breaking news
Police
-
‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్లో రోల్ మోడల్గా తెలంగాణ
‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలపాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పోలీసింగ్ లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘ట్రిపుల్ టీ’(టెక్నాలజీ, ట్రస్ట్, టాలెంట్) వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు. ఆదివారం ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీస్ ఉన్నతాధికారులకు ‘తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026’ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... ఒకప్పుడు పోలీసింగ్ అంటే కేవలం శాంతి భద్రతల పరిరక్షణ మాత్రమే, ఇప్పుడు డేటా సెక్యూరిటీ, డిజిటల్ ట్రస్ట్ గా రూపాంతరం చెందిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా క్రైం కూడా భౌతిక సరిహద్దులను దాటి డిజిటల్ రూపంలోకి విస్తరించిందన్నారు. డీప్ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, ఆటోమేటెడ్ ఫిషింగ్ స్కామ్లు పోలీసులకు పెను సవాల్గా మారాయన్నారు. ప్రస్తుతం నేరగాళ్లకు ఆయుధాలతో పనిలేదని, స్మార్ట్ ఫోన్, డేటా, డిజిటల్ ఐడెంటిటీస్ తో నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఒక్క 2024లో దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రూ.22,845 కోట్లు కొల్లగొట్టారని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 206 శాతం ఎక్కువన్నారు. సైబర్ బాధితుల్లో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే అధికంగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రొఫెషనలిజం, ఆపరేషనల్ రెడీనెస్, లీడర్షిప్, ఇన్నోవేషన్, కొలాబరేషన్ , ఎథిక్స్ తో కూడిన ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ ఆవశ్యకమన్నారు. ఇప్పటికే టెక్నాలజీ ఎనేబుల్డ్ పోలీసింగ్ లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో డేటా అనలిటిక్స్, ఏఐ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సాయంతో నేరాల జరగకముందే అడ్డుకునే ‘ప్రెడిక్టివ్ పోలీసింగ్’కు పెద్దపీట వేస్తామన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే అసలైన పోలీసింగ్ సాధ్యమవుతుందన్నారు. నక్సలిజంపై పోరాటంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్మరించుకున్నారు. వారి త్యాగం వృథా కాలేదన్నారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష భిష్త్, రిటైర్డ్ డీజీపీలు హెచ్ జే దొర, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండో సారి.. ఎస్ఐ సస్పెన్షన్
హైదరాబాద్: డబ్బు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్ అయ్యాడు.. అనంతరం కొద్ది సంవత్సరాల తరువాత విధుల్లో చేరాడు.. ఈ క్రమంలో సిటీలోని ఓ పీఎస్లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టాడు. ఇక్కడా అతని పంథా మారలేదు..వసూళ్ల పర్వం కొనసాగించాడు. గమనించిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. పాతబస్తీ ఐఎస్ సదన్ పోలీస్స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్ను నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. వెంకటేశ్ జూన్లో స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచీ వెంకటేశ్పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో కేసులను నమోదు చేయకుండా జాప్యం చేయడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. బాధితులు, నేరస్తుల నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో విచారణ అనంతరం నగర పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. 2019లో మహబూబ్నగర్ తెల్కపల్లిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యాపారి నుంచి డబ్బు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కేసులో కొన్ని సంవత్సరాలపాటు సస్పెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా అతని తీరు మారకపోవడం విచారకరం. -
లాఠీలతో చావ గొట్టి రోడ్డుపై కోర్టు వరకు నడిపించిన పోలీసులు
-
పోలీసు అధికారిని చంపిన వ్యక్తికి మరణ శిక్ష
స్టార్క్(యూఎస్ఏ): ఓ పోలీస్ అధికారిని అతడి సొంత సర్వీస్ రివాల్వర్తో ఏకంగా 14సార్లు కాల్చి మరణానికి కారకుడైన వ్యక్తికి మంగళవారం సాయంత్రం ఫ్లోరిడా జైలులో మరణ శిక్ష అమలు చేశారు. స్టార్క్ సమీపంలోని ఫ్లోరిడా స్టేట్ ప్రిజన్లో సాయంత్రం 6 గంటలకు దోషి అయిన బిల్లీ లియోన్ కీర్స్(53)కు మూడు ఇంజెక్షన్ల ద్వారా ఈ శిక్షను అమలు చేశారు. చివరి కోరిక తెలపాలని జైలు వార్డెన్ కోరగా..‘మృతుడు డానీ పారిష్ కుటుంబం నుంచి క్షమాపణలు మాత్రమే కోరుతున్నాను. ఇంతకు మించి వారికి తిరిగి ఏమీ ఇవ్వలేను’అని పేర్కొన్నాడు. ఆ సమయంలో మరణ శిక్ష అమలును చూసేందుకు కుటుంబీకులు, అధికారులు కలిపి అక్కడ 15 మంది వరకు ఉన్నారు. బిల్లీ లియోన్ కీర్స్ 1991 జనవరిలో ఓ రోజు కారులో వెళ్తుండగా ఫోర్ట్ పియర్స్ పోలీసు అధికారి డానీ పారిష్ అతడిని ఆపారు. ఆ సమయంలో అతడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు. పైపెచ్చు అతడి వద్ద డ్రైవింగ్ లైసెన్సు లేదు. దీంతో, అతడికి బయటకు రప్పించి, చేతులకు బేడీలు వేసేందుకు యత్నించగా పెనుగులాట జరిగింది. అదను చూసుకుని పారిష్ వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్ను కీర్స్ లాక్కున్నాడు. అతడిపైకి 14సార్లు కాల్చాడు. దీంతో, అక్కడికక్కడే పారిష్ చనిపోయారు. పోలీసులు అనంతరం కీర్స్ను ఇంట్లోనే అరెస్ట్ చేశారు. 1991లోనే కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఫ్లోరిడా సుప్రీంకోర్టు మళ్లీ విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చింది. 1997లో తిరిగి విచారణ జరిపిన కోర్టు కూడా అతడికి మరణశిక్షనే విధించింది. గత వారం ఫ్లోరిడా సుప్రీంకోర్టు కీర్స్ అప్పీల్ను తిరస్కరించింది. మరణ శిక్ష అమలుకు కొద్ది గంటల ముందు కీర్స్ చేసిన తుది అప్పీల్ను అమెరికా సుప్రీంకోర్టు సైతం ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా కొట్టివేసింది. -
కొమ్మల్లో దాగింది కొంటె చిలకమ్మ!
హైదరాబాద్: అది ఖరీదైన, అరుదైన ఆఫ్రికన్ గ్రే చిలక. శ్రీనగర్ కాలనీలోని ఓ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఆదివారం రాత్రి ఇంట్లోంచి తుర్రుమంది. దీంతో ఆ కుటుంబమంతా విలవిలలాడింది. బ్యాటరీ లైటుతో రాత్రంతా గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ చెట్టు కొమ్మ సందుల్లో కనిపించింది. కిందికి తీసుకొచ్చేందుకు యతి్నంచినా ఫలితం లేకుండాపోయింది. పోలీసులు ఫైర్ ఇంజిన్కు, హైడ్రాకు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ అక్కడకు చేరుకుని నిచ్చెన పైకి లేపేందుకు యత్నిస్తుండగా శబ్దానికి ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి ఎగిరిపోయింది. దీంతో జీహెచ్ఎంసీ వీధి దీపాల విభాగానికి సమాచారమిచ్చారు. వారు బకెట్ క్రేన్లో కుటుంబ యజమానిని కూర్చోబెట్టి అలికిడి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెట్ల కొమ్మల్లోని చిలకను 3 గంటల పాటు పోలీసులు, హైడ్రా సిబ్బంది, ఫైర్ సిబ్బంది, జీహెచ్ఎంసీ వీధి దీపాల విభాగం సిబ్బంది ప్రయతి్నంచి విజయం సాధించారు. ఆఫ్రికన్ గ్రే చిలకను పట్టుకోవడానికి నాలుగు ప్రభుత్వ శాఖల సిబ్బంది శ్రమించడం కొసమెరుపు. -
సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు ఏపీ పోలీసులపై కోర్ట్ సీరియస్
-
ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు
బిహార్ ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ను పోలీసులు విత్డ్రా చేసుకున్నారు. సునీల్ నాయక్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని గుంటూరు స్పెషల్ మెుబైల్ కోర్టును పోలీసుల ఆశ్రయించారు.దీంతో అరెస్ట్ చేసిన తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ ఏంటి అని అధికారులను ప్రశ్నించింది. గుంటూరు స్పెషల్ కోర్టు. దీంతో కోర్టు ప్రశ్నలకు కంగుతిన్న పోలీసులు, లాయర్లు సునీల్ నాయక్ నాన్ బెయిలబుల్ వారెంట్ ను విత్డ్రా చేసుకున్నారు. కాగా అంతకు ముందు ఏపీ పోలీసు అధికారులు.. బిహార్ కేడర్ ఐజీ సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు ఆ రాష్ట్ర రాజధానిలో హంగామా చేశారు. అయితే అక్కడ ఏపీ పోలీసులకు భంగపాటు తప్పలేదు. తమ అధికారిని గోడదూకి ఎలా అరెస్ట్ చేస్తారంటూ బిహార్ ప్రభుత్వం మండిపడింది. తమ రాష్ట్ర కేడర్కు చెందిన పోలీసు అధికారులపై ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా తమ ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ గత శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది.తమ అధికారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా తాము అనుమతించాలంటే పాటించాల్సిన నిబంధనలను కూడా వెల్లడించింది. కేంద్ర పోలీసు బలగాలకు చెందిన అధికారులకు వర్తించే అన్ని రకాల రక్షణ చర్యలు బిహార్ ప్రభుత్వ అధికారులకు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 218 కింద బీహార్ పోలీసులకు రక్షణ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.దీంతో కేంద్ర సాయుధ దళాలకు రక్షణ తరహాలోనే బీహార్ పోలీసులకు ప్రభుత్వ రక్షణ కల్పించనుంది. బిహార్ పోలీస్ అధికారి సునీల్ నాయక్ పై ఏపీ పోలీసుల దుందుడుకు చర్యలు నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతీకార, రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో అధికారులను వేధించకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. కేసులను సమీక్షించిన తర్వాతే అనుమతిపై నిర్ణయం తీసుకునేలా నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా కోర్టులు సైతం ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ తిరస్కరించింది. -
అక్రమ వసూళ్లు..అధికార దుర్వినియోగం!
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పలు తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, 15 రోజుల్లో ఆయనపై చర్యలు తీసుకోకపోతే సీపీ చేస్తున్న అన్ని అక్రమాలకు సంబంధించిన ఆధారాలు వీడియోలతో సహా త్వరలో అసెంబ్లీ, మీడియా సాక్షిగా బయటపెడతానని హెచ్చరించారు. ‘కరీంనగర్ సీపీ బచ్చాగాడు, ఆయన వయస్సు 40 యేండ్ల కంటే చిన్ననే..’అని వ్యాఖ్యానించారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కౌశిక్రెడ్డి మాట్లాడారు. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ వాహనాలా? ‘పీడీఎస్ బియ్యం అక్రమార్కుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. 337 మంది హోంగార్డుల బదిలీ కోసం రూ.కోటి తీసుకున్నారు. ప్రభుత్వ వాహనాలు ప్రైవేటు వ్యక్తుల కోసం ఉపయోగిస్తున్నారు. టీఎస్ 09 పీఏ 4195 ఇన్నోవా వాహనాన్ని సీపీ గౌస్ ఆలం తన మిత్రుడు, ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి కోసం వినియోగిస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లు డ్రైవర్లుగా ఉన్నారు. టీఎస్ 09 పీఏ 5601 ఇన్నోవా కారు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సోదరుడిని కాలేజీలో డ్రాప్ చేసేందుకు రోజు చలిమెడ వెళ్తుంది. ప్రైవేటు పౌరుల కోసం ప్రభుత్వ వాహనాల వాడకంపై డీజీపీ శివధర్రెడ్డి సమాధానం చెప్పాలి. సీపీ సతీమణికి కరీంనగర్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఎలా వచి్చందో తెలుసు. ఆమె కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు డ్యూటీ చేస్తున్నారు. ఇక ఆయన ఇంట్లో 20 మంది కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు..’అని కౌశిక్రెడ్డి ఆరోపించారు. వసూళ్ల కోసం ఏసీపీ, సీఐని పెట్టుకున్నారు.. ‘బియ్యం అక్రమార్కుల నుంచి డబ్బులు వసూలు చేయించేందుకు ఏసీపీ విజయ్కుమార్, సీఐ సృజన్రెడ్డిని సీపీ పెట్టుకున్నారు. జనవరి 8న ఎన్ఎన్ ప్రైడ్ మాల్కు ఎన్ఓసీ ఇచ్చేందుకు ఆ మాల్ యజమాని దగ్గర నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారు. నేను చెప్పింది అబద్ధం అయితే నా ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం. చర్యలు తీసుకోకపోతే వీడియోలు బయట పెడతా. ఆ తర్వాత ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ బాధపడకూడదు. ఎందుకంటే నేను ఆ వీడియోలు బయట పెడితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తలదించుకునే పరిస్థితి వస్తుంది. 15 రోజుల తర్వాత హుజూరాబాద్ ఏసీపీ, జమ్మికుంట సీఐ ఏమేం పనులు చేస్తున్నారో అన్నీ బయట పెడతా..’అని కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. -
రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు
సాక్షి, అమరావతి: ‘రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు... మన సహచర పోలీసు అధికారులను వేధించేందుకు మీ తెలివితేటలు ఉపయోగించవద్దు’ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పోలీసు అధికారులకు చేసిన సూచన ఇది. బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అక్రమ అరెస్టుకు ప్రయత్నించిన ఏపీ పోలీసులకు చెంపపెట్టుగా బిహార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే.బిహార్ ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ రిటైర్డ్ ఐజీ ఇ. దామోదర్ ఐపీఎస్ అధికారుల వాట్సాప్ గ్రూపులో ఒక పోస్టు పెట్టారు. ఆ గ్రూపులో ప్రస్తుతం సర్వీసులో ఉన్న, రిటైర్ అయిన ఐపీఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. దామోదర్ పోస్టుపై డీజీ మాదిరెడ్డి ప్రతాప్ స్పందిస్తూ సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారుల వాట్సాప్ గ్రూపులో ఇచ్చిన జవాబు ప్రస్తుతం యావత్ పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.బిహార్ ప్రభుత్వ నోటిఫికేషన్ న్యాయబద్దం కాదు: రిటైర్డ్ ఐజీ ఇ. దామోదర్ బిహార్ క్యాడర్ పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేముందు తమ అనుమతి తప్పనిసరి అని ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ న్యాయబద్ధమైనది కాదు. ఆ రాష్ట్ర క్యాడర్ పోలీసు అధికారి సునీల్ నాయక్ను రక్షించేందుకే హడావుడిగా ఆ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర సాయుధ బలగాలకు ఉద్దేశించిన నిబంధనను పోలీసు అధికారులకు వర్తింపజేయడం సరైన చర్య కాదు. రాజకీయ నేతల చేతిలో పావులు కావద్దు: మాదిరెడ్డి ప్రతాప్ ‘మన తెలివితేటలన్నీ కూడా సహచర పోలీసు అధికారులను వేధించేందుకు ఉపయోగించవద్దు. ఇప్పటికే దేశంలో ఏపీలో మాత్రమే పలువురు పోలీసు అధికారులు జైలుకు వెళ్లారు. విచారణ ఎదుర్కొంటున్నారు. అందుకే రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెడతాం. అంతేగానీ రాజకీయ నేతల ప్రభావానికి గురై ఇటువంటి కక్ష సాధింపు, ప్రతీకార చర్యలకు పాల్పడవద్దు. వాటికి ముగింపు పలుకుదాం’.మాదిరెడ్డి స్పందన పట్ల హర్షం రిటైర్డ్ ఐజీ దామోదర్ పెట్టిన పోస్టుపై పోలీసు అధికారుల్లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పోలీసు అధికారులకు రక్షణ కల్పిస్తూ ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను సాటి పోలీసు అధికారి తప్పుబట్టడం ఏమిటని ప్రశ్నించారు. పైగా పోలీసు అధికారుల సంక్షేమం, సమన్వయం కోసం ఉద్దేశించిన వాట్సాప్ గ్రూపులలో అందుకు విరుద్ధమైన పోస్టు పెట్టడం పట్ల కూడా పోలీసు అధికారులు అంతర్గత సంభాషణల్లో తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే డీజీ ర్యాంకు అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కాస్త కటువుగానే స్పందించి సరైన సమాధానం ఇచ్చారని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోలీసు శాఖ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఒక్కరైనా ధైర్యంగా స్పందించి పోలీసు అధికారులు చట్టబద్ధంగా చేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేశారని ప్రశంసిస్తున్నారు. -
దుబాయ్ లో రోబో పోలీస్
-
అన్వేష్ కు బిగ్ షాక్.. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ కు పోలీసుల లెటర్..
-
ఎఫ్ఐఆర్ నమోదు చేయరేం!
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మ రణానికి కారణమైన విమాన ప్రమాద ఉదంతంపై అను మానాలు నానాటికీ బలపడుతున్నాయని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ అన్నారు. ఆ దుర్ఘటనపై కేసు నమోదు చేయడానికి ముంబై పోలీసులు నిరాకరించడమే ఇందుకు తాజా నిదర్శనమని ఆయన చెప్పారు. ఈ ఉదంతా నికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, యంత్రాంగం ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం ఎక్స్లో రోహిత్ పలు పోస్టులు పెట్టారు.‘‘అజిత్ ప్రయాణించిన లియర్జెట్ 45 (వీటీ–ఎస్ఎస్కే) విమానం సొంతదారైన వీఎస్ఆర్ వెంచర్స్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని డీజీసీఏ మంగళవారం తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. దాంతో ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి ఎఫ్ఐ ఆర్ దాఖలు చేయాల్సిందిగా సహచర ఎమ్మెల్యేలు అమోత్ మిత్కరీ, సందీప్ క్షీర్సాగర్, నేను మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి డిమాండ్ చేశాం.కానీ ఎఫ్ ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరించారు. లాంఛ నంగా మా ఫిర్యాదును స్వీకరించడంతో సరిపెట్టారు. విమా న ప్రమాదంపై మాకిప్పటికే ఉన్న అనుమానాలను పోలీ సుల తీరు మరింత బలపరుస్తోంది’’ అని పేర్కొన్నారు. అజి త్ విమాన ప్రమాదంపై ఎఫ్ఐఆర్ దాఖలుకు డిమాండ్ చేసే ందుకు గురువారం ఉదయం బారామతి పోలీస్ స్టేషన్ కు వెళ్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఫిర్యాదు ను దర్యాప్తు నిమిత్తం సీఐడీకి పంపినట్టు పోలీసులు తెలి పారు.వెనకేసుకొచ్చిన వైమానిక మంత్రివీఎస్ఆర్ వెంచర్స్కు క్లీన్చిట్ ఇచ్చేందుకు డీజీసీఏ తొలుత ప్రయత్నించిందంటూ రోహిత్ ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా వీఎస్ఆర్ సంస్థను వెనకేసుకొచ్చారని ఆయన ఆరోపించారు. విమానంలో భద్రతా లోపాలేవీ లేవని, అన్ని పరీక్షల తర్వాత దానికి డీజీ సీఏ అనుమతులిచ్చిందని చెప్పారని గుర్తు చేశారు. ‘‘ఆ విమానంలో లోపాలున్నట్టు ఇప్పుడు డీజీసీఏ చెబుతోంది. అయినా అనుమతులిచ్చిందంటే ఇందులో ఆ సంస్థ తప్పు కూడా ఉన్నట్టే’’ అంటూ దుయ్యబట్టారు.వీఎస్ఆర్ సంస్థకు చెందిన నాలుగు విమాన సర్వీసులను తక్షణం నిలిపే యాలని డీజీసీఏ మంగళవారం ఆదేశించడం తెలిసిందే. ఇది తమ పోరాటానికి లభించిన పాక్షిక విజయమని రోహిత్ అన్నారు. ‘‘కానీ వీఎస్ఆర్ తప్పిదాలకు మా నాయకుడు బలయ్యారు. ఏదో ఒకనాటికి అజిత్ కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. వీఎస్ఆర్కు చెందిన ఇతర విమాన సర్వీసులను ఎందుకు కొనసాగి స్తున్నారని డీజీసీఏను ప్రశ్నించారు. వాటన్నింటినీ తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేశారు.రామ్మోహన్ రాజీనామా చేయాల్సిందేవీఎస్ఆర్ వెంచర్స్కు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలతో సన్నిహిత వ్యాపార సంబంధాలున్నాయని రోహిత్ పవార్ ఆరోపించారు. వీటన్నింటిపైనా లోతుగా దర్యాప్తు జరగాలన్నారు. పౌర విమాన యాన మంత్రి రామ్మోహన్నాయుడుది కూడా అదే పార్టీ అని గుర్తు చేశారు. ఆయన రాజీనామా చేసి తీరాల్సిందేనని పునరుద్ఘాటించారు. అందుకోసం ఒత్తిడి తెస్తూనే ఉంటానని రోహిత్ స్పష్టం చేశారు.‘‘అంతేగాక వీఎస్ఆర్ వెంచర్స్ యజమానిపై తక్షణం కేసు నమోదు చేయాలి. డీజీసీఏలోని సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. అజిత్ ప్రయాణించిన విమానం ఫిట్గా ఉందని మహా రాష్ట్రకు చెందిన వైమానిక సమన్వయ కంపెనీ ‘యారో’ తప్పుడు ధ్రువీకరణకు పాల్పడింది. అంతేగాక ప్రమాదం జరిగిన రోజు వాతావరణ పరిస్థితులు విమాన ప్రయాణానికి అనువుగా ఉన్నాయని కూడా పేర్కొంది. కనుక ఆ కంపెనీపైనా కేసు పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. -
2024 తర్వాతే.. లొంగు‘బాట’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ డిఫ్యాక్టో చీఫ్గా చెప్పుకుంటున్న దేవ్జీని.. ఆయుధం వదిలి సాధారణ జీవితం గడిపేందుకు ఒప్పించడంలో తెలంగాణ పోలీసులు సాధించిన విజయం ప్రత్యేకంగా నిలిచిందనే చెప్పాలి. అయితే ఆయుధం వీడటానికి ముందు మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. లొంగిపోయిన మావోయిస్టులు, సాయుధ పోరాట సానుభూతిపరులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ నిర్బంధంపై 2018 లోనే మావోయిస్టులు ఒక అంచనాకు వచ్చారు. అయితే 2024 జనవరి 1న కేంద్రం ఆపరేషన్ కగార్ను ప్రారంభించడంతో మావోలపై ముప్పేట దాడి మొదలైంది.2024 ఆగస్టు నాటికి సాయుధ పోరాటం కష్టమనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో బలంగా వినిపించడం ప్రారంభమైంది. అయితే ఆ సమయంలో ‘బెంగాల్లో మన పోరాటం మొదలైంది. అక్కడ నిర్బంధం పెరిగితే శ్రీకాకుళం వచ్చాం. మన్యంలో ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఉత్తర తెలంగాణను గెరిల్లా జోన్గా మార్చాం. అక్కడ ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే దండకారణ్యం చేరుకున్నాం. మునుపెన్నడూ లేనంత బలంగా దండకారణ్యంలో పాతుకుపోయాం. నిర్బంధం పేరుతో చివరకు ఈ ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయడం సరికాదు.నిర్బంధం పేరుతో ఇంకెంత కాలం అడ్డాలు మారుస్తాం’అంటూ హిడ్మా తదితర నేతలు వెల్లడించిన అభిప్రాయానికి పారీ్టలో మెజార్టీ మద్దతు లభించడంతో ఆయుధం వదిలేందుకు మావోలు సిద్ధపడలేదు. రెండు వర్గాలుగా.. ఆపరేషన్ కగార్ తీవ్రత అంచనాలకు మించి ఉండడంతో 2025 ఏప్రిల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి శాంతి చర్చల ప్రస్తావన వచ్చింది. కానీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోగా, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంజీ జార్ఖండ్లో ఎన్కౌంటర్ అయ్యారు. ఆ వెంటనే మే 21న జరిగిన గుండెకోట్ ఎన్కౌంటర్లో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా మృతి చెందారు. అప్పటి నుంచి ఆ పార్టీకి సరైన దిశానిర్దేశం కరువైంది. ఆ తర్వాత చోటుచేసుకున్న మరికొన్ని ఎన్కౌంటర్లలో సీసీ మెంబర్లుగా ఉన్న పర్వేశ్, గణేశ్, మోడెం బాలకృష్ణ, సుధాకర్, కడారి సత్యనారాయణరెడ్డి, కాతా రామచంద్రారెడ్డి వంటి కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. దీంతో సాయుధ పోరాట పంథాకు కాలం చెల్లిందనే వాదన వినిపిస్తున్న మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి వారు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్జీ, హిడ్మా, మిసిర్ బెష్రా సాయుధ పోరాట పంథాను ఎంచుకున్నారు. దీంతో ఆ పార్టీలో స్పష్టమైన చీలిక వచ్చినట్టయింది. హిడ్మా మరణంతో.. దండకారణ్యం నుంచి అర్బన్ షెల్టర్లకు తరలే క్రమంలో హిడ్మా చనిపోవడం పార్టీపై పెను ప్రభావం చూపించింది. అనంతరం సాయుధ పంథాను ఎంచుకున్న సీసీ సభ్యుడు రాంధేర్తో పాటు అనేక మంది కింది స్థాయి సభ్యుల లొంగుబాటు పరంపర మొదలైంది. మరోవైపు అజ్ఞాతంలోనే ఉన్న పాక హన్మంతు, అనల్దా వంటి సీసీ మెంబర్లు కూడా ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో గతేడాది చివరి వారం నాటికే సాయుధ పోరాటం సాధ్యం కాదనే అభిప్రాయానికి ఆ పార్టీ అగ్రనాయకత్వం వచ్చింది. తెలంగాణ విధానాలతో.. అడవిని వీడాలనుకునే మావోయిస్టుల విషయంలో ఆయుధాల అప్పగింతపై తెలంగాణ పోలీçసులు షరతులు విధించడం లేదు. అంతేకాదు సరెండర్ సమ యంలో తమతో పాటుగా కుర్చీలు వేసి గౌరవప్రదంగా సాధారణ జీవితంలోకి స్వాగతం పలుకుతున్నారు. అక్కడికక్కడే నేరుగా ప్రెస్తో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో దశాబ్దాల పాటు నాడీ, నరం, కండ, బుద్ధి ఇలా అన్నింటా తిరుగుబాటు స్వభావం, సాయుధ పోరాట పంథాను అలవర్చుకున్న మావోయిస్టులు..ఇతర రాష్ట్రాల వైపు చూడకుండా తెలంగాణకు వస్తున్నారు. కాల్వపల్లి చివరి వ్యక్తి దామోదరే.. ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన పలువురు వివిధ కారణాలతో మావోయిస్టు ఉద్యమబాట పట్టారు. ఈ నేపథ్యంలో గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఏడుగురు మృతి చెందారు. ఇక గ్రామానికి చెందిన చివరి వ్యక్తి, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు మంగళవారం డీజీపీ ఎదుట లొంగిపోయారు. దీంతో ఉద్యమ బాటలో కాల్వపల్లి ప్రస్థానం ముగిసినట్లయ్యింది. కొడుకును చూడలేను‘నా కొడుకు అన్నల్లో కలిసి 30 ఏళ్లు అయ్యింది. పోలీసులకు లొంగిపో అని చెప్పిన. నేను చెప్పినట్లే లొంగిపోయినందుకు ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు నాకు కంటిచూపు లేదు. కొడుకు వచ్చినా చూడలేను. చేయి పట్టుకుని మాట్లాడుతా..’అంటూ దామోదర్ తల్లి బతుకమ్మ కన్నీటిపర్యంతం అయ్యింది. -
ఏపీ పోలీసులపై బీహార్ కోర్టు సీరియస్
-
‘నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు’
వాషింగ్టన్: తన నివాస ప్రాంతమైన మార్-ఎ-లాగో రిసార్టులోకి ప్రవేశించిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ ఘటనపై ట్రంప్ స్పందించాడు. తాను ఎంతకాలం నేను ఇక్కడ ఉంటానో తెలియదు. అనేమంది తనని టార్గెట్ చేసుకున్నట్లు వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్లో జరిగిన ఘటనపై దుమారం చెలరేగింది. దుండగుడు ట్రంప్ నివాస ప్రాంగణంలో మార్టిన్ అక్రమంగా ప్రవేశించడంతో, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపి హతమార్చారు.పోలీసుల వివరాల ప్రకారం, నార్త్ కరోలినాకు చెందిన 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్ ఫిబ్రవరి 23 తెల్లవారుజామున ఉత్తర గేటు వద్ద రైఫిల్తో లోపలికి ప్రవేశించాడు. భద్రతా సిబ్బంది అతన్ని ఆపడానికి ప్రయత్నించినా, ఆయుధాన్ని వదలమని చెప్పినా అతను నిరాకరించడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటన సమయంలో ట్రంప్, మెలానియా ట్రంప్ అక్కడ లేరు. ఈ సంఘటనపై ట్రంప్ పైవిధంగా మాట్లాడారు. ప్రస్తుతం ఎఫ్బీఐ, సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ట్రంప్పై దాడికి ఎందుకు యత్నించాడు. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు -
రెడ్బుక్ రివర్స్.. బిహార్లో బేజార్!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్బుక్ అరాచకాలకు బిహార్ గడ్డ ఘాటుగా బుద్ధి చెప్పింది! రెడ్బుక్ రాజ్యాంగ వేధింపులను బిహార్లో కూడా అమలు చేసేందుకు బరితెగించిన ఏపీ పోలీసులు ఘోర పరాభవానికి గురయ్యారు. ప్రస్తుతం బిహార్లో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఐపీఎస్, ఐజీ స్థాయి అధికారి సునీల్ నాయక్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు అక్కడకు వెళ్లిన సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ దామోదర్ తన బృందంతో కలసి బీభత్సం సృష్టించారు. సోమవారం తెల్లవారుజామున పట్నాలోని సునీల్ నాయక్ నివాసం గోడదూకి మరీ ఎస్పీ దామోదర్ బృందం కిడ్నాపర్ల మాదిరిగా చొరబడటం తీవ్ర విభ్రాంతికి గురి చేసింది. ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని బిహార్ పోలీసు యంత్రాంగం యావత్తూ ఒక్కటై అడ్డుకుంది.మరోవైపు ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు తీవ్రంగా మండిపడింది. ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారులు పాటించాల్సిన కనీస నిబంధనలను కూడా అనుసరించకుండా ఓ ఐపీఎస్ అధికారి నివాసంలో చొరబడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఎఫ్ఐఆర్లో పేరు లేదు.. కేసు డైరీ లేదు.. స్థానిక కోర్టు నుంచి వారెంట్ లేదు.. ఇవేవీ లేకుండా ఒక సామాన్యుడిని కూడా అరెస్టు చేయడానికి వీల్లేదు.. అటువంటిది ఒక ఐపీఎస్ అధికారిని అరెస్టు చేయడానికి ఏపీ నుంచి పోలీసులు బిహార్ రావడం ఏమిటి..? సునీల్ నాయక్ అరెస్టును అనుమతించేది లేదు.. ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసే ప్రసక్తే లేదు..‘‘ అని పట్నా సివిల్ కోర్టు మండిపడింది. సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. ఒక దశలో ఏపీ పోలీసులను అరెస్టు చేస్తామని కూడా వ్యాఖ్యానించింది. దాంతో బిహార్లో తీవ్ర అవమానానికి గురైన ఏపీ పోలీసులు బిక్క మొహంతో తిరుగుముఖం పట్టారు. ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను బజారుకీడ్చి తీవ్ర అవమానభారంతో వెనుదిరిగారు. యావత్ దేశంలో సంచలనంగా మారిన ఏపీ పోలీసుల రెడ్బుక్ అరాచకం ఇలా ఉంది..!! కిడ్నాపర్ల మాదిరిగా ఏపీ పోలీసులు.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇచి్చన ఫిర్యాదుపై అక్రమ కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు బరితెగించి వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఆయన అహాన్ని సంతృప్తి పరచడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు యావత్ పోలీసు శాఖకు రెడ్బుక్ టాస్క్ ను అప్పగించారు. దాంతో గుంటూరులోని నగరపాలెం పోలీసు స్టేషన్లో అక్రమ కేసు నమోదు చేయించి దర్యాప్తు పేరిట దళిత, గిరిజన ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారు. అందుకోసం అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ అయినా సరే ఈ కేసు దర్యాప్తు అధికారిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గతంలో డిప్యుటేషన్పై రాష్ట్రంలో సీఐడీ డీఐజీగా పని చేసిన గిరిజన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను లక్ష్యంగా చేసుకున్నారు.ప్రస్తుతం బిహార్లో అగ్నిమాపక శాఖ, హోంగార్డ్స్ విభాగం ఐజీగా ఉన్న ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసుల బృందం తాజాగా పట్నా వెళ్లింది. అందుకోసం ఏపీ పోలీసులు కిడ్నాపర్ల మాదిరిగా వ్యవహరించారు. ఎస్పీ దామోదర్ తన బృందంతో కలసి సోమవారం తెల్లవారుజామున సునీల్ నాయక్ అధికారిక నివాసం గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆయన్ను చుట్టిముట్టి బలవంతంగా తమతో లాక్కెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన సునీల్ నాయక్ ప్రతిఘటించి కేకలు వేయడంతో పక్కన పోలీస్ క్వార్టర్స్లో ఉన్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. కిడ్నాపర్లు వచ్చారని భావించి దాదాపు వందమంది పోలీసులు, హోంగార్డులు ఆ నివాసాన్ని చుట్టుముట్టారు. ఎఫ్ఐఆర్లో పేరు లేదు... కేసు డైరీ, వారెంటూ లేదు.. బిహార్ అగ్ని మాపక శాఖ డీజీతోపాటు పలువురు అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు అక్కడకు చేరుకుని గట్టిగా నిలదీయడంతో ఏపీ పోలీసుల బండారం బయటపడింది. తాను ఎస్పీనని.. సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు వచ్చామని దామోదర్ చెప్పడంతో బిహార్ పోలీసు అధికారి, న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. అరెస్టు వారెంటు ఉందా? అని ప్రశ్నించగా ఏపీ పోలీసులు తెల్లమొహం వేశారు. పోనీ ఏ కేసులో అరెస్టు చేస్తున్నారు..? కేసు డైరీ ఉందా..? ఎఫ్ఐఆర్ కాపీ ఉందా..? స్థానిక కోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ వారెంట్ ఉందా..? అని నిలదీయడంతో అవేవీ తమ వద్ద లేవని బదులిచ్చారు. అసలు సునీల్నాయక్కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది కదా..! అని న్యాయవాదులు గుర్తు చేయడంతో ఏపీ పోలీసులు మౌనం దాల్చారు. అయినా సరే.. 35 బీఎన్ఎస్ఎస్ కింద సునీల్నాయక్ను తాము అరెస్టు చేస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించారు.అయితే ఆ నిబంధన కింద అరెస్టు చేసేందుకు వారికి అధికారం లేదని న్యాయవాదులు అభ్యంతరం తెలిపినా ఆలకించలేదు. ఆయన్ను అరెస్టు చేశామని, తమతో తీసుకువెళ్తామని మొండిగా వాదించారు. సునీల్నాయక్ను బలవంతంగా తీసుకువెళ్లేందుకు యత్నించారు. దాంతో బిహార్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. వంద మందికిపైగా పోలీసులు, హోంగార్డులు ఏపీ పోలీసు బృందాన్ని చుట్టుముట్టడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడకు చేరుకున్న పట్నా ఎస్పీ (ఈస్ట్) భానుప్రతాప్సింగ్ ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీల్ నాయక్ను మీరు అరెస్టు చేశామనుకుంటే అనుకోండి..! కానీ ఆయన్ను మా అనుమతి లేకుండా... న్యాయస్థానం ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తీసుకెళ్లేందుకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఏపీ పోలీసులపై పట్నా కోర్టు ఫైర్.. సునీల్ నాయక్ అరెస్టుకు ‘నో’ ఈ క్రమంలో సునీల్ నాయక్ తరపు న్యాయవాదులు సోమవారం ఉదయం పట్నా కోర్టును ఆశ్రయించారు. బిహార్ ఐపీఎస్ అధికారిని ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఓ ఐపీఎస్ అధికారి నివాసంలోకి ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని ఏపీ పోలీసుల బృందం గోడదూకి చొరబడటంపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఒకానొక దశలో ఏపీ పోలీసులను అరెస్టు చేసేందుకు ఆదేశిస్తామని కూడా హెచ్చరించింది. దీంతో ఏపీ పోలీసులు అప్పటికప్పుడు ఆగమేఘాలపై పట్నా కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.సునీల్ నాయక్ను అరెస్టు చేశామని చెబుతూ, ఏపీకి తీసుకువెళ్లేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని కోరారు. దీనిపై బిహార్ పోలీసుల తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సునీల్ నాయక్ పేరు ఎఫ్ఐఆర్లో లేదని.. ఆయనకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలే లేవని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని హైకోర్టుకు నివేదించారు. అనంతరం సునీల్ నాయక్ను నిందితుడిగా చేర్చి నోటీసులు జారీ చేయగా పట్నా హైకోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందిన విషయాన్ని గుర్తు చేశారు. విచారణకు సహకరిస్తారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు.సునీల్ నాయక్పై ఏపీ పోలీసులు పెట్టిన కేసును క్వాష్ చేయాల్సిందిగా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేస్తామని నివేదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం పట్నా కోర్టు సునీల్ నాయక్కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను అరెస్టు చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. సునీల్ నాయక్కు వ్యతిరేకంగా ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు నిరాకరించింది. సునీల్ నాయక్పై 30 రోజుల వరకూ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దాంతో ఎస్పీ దామోదర్ బృందం బిహార్లో భంగపాటుకు గురైంది. ఏపీ డీజీపీ vs బిహార్ డీజీపీసునీల్ నాయక్ అక్రమ అరెస్టు పన్నాగం బెడిసికొట్టడంతో నాలు క కరుచుకున్న ఏపీ పోలీసులు డీజీపీ హరీశ్కుమార్ గుప్తాను ఫోన్లో బిహార్ డీజీపీ వినయ్కుమార్తో మాట్లాడించినట్లు సమాచారం. సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు సహకరించాలని కోరడంపై బిహార్ డీజీపీ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ‘ఐజీ సునీల్ నాయక్ నా పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి.ఈ రోజు ఏపీ పోలీసులు ఆయన నివాసంలో గోడ దూకి ప్రవేశించారు. ఆయన్ను ఎత్తుకు పోయేందుకు యత్నించారు. ఇందుకు అనుమతిస్తే భవిష్యత్లో నా బంగ్లాలోకి కూడా అక్రమంగా ప్రవేశించి నన్నూ ఎత్తుకుపోతారేమో..’ అని తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. బిహార్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. స్థానిక ఎస్పీకి, చివరికి సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి కనీస సమాచారం ఇవ్వకుండా ఒక ఐపీఎస్ అధికారిని అపహరించేందుకు యత్నించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసినట్లు సమాచారం.బందిపోటు దొంగల్లా వచ్చారు..! బిహార్కు చెందిన ఐజీ సునీల్ నాయక్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు బందిపోటు దొంగల్లా వచ్చారు. ఏపీకి చెందిన ఎస్పీ స్థాయి అధికారి గోడదూకి సునీల్నాయక్ నివాసంలోకి చొరబడ్డారు. ఏపీ పోలీసులు ఎటువంటి నిబంధనలను పాటించలేదు. వారి వద్ద అరెస్టు వారెంటూ లేదు.. కేసు డైరీ లేదు.. ఎఫ్ఐఆర్లో కనీసం సునీల్ నాయక్ పేరు లేదు. బిహార్ వచ్చి ఏదైనా చేయవచ్చని అనుకుంటే ఎలా..? ఏపీ పోలీసుల తీరును పట్నా కోర్టు తప్పుబట్టింది. సునీల్ నాయక్ను అరెస్టు చేయడానికి వీల్లేదని చెప్పింది. సునీల్ నాయక్పై ఏపీ పోలీసులు పెట్టిన అక్రమ కేసును రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం. – శ్రీవాస్తవ్, కునాల్ తివారీ, సునీల్నాయక్ తరపు న్యాయవాదులు -
ఇప్పటి వరకూ ఐదుగురు మృతి.. కల్తీ పాలపై సంచలన నిజాలు బయట పెట్టిన పోలీసులు
-
రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు.. వీడిన మిస్టరీ
సాక్షి, ఖమ్మం జిల్లా: పాలేరు రిజర్వాయర్లో కారు ప్రమాదంలో మృతి చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. బొగ్గుల శ్రీనివాస్ది హత్యగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.హత్య చేసిన అనంతరం కారు ప్రమాదంగా నిందితులు చిత్రీకరించే యత్నం చేశారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటం.. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా తేల్చారు. ఈనెల 14న ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లడంతో ఏపీకి చెందిన బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందారు. రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లాక డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన సోదరుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు.శ్రీనివాస్ ప్రయాణించిన కారు ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వేణుమాధవ రెడ్డిదిగా గుర్తించారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. వేణుమాధవరెడ్డి, శ్రీనివాస్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని గుర్తించారు. దర్యాప్తులో శ్రీనివాస్ది హత్యగా తేల్చారు. -
మాజీ మంత్రి కాకాణికి పోలీసుల నోటీసులు
-
ఢిల్లీలో హై అలర్ట్.. ఆలయాలకు భద్రత పెంపు
ఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద బాంబు పేలుళ్లకు ఎల్ఈటీ ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపధ్యంలో పోలీసులు అప్రతమ్తమై, హై అలర్ట్ ప్రకటించారు. పాక్ మసీదు వద్ద పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి.దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని భద్రతా సంస్థలు శనివారం మరోసారి హెచ్చరికలు జారీ చేశాయి. ఎర్రకోట సమీపంలోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యులు పేలుడు పరికరం (ఐఈడీ)తో దాడికి ప్రణాళిక వేస్తున్నారని నిఘా వర్గాలు సూచించాయి. చాందినీ చౌక్లోని ఒక ప్రముఖ ఆలయంపై ప్రత్యేకంగా దాడికి ప్రణాళిక వేస్తున్నాన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది.ఫిబ్రవరి 6న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని ఒక మసీదులో జరిగిన పేలుడు తర్వాత, ఆ సంస్థ భారతదేశంలో భారీ ఉగ్ర దాడికి ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. భద్రతా సంస్థలకు ఈ సమాచారం అందిన వెంటనే, ఢిల్లీ పోలీసులు, కేంద్ర సంస్థలు వెంటనే చర్యలు చేపట్టాయి. ఎర్రకోట, చాందినీ చౌక్, చుట్టుపక్కల మతపరమైన ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు ప్రత్యేక నిఘాలో ఉన్నాయి. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోని ఒక ప్రధాన ఆలయాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆలయం లక్ష్యంగా ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. -
బాన్సువాడలో పోలీసుల లాఠీఛార్జ్
-
నాకేం నష్టం లేదు!
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్వేష్ మరో వివాదానికి తెరలేపాడు. ఇతడి ఇన్స్ట్రాగాం ఖాతా ‘నా అన్వేషణ’ను హైదరాబాద్ పోలీసులు గురువారం బ్లాక్ చేయించారు. దీనివల్ల తనకు ఏం నష్టం లేదని అంటూ బత్తాయిలూ అని వ్యాఖ్యానిస్తూ రూపొందించిన వీడియోను అన్వేష్ శుక్రవారం విడుదల చేశారు. ఇందులో ప్రత్యక్షంగానే నగర పోలీసులకు సవాల్ విసిరారు. ఇప్పుడు దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.అన్వేష్ వీడియోలో చేసిన వ్యాఖ్యలివి...‘నమస్తే అందరికీ.. నా ఇన్స్టాగ్రామ్ చానల్ బ్లాక్ అయ్యిందని బాధపడుతున్నాననుకున్నారా బత్తాయిలూ... రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏమిటి? పోతే ఏమిటి? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.. ఈ రెండు చేతులు నా రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాల న్న మాట. ఈ రెండు కాళ్లూ నా రెండు యూట్యూబ్ చానళ్లు అన్నమాట. నా బాడీ ఫేస్ అన్నమాట... ఈ ఐదింటినీ నడిపించేలా తెలివైన బుర్ర. బత్తాయిలందరూ కలిసి ఓ చెయ్యి విరగొట్టారు. ఇంకో చెయ్యి ఉంది... రెండు కాళ్లు ఉన్నాయి.ఈ ఇన్స్టాగ్రామ్ (మరో చెయ్యి) విరగ్గొట్టినా పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాను. ఒక కాలు తీసేస్తే ఒంటి కాలుతో వెళ్లిపోతాను. రెండు కాళ్లూ తీసేసినా బాడీ ఉంది దేక్కుంటూ వెళ్లిపోతా. బాడీ కూడా నరికేసినా తల ఉంది మాట్లాడుకుంటూ వెళ్లిపోతాను. నేను దొరికితే తియ్యాల్సింది తల. నాకు యూట్యూబ్లో గత నెల రూ.తొమ్మిది లక్షల లాభం వచి్చంది. బత్తాయిల్ని క్షమించేది లేదు. నిద్రపోనివ్వను. 2026లో నరకం చూపిస్తాను. నేను ఎవరినీ దేకను’. అని తనదైన శైలిలో ఆడియో విడుదల చేశారు. -
కూటమికి దడ పుట్టిస్తున్న అంబటి వారసురాలు
-
బొగ్గుల శ్రీనివాస్ కేసు.. కీలక ఆధారాలు లభ్యం..!
కూసుమంచి: ఈనెల 14న ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లి ఏపీకి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంచేశారు. రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లాక డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ నిర్వహించారు.ఆయన సోదరుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ప్రయాణించిన కారు ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మేకల వేణుమాధవ రెడ్డిదిగా గుర్తించడం, ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా ఆరా తీసినట్లు సమాచారం. వేణుమాధవరెడ్డి, శ్రీనివాస్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని బయటపడినట్లు తెలుస్తోంది.శ్రీనివాస్ మిత్రుడైన ఆయన తన వ్యాపార లావాదేవీల కోసం శ్రీనివాస్ జీఎస్టీ నంబర్ను దుర్వినియోగం చేస్తుండటంతో నిలదీయగా కక్ష పెంచుకుని అతనిని హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో శ్రీనివాస్ మృతి కేసు మిస్టరీ వీడనున్నట్లు తెలుస్తోంది. -
అనాథలా ముగిసిన మృగాడి కథ
మదనపల్లె టౌన్: చస్తే పాడి మోయడానికి నలుగురిని సంపాదించుకోవాలంటారు పెద్దలు. అయితే ఆ నలుగురిని కూడా సంపాదించుకోలేక ఊరి జనం దగ్గర ఛీకొట్టించుకుని, కుటుంబ సభ్యులూ పట్టించుకోకపోవడంతో మృగాడు కులవర్ధన్ కథ గురువారం రాత్రి అనాథశవం రూపంలో ముగిసింది. రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించిన మదనపల్లె పట్టణం, నీరుగుట్టువారిపల్లెలో మూడు రోజుల క్రితం ఏడేళ్ల బాలికపై హత్యాచారం... అనంతరం బుధవారం కురబలకోట మండలంలోని కనసానివారిపల్లె వద్ద చెరువులో శవమై తేలిన మృగాడి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి ముదివేడు పోలీసులు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబసభ్యులు, బంధువులు ముందుకు రాకపోవడంతో గురువారం రాత్రి డీఎస్పీ మహేంద్ర ఆదేశాలతో మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. వారు చెత్త బండిలో శవాన్ని డంపింగ్ యార్డుకు తరలించి ఎస్ఐ మధురామచంద్రుని సమక్షంలో పూడ్చేశారు. మరోవైపు బాలిక హత్యాచారం విషయం తెలిసినా కులవర్ధన్ తల్లి చెప్పలేదనే ఆరోపణతో ఆ కేసులో ఆమెను ఏ2గా చేర్చారు. ఈ క్రమంలో ఆమెను ఆయా విధుల నుంచి తొలగించినట్లు వెంకటేశ్వరపురం ప్రభుత్వ స్కూలు హెచ్ఎం మీడియాకు తెలిపారు. మరోవైపు బాలిక హత్యాచారం నేపథ్యంలో ఆందోళన చేపట్టిన వారిలో 50 మందికి మదనపల్లె డీఎస్పీ మహేంద్ర గురువారం రాత్రి 41 నోటీసులు జారీ చేశారు. -
నా ఇంటికి నేను వెళుతుంటే అడ్డుకుంటారా.. అంబటి మాస్ వార్నింగ్
-
మాజీ మంత్రి కాకాణితో పోలీసుల దాగుడు మూతలు
సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డితో పోలీసులు దాగుడు మూతలు ఆడుతున్నారు. మైనర్ మృతి కేసులో విచారించేందుకు ఇంటికి వస్తామంటూ పోలీసులు సమాచారం ఇచ్చారు. 10 గంటల నుంచి విచారణ నిమిత్తం కాకాణి.. ఇంట్లోనే అందుబాటులో ఉన్నారు. పోలీసులు రాకపోవడంతో రాజకీయ పర్యటన కోసం కాకాణి వెళ్లిపోయారు.కాకాణి గోవర్థన్రెడ్డి మాట్లాడుతూ.. బాలిక మృతిపై ప్రశ్నించేందుకు నా పై కేసు పెట్టారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో కేసు పెట్టారు. 14వ తేదీ విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు.. చివరలో రావద్దన్నారు. ఇవాళ ఇంటికి వస్తామన్నారు.. ఇప్పటి వరకు రాలేదు.. మేము ఫోన్ చేసినా.. పోలీసులు స్పందించలేదు. బాలిక కుటుంబ సభ్యుల వివరాలు నేను ఎక్కడా బహిర్గతం చేయలేదు...గంజాయి గురించి అధికార పార్టీ నేతలు మాట్లాడితే కేసులు కట్టలేదు.. నేను మాట్లాడకపోయినా కేసు కట్టారు. పోలీసులు అక్రమార్కుల మీద నిఘా పెట్టకుండా.. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టేందుకే పోలీసులు పని చేస్తున్నారు. మా హయాంలో ఓ బాలిక మీద దాడి జరిగితే.. వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించి.. కుటుంబాన్ని ఆదుకుంది’ అని కాకాణి గుర్తు చేశారు. -
పోలీసుల అత్యుత్సాహం.. కాన్వాయ్ ఆపుదాం అని చూసారు దెబ్బకి ఇచ్చిపడేసిన అంబటి
-
రాళ్ల దాడి కేసు.. బాల్క సుమన్ అరెస్టు
సాక్షి,మంచిర్యాల జిల్లా: రాళ్ల దాడి కేసులో అరెస్టయిన బాల్క సుమన్కు మంచిర్యాల కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మంచిర్యాల ఫస్ట్ క్లాస్ అడిషన్ జూనియర్ సివిల్ జడ్జ్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆదిలాబాద్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం. బాల్క సుమన్ అరెస్టు సమయంలో ఆయన నివాస ప్రాంతమైన క్యాతన పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బాల్క సుమన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా తరలి వచ్చారు. ఇంట్లో ఉన్న బాల్క సుమన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటిగేటును బలవంతంగా ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల రాకపై సమాచారం అందుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బాల్క సుమన్ ఇంటి గేట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బాల్క సుమన్ ఇంటి గేట్లను బలవంతంగా ఓపెన్ చేశారు. ఇంట్లో ఉన్న బాల్క సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంత్రి వివేక్ కాన్వాయ్పై బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాల్క సుమన్ను అరెస్టు చేశారు. సుమన్ను విడుదల చేయాలి: హరీశ్రావుమాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. బాల్క సుమన్ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకే ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. -
రూ.400 కోట్ల దారి దోపిడీ కేసు.. చివరికి ట్విస్ట్ ఏంటంటే?
బెళగావి: సుమారు ఐదు నెలల నుంచి సినిమాను మించి ట్విస్ట్లతో సాగిన రూ. 400 కోట్ల నగదు దోపిడీ కథ.. చివరికి ఫేక్ అని తేలింది. ట్రక్ కంటైనర్లలో గోవా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు రూ.400 కోట్ల నగదు.. దోపిడీ జరిగిందంటూ ట్రక్ డ్రైవర్ చేసిన ఫిర్యాదు.. కట్టుకథగా నాసిక్ పోలీసులు తేల్చిపారేశారు. డ్రైవర్ చెప్పింది నిజం కాదని.. దారి దోపిడీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.నగదు తరలిస్తున్న ట్రక్కును అడ్డగించి దోపిడీ చేశారంటూ డ్రైవర్ సందీప్ గత ఏడాది డిసెంబరు 17న మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ఏడాది అక్టోబరు 22న బెళగావి జిల్లాలోని చోర్లా ఘాట్ ప్రాంతంలో ఈ చోరీ జరిగిందంటూ నమ్మబలికాడు. కొందరు వ్యక్తులు తనను అడ్డగించి.. దాడి చేశారని.. రూ.400 కోట్ల విలువైన రూ.2000 నోట్లతో (రద్దయిన నోట్లు) పరార్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సందీప్.. తనపై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను కూడా షేర్ చేశాడు.ఈ కేసును ఛేదించడానికి మహారాష్ట్ర పోలీసులు.. కర్ణాటక, గోవా పోలీసుల సాయంతో విచారణ చేపట్టారు. అంత భారీ నగదును తీసుకెళ్లే ట్రక్కులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. సందీప్ ఫిర్యాదు మేరకు ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారించామని.. అతని ఆరోపణలు కట్టు కథలేనని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ సందీప్ పాటిల్ చెప్పిన వివరాల్లో అనేక పొంతన లేని విషయాలను సిట్ గుర్తించింది. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురినీ న్యాయస్థానం ఇప్పటికే విడుదల చేసింది. తప్పుడు ఫిర్యాదు చేసిన డ్రైవర్ సందీప్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే యెచనలో పోలీసులు ఉన్నారు. -
ఇంట్లో మృతదేహం.. బయట తలుపునకు తాళం
మూసాపేట (హైదరాబాద్): మృతదేహాన్ని నాలుగు రోజులపాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఇంట్లోనే ఉంచుకోవటంతో దుర్వాసన వెలువడి.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వివేకానందనగర్, రామకృష్ణనగర్ వీధిలో శ్రీసాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో మూడవ అంతస్తులోని అద్దె ఇంట్లో తల్లి శమంతకమణి, ముగ్గురు పిల్లలు జయరాం, శైలజ, సునీతలతో నివాసం ఉంటోంది. భర్త రిటైర్డ్ ఎస్ఐగా చేసి గతంలోనే మరణించాడు. భర్తకు వచ్చే పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. పిల్లలు ముగ్గురికి వివాహం కాలేదు. ఇటీవల అనారోగ్యంతో కుమార్తె శైలజ (50) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి తలుపునకు తాళం వేసుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపుతట్టగా సోమవారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తలుపు వేసుకున్నారు. సోమవారం కూడా మృతదేహాన్ని అలాగే ఉంచటంతో దుర్వాసన ఎక్కువైంది. దీంతో పోలీసులు ఇంటికి వచ్చి మృతదేహాన్ని తరలించాలని సూచించారు. పలు విధాలుగా వారికి నచ్చజెప్పటంతో చివరికి వారి సొంత ఊరు కైకలూరికి అంబులెన్స్లో తరలించారు. అయితే గతంలో వాచ్మన్పై దాడి చేసింది కూడా వీరేనని, అద్దె డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వటం లేదని స్థానికులు తెలుపుతున్నారు. -
పాక్ నిఘా'హనీ-ట్రాప్' ముప్పు : పోలీసులకు కేంద్రం హెచ్చరిక
భారతీయ పోలీసులపై పాకిస్తాన్ హనీ ట్రాప్ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తోంది. పాక్ నిఘా వర్గాలు సోషల్ మీడియా వేదికగా భారత పోలీసులను లక్ష్యంగా చేసుకుని 'హనీ-ట్రాప్' (అందమైన యువతుల ఫోటోలతో బురిడీ కొట్టించడం)కు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) పోలీసు సిబ్బందికి తాజాగా కొన్ని హెచ్చరికలను జారీ చేసింది.పాకిస్తాన్ నిఘా సంస్థల "హనీ-ట్రాపింగ్" ప్రయత్నాలు పెరుగుతున్నట్టు గమనించిన, MHA ఈ ముప్పును ఎదుర్కోవడానికి, సోషల్ మీడియా సురక్షిత వినియోగంపై మంత్రిత్వ శాఖ వివరణాత్మక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) విడుదల చేసింది.ఈ మార్గదర్శకాలను గత ఏడాది నవంబరు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్మెంట్ జారీ చేసింది. పోలీసు అధికారులతో స్నేహం చేసి, సున్నితమైన సమాచారాన్ని రహస్యంగా సేకరించడానికి Facebook, X, Instagram, WhatsApp, Telegram, LinkedIn వంటి ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను వాడుకుంటాయి.ముఖ్యమైన మార్గదర్శకాలు (SOP):సోషల్ మీడియా ప్రొఫైల్స్లో తాము పోలీసు అధికారులమని బహిర్గతం చేయకూడదు.అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. అనామకుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించ వద్దు. ముఖ్యంగా యువతుల ఫోటోలతో ఆకర్షించే ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.ఆన్లైన్ పోస్ట్లు కేవలం మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవారికి మాత్రమే కనిపించేలా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవాలి.ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో (WhatsApp, Telegram, etc.) అధికారిక పత్రాలను లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకోకూడదు.ఉద్యోగాలు, ఉచిత పర్యటనలు లేదా ప్రభుత్వ ఆఫర్ల పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దు. ధృవీకరించని యాప్లను డౌన్లోడ్ చేయడం, తెలియని లింక్స్ క్లిక్ చేయడం, మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో పత్రాలను పంచుకోవడం చేయకూడదు.ఇదీ చదవండి: అవును వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు : ఫ్యాన్స్కు వాలెంటైన్స్ డే సర్ప్రైజ్ఒకవేళ హనీ-ట్రాప్కు గురైతే ఏం చేయాలి?ఒకవేళ హనీ-ట్రాప్కు గురైతే ఏం చేయాలనేదానిపై కూడా సూచనలు అందించింది. ఒకవేళ ఎవరైనా అధికారి హనీ ట్రాప్ ఉచ్చులో పడినట్లు అనుమానం వస్తే, తక్షణమే సదరు అధికారికి చెందిన డిజిటల్ పరికరాలను (ఫోన్లు, ల్యాప్టాప్స్) వెంటనే స్వాధీనం చేసుకోవాలి.ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి. స్టేట్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ ఈ నిబంధనల అమలును పర్యవేక్షిస్తుంది. దృఢమైన పాస్వర్డ్లు, రెండు-కారకాల ప్రామాణీకరణ, పరిమిత యాప్ అనుమతులు, సాధారణ గోప్యతా తనిఖీల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. సోషల్ మీడియాలో చేసే పోస్ట్లకు ఆయా పోలీసు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రహస్య సమాచారాన్ని లీక్ చేస్తే క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్ -
డ్యూటీలో పోలీస్ కపుల్స్
పెద్దపల్లి: భార్యాభర్తలిద్దరూ పోలీసు అధికారులే. ఇద్దరికీ ఒకేచోట ఎలక్షన్ డ్యూటీ. అయితే, ఇద్దరం కలిసి ఎన్నికల విధులు నిర్వర్తించడం మరిచిపోలేని అనుభూతి అని వారిద్దరూ సరదాగా చెప్పారు. పెద్దపల్లి రూరల్ ఎస్సైగా మల్లేశ్, మహిళా ఠాణా ఎస్సైగా రాజమణికి పెద్దపల్లి మున్సిపల్ కౌంటింగ్ విధులు కేటాయించారు. పోలీస్కపుల్స్ కావడంతో పోలీసు అధికారులు అందరూ విధుల్లో ఉన్న దంపతులను చూసి స్వీట్ మెమోరీ అని అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు నా భర్త గెలుపు కోసం వెన్నంటే ఉండి పోరాటం చేశానని, ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వాడజనం మా ఆయనను గెలిపించారని.. భర్త విజయం సాధించిన వార్త విని పరుగులతో వచ్చింది భార్య. ఆ క్షణం భర్త గుండెపై వాలి ఆనందంతో ఏడ్వసాగింది. తల్లి సైతం గారాల కొడుకును చూసి ముద్దులు òపెడుతూ కన్నీరుతెచ్చుకుంది. ఈసన్నివేశం చూస్తూ గెలిచిన అభ్యర్థులంతా ఒక్కసారిగా వారి ప్రేమను చూస్తూ ఉండిపోయారు. పెద్దపల్లి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి పాగాల శ్రీకాంత్ గెలుపుతో తల్లి, భార్య, కూతురు, బంధువులు, కాలనీవాసుల ఆనందం ఆకాశాన్నంటింది. కౌంటింగ్ కేంద్రం బయట ఒకరికొకరు తమ మద్దతుదారులు గెలిచారంటూ సంబురాల్లో మునిగిపోయారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
కెనడా కాల్పుల ఘటన: నిందితుని ఉన్మాదం వెనుక..
వాంకోవర్: కెనడాలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో నిందితునికి సంబంధించిన విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ‘జెస్సీ’ అనే యువకుడు సృష్టించిన బీభత్సానికి పదిమంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో జెస్సీ కన్నతల్లి, సోదరితో పాటు ఒక ఉపాధ్యాయురాలు, అభం శుభం తెలియని పసిపిల్లలు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురు ఆస్పత్రులలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 🔥 BREAKING 🔥This is Jesse.Jesse shot 35 innocent people yesterday including his mother, sister, a teacher & young children.10 are dead & many are fighting for their lives.The Government decided that instead of supporting Jesse’s mental health & helping a disturbed child… pic.twitter.com/RDS6ruOcGa— Lozzy B 🇦🇺𝕏 (@TruthFairy131) February 12, 2026ఈ ఉన్మాదానికి వెనుక ఉన్న కారణాలు ఇప్పడు వార్తల్లో నిలిచాయి. జెస్సీ గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతను ఎప్పుడైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వానికి, సంబంధిత ఏజెన్సీలకు ముందే తెలుసని సమాచారం. అయినప్పటికీ అతడిని ఒక రోగిగా గుర్తించి, సరైన మానసిక చికిత్స అందించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం జెస్సీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సింది పోయి, అతడిని ఒక అమ్మాయిగా పరిగణించి కృత్రిమమైన పద్ధతులను ప్రోత్సహించిందనే మాట వినిపిస్తోంది. అతనికి ‘క్రాస్ సెక్స్ హార్మోన్లు’, ఇతర మందులను ఇవ్వడం ద్వారా అతని శరీరాన్ని, ఆలోచనా తీరును విషపూరితం చేశారని తెలుస్తోంది. ఒక మానసిక రోగి భ్రమలను సరిదిద్దకుండా, వాటిని మరింతగా ప్రేరేపించిన కారణంగానే అతను తనపై తాను నియంత్రణ కోల్పోయి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. -
Bangladesh: మరో హిందూ యువకుని దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ మౌల్వీబజార్ జిల్లాలో ఒక హిందూ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. చంపారా టీ గార్డెన్ కార్మికుడైన 28 ఏళ్ల రతన్ శుభోకర్ పోలీసులకు విగతజీవిగా కనిపించాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గురువారం ఓటింగ్ జరగడానికి కొద్దిసేపటి ముందే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.స్థానిక పత్రిక 'డైలీ స్టార్' నివేదిక ప్రకారం రతన్ శుభోకర్ మృతదేహం రక్తంతో తడిసి ఉండటాన్ని గమనించిన కార్మికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు లక్ష్మణ్ కర్ మాట్లాడుతూ, మంగళవారం రాత్రి నుండి రతన్ కనిపించకుండా పోయాడని, తరువాత తోటలో శవమై కనిపించాడని తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు తమకు తెలియవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, నిందితులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.బంగ్లాదేశ్లో ఎన్నికల వేళ మైనారిటీల భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నది. గత జనవరి నెలలోనే జైలు కస్టడీలో దాదాపు 15 మంది మరణించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదించింది. మరణించిన వారిలో అవామీ లీగ్ సీనేయర్ నేత రమేష్ చంద్ర సేన్, ప్రముఖ సంగీత విద్వాంసుడు ప్రళయ్ చకి తదితరులు ఉన్నారు. డిసెంబర్ 2024లో విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన అశాంతిలో పలువురు హిందూ యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతల గురించి హామీలు ఇస్తున్నప్పటికీ, మతోన్మాద శక్తుల ప్రాబల్యం పెరుగుతుండటంపై మైనారిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. -
శివ సన్నిధానంలో అపచారం.. బాబు ప్రభుత్వం వైఫల్యం
-
సర్కార్ శాడిజం.. కాపు నేతపై కన్నింగ్ ప్లాన్
-
KGF తరహాలో 200 మంది సైబర్ ముఠా.. వేలల్లో నకిలీ పోలీస్ స్టేషన్లు..
పాహోన్ పెన్ : కంబోడియాలో సైబర్ నేరగాళ్లపై భారీ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో అక్కడి అధికారులు 200 మంది సైబర్ గ్యాంగ్స్టర్లను అరెస్టు చేశారు. ఫ్నామ్పెన్లోని నకిలీ సైబర్ సెంటర్లపై పోలీసులు దాడి చేసి, నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యకు కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్ ప్రత్యక్ష ఆదేశాలు ఇచ్చారు.16 దేశాలకు సంబంధించిన 11వేల మందిని పట్టుకున్నారు. మొత్తం 172మంది కలిసి సైబర్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. బాధితుల్ని ఉద్యోగాల పేరుతో కంబోడియాకు రప్పించిన మాఫియా వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయించినట్లు తేలింది. నేరగాళ్లు కేజీఎఫ్ సినిమా తరహాలో ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యోగాల కోసం వచ్చిన వారితో వెట్టి చాకిరి చేయించుకున్నారు. ఇండియాకు సంబంధించిన నకిలీ పోలీస్ స్టేషన్లు,సీబీఐ,ఈడీ ఆఫీసులు ఏర్పాటు చేసి డిజిటల్ అరెస్టులు అంటూ వసూళ్లకు పాల్పడ్డారు.ఈ కేంద్రాల్లో పనిచేసిన వారు సోషల్ మీడియా ద్వారా ప్రేమ, వ్యాపార సంబంధాలు వంటి మాయాజాలాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను మోసం చేశారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం దక్షిణాసియా ప్రాంతం ఈ తరహా మోసాలకు ప్రతి సంవత్సరం సుమారు 40 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర మోసాలు జరుగుతున్నాయని అంచనా. సైబర్ నేరాలు చేసేందుకు కొన్ని వేల సంఖ్యలో పోలీస్ స్టేషన్ల సెట్టింగులు ఏర్పాటు చేశారు. తాజాగా, సైబర్ ఆపరేషన్తో సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టు రట్టయ్యింది. 11వేల మందిని పట్టుకుని కంబోడియా ప్రభుత్వం వారి దేశాలకు పంపించి వేసింది. -
విడుదల కాకుండా ... అంబటిపై మరో కేసులో ఇరికించాలని చూస్తోన్న పోలీసులు
-
అరేయ్ ఎవడ్రా అంటూ పోలీసులపైకి దూసుకెళ్లిన జగ్గారెడ్డి
-
పోలింగ్ ఆపేస్తా.. బూత్లోకి దూసుకెళ్లిన జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ 34వవార్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కాను పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్ బూత్కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పోలింగ్ ఆపేస్తానంటూ బూత్లోకి దూసుకెళ్లారు. పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం అందుకున్నారు. తన కాలర్ పట్టుకున్నారంటూ సీఐపై కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపిస్తున్నారు. పోలీసులు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి కాంగ్రెస్ నాయకులు భారీగా చేరుకుంటున్నారు.సీఐ శివకుమార్ ఇక్కడకు రావాలని పోలీసులతో జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికే సీఐ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్కు పూర్తిగా సపోర్ట్ చేశాడని మండిపడ్డారు. వార్డులో ఎన్నికలు రద్దు చేయాలంటూ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో ఉద్రికత్త చోటుచేసుకున్నాయి. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. భౌతిక దాడులకు కూడా దిగారు. మహబూబాబాద్ 14వ వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి చేయి చేసుకున్నారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు డబ్బుల పంపిణీ చేస్తున్నారంటూ.. స్థానికుల సమాచారంతో పోలింగ్ కేంద్రం వద్దకు పోలీసులు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు డబ్బులు వదిలేసి పరారీ అయ్యారు. లక్షకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
చండీగఢ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బాంబు బెదిరింపుల కాల్స్ ఈ మధ్య తరచుగా మారాయి. తాజాగా ఛండీగఢ్లోని పలు పాఠశాలలలో బాంబులు పెట్టామంటూ ఈ రోజు ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను ఖాళీ చేయించారు.ఛండీగఢ్తో పాటు పక్కనే ఉన్న మోహలీ ప్రాంతంలో పాఠశాలలో బాంబులు పెట్టామని బెదిరింపులు రావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. అదే విధంగా కొన్ని పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో వెంటనే పోలీసులు పాఠశాలలకు చేరుకున్నారు. డాగ్స్క్వాడ్ బృందాలతో పాటు జాగీలాలతో గాలింపు చేపట్టారు. అయితే ఇటీవల పాఠశాలలకు బాంబు బెదిరింపులు తరచుగా మారాయి. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోని తొమ్మిది స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ అఫ్జల్ గురు జ్ఞాపకార్థం ఢిల్లీ ఖలిస్థాన్ గా మార్చబోతున్నామంటూ అందులో ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ స్కూళ్లను ఖాళీ చేయించారు.జనవరి 29న రాజధానిలో ఐదు విద్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా అధికారులు తనిఖీలు చేయగా అది బెదిరింపు మెయిల్ అని తేలింది. అదే విధంగా జనవరి 28న ద్వారకా కోర్టు కాంప్లెక్స్ లోనూ పేలుడు పధార్థాలు పెట్టామంటూ మెయిల్ రాగా పోలిసులు తనిఖీలు చేపట్టగా అది అబద్ధమని తేలింది.అయితే ఇలా బెదిరింపు కాల్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
శివ స్వాములపై లాఠీ ఛార్జ్.. ఇంత కన్నా పాపం ఉంటుందా ?
-
గొప్ప మనసు చాటుకున్న పోలీస్
-
శ్రీశైలంలో టెన్షన్ టెన్షన్.. శివ స్వాములపై లాఠీ ఛార్జ్
-
ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వులు లేవని సీబీఐ–సిట్ చార్జిషిట్ దాఖలు చేసినా.. అధికార పార్టీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో చేసిన వ్యాఖ్యలకు గాను తనపై రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన 33 కేసులను కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు సోమవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు.ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశి్నంచారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదన్నారు. దీనిపై పోలీసులకు తగిన సూచనలు చేస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ నాటికి స్పష్టత తీసుకోవాలని పీపీకి న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 33 కేసుల్లో చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసి ఆయన వివరణ తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేశారు. అంబటి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 35 కేసులు ఒకే అంశానికి సంబంధించినవని, దీనిపై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారం నడుచుకోండి గత ఏడాది జూన్లో వెన్నుపోటు దినం పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించినందుకు అంబటి రాంబాబుపై నమోదైన కేసుల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని గుంటూరు, పట్టాభిపురం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆయనకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలంది. అంబటిపై నమోదైన కేసులు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని, ఫిర్యాదుదారులకు నోటీసులివ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
బ్యాచ్మేట్స్కే సెల్యూట్!
సాక్షి, హైదరాబాద్/మణికొండ: పోలీసు విభాగం అంటే పక్కా క్రమశిక్షణ కలిగిన ఫోర్స్. పై అధికారికి కింది అధికారి కచ్చితంగా సెల్యూట్ కొట్టాల్సిందే. అయితే.. పై అధికారి, ఆయన కింద పని చేసే అధికారి ఒకే బ్యాచ్కు చెందిన వారైతే..?, 2012 బ్యాచ్ సబ్ఇన్స్పెక్టర్లలో అనేక మంది పరిస్థితి ప్రస్తుతం ఇలానే ఉంది. మల్టీజోన్–1లో ఉన్న ఈ బ్యాచ్ అధికారుల్లో దాదాపు అంతా ఇప్పటికే ఇన్స్పెక్టర్లు అయిపోగా.. హైదరాబాద్లోని నాలుగు కమిషనరేట్లు ఉన్న మల్టీజోన్–2కు చెందిన వారికి మాత్రం ప్రమోషన్ల ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. ఈ బ్యాచ్లో ఇప్పటి వరకు కనీసం సగం మందికిపైగా ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి లభించలేదు. దీంతో ఇప్పటికే పదోన్నతి పొందిన బ్యాచ్మేట్స్కు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారు సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి ఉంది. 2004 బ్యాచ్కి ఆరేళ్లకు, 2007 బ్యాచ్కు ఏడేళ్లకు, 2009 బ్యాచ్కు పదేళ్లకు ప్రమోషన్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. అత్యధికులు మల్టీజోన్–2కే.. ఉమ్మడి రాష్ట్రంలో 2012 బ్యాచ్కు సంబంధించి వెయ్యి మందికి పైగా ఎస్సైలు ఎంపికయ్యారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న రెండు జోన్లకు కలిపి వీరి నుంచి 582 మందిని కేటాయించారు. 2018లో జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఐదు, ఆరు జోన్లు.. మల్టీజోన్–1, మల్టీజోన్–2గా మారాయి. దీని ప్రకారం సిబ్బంది పంపకాలు జరగ్గా.. 2012 బ్యాచ్ ఎస్సైలలో మల్టీజోన్–2లో 360 మంది మిగిలారు. మల్టీజోన్–1లో వివిధ జిల్లాలతో పాటు సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం కమిషనరేట్లు ఉన్నాయి. మల్టీజోన్–2 విషయానికి వచ్చేసరికి ఇక్కడ కేవలం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు మాత్రమే మిగిలాయి. అక్కడ వేగంగా.. ఇక్కడ నత్తనడకగా.. పోలీసు విభాగంలో ఎస్సైగా ప్రవేశించిన అధికారి ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందడానికి అర్హుడు అవుతాడు. కాగా, 2012 బ్యాచ్ వారికి 14 ఏళ్ల సరీ్వసు పూర్తయినా.. ఇప్పటికీ మల్టీజోన్–2కు సంబంధించిన అధికారుల్లో అత్యధికులు ఎస్సైలుగానే ఉండిపోయారు. కమిషనరేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు ఖాళీలను సది్వనియోగం చేసుకోవడంతో మల్టీజోన్–1లో ప్రమోషన్లు వేగంగా వస్తున్నాయి. అక్కడ పదోన్నతులు రావాల్సిన వాళ్లు 30 నుంచి 50 మంది వరకే ఉండగా.. ఇక్కడ మాత్రం ఆ సంఖ్య 300 వరకు ఉంది. దీంతో మల్టీజోన్–2కు చెందిన 2012 బ్యాచ్ ఎస్సైలు మల్లీజోన్–1లోని తమ బ్యాచ్ వారితో పోలిస్తే ప్రమోషన్లలో వెనకబడిపోయారు. ఇలా మొదటి పదోన్నతి దశలోనే వెనకబడిపోతే.. ఆ ప్రభావం తమ సర్వీసు మొత్తం ఉంటుందని అధికారులు వాపోతున్నారు. ఈ చర్యలు తీసుకుంటే.. ప్రస్తుతం హైదరాబాద్ అంటే.. ఔటర్ రింగ్ రోడ్ వరకు అనే భావన ఉంది. దీని లోపల ఉన్న పోలీసుస్టేషన్లలో కొన్నింటికి ఎస్సైలు, మరికొన్నింటికి ఇన్స్పెక్టర్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (ఎస్హెచ్ఓ) ఉన్నారు. సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో ఉన్న అన్ని ఠాణాలకు ఇన్స్పెక్టర్లే ఎస్హెచ్ఓలుగా ఉండేలా అప్గ్రేడ్ చేయాలని పాలనారంగ నిపుణులు సూచిస్తున్నారు. రోడ్ సేఫ్టీ విభాగంతో పాటు మరికొన్ని చోట్ల ఉన్న ఖాళీలను పదోన్నతులతో పూరించడంతో పాటు నాలుగు కమిషనరేట్లలో అవసరమైన స్థాయిలో ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేయడం, హైడ్రాకు అవసరమైన ఇన్స్పెక్టర్లను పదోన్నతి పద్ధతిలో కేటాయించడం చేయాలని పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న 2012 బ్యాచ్ ఎస్సైలు కోరుతున్నారు. అలా చేస్తే సూపర్ న్యూమరరీ పోస్టుల ద్వారా అయినా తమకు పదోన్నతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
Ibrahimpatnam Tour: జగన్ భద్రతను గాలికొదిలేసిన పోలీసులు
-
గడ్చిరోలిలో భీకర ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మహిళా మావోయిస్టు ఉన్నట్లు గుర్తించారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన పోలీసు అధికారి.. చికిత్స పొందుతూ మరణించారు. జవాన్ దీపక్ మాడవి మృతి చెందగా.. మరో కమాండో జగో మాడవి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, ఎస్ఎల్ఆర్ తుపాకీ లభించాయి.అహేరికి చెందిన దీపక్ చిన్నా మడవి (38) అనే జవాన్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని అబూజ్మడ్ అడవుల నుండి ఎయిర్లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకపోయింది. మరో జవాన్ జోగా మడవి కూడా గాయపడ్డారు. ఆయనకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఫిబ్రవరి 3న రాత్రి, మావోయిస్టుల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో గడ్చిరోలి పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. ఈ గాలింపు చర్యల్లో మొత్తం 14 C-60 యూనిట్లు, సీఆర్ఫీఎస్కి చెందిన క్విక్ యాక్షన్ టీమ్ (QAT) పాల్గొన్నాయి.మంగళవారం జరిగిన కాల్పుల తర్వాత, భద్రతా దళాలు రెండు మావోయిస్టు క్యాంపులను ధ్వంసం చేసి భారీగా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. దట్టమైన అడవి, కఠినమైన భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ తెలిపిన వివరాల ప్రకారం, సరిహద్దు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మావోయిస్టుల కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. -
బిగ్ షాక్.. బాబు సర్కార్ కు హైకోర్టు నోటీసులు..
-
ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్
-
చిన్నారుల భవిష్యత్తుకు సైబరాబాద్ పోలీసుల భరోసా
హైదరాబాద్: చిన్నారుల చిరునవ్వుల వెనుక దాగున్న విషాదాన్ని దూరం చేసి, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు ముందడుగు వేశారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుల వేషధారణను భిక్షాటనకు ముసుగుగా వాడుకుంటూ, పసిపిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న తీరుపై సైబరాబాద్ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.ఇటీవల ఐదుగురు బాలలు సైబర్ టవర్ జంక్షన్ వద్ద ఇదే రీతిలో భిక్షాటన చేయిస్తుండగా సైబరాబాద్ పోలీసులు వారిని క్షేమంగా రక్షించారు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి వారిని పదే పదే భిక్షాటనకు ప్రేరేపించిన తల్లిదండ్రులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, వారిని జైలుకు పంపారు. రక్షించిన పిల్లలకు బాలల సంరక్షణ సంస్థల సహకారంతో పునరావాసం కల్పించి, వారికి కొత్త జీవితాన్ని అందించామని సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం తెలిపారు.ట్రాఫిక్ సిగ్నల్స్, రద్దీగా ఉండే రోడ్డు జంక్షన్ల వద్ద చిన్నారులకు మహాత్మా గాంధీ వేషం వేసి, ఒళ్లంతా రంగులు పూసి వారిని భిక్షాటన చేయిస్తున్నా ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చాయన్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం కన్నవారే తమ పిల్లల హక్కులను కాలరాస్తూ, వాహనాల మధ్య వారిని ప్రమాదంలోకి నెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు.‘చిన్నారులతో భిక్షాటనకు చేయించచడం చట్టరీత్యా నేరం. అది తల్లిదండ్రులైనా, సంరక్షకులైనా సరే.. చట్టం నుండి తప్పించుకోలేరని డీసీపీ స్పష్టం చేశారు. రంగుల వల్ల కలిగే శారీరక ఇబ్బందులు, రద్దీ ప్రాంతాల్లో ఉండే ప్రాణాపాయం పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తాయని’ ఆమె పేర్కొన్నారు."పిల్లలు బడిలో ఉండాలి.. భిక్షాటనలో కాదు" అనే నినాదంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మీ కంటపడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు గానీ లేదా చైల్డ్ లైన్ నెంబర్ 1098 కు గానీ సమాచారం అందించాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్
-
Devineni : ఇంకో మూడు సంవత్సరాల తరువాత మీ అందరి లెక్కలు తేలుస్తాం
-
గుంటూరుకు జగన్.. తెల్లవారి నుండే కుట్రలు, పోలీసుల సీసీ ఫుటేజీ లీక్
-
సాక్ష్యాలు మాయం చేయడానికి పోలీసులు పొద్దున్నే ఇంటికి వచ్చి..
-
YS జగన్ గుంటూరు టూర్ పై పోలీసుల ఓవరాక్షన్
-
టీడీపీ చేతిలో ఖా‘కీలు బొమ్మలు’
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేయడంతోపాటు ఆయనపై హత్యాయత్నం జరిగిన ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మలై ఆ పార్టీ అధిష్టానం చెప్పినట్టు నడుచుకున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం గోరంట్ల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు గోరంట్ల చిల్లీస్ సెంటర్లో కర్రలు, మారణాయుధాలతో కాపుగాశారు. అంబటి రాంబాబు వాహనాన్ని అడ్డుకుని కారు మీద చేతులతో కొడుతూ అసభ్య పదజాలంతో దూషించారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందనాదేవి అయితే ‘‘నువ్వు మొగోడివి అయితే రారా’’అంటూ అంబటిని రెచ్చగొట్టారు. మారణాయుధాలతో తెలుగుదేశం నేతలు పెద్ద సంఖ్యలో గుమిగూడినా వారిని నియంత్రించడంలో నల్లపాడు సీఐ వంశీధర్ విఫలమయ్యారు.పైగా టీడీపీ నేతలకు కొమ్ముగాశారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి ప్రతిస్పందన రాకుండా తెలుగుదేశం మూకలకు రక్షణగా నిలబడ్డారు. పైగా అంబటి వాహనంలో మారణాయుధాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేశారు. వ్యూహాత్మకంగా దాడి.. అంబటిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అతిగా స్పందించారు. రాంబాబుకు 24 గంటల్లో తామేంటో సినిమా చూపిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు నల్లపాడు సీఐ వంశీధర్ సిద్ధార్ధనగర్లోని అంబటి ఇంటికి వెళ్లి నోటీసు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. అయితే నోటీసు ఇవ్వకుండానే ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు అంబటి ఇంటి వద్ద ఎంతమంది ఉన్నారో గమనించి వెళ్లి టీడీపీ నేతలకు ఉప్పందించారని సమాచారం.ఈ నేపథ్యంలో అంబటిని అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో మీడియా అక్కడికి చేరుకుంది. అదే సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులూ తరలివచ్చాయి. సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త లంకా మాధవి అంబటి ఇంటి వద్దకు వచ్చి అంబటిని ‘‘నా కొడకా రా..రా.. చెప్పుతో కొడతా’’అంటూ దుర్భాషలాడింది. దీనికి వైఎస్సార్సీపీ మహిళా నాయకులు ప్రతిస్పందించారు. టీడీపీ కార్యకర్తను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లంకా మాధవిని అక్కడి నుంచి తప్పించారు. అప్పటికే వ్యూహాత్మకంగా పశ్చిమఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు, అబ్బూరి మల్లి, ఇతర కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంబటి ఇంటికి చేరుకుని ఒక్కసారిగా మారణాయుధాలు, కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పటికే పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు నేతృత్వంలో వందమందికిపైగా పోలీసులు అక్కడ మోహరించినా.. వారిని అడ్డుకునే యత్నం చేయకుండా చోద్యం చూశారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు అనే టీడీపీ దివ్యాంగుల విభాగం నేత మైక్ సెట్తో వచ్చి ‘‘బయటకు రారా నా కొడకా’’అంటూ అంబటిపై బూతుపురాణం లంకించుకున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ గూండాలకు అండగా నిలబడ్డారు. ఈ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులే! సీఐలు గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు గతంలో పలుమార్లు వైఎస్సార్సీపీ ర్యాలీలు, సభలను అడ్డుకున్నారు. కొన్ని సందర్భాల్లో అంబటి రాంబాబుతో వాగ్వాదానికీ దిగారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు సీఐలు అధికార పార్టీ నేతల ఆదేశాల ప్రకారం అంబటిని ఇబ్బంది పెట్టాలనే వ్యూహరచన చేశారని వైఎస్సార్సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కోర్టును ఆశ్రయించడానికి సన్నద్ధమవుతున్నాయి. పక్క సబ్ డివిజన్ స్టేషన్లో ఆ సీఐకి ఏం పని?ఉదయం టీడీపీ నేతలు అంబటిపై దాడికి యత్నించిన ప్రదేశం గోరంట్ల చిల్లీస్ సెంటర్ నల్లపాడు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అన్యాయంగా అక్రమంగా అంబటిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను శనివారం రాత్రి 10.30 గంటలకు నల్లపాడు స్టేషన్కు తరలించి లాకప్లో పెట్టారు. నల్లపాడు గుంటూరు సౌత్ సబ్డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఆ స్టేషన్లో వైఎస్సార్సీపీ శ్రేణులు అంబటిని కలవకుండా ఉండేలా ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అర్ధరాత్రి లాకప్లో నిద్రపోతున్న అంబటిని నల్లపాడు పోలీస్ స్టేషన్ పైఅంతస్తుకు పోలీసులు తీసుకువెళ్లారు. అక్కడ నల్లపాడు సీఐ వంశీధర్తోపాటు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లూ ఉన్నారని స్వయాన అంబటి రాంబాబు న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ఇద్దరూ తనను గోడకు ఆనించి కూర్చోబెట్టి రెండు కాళ్లు చీల్చి ఇబ్బందికి గురి చేశారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టాభిపురం స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లుకు సౌత్ సబ్డివిజన్లోని నల్లపాడు స్టేషన్లో ఏం పని అనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఆమె మాట్లాడింది తప్పు కాదా.. ఇప్పటికైనా ఆపకపోతే
-
కపటనాటక సూత్రధారి
బెంగళూరు: వివాహ రిసెప్షన్కు వెళ్తున్న వరుడిపై కత్తితో దాడి చేసిన ఘటనను చామరాజనగర్ జిల్లా కొల్లేగాళ టౌన్ పోలీసులు ఛేదించారు. వధువుతోపాటు, ఆమె ప్రియుడు దర్శన్, ఒక మైనర్ను అరెస్టు చేశారు. గోకుల్, మరో నిందితుడు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కొళ్లేగాల తాలూకా కుణగళ్లికి చెందిన ఎల్.రవీశ్కు కొళ్లేగాల తాలూకాఆ హొసఅణగళ్లికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. కొళ్లేగాల పట్టణంలోని వేంకటేశ్వర మహల్లో గతనెల 30న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వరుడు రవీశ్ తన గ్రామం నుంచి కారులో వస్తుండగా ఎంజీఎస్వీ రోడ్డు వద్ద దుండగులు అడ్డుకొని కత్తితో దాడి చేశారు. గాయపడిన రవీశ్ను ఆస్పత్రికి తరలించారు. అయితే కొన్ని రోజుల క్రితం అతనికి గుర్తు తెలియని యువకుడు ఫోన్ చేసి పెళ్లి రద్దు చేసుకోవాలని బెదిరించాడు. ఈ విషయంపై యువతిని ప్రశ్నించగా తాను గతంలో అతన్ని ప్రేమించిన విషయం వాస్తవమేనని, అయితే ఇప్పుడు విడిపోయామని, ఇష్టంతోనే పెళ్లికి అంగీకరించినట్లు పేర్కొంది. అయితే వరుడు ఈ వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. కాగా రవీశ్పై జరిగిన దాడికి సంబంధించి కేసు దర్యాప్తును చామరాజనగర్ ఎస్పీ ముత్తురాజ్ ఒక ప్రత్యేక బందానికి అప్పగించారు. కొల్లేగల్ డీఎస్పీ ధర్మేంద్ర, సీఐ శివమాదయ్య, కొల్లేగల్ టౌన్ ఎస్ఐ వర్షలు యువతి ప్రియుడు దర్శన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రియురాలి సూచనతోనే దాడి చేసినట్లు వెల్లడించడంతో ఆమెను కూడా అరెస్ట్ చేశారు. దాడికి ఉపయోగించిన కారును స్వా«దీనం చేసుకున్నారు.సంబంధిత వార్త వరుడిపై కత్తితో దాడి.. ఆగిపోయిన పెళ్లి -
సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీసులు గీత దాటొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేసే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధివిధానాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రాథమిక హక్కుల రక్షణ కోసమే హైకోర్టు ఆ నిబంధనలు పెట్టిందని.. వాటిని పోలీసులు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. అసలేం జరిగింది? సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల పోస్టుల ఆధారంగా యాంత్రికంగా క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించరాదని సూచించింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పాటించాల్సిన మార్గదర్శకాలను తీర్పులో పొందుపరిచింది. అయితే ఈ మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం సుప్రీం ధర్మాసనం ముందు వాడీవేడిగా వాదనలు జరిగాయి. పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛకు మార్గదర్శకాలు అడ్డంకిగా ఉన్నాయి: లూథ్రా విచారణ ప్రారంభం కాగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కేసు మెరిట్స్పై తాము వాదించడం లేదని.. కానీ హైకోర్టు విధించిన కొన్ని షరతులు ఇబ్బందికరంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘హైకోర్టు తీర్పులోని పేరా 29లో ఇచ్చిన మార్గదర్శకాలపై మాకు అభ్యంతరం ఉంది. ముఖ్యంగా గైడ్లైన్ నంబర్ 7, 8 పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉన్నాయి. రాజకీయ ప్రసంగాలు లేదా సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఇది ప్రాసిక్యూషన్ వ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. ప్రాసిక్యూషన్ వేరు, దర్యాప్తు వేరు కదా?. కానీ గైడ్లైన్ నంబర్ 4, 7 పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఫిర్యాదులు నిరాధారమని తేలితే కేసు క్లోజ్ చేయాలని చెబుతున్నారు. అది కేవలం సాక్ష్యాధారాల లేమి వల్లే కాదు.. ఇతర కారణాల వల్ల కూడా క్లోజ్ చేయొచ్చు కదా?’అని అన్నారు. తప్పేంటి?: సుప్రీం ధర్మాసనందీనిపై జస్టిస్ పార్దివాలా జోక్యం చేసుకుంటూ ‘అసలు హైకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడంలో తప్పేముంది? పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి, యాంత్రికంగా కేసులు పెట్టకుండా ఉండటానికి ఆ మాత్రం జాగ్రత్తలు అవసరం లేదా? ఒక హైకోర్టు జ్యుడీíÙయల్ ఆర్డర్ ద్వారా కొన్ని మార్గదర్శకాలు ఇస్తే సంబంధిత అధికారులు వాటిని పాటించాల్సిందే. మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు కనిపించడం లేదు. చాలా కోర్టులు ఇలాంటి మార్గదర్శకాల కోసమే ఎదురుచూస్తున్నాయి కూడా. హైకోర్టు కేవలం విస్తృతమైన మార్గదర్శకాలనే జారీ చేసింది. వాటిని పాటించండి’అని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ ప్రభుత్వ పిటిషన్ను డిస్మిస్ చేసింది. పోలీసులకు హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఇవీ.. ముందస్తు పరిశీలన: సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ముందుగా ప్రాథమిక విచారణ జరపాలి. న్యాయ సలహా: రాజకీయ విమర్శలు, సున్నితమైన అంశాలకు సంబంధించిన పోస్టుల విషయంలో కేసు నమోదు చేసే ముందు తప్పనిసరిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలి. నిరాధారమైతే రద్దు: విచారణలో ఫిర్యాదు నిరాధారమైనదిగా లేదా దురుద్దేశపూర్వకమైనదిగా తేలితే వెంటనే కేసు మూసేయాలి. -
జోగి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
-
నేను అంబటిని ఇప్పుడే చూడాలి.. విడుదల రజినీతో పోలీసుల ఓవరాక్షన్
-
ఆంధ్రప్రదేశ్లో గూండారాజ్... పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. శనివారం రాత్రి అరెస్టు
-
Ambati : టీడీపీ నేతలు నన్ను తిట్టడంతోనే నేను ఆవేశంలో మాట్లాడాను
-
పోలీసులే దగ్గరుండి నాపై దాడి చేయించారు
-
హిందూపురం YSRCP దీపికా ఇంటి వద్ద అర్ధరాత్రి పోలీస్ డ్రామా..
-
స్త్రీధరుడి రాస లీలలు ఇంకెన్నో?
దేశంలో నాడు స్త్రీకి ఉన్నత గౌరవం ఉండేది. ఆమెను దేవతతో సమానంగా చూసేవారు. నేడు బాబు సర్కారులో ఓ మహిళ హోమ్ మంత్రిగా ఉండి కూడా అతివలకు రక్షణ కరువైంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులే ఆమెను చెరబడుతున్నారు. అందుకు నిదర్శనం మూడు రోజుల కిందట వెలుగులోకి వచ్చిన అరవ శ్రీధర్ కీచకపర్వమే. ఆ ఒక్కటితో ఆగలేదు ఆయనగారి రాసలీలలు. ఆయన కీచక పర్వం రోజుకొక వీడియోతో కొనసాగుతోంది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన రాసలీలలు ఇంకెన్ని బయట పడతాయోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. రైల్వేకోడూరు అర్బన్: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళా ఉద్యోగితో జరిపిన కీచక పర్వం వీడియో లీకులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బాధితురాలు రోజుకొక లీకులు సోషల్ మీడియా ద్వారా పోస్టు చేస్తున్నారు. నియోజకవర్గమంతా ఇంకా ఎన్ని కొత్త వీడియోలు వస్తాయో? అనే చర్చే కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా నియోజక వర్గంలో ఇదే చర్చనీయాంశంగా మారింది. బాధిత మహిళ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిశాక సీను మొత్తం రివర్స్ కావడంతో టీవీ చానళ్ల ద్వారా జరిగిన విషయాలను బయట పెట్టి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నిజ స్వరూపం బయట పెట్టింది. ఈ మధ్యలో జనసేన నాయకుడు, మరి కొందరూ మంతనాలు జరిపినట్లు తెలిసింది. అయితే బాధితురాలికి నమ్మకం లేక పోవకోవడంతో ఎమ్మెల్యేకి తనకు మధ్యలో జరిగిన విషయాలను బహిర్గతం చేసింది. మూడు రోజులుగా ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా రోజుకొటి రెండు వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్న వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. కొత్తగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒంటరిగా కారు తోలుతూ బాధిత మహిళకు వీడియోకాల్ చేసి ‘నువ్వు వద్దంటే చచ్చిపోతాను.. నువ్వు లేకుండా నేను ఉండలేను’ అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన వీడియో హల్చల్ చేస్తోంది. కొత్త కోణంలో ఈ చిత్రాలు ఇంకా ఎన్ని ఉన్నాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.పోలీసులు ఎంక్వైరీ సక్రమంగా సాగేనా? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ తన కొడుకుని, తమ కుటుంబ సభ్యులను ఆ మహిళా ఉద్యోగి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు చేస్తూ బాధిత మహిళపై రైల్వేకోడూరులో పోలీసులకు ఈనెల 7వ తేదీన ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ చంద్రశేఖర్ ఆరోపిస్తున్న మహిళపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించామని చెబుతున్నారు. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. ఆమె అందుబాటులో లేదని, నోటీసు ఇచ్చి విచారణ చేస్తామని, దీనికి తోడు మరో కేసు నమోదు చేసామన్నారు. ఇదిలా ఉండగా జిల్లా పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు కేసు నమోదు కాలేదు. ఏకపక్షంగా ఎంక్వయిరీ జరిగేలా నాయకులు పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అజ్ఞాతంలోకి అరవ శ్రీధర్ ఈవిషయం జరిగిన మరుక్షణం నుంచి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోని వెళ్లారు. మరుసటి రోజు ఆ వీడియోలకు తనవి కావని చట్టరీత్యా నిరూపించుకుంటానని ఎక్కడో ఉండి వివరణ ఇచ్చాడు. అంతేకాని మూడురోజులవుతున్నా ఎవరికీ అతని జాడ తెలియలేదు. ఎవరితోనూ సంప్రదించలేదని తెలిసింది. ఎమ్మెల్యే నియోజకవర్గంలో లేకపోవడంతో అధికారిక కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతోంది. ఎమ్మెల్యే అయ్యి ఉండి అతను బహిరంగంగా ప్రజలకు ఎం జవాబు చెబుతాడోనని ఉత్కంఠగా పలువురు ఎదురు చూస్తున్నారు. ఇంత వరకు ఖండించని స్థానిక పార్టీ, నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు, వీడియోలపై ఇంతవరకు, జనసేన పారీ్టకాని, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గానీ ఖండించలేదు. ఎవరికీ వారు తమ పనులు చేసుకుంటూ విషయం ఎవరికీ తెలీదన్నట్లు ఉన్నారు. ఎమ్మల్యే అరవ శ్రీధర్ను అన్నీ తానై గెలిపించిన టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఈ తతంగంపై మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. -
పోలీసులతో సీతక్క డాన్స్
-
బర్త్డే, మ్యారేజ్డే నాడు పోలీసులకు ప్రత్యేక సెలవు
పోలీసు సిబ్బందికి విధులు నిరంతరాయంగా ఉండేవే. వాళ్లకు సెలవులు, విశ్రాంతి, వీకాఫ్లు అనే వాటిపై చర్చ కూడా నిరంతరం జరిగేదే. ప్రభుత్వాలు ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన దాఖలాలు అరుదనే చెప్పాలి. అయితే.. ఇక్కడ ఓ రాష్ట్రంలో పోలీసులకు ఇక నుంచి ప్రత్యేక సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పోలీసులకు వాళ్ల, వాళ్ల కుటుంబ సభ్యుల పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం తదితర రోజుల్లో సెలవు తీసుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. నిరంతరం విధుల్లో ఉంటూ కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారని ఈ వెసులుబాటు ఇచ్చింది. దీనివల్ల వారిపై పనిభారం, మానసిక ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాల కోసం పోలీసు సిబ్బంది సెలవు కోరితే తప్పకుండా మంజూరు చేయాలని డీజీపీ డాక్టర్ సలీం గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రత్యేక లీవ్ పాలసీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించబడిన ఉదాహరణలు లేవు. కాబట్టి.. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల రోజున పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా సెలవు ఇవ్వడం(కాజ్యువల్ లీవ్) అనే విధానం కర్ణాటకలోనే మొదటిసారి అమలులోకి వచ్చింది.పోలీస్ సేవ చాలా కఠినమైనది, కుటుంబానికి సమయం కేటాయించడం కష్టమవుతోంది. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి వ్యక్తిగత సందర్భాల్లో సెలవు ఇవ్వడం ద్వారా సిబ్బంది భావోద్వేగపరంగా రీఛార్జ్ అవ్వగలరు. కుటుంబంతో కొంత సమయం గడపగలరు. ఇది మానసిక ఒత్తిడి తగ్గించడంలో, ఉత్సాహాన్ని పెంచడంలో, ఉద్యోగ సంతృప్తి, ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు.రాష్ట్రంలోని అన్ని యూనిట్ హెడ్లు ఈ ఆదేశాన్ని అమలు చేసి, సిబ్బంది కోరినప్పుడు సెలవు ఇవ్వాలని కర్ణాటక డీజీపీ ఆదేశించారు. ఈ చర్యను మానవీయమైన నిర్ణయంగా వర్ణిస్తూ.. పోలీస్ సిబ్బంది చేసిన త్యాగాలను గుర్తించడం, విశ్వాసాన్ని పెంపొందించడం, శాఖ పట్ల నిబద్ధతను బలపరచడం లక్ష్యంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసుల నిర్లక్ష్యం
సాక్షి, విజయవాడ: కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా.. కానీ పోలీసులు స్పందించలేదు. ఈనెల 26న డీజీపీకి బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై దళిత మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయగా.. ఆ మహిళ ఫిర్యాదుపై కనీసం ఎఫ్ ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేసినట్టు ఆమె వెల్లడించారు. రైల్వే కోడూరు పోలీసులు, తిరుపతి ఎస్పీ ఫిర్యాదు తీసుకోలేదని బాధితురాల వాపోయింది. బాధితురాలు ఫిర్యాదును తీసుకోకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేపై డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యల్లో తాత్సారం చేశారు. డీజీపీకి చేసిన ఫిర్యాదును బాధిత మహిళ విడుదల చేశారు.ఎమ్మెల్యే శ్రీధర్ శారీరక, మానసిక వేధింపులపై బాధితుల ఫిర్యాదు చేసింది. కొట్టి, తిట్టి తనను లైంగికంగా ఎమ్మెల్యే శ్రీధర్ లోబర్చుకున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఐదు సార్లు తనకు అబార్షన్ చేయించినట్టు డీజీపీకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ దారుణంపై సాక్షి కథనాలతో రాజకీయ ప్రకంపనలు రేపాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంతో దూమారం రేగింది. మహిళను వేధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. డైవర్షన్ కోసం కాలయాపన కమిటీని జనసేన తెరపైకి తీసుకొచ్చింది. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ప్రకటించింది. దళిత మహిళను వేధించిన ఎమ్మెల్యేలకు చర్యలకు పూనుకోని ప్రభుత్వం.. ఉద్యోగిని మోసం చేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. జనసేన దృష్టికి బాధిత మహిళ ముందే ఈ విషయాన్ని తీసుకెళ్లిన కానీ పట్టించుకోలేదు. -
పేర్ని నానిపై మరో అక్రమ కేసు నమోదు..
-
Mulugu District: పేలిన తుపాకీ ఇన్స్పెక్టర్కు గాయాలు
-
కనిపించని ఆ నాలుగో సింహమే..
అతను చూడగానే చిన్నపిల్లాడిలా అనిపిస్తాడు. అప్పుడే వస్తున్న నూనూగు మీసాలు అతని ముఖానికి కొత్తదనాన్ని తెచ్చాయి. అయితే కనిపించే ఈ రూపానికి భిన్నంగా అతని భుజాలపై మెరిసే నక్షత్రాల బ్యాడ్జీ, హుందాగా కనిపించే యూనిఫాం... ఇదంతా గమనిస్తే ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు అనే సందేహం అందరిలో మెదులుతుంది. అతనే రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి అభిజీత్ పాటిల్.. భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. దేశసేవలో భాగస్వామి అయిన ఈ 22 ఏళ్ల కుర్రాడి సక్సెస్ స్టోరీ..నమ్మి తీరాల్సిందే..దేశంలో అతి పిన్న వయసులో ఐపీఎస్ సాధించిన అభిజీత్ పాటిల్ను చూసిన వారు అతని రూపాన్ని చూసి తెగ ఆశ్చర్యపోతుంటారు. ఇంత చిన్న వయసులో శాంతిభద్రతల లాంటి క్లిష్టమైన బాధ్యతలను ఇతను నిర్వహిస్తున్నాడా? అని ముక్కున వేలేసుకుంటారు. మొదట ఎవరైనా ఇతనిని చూడగానే పోలీసు ఉన్నతాధికారి అంటే నమ్మలేరు. మహారాష్ట్రలోని థానేలో జన్మించిన అభిజీత్ 22 ఏళ్ల వయసులోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి, దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారు.తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్అభిజీత్ పాటిల్ విద్యాభ్యాసం ఎంతో ఆసక్తికరంగా సాగింది. 2022లో సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగానే అభిజీత్ యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఆశ్చర్యకరంగా డిగ్రీ సర్టిఫికేట్ చేతికి రాకముందే ఆయన ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు. ఆ తర్వాత మెయిన్స్ కూడా క్లియర్ చేసి, 2022 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 470వ ర్యాంకు సాధించాడు. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగకుండా, ఇంటి వద్దే ఉండి, ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.రోజుకు 8 గంటలు చదువుతూ..అభిజీత్ విజయ రహస్యం ఆయన సొంతంగా రూపొందించుకున్న ప్రణాళిక. లక్షల రూపాయలు వెచ్చించి, కోచింగ్ తీసుకునే స్తోమత లేని వారికి అభిజీత్ ఓ రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్లో ఒక టాపర్ వీడియో చూసి. అభిజీత్ తాను ఐపీఎస్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఎనిమిది నెలల పక్కా ప్రణాళికతో చదివాడు. రోజుకు 8 గంటల పాటు సిలబస్ను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించడం, మాక్ టెస్టులు రాయడం ద్వారా విజయం సాధించారు. లక్ష్యంపై స్పష్టత ఉంటే సివిల్స్ లాంటి కఠినమైన పరీక్షలను కూడా సులభంగా ఛేదించవచ్చని అభిజీత్ నిరూపించాడు.సామాన్యుల గుండెల్లో 'యంగ్ హీరో'ప్రస్తుతం రాజస్థాన్లోని చురు జిల్లా రాజ్గఢ్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎఎస్పీ)గా అభిజీత్ విధులు నిర్వర్తిస్తున్నారు. 172 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నప్పటికీ, ఆయనకున్న ‘బేబీ ఫేస్’ కారణంగా అతనిని చూసినవారంతా ఆయనను చిన్నపిల్లాడిగా పొరబడుతుంటారు. విధి నిర్వహణలో అభిజీత్ పనితీరు ప్రజల్లో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టింది. ఇటీవల రాజ్గఢ్కు చెందిన ఒక కూలీ తన కుమారుని పుట్టినరోజు నాడు అభిజీత్ వద్దకు వచ్చి, తన కుమారుడిని ఆశీర్వదించాలని కోరడం ఆయనకున్న క్రేజ్కు నిదర్శనం. ఆ పిల్లాడు కూడా భవిష్యత్తులో పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటున్నాడని తెలుసుకున్న అభిజీత్ ఎంతో సంతోషించారు.ఇది కూడా చదవండి: 40 ఏళ్లకే రిటైర్మెంట్? వణికిస్తున్న ‘లే-ఆఫ్’లు -
10వేల కిలోల పేలుడు పదార్థాలు.. డిటోనేటర్లు లభ్యం
జైపూర్: గణతంత్ర దినోత్సవం ముందు రోజు దేశంలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాజస్థాన్లో 10వేల కిలోల పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా పేలుడు పదార్థాలను ఇటీవల ఢిల్లీ ఎర్రకోట కారు పేలుళ్లకు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. హార్సౌర్ గ్రామంలో శనివారం రాత్రి పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 9,550 కిలోల అమోనియం నైట్రేట్ను 187 సంచుల్లో నింపి ఒక పొలంలో దాచినట్లు గుర్తించారు. నాగౌర్ జిల్లా జిల్లా ఎస్పీ మృదుల్ కచ్చావా ఈ వివరాలను వెల్లడించారు.అమోనియం నైట్రేట్ గతంలో అనేక పేలుళ్లలో ఉపయోగించినట్లు తెలిపారు. ముఖ్యంగా, 2025 నవంబర్లో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో ఈ రసాయనం కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తుచేశారు. హార్సౌర్ గ్రామానికి చెందిన సులేమాన్ ఖాన్ను పోలీసులు సంఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు. అతనిపై ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.అమోనియం నైట్రేట్తో పాటు పోలీసులు భారీగా పేలుడు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.తొమ్మిది కార్టన్ల డిటోనేటర్లు,12 కార్టన్లు, 15 బండిల్స్ బ్లూ ఫ్యూస్ వైర్లు, 12 కార్టన్లు, ఐదు బండిల్స్ రెడ్ ఫ్యూస్ వైర్లు ఉన్నట్లు తేలింది. ప్రాథమిక విచారణలో సులేమాన్ ఖాన్ అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎక్స్ప్లోజీవ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.గణతంత్ర దినోత్సవానికి ముందు ఇంత భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన ఉగ్రకుట్రలపై భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉన్నాయని సూచిస్తోంది. -
పది మంది సివిల్ డీఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పది మంది సివిల్ డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ బి.శివధర్రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారులు వారికి సూచించిన పోస్టింగ్లలో వెంటనే చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.బదిలీ అయిన అధికారుల వివరాలు.. -
ఏఎస్పీ రవికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం–2026 సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన పతకాల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు మొత్తం 19 పతకాలు వరించాయి. పోలీస్ విభాగంలో ఒకరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం) వరించింది. మరో 15 మందికి ప్రతిభావంతమైన సేవా పతకాలు (ఎంఎస్ఎం) దక్కాయి. జైళ్ల శాఖ (కరెక్షనల్ సర్వీసెస్) నుంచి ముగ్గురు సిబ్బంది పతకాలకు ఎంపికయ్యారు.రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఇచ్చే ‘ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్వి‹Ù్డ సర్వీస్’ ఈసారి రాష్ట్రం నుంచి ఒకే ఒక్క పోలీసు అధికారికి దక్కింది. తిరుపతి జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రవి మనోహర తిరుమల చారి ఈ గౌరవానికి ఎంపికయ్యారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా. పోలీస్ ప్రతిభావంతమైన సేవా పతకాలు విధి నిర్వహణలో అంకితభావం చాటుకున్న అడిషనల్ ఎస్పీ నుంచి హెడ్ కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది వరకు మొత్తం 15 మందికి ‘పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్’ లభించింది. ⇒ సింగాల కృష్ణమోహన్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ⇒ రాయపు శివారెడ్డి, డీఎస్పీ ⇒ పోలవరపు వెంకట శేష నాగమల్లికార్జునరావు, అసిస్టెంట్ కమాండెంట్ ⇒ కరజాడ రామారావు, అసిస్టెంట్ కమాండెంట్ ⇒ కుందేటి నరసింహారావు, ఇన్స్పెక్టర్ ⇒ కామవరపు విక్రమరావు, సబ్ ఇన్స్పెక్టర్ ⇒ షేక్ షఫీ ఉల్లా, సబ్ ఇన్స్పెక్టర్ ⇒ కటారి జయరామ్, ఆర్మ్డ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ⇒ ఈత వెంకటకృష్ణ మునేశ్వరరావు, ఆర్మ్డ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ⇒ చిన్నావుల శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ⇒ మాదాసు గంగాధరరావు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ⇒ అబ్రహం అన్నలదాసు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ⇒ కొప్పిశెట్టి రామకృష్ణ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ⇒ గళ్ల రంగయ్య, హెడ్ కానిస్టేబుల్ ⇒ కాళీదేవి నరసింహులు, హెడ్ కానిస్టేబుల్ ⇒ జైళ్ల శాఖలో ఉత్తమ సేవలందించినందుకు జైలర్ గొల్లపోతు రవిబాబు, చీఫ్ హెడ్ వార్డర్ దోనేపూడి ⇒ వెంకట కృష్ణప్రసాద్, హెడ్ వార్డర్ గేరా ఆనందరావుకు ‘మెరిటోరియస్ సర్విస్ మెడల్స్’ లభించాయి. -
బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుని హత్య
ఢాకా: బంగ్లాదేశ్లోని నర్సింగడి జిల్లాలో శుక్రవారం రాత్రి అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. చంచల్ చంద్ర భౌమిక్ అనే 23 ఏళ్ల హిందూ యువకుడు తాను పనిచేసే గ్యారేజీలోనే దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని మసీదు మార్కెట్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం దుండగులు బయటి నుంచి షాపు షట్టర్పై పెట్రోల్ పోసి నిప్పంటించారని, చంచల్ లోపలే చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చి, అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. షాపు బయటి నుంచి ఒక వ్యక్తి నిప్పంటించి పారిపోతున్నట్లు కనిపిస్తున్న సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే వాటిని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇది పథకం ప్రకారం చేసిన హత్యేనని చంచల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చంచల్ తండ్రి గతంలోనే మరణించగా, అనారోగ్యంతో ఉన్న తల్లి, దివ్యాంగుడైన అన్నయ్య తమ్ముడికి ఆయనే ఏకైక దిక్కుగా ఉన్నాడు. అతనిని కిరాతకంగా హత్య చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సుమారు 17 కోట్ల జనాభా కలిగిన ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్లో 2024 రాజకీయ అస్థిరత తర్వాత పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మైనారిటీలైన హిందువులు, సూఫీ ముస్లింలు మరియు ఇతరులపై దాడులు తీవ్రతరమయ్యాయి. ఫిబ్రవరిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మతపరమైన హింస పెరుగుతుండటంపై ‘బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రిస్టియన్ ఐక్యతా మండలి’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.బంగ్లాదేశ్లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులను తాము నిరంతరం గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది. మైనారిటీలపై దాడులు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి ఘటనలను వ్యక్తిగత కక్షలుగా చిత్రీకరించడం వల్ల తీవ్రవాద శక్తులు మరింత రెచ్చిపోతాయని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ హెచ్చరించారు. అయితే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ మాత్రం భారత్ ఆరోపణలను అతిశయోక్తిగా అభివర్ణించడం గమనార్హం. -
సోషల్ మీడియా సెన్సేషన్.. ఎవరీ అభినవ భగత్ సింగ్!
ప్రశ్నిస్తాం.. ప్రశ్నిస్తాం..అన్న నేతలే పారిపోతుంటే, ఓ బాలుడు మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తున్నాడు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అవినీతి చూసి ‘ఆ నాకెందుకులే’ అని పక్కకు తప్పుకోకుండా, ప్రశ్నిస్తున్నాడు. విమర్శిస్తున్నాడు. ఇందుకోసం పాఠ్య పుస్తకాలే కాదు, లా పుస్తకాలు కూడా తిరగేస్తున్నాడు. అధికారులకు, నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. నెటిజన్లు అతన్ని ‘యూపీ భగత్ సింగ్’గా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన 14 ఏళ్ల బాలుడు అశ్వమిత్ గౌతమ్. సాధారణంగా 14ఏళ్ల బాలుడు అంటే తొమ్మిది, లేదంటే పదోతరగతి పుస్తకాలతో కుస్తీ పడతారు. మార్క్స్,ఎగ్జామ్స్,పర్సంటేజ్ పేరుతో క్షణం తీరికి లేకుండా స్కూల్,ట్యూషన్,ఇల్లే జీవితంగా గడిపేస్తుంటారు. కానీ ఈ ఛోటా భగత్ సింగ్ అలా కాదు. సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన గౌతమ్ ఇన్స్టాగ్రామ్లో ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్ను సంపాదించాడు. రాజకీయాలు, నేతలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, మీడియా, వ్యాపారవేత్తల స్కాంలు వంటి అంశాలపై ఆధారాలతో మాట్లాడుతున్నాడు. ప్రజలు అతన్ని అభినవ భగత్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్తో పోలుస్తున్నారు. ఈ చైతన్యం పాలకులను, అధికారులను అసహనానికి గురి చేసింది. మైనర్ అని కూడా చూడకుండా అతనిపై సెక్షన్ 151 ప్రయోగించి అరెస్టు చేశారు. కొద్దిసేపటికే విడుదల చేసినా, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతని వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతూ, ప్రభుత్వాలపై అతను సంధించిన ప్రశ్నలు ప్రజల్లో చైతన్యం రేపుతున్నాయి.వెరసీ అతడిని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలపై విమర్శాత్మక వీడియోలు పోస్ట్ చేసినందుకు ఈ చర్య తీసుకోవడం పిల్లల హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలపై కేసులు నమోదు చేయడం ప్రత్యేక నిబంధనలతో మాత్రమే సాధ్యం. ఈ కేసు చట్టపరమైన సరళతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. న్యాయవేత్తలు పిల్లలపై ఇలాంటి చర్యలు భయపెట్టే ప్రయత్నం’ అని వ్యాఖ్యానిస్తున్నారు.అశ్వమిత్ గౌతమ్ కథ ఒక చిన్నారి ధైర్యానికి ప్రతీక. వయసు చిన్నదైనా, ఆలోచనలు పెద్దవిగా మారి సమాజాన్ని కదిలిస్తున్నాయి. పిల్లలపై ఇలాంటి చర్యలు చట్టపరంగా సరైనవా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సత్యం, న్యాయం కోసం ప్రశ్నించే స్వరం ఎప్పటికీ ఆగదు. ఈ బాలుడి ధైర్యం కొత్త తరం యువతకు ప్రేరణగా నిలుస్తోంది. -
తాడిపత్రిలో హైటెన్షన్..మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసులు
సాక్షి,అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తన ఇంటి వద్దకు తరలిరావాలని టీడీపీ శ్రేణులకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న (గురువారం) రాత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న జేసీ వర్గీయులు కుప్పలుగా రాళ్లు వేసి ఉద్రిక్తత సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని రాళ్లను తొలగించారు. పరిస్థితి అదుపులో ఉంచేందుకు తాడిపత్రి పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద, జేసీ వర్గీయుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు మొహరించారు. ఈ క్రమంలో తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం. -
రైల్వేలో రోబో పోలీస్
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల భద్రత, రక్షణ, సేవల నిర్వహణను మరింత మెరుగుపర్చేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించే దిశగా ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ అడుగులు వేసింది. భారతీయ రైల్వేలోనే తొలిసారిగా హ్యూమనాయిడ్ రోబో ‘‘ఏఎస్సీ అర్జున్’’ను విశాఖపట్నం రైల్వేస్టేషన్లో రైల్వే భద్రతా దళం ప్రవేశపెట్టింది. ఈ రోబోను ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అలోక్ బోహ్ర, డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్బోహ్ర సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమాండెంట్ (ఆర్పీఎఫ్) ఎ.కె.దూబె సమక్షంలో విశాఖపట్నం రైల్వేస్టేషన్లో గురువారం సాయంత్రం ప్రారంభించారు.పూర్తిగా విశాఖపట్నంలోనే సీనియర్ అధికారుల మార్గదర్శకత్వంలో దాదాపు ఏడాది పాటు కృషిచేసి, అభివృద్ధి చేసిన ఈ రోబోను ఆర్పిఎఫ్ ఆధునికీకరణ, డిజిటల్ మార్పు కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభించారు. ఈ ఏఎస్సీ అర్జున్ ఏఐ, ఐఓటీ, రియల్టైం మేనేజ్మెంట్ పర్యవేక్షణ, సామర్థ్యాలతో ఫేస్ ఐడెంటిటి ద్వారా నేరస్తుల గుర్తింపు, కదలికలు, అక్రమ చొరబాట్లు, ప్రయాణికుల రద్దీ, ప్రమాదాలు, నేరాలు వంటివి ముందుగానే గుర్తించి ఆర్పిఎఫ్ సిబ్బందికి సమాచారం అందజేస్తుంది. -
ఢిల్లీ హై అలర్ట్: ఈ ఆరుగురు ఉగ్రవాదులు కనిపిస్తే..
