం ఏర్పాటు చేసుకున్న భోజనం తినేందుకు పంపించాడు. అదే సమయంలో ఆ అభ్యర్థి మద్దతుదారులు అక్కడకు చేరుకున్నారు. వీరంతా ఎవరు? ఎందుకొస్తున్నారోనని సదరు అభ్యర్థితో సహా ఆయన మద్దతుదారులెవరికీ అంతుబట్టలేదు. ‘మిమ్మల్ని ఎవరు పంపించారు’ అని ఆరా తీయగా.. పొరుగువార్డుకు చెందిన ఓ నాయకుడని తేలింది. ‘మీ అందరికీ తలా రూ.200 చొప్పున డబ్బులు ఇవ్వమని అతడికి డబ్బులు ఇచ్చా.. మీరంతా ఆయన వద్దకే వెళ్లి తీసుకోండి’ అని చెప్పి వెనక్కి పంపిచేశాడు. ‘అరే.. మా అవసరానికి తగ్గట్టుగా భోజనం సిద్ధం చేసుకుంటే.. మాకు సంబంధం లేనివ్యక్తులను ఇలా పంపడమేంటో’ అని సదరు అభ్యర్థి వాపోయాడు. ఇలాంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి.ఒకరి ప్రచారం.. మరొకరి భోజనం! అధికార పార్టీకి ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రచారం స్వతంత్రులకు అధికార పార్టీ నాయకుడి ప్రచారం జగిత్యాలలో వింత పరిస్థితి -
మహిళలకు ఫ్రీ బస్సుపై కేటీఆర్ వ్యతిరేకం
సిరిసిల్ల అర్బన్: మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడంపై కేటీఆర్ పదే పదే తప్పుపడుతున్నారని, ఫ్రీ బస్సు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారా? అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అడిగారు. జ్యోతినగర్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఎలుక తిరుపతి పాల్గొన్నారు. -
పల్లెనేతలు!
‘పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. రేషన్బియ్యం నుంచి గృహనిర్మాణాల వరకు ప్రధాని నరేంద్రమోదీ నిధులు పంపుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాలు చెప్పడం లేదు. ఈ విషయాలు వివరించి ఓటర్లను దేశం కోసం.. ధర్మం కోసం బీజేపీని గెలిపించాలని కోరాలి..’ ఇది కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ప్రభుత్వం మనదే ఉంది. ఇంకా మూడేళ్లు అధికారం మనదే. అభివృద్ధి, సంక్షేమం మనతోనే సాధ్యమని చెప్పండి. ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్నాం. వచ్చే మూడేళ్లలోనూ ప్రజల అవసరాలు తీర్చే ప్రణాళికతో ముందుకు సాగుదాం. కాంగ్రెస్పై ప్రజల్లో విశ్వాసం ఉంది. చేసింది చెప్పుకోవాలి.. చేసేది చెప్పి ఒప్పించాలి..’ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడలో పార్టీ శ్రేణులకు దిశనిర్దేశం చేశారు. -
ప్రచారం బంద్
48కలెక్టర్ గరీమా అగ్రవాల్ గంటల ముందేసిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలు ప్రణాళికతో పూర్తి చేయాలని, ప్రచారాన్ని పోలింగ్కు 48 గంటల ముందే బంద్ చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కలెక్టరేట్లో శనివారం సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు, నోడల్ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలు, 13న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని, పోలింగ్ కేంద్రం బయట ఒక సీసీ కెమెరా ఉండాలన్నారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, మచ్చ గీత, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, తహసీల్దార్లు మహేశ్కుమార్, జయంత్కుమార్, అధికారులు ప్రవీణ్, మీర్జా ఫసహత్ అలీ బేగ్, అన్సార్ పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించాలి సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు 13న జరుగుతుందని, ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో కౌంటింగ్ విధులపై ఆర్వో, ఏఆర్వోలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలకు శిక్షణ ఇచ్చారు. సిరిసిల్ల, వేములవాడల్లోని సినారె కళామందిరంలో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్, తర్వాత వార్డుల వారీగా ఓట్లు లెక్కించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విధులకు హాజరయ్యే వారు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్లోని ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆదివారం కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. నోడల్ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మహేశ్కుమార్ పాల్గొన్నారు. -
భీమన్నకు పట్టువస్త్రాలు
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరీ సేవా సమితి భక్తి కార్యక్రమం రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భీమేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు బద్దిపోచమ్మ అమ్మవారికి సారెను శనివారం సమర్పించారు. ఆలయ ఈవో రమాదేవి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఏఈవోలు శ్రావణ్కుమార్, అశోక్కుమార్, సీనియర్ అసిస్టెంట్లు ఎడ్ల శివసాయి, పురాణం వంశీ పాల్గొన్నారు. అత్యవసర వేళల్లో అందుబాటులో ఉండాలి సిరిసిల్లటౌన్: క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చే అత్యవసర సమయాల్లో 108 సిబ్బంది అందుబాటులో ఉండాలని డీఎంహెచ్వో రజిత సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని 108 అత్యవసర అంబులెన్స్ వాహనాలను శనివారం తనిఖీ చేపట్టారు. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వాహనం వచ్చిన సందర్భంగా వాహనంలోని అత్యవసర సమయంలో ఉపయోగించే పరికరాల పనితీరును పరిశీలించారు. శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని జిల్లా మేనేజర్ అరుణ్కుమార్కు సూచించారు. 108 జిల్లా మేనేజర్ అరుణ్కుమార్, సిబ్బంది పెద్ది శ్రీనివాస్, వడ్నాల అనిల్కుమార్, పోచంపల్లి పర్శరాములు, బండారి స్వాతి, బుర్ర వెంకటేశ్ పాల్గొన్నారు. కొదురుపాకలో స్థల పరిశీలన బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాకలో బస్టాండ్ నిర్మాణానికి కరీంనగర్ ఆర్టీసీ ఆర్ఎం రాజు శనివారం స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో బస్టాండ్, బస్టాప్ నిర్మాణం గురించి కొదురుపాక సర్పంచ్ కత్తెరపాక మంజుల ఆధ్వర్యంలో ఇటీవల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మంత్రి సూచనలతో ఆర్ఎం కొదురుపాకలో స్థలాన్ని పరిశీలించారు. మహాశివరాత్రి జాతరకు ప్రత్యేక బస్సులు వేములవాడఅర్బన్: వేములవాడలో మూడు రోజులు జరిగే మహాశివరాత్రి జాతరకు 600 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు తెలిపారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్లో శనివారం సమావేశమయ్యారు. కరీంనగర్–వేములవాడ రూట్లో 58 బస్సులు, కోరుట్ల –వేములవాడ 38, మెట్పల్లి–వేములవాడ 69, జేబీఎస్–వేములవాడ 49, వేములవాడ–కొండగట్లు 15, వరంగల్–వేములవాడ 131, వేములవాడ–సిరిసిల్ల 18, నిర్మల్–వేములవాడ 85, ఆర్మూర్–వేములవాడ 90, నిజామాబాద్–వేములవాడ 22, కామారెడ్డి–వేములవాడ 25 బస్సులు నడిపించనున్నట్లు వివరించారు. డిపో మేనేజర్ శ్రీనివాస్ ఉన్నారు. ప్రశ్నించే గొంతుక సీపీఎం సిరిసిల్లటౌన్: మున్సిపాలీటీలో ప్రజా సమస్యలను ప్రశ్నించే గొంతుకై న సీపీఎంను ఆదరించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కై లాబ్బాబు కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం సిరిసిల్లలో ప్రచారం చేశారు. సీపీఎం పోరాటంతోనే సుందరయ్యనగర్, బీవై నగర్లలో పేదలకు ఇళ్లు దక్కాయన్నారు. పవర్లూమ్ కార్మికుల కూలి కోసం పోరాడామని గుర్తు చేశారు. 21వ వార్డు కోడం రమణ, 33వ వార్డు ఎలిగేటి రాజశేఖర్, 34వ వార్డు రాపెల్లి రమేశ్లను గెలిపించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, ఎర్రవల్లి నాగరాజు, గురిజాల శ్రీధర్, సూరం పద్మ పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే బీసీలకు న్యాయం
సిరిసిల్లటౌన్/వేములవాడ: కాంగ్రెస్ పాలనలోనే బీసీలకు, మహిళలకు న్యాయం జరిగిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో శనివారం ప్రచారం చేశారు. వేములవాడను జర్మనీ రమేశ్బాబుతో వెనుకపడేశారని, వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని ఆది శ్రీనివాస్ ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారన్నారు. వేములవాడలో విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ప్రచారం చేశారు. నాయకులు నాగుల సత్యనారాయణగౌడ్, సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, చీటి ఉమేశ్రావు, గడ్డం నర్సయ్య పాల్గొన్నారు. -
స్వామి.. ఓ సంచలనమే
సిరిసిల్ల: మావోయిస్టు చందర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ హయాంలో సిరిసిల్ల ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం నడిచింది. పీపుల్స్వార్(ప్రస్తుత మావోయిస్టు) పార్టీ పశ్చిమ డివిజన్ కమిటీ కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యుడి రెండేళ్లపాటు పనిచేశారు. తన కాలంలో భారీగా రిక్రూట్మెంట్స్తో ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ప్రస్తుతం సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేస్తున్న లోకేటి చందర్రావు(57) గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో స్వామితోపాటు ఏడుగురు మరణించారు. ఈ ఎన్కౌంటర్లో పోలీస్ కమాండో కానిస్టేబుల్ దీపక్ చిన్నమదవి మంద్రా(38) ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడికి చెందిన చందర్ రాజన్నసిరిసిల్ల జిల్లాలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. కోనరావుపేట ఎస్సైపై కాల్పులు 1998లో కోనరావుపేట ఎస్సైగా ఉన్న ముసిపట్ల శ్రీనివాస్గౌడ్ పోలీసు బలగాలతో శివారు అడవుల్లోకి కూంబింగ్కు వెళ్లారు. ఎగ్లాస్పూర్కు చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిమ్మపల్లి వైపు వెళ్తుండగా అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న మావోయిస్టు స్వామి దళం పోలీసులపై మెరుపుదాడి చేసి కాల్పులు జరిపారు. కూంబింగ్లో ముందు వరుసలో వస్తున్న శ్రీనివాస్గౌడ్ అక్కడికక్కడే మరణించారు. మరికొందరు పోలీసులు గాయాలతో బయటపడ్డారు. ● అదే ఏడాది కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు కెనాల్ పక్కన హోంగార్డు శ్రీనివాసరాజు కోవర్టుకు పాల్పడుతున్నాడని కాల్చి చంపారు. ● కోనరావుపేట మండలం వట్టిమల్లలో 1997, జూలై 28న మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను సాయుధ నక్సలైట్లతో నిర్వహించారు. వట్టిమల్ల వేదికగా జనాన్ని సమీకరించి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగించారు. వట్టిమల్లకు వచ్చే నాలుగు దారుల్లోనూ సాయుధ నక్సలైట్లతో మందుపాతరలు అమర్చి మూడు గంటలపాటు పొద్దంతా సమావేశాన్ని నిర్వహించడం అప్పట్లో ఓ సంచలనం. ● వీర్నపల్లి మండలం గర్జనపల్లి, కోనరావుపేట మండలం మరిమడ్లలో అటవీశాఖ కాంట్రాక్టర్ల ద్వారా తునికాకు సేకరణ చేసింది. కూలీలకు కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించి సేకరించిన తునికాకును నిల్వ చేశారు. రూ.కోటి విలువైన తునికాకును లారీల్లో మధ్యప్రదేశ్కు అమ్మేసి ఆ డబ్బుల్లో కొంత మొత్తాన్ని గ్రామాభివృద్ధికి, కొంత ఉద్యమ అవసరాలకు వినియోగించారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ● 1999లో కోనరావుపేట మండలం నిజామాబాద్లో ప్రజాకోర్టును నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మీడియాను తెప్పించి ప్రజాకోర్టును ఏర్పాటు చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన సీపీఐ(ఎంఎల్) జనశక్తి పార్టీ సానుభూతిపరుడు భానును, కోనరావుపేట మండలం మరిమడ్లకు చెందిన నాగరాజు గర్జనపల్లి అడవుల్లో పట్టుకుని కాల్చి చంపారు. అప్పట్లో పీపుల్స్వార్కు, జనశక్తి పార్టీలకు మధ్య వైరుధ్యాలు ఉండేవి. ఆధిపత్య పోరులో భాగంగా జనశక్తికి చెందిన ఇద్దరిని కాల్చిచంపారు. ఇంకా అనేక హింసాత్మక ఘటనలకు, భౌతికదాడులకు, సంచలన ఘటనలకు పడ్కల్ స్వామి కేంద్రబిందువుగా నిలిచారు. పడ్కల్ స్వామిగా గుర్తింపు 1992 నుంచి అజ్ఞాతంలో ఉన్న స్వామి ఏనాడు ఇంటి ముఖం చూడలేదు. 1993లో నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడ్కల్లో సిర్నాపల్లి దళం సేదతీరుతుండగా పోలీసులు దాడి చేశారు. ఆ సంఘటనలో డిప్యూటీ దళకమాండర్ సంజీవ్, గోపి, క్రాంతి మరణించారు. పడ్కల్లో పోలీసులతో రెండు రోజులపాటు ఒక్కడే పోరాడి ఒక్క కానిస్టేబుల్ను కాల్చి చంపారు. అప్పటి డీజీపీ పడ్కల్కు రావడం విశేషం. స్వామి ఉన్న ఇంటికి నిప్పు పెట్టగా ఏకే 47తో కాల్పులు జరిపి పోలీసులు వెనక్కి తగ్గగానే తప్పించుకున్నారు. అప్పట్లో ఇదో సంచనం. అప్పటి నుంచి పడ్కల్ స్వామిగా లోకేటి చందర్రావుకు గుర్తింపు. ఆయన భార్య సులోచన అలియాస్ నవనీత పార్టీలో పనిచేస్తూనే 2016లో అనారోగ్యంతో మరణించారు. ఆయన కొడుకు రమేశ్ ఇటీవల పోలీసులకు లొంగిపోయారు. రమేశ్ భార్య బుజ్జి అలియాస్ కమలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వామి ఎన్కౌంటర్ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రాబల్య గ్రామాల్లో శనివారం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఆవశ్యకతపై ప్రసంగం సిరిసిల్లలో చర్చనీయ ఘటనలు గొడ్చిరోలి ఎన్కౌంటర్లో మృతి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్న మాజీలు, సానుభూతిపరులు -
వన్యప్రాణుల దాడులు.. అందని పరిహారం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైతులకు పంటలకుతోడు పాడి ఉంటేనే ఆర్థికంగా స్థిరపడతారు. అయితే ఇటీవల జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లోని రైతులకు వన్యప్రాణుల దాడులు దడ పుట్టిస్తున్నాయి. వేలకు వేలు పెట్టి ఆవులు, గేదెలు కొని పాలు విక్రయించి అప్పుల నుంచి గట్టెక్కుదామనుకుంటే వన్యప్రాణుల దాడులతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. విచారణ చేపడుతున్న ఫారెస్ట్ అధికారులు నివేదిక సమర్పించి చేతులు దులుపుకుంటున్నారు. బాధితులకు మాత్రం పరిహారం రావడం లేదు. సంఘటనలు ఇలా.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో అటవీ విస్తరించి ఉంటుంది. అటవీని ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఇటీవల వన్యప్రాణుల దాడులు పెరిగాయి. అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఐదు చిరుతపులులు, పలు ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. ఇటీవల ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కోనరావుపేట మండలాల్లో చిరుతల దాడుల్లో గేదెలు చనిపోయాయి. ఆరు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా జరిగిన పది సంఘటనల్లో లేగదూడలు మృతిచెందాయి. వీరిలో ఎవరికీ ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదు. ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల, గాలిపల్లి గ్రామాల్లో ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని గుంటపల్లిచెరువుతండాలో ఆరు నెలల్లో చిరుతల దాడిలో మూడు లేగదూడలు, ఎలుగుబంట్ల దాడిలో రెండు దూడలు చనిపోయాయి. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
వేములవాడరూరల్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు ఎస్సై చల్లా వెంక్రట్రాజం తెలిపారు. మృతునికి 50 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. మెడలో రుద్రాక్ష, ఇతర మాలలు ధరించి ఉన్నాడు. మతిస్థిమితం సరిగ్గా లేక.. కాగితాలు ఏరుకునేవాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే 87126 56417లో సంప్రదించాలని కోరారు. ● పత్తిపాకలో దొంగతనం ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలోని మెన్నెని వెంకటనర్సింగరావు ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. ఎస్సై ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.. వెంకటనర్సింగరావు తన ఇంటికి తాళాలు వేసి పని నిమిత్తం కరీంనగర్ వెళ్లాడు. శనివారం ఉదయం వచ్చిచూడగా తాళం పగులకొట్టి కనిపించింది. లోనికి వెళ్లిచూడగా.. బీరువా ధ్వంసమై ఉంది. అందులోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి గుడికి సంబంధించిన 19 గ్రాముల బంగారు ఆభరణాలు, 510 గ్రాముల వెండి వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్టీం పోలీసులు వేలిముద్రలు సేకరించారు. 25ఏళ్లుగా స్వామివారి కానుకలు ఇక్కడే.. పత్తిపాకలో 2000–2001 సంవత్సరంలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నాటినుంచి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సమకూరే కట్నకానుకలను మాజీ సర్పంచ్ వెంకటనర్సింగరావు ఇంట్లోనే భద్రపర్చుతున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చిన కట్నకానుకలనూ ఆయన ఇంట్లో ఉంచేందుకు భక్తులు రాగా.. తాను స్థానికంగా ఉండడం లేదు, వేరేవారి ఇంట్లో భద్రపర్చాలని చెప్పారు. అయినా, గ్రామస్తులు ఒప్పుకోలేదు. ఆయన ఇంట్లోనే ఆభరణాలు భద్రతపరిచారు. దొంగలు ఈ ఆభరణాలతోపాటు వాటి తాలూకు జాబితా కూడా ఎత్తుకెళ్లారు. దీంతో బంగారం, వెండి ఎంతుందనే సమాచారం తెలియడం లేదు. దీనిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ స్పష్టత ఇవ్వలేదు. సిరిసిల్లక్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లో శనివారం రెండు వేర్వేరు సంఘటనల్లో రూ.4లక్షలు సీజ్ చేశారు. జగిత్యాలకు చెందిన శ్రీనాథ్ తన కారులో వస్తుండగా పోలీసుల తనిఖీల్లో రూ.2లక్షలు నగదు పట్టుబడిందని సిరిసిల్లటౌన్ సీఐ కృష్ణ తెలిపారు. వేములవాడ మండలం ఎదురుగట్ల నుంచి చిగురు వినోద్ సిరిసిల్ల వస్తుండగా స్థానిక చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.2లక్షలు నగదు తరలిస్తున్నట్లు నిర్ధారించి సీజ్ చేసినట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. -
పాలిసెట్తో ఉజ్వల భవిత
కరీంనగర్టౌన్: ప్రస్తుతం పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత ఏం చేయాలనే ఆలోచన తల్లిదండ్రులు, విద్యార్థుల్లో మెదులుతుంది. చాలా మంది ఇంటర్ చదవడానికి ఆసక్తి చూపుతారు. సంప్రదాయ చదువులు కాకుండా.. త్వరితగతిన ఉపాధి, ఉద్యోగవకాశాలు కావాలనుకునేవారికి పాల్టెక్నిక్ కోర్సులు ఉపయోగకరంగా ఉంటాయని విద్యానిపుణులు చెబుతున్నారు. పదో తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాలిసెట్– 2026 ప్రవేశపరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులకు అవకాశం ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 40,701 మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. కరీంనగర్ జిల్లాలో 13,156, జగిత్యాల 12,298, పెద్దపల్లి 7,495, రాజన్న సిరిసిల్ల 7,752 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో టెక్నికల్ రంగం వైపు అడుగులు వేయాలనుకునే వారు పాలిసెట్ను ఎంపిక చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాటారం, హుస్నాబాద్, సిరిసిల్ల(ఆగ్రహారం), కోరుట్ల, కరీంనగర్ జిల్లాకేంద్రాల్లో పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో 480 సీట్లు, హుస్నాబాద్, కాటారం, కోరుట్ల, కరీంనగర్ కళాశాలల్లో 5 కోర్సులకు 66 చొప్పున 330 సీట్లున్నాయి. ఆసక్తిగల విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.300 అపరాద రుసుముతో ఏప్రిల్ 22 వరకు ఫీజు చెల్లించొచ్చు. మే 13న ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, పదో తరగతిలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా ఎంపిక చేస్తారు. మూడేళ్ల కోర్సులో ప్రతిభచాటిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా జెన్కో, ఎన్టీపీసీ, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వే, సింగరేణి, ఐవోసీఎల్, బీహెచ్ఈఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఐటీఐ, ఇంజినీరింగ్, పాలిటెక్నికల్ శిక్షకులుగా చేరవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఏప్రిల్ 20 వరకు అవకాశం.. మే 13న ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40,701 మంది ఎస్సెస్సీ విద్యార్థులు ఉపాధి, ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధికి పాల్టెక్నిక్ విద్య తోడ్పడుతుంది. గ్రామీణ విద్యార్థులకు ఈ కోర్సు ఉపయోగకరం. తక్కువ ఫీజు చెల్లించి ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది. మూడేళ్ల కోర్సులో ఆరు నెలలు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. ఇది విద్యార్థుల్లో అవగాహన పెంచుతుంది. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ చేస్తే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు ఉంటాయి. – డి.శోభారాణి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కరీంనగర్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 20 రూ.100 అపరాధ రుసుంతో ఏప్రిల్ 21 ప్రవేశపరీక్ష నిర్వహించే తేదీ మే 13 -
మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు
కరీంనగర్రూరల్: మూడేళ్లక్రితం కుటుంబకలహాలతో ఇంటినుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తిని పోలీసులు ఆధునిక టెక్నాలజీతో నేపాల్లోని ఖాఠ్మాండులో గుర్తించి శనివారం కరీంనగర్కు తీసుకొచ్చారు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు వివరాలు గోదావరిఖనికి చెందిన పస్తం సురేశ్(32)కు దుర్శేడ్కు చెందిన అనూషతో వివాహమైంది. మూడేళ్లక్రితం అత్తగారింటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు కరీంనగర్రూరల్పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక విచారణతోపాటు ఆధునిక సాంకేతిక సాయంతో సురేశ్ విశాఖపట్నం,నేపాల్దేశంలోని ఖాఠ్మాండులో నివసిస్తున్నట్లు గుర్తించారు. చివరకు వివిధ ప్రయత్నాల ద్వారా సురేశ్ను పట్టుకుని శనివారం పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మిస్సింగ్కేసును చేధించిన పోలీసులను సీఐ నిరంజన్రెడ్డి అభినందించారు. -
డబ్బులు రాలేవు
రెండు నెలల కింద ఎలుగుబంటి దాడి చేయడంతో లేగదూడ చనిపోయింది. అధికారులు వచ్చి చూసిండ్రు. నివేదిక రాసుకొని పోయిండ్రు. పైసలు అయితే రాలేవు. – భూక్య తిరుపతినాయక్, గుంటపల్లిచెరువుతండా, గిరిజన రైతు నివేదికలు పంపిస్తున్నాం ఇటీవల జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టి నివేదికలు పంపించాం. పరిహా రం రైతులకు వస్తుంది. గతంలోనూ పలువురు రైతుల పశువులపై దాడి జరిగిన సంఘటనల్లో పరిహారం వచ్చింది. ఆలస్యమైనప్పటికీ పరిహారం మాత్రం తప్పనిసరిగా వస్తుంది. – మోహన్లాల్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ -
మత్తు కోసం ఏవిల్ ఇంజెక్షన్లు !
