బడి తెరిస్తే పిల్లలను పంపిస్తాం | - | Sakshi
Sakshi News home page

బడి తెరిస్తే పిల్లలను పంపిస్తాం

Aug 7 2026 3:53 AM | Updated on Aug 7 2026 3:53 AM

మా ఊర్లో ప్రాథమిక పాఠశాల మూతబడి మూడేళ్లు గడుస్తోంది. ఇరువై మంది వరకు పిల్లలను పంపిస్తామని మొన్నటి బడిబాటలో చెప్పాం. సార్లు కూడా వచ్చారు. కానీ తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించకపోవడంతో మళ్లీ ఆర్థికంగా భారమైన ప్రైవేటుకు పంపిస్తున్నాం. పాఠశాల తెరిస్తే పిల్లలను పంపిస్తాం.

– సతీశ్‌, కొదాటివానిపల్లె

బడులను కాపాడుకోవాలి

గన్నెవారిపల్లెలో ఇంకో టీచర్‌ కావాలి. కొదాటివానిపల్లెలో ప్రభుత్వ బడిని ఓపెన్‌ చేసేందుకు సహకరిస్తాం. ఇక్కడ పనిచేసే టీచర్‌ను తిరిగి మా ఊరికి రప్పించాలి. గ్రామస్తుల అందరి సహకారంతో ఊరి నుంచి విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లకుండా బడులను కాపాడుకుందాం.

– రేసు రఘు, సర్పంచ్‌,

గన్నెవారిపల్లె

డిప్యూటేషన్ల ఆర్డర్లు రాలేదు

గతేడాది జరిగిన టీచర్ల సర్దుబాట్లే ఇప్పుడు కొనసాగుతున్నాయి. కొత్తగా డిప్యూటేషన్లు చేపట్టలేదు. విద్యార్థులున్న చోటికి తప్పకుండా టీచర్లను పంపిస్తాం. అవసరమైన చోట వలంటీర్లను నియమించి బోధనకు ఆటంకం లేకుండా చర్యలు చేపడతాం.

– రవీందర్‌, ఎంఈవో,

ముస్తాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement