పుణ్యక్షేత్రాల సందర్శనలో కౌన్సిలర్లు | - | Sakshi
Sakshi News home page

పుణ్యక్షేత్రాల సందర్శనలో కౌన్సిలర్లు

Aug 8 2026 1:11 AM | Updated on Aug 8 2026 1:11 AM

వేములవాడ: వేములవాడ మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజుతోపాటు వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, కౌన్సిలర్లు కర్ణాటకలోని ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు వెళ్లారు. భట్కళ్‌లోని ప్రసిద్ధ మురుడేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గోకర్ణ మహాబలేశ్వరం, కొల్లూరులోని శ్రీమూకాంబికాదేవీని దర్శించుకున్నారు.

ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభం

వేములవాడఅర్బన్‌: మండలంలోని అగ్రహారం శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ను శుక్రవారం ప్రారంభించారు. ప్రిన్సిపాల్‌ ప్రభాకరాచారి, దాతలు కంటాల శివకుమార్‌, పెద్ది రాణి, అధ్యాపకులు శంకరయ్య, కుమారస్వామి, సుధాకర్‌, శ్యామ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

సిరిసిల్లటౌన్‌: యూపీఎస్సీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల సాధనకు శుక్రవారం ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. సిరిసిల్లలోని గీతానగర్‌ బాలికల హైస్కూల్‌లో ప్రీప్రైమరీ ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కొనసాగుతున్న నేపథ్యంలో భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement