మహాజాతరను విజయవంతం చేయాలి
● జాతర ఏర్పాట్లపై సమీక్ష
వేములవాడ: రాజన్న క్షేత్రంలో ఈనెల 14 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని అధికారులు కోరారు. జాతర మహోత్సవాలపై ఆలయ ఈవో రమాదేవి, ఏఎస్పీ రుత్విక్సాయి, ఈఈ రాజేశ్ బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు.


