● ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర నాయకుడు దశరథం
సిరిసిల్లటౌన్: కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఎలాంటి ప్రయోజనాలు కల్పించని రోడ్డు నిర్మిస్తున్నారని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమిశెట్టి దశరథం పేర్కొన్నారు. ఈమేరకు గురువారం సిరిసిల్ల మానేరు కరకట్ట రోడ్డు నిర్మాణంపై మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా కోసమే మానేరునదిలో రోడ్డు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో మానేరు పరివాహక రైతుల పొలాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.