● చెట్లపొదల్లో వెలుగుచూసిన సిరంజీలు, ఆంపుల్స్ ముస్తాబాద్ (సిరిసిల్ల): యువత మత్తు కోసం రోజుకో మార్గాన్ని కనిపెడుతున్నారు. తక్కువ ధరకు లభించే ఇంజెక్షన్లు తీసుకుంటూ మత్తులో జోగుతున్నారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజ న్నసిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రం శివారులో తెర్లుమద్ది, బందనకల్ గ్రామాల మధ్య చెట్ల పొదల్లో వాడి పడేసిన సిరంజిలు, ఆంపుల్స్ కవర్లు ప్రత్యక్షమయ్యాయి. ఫిజీషియన్ సమక్షంలోనే ఇచ్చే ఈ ఇంజెక్షన్లు ఇలా ఆరుబయట, చెట్లపొదల్లో పడి ఉండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. మత్తు కోసమే వాడవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలోనే మత్తు కోసం దగ్గు మందు తాగేవారు. మత్తు కోసం ఇలాంటి మార్గాలు ఎంచుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిరిసిల్ల క్రైం: మున్సిపల్ ఎన్నికల నిబంధనలు అతిక్రమించి తరలిస్తున్న మద్యంను సిరిసిల్ల టౌన్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ కృష్ణ తెలిపిన వివరాలు. పట్టణంలోని సుభాష్నగర్ ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేయగా.. రూ.19,008 విలువైన మద్యం, బైక్, మొబైల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దార్నం అరుణ, దార్నం లక్ష్మీనారాయణ, మల్లికార్జున వైన్స్, రాచమల్లు రాముపై కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం తీసుకెళ్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
● గొడ్డలితో నరికి.. కత్తితో గొంతుకోసి ● భార్యను దారుణంగా చంపిన భర్త ● నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జగిత్యాలక్రైం: మూడుముళ్లు వేసి.. ఏడడుగులు వేసి.. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను అనుమానిస్తూ.. ఆమైపె కక్ష పెంచుకుని నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి.. కత్తితో గొంతు కోసి దారుణహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో శనివారం వేకువజామున వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీపూర్కు చెందిన అదరవేని మల్లయ్యతో 30 ఏళ్ల క్రితం జగిత్యాల పట్టణ శివారు ఉప్పరిపేటకు చెందిన సత్తవ్వతో వివాహమైంది. వీరికి కుమారుడు, కూతురు సంతానం. కొంతకాలంగా మల్లయ్య భార్యను అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. మద్యానికి బానిస అయిన మల్లయ్య సత్తవ్వను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. పలుమార్లు పంచాయితీలు జరిగాయి. వేధింపులు భరించలేని సత్తవ్వ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అయినా వేధించడంతో తల్లిగారింటికి వెళ్లి కొన్నేళ్లు అక్కడే ఉంది. మూడేళ్ల క్రితం పెద్దలు పంచాయితీ చేసి ఇద్దరిని కలిపారు. అప్పటినుంచి సత్తవ్వ పిల్లలను చూసుకుంటూ.. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. కుమారుడు హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న కూతురు నాలుగురోజుల క్రితం తన ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ వెళ్లింది. దీనిని అదునుగా చేసుకున్న మల్లయ్య.. శనివారం వేకువజామున రెండు గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సత్తవ్వను గొడ్డలితో నరికాడు. సత్తవ్వ సృహ కోల్పోవడంతో కూరగాయల కత్తితో గొంతు కోశాడు. విచక్షణరహితంగా శరీరంపై పొడిచాడు. ఆమె మృతిచెందిందని నిర్ధారించుకుని అక్కడినుంచి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి సోదరుడు గడ్డం చిన్నమల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్ తెలిపారు. లక్ష్మీపూర్లో విషాదం ఇద్దరు పిల్లలతో కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సత్తవ్వ హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుమారుడు, కూతురును ఉన్నత చదువులు చదివిస్తున్న సత్తవ్వ హత్యకు గురికావడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సాయంత్రం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. నిందితుడు మల్లయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. -
లారీ, బస్సును ఢీకొన్న ఇసుక లారీ
● ఆరుగురు ప్రయాణికులు, లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు ● బోల్తా పడ్డ యూరియా లారీ పగిలిన ఆర్టీసీ బస్సు అద్దాలు బోల్తా పడ్డ యూరియా లారీ శంకరపట్నం: తాడికల్ గ్రామంలో శనివారం యూరియా లారీ, ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొంది. ప్రయాణికులు, స్థానికుల వివరాల ప్రకారం.. తాడికల్ సహకార సంఘానికి యూరియా లోడ్తో వస్తున్న లారీ వెనుక హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు 70 మంది ప్రయాణికులతో కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్తోంది. తాడికల్కు చేరుకున్న క్రమంలో యూరియా లారీని ఇసుక లారీ ఢీకొట్టిడంతో యూరియా లారీ బోల్తా పడింది. యూరియా లారీ వెనకాల వస్తున్న హుజూరాబాద్ డిపోకు చెందిన అద్దె బస్సును సైతం ఇసుక లారీ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. యూరియా లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని 108 వాహనానికి సమాచారమందించారు. ఆలస్యం కావడంతో ఆటోలో కొందరిని హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కేశవపట్నం పోలీసులు చేరుకొని 108 వాహనంలో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించి వివరాలు సేకరించారు. తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికులు -
పదేళ్లలో గాలికొదిలేసిన పనులు చేస్తున్నా
● గతంలో వేములవాడను పట్టించుకోలేదు ● కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: పదేళ్లుగా గాలికి వదిలేసిన పనులను తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లలో ముందుకు తీసుకెళ్తూ.. వేములవాడను వెన్నెలవాడగా మార్చేందుకు కృషి చేస్తున్నానని ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 1 నుంచి 28వ వార్డు వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వేములవాడలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కౌన్సిలర్లను తమ పార్టీకి ఇస్తే వేములవాడను టెంపుల్సిటీగా మరింత సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటే సీఎం రేవంత్రెడ్డితో కొట్లాడి నిధులు తీసుకొస్తానన్నారు. వారు గెలిస్తే నిధులు ఎక్కడి నుంచి తెస్తారనేది మీరు ఆలోచించాలని కోరారు. పదేళ్లు అధికా రంలో ఉండి మూలవాగు బ్రిడ్జి కూడా కట్టలేదన్నా రు. రాజన్నగుడిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లకు ఓటు వేస్తే మురుగుకాలువలో వేసినట్లేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
ఆకట్టుకున్న సృజన టెక్ ఫెస్ట్
వేములవాడఅర్బన్: అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పాలిటెక్నిక్ సృజన టెక్ ఫెస్ట్–2026 నిర్వహించారు. కోరుట్ల, అగ్రహారం కళాశాలల విద్యార్థులు మోకానికల్, టెక్స్టైల్ విభాగంలో తయారు చేసిన ప్రాజెక్ట్లు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ ప్రభాకరా చారి, అధ్యాపకులు శంకరయ్య, శరణ్య, అంజలి, కనకయ్య పాల్గొన్నారు. వీర్నపల్లి(సిరిసిల్ల): రానున్న వేసవిలో నీటి ఎద్దడి లేకండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి ఎండీ.షఫీయొద్దీన్ అధికారులు, సర్పంచులకు సూచించారు. వీర్నపల్లిలోని రైతువేదికలో శుక్రవారం సమావేశమయ్యారు. ఎంపీడీవో శ్రీలేఖ, అధికారులు సుమలత, అన్వర్, భీరయ్య, పావని, రాము, అనిల్, కార్తికేయ పాల్గొన్నారు. సిరిసిల్ల ఎడ్యుకేషన్: హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం సరికాదని బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల లక్ష్మణ్గౌడ్ పేర్కొన్నారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హేతుబద్ధీకరణ కోసం తెచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు. వికృతి లక్ష్మీనారాయణ, బండారి మల్లేశం, పులి రాంగోపాల్గౌడ్, ఇటికాల సుధాకర్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: తమ సామాజిక వర్గంపై సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆలిండియా వెలమ అసోసియేషన్(ఐవా) ఉపాధ్యక్షుడు తాండ్ర శ్రీనివాస్రావు పేర్కొన్నారు. సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్హాలులో శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. త్వరలోనే వెలమ సమరభేరి ద్వారా తమ నిరసనను వినిపిస్తామన్నారు. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. నాయకులు సరీన్గాంధీరావు, మోచినేని శ్రీనివాస్రావు, రోకండ్ల వెంకటేశ్వర్రావు, వంశీకృష్ణారావు, కలకుంట్ల నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మోడల్స్కూల్ విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదివి అత్యున్నత ఫలితాలు సాధించాలని బీటీఆర్ ఫౌండేషన్ అధినేత బెద్రం తిరుపతిరెడ్డి కోరారు. మండలంలోని రహీంఖాన్పేట మోడల్స్కూల్ విద్యార్థులు 94 మందికి ‘సాక్షి’ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ స్టడీ మెటీరియల్ను శుక్రవారం పంపిణీ చేశారు. సాక్షి స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గంగాధర్, రహీంఖాన్పేట ఉపసర్పంచ్ గడ్డమీది పద్మ, శ్రీకాంత్గౌడ్, ప్రసన్నకుమార్, అనిల్కుమార్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: కుక్కల సంఖ్య పెరగకుండా చికిత్స చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్పాషా తెలిపారు. ఏనిమల్ బర్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతున్న కుక్కలను శుక్రవారం ఏబీసీ సెంటర్కు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీధికుక్కలను గుర్తించి అవసరమైన చికిత్స చేసిన అనంతరం తిరిగి వదిలేస్తున్నట్లు తెలిపారు. -
వెబ్ కాస్టింగ్
పోలింగ్ కేంద్రాల్లో ● 175 పోలింగ్ కేంద్రాలు.. 1,212 మంది సిబ్బంది ● 48 సెన్సిటివ్, 17 క్రిటికల్ సెంటర్స్ ● ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం ● ‘సాక్షి’తో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ఎన్నికల నిర్వహణ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసారి క్యూఆర్ కోడ్ ద్వారా ప్రశ్నావళిని ఇచ్చాం. ఆ ప్రశ్నావళిలో ఎన్నికల సిబ్బంది సమర్థత వెలుగు చూస్తుంది. ఎన్నికల నిర్వహణపై అవగాహన లోపం ఉన్న వారికి మళ్లీ శిక్షణ ఇచ్చాం. ఇలా పూర్తి అవగాహనతో సిబ్బంది ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ర్యాండమైజేషన్ పూర్తయింది. మూడోసారి ర్యాండమైజేషన్ చేసిన తర్వాతే సిబ్బందికి పోలింగ్ కేంద్రాల కేటాయింపులు ఉంటాయి. ఓట్లలెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇస్తాం. మాక్ కౌంటింగ్ను నిర్వహిస్తాం. సిరిసిల్లలో ఓట్ల లెక్కింపు కొత్తబస్టాండులోని సినారె కళామందిరంలో, వేములవాడలోనూ సినారె కళామందిరంలో జరుగుతుంది.సిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ తెలిపారు. ప్రతీ ఒక్క ఓటరు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఓటుహక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేలా మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు చేశామని, ఫామ్–12 ద్వారా దరఖాస్తును సమర్పించి ఓటుహక్కు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ‘సాక్షి’తో శుక్రవారం మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..48 సెన్సిటివ్, 17 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు రెండు మున్సిపాలిటీల్లో 48 సెన్సిటివ్, 17 క్రిటికల్ పోలింగ్స్టేషన్లు ఉన్నట్లు పోలీస్శాఖ రికార్డులు చెబుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జిల్లా పోలీసులు చేస్తారు. 175 పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ ఉంటుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తారు. 1,212 మంది సిబ్బంది సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్ని కల నిర్వహణకు 1,212 మందిని నియమించాం. నామినేషన్ల కోసం మూడు వార్డులకు ఒక్కో ఆర్వోను నియమించాం. సిరిసిల్లలో 13, వేములవాడలో 10 మందిని నియమించాం. ఎన్నికల నిర్వహణకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో పీవో, ఏపీవోలతోపాటు ముగ్గురు ఓపీవోలు ఉంటారు. 20 శాతం అదనపు సిబ్బందిని రిజ ర్వులో ఉంచాం. ఓట్ల లెక్కింపునకు 243 మంది సిబ్బందిని నియమించారు. ఎన్నికల విధులకు నియమించబడిన సిబ్బంది అందరూ శిక్షణకు హాజరయ్యారు. సిరిసిల్లలో 8, వేములవాడ 6 జోన్లుగా విభజించి ఎన్నికలను నిర్వహిస్తున్నాం. 23 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించాం. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పత్రాలను అందించాం. శని, ఆదివా రాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ముందుగా ఫామ్–12 సమర్పించిన సిబ్బందికే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుంది. జిల్లాలో రూ.26.70 లక్షలు సీజ్ చేశాం సిరిసిల్ల, వేములవాడ పట్టణాల శివారుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. లెక్కలు చూపకుండా తరలిస్తున్న రూ.26.70లక్షల మేరకు సీజ్ చేశాం. క్షేత్రస్థాయిలో సిరిసిల్లలో మూడు, వేములవాడలో మూడు తనిఖీ బృందాలతో నిఘా ఉంచాం. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల సంఘం నిబంధల మేరకు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్లు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి స్వేచ్ఛగా, నిజాయితీగా ఓటుహక్కును వినియోగించుకోవాలి.సిరిసిల్లలో 39 వార్డులు 117 పోలింగ్ స్టేషన్లు, వేములవాడలో 28 వార్డులు, 58 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సిరిసిల్లలో 81,959 మంది, వేములవాడలో 40,877 మంది ఓటర్లు ఉన్నారు. దివ్యాంగులు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేలా ర్యాంపులు ఏర్పాటు చేశాం. బూత్ లెవల్ ఆఫీసర్లు ఓటర్లకు స్లిప్స్ పంపిణీ చేయడం ద్వారా ఓటు వేయాలనే ఆలోచన వస్తుంది. ఇప్పటికే అన్ని పొలిటికల్ పార్టీలతో సమావేశాలు నిర్వహించి ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలని సూచించాం. డిగ్రీ కాలేజీల్లోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. -
జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్స్
సిరిసిల్ల: రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగిన 7వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారిణి బి.బేలా గోల్డ్మెడల్తో పాటు మరో రెండు పతకాలు సాధించారు. అజ్మీర్లో ఫిబ్రవరి 2న జరిగిన పోటీల్లో బేలా ఐదు కిలోమీటర్ల నడక పోటీలో గోల్డ్ మెడల్, 500 మీటర్ల పరుగుపందెంలో సిల్వర్, వెయ్యి మీటర్ల పరుగుపందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. 40–44 ఏళ్ల గ్రూప్లో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. స్పోర్ట్స్ డ్రెస్ను బహుమతిగా అందించారు. బేలాను జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి బొడ్డు నారాయణ, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్ అభినందించారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
● జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ సిరిసిల్ల/వేములవాడ: ఎన్నికల సిబ్బంది బాధ్యతా యుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ సూచించారు. వేములవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల అధికారు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. ఆర్డీవో రాధాబాయి, ట్రై నింగ్ నోడల్ అధికారి శ్రీనివాసాచారి, డీఈవో జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, తహసీల్దార్ జయంత్కుమార్ ఉన్నారు. జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్థానిక సినారె కళామందిర్లో రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈనెల 7, 8 తేదీల్లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీనివాస్రెడ్డితో కలిసి శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నోడల్ అధికారి మల్లికార్జునరావు, ట్రైనర్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి ఈనెల 25 నుంచి మార్చి 16 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై అనదపు కలెక్టర్ నగేశ్, ఏఎస్పీ చంద్రయ్యలతో కలిసి సమీక్షించారు. ఫస్టియర్ 4,046, సెకండియర్ 4,060 మంది హాజ రవుతారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. డీఐఈవో శరత్కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు వేణు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ కార్డులకు ఆన్లైన్ దరఖాస్తులు 2026–2028 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చే యాలని జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడున్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి ఈనెల 28తో ముగియనుందని, అర్హత గల జర్నలిస్టులకు కొత్తకార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 9 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కోరారు. భక్తులు ఇబ్బందులు పడొద్దు మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు సాఫీగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భీమేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రాధాభాయితో కలిసి పరిశీలించారు. వీఐపీ దర్శనాల కోసం చేసిన ప్రత్యేక ద్వారం, బారికేడ్లను పరిశీలించిన ఈఈ రాజేశ్కు సూచనలు చేశారు. బద్దిపోచమ్మ ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ప్రసాదం కౌంటర్ ఏర్పా టు చేయాలని సూచించారు. మొబైల్ టాయిలెట్ల సంఖ్య పెంచాలన్నారు. కోడెల టికెట్ కౌంటర్, పందిర్లు, శివార్చన స్టేజీ పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలన్నారు. ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, తహసీల్దార్ జయంత్, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ ఉన్నారు. -
మహాజాతరకు పటిష్ట భద్రత
● ఎస్పీ మహేశ్ బీ గీతే వేములవాడ: మహాశివరాత్రి జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. భీమన్న ఆలయంలో శుక్రవారం ప రిశీలించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తుల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, క్యూలైన్లు, ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించా రు. పట్టణంలోని ప్రధాన మార్గాల్లో రూట్మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఏఎస్పీ రుత్విక్సాయి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై రాజు, ఆలయ ఈఈ రాజేశ్, డీఈ మహిపాల్రెడ్డి, ఏఈ రాంకిషన్రావు ఉన్నారు. రగుడు చెక్ పోస్ట్ తనిఖీసిరిసిల్ల క్రైం: రగుడు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ఎస్పీ మహేశ్ బీ గీతే శుక్రవారం తనిఖీ చేశారు. వాహన తనిఖీల రిజిస్టర్లు పరిశీలించారు. చెస్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 8న కరీంనగర్లో ఐటీ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంకరీంనగర్: జిల్లాలోని యువతకు ఐటీరంగంపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కోడింగ్ ట్యూటర్ ఆధ్వర్యంలో ఐటీ జాబ్మేళా, ఇంటర్న్షిష్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈనెల 8న ఆదివారం ఉదయం 10 గంటలకు, కరీంనగర్లోని శ్వేత హోటల్లో కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఐటీ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలు, కంపెనీలు ఏ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి... గ్రాడ్యుయేషన్ తర్వాత యువత ఎలా సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టవచ్చు.. ఇంటర్న్షిప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయనే విషయాలను ఫణిరాజ్ జాలిగామ వివరించనున్నారు. ఈ కార్యక్రమం డిగ్రీ/ఇంజినీరింగ్ పూర్తిచేసిన, ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 89888 87333 నంబర్కి ఫోన్చేసి తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసిన వారికే ప్రవేశం కల్పించబడుతుందన్నారు. -
ఆరోగ్యం పైలం!
పరీక్షల కాలం..హుజూరాబాద్/కరీంనగర్ స్పోర్ట్స్: వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతోంది. పక్షం రోజుల్లో ఇంటర్, నెల రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈక్రమంలో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి పుస్తకాలతో యుద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతూ.. అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఏడాదిలో విన్న పాఠాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. పరీక్షలు ఉన్నాయని చదవడమే కాదు.. ఆర్యోగ్యాన్ని కాపాడుకోవడమూ ముఖ్యమని నిపుణులు అంటున్నారు. సరైన ఆహారం తీసుకోవాలని, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దని, నిద్రముఖ్యమని సూచిస్తున్నారు. – వివరాలు 8లో.. -
కాంగ్రెస్కు ఓటేస్తే జిల్లా పోతది
● సిరిసిల్లకు కేసీఆర్ సముద్రాన్ని తెచ్చాడు ● నేతన్నలను కడుపులో పెట్టుకున్నాడు ● బీడీ కార్మికులకు ఆసరా అయ్యాడు ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సిరిసిల్ల/వేములవాడ/సిరిసిల్లఅర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జిల్లా పోతదని, నా మీద కోపంతో జిల్లాను రద్దు చేయాలనే ఆలోచన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలోని పెద్దూరు బాబాజీకాలనీ, పెద్దూరు చౌరస్తా, తారకరామానగర్, విద్యానగర్, సుభాష్నగర్, నేతన్నచౌక్, పద్మనగర్, చంద్రంపేటతోపాటు వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ బస్టాండు, అమరవీరుల స్తూపం, తెలంగాణచౌక్లో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పెన్షన్లను పెంచలేదు, మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు, బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, రైతుబంధు ఇవ్వలేదు, కల్యాణలక్ష్మీలో తులం బంగారం ఇవ్వలేదు, కేసీఆర్ కిట్టు లేదన్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో మీ కళ్ల ముందే ఉందన్నారు. మానేరు వాగులోకి సముద్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్దేనని తెలిపారు. మెడికల్ కాలేజీ, జేఎన్టీయూ, వ్యవసాయ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, అపెరల్ పార్క్.. కేసీఆర్ నిధులిస్తే.. నేను మంత్రిగా చేశానని గుర్తు చేశారు. నేతన్నల ఉపాధి కోసం బతుకమ్మ చీరలు నేతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యలు తగ్గించాలనే లక్ష్యంతో రూ.3,400కోట్లతో బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తే.. కాంగ్రెస్ ఆ పథకాన్ని రద్దు చేసిందన్నారు. చెయ్యి గుర్తును గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు వస్త్రోత్పత్తిదారులను బెదిరిస్తున్నారన్నారు. బిడ్డా.. ఇది కేటీఆర్ అడ్డా.. బిల్లులు ఇవ్వము.. ఆర్డర్లు ఇవ్వమంటే గల్లా పట్టి నిలదీస్తామన్నారు. సిరిసిల్ల గులాబీ కంచుకోట అని మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు వేసి మరోసారి నిరూపించాలని కోరారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉండి బండి సంజయ్ సిరిసిల్లకు, రాజన్నకు ఒక్కపైసానైనా తెచ్చాడా అని కేటీఆర్ నిలదీశారు. గుడి ముందు బిచ్చగాళ్లలాగా దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. మీ దయతోనే మంత్రిని అయిన.. సీఎం కేసీఆర్ చొరవతో జిల్లాను సాధించుకున్నామని.. ఇప్పటికే చాలా పనులు చేసుకున్నాం.. ఇంకా కొన్ని పనులు మిగిలిపోయాయి.. అవి చేయించే బాధ్యత తనదేనన్నారు. దండం పెట్టి చెబుతున్నా.. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కొండూరి రవీందర్రావు, తోట ఆగయ్య, తుల ఉమా, చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్ పాల్గొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే..మోసానికి వేసినట్లే కాంగ్రెస్కు ఓటువేస్తే మోసానికి వేసినట్లేనని ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. విలీన గ్రామాలను పట్టణంలో కలిపితే అభివృద్ధి చెందుతాయనుకున్నామే తప్ప మరే ఉద్దేశం లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విలీన గ్రామాలను తిరిగి పంచాయతీలుగా మార్చుకుందామన్నారు. ఈ ఎన్నికల్లో మీ ఓటు ద్వారా కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. -
పంచిన మద్యం సీసాలు వైన్స్షాపుల్లోకి..
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని ఓ వార్డులో ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ప్రతిరోజూ సాయంత్రం ముగ్గురు అభ్యర్థులు అడిగినవారికి లేదనకుండా మందు పంపిణీ చేస్తున్నారు. అయితే ముగ్గురు ఇచ్చిన మందును ఒకేరోజూ తాగలేకపోతున్నారు. దీంతో వారు కొత్త ఐడియాకు తెరతీశారు. ఒక అభ్యర్థి ఇచ్చిన మందును ఆ రోజు తాగి.. మిగిలిన అభ్యర్థులు ఇచ్చిన మందు బాటిళ్లను వైన్స్షాపులకు తీసుకెళ్లి ఇచ్చి నగదు తీసుకుంటున్నారు. ఇలా సమకూరిన డబ్బులను తలాకొంత పంచుకుంటుండడం విశేషం. ప్రచారంలో భాగంగా వచ్చిన మద్యం బాటిళ్లను ఇచ్చి డబ్బులు తీసుకెళ్లడంతో వైన్స్షాపు నిర్వాహకులు నివ్వెరపోతున్నారు. కండువాలు మారుతున్నాయ్.. కొందరు కార్యకర్తలు ఉదయం ఒకపార్టీకి.. మధ్యాహ్నం మరోపార్టీకి.. సాయంత్రం ఇంకో పార్టీకి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎప్పడికప్పుడు కండువాలు మారుస్తూ.. పోటీలో ఉన్న అభ్యర్థులను కంగారుపెడుతున్నారు. మహిళాసంఘాల సభ్యులైతే ఎవరు ప్రచారానికి రమ్మంటే వారివెంట వెళ్తున్నారు. అభ్యర్థులు కూడా కార్నర్ మీటింగ్లకు మహిళాసంఘాల సభ్యులను తరలిస్తున్నారు. వీరికి ఆయా పార్టీల వారు రూ.200 నుంచి రూ.300 వరకు ఇస్తున్నట్లు సమాచారం. పొద్దంతా మూడు పూటల మూడు పార్టీల ప్రచారంలో పాల్గొంటే ఎంత తక్కువనుకున్నా రూ.వెయ్యి వరకు గిట్టుబాటు అవుతోంది. కొంతమంది మహిళా సంఘాల ప్రతినిధులు బరిలో ఉన్న అభ్యర్థులకు ఫోన్ చేసి ‘మీరేమీ అనుకోవద్దు.. మేం మీకే ఓటు వేయిస్తాం..’ కేవలం డబ్బుల కోసం ఓ పూట ప్రచారానికి వెళుతున్నామని చెబుతుండడం గమనార్హం. బాటిళ్లు ఇచ్చి నగదు తీసుకుంటున్న వైనం ఒక్కోరోజు ఒక్కో అభ్యర్థి పంచిన మద్యం సేవనం మిగిలిన వారు ఇచ్చిన బాటిళ్లకు వచ్చిన డబ్బులు తలాకొంత -
మాదిగలు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తరు
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్పార్టీకే ఓటు వేయాలని మాదిగ హక్కుల దండోరా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. గురువారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్నూరుకాపు భవన్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ముఖ్యనాయకుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగతో కలిసి మాట్లాడారు. మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయత్వాన్ని బలపర్చాలని రామకృష్ణ కోరారు. సామాజిక న్యాయం, దళిత వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సమావేశంలో నాయకులు అందే భవాని, కవ్వంపల్లి రవి, కూడెల్లి ప్రవీణ్ కుమార్, సప్పి పోశయ్య, ఎలుకంటి జనార్దన్, బొడ్డు రాములు, కృష్ణపెల్లి రాజలింగం, జంగాపల్లి రాజనర్సు, చిలుక రాజేశ్, తాటిపల్లి బాబు, గాలి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు ముఖ్యుల ఓట్లు 30వ డివిజన్లోనే..
రామగుండం: రామగుండం నగరంలోని 30వ డివిజన్పైనే అందరి దృష్టి నెలకొంది. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ డివిజన్లో ముగ్గురు ముఖ్యులు అయోధ్యనగర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి కాగా, ఇటీవల అంతర్గాం మండల పరిధిలోకి తన ఓటును బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. కాగా దీని పక్కనున్న 28వ డివిజన్ అబాది రామగుండంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పీసీసీ ప్రోటోకాల్ చైర్మన్, ఏఐసీసీ ప్రతినిధి హర్కర వేణుగోపాల్రావు ఓటరుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 30వ డివిజన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములు ముగ్గురు ముఖ్యుల ఆధిపత్యాన్ని స్పష్టం చేయనుందనే చర్చ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కోలేటి దామోదర్కౌశికహరివేణుగోపాల్రావుమక్కాన్సింగ్ రామగుండంలో సర్వత్రా ఆసక్తికర చర్చ -
తహసీల్ ఆఫీస్ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఓ గిరిజన మహిళా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించింది. ముస్తాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట సేవాలాల్తండాకు చెందిన ధరంసోత్ రాజవ్వ గురువారం ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. గమనించిన స్థానికులు రాజవ్వను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు రాజవ్వ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాజవ్వ మాట్లాడుతూ తండాలో సర్వే నంబర్లు 79, 196లలోని భూమిలో 50 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామన్నారు. ఈ భూమిని మరొకరి పేరుపై తహసీల్దార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే సమాచారంతో ఇక్కడికొచ్చామన్నారు. దీనిని అడ్డుకోవా లని అధికారులను కోరామన్నారు. ఆ భూమి ని ఇతరులపై రిజిస్ట్రేషన్ చేయొద్దని అధికారులకు వినతిపత్రం అందించారు. ఈవిషయంపై తహసీల్దార్ రామచంద్రం మాట్లాడుతూ సదరు సర్వేనంబర్లపై వచ్చిన ఫిర్యాదు మేరకు రిజిస్ట్రేషన్ నిలుపుదల చేశామని స్పష్టం చేశారు. తమకు న్యాయం చేయాలని రాజవ్వ, ఆమె కుటుంబ సభ్యులు కోరారు. -
తైబజార్ లేని మున్సిపాలిటీ జగిత్యాల
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీకి ప్రత్యేకత ఉంది. ఏ మున్సిపాలిటీలోనైనా తైబజార్ వసూలు చేస్తుంటారు. ఇక్కడ మాత్రం తైబజార్ వసూలు చేయరు. కూరగాయల వ్యాపారులైనా.. తోపుడు బండ్ల వ్యాపారులైనా.. రోడ్లపై చిన్నచిన్న వస్తువులను ఎవరైనా అమ్ముకోవచ్చు. ఇలాంటి వారికి తైబజార్ లేకపోవడం ఎంతో వెలుసుబాటు కలిగిస్తోంది. పైగా వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మున్సిపాలిటీలో అప్పటి పాలకవర్గం రూ.200కే నల్లా కనెక్షన్ అమలు చేశారు. అప్పటినుంచి అదే అమలువుతోంది. ఏ మున్సిపాలిటిలోనైనా నల్లా కనెక్షన్ తీసుకోవాలంటే కొంతమొత్తం వసూలు చేస్తుంటారు. ఇక్కడ కేవలం రూ.200కే కనెక్షన్ ఇస్తున్నారు. రైతులు, వ్యాపారులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కొనసాగుతున్న రూ.200కే నల్లా కనెక్షన్ -
విద్యుత్ షాక్తో రైతు మృతి
మెట్పల్లిరూరల్: విద్యుత్షాక్తో ఓ రైతు మృతి చెందినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట గ్రామానికి చెందిన సబ్బని గణేశ్ రైతు. పంటకు అడవి పందుల బెడద ఉందని బుధవారం రాత్రి సమయంలో పొలం వద్దకు కాపలా కోసమని అదే గ్రామానికి చెందిన వినోద్, సురేశ్ను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఆ ప్రాంతంలో చీకటి ఉందని సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ లైట్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో విద్యుత్ షాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని వెంట ఉన్న వినోద్, సురేశ్ మెట్పల్లిలోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ప్రమాదమని తెలిసినా.. గణేశ్కు సహకరించిన వినోద్, సురేశ్పై మృతుడి భార్య లహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. 12 రోజుల్లో ఇద్దరి మృతిరుద్రంగి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో విషజ్వరాలు ప్రబలు తున్నాయి. 12 రోజుల్లో ఇద్దరు విషజ్వరంతో మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషజ్వరం, రక్తకణాలు తగ్గిపోయి బోయిని రాములు అనే వ్యక్తి జనవరి 25న మృతిచెందగా విషజ్వరం, రక్తకణాలు పడిపోయి, జాండీస్తో కట్కూరి సంజీవ్(48) గురువారం మృతిచెందారు. ప్రభుత్వ వైద్యాధికారులు పరీక్షలు చేసి మరణాలకు గల కారణాలను తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంజీవ్ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి కరీంనగర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. సంజీవ్కు తల్లి లక్ష్మి, భార్య మంజూల, కొడుకులు వంశీ(25), సన్ని(19), శ్రావణ్(16) ఉన్నారు. గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ శివారు గోదావరినదిలో గురువారం గుర్తుతెలియని లభించినట్లు ఎస్సై వెంకటస్వామి పేర్కొన్నారు. మృతుడికి సుమారు 40 ఏళ్ల వయసు ఉంటుందని, ఆకు పచ్చ రంగు ఫుల్ టీ షర్ట్, దానిలో తెలుపు రంగు, లేత ఆకుపచ్చ జీన్స్ ప్యాంట్, కుడి చేతికి 3 స్టార్ టాటూస్, ఎడమ చేతికి టీ, ఎం, ఎన్ ఇంగ్లిష్ అక్షరాలను టాటూ వేయించుకున్నాడు. ఆచూకీ తెలిసినవారు 87126 56527 నంబర్కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. ఈనెల 2న గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యం కాగా రెండురోజుల వ్యవధిలో మరో మృతదేహం లభ్యమవడం చర్చనీయాంశంగా మారింది. బెల్ట్షాపు మూసివేతచిగురుమామిడి: మండలంలోని ఓ గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులు మద్యం సేవించిన ఘటనపై తిమ్మాపూర్ సర్కిల్ ఎకై ్సజ్ అధికారులు స్పందించారు. గురువారం పాఠశాలకు సమీపంలో ఉన్న బెల్ట్షాపును మూసివేయించారు. విచ్చలవిడిగా బెల్ట్షాపులు కొనసాగుతున్నాయని, ఒక్కటి మూసివేసినంత మాత్రాన, మిగతా వాటి పరిస్థితి ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మిగతా వాటిపైనా చర్యలు తీసుకుని, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. -
అనాథ చిన్నారుల ఇళ్లకు అధికారులు
వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని కంచర్ల, రంగంపేట గ్రామాల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల దీనస్థితిపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అనాథ గువ్వలు’ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం ఆదేశాలతో ఐసీపీఎస్ కౌన్సిలర్ భార్గవి, అంగన్వాడీ మండల సూపర్వైజర్ మమత గురువారం చిన్నారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. రంగంపేటలో అంకమల్ల అశ్విత, కంచర్లలో ఇందు, లాస్యల కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారులు వృద్ధులైన తమ నానమ్మ, అమ్మమ్మల వద్ద ఉంటున్నారని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వ సాయం కోసం నివేదిక పంపిస్తామని తెలిపారు. -
ఇంటికొస్తున్నామని.. అంతలోనే దూరమై
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి ● ఎదురెదురుగా వాహనాలు ఢీకొని దుర్మరణం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరామని ఫోన్లో చెప్పిన ఇద్దరు యువకులు.. అంతలోనే ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లి– తారుపల్లి గ్రామాల మధ్యలో క్రాస్ రోడ్డు వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఓదెల మండల పొత్కపల్లికి చెందిన పచ్చిక నాగఫణీందర్రెడ్డి(28) పెద్దరాతుపల్లిలో సోలార్ ప్లాంట్లో టెక్నీషియన్గా పని చేస్తుండగా, పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన బొజ్జం సురేశ్(27)వ్యవసాయం చేస్తాడు. ఫణీందర్రెడ్డి విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తుండగా, సురేశ్ కాల్వశ్రీరాంపూర్ నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తూ ఇద్దరూ ఎదురెదురుగా ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు పేర్కొన్నారు. కాగా సురేశ్కు వివాహం జరిగి ఏడాది కూడా దాటలేదు. ఫణీందర్రెడ్డికి ఏడాదిన్నర క్రితం వివాహం అయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇద్దరు యువకుల మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆరుగురు బంగారం దొంగలు, వ్యాపారి అరెస్ట్
మెట్పల్లి: మెట్పల్లి ప్రాంతంలో పలు దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు నిందితులు.. వారు తెచ్చిన సొత్తును కొనుగోలు చేసిన వ్యాపారిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో మెట్పల్లి ప్రాంతంలో ఆరుచోట్ల దొంగతనాలు జరిగాయి. మెట్పల్లి శివారులో వన్నెల గంగుపై పట్టపగలే దాడి చేసి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. ఇలా వరుస దొంగతనాలు జరగడాన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు.. నిందితుల కోసం డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో సీఐ అనిల్కుమార్, ఎస్సైలు కిరణ్కుమార్, అనిల్, నవీన్తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మెట్పల్లి, నిజామాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్ట నిందితులను గుర్తించారు. అప్పటినుంచి వారి కోసం గాలిస్తుండగా గురువారం మెట్పల్లిలోని కొత్త బస్టాండ్ వద్ద పండుగ రమేశ్, పల్లెపు రమేశ్ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా వారు ఇచ్చిన సమాచారంతో మరో నలుగురు నిందితులు గుంజె గంగాధర్, గంగమణి, గైని కిరణ్, పెద్దూరు మల్లేశ్వరితోపాటు దొంగ సొత్తును కొనుగోలు చేస్తున్న వ్యాపారి ఇందూరి రాకేశ్ను అరెస్ట్ చేశారు. వీరందరి నుంచి 15 తులాల బంగారు, 32తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగవంతంగా చేధించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. నిందితులపై అనేక కేసులు అరెస్టయిన నిందితుల్లో నలుగురిపై గతంలో పలు స్టేషన్లలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కిరణ్పై 35, పండుగ రమేశ్పై 23, గంగాధర్పై 16, పల్లెపు రమేశ్పై 13 కేసులున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ అశోక్కుమార్ -
నువ్వక్కడ.. నేనిక్కడ!
