యాంత్రీకరణతో రైతులకు లబ్ధి
బోయినపల్లి(చొప్పదండి): వ్యవసాయ యాంత్రీకరణ పథకంతో రైతులకు లబ్ధి చేకూరుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో 31 మంది రైతులకు రూ.6.78 లక్షల విలువైన సబ్సిడీ వ్యవసాయ పరికరాలను సోమవారం అందించారు. ఎంఏవో ప్రణిత, ఎంపీడీవో జయశీల, ముదుగంటి సురేందర్రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపెల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, వినోద్, బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, పులి లక్ష్మీపతి, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి, మహేశ్రెడ్డి, సర్పంచులు నల్ల మోహన్, ఏనుగుల కనకయ్య, జంగం అంజయ్య, డాక్టర్ వెంకటేశ్, రాజేశం, మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


