గణతంత్ర వేడుకలకు సిద్ధం
కలెక్టరేట్లో జాతీయ జెండా ఆవిష్కరణ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గౌరవ వందనం ఏర్పాట్లు చేసిన అధికారులు
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో సోమవారం గణతంత్ర వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ గరీమా అగ్రవాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి 9.05 నుంచి 9.10 గంటల వరకు పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. 9.10 గంటలకు కలెక్టర్ సందేశం, 9.25 నుంచి 9.55 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9.55 నుంచి 10.15 గంటల వరకు శకటాల ప్రదర్శన, 10.15 నుంచి 10.45 గంటల వరకు విధులలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు పంపిణీ, 10.45 నుంచి 11 గంటల వరకు స్టాల్స్ సందర్శన ఉంటుంది. ఈమేరకు కలెక్టరేట్, పోలీస్ పరేడ్గ్రౌండ్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.
గణతంత్ర వేడుకలకు సిద్ధం


