● 194 యూనిట్లు వాడినా రూ.1,146 బిల్లు
● 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలేది?
వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి క్షేత్రస్థాయిలో ఎన్నో లొసుగులు కనిపిస్తున్నాయి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. వేములవాడలో ఓ గృహ యజమాని 194 యూనిట్లు మాత్రమే వినియోగించినా బిల్లు వచ్చింది. పట్టణానికి చెందిన కనకయ్య తన ఇంటి అవసరాలకు 194 యూనిట్ల విద్యుత్ వినియోగించగా... రూ.1,146 బిల్లు వచ్చింది. అదే బిల్లులో యూనిట్కు రూ.2.62 చొప్పున రూ.510.21 సబ్సిడీ చూపించింది. అయినా బిల్లు చెల్లించాలని అందులో ఉంది.


