వ్యాపారులు డీఏపీ కొరత సృష్టించకుండా యూరియా తరహాలోనే యాప్లో విక్రయించాలి. కాంప్లెక్స్ ఎరువుల ధరలు రూ.2వేలకు పైగా ఉండడంతో డీఏపీ ధర రూ.1350గా ఉంది. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని డీఏపీ కొరత సృష్టిస్తూ.. ఇతరు ఎరువులు అంటగడుతున్నారు.
– చిలుక పెంటయ్య, రైతు సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు, చందుర్తి
రైతులు అడిగిందే ఇవ్వాలి
రైతులు అడిగిందే వ్యాపారులు ఇవ్వాలి. అలా కాకుండా బలవంతంగా ఇతర ఎరువులు అంటగడుతున్నట్లు ఫిర్యాదులు వస్తే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఫిర్యాదు వచ్చిన ముగ్గురు డీలర్లపై చర్యలు తీసుకున్నాం. డీలర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు లింక్తో ఏమైనా ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. – అఫ్జల్బేగం, జిల్లా వ్యవసాయాధికారి