● బల్దియా బరిలో భార్యాభర్తలు కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచేందుకు భార్యభర్తలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వేర్వేరు డివిజన్లలో భార్యాభర్తలు పోటీచేసి గెలుపొందిన సంఘటనలు గతంలో ఉండగా, ఈ సారి నగరంలో మూడు జంటలు బల్దియా పోరులో నిలిచాయి. బీఆర్ఎస్ నుంచి 47వ డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, ఆమె భర్త బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ 21వ డివిజన్ నుంచి పోటీచేస్తున్నారు. 58వ డివిజన్ నుంచి దుడ్డెల శ్రీధర్, 57వ డివిజన్ నుంచి ఆయన భార్య దుడ్డెల మంజుల పోటీకి దిగారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన వీరు, దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. 46వ డివిజన్ నుంచి మాజీ కౌన్సిలర్ వరాల నారాయణ, 13వ డివిజన్ నుంచి ఆయన భార్య వరాల అనసూయ స్వతంత్రులు పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికి, రాకపోవడంతో స్వతంత్రులుగా పోటీలో నిలిచారు. -
అభివృద్ధితో ప్రత్యేక గుర్తింపు
● అర్ధంతరంగా నిలిచిన పనులపై దృష్టిపెట్టాం ● మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు ● ‘సాక్షి’తో రామగుండం బల్దియా మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కోల్సిటీ(రామగుండం): రామగుండం మొదటి మున్సిపల్ చైర్మన్గా పలు అభివృద్ధి పనులు, సంస్కరణలు చేపట్టి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సోమారపు సత్యనారాయణ. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా పని చేశారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గెస్ట్ ఫాకల్టీగా ఐఏఎస్ హోదా కలిగిన అధికారులకు పాఠాలు బోధించగల విజ్ఞానం ఆయన సొంతం. ఇంజినీరింగ్తోపాటు ఎంబీఏ చదివిన ఆయన తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, మేనేజ్మెంట్ నైపుణ్యంతో చేపట్టిన పనులు మున్సిపల్ చైర్మన్ పదవికే వన్నె తెచ్చాయి. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న సత్యనారాయణను మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ పలకరించగా నాటి అనుభవాలు, విశేషాలను ఇలా పంచుకున్నారు. సోమారపు సత్యనారాయణ రామగుండం మొదటి చైర్మన్గా ఎన్నికైనప్పు డు ఉన్న పరిస్థితుల్లో మీ అనుభవం? పాలకవర్గం లేకపోవడంతో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఉన్న కాలంలో చైర్మన్గా ఎన్నికయ్యాను. సింగరేణి నీటి సరఫరా తప్ప మున్సిపల్ నీళ్లు లేవు. అక్కడక్కడా ఉన్న బోర్వెల్ నీరే ఆధారం. డ్రైనేజీ వ్యవస్థ, సరైన రోడ్లు కూడా లేవు. సింగరేణి స్థలాల్లో కట్టుకున్న ఇళ్లకు ఇంటి పన్ను లేకపోవడంతో నిధులు చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లారు..? ముందుగా నిధుల కొరత అధిగమించే ప్రయత్నం చేశాను. సింగరేణి స్థలాల్లో కట్టుకున్న ఇళ్లకు నంబర్లు ఇచ్చి నామమాత్రపు పన్ను విధించాం. దగ్గరున్న బ్యాంకుల్లో కట్టుకోవడానికి వీలుగా చలానాలు పంపిణీ చేశాం. ఆ రశీదుల కారణంగానే తర్వాత కాలంలో వారికి సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నిధులు పొందడానికి రామగుండంకు అర్హత ఉండగా, నాటి సీఎంను ఒప్పించి ముందుగానే నిధులు రాబట్టి అభివృద్ధి పనులు చేపట్టాం. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? తాగునీటి సరఫరాపై ముందు దృష్టిపెట్టాను. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా అర్ధాంతరంగా నిలిచిన పనులపై దృష్టిపెట్టి, హెడ్ వర్క్స్, ట్యాంకులు నిర్మించడంతో మున్సిపల్ నీటి సరఫరా ప్రారంభమైంది. ఆ తర్వాత 24 గంటల నీటి సరఫరా చేసి దేశం దృష్టిని ఆకర్షించేలా చేయగలిగాను. ఆ తర్వాత దేనిపై దృష్టి పెట్టారు? పారిశుధ్యం దృష్టి పెట్టాను. శానిటేషన్తో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో దేశంలోనే మొదటిసారిగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం జరిగింది. చెత్త ఏరుకొని జీవించే వారిని గుర్తించి, వారికి పరుగు పందెం నిర్వహించి శారీరక సామథ్యం ఉన్నవారికి ఉచితంగా రిక్షాలు ఇచ్చి ఇంటింటా చెత్త సేకరించడం జరిగింది. అలాగే ఎడ్ల బండ్లతో చెత్త సేకరించే పారిశుధ్య కార్మికులకు ఆటోలు ఇచ్చాం. స్వశక్తి సంఘాలకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించి ట్రాక్టర్లు కొనుగోలు చేయించాం. వాటికి మున్సిపల్ నుంచి అద్దె చెల్లించడం ద్వారా ఒకపక్క ఉపాధి పొందడంతోపాటు మరో పక్క రుణం తీరిపోయి, వారే ఆ వాహనాలకు యజమానులయ్యారు. రోడ్లు, కాలువలను ఎలా అభివృద్ధి చేశారు? మున్సిపాలిటీలో నిధుల్లేవు, పబ్లిక్, ప్రయివేట్ పార్టీసిపేషన్ అంటే నగరపాలక సంస్థ, ప్రజల భాగస్వామ్యంతో 80: 20 ప్రాతిపదికన ఎవరూ ముందుకొస్తే అక్కడ రోడ్లు, కాలువలు నిర్మించాం. నా చొరవతో నాటి ముఖ్యమంత్రి డీఎఫ్ఐడీ నిధులు రామగుండంకు మంజూరు చేయడంతో రోడ్లు, కాలువలు వంటి అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం దొరికింది. వినూత్నంగా ఆలోచించి చేపట్టిన పనులేవి? పట్టణానికి తగినట్టుగా దేశంలోనే మొదటిసారిగా బేబీ డ్రెయిన్లతో కాలువల నిర్మాణం చేపట్టాం. డ్రై వెదర్ డ్రెయిన్, ఫెర్రో సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణం నా హయాంలో చేపట్టడం జరిగింది. అత్యంత మన్నికతో వేసిన సీసీ రోడ్లు కొన్ని చోట్ల ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మీటర్లు ఏర్పాటు చేసి వాడిన నీటికే బిల్లు తీసుకున్నాం. జనన, మరణ ధ్రు వీకరణ పత్రాలు కొరియర్ ద్వారా ఇంటికే పంపాం. పైరవీలకు తావు లేకుండా జరిగింది. కొత్త వెలుగు కోసం ఏం చర్యలు తీసుకున్నారు? చాలా మంది రిటైర్డ్ కార్మికులు ఇక్కడ సరైన వసతులు లేవని ఇతర ప్రాంతాలు, సొంత ఊళ్లకు వెళ్తున్న తరుణంలో అందరికీ అందుబాటులో ఉండేలా మున్సిపల్ కార్యాలయ భవనం, వినూత్న డిజైన్తో కొత్త కూరగాయల మార్కెట్ నిర్మించాను. ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ భవనానికి నిధులు మంజూరు చేయించి పునాది వేశాను. తాగునీటి సరఫరా, సెంట్రల్ లైటింగ్, ఇంటి ముందుకే చెత్త బండి రావడం తదితర సౌకర్యాలు సమకూరడంతో ఇళ్ల నిర్మాణం పెరిగింది. స్వశక్తి మహిళలకు సీఆర్సీ భవనం నిర్మించి, వారితో సూపర్ మార్కెట్లు పెట్టించాం. నేపాల్ నుంచి నిపుణులను రప్పించి టోపీలు కుట్టించే శిక్షణ ఇప్పించాను. మలుపు అనే పథకం ద్వారా వందల మందికి చెప్పులు కుట్టే శిక్షణ ఇప్పించాను. ఇలా అనేక ఉపాధి అవకాశాలు కల్పించాను. మీ పనులు ప్రభావితం చేశాయా? చేశాయి. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది స్టడీ టూర్లో భాగంగా రామగుండం సందర్శించారు. మున్సిపల్ విద్యుత్ బిల్లుల్లో రామగుండంకు రూ.25లక్షలు నేను రికవరీ చేసిన విధానం నచ్చి, అలాగే చేయాలని అన్ని మున్సిపాలిటీలకు నాటి ముఖ్యమంత్రి సర్క్యులర్ జారీ చేయించారు. రాగ్పిక్కర్ విధానం, 24 గంటల నీటి సరఫరా తీరును అనేక మంది పరిశీలించి వెళ్లారు. చైర్మన్గా గొప్పగా భావించేది ఏది? మురికివాడలను అభివృద్ధి చేయడం అన్నింటి కంటే ఎక్కువగా చెప్పుకోతగ్గది. నాడు రామగుండంలో 45 నోటిఫైడ్ 47 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఉండేవి. నేను చేపట్టిన పనులతో అవి ఇప్పుడు స్లమ్స్లా కనబడతలేవు. గుర్తింపు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అవార్డులకు ఎప్పుడూ నామినేషన్ వేయలేదు. కానీ, చేంజ్ మేనేజ్మెంట్ ఫోరంలో దేశంలో కేవలం ఇద్దరు మున్సిపల్ చైర్మన్లను ఎంపిక చేయగా, అందులో నేను ఒక్కడిని కావడం నాకు ఇచ్చిన పెద్ద గుర్తింపుగా భావిస్తున్న. ఏమైనా సలహాలు ఇస్తారా? ఎవరి ఐడియాలజీ వారికి ఉంటుంది. ఆ ఐడియాలజీ ప్రకారం పని చేసుకుంటూ పోతారు. -
జనరలైనా.. తగ్గేదే లే..
● ఆసక్తికరంగా 63వ డివిజన్ పోరు కరీంనగర్ కార్పొరేషన్: మహిళా రిజర్వేషన్కే ఆ నాయకురాళ్లు పరిమితం కాలేదు. జనరల్ అంటే పురుషులకు కేటాయించినట్లు కాదంటూ, తాము బరిలోకి దిగి ఆ మహిళలు పోరుకు సై అన్నారు. నగరంలోని 63వ డివిజన్ పోరు ఆసక్తికరంగా మారింది. డివిజన్ రిజర్వేషన్ బీసీ జనరల్ అయినప్పటికి మూడు ప్రధాన పార్టీల నుంచి అతివలే బరిలోకి దిగారు. మాజీ కార్పొరేటర్ గందె మాధవి బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ కర్రె పావని, బీజేపీ నుంచి దేశ శిల్ప పోటీపడుతున్నారు. డివిజన్ నుంచి మొత్తం నలుగురు పోటీలో ఉండగా.. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీసీ ఉద్యమ నేత కేశిపెద్ది శ్రీధర్రాజు బరిలో నిలిచారు. -
రూ.200 పుచ్చుకో... జెండా పట్టుకో !
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ, పొలిమేర గ్రామాల్లోని మహిళలకు ఉపాధి పుష్కలంగా లభిస్తుంది. నామినేషన్లపర్వం ముగిసిపోయి బుధవారం నుంచి ప్రచారం ప్రారంభమైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో తన వెంట ఎక్కువ మంది కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. స్థానిక మహిళలతోపాటు పొరుగున్న ఉన్న పల్లెల నుంచి రూ.200 చొప్పున కూలీ చెల్లించి తమ వెంట ప్రచారానికి తెచ్చుకుంటున్నారు. వారు జెండా పట్టుకొని అభ్యర్థులు వెనుక ఉంటూ.. ‘.. మన అన్నకే ఓటేయాలి’, ‘అన్న గెలుపుతోనే వార్డు అభివృద్ధి’ అంటూ నినాదాలు చేయా లి. వీరు వచ్చిపోయేందుకు ఆటోలు పెడుతున్నారు. ప్రచారానికి వచ్చిన వారికి అభ్యర్థి ఇంటి వద్ద లేదా తన వార్డు ఆఫీస్ వద్ద భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. పురుషులు ప్రచారానికి వస్తే అదనంగా మందు ఖర్చు చేస్తున్నారు. దీంతో పట్టణంలోని చికెన్, మటన్ సెంటర్ల వద్ద గిరాకీ పెరిగింది. సాధారణ రోజులతో పోల్చితే ఇప్పుడు బిర్యానీ ఆర్డర్లు రెట్టింపయ్యాయని బిర్యానీ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. -
కోతులు పోవాలి
మురికి తొలగాలి..సిరిసిల్ల/సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: జిల్లా కేంద్రంలో మురికినీటి సమస్య పరిష్కారం కావాలి.. కోతుల బెడద తొలగిపోవాలి.. కుక్కలతో భయం..భయంగా బతుకుతున్నాం.. ఇక ట్రాఫిక్ సమస్య చెప్పలేనిదిగా ఉంది.. చిన్నపాటి వర్షానికి పట్టణాన్ని వరద ముంచెత్తుతోంది.. అంటూ పట్టణ ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని సమస్యలపై గురువారం స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్లో డిబేట్ నిర్వహించింది. పలువురు పట్టణ పౌరులు పాల్గొని తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గళం ఎత్తారు. సిరిసిల్ల పట్టణంలో చేయాల్సిన అభివృద్ధి.. ప్రజలకు అందించాల్సిన సౌకర్యాలపై గొంతు విప్పారు. నిజాయితీ పాలన అందించే నాయకత్వం.. పట్టణాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసే దూరదృష్టి గల నాయకులనే ఎన్నుకుంటామని చెప్పారు. సిరిసిల్ల ప్రజలు చెప్పిన ఎజెండా అంశాలు వారి మాటల్లోనే.. ట్రాఫిక్ సమస్య తీరాలి నిజాయితీ పాలన రావాలి ఇది సిరిసిల్ల ప్రజల ఎజెండా ‘సాక్షి’ డిబేట్లో పట్టణ పౌరులు -
కాంగ్రెస్ జెండా ఎగరాలి
సాక్షిప్రతినిధి, కరీంనగర్/చొప్పదండి: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని బల్దియాలపై కాంగ్రెస్ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతిబాట బహిరంగ సభకు హాజ రై కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపారు. ముందుగా రామడుగు మండలంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ), గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగు దత్తోజీపేటలో సోలార్ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజ లు పెద్ద ఎత్తున హాజరు కాగా.. ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజన్ని నింపింది. పట్టం కట్టి.. పనులు చేయించుకోండి అనంతరం వేదిక మీదకు వచ్చిన సీఎం రేవంత్ బీజేపీ–బీఆర్ఎస్ల బంధంపై నిప్పులు చెరిగా రు. రెండేళ్ల వ్యవధిలో తాము చేసిన అభివృద్ధిని వివరించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కరీంనగర్ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు సుమారు రూ.2,778కోట్లు ఇచ్చామన్నా రు. రామగుండానికి రూ.586 కోట్లు, కరీంనగర్ కార్పొరేషన్కు రూ.1,489కోట్లు, చొప్పదండి మున్సిపాలిటీకి రూ.50కోట్లు ఇచ్చామన్నా రు. ఇవన్ని పనులు జరగాల్సి ఉందని, కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టి, గెలిపించి పనులు పూర్తి చేయించుకోవాలని కోరారు. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పట్టణంలోని యావర్ రోడ్డును విస్తరించాలని సీఎంను కోరారు. రోడ్డు విస్తరించి, యంగ్ ఇండియా స్కూల్ ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రెండు పేజీల సమస్యలు ఇచ్చారని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడు తూ.. సుదీర్ఘంగా పట్టి పీడిస్తున్న రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. రాహుల్గాంధీ, పార్టీ సూచనతో రాష్ట్రంలో కులగణన చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మనల్ని చూసి కేంద్రం కూడా కులగణనకు తలవంచిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే పట్టం కట్టాలని కోరారు. కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జి, రింగురోడ్డు, రివర్ ఫ్రంట్, డ్రైనేజీ పనులు పూర్తి చేయిస్తామన్నారు. ● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. పిల్లల్లో నైపుణ్యం పెంచాలని సీఎంను కోర డం ద్వారా ఏటీసీ మంజూరైందన్నారు. డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే సీఎం సహకారంతో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉ మ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాల్లో 8 సీట్లలో గెలిపించారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టా లని కోరారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న పవన్ కల్యాణ్తో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజలకు మధ్యకు వస్తోందన్నారు. ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడు తూ.. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలను అభివృద్ధి చేయాలని కోరారు. గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు సౌకర్యాలు కల్పించాలన్నారు. ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మా ట్లాడుతూ.. రేవంత్రెడ్డి నాయకత్వంలో చొ ప్పదండి నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందన్నారు. రూ.240కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేశారని, గంగాధరలో డిగ్రీ కళాశాలకు నిధులతోపాటు, పోస్టులు మంజూరు చేశారన్నారు. కొండగట్టుకు టీటీడీ రూ.35కోట్లు ఇచ్చారని, మన ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రాజ్ఠాకూర్, విజ యరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్లక్రైం: చెక్పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. సిరిసిల్ల మున్సి పల్ పరిధిలోని వెంకటాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును గురువారం తని ఖీ చేశారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్ప టి నుంచి ఆరు కేసులు నమోదు చేసినట్లు తెలి పారు. రూ.26.70 లక్షల నగదు, 85.695 లీట ర్ల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. 127 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు. సిరిసిల్లక్రైం: ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అధికంగా సొమ్ము తీసుకెళ్తున్న వారిపై పోలీ సుల నిఘా తీవ్రమైంది. దీనిలో భాగంగా గు రువారం జిల్లాలో పోలీసులు చేపట్టిన తని ఖీల్లో రూ.4లక్షల నగదు పట్టుబడింది. సిద్దిపే ట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన పురుమడ్ల వెంకట్రెడ్డి తన కారులో వస్తున్నా డు. ఈక్రమంలో సిరిసిల్ల శివారులోని మానేరు బ్రిడ్జి చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీ లు చేపట్టారు. తనిఖీల్లో ఎస్ఎస్ఈ టీమ్ ఇన్చార్జి శ్రీకాంత్ పంచుల సమక్షంలో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తామని సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి నీటి విడుదల కొనసాగుతోంది. గురువారం ఎల్ఎండీకి 500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు కుడికాల్వ ద్వారా 150 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. మిడ్మానేరులో నీటిమట్టం 24.755 టీఎంసీలకు చేరింది. గంభీరావుపేట(సిరిసిల్ల): వేసవి సమీపిస్తుండడంతో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి షర్ఫొద్దీన్ సూచించారు. గంభీరావుపేట మండల పరిషత్లో గురువారం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటికొరత ఉన్న గ్రామాలను, కాలనీలను గుర్తించాలన్నారు. ఎంపీడీవో రాజేందర్, అధికారులు సుమలత, రాము, పావని, జయసుధ, ఎంపీవో సుధాకర్, ప్రేమ్చందర్, వేణు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపాలిటీలో ఓటర్ హెల్ప్డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ ఎ.ఏ.ఖదీర్పాషా తెలిపారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో మున్సిపల్ ఆఫీస్లో ఓటర్ సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 14 నుంచి జరిగే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు పట్టణంలోని లాడ్జీలు, సత్రాల ధరలు పెంచొద్దని ము న్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ ప్రకటనలో కోరారు. లాడ్జ్ ధరలు పెంచి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు. మహాశివరాత్రికి రూ.1.96 కోట్లతో పనులువేములవాడ: రాజన్న క్షేత్రంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో నిర్వహించే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు రూ.1.96కోట్లతో పనులు చేపడుతున్నట్లు ఈవో రమాదేవి గురువారం తెలిపారు. ఉప ఆలయాలు, ఆర్చిగేట్లకు రంగులు, పారిశుధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా, తాత్కాలిక క్యూలైన్లు, స్నానాల కోసం షవర్లు, పార్కింగ్ ఏరియాలో టాయిలెట్స్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్ తదితర పనులు చేపట్టనున్నట్లు వివరించారు. అద్దె ప్రాతిపదిక నీటిట్యాంకర్లు, ఇనుప బారీకేడ్లు, భక్తుల విశ్రాంతి కోసం ఏర్పాట్లు, సీసీ కెమెరాల బిగింపు, మినీబస్సుల అలంకరణ, నాంపల్లి ఆలయం వద్ద తాత్కాలిక లైట్లు తదితర పనులు చేయనున్నట్లు తెలిపారు. -
నిబంధనల మేరకు పనిచేయాలి
● కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్సిరిసిల్ల: నియమావళికి అనుగుణంగా అధికా రులు విధులు నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ సూచించా రు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ స్కూల్లో ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియమ, నిబంధనలపై అవగాహన ఉండాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం గీతానగర్ హైస్కూల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఓటర్లు 18 రకాల గుర్తింపుకార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకెళ్లి ఓటుహక్కు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. పోలింగ్ ముగిసిన తర్వాత సామగ్రిని జిల్లా సినారె కళామందిర్లోని రిసెప్షన్ కేంద్రంలో అప్పగించాలని తెలిపారు. వసతులు కల్పించాలి పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య హైస్కూల్లోని కేంద్రాలను పరిశీలించారు. దివ్యాంగులకు ర్యాంప్, పోలింగ్ అధికారులు, సిబ్బందికి తాగునీరు, టాయిలెట్స్ వసతి కల్పించాలని ఆదేశించారు. అనంతరం పదోతరగతి విద్యార్థులకు పరీక్షలపై మార్గదర్శనం చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల, విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ట్రైనింగ్ నోడల్ అధికారి శ్రీనివాసాచారి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, తహసీల్దార్ మహేశ్కుమార్ పాల్గొన్నారు. -
సమన్వయం అవసరం
రోడ్ల వెంట చెట్ల విషయంలో సెస్, మున్సిపల్ అధికారుల్లో సమన్వయం లోపించింది. చెట్లు పెరిగి విద్యుత్ తీగలను తాకుతున్నాయి. వాటిని ముట్టుకుంటే షాక్ వస్తుందని తొలగిస్తే.. అధికారులు ఇబ్బందులు పెడుతుండ్రు. ఇరు శాఖల అఽధికారులు చెట్లు విషయంలో బాధ్యతగా ఉండాలి. – కముటాల రాఘవేందర్ పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం నూరుశాతం కొనసాగించాలి. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వస్తువులు వాడి డ్రైనేజీల్లో పడేస్తున్నారు. దీంతో డ్రైనేజీల్లో నీరు ప్రవాహం లేక మురుగు రోడ్లపై పారుతుంది. శివారు ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. పట్టణంలో గ్రీనరీని పెంచాలి. కొత్త పాలకవర్గం నిజాయితీ తో అభివృద్ధి చేపట్టాలి. – గుండెల్లి రవీందర్ సిరిసిల్లలోని ప్రధాన డ్రైనేనీ నీరు పాతబస్టాండు ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది. ఇక్కడి ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంతో వర్షాకాలంలో కాలనీలు, వ్యాపారం సంస్థలు మునిగిపోతున్నాయి. పట్టణం మొత్తంగా అన్ని వార్డుల్లో నూరుశాతం వసతులు కల్పించాలి. ప్రణాళికాబద్ధంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. – నంగునూరి శ్రీకాంత్ పట్టణం అభివృద్ధి పథంలో ముందుండాలంటే సమర్థవంతులైన నాయకులను ఎన్నుకోవాలి. ఒక్క రోజు జరిగే లబ్ధికి చూసుకోవద్దు. ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉండే వారినే ఎన్నుకోవాలి. మంచినీటి సరఫరాలో సమస్య తీర్చాలి. ఉపాధి అవకాశాలు పెంచాలి. – గెంట్యాల గోపి -
రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20267హుండీ ఆదాయం రూ.1.72కోట్లువేములవాడ: భీమన్నకు హుండీల ద్వారా రూ.1,72,76,469 నగదు, బంగారం 75 గ్రాములు, వెండి 6.800 కిలోలు వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు. సిరిసిల్ల: ప్రభుత్వ విద్యాసంస్థల్లోని 14ఏళ్ల లోపు పిల్లలకు వైద్యపరీక్షలు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో నాగేంద్రబాబు సూచించారు. లోపాలు గుర్తించి, వైద్యశాలకు పంపించాలన్నారు.వాతావరణం ఎండగా ఉంటుంది. గాలిలో తేమ ఉంటుంది. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి. -
నేతన్నల పొట్టకొట్టిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
సిరిసిల్ల: నేతన్నల పొట్టకొట్టిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు కోరారు. సిరిసిల్లలో గురువారం కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ నేతన్నలకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు రూ.3400 కోట్లతో బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పద్మశాలీ భవన్కు ఐదెకరాల భూమిని కేటాయించి రూ.5కోట్లు ఇస్తే.. కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వకుండా.. పనిని మధ్యలో ఆపేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. రెండేళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. జిల్లాను రద్దు చేస్తారట నాపై కోపంతో రేవంత్రెడ్డి జిల్లాను రద్దు చేస్తారట అని కేటీఆర్ అన్నారు. జిల్లాను రద్దు చేసే వాళ్లకు ఓట్లు వేద్దామా.. అని అడిగారు. సిరిసిల్లలో కొంతమేరకు అభివృద్ధి చేశానని, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయన్నారు. పెండింగ్లో ఉన్న పెన్షన్లు, ఇళ్లు, రోడ్లు, మురికికాల్వలు పూర్తి చేసే బాధ్యత తనదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల ఇన్చార్జి తుల ఉమ, కొండూరి రవీందర్రావు, చీటి నర్సింగరావు, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, మ్యాన రవి, శరత్రావు, అక్కరాజు శ్రీనివాస్, కుంభాల మల్లారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ మాటలతో మోసపోకండి సిరిసిల్లఅర్బన్: కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని కేటీఆర్ కోరారు. జ్యోతినగర్, 11, 24వ వార్డుల్లో పర్యటించారు. కేటీఆర్ మాట్లాడుతూ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టేశారన్నారు. జ్యోతినగర్ను దత్తత తీసుకొని వసతుల కల్పనకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. -
మహాజాతరను విజయవంతం చేయాలి
● జాతర ఏర్పాట్లపై సమీక్ష వేములవాడ: రాజన్న క్షేత్రంలో ఈనెల 14 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని అధికారులు కోరారు. జాతర మహోత్సవాలపై ఆలయ ఈవో రమాదేవి, ఏఎస్పీ రుత్విక్సాయి, ఈఈ రాజేశ్ బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు. -
యూరియా ఏదయా
● అవసరాన అన్నదాతకు ఇదేం అవస్థ ● యాప్లో జిల్లావ్యాప్తంగా యూరియా నిల్వ సున్నా ● ఏవోల నిర్లక్ష్యం.. పడకేసిన పర్యవేక్షణకరీంనగర్ అర్బన్: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. యూరియా అక్రమ రవాణాకు చెక్ పెడుతూ ప్రభుత్వం యాప్ను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 1నుంచి సదరు విధానం అమలవుతుండగా తదనుగుణ పర్యవేక్షణ లేమి రైతులకు గుదిబండగా మారింది. యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలని చెబుతున్నా వ్యవసాయ శాఖ అసలు యూరియా నిల్వలు ఏ మేరకు ఉన్నాయి, ఎంత అవసరమనే కోణంలో ప్రణాళిక లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అత్యవసర వేళ ఇదేం కొరత యాసంగి సీజన్కు గానూ జిల్లాలో 2,59,065 ఎకరాల్లో వరి సాగవగా, 29,396 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. అన్ని పంటలు కలిపి 2,89,017 ఎకరాలు సాగులో ఉంది. ఈ సమయంలో వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయడం అత్యవసరం. కానీ రైతులు మాత్రం ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరగడం, పడిగాపులు కాయడం ఆందోళనకర పరిణామం. ఆయా పంటలకు మూడు దశల్లో అంటే విడతల వారీగా యూరియా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో దశలో ఎకరానికి ఒక బస్తా మాత్రమే బుక్ కానుంది. జిల్లావ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉంది. జిల్లా కేంద్రంతో పాటు 16 మండలాలుండగా ఎక్కడా కూడా యూరియా బస్తా ఒక్కటి లేదని యాప్ స్పష్టం చేస్తోంది. అవసరమైన సమయంలో యూరియా వేస్తేనే పంటకు బలం కాగా దిగుబడి రానుంది. ఎన్నికల విధుల్లో ఏవోలు.. ఇండెంట్ పెట్టేదెవరు వాస్తవానికి యూరియా నిల్వలను అనుసరించి ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టడం మండల వ్యవసాయ అధికారుల విధి. జిల్లాలో మాత్రం ఏ ఒక్క ఏవో కూడ తదనుగుణంగా విధులు నిర్వహించడం లేదనడానికి యాపే తార్కాణం. పలువురు ఏవోలు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తుండగా విధులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు పుష్కలం. మున్సిపల్ ఎన్నికల్లో విధులు కేటాయించగా యూరియా నిల్వలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులకు ఇబ్బందులు షరామామూలే. యూరియా పక్కదారి? యూరియా పక్కదారి పడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ సర్వే నంబర్లో ఏ పంట సాగు చేశారనేది యాప్లో నమోదు కాలేదు. క్రాప్ బుకింగ్ వివరాలు నమోదుకాకపోవడంతో అక్రమార్కులు సాగులో లేని భూముల వివరాలతో యూరియా బుక్ చేస్తూ వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నారని తెలుస్తోంది. సాగులో లేని భూములు వేల ఎకరాలుండగా భవనాలు, రోడ్లు, ప్లాట్లు, దేవాలయాలు ఇతర నిర్మాణాలు ఉన్నా భూములూ ఉండగా యాప్పై అవగాహన ఉన్న అక్రమార్కులు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. -
పాఠశాలలో మద్యం కలకలం
● జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘటన చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని ఓ జిల్లాపరిషత్ పాఠశాలలో కొందరు విద్యార్థులు మధ్యాహ్నం సమయంలో మద్యం తాగిన సంఘటన చర్చనీయాంశమైంది. 8వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు ఈనెల 3న భోజన విరామ సమయంలో బయటకు వెళ్లి ఒక మద్యం బాటిల్, కూల్డ్రింక్ తెచ్చుకుని పాఠశాలలోనే సేవించినట్లు సమాచారం. ఇది చూసిన కొందరు విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాల హెచ్ఎం బుధవారం పేరెంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. జరిగిన సంఘటనపై చర్చించారు. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం ఉందని, ఉపాధ్యాయులు వారి కదలికలను ఎందుకు పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా గేటుకు తాళం వేయాలని సర్పంచ్ సూచించారు. పాఠశాల సమీపంలోనే కొందరు బెల్ట్షాపులు నిర్వహిస్తున్నారని, వాటిని మూసివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై హెచ్ఎంను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. వరకట్నం వేధింపులకు వివాహిత బలిబోయినపల్లి(చొప్పదండి): ఇద్దరు కుమారులు పుట్టాక భర్త పెట్టే అదనపు కట్నం వేధింపులు భరించలేక బోయినపల్లికి చెందిన దొంతరవేణి నర్మద(28) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎన్.రమాకాంత్ తెలి పారు. బోయినపల్లికి చెందిన నర్మదకు ఐదేళ్ల క్రితం మండలంలోని జగ్గారావుపల్లికి చెందిన దొంతరవేణి నరేశ్తో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. పెళ్లయిన ఏడాది తర్వాత అదనంగా రూ.2లక్షలు కట్నం తీసుకురావాలని నర్మదను భర్త వేధించేవాడు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకొని భార్య పిల్లలను బాగా చూసుకుంటానని ఒప్పుకున్నాడు. ఈక్రమంలో ఆరు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయి వెళ్తానంటే నరేశ్ మామ ఊరుమడ్ల రాజయ్య డబ్బులు వెచ్చించి పంపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత సైతం నరేశ్ వైఖరిలో మార్పు రాకపోగా.. ఫోన్లో భార్యను కట్నం కోసం వేధింపులు ఎక్కువయ్యాయి. తీవ్ర మానసిక వేదనకు గురైన నర్మద మంగళవారం బోయినపల్లిలోని తన తల్లిగారింట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నర్మద తండ్రి ఊరుమడ్ల రాజయ్య ఫిర్యాదుతో దొంతరవేణి నరేశ్పై కేసు నమోదు చేశారు. దరఖాస్తులు ఆహ్వానంవిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు డిప్లొమా అప్రెంటిషిప్ కోసం అర్హతున్న అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ రీజియన్ మేనేజర్ బి.రాజు తెలిపారు. వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్ధులు ఈనెల 24 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
పరిహారం కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు
మల్లాపూర్ : కూలీ పనికి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా.. ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో మృత్యువాత పడిన నలుగురి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరుతూ మండలంలోని మొగిలిపేటలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మెట్పల్లి –ఖానాపూర్ రహదారిపై ధర్నా చేశారు. పసుపు ఏరడానికి కూలీలను తీసుకెళ్లిన ఎర్రంశెట్టి గంగా ధర్ నిర్లక్ష్యంతోనే ట్రాక్టర్ అదుపుతప్పిందన్నారు. లలిత, గంగు, సాయమ్మ, వైష్ణవి కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. మెట్పల్లి సీఐ అనిల్కుమార్, మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల ఎస్సైలు అనిల్, కిరణ్, చిరంజీవి మొగిలిపేటకు చేరుకొని పోలీసులు గంగాధర్ కుటుంబసభ్యులతో మాట్లాడి మృతుల కుటుంబాకు రూ.6.50లక్షల చొప్పున పరిహారంతోపాటు రూ.15వేల చొప్పున దహనసంస్కారాలకు ఇచ్చేందుకు ఒప్పించారు. తక్షణ పరిహారంగా రూ.50వేలు అందించడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. -
జల్సాల కోసం దొంగతనాలు
పాలకుర్తి(రామగుండం): జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు ఆలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నాడు. బసంత్నగర్ శ్రీకోదండ రామాలయంలో ఇటీవల జరిగిన చోరీకేసులో అరెస్ట్ చేయడంతో నిందితుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ బసంత్నగర్ ఠాణాలో బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ రాంనగర్లో నివాసం ఉండే సాయి జల్సాలకు అలవాటుపడ్డాడు. దొంగతనాలు చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఇనుపరాడు సాయంతో తాళాలు పగులగొట్టడంలో నేర్పరి. తాళం వేసిన ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా చోరీలు చేస్తున్నాడు. పదేళ్లలో పలు చోరీలు చేయగా 13కుపైగా కేసులు నమోదయ్యాయి. గతనెల 28న రాత్రి బసంత్నగర్ శ్రీకోదండ రామాలయంలో వెండి కిరీటాలు, వెండి హస్తాలు, వెండి కళ్లు, నామాలతో కూడిన సీతమ్మ పుస్తెలు చోరీకి గురయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్రీధర్.. క్లూస్టీం సాయంతో వేలిముద్రలు సేకరించారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. పాత నేరస్తుడు సాయిపై నిఘా ఉంచారు. తాను చోరీచేసిన వస్తువులు విక్రయించేందుకు వెళ్తున్నాడనే పక్కా సమాచారంతో ధర్మారం క్రాస్రోడ్డు వద్ద నిఘావేసి అదుపులోకి తీసుకున్నారు. సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వైద్యపరీక్షల అనంతరం రిమాండ్కు తరలించనున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై శ్రీధర్తోపాటు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శరత్, క్లూస్టీం కానిస్టేబుల్ రాజేశ్ను ఏసీపీ అభినందించారు. నగదు పారితోషికం అందజేశారు. తాళం వేసిన ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా చోరీలు నిందితుడిని అరెస్ట్ చేసిన బసంత్నగర్ పోలీసులు వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ -
నా కొడుకును స్వగ్రామానికి రప్పించండి
బోయినపల్లి(చొప్పదండి): ఉపాధి కోసం సౌదీఅరేబియాకు వెళ్లి ఏజెంట్ మోసంతో అక్కడి జైలులో మగ్గుతున్న తన కొడుకు కమటం వెంకటేశంను విడిపించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూర్గుపల్లికి చెందిన కాంతవ్వ ఎస్పీ మహేశ్ బీ గీతేను కోరింది. బూర్గుపల్లికి చెందిన వెంకటేశ్కు ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ నమ్మబలికి సౌదీఅరేబియాకు పంపాడని తెలిపింది. పక్కా పని చూపకుండా రహస్యంగా చేసే పని చూపడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలులో వేశారని కాంతవ్వ వాపోయింది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్తోపాటు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందించినట్లు తెలిపింది. ఈక్రమంలో బక్కి వెంకటయ్య రాసిన లేఖను ఎస్పీకి అందచేశామంది. ఏజెంట్ శేఖర్తోపాటు అతనికి సహకరిస్తున్న పెద్ద మనుషులపై చర్యలు తీసుకోవాలని కాంతవ్వ కోరింది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తడగొండ సత్యరాజ్వర్మ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు తడగొండ నర్సింగ్బాబు ఉన్నారు. -
శోకసంద్రం మధ్య ముగ్గురు కూలీల అంత్యక్రియలు
బోరున విలపిస్తున్న మంగళారపు లలిత భర్త, కూతుళ్లు, కుమారుడు విలపిస్తున్న రొడ్డ వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మల్లాపూర్: మండలంలోని మొగిలిపేటలో ట్రాక్టర్ బోల్తాపడి మృతిచెందిన మంగళారపు లలిత, పెద్దిరెడ్డి గంగు, సంపంగి సాయమ్మ, రొడ్డ వైష్ణవికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మంగళారపు లలిత మృతదేహం వద్ద భర్త ధర్మరాజు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు బోరున విలపించారు. పిల్లలకు అమ్మ లేని లోటును ఎలా తీర్చాలి అంటూ.. ధర్మరాజు కన్నీటి పర్యంతమయ్యారు. గంగు మృతదేహం వద్ద కొడుకు, కూతుళ్లు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రొడ్డ వైష్ణవి తల్లిదండ్రులు పోశయ్య, అనిత, అక్కాచెల్లెల్లు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అశ్రునయనాల మధ్య ఈ ముగ్గురికి అంత్యక్రియలు పూర్తి చేశారు. సంపంగి సాయమ్మ భర్త ఎల్లయ్య దుబాయ్ నుంచి బయల్దేరాడు. ఆయన రాగానే ఆమెకు అంత్యక్రియలు చేయనున్నట్లు సమాచారం. నిందితుడిపై కేసు నమోదు ట్రాక్టర్ను నిర్లక్ష్యంగా నడిపి నలుగురు కూలీల మృతికి కారణమైన డ్రైవర్ ఎర్రంశెట్టి గంగాధర్పై సంపంగి లక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మెట్పల్లి సీఐ అనిల్కుమార్ తెలిపారు. దుబాయ్ నుంచి బయలుదేరిన సంపంగి సాయమ్మ భర్త ఆయన వచ్చాకే అంత్యక్రియలు చేసే అవకాశం -
మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): మద్యం తాగొద్దని తల్లి హితవు చెప్పినా వినకుండా పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్కాలనీ రాజీవ్ నగర్ తండాకు చెందిన గుగులోతు రవి నాయక్(28) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రవినాయక్ తండ్రి అనారోగ్యంతో ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లితో కలిసి ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతున్నాడు. అయితే, మద్యం తాగద్దని తల్లి చేప్పినా వినలేదు. మద్యం తాగినప్పుడు మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరించేవాడు. ఈక్రమంలో ఈనెల 3న మద్యం తాగివచ్చి తల్లితో గొడవపడ్డాడు. ఆ తర్వాత తల్లి తనకూతురు ఇంటికి వెళ్లగా.. మనస్తాపం చెందిన రవినాయక్ ఇంట్లోని ఇనుపరాడ్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు సీఐ ప్రసాద్రావు తెలిపారు. ● కల్వచర్లలో యువకుడి ఆత్మహత్య రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామ పంచాయతీ పరిధి గోకుల్నగర్కు చెందిన బాదం రవికిరణ్(21) గడ్డిమందు తాగి మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. రవికిరణ్ కొద్దిరోజులుగా ఉపాధి లేదని బాధపడుతున్నాడు. ఈక్రమంలో మనస్తాపం చెంది మంగళవారం గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు కరీంనగర్కు ఆ తర్వాత హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన శనిగారపు బుచ్చిరాజు (60) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డినట్లు పోలీసులు తెలి పారు. వారి కథనం ప్రకారం.. బుచ్చిరాజుకు కొన్నాళ్లుగా మతిస్థిమితం సరిగా ఉడడం లేదు. కుటుంబసభ్యులు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బుచ్చిరాజు భర్త లింగన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. కోదండ రామాలయంలో చోరీజగిత్యాలరూరల్: జగిత్యాల శివారు ధరూర్ క్యాంప్లో.. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీకోదండరామాలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎప్పటిలాగే పురోహితులు గుడికి తాళం వేసి వెళ్లారు. ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాతోపాటు, దేవతలపై ఉన్న పావుకిలో వెండి ఆభరణాలు, 10 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయ పూజారి జగన్మోహనాచారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
చిన్నారి ప్రాణాలతో చెలగాటం
● ఊపిరాడకుండ గుడ్డపేగులో చుట్టి యాచన ● వేములవాడలో పట్టుకున్న అధికారులు ● పోలీసులకు ఫిర్యాదు వేములవాడ: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో మూడు నెలల పసికందును గుడ్డలో చుట్టి భక్తుల వద్ద డబ్బులు యాచిస్తున్న ఓ మహిళను వేములవాడలో అధికారులు బుధవారం పట్టుకున్నారు. జిల్లా శిశు సంరక్షణ అధికారి కవిత వృద్ధులను సంక్షేమ కేంద్రానికి తరలిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ మహిళ తన భుజాన ఓ గుడ్డను వేసుకొని యాచిస్తుండడం గమనించారు. ఆమె వద్దకు వెళ్లి చూడగా ఆ గడ్డులో చిన్నారి ఉండడంతో అవాక్కయ్యారు. వేములవాడ శివారులోని తిప్పాపూర్ ఎల్ల మ్మగుడి వద్ద గుడారాలు వేసుకొని ఉన్న సారవ్వ అనే మహిళ మూడు నెలల క్రితం ఆడ కూతురికి జన్మనిచ్చింది. ఆ మూడు నెలల పాపను పట్టుకొని రాజన్న ఆలయ పరిసరాల్లో భక్తుల వద్ద యాచిస్తోంది. గుడ్డ పేగులో పసిపాపను చుట్టి యాచిస్తున్న తీరు గమనించిన అధికారులు ఆమెను విచారించారు. మూడు నెలల పాపను ఊపిరి ఆడకుండా గుడ్డలో చుట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమైపె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో ఇలాంటి వారు అనేక మంది అడుక్కోవడమే వృత్తిగా బతుకుతున్నారు. ఇప్పటికే చాలా మందిలో మార్పు తీసుకొచ్చిన అధికారులకు వీరిలో మార్పు తీసుకురావడం సాధ్యం కావడం లేదు. గుడికి కాపలా..ఇల్లంతకుంట: అవును మీరు చదివింది నిజమే. ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామంలో ముది రాజ్ కులస్తులు తమ కులదైవం పెద్దమ్మ ఆలయం వద్ద మంగళవారం రాత్రి కాపలా కాశారు. ఇటీవల మండలంలోని పలు గ్రామాల్లోని పెద్దమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుండడంతో కులస్తులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. -
కంటిపాపను కాపాడండి
కరీంనగర్: ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మీ వచ్చిందని సంబురపడ్డారు. కూలి చేస్తేనే కడుపునిండే కుటుంబం అయినా తమ కూతురు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కానీ అంతలోనే ఆ చిన్నారి ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది. వెంటనే వైద్యం అందిస్తేనే బతికే పరిస్థితులు వచ్చాయి. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితులు కావడంతో తమ కూతురు వైద్యానికి దాతలు సాయం చేసి ఆదుకోవాలని ఆ నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన రౌతు సంపత్–రాజేశ్వరీ దంపతులకు శ్రేయన్షి సంతానం. ఏడాదిన్నర వయస్సున్న శ్రేయన్షి తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితికి చేరింది. హార్ట్ సమస్యతోపాటు బ్లడ్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కు సోకడంతో ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి వచ్చింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారి చికిత్సకు రూ.5లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. కూలి పని చేసే కుటుంబం కావడంతో ఇంత భారీ మొత్తాన్ని భరించే స్థోమత లేక తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే బంధువులు, పరిచయస్తుల వద్ద రూ.లక్ష వరకు అప్పు తెచ్చి చికిత్స అందిస్తున్నారు. మిగతా డబ్బులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దాతలు చేసే సహాయం తమ కూతురి ప్రాణానిన నిలబెడుతుందని ఆ నిరుపేద తల్లిదండ్రులు కోరుతున్నారు. సహాయం చేయాలనుకునే వారు ఫోన్పే లేదా గూగుల్పే 91603 89464, 99120 20718లో ఆర్థిక సహాయం చేయాలని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆదుకోవాలని తల్లిదండ్రుల విన్నపం ప్రాణాపాయ స్థితిలో చిన్నారి -
పునాదుల్లోనే పద్మశాలీ భవనం
● ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారిన పనులు సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని పద్మశాలీ సంఘ భవనం పునాదుల్లో ఆగిపోయింది. రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బైపాస్రోడ్డులో ఐదెకరాల స్థలం, రూ.5కోట్లు మంజూరు చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో పునాదుల్లోనే ఆపివేశాడు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పద్మశాలీ సంఘం భవన నిర్మాణం ప్రచారాస్త్రంగా మారింది. సిరిసిల్ల పద్మశాలి సంఘం పెద్దలు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను కలిసి భవన నిర్మాణంపై చర్చించారు. భవన నిర్మాణం రూ.కోటి వరకు పూర్తి కాగా.. ఒక్క పైసా కాంట్రాక్టర్కు రాలేదు. దీంతో పనులు ఆగాయని వివరించారు. అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్ను హైదరాబాద్ పిలిపించి భవనం పనులు చేయాలని, బిల్లులు ఇప్పిస్తామని చెప్పడంతో మళ్లీ రూ.1.45కోట్ల పనులు చేశారు. కానీ ఇప్పటి వరకు రూ.2.45 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆఘమేఘాలపై మళ్లీ పనులు ప్రారంభించి మొరం పోయిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సిరిసిల్ల పద్మశాలీ సంఘ భవనం నిర్మాణం ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారడం చర్చనీయాంశమైంది. -
వరద కష్టాలు తీర్చాలి
ఏటా వర్షాకాలంలో మేము వరదలతో ఇబ్బంది పడుతున్నాం. పై భాగంలోని నీళ్ళు వచ్చి ఇక్కడ నిలుస్తున్నాయి. ఇండ్ల బేస్మెంట్ భాగం పాడవుతున్నాయి. గోడలు పర్రెలు వస్తున్నవి. దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయి. వరదలు రాకుండా తాత్కాలికంగా కచ్చా నాలా తవ్వి వదిలేశారు. శాశ్వత పరిష్కారం చూపాలి. – కందాళ నవీన్కుమార్, 2వ వార్డు వార్డులో సీసీ కెమెరాలు పెట్టించాలి. కొన్ని ఏరియాల్లో వీధిలైట్లు లేవు. కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో వసతులు కల్పించాలి. పాడైన పాతరోడ్ల స్థానంలో కొత్తగా నిర్మించాలి. మిషన్ భగీరథ నీరును అందరికీ సరిపడా సరఫరా చేయాలి. గీతానగర్ చౌరస్తా నుంచి పాతపోచమ్మ వరకు రోడ్డు వేయాలి. – గండ్ర పృథ్వీథర్రావు, 3వ వార్డు వార్డులో చిన్న మోరీలతో మురికినీరు సరిగా పోతలేదు. పెద్దమోరీలు కట్టించాలి. పాడైన రోడ్లను మరమ్మతు చేపట్టాలి. కొన్ని వాడల్లో లైట్లు వెలుగుతలేవు. ప్రతి రోజు మోరీలు శుభ్రం చేయించాలి. రోజు నల్లానీళ్లు ఎక్కువ సేపు ఇవ్వాలి. సీసీ కెమెరాలు పెట్టించి వార్డులో దొంగతనాలు జరక్కుండా చూడాలి. – గున్నాల మల్లమ్మ, 4వ వార్డు -
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. మున్సిపల్ పరిధిలోని 1, 7, 8, 9, 23, 28 వార్డుల్లో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. అభివృద్ది కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. తిప్పాపూర్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో తిప్పాపూర్ బస్స్టాండ్ను తరలిస్తామంటే తానే మొదట అడ్డుకున్నానన్నారు. ఇటీవల తిప్పాపూర్లో రూ.కోటితో జంక్షన్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని.. తాము నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులకు రేషన్కార్డులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో తెలంగాణలోనే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. -
మత్తుకు బానిస కావద్దు
● సైకాలజిస్ట్ పున్నంచందర్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): యువత మత్తుపదార్థాలకు బానిస కావద్దని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ కోరారు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలోని ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, కళాశాలలోని విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. పున్నంచందర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి అలవాట్లు మానసిక కృంగుబాటుకు, ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తాయన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు మత్తును ఆశ్రయించడం పరిష్కారం కాదన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తల్లిదండ్రులు, నిపుణులతో పంచుకోవాలని సూచించారు. పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రజనీ, వైస్ప్రిన్సిపాల్ శ్రీవిద్య, ఉపాధ్యాయులు షాలిని, సవిత, శ్వేత, విజయశ్రీ పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): తమ గ్రామం మీదుగా బస్సులను పునరుద్ధరించాలని కోరుతూ మండలంలోని వెంకట్రావుపల్లి సర్పంచ్ చల్ల నవీన్రెడ్డి గ్రామస్తులతో కలిసి బుధవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందించారు. గతంలో సిద్దిపేట, కరీంనగర్ల నుంచి నడిచిన బస్సులను నాలుగేళ్ల క్రితం రద్దు చేశారన్నారు. ఆ రెండు సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు. నాయకులు మామిండ్ల కనకరాజు, మంద రాజు, సంపత్రెడ్డి, బత్తిని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సిరిసిల్ల అర్బన్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ మినీస్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేశ్కుమార్, మండల విద్యాధికారి దూస రఘుపతి తిలకించారు. వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. నియోజకవర్గస్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జిల్లాస్థాయికి ఎంపికవుతారని తెలిపారు. ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలోని మతిస్థిమితం లేని ఓ మహిళను సఖీ కేంద్రం నిర్వాహకులు బుధవారం సిరిసిల్లకు తరలించారు. నెల రోజులుగా సంచరిస్తున్న సదరు మహిళ పరిస్థితిని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల విన్నపంతో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం స్పందించారు. సఖీ కేంద్రం బాలిక సంరక్షణ అధికారి కవిత ప్రత్యేక అంబులెన్స్తో ముస్తాబాద్కు వచ్చి, మతిస్థిమితం లేని మహిళతో మాట్లాడారు. ఆమె ఎలాంటి వివరాలు చెప్పకపోవడంతో, అంబులెన్స్లో సిరిసిల్లకు తీసుకెళ్లారు. అక్కడి వృద్ధాశ్రమంలో చేర్చినట్లు డీసీపీవో కవిత తెలిపారు. -
● రైల్వేలైన్కు భూసేకరణ వేగవంతం ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ హైస్కూల్ను జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి బుధవారం పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం, సీసీ కెమెరాల, మీడియా సెంటర్ ఏర్పాటు, వాహనాల పార్కింగ్ అంశాలపై అధికారులతో చర్చించారు. రైల్వేలైన్ భూసేకరణ వేగవంతం కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ భూసేకరణను వేగంగా పూర్తి చేస్తామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి క్యాబినెట్ సెక్రటరీ (కోఆర్డినేషన్) సెంట్రల్ సెక్రటేరియట్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అందరికీ సమాన అవకాశాలు అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. అటెండర్ నుంచి అన్ని స్థాయిల అధికారులకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో చేస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. వంద శాతం ఫలితాలు సాధించాలి పదో తరగతి పరీక్షల్లో ప్రతీ విద్యార్థిపై దృష్టి సారించి, వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ గరీ మా అగ్రవాల్ కోరారు. విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. డీఈవో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో 4,405 మంది చదువుతున్నారని, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులతో స్కాలర్షిప్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేయించాలని తెలిపారు. -
మున్సిపాలిటీలు అప్పగిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా
సిరిసిల్ల/వేములవాడ: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో బుధవారం నిర్వహించిన స్ట్రీట్కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. కేసీఆర్ కొడుకు మాకు భయపడి సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10వేలు ఇస్తున్నాడట.. ఆ డబ్బులు తీసుకొని.. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేయాలని కోరారు. మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్కు అప్పగిస్తే వానొస్తే గల్లీలు మునిగిపోతున్నాయన్నారు. కలెక్టరేట్కు పడవలు, ట్రాక్టర్లలో పోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వస్త్రపరిశ్రమ సిరిసిల్లలో ఉంటే.. యారన్ డిపో అక్కడెందుకు అని ప్రశ్నించారు. కాంగ్రెసోళ్లు ప్రతీ కిలోపై కమీషన్లు దొబ్బుతున్నారని ఆరోపించారు. మురికినీటి శుద్ధిప్లాంట్ను పద్మనగర్లో నిర్మించి ఊరిని మురికినీటితో ముంచారని ఆరోపించారు. సుందరీకరణ పేరిట సిరిసిల్ల కొత్త చెరువులో చేపట్టిన పనులతో కొద్దిపాటి వర్షానికి నీళ్లు ఊరిలోకి వస్తున్నాయన్నారు. టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలు మూత పడుతున్నాయని, అపెరల్పార్క్లో షెడ్లు నిర్మించి వదిలేశారన్నారు. సిరిసిల్లలో ఏడు గ్రామాలను విలీనం చేసి ఉపాధిహామీని దూరం చేశారన్నారు. సిరిసిల్లకు 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.29 కోట్లు మంజూరు చేశామని, అమృత్ పథకంలో రూ.50 కోట్లు ఇచ్చామని వివరించారు. పట్టణంలోని చిరువ్యాపారులకు రూ.21.52కోట్ల రుణాలు, స్వచ్ఛ భారత్లో రూ.44 కోట్లు ఇచ్చామని వివరించారు. వేములవాడ ఎమ్మెల్యే అడ్డగోలు వ్యవహారం ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటుంటే, వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ నేతలను బెదిరిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. తన మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే ఉరుకునేది లేదన్నారు. డీజీపీ, ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాతితో కట్టాల్సిన ఆలయాన్ని సిమెంట్ కాంక్రిట్తో కడుతున్నారన్నారు. గుడి పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎములాడ రాజన్నకే శఠగోపం పెట్టిండని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ సిరిసిల్ల ఇన్చార్జి మీసాల చంద్రయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్రావు, నాయకులు ఆడెపు రవీందర్, మట్ట వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
ఆమెకు అందలం
● సిరిసిల్లలో ఆరుసార్లు చైర్పర్సన్లు ● వేములవాడలో మూడోసారి నారీ ● అతివలకే పుర‘పాలనా’ పగ్గాలు ● ఈసారి అతివకే పట్టాభిషేకంసిరిసిల్ల: జిల్లాలో మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ఓటర్లుగానే కాదు నేతలుగా ఎదుగుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పగ్గాలు కొన్నేళ్లుగా అతివల చేతుల్లోనే ఉంటున్నాయి. ఈసారి ఎన్నికల్లోనూ మహిళలే చైర్పర్సన్లు కానున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 119 గ్రామాల్లో మహిళలే సర్పంచులుగా పాలనా పగ్గాలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 976 మంది మహిళా వార్డుసభ్యులు పాలకవర్గంలో భాగస్వాములయ్యారు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ‘ఆమె’ ప్రజాసేవలో ముందుండనున్నారు. గతంలోనూ అతివలే.. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో గతంలోనూ మహిళల పాలన కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్గా తుల ఉమ, జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే తొలిసారి సింగిల్విండో చైర్పర్సన్ బర్కం లక్ష్మీనవీన్యాదవ్ పాలన సాగించారు. ఓటర్లుగానూ ప్రభావం సిరిసిల్ల పట్టణంలో 81,959 మంది ఓటర్లు ఉండగా మహిళలు 42,011, పురుషులు 39,942, థర్డ్ జెండర్లు ఆరుగురు ఉన్నారు. వేములవాడలో 40,877 మంది ఓటర్లు ఉండగా మహిళలు 21,279, పురుషులు 19,580, థర్డ్ జెండర్లు 18 మంది ఉన్నారు. మహిళ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రెండు మున్సిపాలిటీల్లోను చైర్పర్సన్గా మహిళలకు కేటాయించారు. అఽధిష్టాన నిర్ణయమే ఫైనల్ సిరిసిల్ల, వేములవాడల్లో చైర్పర్సన్ సీటుపై గురిపెట్టిన నేతలు ఆయా పార్టీల అధిష్టానం హామీ కోసం ప్రయత్నిస్తున్నారు. రెండు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ సీటు చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. కొత్తవాళ్లు తెరపైకి రావడంతో అధిష్ఠా నం సైతం ముందుగా కౌన్సిలర్గా గెలవాలని స్పష్టం చేస్తుంది. ఏ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించిన అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఆ మేరకు చైర్పర్సన్ ఎన్నిక సాధ్యమవుతుంది. మొత్తంగా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోనూ మరోసారి మహిళ శకానికి బాటలు పడుతున్నాయి. పాలన పగ్గాలను అతివలు చేపట్టనున్నారు. భర్త చాటు భార్యలుగా కాకుండా సొంత నిర్ణయాలతో పాలన సాగిస్తే.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు అర్థముంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మహిళలకు కేటాయించిన వార్డులపై ముఖ్యనాయకులు దృష్టి సారించారు. చైర్పర్సన్ స్థానంపై గురిపెట్టిన నాయకులు ముందుగా తమ సతులను కౌన్సిలర్గా గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు. సిరిసిల్ల పట్టణంలో మహిళలకు 3, 4, 5, 8, 9, 10, 15, 18, 23, 27, 28, 29, 30, 31, 36, 37, 38, 39వ వార్డు కేటాయించారు. మరోవైపు జనరల్ స్థానాల్లోనూ పురుషులకు పోటీకి అవకాశం ఉన్నా మహిళను పోటీలో ఉంచి మున్సిపల్ చైర్పర్సన్ స్థానంపై గురిపెట్టారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళ కావడంతో అన్ని సామాజిక వర్గాలకు ఈసారి అవకావం లభించింది. వేములవాడలో 28 వార్డులు ఉండగా.. 14 వార్డులకు మహిళలకు కేటాయించారు. ఈసారి వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు చైర్పర్సన్ స్థానంపై గురిపెట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యనాయకుల సతీమణులు చైర్పర్సన్ స్థానం కోసం జనరల్ వార్డుల్లోనూ మహిళలు పోటీలో ఉంచి గెలిపించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వేములవాడలో మహిళలకు కేటాయి ంచిన వార్డులు 1, 2, 5, 9, 10, 11, 19, 22, 23, 26, 27, 28వ వార్డులపై దృష్టిసారించారు.మున్సిపల్లోనూ... సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్లుగా రుద్ర సత్తమ్మ, గుండ్లపల్లి సరోజన, గుడ్ల మంజుల, సామల పావని, జిందం కళాచక్రపాణి పనిచేశారు. మరోసారి మహిళా చైర్పర్సన్కు ఈసారి అవకాశం వచ్చింది. ఆరు పర్యాయాలు మహిళలు మున్సిపాల్ పాలనాపగ్గాలు చేపట్టినట్లు అవుతుంది. వేములవాడలో నామాల ఉమ, రామతీర్థపు మాధవి తాజా మాజీ చైర్పర్సన్గా ఉన్నారు. వీరంతా ఐదేళ్లపాటు పాలన సాగించారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు మహిళలకు మరోసారి చైర్పర్సన్ స్థానాలు దక్కాయి. -
పవర్బోర్లు వేయించాలి
సుభాష్నగర్ వాటర్ట్యాంక్ ఏరియాలో పాడైన హ్యాండ్బోర్లను పవర్బోర్లుగా మార్చాలి. మిషన్ భగీరథ నీళ్లు సరిపోవడం లేదు. మిషన్ భగీరథ నీరు రాని రోజు గోస పడుతున్నాం. మోరీలు సరిగా తీయక దోమలు పెరిగిపోతున్నాయి. రోడ్లను మంచిగా చేయించాలి. – దూస రజిత, 5వ వార్డు వార్డులో నలభై ఏళ్ల కింద నిర్మించిన రోడ్డు శిథిలమయ్యాయి. కొత్తగా రోడ్లు వేయాలి. అవసరం ఉన్న చోట్ల వీధిలైట్లు పెట్టించాలి. వార్డులో ప్రవహించే ప్రధాన డ్రైనేజీ సిల్టుతో నిండిపోయింది. పనిచేయని బోర్లను రిపేరు చేయిస్తే నళ్లాలు రాని సమయంలో నీళ్ల కష్టాలు ఉండవు. – గజ్జెల్లి మహేశ్, 6వ వార్డు 7వ వార్డులోని ఆదర్శనగర్లో కనుచూపు మేరలో రోడ్లు, మోరీలు కనిపించవు. కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో కచ్చా డ్రైనేజీలతో ఇబ్బంది పడుతున్నాం. మిషన్ భగీరథ పైపులైన్లు పటిష్ట పర్చాలి. వైకుంఠథామంలో వసతులు కల్పించాలి. మహిళా కమ్యూనిటీ భవనం కట్టించాలి. నూరుశాతం వసతులు అందించాలి. – ఒగ్గు రాజు, 7వ వార్డు -
సిరిసిల్ల బరిలో 170 మంది
సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ పోరులో ప్రచార పర్వానికి తెరలేచింది. పట్టణంలో 39 వార్డులు ఉండగా, 170 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మంగళవారం 64 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో బీఆర్ఎస్ నుంచి అత్యధికంగా 32 మంది, కాంగ్రెస్ నుంచి 16, బీజేపీ నుంచి ఏడుగురు, ఇండిపెండెంట్లు 8 మంది, ఏఐఎఫ్బీ నుంచి ఒక్కరు విత్డ్రా చేసుకున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు విషణ్ణవదనాలతో, ఆవేదనతో మున్సిపల్ ఆఫీస్ నుంచి బయటికి రావడం కనిపించింది. బరిలో నిలిచిన అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు, ఇండిపెండెంట్లకు ఇతర గుర్తులను అధికారులు కేటాయించారు. బీఆర్ఎస్ ఇన్చార్జి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, విండో మాజీ చైర్మన్ పబ్బతి విజయేందర్రెడ్డి పార్టీ అభ్యర్థుల బీ ఫామ్స్ను కమిషనర్కు అందించారు. 14 వార్డుల్లో త్రిముఖ, 10 వార్డుల్లో చతుర్ముఖ పోటీ సిరిసిల్లలో 39 వార్డులు ఉండగా, 14 వార్డుల్లో ముగ్గురి మధ్య పోటీ, 10 వార్డుల్లో నలుగురి మధ్య పోటీ ఉంది. 9 వార్డుల్లో ఐదుగురి మధ్య, ఒక్క వార్డులో ఆరుగురు, మూడు వార్డుల్లో ఏడుగురు చొప్పున అభ్యర్థులు బరిలో ఉండగా.. 15వ వార్డు, 34వ వార్డుల్లో మాత్రం ఎనిమిది మంది చొప్పున పోటీలో ఉన్నారు. పట్టణంలోని పది వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల రెబల్ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. బుధవారం నుంచి అభ్యర్థులు ప్రచారానికి తెర లేపనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పరిశీలన సిరిసిల్ల మున్సిపల్లో మంగళవారం నామినేషన్ల ఉపసంహరణను ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు వేర్వేరుగా పరిశీలించారు. కమిషనర్ ఖదీర్పాషా ఎన్నికల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నోడల్ అధికారి భారతి, తహసీల్దార్ మహేశ్కుమార్, స్పోక్స్ పర్సన్ పాతూరి మహేందర్రెడ్డి పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్లో.. వేములవాడ: వేములవాడ బల్దియాలో మొత్తం 150 మంది అభ్యర్థులకు మంగళవారం 37 మంది నామినేషన్ ఉపసంహరించుకోగా, 113 మంది బ రిలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు బుధవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్లో స మావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ ఎలక్షన్ ఏజెంట్ల పాస్పోర్టు సైజ్ ఫొటో, పూర్తి వివరాలతో హాజరు కావాలని కోరారు. -
బుకింగ్ గుబులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉదయం లేవగానే పొలంగట్ల వెంట పోయి పంటచేలను చూస్తే మనసు నిమ్మలం అయ్యే రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా అంటే ఫర్టిలైజర్షాప్నకు వెళ్లాలని అనుభవం ఉన్న అన్నదాతలు.. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ గురించి అవగాహన లేక యూరియా బస్తాలు ఎలా తెచ్చుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పంటలకు యూరియా అందక రంగుమారుతుంటే ఆవేదన చెందుతున్నారు. అవగాహన కరువు వ్యవసాయ పనులు చేస్తున్న రైతులకు 70 శాతానికి పైగా అక్షరజ్ఞానం లేదు. వాళ్లకు స్మార్ట్ఫోన్లను ఎలా వాడాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తెచ్చిన ఫర్టిలైజర్యాప్ను వినియోగించుకోవడం తెలియక చదువు వచ్చిన రైతుల వద్దకు వెళ్లి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈక్రమంలో యూరియా అందడం ఆలస్యమై పంటలు ఎదగడం లేదు. అక్రమాలకు చెక్ పెట్టేందుకే.. ఇన్నాళ్లు బడారైతులు ఎక్కువ యూరియా బస్తాలు తీసుకెళ్లే అవకాశం ఉండడంతో చిన్న, సన్నకారు రైతులకు ఎరువుల బస్తాలు అందడం లేదు. గ్రామాల్లో పలుకుబడి ఉన్న రైతులకే ఎరువుల బస్తాలు సరిపడేలా అందేవి. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్ట్టేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్యాప్ను తీసుకొచ్చింది. దీని ద్వారా పట్టాపాసుపుస్తకంలో ఉన్న భూమి విస్తీర్ణాన్ని బట్టి ఎరువుల బస్తాలను దశలవారీగా ఇస్తున్నారు. అయితే రైతుల్లో చాలా మంది నిరక్షరాస్యులు ఉండడంతో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం తెలియక.. ఒక వేళ డౌన్లోడ్ చేసుకున్న ఎలా బుకింగ్ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇలాంటి సమస్యలపై వ్యవసాయాధికారులు దృష్టి పెట్టి అవగాహన కల్పిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. -
అసంతృప్తుల జ్వాలలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో టికెట్లు ఆశించిన ఆశావహులకు నిరాశ ఎదురవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియడంతో బీఫారాలు అందుకున్న అభ్యర్థులు ప్రచార బరిలో దిగారు. ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కలేదన్న ఆగ్రహంతో పలువురు బహిరంగ నిరసనలకు దిగారు. పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆశావహులు రోడ్డెక్కారు. పార్టీ సభ్యత్వాలు, పదవులకు రాజీనామా చేయడం, నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేయడం, నేతల ఇళ్ల ముందు ఆందోళనలు నిర్వహించడం, పరస్పర వాగ్వాదాలకు దిగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలువురు ఆశావహులు పార్టీ పెద్దల ఇళ్లముందు ఆందోళన చేపట్టారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తూ కొందరు స్వతంత్రులుగా.. మరికొందరు పార్టీ రెబల్స్గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ పార్టీలకు రాజీనామా చేసి ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ పరిణామాలు ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పిగా మారాయి. రెబల్స్ ప్రభావం ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగుతున్నప్పటికీ.. చాలాచోట్ల పరిస్థితి అదుపులోకి రావడం లేదు. టికెట్ల వ్యవహారం మరింత మంటలు రాజేస్తుండటంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ పోరు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. రెబల్స్ బెడద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు అందించే సమయంలో హైడ్రామా నెలకొంది. ఒకే డివిజన్కు రెండు బీఫామ్లు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. పీసీసీ ఆదేశాలకు వ్యతిరేకంగా స్థానిక నాయకులు బీఫామ్లు అందించడం కలకలం రేపింది. తొలుత 50వ డివిజన్ అభ్యర్థిగా కొత్త అనిల్ను హైకమాండ్ ప్రకటించింది. అదే సమయంలో పార్టీ కార్పొరేషన్ ఇన్చార్జి వైద్యుల అంజన్కుమార్ బీఫామ్ను చక్రధర్రావుకు అందించారు. ఈ విషయం తెలిసి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అవాక్కయ్యారు. అనిల్కు కాదని బీఫామ్ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎలాగైనా అనిల్కు న్యాయం చేయాలనే ఆలోచనతో హైకమాండ్ అప్పటికే 57వ డివిజన్ పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు కేటాయించిన బీఫామ్ అందించారు. ఒక విధంగా అటు నగర, అసెంబ్లీ ఇన్చార్జిలు పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అన్నా, చెల్లెలి సవాల్సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలు రక్తసంబంధీకుల మధ్య పోటీని నెలకొల్పాయి. సిరిసిల్ల పట్టణంలోని 16వ వార్డులో బీఆర్ఎస్ టికెట్పై సిట్టింగ్ కౌన్సిలర్ గుడ్ల శ్రీనివాస్ పోటీ చేయగా, ఆయనకు స్వయానా చెల్లెలు గుజ్జె తార కాంగ్రెస్ టికెట్పై బరిలో ఉన్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లోనూ వీరిద్దరు పోటీ పడ్డారు. అప్పటి ఎన్నికల్లో గుజ్జె తార బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేయగా, గుడ్ల శ్రీనివాస్ ఇండిపెండెంట్గా పోటీ చేసి చెల్లెలుపై విజయం సాధించారు. మరోసారి అన్నా, చెల్లెలు సిరిసిల్లలో సవాల్ చేయడం చర్చనీయాంశమైంది. కరీంనగర్ 53వ డివిజన్కు చెందిన తాజీ మాజీ కార్పొరేటర్ మెండి శ్రీలతచ ంద్రశేఖర్కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో దళిత మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం ముందు ఆందోళన చేశారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. శ్రీలత, చంద్రశేఖర్ కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలోని 2వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ దాసరి సాగర్ నగరంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం ముందు ఆందోళనకు దిగారు. తాను బీఆర్ఎస్ అభ్యర్థి అని ముద్రించుకున్న కరపత్రాలు, పోస్టర్లను తగలబెట్టి నిరసన తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకుడు బేతి మహేందర్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి, రెబల్గా బరిలో నిలిచాడు. జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద మొదలైంది. మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ మధ్య సయోధ్య లేకపోవడంతో పార్టీ రెండు వర్గాలుగా చీలింది. టికెట్లు దక్కని నేతలు రెబల్స్గా బరిలోకి దిగారు. రాయికల్ మున్సిపాలిటీలో ఐదుగురు రెబల్స్ పోటీలో ఉన్నారు. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లిలోనూ కాంగ్రెస్కు రెబల్స్ బెడద తప్పడం లేదు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలలో రెబల్స్ బెడద ఉంది. సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీలో అన్ని పార్టీలకు రెబల్స్ బెడద ఉంది. వేములవాడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు 3 డివిజన్లలో, బీఆర్ఎస్కు రెండు డివిజన్లలో రెబల్స్ బరిలో నిలిచి గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. -
జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతర పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. భీమేశ్వర ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసే ర్యాంపు, లడ్డూ కౌంటర్, పార్కింగ్ తదితర ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో రమాదేవి, ఆర్అండ్బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మహిపాల్రెడ్డి, ఏఈవోలు జయకుమారి, శ్రావణ్కుమార్, బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిమ్మపల్లి–వట్టిమల్ల గ్రామాల గీతకార్మిక సంఘాల మధ్య ఏర్పడిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తామని ఎల్లారెడ్డిపేట ఎకై ్సజ్ సీఐ మిట్టపెల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రెండు గ్రామాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈత, తాటి చెట్లను గీస్తూ నిమ్మపల్లికి చెందిన గౌడ సంఘం సభ్యులు కొన్నేళ్లుగా ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ వనాలు తమ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయని, ఇవి తమకే చెందుతాయని వట్టిమల్లకు చెందిన గీతకార్మిక సంఘం ఆరోపిస్తోంది. ఈ విషయమై ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వట్టిమల్ల గీత కార్మికుల ఫిర్యాదు మేరకు ఎకై ్సజ్ సీఐ సిబ్బందితో చేరుకుని రెండు గ్రామాల గీత కార్మికులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తామని, అప్పటి వరకు ఎవరూ గొడవలు పెట్టుకోవద్దని సూచించారు. బీఆర్ఎస్ది సంక్షేమ పాలన.. కాంగ్రెస్ సంక్షోభ పాలనసిరిసిల్ల: జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పాలన సంక్షేమాన్ని అందించిందని, రెండేళ్ల కాంగ్రెస్ పాలన సంక్షోభాన్ని చూపిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. ఉద్యమ పార్టీగా సిరిసిల్ల అభివృద్ధికి బీఆర్ఎస్ బాటలు వేసిందని, అప్పటి సీఎం కేసీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందన్నారు. మున్సిపాలిటీలో 39 వార్డులకు అభ్యర్థులను ముందే ప్రకటించి బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని, అధికార కాంగ్రెస్, బీజేపీలు అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలుపలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. సిరిసిల్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నేతన్నలకు ఉపాధి చూపింది, అభివృద్ధికి బాటలు వేసింది బీఆర్ఎస్ అని ప్రజలు గుర్తించారని, అందుకే తమ పార్టీ టికెట్ల కోసం ఎన్నడూ లేనంత పోటీ నెలకొందన్నారు. గత పాలన, నేటి పాలనను పోల్చుకుంటూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు. నాయకులు కొండూరి రవీందర్రావు, చీటి నర్సింగరావు, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, సామల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గడువు పొడిగింపుసిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ఎస్సీడీవో డాక్టర్ రవీందర్రెడ్డి తెలిపారు. 2025–26 సంవత్సరానికి ఫౌండేషన్ కోర్సులకు (రాష్ట్రస్థాయి అన్ని పోటీ పరీక్షలతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఇతర పోటీ పరీక్షలు) శిక్షణ ఇస్తామన్నారు. భోజన వసతితో పాటు స్టడీ మెటీరియల్స్ అందించే శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులైన యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 22లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కోరారు. ఇతర వివరాలకు 83413 87700 నంబర్లో సంప్రదించాలన్నారు. -
ప్రచార ఖర్చులు పక్కాగా నమోదు చేయాలి
సిరిసిల్ల: జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల వ్యయాలపై పక్కాగా పర్యవేక్షణ చేపట్టాలని వ్యయ పరిశీలకులు రాజ్కుమార్ ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల, వేములవాడ బల్దియాలను సందర్శించి, ఎన్నికల అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ఖర్చును నిబంధనల ప్రకారం నమోదు చేసి, వ్యయ రిజిస్టర్లు రోజువారీగా అప్డేట్ చేయాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ సమన్వయంతో పనిచేసి అక్రమ ఖర్చులు, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాలన్నారు. అభ్యర్థులకు ఎన్నికల వ్యయాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారు సమయానికి ఖర్చుల వివరాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నోడల్ అధికారులు నవీన్కుమార్, భారతి పాల్గొన్నారు. -
గడువులోగా సీఎంఆర్ పూర్తి చేయండి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను గడువులోగా అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం రైస్ మిల్లర్లతో సీఎంఆర్పై సమీక్షించారు. 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లకు మిల్లుల వారీగా కేటాయించిన ధాన్యం, డెలివరీ చేయకుండా పెండింగ్లో ఉన్న ధాన్యం వివరాలపై చర్చించారు. మిల్లుల వారీగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా గడువులోగా పూర్తి చేసేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఖరీఫ్ బియ్యం ఈనెల 16, రబీ బియ్యం 28లోగా అందించాలన్నారు. సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తి చేయడం మిల్లర్లు బాధ్యతగా భావించాలని సూచించారు. గత అనుభాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే సీజన్లో లక్ష్యాన్ని సమర్థవంతంగా చేరుకునేలా ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఇన్చార్జి డీసీఎస్వో, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రజిత, రైస్ మిల్లర్ల ప్రతినిధులు చేపూరి నాగరాజు, పబ్బ నాగరాజు, గరిపెల్లి ప్రభాకర్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయిల్పాం సాగుతో అధిక ఆదాయం ఇల్లంతకుంట(మానకొండూర్): ఆయిల్పాం సాగుతో రైతులు అధిక దిగుబడి, దీర్ఘకాలం పాటు ఆదాయం పొందవచ్చని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం మండలంలోని వల్లంపట్లలో ఆయిల్పాం మెగా ప్లాంటేషన్లో పాల్గొని మాట్లాడారు. పంట సాగుకు సబ్సిడీ, మార్కెటింగ్, సదుపాయాల గురించి రైతులకు వివరించారు. ఆయిల్పాం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని పేర్కొన్నారు. జిల్లాలో ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు పీఏసీఎస్, ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులకు లక్ష్యం కేటాయించామన్నారు. పంట విక్రయించేందుకు ఇబ్బందులు ఉండవని, సిద్దిపేట జిల్లా నర్మెట్ట వద్ద ఆయిల్పాం ఫ్యాక్టరీ ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో డీఏవో అఫ్జల్ బేగం, తహసీల్దార్ ఎంఏ ఫరూక్, అధికారులు సందీప్, గోవర్ధన్, సర్పంచ్ నేరెళ్ల విజయ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నిరసనలు.. రాజీనామాలు
సిరిసిల్ల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల్లో ముసలం పెట్టాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పలువురు అభ్యర్థులు పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డారు. దీంతో నిరసన వ్యక్తం చేస్తూ, పార్టీకి రాజీనామాలు చేశారు. సిరిసిల్ల 10వ వార్డు బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ బొల్గం నాగరాజు సతీమణికి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్థాణిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద పార్టీ కండువాలను వదిలేస్తూ.. రాజీనామా చేస్తున్నట్లు అంబేడ్కర్ విగ్రహానికి అందించారు. అదే వార్డుకు చెందిన ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకుడు బండారు శ్యాం టికెట్ రాలేదని ఆ పార్టీకి రాజీనామా చేశాడు. కాంగ్రెస్కు చెందిన పిట్టల శ్రీకాంత్ 38 వార్డులో తమ అభ్యర్థి పిట్టల తేజస్వినికి టికెట్ రాలేదని పార్టీ ఆఫీస్లోనే గొడవకు దిగారు. ఇలా అన్ని పార్టీల్లోనూ నిరసనలు, రాజీనామాలు జరిగాయి. పది వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులు సిరిసిల్లలోని 10 వార్డుల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచారు. పార్టీ టికెట్ రాని వారంతా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఇతర గుర్తులపై పోటీ చేశారు. రెబల్స్ బెడద అన్ని పార్టీల్లోనూ ఉండడం గమనార్హం. ఆయా పార్టీ ముఖ్యనేతలంతా అలకబూనిన అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. నామినేషన్ల ఉపసంహరణకు చేసిన రాజీ ప్రయత్నాలు కొన్ని చోట్ల కొలిక్కి వచ్చినా.. రెబల్స్ బెడద అన్ని పార్టీలకు ఉంది. -
యాంత్రీకరణతో రైతులకు లబ్ధి
బోయినపల్లి(చొప్పదండి): వ్యవసాయ యాంత్రీకరణ పథకంతో రైతులకు లబ్ధి చేకూరుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో 31 మంది రైతులకు రూ.6.78 లక్షల విలువైన సబ్సిడీ వ్యవసాయ పరికరాలను సోమవారం అందించారు. ఎంఏవో ప్రణిత, ఎంపీడీవో జయశీల, ముదుగంటి సురేందర్రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపెల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, వినోద్, బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, పులి లక్ష్మీపతి, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి, మహేశ్రెడ్డి, సర్పంచులు నల్ల మోహన్, ఏనుగుల కనకయ్య, జంగం అంజయ్య, డాక్టర్ వెంకటేశ్, రాజేశం, మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సింహం ధైర్యం..!
ఏనుగు బలం..సాక్షిప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో టికెట్లు దక్కని ఆశావహులు ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఏఐఎఫ్బీ (సింహం గుర్తు), బీఎస్పీ (ఏనుగు గుర్తు) పార్టీలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. సింహం ధైర్యానికి, ఏనుగు బలానికి ప్రతీకగా భావించే ఈ గుర్తులు ఇప్పుడు రాజకీయంగా కూడా బలమైన ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో అంతర్గత అసంతృప్తి, రెబెల్స్ బెడద ఎక్కువగా ఉన్న వార్డులు, డివిజన్లలో ఈ గుర్తులు ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇస్తున్నాయి. ముందస్తు వ్యూహాలు టికెట్ రాకపోతే ప్రత్యామ్నాయంగా పోటీ చేసేందుకు ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకుంటున్న నేతలు ఏఐఎఫ్బీ, బీఎస్పీ నాయకత్వాలతో చర్చలు జరిపి, అవసరమైతే తమకు ఆ పార్టీ గుర్తు కేటాయించాలంటూ మాట తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రధాన పార్టీల తరఫున నామినేషన్ దాఖలు చేస్తూనే, ప్రత్యామ్నాయంగా ఏఐఎఫ్బీ, బీఎస్పీ పార్టీల పేర్లతో కూడా నామినేషన్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పరిధిలో ఉన్న రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా చివరి నిమిషాల్లో ‘ఆపద్బాంధవ’ పార్టీలుగా ఏఐఎఫ్బీ, బీఎస్పీలు మారుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలకు సవాల్ ఏఐఎఫ్బీ, బీఎస్పీ, జనసేనతో పాటు ఇతర చిన్న పార్టీల రంగప్రవేశం కూడా ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఓటు చీలిక, రెబెల్ ప్రభావం, గుర్తుల సెంటిమెంట్స్ కలసి ప్రధాన పార్టీలకు సవాళ్లను విసురుతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ కంటే గుర్తే బలం అన్న నమ్మకం బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సింహం, ఏనుగు గుర్తులపై పోటీ చేసే అభ్యర్థులు ఎంతవరకు ప్రధాన పార్టీలను దెబ్బతీస్తారో, ఎవరి లెక్కలు ఎవరి మీద పనిచేస్తాయో తేలాల్సి ఉంది. సెంటిమెంట్ ఏఐఎఫ్బీ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విస్తృతంగా పోటీ చేసి విజయాలు సాధించింది. ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 224 మంది అభ్యర్థులను బరిలో దింపగా, 102 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 జెడ్పీటీసీ, 49 ఎంపీటీసీ స్థానాలను ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 17 స్థానాలను పార్టీ కై వసం చేసుకుంది. చొప్పదండిలో 1, పెద్దపల్లి 1, రామగుండం 9, కరీంనగర్ 3, జగిత్యాల 1, రాయికల్లో 2 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 230 మంది అభ్యర్థులు బరిలో దిగారు. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కరీంనగర్ జిల్లాలో 20 స్థానాల్లో పోటీ చేస్తుంది. కరీంనగర్ కార్పొరేషన్లో 10 స్థానాలు, జమ్మికుంట మున్సిపాలిటీలో 4, హుజురాబాద్లో 4, చొప్పదండిలో 2 సీట్లల్లో పోటీ చేస్తుంది. మొదటిసారిగా బీఎస్పీకి స్థానిక ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై పోటీ చేసేందుకు అనుమతి లభించింది. ఈసారి సత్తా చాటుతాం. – నల్లాల శ్రీనివాస్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడుప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుస్తాం. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఫార్వర్డ్ బ్లాక్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యం, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పన్నాగం రాబోయే ఎన్నికల్లో తేలిపోతుంది. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపి, అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ఫార్వర్డ్ బ్లాక్ పనిచేస్తుంది. ప్రజల మద్దతుతో ఫార్వర్డ్ బ్లాక్ను మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతాం – అంబటి జోజిరెడ్డి, ఏఐఎఫ్బీ రాష్ట్ర కన్వీనర్ -
శాశ్వత పరిష్కారం చూపాలి
మా కాలనీలో డ్రెయినేజీలు లేవు. మేమే కచ్చ డ్రెయినేజీలు నిర్మించుకున్నాం. చెత్త పేరుకుపోతే మేమే తొలగించుకుంటున్నాం. రోడ్లు సరిగ్గా లేవు. వర్షకాలం వచ్చిందంటే కాలనీ మొత్తం బురదమయం అవుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. – శ్రీనివాస్రెడ్డి, చంద్రంపేట, జ్యోతినగర్ అభివృద్ధికి దూరంగా.. సిరిసిల్ల పట్టణంలో విలీనమైన ఏడు గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. రోడ్లు, డ్రెయినేజీ, మంచినీటి సరఫరాలో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. – సందవేణి శ్రీనివాస్యాదవ్, రగుడు ఉపాధి అవకాశాలు కల్పించాలి గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు ఉపాధిహామీ పనులు ఉండేవి. ఎప్పుడైతే మున్సిపాలిటీలో విలీనం చేశారో అప్పటి నుంచి ఉపాధిహామీ పనులు నిలిచిపోయాయి. ఫలితంగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విలీన గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలి. – సలేంద్రి బాలరాజు, పెద్దూరు -
చిక్కరు.. దొరకరు!
సిరిసిల్ల: మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేసిన స్వ తంత్ర, రెబల్ అభ్యర్థులు ప్రధాన పార్టీల వారికి చి క్కకుండా.. దొరకకుండా తిరుగుతున్నారు. కొంద రు స్వతంత్రులు నామినేషన్ వేసిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుండగా.. రెబల్స్, స్వతంత్రులను తప్పించేందుకు పార్టీల అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉపసంహరణ గడువు ముగిసేదాకా చిక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. ఏకగ్రీవాలకు ఎత్తులు జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏకగీవ్రం కోసం పావులు కదుపుతున్నారు. పోటీలో ఉన్న ప్రత్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో వార్డులో ఒకే పార్టీకి చెందిన వారు ఒకటికి మించి నామినేషన్లు వేశారు. 2020లో మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్లలో నాలుగు వార్డులు, వేములవాడలో ఒక్క వార్డు ఏకగ్రీవమైంది. బీ–ఫామ్ ఇస్తేనే పార్టీ గుర్తులు అభ్యర్థులు మంగళవారం సాయంత్రంలోగా పార్టీ బీఫామ్స్ అందించాల్సి ఉంటుంది. బీ–ఫామ్ రాని వారు రెబల్గా బరిలో మిగిలిపోతారు. వీరికి ఇతర గుర్తులను ఎన్నికల అధికారులు కేటాయిస్తారు. బరిలో నిలిచిన వారు.. వారికి వచ్చిన గుర్తులతో బుధవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మాట వినకుంటే వేటే ! తిరుగుబాటు అభ్యర్థులు పార్టీకి తలనొప్పిగా మారారని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ప్రధాన పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగి రెబల్స్కు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మాట వినకుంటే పార్టీ నుంచి బహిష్కరించాలనే నిర్ణయంతో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈక్రమంలో సొంత పార్టీ నేతలే నష్టం చేస్తే బహిష్కరణ తప్పదని హెచ్చరిస్తున్నారు.మున్సిపాలిటీ వార్డులు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సిరిసిల్ల 39 129 117 97 వేములవాడ 28 40 50 38 -
సాంఘికశాస్త్రం.. సమాజాన్ని మలిచే విజ్ఞానం
● డీఈవో బి.జగన్మోహన్రెడ్డి సిరిసిల్లటౌన్: సాంఘికశాస్త్ర పరిజ్ఞానం విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేస్తుందని జిల్లా విద్యాధికారి బి.జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ను గీతానగర్ హైస్కూల్లో నిర్వహించారు. ఈసందర్బంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల దశలోనే జీవిత గమ్యాన్ని నిర్ధేషించుకోవాలని సూచించారు. ఈ పోటీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 72 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలకు నగదుతోపాటు ప్రశంసాపత్రాలు అందించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులు ప్రతిభ చూపి జిల్లా పేరును నిలబెట్టాలన్నారు. రాష్ట్రస్థాయికి ఇంగ్లీష్ మీడియం నుంచి.. టి.ఐశ్వర్య(జెడ్పీహెచ్ఎస్ మూడపల్లి), బి.ప్రణవి(జెడ్పీహెచ్ఎస్ నామాపూర్), ఎ.లిఖిత్కుమార్(నెహ్రూనగర్), తెలుగు మీడియం నుంచి.. ఎ.రమ్య(బాలికల హైస్కూల్ వేములవాడ), ఎండీ.అంజద్(బాలికల హైస్కూల్ వేములవాడ), ఎన్.గాయత్రి(హైస్కూల్ వేములవాడ) ఎంపికయ్యారు. రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి.. ఎన్.మహిత, ఎం.హర్షిణి, జి.అఖిల(రహీంఖాన్పేట) ఎంపికయ్యారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఎంఈవో దూస రఘుపతి, గీతానగర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం లోకిని శారద, జిల్లా సోషల్ ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి రవి, కె.రాజ్కుమార్ పాల్గొన్నారు. సిరిసిల్లఅర్బన్/సిరిసిల్ల ఎడ్యుకేషన్/ఇల్లంతకుంట: ఈనెల 4 నుంచి 6 వరకు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు సిరిసిల్ల మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఎంఈవో రఘుపతి తెలిపారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, తంగళ్లపల్లి, గంభీరావుపేట, మండలాలతో కలిపి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మానకొండూర్ నియోజకవర్గస్థాయి సీఎం కప్ క్రీడాపోటీలు గాలిపెల్లి హైస్కూల్ మైదానంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వై.శశికళ తెలిపారు. ఆన్లైన్లో పేరు నమోదు చేసుకున్న క్రీడాకారులు హాజరుకావాలని తెలిపారు. వేములవాడ: రాజన్న, భీమన్నలను దర్శించుకుని స్వామి వారి హుండీలలో వేసిన కట్నాలు, కానుకలను లెక్కించేందుకు ఆలయ అధికారులు ఈనెల 5న భీమేశ్వర సదన్లోని పార్కింగ్ స్థలంలో ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలని ఈవో రమాదేవి కోరారు. సిరిసిల్లటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం పార్టీలు, నేతలు అందించే డబ్బు, మద్యం పంపిణీని ప్రజలు తిరస్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్బాబు కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీస్లో సోమవారం పార్టీ అభ్యర్థులకు బీఫామ్స్ అందించి మాట్లాడారు. ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, నాయకులు జవ్వాజి విమల, కోడం రమణ, రాపల్లి రమేశ్, ఎలిగేటి రాజశేఖర్, సూరం పద్మ, గురిజాల శ్రీధర్, శ్రీరాముల రమేశ్చంద్ర పాల్గొన్నారు. జాతీయస్థాయిలో మెరిసిన అశోక్సిరిసిల్లటౌన్: జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో జిల్లా వాసి మూడు కాంస్య పతకాలు సాధించారు. ఈనెల 2న రాజస్థాన్లోని అజ్మీర్లో నిర్వహించిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్మీట్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన కడారి అశోక్ 10 కిలోమీటర్లు, హైజంప్, లాంగ్జంప్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సురేశ్కుమార్శర్మ, మాజీ డీఐజీ రాకేశ్జోషి చేతులమీదుగా పతకాలు అందుకున్నారు. -
స్వతంత్రులకు గుర్తుల గుబులు !
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే ఇండిపెండెంట్స్(స్వతంత్రులు) అభ్యర్థులకు కేటాయించే గుర్తులు తికమకపెట్టనున్నాయి. స్వతంత్రులకు కే టాయించే 75 గుర్తులతో కూడిన జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎయిర్ కండిషనర్, యాపిల్, పండ్లబుట్ట, బ్యాట్, బాటరీ టార్చి, బైనాక్యులర్స్, సీసా, బ్రెడ్, బకెట్, కెమెరా, క్యారమ్బోర్డు, చెయిన్, కుర్చీ, చపాతి రోలర్, కోటు, కొ బ్బరితోట, మంచం, కప్పుసాసర్, కటింగ్ ప్లేయర్ వంటి గుర్తులతో పాటు ఎవరూ గుర్తుపట్టని విధంగా కవరు, పిల్లనగ్రోవి, డంబెల్స్, ద్రాక్షపండ్లు, పచ్చిమిర్చి, అగ్గిపెట్టె, పెన్డ్రైవ్, ఊలు, సూది, టూత్పేస్ట్, వాల్నట్ వంటి గుర్తులను ఇచ్చారు. 75 గుర్తుల్లో చాలామటుకు ఒక్కటిని పోలినట్లు మరొకటి ఉండడం విశేషం. బ్యాట్, బాటరీ టార్చ్ ఒకేలా కనిపిస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ బ్యాలెట్ పత్రాలు కావడంతో ఈ గుర్తులను గుర్తించడం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
పట్టణంలో చిక్కిన పల్లెలు
● కనిపించని అభివృద్ధి ● కనీస వసతులు కరువు ● పట్టించుకోని పాలకులుసిరిసిల్ల అర్బన్: మున్సిపాలిటీలో విలీనమైతే వసతులు దరిచేరుతాయని ఆశపడ్డారు. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశించారు. కానీ స్థానికుల ఆశలు అడియాసలయ్యాయి. ఉన్న ఉపాధిహామీ పథకం మూలకుపడింది. వసతుల మాట పాలకులు ఎత్తనే లేదు. మున్సిపాలిటీలో విలీనం కాక ముందు గ్రామపంచాయతీలుగా ఉన్న రోజుల్లోనే తమ కాలనీల్లో పరిస్థితులు బాగుండేవని స్థానికులు పేర్కొంటున్నారు. ఏడేళ్ల క్రితం సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూరు, సర్ధాపూర్ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కరువయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విలీన గ్రామాల్లోని పరిస్థితులపై సాక్షి ఫోకస్. పడకేసిన పారిశుధ్యం పనులు విలీన గ్రామాల్లో డ్రెయినేజీలు సరిగా లేవు. చెత్తసేకరణ సరిగ్గా చేపట్టకపోవడంతో శివారుకాలనీలతో పాటు విలీన గ్రామాల్లో పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా మారాయి. ప్రధానంగా విలీన గ్రామాలైన చంద్రంపేట, జ్యోతినగర్, రగుడు, రాజీవ్నగర్, బోనాల, పెద్దూరు, బాబాజీకాలనీలు అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. డ్రెయినేజీలు, బీటీ, సీసీ రోడ్లు అసలే లేవు. మట్టిరోడ్లు.. వాటిపై పారుతున్న మురుగునీటితో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయని విలీన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చంద్రంపేటలో మట్టిరోడ్డు, పక్కనే మురికికూపంపిచ్చిమొక్కలతో జ్యోతినగర్లోని అంతర్గతరోడ్డు -
నిత్య సాధనతోనే విజయం
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ‘పది’ విద్యార్థులకు ప్రేరణ తరగతులు ప్రారంభంసిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై నిత్యం సాధన చేస్తేనే విజయం సాధిస్తారని కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హాస్టళ్లలోని పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ‘ప్రేరణ’ అవగాహన తరగతులకు సోమవారం శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రేరణను ప్రారంభించారు. కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమన్నారు. ఇప్పుడు వచ్చిన మార్కులు భవిష్యత్ చదువులకు ఉపయోగపడతాయన్నారు. పరీక్షల టైమ్టేబుల్ సిద్ధం చేసుకోవాలని, అందుకు అనుగుణంగా చదవడం, రాయడం పూర్తి చేయాలని సూచించారు. అందరూ విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్, ఏఎస్డబ్ల్యూవో విజయలక్ష్మి పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సర్వీస్, పీడీ ఓటర్లు, ఎన్నికల సిబ్బంది ఓటుహక్కును వినియోగించుకోవడానికి సిరిసిల్ల, వేములవాడల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్పై అధికారులకు సోమవారం శిక్షణ ఇచ్చారు. అనంతరం ఎన్నికల కౌంటింగ్ అఽధికారులు, సిబ్బందికి సంబంధించి ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, లక్ష్మీరాజం, జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
రాష్ట్రానికి మొండిచేయి
వేములవాడ: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేకసార్లు ప్రధానిని కలిసి విన్నవించినా రాష్ట్రాన్ని విస్మరించారు. రీజినల్ రింగ్ రోడ్డు, మూసి అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు నిధులు కేటాయించారు. క్రీడారంగంలోనూ తెలంగాణకు కేటాయింపులు లేవు. రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా నిధులు సాధించలేకపోవడం బాధాకరం. – ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్ -
సంక్షేమం, అభివృద్ధి
కరీంనగర్: ఆర్థిక క్రమశిక్షణతో దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించే బడ్జెట్. ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు, రక్షణ, రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది. ‘గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’గా భారతదేశం ఎదగడంలో హైదరాబాద్ కీలకపాత్ర వహిస్తుంది. వికసిత్ భారత్ రూరల్ అజీవికా మిషన్ – గ్రామీణ్ నిధులు పెంచాం. ఉచితం కంటే ఉపాధి అవకాశాలు కల్పించడమే బడ్జెట్ లక్ష్యం. – బండి సంజయ్కుమార్, కేంద్ర సహాయమంత్రి -
మున్సిపల్ ఖజానా గలగల
● సిరిసిల్లలో రూ.31.02 లక్షలు ● వేములవాడలో రూ.6.15 లక్షలు వసూలుసిరిసిల్ల: ఆస్తిపన్ను.. నల్లా పన్నులు చెల్లించాలని మున్సిపల్ సిబ్బంది ఇంటి చుట్టూ తిరిగినా వసూలు కాని రోజులు చూశాం. కానీ మున్సిపల్ ఎన్నికలు రావడంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో బకాయి పన్నులు వసూళ్లు అయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి నామినేషన్ను ప్రతిపాదించే వ్యక్తులకు సంబంధించిన పన్నులు బకాయి ఉండొద్దనే నిబంధనలు ఉన్నాయి. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా మున్సిపల్ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సిరిసిల్ల మున్సిపాలిటీలోని 39 వార్డులకు నామినేషన్లు వేసిన 240 మంది అభ్యర్థులు మరో 240 మంది ప్రతిపాదించే వ్యక్తులు 880 మంది ఇంటి పన్నులను, నల్లా పన్నులను చెల్లించారు. దీంతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఆస్తిపన్నులు రూ.14 లక్షలు, నల్లాపన్నులు రూ.16లక్షలు, ఇతర పన్నులు రూ.లక్ష వసూలైంది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 28 వార్డుల్లో నామినేషన్ వేసిన 150 మంది అభ్యర్థులతోపాటు మరో 150 మంది ప్రతిపాదించే వ్యక్తులు మొత్తం 300 మంది తమ ఇంటి పన్నులను చెల్లించారు. ఇంటి పన్నుల రూపంలో రూ.3.83 లక్షలు వసూలు కాగా.. నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీకి రూ.2.32 లక్షలు వసూలయ్యాయి. వేములవాడ మున్సిపల్ పరిధిలో రూ.6.15 లక్షల మేరకు పన్నులు చెల్లించారు. వేములవాడ మున్సిపాలిటీలో నల్లా పన్నులను వసూలు చేయలేదు. ఫలితంగా కొంత మేరకు తక్కువ పన్నులు వసూలయ్యాయి. వాస్తవానికి ఎన్నికల నిబంధనల్లో నల్లా పన్నులు చెల్లించాలనే నిబంధన లేదు. కానీ సిరిసిల్ల మున్సిపల్ అధికారులు నో డ్యూస్ ఇచ్చేందుకు నల్లా బకాయిలు చెల్లించాలనే నిబంధనను విధించడంతో నల్లాల బకాయిలకు మోక్షం లభించింది. వేములవాడలో నిబంధనల మేరకు ఆస్తి పన్నులను మాత్రమే వసూలు చేశారు. ఎన్నికలు లేకుంటే 2026 మార్చి నెలాఖరులోగా ఇంటి చుట్టూ బిల్ కలెక్టర్లు తిరిగితే చెల్లించే పన్నులు ఎన్నికల పుణ్యమానీ ముందే వసూలు కావడం విశేషం. -
కల్యాణం.. కమనీయం
సనుగులలో కల్యాణ వేడుకకు హాజరైన భక్తులుముస్తాబాద్లో కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు, సనుగులలో హాజరైన భక్తులుచందుర్తి/ముస్తాబాద్: చందుర్తి మండలం సనుగుల శ్రీగోవిందరాజుల కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ దాత, శాశ్వత చైర్మన్ ఉప్పుగంటి శోభలత–గోవిందరావు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టువస్త్రాలు అందజేశారు. కల్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలతోపాటు హైదరాబాద్, కరీంనగర్లో స్థిరపడ్డ ఈ ప్రాంత ప్రజలు తరలివచ్చారు. స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్ఎస్ వేములవాడ నియోజవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, సర్పంచ్ బొడిగే లావణ్య, ఉపసర్పంచ్ శనిగరపు స్వామి, రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, చందుర్తి మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, సనుగులు సింగిల్ విండో మాజీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి దర్శించుకున్నారు. ముస్తాబాద్లో.. బందనకల్ వాసుదేవ ఆశ్రమం వార్షికోత్సవం సందర్భంగా రుక్మిణి, వేణుగోపాలస్వామి కల్యాణం నిర్వహించారు. అర్చకులు రామశర్మ, రాజేందర్శర్మ ఆధ్వర్యంలో కల్యాణోత్సవం నిర్వహించారు. సర్పంచులు చిగురు నరేశ్, మట్ట వెంకటేశ్వర్రెడ్డి, వెంకట్రెడ్డి, కార్తీక్రెడ్డి పాల్గొన్నారు. -
ఎగసిన నిరసన జ్వాలలు
సిరిసిల్లటౌన్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై సిరిసిల్లలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం కార్మికక్షేత్రంలోని అన్ని వాడలలో నిరసన ర్యాలీలు, నల్లజెండాలతో ప్రదర్శనలు చేపట్టారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో పట్టణంతో పాటు వివిధ మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలో బైక్ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తుల ఉమ ఆధ్వర్యంలో రగుడు చౌరస్తాలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ తగులపెట్టారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, రాష్ట్ర నాయకులు బొల్లి రామ్మోహన్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. గొర్రె తలకాయతో వినూత్న నిరసనఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంపై ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లో వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రామ కూడలిలో గొర్రెతలకాయతో కూడిన సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసనలో పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్విండో మాజీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 13 మందిపై కేసు రాచర్లబొప్పాపూర్లో గొర్రె తలకాయను సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మకు పెట్టి దహనం చేసిన ఘటనపై 13 మందిపై కేసు పెట్టినట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వరుస కృష్ణహరితోపాటు మరో 12 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మండల యాదవ సంఘం అధ్యక్షుడు మండే శ్రీను ఆధ్వర్యంలో యాదవ కులస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దయచూపని నిర్మలమ్మ
ఉమ్మడి జిల్లాకు దక్కని ప్రత్యేక హామీలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్రప్రభుత్వం ఆదివా రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27లో ఉమ్మడి జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు కేటాయింపులపై ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు రానప్పటికీ.. నేడో, రేపో వాటిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్దది. అలాంటి ప్రాజెక్టుకు కేటాయింపులపై ప్రకటన రాలేదు. అదే సమయంలో ప్రతిష్టాత్మక రాఘవాపురం–మణుగూరు, హసన్పర్తి – కరీంనగర్, నిజామాబాద్ – కరీంనగర్ – పెద్దపల్లి డబ్లింగ్, పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ వర్క్స్ కేటాయింపులపై ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. పింక్ బుక్ విడుదల ఈసారి లేకపోవడంతో నిధుల కేటాయింపుపై ఇప్పటివరకు తమకు సమాచారం లేదని, తాము కూడా కేంద్ర రైల్వేమంత్రి విలేకరుల సమావేశం కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి జోన్ల వారీగా నిధుల కేటాయింపులపై వివరాలు త్వరలోనే విడుదలవుతాయని పేర్కొన్నారు. గతేడాది ఉమ్మడి జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులకు రూ.435 కోట్లు కేటాయించగా.. ఈసారి ఎంత అనేది ఆసక్తిగా మారింది. -
గాలికొదిలేసిన పనులను గాడిలో పెట్టాం
● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: పదేళ్ల పాలనలో గాలికి ఒదిలేసిన పనులను తాము రెండేళ్లలో గాడిలో పెట్టామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడను టెంపుల్ సిటీగా మార్చేందుకు ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. స్థానిక ఎస్ఆర్ఆర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. పార్టీ సూచించిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్లకు అవకాశం ఇస్తే అభివృద్ధిని విస్మరించారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేములవాడలో చేసిన అభివృద్ధి పనులను బేరీజు వేసుకోవాలని పట్టణ ప్రజలను కోరారు. రూ.10కోట్లతో మూలవాగులో గుడి చెరువులో డ్రెయినేజీ నీరు కలవకుండా పనులు చేస్తున్నామన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, 28 వార్డుల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
సిరిసిల్ల: కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదివారం తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు ప్రజావాణి ఉండదని స్పష్టం చేశారు. అందుబాటులోకి ఫర్టిలైజర్ యాప్ సేవలు సిరిసిల్ల: రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం ఆదివారం కోరారు. ఈ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఫర్టిలైజర్ యాప్ను రైతులు డౌన్లోడ్ చేసుకొని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆలయ కమిటీకి సన్మానం తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని మండెపల్లి సమ్మక్క–సారలమ్మ ఆలయ కమిటీని ఆదివారం శ్రీమల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. సర్పంచ్ గదగోని సాగర్, ఆలయ కమిటీ చైర్మన్ కడారి రాంరెడ్డి, సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. ‘యాదవుల మనోభావాలు పట్టించుకోరా?’ సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ నేతలు గొర్రె తలకాయను రేవంత్రెడ్డి దిష్టిబొమ్మకు తగిలించి నిరసన చేపట్టడం సరికాదని.. ఇది యాదవుల మనోభావాలు దెబ్బతీయడమేనని యాదవ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్ మాట్లాడారు. యాదవుల మనోభావాలు దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్, కేటీఆర్లను కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జడల రవీందర్, వాసం మల్లేశం, మాసం భాస్కర్, జడల అరవింద్, అన్నబోయిన మల్లికార్జున్, తాడెం శ్రీనివాస్ పాల్గొన్నారు. మహాజాతర పనులు వేగవంతం చేయండివేములవాడ: మహాశివరాత్రి జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఈవో రమాదేవి సూచించారు. తన చాంబర్లో ఆదివారం సమావేశమయ్యారు. సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ఆలయ ఉద్యోగులు సమన్వయంతో విధులు నిర్వహించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూశారని అభినందించారు. ఈ అనుభవంతో మహాశివరాత్రి జాతరను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు. కార్మికులను బానిసలుగా మారుస్తున్నారు తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను నీరుగార్చి, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు విమర్శించారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఆదివారం నిర్వహించిన సుతారి సంఘం సమావేశంలో మాట్లాడారు. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా చేస్తున్నారని మండిపడ్డారు. తోట కనకయ్య, సుతారి సంఘం నాయకులు పాల్గొన్నారు. -
మున్సిపల్పై కాషాయజెండా ఎగురవేద్దాం
● మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో కాషాయజెండా ఎగురవేయాలని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కోరారు. వేములవాడలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాషాయజెండా ఎగురవేయడానికి అనుకూలంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రధాని నరేంద్రమోదీ రాజన్న దర్శనం చేసుకున్న క్షేత్రం కాబట్టి పట్టణ ప్రజలు బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయి న గోపి, జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్, నాయకులు శంకర్, సిరికొండ శ్రీనివాస్, బండ మల్లేశం, గోపు బాలరాజు, కృష్ణస్వామి, సత్తయ్య పాల్గొన్నారు. -
కార్యకర్తలను కాపాడుకుంటాం
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతంగళ్లపల్లి(సిరిసిల్ల): పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. కేసీఆర్ సిట్ విచారణకు నిరసనగా ఆదివారం చేపట్టిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ సారంపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత గుగ్గిళ్ల భూమలింగంగౌడ్ను పరామర్శించి మాట్లాడారు. భౌతిక దాడులకు దిగడం పిరికిపంద చర్య అన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, పుర్మాని రాజశేఖర్రెడ్డి, కోడి అంతయ్య, సింగిరెడ్డి రవీందర్రెడ్డి, మాట్ల మధు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్య
● డీఐఈవో శరత్కుమార్ సిరిసిల్లటౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రైవేటుకు ధీటుగా మెరుగైన విద్య అందుతుందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సీహెచ్.శరత్కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన కరపత్రాలను శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పెంచడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. డిగ్రీ కళాశాల అడ్మిషన్ ఇన్చార్జి జి.శ్రీధర్రావు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసాద్, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు నర్సయ్య పాల్గొన్నారు. సిరిసిల్ల: జిల్లాలోని ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థుల నుంచి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎస్సీడీవో రవీందర్రెడ్డి శనివారం కోరారు. 2026 విద్యాసంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహిస్తున్న శ్రీఅంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ ద్వారా ఎస్సీ విద్యార్థులకు రూ.20లక్షలు స్కాలర్షిప్ అందిస్తారని తెలిపారు. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్ దేశాల్లోని యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో చదువాలనుకునే ఎస్సీ విద్యార్థులు మార్చి 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 79893 84801లో సంప్రదించాలని కోరారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్ రామాలయం అర్చకుడు వేణుగోపాలాచారి శనివారం జాతీయ కామధేను పురస్కారం అందుకున్నారు. నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో కేవీ రమణాచారి చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు. తెలంగాణ నుంచి భద్రాచలం అర్చకులతోపాటు ఎల్లారెడ్డిపేటకు చెందిన వేణుగోపాలాచారికి ఈ పురస్కారం దక్కింది. సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: మేరా యువభారత్ బీసీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నర్సింగ్ కళాశాలలో శని వారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మై భారత్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వెంకట రాంబాబు మాట్లాడారు. 18 ఏళ్లు దా టిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, గంగిపల్లి స్వామి, పూసాల సంతోష్, నెల్లిమెల రజనీకాంత్, ధనుష్ పాల్గొన్నారు. మైనర్లు వాహనాలు నడపొద్దువేములవాడ: మైనర్లు బైక్లు నడపడం ద్వారా ప్రమాదాలు జరుగుతాయని.. ఇందుకు తల్లిదండ్రులు బాధ్యతవహించాల్సి వస్తుందని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్ నిబంధన పాటించకుండా ప్రమాదకరంగా వాహనాలు నడిపిన వారికి శనివారం స్థానిక ఠాణాలో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒకే బైక్పై ఐదుగురు మైనర్లు అతివేగంగా తిరగడాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇలాంటి చర్యలు ప్రాణాలకే ముప్పు అన్నారు. మైనర్లు వాహనాలు నడపడం మోటారు వాహన చట్టం ప్రకారం నేరమన్నారు. ట్రాఫిక్ ఎస్సై సముద్రాల రాజు, పేరెంట్స్ ఉన్నారు. -
● కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్
రెండో విడత ర్యాండమైజేషన్సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్, మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి పర్యవేక్షణలో కలెక్టరేట్లో రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ శనివారం పూర్తి చేశారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఎన్నికల విధుల నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ చేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, జగన్మోహన్రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, భారతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రాయబేరాలు
బుజ్జగింపులు...సిరిసిల్ల: బుజ్జగింపుల పర్వం మొదలైంది. నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు రాయబేరాలు ప్రారంభించారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉండడంతో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పోటీచేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులను బుజ్జగించేందుకు వారి సన్నిహితులతో పావులు కదుపుతున్నారు. సిరిసిల్లలో 429, వేములవాడలో 260 నామినేషన్లు వేశారు. వేములవాడలో 29, సిరిసిల్లలో 59 మంది స్వతంత్రులు నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పోటీ నుంచి తప్పించే ప్రయత్నిస్తున్నారు. బరిలో దిగాలా... బందుకు జరగాలా ! కౌన్సిలర్లుగా పోటీ చేసి రాజకీయంగా ఎదగాలనే ఆశతో చాలా మంది నామినేషన్లు వేశారు. ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రత్యర్థులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రత్యర్థులకు భారీ నజరానాలు ఆఫర్ చేస్తున్నారు. ఎన్నికల ఖర్చు భరించడం ఇబ్బంది అవుతుందని బరిలో ఉండాలా? వద్దా? అనే ఆలోచనలో కొందరు పడ్డారు. ఎదుటి వారు ఇచ్చే ఆఫర్లు తీసుకొని పక్కకు జరగాలనే ఆలోచనలో మరికొందరు ఉన్నట్లు సమాచారం. రంగంలోకి ముఖ్యనాయకులు అభ్యర్థుల జాబితా ఆధారంగా ముఖ్యనాయకులు బుజ్జగింపులకు రంగంలోకి దిగారు. సాధ్యమైనన్ని వార్డుల్లో ఏకగ్రీవాలతో ముగించాలని ప్రధాన పార్టీల నాయకులు భావిస్తున్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, వేములవాడలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో సిరిసిల్లలో మూడు కౌన్సిలర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈసారి కూడా అదే పట్టుదలతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్రులు కూడా ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రత్యర్థులపై ప్రలోభాల వల విసురుతున్నారు. తప్పుకుంటే భవిష్యత్లో పదవులు ఇస్తామని, కాంట్రాక్టు పనులు అప్పజెప్పుతామని, పార్టీలో ప్రాధన్యమైన పదవులు అందిస్తామని ఆఫర్లతో చర్చలు సాగిస్తున్నారు.‘అన్నా.. నువ్వు గెల్సుడు గ్యారంటీ. మొన్నటిసారి మన వార్డుల గంత కష్టపడినం. కొద్దిల మిస్సయింది. ఈసారి మాత్రం గెలుపు మనదే. పోటీల ఉండుడే. నువ్వు గెల్వకుంటే మేం గుండు గీయించుకుంటం. మావోడైతే మీసాలే గీయించుకుంటానని చెప్తుండు’... నామినేషన్లు వేసిన అభ్యర్థుల వద్ద అనుచరులు చెబుతున్న మాటలు. నమ్మినబంటుగా ఉండే ద్వితీయశ్రేణి నేతలు వీధులవారీగా వార్డుల్లో ఓట్లు అంచనా వేస్తూ భారీ మెజార్టీ కళ్లముందు ఉంచుతున్నారు. సన్నిహితుల మాటలకు ఒకింత సంబరంగా ఉన్నా.. లోలోన మాత్రం తెలియని భయం అభ్యర్థిని వెంటాడుతోంది. గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుందంటూ అనుచరులను ఆరా తీస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉండడంతో అభ్యర్థుల వద్ద వారి అనుచరులు గొప్పలు చెబుతున్నారు. అన్నో నిన్నే నమ్ముకుని పది రోజులుగా పనిచేస్తున్నం. ఇప్పుడు నువ్వు తప్పుకుంటే మా గతి అటు.. ఇటు కాకుండా పోతది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుచరుల మాటలను అంచనా వేస్తూ ఎన్నికల్లో అయ్యే ఖర్చులను లెక్కిస్తూ అభ్యర్థులు డైలమాలో ఉన్నారు. అనుచరులు మాత్రం అభ్యర్థుల్లో నమ్మకం కలిగిస్తూ మందు, విందులు చేసుకుంటున్నారు. -
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
సిరిసిల్ల: రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా 2వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ దేశ భవిష్యత్ పిల్లలపైనే ఉందన్నారు. రాబోయే తరంలో రోడ్డు ప్రమాదాలు లేని సమాజాన్ని స్థాపించాలన్నారు. రోడ్డు మాది.. భవిష్యత్ మీది.. వేగంగా వెళ్లవద్దని సూచించారు. జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. మద్యం సేవించి, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపరాదన్నారు. బతుకమ్మ ఘాట్ నుంచి పాతబస్టాండ్ మీదుగా అంబేడ్కర్చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రతిజ్ఞ చేశారు. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి, సిరిసిల్ల టౌన్ సీఐ కె.కృష్ణ, సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి రజనీ, పృథ్వీరాజ్వర్మ, ఆర్టీఏ సిబ్బంది రమ్య, సౌమ్య, ప్రశాంత్, యెల్లెశ్ పాల్గొన్నారు. -
● జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగుతోందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో ఓటర్ జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూ సర్టిఫికెట్, హెల్ప్ డెస్క్, అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషాకు సూచించారు. డీఈవో జగన్మోహన్రెడ్డి, మెప్మా అధికారి మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేశ్కుమార్, సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ, మాస్టర్ ట్రైనర్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. ‘లింగ నిర్ధారణ’ చేస్తే కఠిన చర్యలు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ సెంటర్లు, కొత్త ప్రైవేట్ దవాఖానాలకు అనుమతులు, నవజాత శిశు మరణాలపై వైద్య, ఆరోగ్య, సంక్షేమ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు. భ్రూణ హత్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి, సంక్షేమాధికారి లక్ష్మీరాజం, అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్ శోభారాణి, ఎన్జీవో ప్రతినిధి భాస్కర్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ రెండో జాబితా
● పొద్దంతా సమీక్షించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీలో పోటీ చేసే పది మందితో రెండో జాబితాను బీఆర్ఎస్ గురువారం రాత్రి ప్రకటించింది. తొలి విడతలో బుధవారం 18 మంది పేర్లు ప్రకటించగా.. రెండో విడతగా మరో 10 మంది పేర్లను ప్రకటించారు. 1వ వార్డులో బూర బాలు, 2లో వేముల రాములు, 4లో అడ్డగట్ల మాధవి బాలకిషన్, 6లో దూడం రజని శ్రీనివాస్, 14లో అడ్డగట్ల మాధవి మురళి, 19లో అన్నారం శ్రీనివాస్, 22లో కత్తెర వరుణ్, 33లో దార్ల అశోక్, 34లో దార్ల సందీప్, 38లో రిక్కుమల్ల రజిత సంపత్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారు. పొద్దంతా కేటీఆర్ సమీక్ష పట్టణ బీఆర్ఎస్ నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొద్దంతా సమీక్షించారు. వార్డుల్లో పోటీ నెలకొనడంతో సయోధ్య కుదిర్చారు. పలువార్డుల నాయకులు పార్టీ టిక్కెట్లు ఆశిస్తూ జనంతో తెలంగాణ భవన్కు బలప్రదర్శనకు రావడం విశేషం. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా.. ఇప్పటికే 28 మందిని ప్రకటించారు. ఇంకా 11 వార్డుల జాబితా పెండింగ్లో ఉంది. బీఆర్ఎస్లో చేరి టిక్కెట్ పొంది 1వ వార్డు రగుడుకు చెందిన బూర బాలు బీఆర్ఎస్లో చేరి టిక్కెట్ సాధించారు. 6వ వార్డు టిక్కెట్ను దూడం రజనీ, శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి బీ ఆర్ఎస్లో చేరారు. మున్సిపల్ ఇన్చార్జి తుల ఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, కేడీసీసీబీ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిందం చక్రపాణి, చీటి నర్సింగరావు, రామ్మోహన్, వేణు పాల్గొన్నారు. -
ఉడ్తి పతంగ్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మజ్లిస్ –ఎ–ఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) సత్తా చా టేందుకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పలుమార్లు సత్తా చాటుకున్న ప తంగ్ పార్టీ మరోసారి విజయబావుటా ఎగరేసేందుకు సన్నద్ధమవుతోంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తగినన్ని సీట్లు సంపాదించి కింగ్మేకర్ కావాలని ప్రణా ళికలు రచిస్తోంది. తన సుదీర్ఘ రాజకీయ మిత్రపార్టీ అయిన కాంగ్రెస్తో మరోసారి జట్టు కట్టేందుకు లేదా అవగాహనతో ముందుకు వెళ్లేందుకు పావులు కదుపుతోంది. రెండు దశాబ్దాలుగా కరీంనగర్ కా ర్పొరేషన్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో చెప్పుకోదగ్గ స్థానాల్లో ఉనికి చాటుకుంటూ వస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అసెంబ్లీ, బల్దియా ఎన్నికల్లో వీరి పొత్తు అనివార్యం అయ్యేలా చక్రం తిప్పడం ఆ పార్టీకే చెల్లింది. కరీంనగర్లో కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎంఐఎం పార్టీ 2005లో తొమ్మిది కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది. 2014లో రెండు కార్పొరేటర్లకు పరిమితమైంది. 2020లో పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో 10 సీట్లకు పోటీచేసి ఏడు సీట్లు గెలుచుకుంది. ఒక కో–ఆప్షన్ను బీఆర్ఎస్తో పొత్తులో భాగంగా కైవ సం చేసుకుంది. ఒకప్పటిలా ముస్లిం మైనార్టీలకే పరిమితం కాలేదు. హిందువులు మెజారిటీ ఉన్న చోట్ల వారినే నిలబెట్టి గెలిపించుకునేలా వ్యూహాలు రచించడం ఆ పార్టీకి కొత్తేమీ కాదు. హైదరాబాద్లో విజయవంతమైన ఈ ఫార్ములా రాష్ట్రంలో అన్ని చోట్లా అమలు పరుస్తోంది. కరీంనగర్లో 40 డివి జన్లలో కమిటీలు ఏర్పాటు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని ఈసారి 20 చోట్ల పోటీ చే స్తోంది. ఇందులో కనీసం 15 స్థానాలు గెలుచుకొని కరీంనగర్ కార్పొరేషన్లో కింగ్మేకర్ పాత్రను పోషి స్తూ.. మూడు లేదా నాలుగు కోఆప్షన్లును కైవసం చేసుకునేలా పావులు కదుపుతోంది. మొన్న బిహార్ ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం నిన్న మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 125 మంది కార్పొరేటర్లను గెలుచుకొని సత్తా చాటింది. అదే ఊపుతో తెలంగాణలోని నిజా మాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, బోధన్లో పాగా వేసేందుకు కసరత్తు చేస్తోంది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో 2020లో జగిత్యాలలో రెండు, కోరుట్లలో రెండు చొ ప్పున కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుంది. మెట్పల్లిలో ఒకటి, పెద్దపల్లిలో రెండు కౌన్సిలర్ సీట్లను కైవస చేసుకుంది. రామగుండంలో ఎంఐఎం మద్దతుతో పలువురు విజయం సాధించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒకరిద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లకు అవినీతి బంధుప్రీతి పార్టీ నియమావళి ఉల్లంఘన తదితర కారణాలతో టికెట్లు ఖరారు చే యలేదని సమాచారం. ఒకప్పుడు ఎంఐఎం టికెట్ కోసం పెద్దగా పోటీ ఉండేది కాదు. కానీ ప్రస్తుతం రాజకీయ వలసలు, ముస్లిం దళిత సామాజిక వర్గాల్లో వచ్చిన స్పందనతో డిమాండ్ పెరిగిపోయింది. ఎంఐఎం అధినేత ఎంపీ అసద్ ఆదేశాల మేరకు అన్ని డివిజన్లలో మూడు రకాల సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి ఎలాగైనా 15 స్థానాల్లో గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధపడుతోంది. -
పైసలే ఫైనల్
● అభ్యర్థి ఆర్థిక బలాబలాలపై ఆరా వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల బలాబలాలు లెక్కించే క్రమంలో పార్టీ అధినేతలు ఆర్థిక బలాన్నే ప్రధానం చూస్తున్నారు. అ భ్యర్థికి ఏపాటి పేరుందో కాదు.. ఏమాత్రం పైసలు ఖర్చు చేయగలడో ఆరా తీస్తున్నారు. వే ములవాడ మున్సి పల్ పరిధిలో అన్ని పార్టీలు ఇదే మంత్రాన్ని జపిస్తున్నట్లు సమాచారం. ఈసారి టికెట్లు కన్ఫమ్ కావడంలో ప్రజలకు చేసిన సేవ కంటే ఎంత ఖర్చు పెట్టగలడనే లె క్కలు వేస్తున్నారు. సీనియర్ నాయకులు, స్థా నికంగా పేరు ఉన్నవారు టికెట్ కోసం ఎదురుచూస్తుంటే.. పార్టీ పెద్దలు మాత్రం ఏమాత్రం ఖర్చు పెడతారనే చూస్తున్నారని చర్చ సాగుతోంది. దీంతో కొందరు ఆశావహులు పార్టీలు మా రేందుకు అడుగులు వేస్తుండడం రాజకీయవర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఈ పని చేస్తాం.. ఆ పని చేస్తామంటూ ఒకప్పుడు అభ్యర్థులు ప్రచారం చేసే వారు. కానీ నేడు వారు ఎంత ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం మాకే వేయండంటూ అన్ని పార్టీల నాయకులు మాట్లాడుతుండడం ఎన్నికల్లో పైసలు ఎంత ప్రధానంగా మారాయో అర్థమవుతుంది.వేములవాడ: పట్టణాభివృద్ధికి బీజేపీతో కలసి రావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన డాక్టర్ నరేశ్, పల్లపు లక్ష్మణ్, వానిక సంపత్, మెరుగు లక్ష్మణ్, గంగరాజు, నర్సయ్య, బాబులకు పార్టీ కండువా కప్పారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పట్టణశాఖ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంటి మహేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యక్షులు శంకర్, వివేక్రెడ్డి పాల్గొన్నారు. వేములవాడఅర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ మండలం సంకెపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ను జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజుకుమార్ గురువారం తనిఖీ చేశారు. చెక్పోస్ట్ వద్ద రిజిస్టర్ను పరిశీలించారు. నోడల్ అధికారి గీత, నవీన్కుమార్, భారతి ఉన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రానున్న వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ డీఈఈలు పావని, రాము పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల పరిషత్లో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండలంలోని ప్రతీ గ్రామపంచాయతీలో ఎంపీవో, మిషన్ భగీరథ సహాయ ఇంజినీర్లు, పంచా యతీ కార్యదర్శులు, పంపు డ్రైవర్ కమిటీ సభ్యులతో కలిసి నీటి ఎద్దడిని గుర్తించి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎంపీడీవో సత్తయ్య, మండల పంచాయతీ అధికారి జోగం రాజు, మిషన్ భగీరథ సహాయక ఇంజినీర్ సంతోష్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మిషన్ భగీరథ పంపు డ్రైవర్లు పాల్గొన్నారు. వేములవాడ: స్టేట్ బార్ అసోసియేషన్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణకు వేములవాడ బార్ అసో సియేషన్ రూమ్లో ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారి పొత్తూరి అనిల్కుమార్, జడ్జి జ్యోతి ర్మయి, సూపరింటెండెంట్ ఆంజనేయులు, అడ్వకేట్ నక్క దివాకర్ గురువారం ఏర్పాట్లు పరిశీలించారు. 203 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 23 మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రాధాన్యత ఓటు హక్కును ఇంగ్లిష్లో క్యాపిటల్ లెటర్స్తో వన్, టూ, త్రీ, ఫోర్ ఇలా వేయాలని అనిల్కుమార్ తెలిపారు. -
‘చింతలఠాణా’ చిక్కుముడి వీడేదెన్నడో!
● ‘చితి’కిపోయిన వ్యక్తి సర్పంచ్గా ఎన్నిక ● ఉపసర్పంచ్కు రాని చెక్పవర్ ● గ్రామంలో పేరుకుపోతున్న సమస్యలు ● కలెక్టర్ను ఆశ్రయించిన పాలకవర్గంసిరిసిల్ల: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వేములవాడ అర్బన్ మండలం చింతలఠాణా సర్పంచ్గా మరణించిన వ్యక్తి గెలుపొందాడు. ఎన్నికల ప్రచార సమయంలో సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి డిసెంబర్ 3న గుండెపోటుతో చనిపోయాడు. డిసెంబర్ 11న జరిగిన ఎన్నికల్లో గ్రామస్తులు అతని గుర్తు కత్తెరకే ఓటు వేసి గెలిపించారు. గ్రామంలో ఐదుగురు బరిలో నిలవగా.. కొలపురి రాజమల్లుకు 358 ఓట్లు, చెర్ల మురళి(చనిపోయిన వ్యక్తి)కి 745, బడుగు శ్రీనివాస్కు 40, మంత్రి రాజలింగంకు 160, సురువు వెంకటికి 367 ఓట్లు వచ్చాయి. సురువు వెంకటిపై 378 ఓట్ల మెజార్టీతో మరణించిన మురళి గెలిచాడు. పల్లెల్లో పాలన మొదలై నెలదాటింది అన్ని గ్రామాల్లో నూతన పాలకవర్గాల పాలన డిసెంబరు 22, 2025న ప్రారంభమైంది. కానీ చింతలఠాణాలో ఉపసర్పంచ్గా గొట్ల కుమార్, వార్డు మెంబర్లు మరో తొమ్మిది మంది అదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఉపసర్పంచ్తో పాటు పాలకవర్గానికి ఎలాంటి బాధ్యతలను అధికారులు అప్పగించలేదు. దీనిపై జిల్లా అధికార అధికారులు ప్రభుత్వానికి నివేదించి వదిలేశారు. ఫలితంగా స్థానిక పాలన లేక చింతలఠాణాలో ప్రజాసమస్యలకు మోక్షం లభించడం లేదు. కలెక్టర్ను ఆశ్రయించిన పాలకవర్గం కలెక్టర్ గరీమా అగ్రవాల్ను చింతలఠాణా ఉపసర్పంచ్ గొట్ల కుమార్, వార్డు సభ్యులు నాయిని రవి, పొత్తూరి దేవరాజు, మంత్రి రాజేశం గురువారం ఆశ్రయించారు. 37 రోజులుగా స్థానిక పాలన లేక గ్రామపంచాయతీ పనులు కుంటుపడుతున్నాయని, స్థానిక మండల అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నిక జరిగే వరకు ఉపసర్పంచ్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి చెక్పవర్ ఇవ్వాలని వారు కోరారు. అధికారికంగా స్పష్టత ఇచ్చి చింతలఠాణాలో స్థానిక పాలనకు శ్రీకారం చుట్టాలని కోరారు.ఓట్లు: 2,319, పోలైన ఓట్లు: 1,719, వార్డులు: 10 -
వస్త్రోత్పత్తి ఖిల్లా
● నాలుగు దశాబ్దాల కిందటే మున్సిపాలిటీగా.. ● 39 వార్డులతో విస్తరించిన సిరిసిల్ల సిరిసిల్ల: కార్మిక క్షేత్రం.. వామపక్ష ఉద్యమాలకు, తెలంగాణ రైతాంగ పోరాటానికి పురిటిగడ్డ. వస్త్రోత్పత్తి ఖిల్లాగా సిరిసిల్ల ఖ్యాతిగాంచింది. ప్రస్తుతం ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా, జిల్లా కేంద్రంగా అవతరించింది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సిరిసిల్ల రాజకీయ ఉద్దండులకు వేదికై ంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా మరమగ్గాలు(పవర్లూమ్స్) ఉన్న పట్టణంగా భాసిల్లుతోంది. సిరిసిల్ల ‘పుర’ ప్రస్థానంపై కథనం. టౌన్ మున్సిపాలిటీగా.. 1953లో తొలిసారిగా టౌన్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అప్పట్లో పట్టణ జనాభా 12 వేలు ఉండేది. శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం, రెడ్డివాడ, సుభాష్నగర్, గాంధీనగర్, అంబేడ్కర్నగర్, పాతబస్టాండు ప్రాంతాలతో కలిసి చిన్న పట్టణంగా ఉండేది. కాలక్రమంలో వెంకంపేట, శాంతినగర్, గోపాల్నగర్, పద్మనగర్, కొత్తబస్టాండు, రాయినిచెరువు ప్రాంతాలు కలిసిపోవడంతో బీవై నగర్, పీఎస్ నగర్, ఇందిరానగర్, తారకరామానగర్, గణేశ్నగర్, వంశీకృష్ణకాలనీ, రాజీవ్నగర్, భూపతినగర్లతో పట్టణం విస్తరించింది. ఏడేళ్ల క్రితం సిరిసిల్ల శివారులోని పెద్దూరు, సర్ధాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల, ముష్టిపల్లి, చంద్రంపేట, రగుడు గ్రామాల విలీనంతో లక్షకు పైగా జనాభాతో 39 వార్డులతో పట్టణ రూపురేఖలు విశాలమయ్యాయి. దేశంలోనే తొలి నేతన్న కాంస్య విగ్రహం ఉంది. తొలి చైర్మన్ మడుపు మల్లారెడ్డి సిరిసిల్ల టౌన్ మున్సిపాలిటీగా ఆవిర్భవించాక 1953లో తొలి చైర్మన్గా మడుపు మల్లారెడ్డి ఎన్నికై .. 1962 వరకు కొనసాగారు. 1962లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుజ్జె రాజయ్య ఎన్నికయ్యారు. 1964లో సిరిసిల్ల మున్సిపాలిటీని ప్రభుత్వం గ్రామపంచాయతీగా మార్చింది. అప్పటికే మున్సిపల్ చైర్మన్గా ఉన్న గుజ్జె రాజయ్య పాలకవర్గాన్ని 1970 వరకు గ్రామపంచాయతీ పాలకవర్గంగానే కొనసాగించింది. 1971లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో రుద్ర శంకరయ్య సర్పంచ్గా గెలుపొందారు. పదేళ్లపాటు శంకరయ్య సర్పంచుగా కొనసాగారు. 1981లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గుండ్లపల్లి భూమయ్య సర్పంచ్గా ఎన్నికై .. 1987 వరకు కొనసాగారు. మళ్లీ ‘పుర’పాలన గ్రామపంచాయతీగా ఉన్న సిరిసిల్ల పట్టణాన్ని 1987లో ప్రభుత్వం తృతీయ శ్రేణి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. 1988లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాజీ సర్పంచ్ రుద్ర శంకరయ్య సతీమణి రుద్ర సత్తమ్మ మున్సిపల్ తొలి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 1995లో జరిగిన ఎన్నికల్లో మాజీ సర్పంచ్ గుండ్లపల్లి భూమయ్య సతీమణి గుండ్లపల్లి సరోజన చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2000లో ఆడెపు రవీందర్ను చైర్మన్గా నేరుగా పట్టణ ఓటర్లు ఎన్నుకున్నారు. పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్ ఎన్నికలు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికను పరోక్ష పద్ధతిలో నిర్వహించాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఈమేరకు 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుడ్ల మంజులను చైర్పర్సన్గా మెజార్టీ కౌన్సిలర్లు పరోక్ష పద్ధతిలో ఎన్నుకున్నారు. 2010 నుంచి 2014 వరకు ప్రత్యేకాధికారి పాలన సాగింది. 2014లో మరోసారి సిరిసిల్ల చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో సామల పావని ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2019 జూలై 2వ తేదీతో ముగిసింది. 2020 జనవరిలో జరిగిన ఎన్నికల్లో చైర్పర్సన్గా జిందం కళాచక్రపాణి ఎన్నికై.. 2025 ఫిబ్రవరి వరకు కొనసాగారు. అనంతరం ప్రత్యేకాధికారుల పాలన సాగింది. విస్తరించిన పట్టణం సిరిసిల్ల కాలక్రమంగా విస్తరిస్తోంది. 2005లో 29 వార్డులు ఉండగా.. 2014 నాటికి 33 వార్డులు అయ్యాయి. ద్వితీయశ్రేణి మున్సిపాలిటీగా ఉన్న సిరిసిల్ల ఇప్పుడు ఏడు గ్రామాల విలీనంతో ప్రథమశ్రేణి మున్సిపాలిటీగా అవతరించింది. జిల్లా కేంద్రంగా భాసిల్లుతోంది.జనాభా: 1,12,002, ఓటర్లు: 81,959 పురుషులు: 39,942, మహిళలు: 42,011 థర్డ్ జెండర్ : 06, వార్డులు: 39 పోలింగ్ కేంద్రాలు: 117 పట్టణ విస్తీర్ణం : 51.93 చదరపు కిలోమీటర్లు గృహాలు: 24,721, అక్షరాస్యత శాతం: 73.7 -
● సిరిసిల్లలో 134.. ● వేములవాడలో 90 దరఖాస్తులు
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్/వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు గురువారం నామినేషన్ల జోరు కొనసాగింది. సిరిసిల్లలో 134 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీఆర్ఎస్ 40, కాంగ్రెస్ 36, బీజేపీ 31, సీపీఎం 3, జనసేన 3, ఏఐఎఫ్బీ 1, సీపీఐ 1, ఇండిపెండెంట్లు 18 చొప్పున నామినేషన్లను సమర్పించారు. రెండు రోజుల్లో 154 నామినేషన్లు దాఖలైనట్లు మున్సి పల్ కమిషనర్ ఖదీర్పాషా తెలిపారు. 13 కౌంటర్ల ద్వారా 30 మంది ఆర్వో, ఏఆర్వోలు నామినేషన్లు స్వీకరించారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద ఏఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో డీఎస్పీ నాగేంద్రచారి, టౌన్ సీఐ కృష్ణ, ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. వేములవాడలో.. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజ్కుమార్ పరిశీలించారు. ఆర్డీవో రాధాభాయ్, నోడల్ అధికారులు గీత, నవీన్కుమార్, భారతి, కమిషనర్ సంపత్కుమార్, టీపీవో అన్సార్ ఉన్నారు. రెండో రోజు 90 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ 28, బీజేపీ 24, బీఆర్ఎస్ 21, జనసేన 5, సీపీఐ 2, బీఎస్పీ 1, ఇండిపెండెంట్ 9 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్లకు నేడు చివరి రోజు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో నామినేషన్ దాఖలుకు శుక్రవారం చివరి రోజు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. గతంలో పలువురు ఆలస్యంగా నామినేషన్ కేంద్రానికి చేరుకొని పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. సిరిసిల్లలో 39 వార్డులకు 13 నామినేషన్ కేంద్రాలు, వేములవాడలో 28 వార్డులకు 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోని హెల్ప్లైన్కు పెద్దగా ఫిర్యాదులు రా వడం లేదు. సిరిసిల్లకు చెందిన వేముల మార్కండేయులు తన ఓటు హక్కు మిస్ అయిందని ఫిర్యాదు చేయగా.. మరో వార్డులో ఉన్నట్లు ఆధార్కార్డు నంబరుతో గుర్తించారు. నామినేషన్ పత్రాల దాఖలు అంశంపై వంగరి అనిల్ ఫిర్యాదు చేశారు. -
సందడి లేని ‘సంగీత’ నిలయం
వేములవాడరూరల్: వేములవాడ ప్రాంతంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా... ‘సంగీత’ నిలయం సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ సందడి కనుమరుగైంది. 2004 లో మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు తన తండ్రి చెన్నమనేని రాజేశ్వర్రావు గెలుపు కోసం పాటుపడ్డారు. అప్పటి నుంచి సంగీత నిలయం వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో నాటి ఎన్న్ఙికళ్ఙ కళ వేములవాడలోని సంగీత నిలయంలో ప్రస్తుతం లేదు. మరోవైపు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంటి వద్ద మాత్రం రోజురోజుకు ఆశావాహుల సంఖ్య పెరగడంతో సందడి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న ఈ సందడి రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై ప్రత్యేక కథనం. వేములవాడ నియోజకవర్గం అంటేనే చెన్నమనేనికి పెట్టింది పేరుగా ఉన్నది. నాడు చెన్నమనేని రాజేశ్వర్రావు తదుపరి ఆయన తనయుడు రమేష్బాబు ఈ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పాలన సాగించారు. ఏ ఎన్నికలు వచ్చినా వేములవాడ సంగీత నిలయంలో కార్యకర్తలు, అభిమానులతో కళకళలాడేది. అలాంటి ఆ సంగీత నిలయం ప్రస్తుతం జన ఆకర్షణ లేకుండా నెలకొన్నది. వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటి వద్ద అభిమానులు, కౌన్సిలర్ టికెట్ ఆశించే అభ్యర్థుల రద్దీ నెలకొంది. గతంలో ఎప్పుడూ రద్దీగా ఉండే సంగీత నిలయం ప్రస్తుతం వెలవెలబోతోంది. నాడు మాజీ ఎమ్మెల్యే దివంగత రాజేశ్వర్రావు ఉన్న సమయంలో ప్రతీ ఎన్నికల సమయంలో ప్రజలు క్యూ కట్టేరోజులు కనబడ్డాయి. కానీ.. మాజీ ఎమ్మెల్యే రమేశ్బాబుకు టికెట్ రాకపోవడంతో ఆయన ప్రస్తుతం జర్మనీలోనే ఉంటున్నారు. వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు టికెట్ ఇవ్వడంతో గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎలాగైనా వేములవాడ మున్సిపాలిటీలపై తమ జెండా ఎగురవేయాలని ఇప్పటికే పలు సమావేశాల్లో ప్రకటించారు. అభ్యర్థుల వేటలో పార్టీలు.... ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మున్సిపాలిటీ కౌన్సిలర్లు పలువురు పోటీ పడుతున్నారు. వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలో పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ తరుపున టికెట్ ఆశిస్తుండగా బీఆర్ఎస్, బీజేపీ తరరపున తమ అభ్యర్థులను గెలిపించేందుకు బలమైన అభ్యర్థుల వేటలో ఆ రెండు పార్టీల నాయకులు అన్వేషిస్తున్నారు. ప్రధానంగా వేములవాడ మున్సిపాలిటీపై ఎలాగైనా తమ పార్టీ జెండా ఎగురవేయాలని ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీల ప్రధాన నాయకులు సమావేశాలు నిర్వహించారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు కలవు. ఇందులో ప్రధానంగా తమ బలమైన అభ్యర్థులను అధికార పార్టీకి దీటుగా పోటీలో ఉంచి మున్సిపల్పై తమ జెండా ఎగరవేయాలని ఆ రెండు పార్టీల అభ్యర్థులు దృష్టిపెట్టారు. ప్రధానంగా అధికార పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు తమ బలమైన అభ్యర్థులను పోటీలో ఉంచి మున్సిపల్ జెండా కై వసం చేసుకునేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇందుకు గాను ఇప్పటికే ఆ ప్రధాన పార్టీల నాయకులు వేములవాడ పట్టణంలో సర్వేలు నిర్వహించి అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభిస్తున్నారు. బుధవారం ప్రధాన పార్టీల నాయకులు ముఖ్య నాయకులతో తమ కార్యాలయంలోకి కొంత మంది సంఘం పెద్ద మనుషులు, పార్టీ సీనియర్ నాయకులతో పిలిపించుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్లు తెలిసింది. ఏదిఏమైనప్పటికీ వేములవాడలో ప్రధాన రాజన్న ఆలయం ఉండడంతో ఇక్కడ మూడు పార్టీల అభ్యర్థులు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. -
నీ మద్దతు నాకుండాలే..!
● మనోళ్ల ఓట్లు పోనియ్యద్దు ● ఈసారి ఎవరున్నా నేను పోటీలుంటా ● మున్సిపాలిటీల్లో ఎటూ చూసినా ఇవే ముచ్చట్లు యువకుడు : అన్నా ఎన్నికలట.. నువ్వు పోటీ చేస్తున్నావే.. ఆశావహుడు : అవునే.. నా వయసు యాబై.. ఇక నాకెప్పుడు గుర్తింపు చెప్పు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొత్తయా.. ఎప్పుడు పోటీచేయాలా! అని ఎదురుచూస్తున్నా. రెండు నెలల కిందటే ఎన్నికల్లో పోటీ చేయాలని వార్డులున్న వాళ్లందరినీ కలిసిన. కానీ ఎన్ని కలే పెట్టకపోయిరి. ఈసారి పోటీచేసుడే అన్న. యువకుడు : మరీ మీ అన్న ఉన్నడు కదే ! నిజమే.. కానీ అన్నా అని చూస్తే నా వయసు అయిపోతుంది. మల్లా రిజర్వేషన్ కల్సి వత్తదో.. లేదో.. మా అన్న ఒక్కసారి కౌన్సిలర్గా చేసిండు సాలదా.. మళ్లీ మళ్లీ ఆయనే పోటీచేత్తే నా సంగతేంది. ఎన్నికల్లో అన్న లేదు.. తమ్ముడు లేదు. పోటీ చేసుడు. వాడకట్టుల అందర్నీ కూసోవెట్టి మాట్లాడుతం. ఎవ్వరికి మద్దతుంటే వాళ్లే పోటీచేయాలే.. యువకుడు : అంతేగదనే అన్న. ఈసారి బాగానే ఖర్సు అయితది. ఆశావహుడు : అరె తమ్మీ ఖర్సుకు భయపడ. దేనికీ ఎన్కకు బోను. ఎన్నికల్ల దిగినంక అన్నింటికీ సిద్ధమే. యువకుడు : అయితే ఓకే అన్నా.. నాకు కొద్దిగా పనుంది. నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకో!ఇవి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికలు జరిగే పట్టణాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. రియల్ ఎస్టేట్ దందాలో సంపాదించిన వాళ్లంతా ఈసారి ఎన్నికల్లో పోటీచేసి రాజకీయంగా రాణించాలని చూస్తున్నారు. అందుకే ఏదో ఒక్క పార్టీలో చేరి టిక్కెట్ సంపాదించాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నారు. – సిరిసిల్లయువకుడు : శ్రీనన్న మున్సిపల్ ఎన్నికలట.. మల్లా పోటీ చేస్తవా లేదా..? నాయకుడు : అరె నాకెందుకురా భయ్ గీ రాజకీయాలు. నేను చేసింది చాలదా! నువ్వే పోటీచెయ్. నీ ఎన్క నేనున్న గదా తమ్మీ. యువకుడు : అన్నా నీ మద్దతు నాకుండాలే. ఖర్సయినా సరే.. కౌన్సిలర్గా మన గల్లీల నిలవడ్త. పోయినసారి నీకై తే నేను పనిచేసిన. నీకు తెల్సు. ఈసారి నాకు మద్దతు ఇయ్యి అన్న కౌన్సిలర్ గావాలంతే.. నాయకుడు : అరే తమ్మీ నా మద్దతు నీకే. కానీ పార్టీ టికెట్ వస్తుందా? యువకుడు : అరే అన్నా నువ్వు లేవాయే.. నాకు టికెట్ ఇప్పియ్యాలే. నాయకుడు : సరే.. తమ్మీ చూద్దాం లే. -
నాలుగు కార్లు ఢీ
● పలువురికి స్వల్పగాయాలు జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రం శివారు ధరూర్ బ్రిడ్జి వద్ద స్పీడ్బ్రేకర్ల ఏర్పాటుతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం వేగంగా వచ్చిన కార్లు స్పీడ్ బ్రేకర్ల వద్ద అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లు ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలయ్యాయి. వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో స్పీడ్బ్రేకర్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. కొండగట్టు ఆలయ అర్చకులకు మెమోలుమల్యాల: కొండగట్టు ఆలయ ఈవోకు వ్యతిరేకంగా ఈనెల 23న ధర్నాకు దిగిన అర్చకులకు ఈఓ మోమోలు జారీ చేసినట్లు తెల్సింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేశ్ జన్మదినం సందర్భంగా కొండగట్టులో పూజలు చేసేందుకు టీడీపీ నాయకులు రాగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. దీనిపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారని, దుర్భాషలాడారని అర్చకులు ఈవోకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేశారంటూ ఈఓ అర్చకులకు బుధవారం మెమోలు జారీ చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఏడుగురు ఉమ్మడి జిల్లావాసులుజగిత్యాలజోన్: ఈనెల 30న జరిగే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 203 మంది పోటీ చేస్తుండగా.. వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఏడుగురు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు బార్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్న కాసుగంటి లక్ష్మణ్కుమార్, సీహెచ్.ప్రదీప్కుమార్ రాజు, కె.సంజీవరెడ్డి, ఐ.సత్యనారాయణ, బాలసాని సురేశ్గౌడ్, పోలు వెంకటరాజ్కుమార్, కె.వేణుగోపాల్ ఉన్నారు. వీరితోపాటు మరో ఐదారుగురు ఉమ్మడి జిల్లాకు చెందినవారు ఉన్నప్పటికీ వారంతా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ధ్వంసమైన కార్లు -
నో డ్యూ.. నో సిస్టం
కోల్సిటీ(రామగుండం): రామగుండం బల్దియా కార్యాలయం బుధవారం ఆశావహులతో కిటకిటలాడుతోంది. కార్పొరేటర్గా పోటీ చేసేందుకు నోడ్యూ సర్టిఫికెట్ దాఖలు చేయాల్సి ఉంది. దీనికి ఆస్తిపన్ను, కుళాయి బిల్లులు తదితర బకాయిలు చెల్లించేందుకు ఆశావహులు, అభ్యర్థులు, ప్రతిపాదించేవారు భారీగా బల్దియా కార్యాలయానికి తరలివచ్చారు. జనం ఒక్కసారిగా వెల్లువెత్తడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు రంగంలోకి దిగినా, ఒకదశలో తోపులాట చోటుచేసుకుంది. కార్యాలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆన్లైన్లో బకాయిలు.. గతంలోనే కుళాయి బిల్లులు చెల్లించినా.. ఆన్లైన్ రికార్డుల్లో బకాయిలు ఉన్నట్లు చూపించడంతో ఆశావహులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రషీదులు చూపిస్తున్నా నో డ్యూ ఇవ్వడంలేదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సమస్య తీవ్రం కావడంతో అధికారులు రికార్డులు పరిశీలించి బకాయిలను క్లియర్ చేశారు. అయినా.. అధిక సమయం తీసుకోవడంతో ఆశావహులు గంటల తరబడి నిరీక్షించారు. అయితే, అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందనే విమర్శలున్నాయి. మరోవైపు.. ఒక్కో నో డ్యూ సర్టిఫికెట్ కోసం కొందరు అధికారులు రూ.3,000, ప్రతిపాదించే వ్యక్తి నుంచి మరో రూ.3,000 చొప్పున ఫీజు వసూలు చేయడంపై అసహనం వ్యక్తమమైంది. ఈ విషయంపై కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ వివరణ ఇస్తూ.. కౌన్సిల్ ఆమోదంతోనే ఫీజులు వసూలు చేస్తున్నామన్నారు. -
అమ్మలేదు.. ఆదుకునే నాన్నలేడు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): గోరుముద్దలు తినిపించే అమ్మలేదు.. ఆటాపాటలతో సంతోషాన్నిచ్చే నాన్నలేడు.. అనారోగ్యం రూపంలో వచ్చిన మృత్యువు దంపతులిద్దరినీ కబళించడంతో వారి ఇద్దరు కూతుళ్లు ఏ దిక్కూలేక అనాథలయ్యారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్ గ్రామంలో ఈ దయనీమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. అక్కల సదయ్య(35)– శ్యామల దంపతులు. వీరిది పేదకుటుంబం. సదయ్య ఊరులో పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. ఉన్నంతలో తమ ముగ్గురు కూతుళ్లను పోషించుకుంటున్నారు. కొంతకాలం క్రితం పెద్దకూతురు వివాహం జరిపించి అత్తారింటికి పంపించారు. విధివక్రీకరించింది.. అనారోగ్యానికి గురైన శ్యామల రెండేళ్ల క్రితం మృతి చెందింది. అయినా, తన ఇద్దరు కూతుళ్లు అక్షయ, అక్షితను పోషించుకుంటున్న సదయ్య.. అకస్మాత్తుగా ఆయన కూడా అనారోగ్యానికి గురయ్యాడు. ఈక్రమంలోనే బుధవారం చనిపోయాడు. తండ్రి శవం వద్ద బిక్కుబిక్కుమంటున్న కూర్చున్నారు వారి చిన్నకూతుళ్లు అక్షయ, అక్షిత. ఏం చేయాలో కూడా తెలియని స్థితివారిది. బాలికలను చూసిన గ్రామస్తులు అయ్యా పాపం అంటూ చలించిపోయారు. అంత్యక్రియల ఎలా జరపాలని ఊరోళ్లే ఆలోచన చేశారు. ఊరంతా తలోకొంత డబ్బుపోగు చేసుకున్నారు. సదయ్య అంత్యక్రియలు పూర్తిచేసి మానత్వం చాటుకున్నారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాడు తల్లి, నేడు తండ్రి మృతి అనాథలైన చిన్నారులు దయనీయ స్థితిలో బాలికలు చందాలు వేసుకుని అంత్యక్రియలు మానవత్వం చూపిన ఇదులాపూర్ గ్రామస్తులు -
స్వగ్రామానికి చేరిన వలసజీవి మృతదేహం
బోయినపల్లి(చొప్పదండి): సంక్రాంతి పండుగ పూట వలస జీవి మరణ వార్త తెలిసింది.. సమ్మక్క జాతరకు మృతదేహం ఇంటికి చేరింది.. ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా మృతదేహం రాకకోసం 17 రోజులు ఎదురుచూశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన ప్రవీణ్ రూ.10 లక్షల వరకు అప్పు చేసి 9 నెలల క్రితం ఆర్మేనియా దేశం వెళ్లాడు. అక్కడ కారు డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందేవాడు. ఈనెల 11న రోడ్డు పక్కన ఉండగా ఓ వాహనం వచ్చి ప్రవీణ్ను ఢీకొట్టడంతో మృతిచెందాడు. 17 రోజుల అనంతరం ప్రవీణ్ మృతదేహం బుధవారం బోయినపల్లికి చేరింది. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. యూరప్లో ఈనెల 11న ప్రవీణ్ మృతి -
బిర్యానీ సెంటర్లో అగ్నిప్రమాదం
ధర్మపురి: చికెన్ బిర్యానీ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి రూ.20లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. యజమాని ఎండీ.అనాస్ కథనం ప్రకారం.. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అనాస్ తండ్రి సాబీర్ మూడేళ్లుగా చికెన్ బిర్యానీ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. సాబీర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అనాస్ సెంటర్ నడిపిస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 11.30గంటల సమయంలో సెంటర్ మూసి ఇంటికి వెళ్లారు. బుధవారం వేకువజామున పెద్దఎత్తున మంటలు చెలరేగినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా ఫైరింజన్ సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పి వేశారు. ప్రమాదంలో రూ.20లక్షలకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. రెవెన్యూ సిబ్బంది పంచనామా చేపట్టారు. మంటలు ఆర్పిన ఫైరింజన్ రూ.20 లక్షలకు పైగా ఆస్తి నష్టం -
టూ వీలర్.. దండిగా
మళ్లీ రావడం ఎందుకు అని అనుకున్నాడో? లేక.. ఆటోలో తీసుకెళ్తే చార్జి అధికం అవుతుందనే తెలియదు కానీ.. ఓ వ్యక్తి టూవీలర్పై ఒకేసారి ఎనిమిది డ్రమ్ములు తీసుకెళ్తూ ఇలా కనిపించాడు. చూసేవారు ఖాళీ డ్రమ్ములే కదా? ఏం కాదులే అని చమత్కరిస్తుంటే.. మరికొందరు వచ్చిపోయే వారికి సైడ్కూడా ఇవ్వకుండా ఇంత ప్రమాదకరంగా ప్రయాణించడం అవసరమా? అని విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి చౌరస్తా నుంచి వెళ్తూ డ్రమ్ముల టూవీలర్ శ్రీసాక్షిశ్రీకి ఇలా కనిపించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్; పెద్దపల్లి -
ఆర్థిక ఇబ్బందులతో కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల క్రైం: ఆర్థిక ఇబ్బందులతో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పవర్లూమ్ కార్మికుడు నర్సయ్య(50) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. నర్సయ్య పవర్లూమ్ కార్మికుడిగా జీవనోపాధి పొందుతున్నాడు. పెద్ద కూతురుకు ఐదేళ్ల క్రితం వివాహం చేశాడు. మరో కూతురుకి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కుటుంబ అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో కూతురు పెళ్లి ఎలా చేయడమంటూ పలుమార్లు కుటుంబ సభ్యులతో మదనపడ్డాడు. బుధవారం పనికి వెళ్తున్నాని ఇంటి నుంచి వెళ్లి తను పనిచేస్తున్న ఖార్కానాలో ఉరి వేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో తపాలా ఉద్యోగి మృతిమేడిపల్లి: మేడిపల్లి మండలం కల్వకోటకు చెందిన తూం ఆనంద్ కుమార్ (42) గుండెపోటుకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఆనంద్ భీమారం మండలంలోని మన్నెగూడెంలో బ్రాంచ్ పోస్ట్మాస్టర్. అందరితో కలివిడిగా ఉండే ఆయన మృతిపై తోటి ఉద్యోగులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. తప్పిపోయిన వృద్ధుడువేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్కు చెందిన గడప చేరాలు(60) ఈనెల 26న తప్పిపోయినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. డయల్ 100కు, 83749 25039లో సమాచారం ఇవ్వాలని కోరారు. హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక ధర్మారం(ధర్మపురి): స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులు 69వ ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ బైకని కొమురయ్య తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అఖిల, శ్రీజ ఇటీవల మహబూబ్నగర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చారన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఐదోతేదీ వరకు హిమాచల్ప్రదేశ్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ ఈరవేని రాజ్కుమా ర్, వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమురయ్య, మేకల సంజీవ్రావు అభినందించారు. -
రాజన్న సిరిసిల్ల
గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 20267సిరిసిల్ల: సిరిసిల్లలోని నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ బుధవారం పరిశీలించారు. కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. జిల్లాలో వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలులు వేగంగా వీస్తాయి.చందుర్తి: ఆశిరెడ్డిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులు సమ్మక్క–సారలమ్మ జీవిత చరిత్రను నాటకం ద్వారా ప్రదర్శించారు. -
గద్దెలకు చేరిన సారలమ్మ
తంగళ్లపల్లి/ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్: తంగళ్లపల్లి మండలం మండెపల్లి, ఓబులాపూర్ గ్రామాల్లో సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం ప్రారంభమైంది. మండెపల్లిలో ఉదయం పెద్దభోనం, సాయంత్రం సారలమ్మ, గోవిందరాజు, పగడిద్ద రాజు గద్దెలకు చేరుకోగా.. ఓబులాపూర్లో సమ్మక్క, సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. ముస్తాబాద్లో సమ్మక్క, సారలమ్మలు గద్దెలకు చేరారు. గురువారం అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. మండల కేంద్రంలో 26 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎస్సై ఉపేంద్రచారి బందోబస్తును పరిశీలించారు. సర్పంచులు గదగోని సాగర్, కొమ్మెట పర్శయ్య, ఆలయ కమిటీ చైర్మన్లు కడారి రాంరెడ్డి, తన్నీరు వెంకట్రావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బొప్పాపూర్లో బోనం ఊరేగింపు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో సమ్మక్క–సారలమ్మలకు బోనం తీశారు. పూజారుల నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో తరలివచ్చారు. సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, ఉపసర్పంచ్ సుధాకర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని కందికట్కూర్, వంతడుపుల, ఇల్లంతకుంట గ్రామాల్లో బుధవారం రాత్రి సారలమ్మను డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాల మధ్య గద్దెకు చేర్చారు. ఇల్లంతకుంటలో కోయదొరలు పూజలు చేశారు. గొడుగు హరికుమార్, ఈదుల రమేశ్, రవీందర్రెడ్డి, రాజిరెడ్డి, మల్లేశం, శంకర్, దత్తు పాల్గొన్నారు. ఎత్తుబంగారం మొక్కు సమ్మక్క–సారలమ్మకు ఎత్తు బంగారం మొక్కులు ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామాల చెల్లించుకుంటున్నారు. బుధ, గురు, శుక్రవారాలలో ఇల్లంతకుంట, కందికట్కూర్, వంతడుపుల గ్రామాల్లో జాతరలు జరగునున్నాయి. దుకాణాలు ఎత్తు బంగారం తూకాలతో కిటకిటలాడుతున్నాయి. -
నామినేషన్ల సందడి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించడంతో సమయం లేక అభ్యర్థులు, పార్టీల నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొదటి రోజు కొంతమంది నామినేషన్లు దాఖలు చేసి, టికెట్లు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల్లోని నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే గెలుపు పక్కా అంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఒక్కో వార్డు/డివిజన్లో పార్టీ టికెట్లు ఆశించే వారు 3 నుంచి నలుగురు ఉండడంతో నేతలకు తలనొప్పిగా మారింది. ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఆయా పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. పలువురు ఆశావహులు గాడ్ ఫాదర్లను నమ్ముకొని, టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. సర్వేల ఆధారంగా టికెట్లు ఒక్కోవార్డు/డివిజన్లో ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో పార్టీలన్నీ సర్వే నిర్వహించాయి. షెడ్యూల్ ఖరారు కాగానే కొత్తవారు తెరపైకి రావడంతో సర్వే ఆధారంగా గెలిచే అవకాశం ఎవరికున్నదనే ప్రాతిపదికన టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు ఆయా పార్టీల్లోని నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అభ్యర్థుల గుణగణాలు, ప్రజల్లో ఆదరణ, పార్టీకి అందిస్తున్న సేవలు తది తర అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ల కేటా యింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధాన పార్టీల్లో మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, నియోజవర్గ ఇన్చార్జ్జీలు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలను కై వసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ కాంగ్రెస్ నేత వొడితెల ప్రణవ్ వ్యూహరచన చేస్తున్నారు. ● బీఆర్ఎస్ విషయానికొస్తే కరీంనగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, చక్రం తిప్పుతున్నారు. బీజేపీలో మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ అన్ని తానై నడిపిస్తున్నారు. ● పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సి పాలిటీలు ఉన్నాయి. అధికార కాంగ్రెస్లో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు విజయరమణా రావు, ఎంఎస్ రాజ్ఠాకూర్ టికెట్ల కేటాయింపులపై దృష్టి సారించారు. బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, పుట్టమధు, బీజేపీ పార్టీలో గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్రావు, సునీల్రెడ్డి, కందుల సంధ్యారాణి టికెట్ల వ్యవహారాన్ని చూస్తున్నారు. ● సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్లు అభ్యర్థులపై దృష్టిసారించారు. బీఆర్ఎస్లో మాజీ మంత్రి కె.తారకరామారావు, చల్మెడ లక్ష్మి నరసింహరావులు, బీజేపీలో యథావిధిగా బండి సంజయ్కుమారే టికెట్ల వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. ● జగిత్యాల జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, రాయికల్, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పరిశీలిస్తుండగా, బీఆర్ఎస్లో డాక్టర్ సంజయ్ టికెట్ల వ్యవహారాన్ని చూస్తున్నారు. బీజేపీలో ఎంపీ అరవింద్ అభ్యర్థుల ఖరారులో చురుకుగా వ్యవహరిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు అన్నిపార్టీలు రేపు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది. అదే రోజు బీ–ఫారాలు అప్పగిస్తే వారంతా పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల అధికారులకు దాఖలు చేస్తారు. అయితే మేయర్/చైర్మన్ అభ్యర్థుల ఖరారు మాత్రం పార్టీలకు సంకటంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా మేయర్/చైర్మన్ అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీంతో రిజర్వేషన్ అనుకూలించే ప్రతీ సీనియర్ నేత పోటీకి దిగుతున్నారు. పోటీకి సిద్ధమైనవారు ప్రచారాలు మొదలు పెట్టారు. ఇంటింటికి తిరిగి తమను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్టీ టికెట్లు తమకే వస్తాయని భావిస్తున్న నాయకులంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. -
ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్ శ్రీనివాస్రెడ్డి
సిరిసిల్ల: తెలంగాణ రెరా సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా నియమితులయ్యారు. బుధవారంజిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులుంటే నేరుగా తనను సంప్రదించవచ్చని శ్రీనివాస్రెడ్డి సూచించారు. వేములవాడరూరల్: మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు సమావేశాలకు హాజరయ్యారు. వేములవాడ రూరల్ మండలంలో బుధవారం నీటి ఎద్దడిపై మండలంలోని సర్పంచులతో సమావేశం నిర్వహించారు. నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో మండల పరిషత్లో నిర్వహించిన సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి పలు గ్రామాల మహిళా సర్పంచుల స్థానాల్లో వారి భర్తలకు హాజరయ్యారు. ఈ విషయంపై ఎంపీవోను వివరణ కోరగా తనకేమి తెలియదని దాటవేశారు. ఇల్లంతకుంట(మానకొండూర్): ముదిరాజు లు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము కోరారు. మండల కేంద్రంలో బుధవారం ముదిరాజ్ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చొక్కాల రాము మాట్లాడుతూ ముదిరాజ్లు ఐక్యంగా ఉండి రాజకీయాలలో సత్తా చాటాలని కోరారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలని కోరారు. జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు ఎలవేణి రమేశ్, ప్రధాన కార్యదర్శి సరుగు నరేశ్, గౌరవ అధ్యక్షుడు కె.ప్రభాకర్, కనకయ్య, బీసీ మహా అధ్యక్షుడు బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి కొమ్ముల నర్సింహం, పల్లె రాజశేఖర్, పరుశరాములు, నాగరాజు, ఎండ్ర చందన్ పాల్గొన్నారు. సిరిసిల్ల ఎడ్యుకేషన్: హిమాచల్ప్రదేశ్లోని గుమర్విన్ పట్టణంలో నిర్వహించే 69వ ఎస్జీఎఫ్ అండర్–19 జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలికల జట్టుకు హెడ్ ఆఫ్ ది డెలిగేషన్గా సిరిసిల్ల ప్రభుత్వ హైస్కూల్ పీడీ డేవిడ్సన్ వ్యవహరించనున్నారు. ఈమేరకు తెలంగాణ స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఉషారాణి, సిరిసిల్ల సెక్రటరీ నర్ర శ్రీనివాస్రెడ్డి వివరాలు వెల్లడించారు. క్షయవ్యాధిని కట్టడి చేద్దాంసిరిసిల్ల: జిల్లాలో క్షయవ్యాధిని కట్టడిచేద్దామని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. కలెక్టరేట్లోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో బుధవారం జిల్లా వైద్యాధికారులతో సమావేశమయ్యారు. డీఎంహెచ్వో రజిత మాట్లాడు తూ క్షయవ్యాధిగ్రస్తులకు మంచి పౌష్టికాహారం, మందులు అందిస్తూ వ్యాధి నుంచి విముక్తి లభించేలా సేవలందించాలన్నారు. జి ల్లాలో ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు సాధించాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, నయీమా జహా పాల్గొన్నారు. -
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల విధులపై జోనల్ ఆఫీసర్స్, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంలకు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డితో కలిసి బుధవారం శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొనకూడదని స్పష్టం చేశారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉల్లంఘనలను, నగదు, మద్యం పంపిణీని గుర్తించి రిపోర్ట్ చేయాలన్నారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, అదనపు ఎస్పీ చంద్రయ్య, నోడల్ అధికారులు గీత, శ్రీనివాసాచారి, నవీన్, ట్రైనర్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. హెల్ప్లైన్ సెంటర్, కంట్రోల్ రూం ప్రారంభం కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికల హెల్ఫ్లైన్ సెంటర్, కంట్రోల్ రూం, మీడియా సెంటర్ను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రారంభించారు. ఎన్నికల ఫిర్యాదులను 1800 233 1495కు కాల్ చేయాలని కోరారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ సమావేశమయ్యారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల్లో పార్టీలు అనుసరించాల్సిన విధి, విధానాలను, నిబంధనలను వివరించారు. అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు వేములవాడ: ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఓటర్ జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూ సర్టిఫికెట్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ జారీచేసిన మార్గదర్శకాలు, నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఈనెల 28 నుంచి 30 వరకు ఉదయం 10.30 నుంచి 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితోపాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. వేములవాడలో 28 వార్డులకు 10 మంది ఆర్వోలు, 10 మంది ఏఆర్వోలను నియమించినట్లు తెలిపారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, తహసీల్దార్ జయంత్కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ పాల్గొన్నారు. -
నీళ్లు లేవు.. నీడ లేదు
హెల్ప్డెస్క్ వద్ద రోడ్డుపైనే క్యూలైన్లో అభ్యర్థులుగాంధీచౌక్లో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లుసిరిసిల్ల: జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు చేసిన ఏర్పాట్లు అభాసుపాలవుతున్నాయి. మున్సిపల్ ఆఫీస్ గేట్లను మూసివేసి గేటు వద్దనే హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. నామినేషన్ పత్రాల కోసం వచ్చిన అభ్యర్థులకు నీడ కరువైంది. రోడ్డుపైనే క్యూలో నిల్చొని నామినేషన్ పత్రాలు స్వీకరించారు. గేటు వద్దనే హెల్ప్డెస్క్ అని బోర్డు పెట్టి, కనీసం టెంట్ కూడా వేయలేదు. నీళ్లు లేవు.. నిలబడేందుకు నీడ లేదు. నామినేషన్ల స్వీకరణకు కనీస ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. మున్సిపల్ అధికారులు ఇప్పటికై నా ఏర్పాట్లను సమీక్షించి మెరుగైన వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. రోడ్లపై పోలీసులు ఆంక్షలు పట్టణ ప్రజల సహనానికి పోలీసులు పరీక్ష పెట్టారు. నామినేషన్ల ప్రక్రియ సాగుతుండగా పోలీసులు పట్టణంలోని ప్రధాన రహదారిని మూసివేశారు. గాంధీచౌక్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఒక్క వైపు రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. దీంతో ఒకే వైపు నుంచి వాహనాలు వెళ్లడంతో రద్దీగా మారింది. మున్సిపల్ ముందు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి, పట్టణ సీఐ కె.కృష్ణ, ఎస్సైలు శ్రీకాంత్, గణేశ్, అశోక్కుమార్, ముళీధర్గౌడ్, ట్రాఫిక్ ఎస్సై దిలీప్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మానేరువాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడిని జిల్లా గార్డు కానిస్టేబుళ్లు కాపాడారు. మండల కేంద్రానికి చెందిన సూర నవీన్(27) బుధవారం మానేరు బ్రిడ్జి పైనుంచి వాగులోకి దూకాడు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న డిస్ట్రిక్ట్ గార్డ్ కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్ వెంటనే వాగులోకి దూకి నవీన్ను ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి సంఘటన స్థలానికి చే రుకుని యువకుడికి కౌ న్సెలింగ్ ఇచ్చారు. వాగులోకి దూకి యువకుడిని కాపాడిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్ను ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
సిరిసిల్ల: మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు పనిచేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్, సిరిసిల్ల మున్సిపల్ ఇన్చార్జి తుల ఉమ కోరారు. తెలంగాణ భవన్లో బుధవారం పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, నాయకులు చీటి నర్సింగరావు, జిందం చక్రపాణి, సిద్ధం వేణు, సత్తార్ పాల్గొన్నారు. 11 మంది సిట్టింగ్లతోనే.. సిరిసిల్ల పట్టణంలో 39 వార్డులు ఉండగా..18 మందితో తొలిజాబితాను విడుదల చేసింది. గత కౌన్సిల్లో చైర్పర్సన్గా ఉన్న జిందం కళాచక్రపాణి, వైస్చైర్మన్గా ఉన్న మంచె శ్రీనివాస్ సతీమణి రేణుకతోపాటు మరో తొమ్మిది మంది సిట్టింగ్ కౌన్సిలర్లకు అవకాశం కల్పిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్థులను ప్రకటించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో స్వల్పఓట్లతో ఓడిపోయిన మరో ఐదుగురికి మళ్లీ అవకాశం కల్పించారు. కొత్త అభ్యర్థులు ఇద్దరికి టిక్కెట్లను ప్రకటించారు. 3వ వార్డులో జిందం కళాచక్రపాణి, 5లో దార్నం అరుణలక్ష్మీనారాయణ, 8లో లింగంపల్లి భాగ్యలక్ష్మిసత్యనారాయణ, 9లో దొంతునేని కల్యాణిఅశోక్రావు, 12లో మొగిలి నాగరాజు, 13లో బుర్రనారాయణ, రాజు, 16లో గుడ్ల శ్రీనివాస్, 17లో గుండ్లపల్లి నీరజపూర్ణచందర్, 21లో ఎలుక వెంకటేశం, 24లో బుర్ర మల్లికార్జున్, 27లో కాసర్ల పద్మ, 28లో అడిచెర్ల రూపాసాయికృష్ణ, 29లో గెంట్యాల శ్యామలశ్రీనివాస్, 30లో మంచె రేణుకశ్రీనివాస్, 32లో సయ్యద్ అక్రమ్, 35లో బత్తుల రమేశ్, 36లో కల్లూరి రేణుకారాజు, 39వ వార్డులో ఆకుల స్వప్నకృష్ణ(చిన్న)ల పేర్లను ప్రకటించారు. -
సిరిసిల్లలో 20.. వేములవాడలో 16
సిరిసిల్లటౌన్: బల్దియా ఎన్నికలలో భాగంగా బుధవారం నామినేషన్ల పర్వం మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు మున్సిపల్ ఆవరణలో కమిషనర్ ఖదీర్పాషా నేతృత్వంలో 39 వార్డులకు 13 కౌంటర్లను ఏర్పాటు చేశారు. 15 మంది ఆర్వో, 15 మంది ఏఆర్వోలకు విధులు కేటాయించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి నలుగురు అధికారులతో ‘హెల్ప్డెస్క్’ ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ పర్యవేక్షించారు. నామినేషన్ సెంటర్కు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ను అమలు చేశారు. సిరిసిల్లలో 20 మంది 20 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 3వ వార్డు నుంచి తాజా మాజీ చైర్పర్సన్ జిందం కళ(బీఆర్ఎస్), 12వ వార్డు నుంచి సూర నిర్మల(కాంగ్రెస్), 30వ వార్డు నుంచి నాగుల రూప(బీజేపీ) తదితరులు నామినేషన్లను అఽధికారులకు అందజేశారు. బీఆర్ఎస్ నుంచి 11, కాంగ్రెస్ 4, బీజేపీ ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యం నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికెట్లు పొందడానికి అధికారుల నుంచి స్పందన కరువైందని వారు వాపోయారు. రాత్రి వరకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై విమర్శలు గుప్పించారు. నో డ్యూ సర్టిఫికెట్లు లేక పలువురు అభ్యర్థులు నామినేషన్ల దాఖలును ఒక రోజు వాయిదా వేసుకున్నారు. వేములవాడలో 16 నామినేషన్లు వేములవాడ: వేములవాడలో మొదటి రోజు 16 నామినేషన్లు దాఖలైనట్లు కమిషనర్ సంపత్కుమార్ తెలిపారు. కాంగ్రెస్ నుంచి 8, బీఆర్ఎస్ నుంచి 5, బీజేపీ నుంచి 3 నామినేషన్లు దాఖలయ్యాయి. -
నన్ను ఏకాకి చేశావా చెల్లె..
చందుర్తి(వేములవాడ): ‘ఇన్నాళ్లు మనకు ఎవరూ లేకున్నా.. ఒకరికొకరం తోడునీడగా ఉన్నాం.. కష్టసుఖాలను పంచుకున్నాం.. ఇప్పుడు నన్ను ఏకాకి చేసి వెళ్లిపోయావా చెల్లె.. నేను ఎవరి కోసం బతకాలె..’ అంటూ చెల్లె మృతదేహం వద్ద అక్క రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో విషాదం నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బండపల్లికి చెందిన తోకల బుచ్చవ్వ– మల్లయ్య దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు సంతానం. పెద్ద కూతురు లచ్చవ్వ, రెండో కూతురు మల్లవ్వ(53)కు గతంలోనే పలువురితో పెళ్లి కాగా, విడాకులు తీసుకుని తల్లిగారింట్లో ఉంటుండగా, మరో ముగ్గురు వారివారి అత్తవారిళ్లలో ఉంటున్నారు. పెద్ద కూతురు, రెండో కూతురు కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచేవారు. తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే మృతిచెందగా, లచ్చవ్వ, మల్లవ్వ ఒకరికొకరు తోడునీడగా జీవనం సాగిస్తున్నారు. వీరికి వారసులు లేరు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో సోమవారం వరినాటు వేసి వచ్చిన మల్లవ్వ మంగళవారం వేకువజామున అస్వస్థతకు గురై అకస్మాత్తుగా మృతిచెందింది. చెల్లె మరణాన్ని తట్టుకోలేని అక్క గుండెలవిసేలా రోదించింది. అన్నీతానై కుటుంబాన్ని పోషించిన లచ్చవ్వ చివరకు చెల్లెకు తలకొరివి పెట్టేందుకు ఓ చేతిలో కుండ, మరో చేతిలో అగ్గి పట్టుకుని ముందు నడవడం చూసి గ్రామస్తులు కన్నీరుపెట్టారు. బాధితులది నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు విరాళాలు అందించారు. సర్పంచ్ కటకం మల్లేశం, మాజీ ఉపసర్పంచ్ గడ్డం శ్రీనివాస్రెడ్డి పాడే మోసి ప్రగాడ సంతాపం తెలిపారు. ఇన్నాళ్లు ఒకరికొకరు తోడునీడగా ఉన్న అక్కాచెల్లెలు అకస్మాత్తుగా చెల్లె మృతి చితికి నిప్పు పెట్టిన అక్క అంత్యక్రియలకు గ్రామస్తుల విరాళం బండపల్లిలో విషాదం -
ఉత్పత్తిలో వెనక !
నూలు లేక..ఇదీ.. వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డులోని నూలుడిపో. సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులకు అవసరమైన నూలును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లతో ఏర్పాటు చేసింది. పది శాతం డబ్బులు చెల్లించిన మధ్యతరగతి వస్త్రోత్పత్తిదారులకు నూలు ఇవ్వాలి. కానీ మూడు నెలలుగా నూలు లేక నేతన్నలకు ప్రభుత్వం ఇచ్చిన ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తిలో మధ్యతరగతి ఆసాములు వెనకబడ్డారు. ఒక్క జరీ నూలు మాత్రమే ఈ డిపోలో అందుబాటులో ఉంది. చీరల బట్ట ఉత్పత్తికి అవసరమైన వెప్ట్(అడ్డం పోగులు), వార్ప్(నిలువు పోగులు) నూలు అందుబాటులో లేదు. దీంతో చీరల ఉత్పత్తి ముందుకుసాగడం లేదు. ఆర్డర్లు : 1.71 కోట్ల మీటర్లు ఆర్డర్ల విలువ : రూ.60కోట్లు ఆర్డర్లు పొందిన మ్యాక్స్లు : 130 ఉత్పత్తి ప్రారంభించిన మ్యాక్స్లు : 15 సిరిసిల్లలోని సాంచాలు : 24,560 ఉత్పత్తి చేస్తున్న సాంచాలు : 6,950 ఇప్పటికే ఉత్పత్తి అయిన చీరల బట్ట : 25 లక్షల మీటర్లు చీరల బట్ట ఉత్పత్తి గడువు : 2026, జనవరి 31 -
పోలీసు శాఖలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి
జ్యోతినగర్(రామగుండం): తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఎస్సీ రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీలో మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి పోలీసు విభాగం సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎస్సీల హక్కులు, రిజర్వేషన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. నియామకాలు, పదోన్నతులు, సేవా వ్యవహారాల్లో వివక్షత చూపొద్దని పోలీసు అధికారులకు సూచించారు. బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అన్నారు. ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సిఫారసు చేయడం ద్వారా ప్రమోషన్లలో కొంత ఉపషమనం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్బాబు, రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ, ఏజీపీ(లా అండ్ ఆర్డర్) రమణ, లీగల్ సెల్ అదనపు ఎస్పీ సతీశ్, సీఐడీ ఎస్పీ అనన్య, ఐఎస్డబ్ల్యూ ఎస్పీ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. నేను దళిత మహిళను. కుమారస్వామి అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది. ఇప్పుడు ఇబ్బందులకు గురిచేసిండు. అన్యాయంగా నా ఇల్లును రిజిస్ట్రేషన్ చేసుకుని జైలుకు పంపించిండు. అప్పటి ఎస్సై ఉపేందర్ ఆయనకు సహకరించారు. కుమారస్వామి, ఎస్సై ఉపేందర్తోపాటు మరికొందరిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి. –స్వరూప, నస్పూర్, మంచిర్యాల జిల్లా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ ఎన్టీపీసీలో పోలీసు అధికారులతో రాష్ట్రస్థాయి సమీక్ష -
హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించాలి
● వరంగల్– కరీంనగర్ ప్రధాన రహదారిపై నిరసన హుజూరాబాద్: హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించాలనే ఉద్యమం మళ్లీ రాజుకుంది. జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్సు డిపో చౌరస్తాలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం నుంచి భారీ ర్యాలీ తీశారు. శ్రీహుజూరాబాద్ జిల్లా– మన హక్కుశ్రీ అంటూ నినదించారు. అనంతరం కరీంనగర్– వరంగల్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ భీమోద్ సదానందం మాట్లాడుతూ అన్ని అర్హతలున్న హుజూరాబాద్ను గత పాలకులు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్షాళన చేపట్టనున్న నేపథ్యంలో హుజురాబాద్ను జిల్లాగా ప్రకటించాలని, పీవీ నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు రహదారిపై ఆందోళన నిర్వహించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టౌన్ సీఐ కరుణాకర్ ఆందోళనకారులతో మాట్లాడి విరమింపజేశారు.