న్యూఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జనవరి 26న జరగనున్న వేడుకలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఆరుగురు అల్ ఖైదా ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు.దీనిలో ‘అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్-కాంటినెంట్’ (ఏక్యూఐఎస్)కు చెందిన మహమ్మద్ రేహాన్ అనే ఉగ్రవాది ఫోటోను తొలిసారిగా చేర్చడం గమనార్హం. రేహాన్ ప్రస్తుతం ఢిల్లీ పోలీసులకు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఈ ఆరుగురు ఉగ్రవాదులు ఎక్కడైనా కనిపిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచించారు. కాగా కర్తవ్య పథ్, న్యూఢిల్లీ జిల్లా అంతటా విస్తృతమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గణతంత్ర వేడుకల భద్రత కోసం సుమారు 10 వేల మంది పోలీసులు, పారామిలటరీ దళాలను మోహరించినట్లు న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్ అడిషనల్ పోలీస్ కమిషనర్ దేవేష్ కుమార్ మహాలా తెలిపారు.ఢిల్లీ సరిహద్దులు, జిల్లా చెక్పోస్టుల వద్ద వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. భద్రతా సిబ్బందితో ఇప్పటికే తొమ్మిది రౌండ్ల బ్రీఫింగ్, రిహార్సల్స్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో సిట్టింగ్ ఎన్క్లోజర్లకు గంగా, గోదావరి, యమున తదితర నదుల పేర్లను పెట్టారు. ఆహ్వానితులు తమ పాస్లపై ఉన్న సూచనలను గమనించి, నిర్దేశిత మెట్రో స్టేషన్లను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఇది కూడా చదవండి: ఏఐ వాడకుంటే ‘ఫెయిల్’.. టెక్కీ ఇంటర్వ్యూ వైరల్ -
మీడియా ముందు పోలీసులేం మాట్లాడాలో నిర్ణయించండి
న్యూఢిల్లీ: విచారణలో ఉన్న కేసుల వివరాలను ప్రజలు, మీడియా సమక్షంలో పోలీసులు ఏ మేరకు ప్రస్తావించాలో, ఏ అంశాలను మాత్రమే వెల్లడించాలో తెలిపే నియమావళిని రూపొందించాలని రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత మూడు నెలల్లోపు ఈ మేరకు నిబంధనావళిని తయారుచేయాలని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం సూచించింది. ఈ మేరకు జనవరి 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులోని వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న, విచారణ దశలో ఉన్న కేసులపై మీడియా ఎదుట పోలీసులు కీలక విషయాలతోపాటు అనవసర విషయాలనూ ప్రస్తావిస్తున్నారని, ఈ ధోరణికి అడ్డుకట్టవేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కోర్టు సూచనలుచేసింది. ‘‘కోర్టుకు సహాయకుడు(అమికస్ క్యూరీ)గా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కేంద్ర ప్రభుత్వం, విదేశాలు అవలంబిస్తున్న విధానాలకు అనుగుణంగా ‘పోలీస్ మాన్యువల్ ఫర్ మీడియా బ్రీఫింగ్’ను తయారుచేశారు. దీనిని మీరు ఒకసారి పరిశీలించండి. బాగుంటే దీనిని మీరూ అనుసరించండి. లేదంటే కొత్తగా మరోటి తయారుచేసుకోండి. కొత్త మాన్యువల్ను ఆ తర్వాత రెండు వారాల్లోపు వెబ్సైట్లో అప్లోడ్ చేయండి’’అని కోర్టు ఆదేశించింది. శంకరనారాయణన్ తయారుచేసిన ఈ 60 పేజీల మాన్యువల్లో నాలుగు భాగాలున్నాయి. దర్యాప్తుకు ఎలాంటి భంగం కల్గించకుండా, నష్టం వాటిల్లకుండా, కీలక అంశాలు బయటకు పొక్కకుండా, క్లుప్తంగా విషయాలను మీడియాకు పోలీసులు చెప్పొచ్చని మాన్యువల్ పేర్కొంది. -
కోర్టు హాల్లో పోలీసుల దౌర్జన్యంపై ‘న్యాయ’ పోరాటం!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగంతో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై న్యాయవాదులు న్యాయ పోరాటానికి దిగారు. ఇటీవల ఓ కేసులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని జడ్జి అనుమతి లేకుండానే కోర్టు హాల్లోకి చొరబడి పోలీసులు అరెస్టు చేయడం.. అడ్డుకునేందుకు యత్నించిన న్యాయవాదులపై పోలీసులు దౌర్జన్యానికి దిగటాన్ని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. సరెండర్ పిటిషన్ దాఖలు చేసి కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న నిందితుడిని పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లడంపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ కర్నూలు జిల్లా పత్తికొండ న్యాయవాదుల సంఘం హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. చిప్పగిరి పోలీస్స్టేషన్ ఎస్ఐ సతీష్ కుమార్, కానిస్టేబుళ్లు షబ్బీర్, రామోజీ, పత్తికొండ ఎస్ఐ ఆర్.విజయ్కుమార్ నాయక్పై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని పత్తికొండ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.భాస్కర్ తన పిటిషన్లో హైకోర్టుకు నివేదించారు.జడ్జి అనుమతి లేకుండా కోర్టు హాలులోకి చొరబడి నిందితుడిని అరెస్ట్ చేసిన ఘటనపై జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్ లేదా జిల్లా జడ్జి సూచించిన అధికారి లేదా ఏదైనా స్వతంత్ర సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరారు. పోలీసుల దౌర్జన్యంపై వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యాయని పిటిషన్లో నివేదించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు దూకుడుగా వ్యవహరించారన్నారు. మేజి్రస్టేట్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైకోర్టుకు విన్నవించారు. కోర్టు హాల్లోకి దూసుకెళ్లిన పోలీసులు.. చిప్పగిరి మండలం డేగులపాడుకి చెందిన శివయ్య గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో లొంగిపోయేందుకు గత నెల 24న పత్తికొండ కోర్టుకు వచ్చిన నిందితుడు తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై న్యాయాధికారి నిర్ణయం కోసం శివయ్య కోర్టులో నిరీక్షిస్తుండగా పోలీసులు మఫ్టీలో కోర్టు హాల్లోకి చొరబడి శివయ్యను లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. దీన్ని అడ్డుకోబోయిన న్యాయవాదులను తోసివేశారు. కోర్టు హాలులోకి ప్రవేశించేందుకు సంబంధిత న్యాయాధికారి అనుమతి తీసుకోకపోవడం, పోలీసుల దౌర్జన్యంపై పత్తికొండ కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ, డీఐజీలకు ఈ నెల 5న పత్తికొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. -
100 మందికి పైగా పోలీసుల ఆత్మహత్యలు?
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు బ్రిటన్లో సంచలనంగా మారాయి. ఇంగ్లండ్ వేల్స్ పోలీస్ ఫెడరేషన్ తాజా నివేదిక ప్రకారం.. గత మూడేళ్లలో దాదాపు 100 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారు.అంతేకాకుండా 200 కంటే ఎక్కువ మంది అధికారులు ఆత్మహత్యయాత్నం చేశారంట. దీన్ని ఇంగ్లండ్ వేల్స్ పోలీస్ ఫెడరేషన్ నిశ్శబ్ద విపత్తుగా అభివర్ణించింది. దీనిని అరికట్టడానికి #CoppedEnough అనే నిరసన కార్యక్రమాన్ని పోలీస్ ఫెడరేషన్ చేపట్టింది.అయితే ఆత్మహత్య చేసుకున్న వారిలో అత్యధిక మంది ఏదో ఒక రకమైన శాఖాపరమైన విచారణలు ఎదుర్కొంటున్నవారే కావడం గమనార్హం. చిన్నచిన్న కారణాలకు కూడా విచారణలను ఏళ్ల తరబడి సాగదీయడం వల్ల అధికారులు మనస్తాపానికి గురువుతన్నట్లు ఇంగ్లండ్ వేల్స్ పోలీస్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది.ఈ ఆత్మహత్యలను కట్టడి చేసేందుకు ఫెడరేషన్ కొన్ని కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. అధికారులపై జరిగే క్రమశిక్షణ విచారణలను గరిష్టంగా ఒక ఏడాది లోపే పూర్తి చేయాలని సూచించింది. ప్రతి పోలీసు అధికారి ఆత్మహత్యను ఖచ్చితంగా రికార్డ్ చేసేలా చట్టం తీసుకురావాలని ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
తెలంగాణ సీఐడీ కీలక నిర్ణయం.. ఇంటివద్దే ఫిర్యాదు
సాక్షి హైదరాబాద్: రాష్ట్ర సీఐడీ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి పౌర కేంద్రిత పోలిసింగ్ను రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు పేర్కొంది బాధితులు పోలీస్స్టేషన్కు వెళ్లకుండా వారి ఇంటి వద్దే ఫిర్యాదుల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపింది.ఈ రోజుల్లో పోలీస్స్టేషన్ భయంతో చాలా వరకూ నేరాలు వెలుగులోకి రావడం లేదు. పోలీసు స్టేషన్ వెళ్లాలంటే సామాజికంగా తమపై ప్రభావం పడుతుందనే భయంతో పాటు ఆర్థికంగా కొంత భారం కారణంగా చాలామంది అక్కడికి వెళ్లడానికి మెుగ్గు చూపరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు, చిన్నారుల కేసులతో పాటు పోక్సో చట్టం ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ బాల్య వివాహాలు, ర్యాగింగ్ లాంటి కేసులలో బాధితుల ఇంటివద్దే ఫిర్యాదు స్వీకరించనున్నట్లు తెలిపింది.వీటితో పాటు శారీరక దాడులు, ఆస్తి వివాదాల కేసులలో బాధితుల ఇంటివద్దే ఫిర్యాదు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. బీఎన్ఎస్ న్యాయ సంహిత ప్రకారం ఫిర్యాదు స్వీకరించి అనంతరం ఎఫ్ఐఆర్ కాపీని బాధితులకు అందజేయనున్నట్లు పేర్కొంది. సాక్ష్యాల సేకరణ అక్కడికక్కడే చేయనున్న తెలిపింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్లలో ఈ కొత్త నియమాలు సత్వరమే అమలులోకి వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. -
CPM Leaders: అయ్యా బాబు .. ఎడ్జోలము కాదు .. ఎదురుతిరుగుతాము
-
చెవిరెడ్డి హర్షిత్రెడ్డికి పోలీసుల నోటీసులు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎస్వీయూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న ఆర్డీవో ఆఫీస్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి.విద్యార్థి సంఘాలపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు ఎత్తేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ధర్నాకు మద్దతు తెలిపిన హర్షిత్ రెడ్డితో పాటు 14 మంది విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. -
దమ్ముంటే టచ్ చెయ్.. హౌస్ అరెస్ట్ పై అశోక్ బాబు వార్నింగ్
-
విక్టిమ్ ఎవరు? స్టేట్మెంట్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: మంత్రి, ఐఏఎస్ అధికారిపై కథనాల ప్రసారానికి సంబంధించిన కేసులో.. హైదరాబాద్ సిటీ పోలీసులపై మెజిస్ట్రేట్ ప్రశ్నల వర్షం కురిపించారు. కేసులో ఫిర్యాదుదారు ఎవరు? విక్టిమ్ ఎవరు? బాధితుల స్టేట్మెంట్ ఎక్కడ? అని ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సు«దీర్లను సుదీర్ఘంగా విచారించిన సీసీఎస్ పోలీసులు చారిని మధ్యలోనే పంపించేశారు. మిగతా ఇద్దరిని సుమారు 24 గంటలపాటు విచారణ పేరుతో అదుపులో పెట్టుకున్నారు.అనంతరం కింగ్కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత తిరిగి సీసీఎస్కు తీసుకొచ్చారు. అక్కడ రిమాండ్ రిపోర్ట్లో అదనంగా మరో మూ డు సెక్షన్లు జోడించారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మణికొండలోని మెజిస్ట్రేట్ ఇంటికి తరలించారు. ఒంటిగంట సమయంలో రమేశ్, సు«దీర్లను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేకపోయారు. అసోసియేషన్ ఫిర్యాదు మేరకు విచారణ పోలీసులకు పలు ప్రశ్నలు వేసిన న్యాయమూర్తి..ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్లకు, రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలకు సంబంధం లేదని అన్నారు. దీంతో విక్టిమ్ ఎవరూ లేరని, విక్టిమ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరని, వాళ్ల అసోసియేషన్ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారిపై అభ్యంతరకర వార్తలు ప్రసారం చేశారని, దాంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, సమాజంలో తలెత్తుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కేసులో మరింత విచారణ జరపాల్సి ఉందంటూ రిమాండ్ విధించాలని పీపీ కోరారు. నిరాధారమైన ఆరోపణలతో అరెస్టు ఎన్టీవీ రిపోర్టర్ల తరఫు న్యాయవాదులు కిరణ్, జగదీశ్, శేరియార్ వాదిస్తూ..పోలీసులు చట్టవిరుద్దంగా చర్యలు చేపట్టడం దారుణమని అన్నారు. ఈ కేసులో పెట్టిన కొన్ని సెక్షన్లు ఏడేళ్ల లోపువే ఉన్నాయని, ఈ కేసులో బాధితుల పేర్లు లేవని, వారి నుంచి ఎలాంటి స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డు చేయలేదని తెలిపారు. పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే అరెస్టు చేశారన్నారు. అధికారిక పర్యటన కోసమే దొంతు రమేష్ విదేశాలకు వెళ్తున్నారని, కుటుంబాన్ని తీసుకుని ముందుగా బ్యాంకాక్ వెళ్లి, ఆ తర్వాత దావోస్లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.నిరాధారమైన ఆరోపణలతో అరెస్టు చేశారని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన మేజి్రస్టేట్.. పోలీసుల రిమాండ్ రిక్వెస్ట్ను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. ‘విక్టిమే లేనప్పుడు కేసు ఎలా నమోదు చేశారు..? సెక్షన్లు ఎలా పెట్టారు..? సీనియర్ అయినా.. జూనియర్ అయినా.. ఐఏఎస్ అయినా.. అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. సదరు అధికారుల కోసం ప్రత్యేక చట్టాలు ఏం లేవు. కాబట్టి రిమాండ్ రిక్వెస్ట్ను రిజెక్ట్ చేస్తున్నాం..’ అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. సు«దీర్, రమేష్ లకు బెయిల్ మంజూరు చేశారు. వారు తమ పాస్పోర్ట్లు సరెండర్ చేయాలని, రూ.20 వేల విలువైన రెండు షూరిటీలు సమరి్పంచాలని ఆదేశించారు. అరెస్టులు ఖండించిన జర్నలిస్టు సంఘాలు ఎన్టీవీ రిపోర్టర్లను అరెస్టు చేయడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టుల అరెస్టును పలు జర్నలిస్టు సంఘాలు, పౌరహక్కుల సంఘాలు ఖండించాయి. పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టాయి. ఐఏఎస్పై కథనానికి సంబంధించి ఈనెల 10న ఎన్టీవీ తోపాటు తెలుగు స్క్రైబ్, ఎమ్ఆర్ మీడియా తెలంగాణ, ప్రైమ్ 9, పీవీ న్యూస్, సిగ్నల్ టీవీ, వ్లోగా టైమ్స్, మిర్రర్ టీవీ, టీ న్యూస్ తెలుగు ఛానల్స్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ–1 గా ఎన్టీవీని చేర్చారు.ఆ తర్వాత ఇదే తరహా మరో కేసును కలిపి రెండు కేసుల దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తూ డీజీపీ బి.శివధర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సిట్ దర్యాప్తు పర్యవేక్షణను హైదరాబాద్ సిటీ సీపీ వీసీ సజ్జనార్కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈనెల 13న రాత్రి 11 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దొంతు రమేష్ ను అరెస్టు చేసి నేరుగా సీసీఎస్కు తరలించారు. అదేరోజు రాత్రి 12 నుంచి 2 గంటల మధ్య మరో ఇద్దరు ఎన్టీవీ రిపోర్టర్లు సు«దీర్, పరిపూర్ణాచారిని వాళ్ల ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలోనే రిపోర్టర్ సు«దీర్ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. ఒక దశలో ఇంటి తలుపులు బద్ధలు కొడతామంటూ పోలీసులు బెదిరించినట్లు రిపోర్టర్లు చెప్పారు.చివరకు సు«దీర్, చారి, రమేష్ ముగ్గురిని బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. ఓ వైపు సీసీఎస్లో విచారణ జరుగుతుండగానే.. ఎన్టీవీ సీఈఓ ఇంటికి, యాంకర్ దేవి ఇంటికి మరికొన్ని పోలీస్ బృందాలను పంపారు. అక్కడ కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు జర్నలిస్టు వర్గాల సమాచారం. దేవి, రాజశేఖర్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ.. అర్జెంట్గా తమ ముందు హాజరవ్వాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించినట్లు తెలిసింది. సాక్షిగా స్టేట్మెంట్ ఇచి్చన యాంకర్ దేవిని కూడా ఇబ్బంది పెట్టినట్లు రిపోర్టర్లు తెలిపారు. కమిషనర్ సజ్జనార్ తీరుపై విస్మయం ఎన్టీవీ కథనంపై కేసు, రిపోర్టర్ల అరెస్టు వ్యవహారంలో నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వ్యవహరించిన తీరుపై జర్నలిస్టు సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రిపోర్టర్ల అరెస్టు విషయంలో ఆయన మీడియాతో ఆగ్రహంగా బెదిరించేలా మాట్లాడారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ‘సిట్ అంటేనే దర్యాప్తు..ఎందుకు నోటీసులు ఇవ్వాలండి...కావాల్సిన వాళ్లను పిలిపిస్తాం. మేము పిలిస్తే రావాల్సిందే..మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి చూపండి.. ఎందుకు పారిపోతున్నారు? ఎక్కడ ఉన్నా పట్టుకుని వస్తా. చట్టం ముందు ప్రవేశపెడ్తా..’ అంటూ సజ్జనార్ ఆవేశంగా మాట్లాడటాన్ని పలువురు సీనియర్ జర్నలిస్టులు తప్పుపడుతున్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే రిపోర్టర్లు తప్పు చేశారనే విధంగా తీర్పునిచ్చేలా మాట్లాడడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎడిటర్లు ఎక్కడ? ఇన్చార్జిలు ఎక్కడ? విచారణలో భాగంగా ఎన్టీవీ ఆఫీస్లోకి వెళ్లిన ఇన్స్పెక్టర్తో పాటు మరో ఆరుగురితో కూడిన బృందం.. ఎడిటర్లు ఎక్కడ? ఇన్చార్జిలు ఎక్కడ..? అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. హార్డ్ డిస్్కలు, సీపీయూలు సీజ్ చేస్తామని, సర్వర్ వైర్లు లాగేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. సీఈఓ, దేవి, రాంబాబు.. ఎక్కడున్నారో చెప్పకపోతే, ఇక్కడున్న మిమ్మల్ని అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందంటూ భయబ్రాంతులకు గురిచేశారని వారు వాపోయారు. సెర్చ్ వారెంట్ ఉందా..? అని గట్టిగా నిలదీయడంతో పోలీసులు వెనుదిరిగారని, కాసేపటికి తిరిగి వచి్చన పోలీసులు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి ఓ సీపీయూ సీజ్ చేశారని తెలిపారు. ఇలావుండగా తెలుగుదేశం సోషల్ మీడియా ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి బ్యాంకాక్ పారిపోయారంటూ దు్రష్పచారాన్ని ప్రారంభించింది. అయితే ఆయన మూడు రోజులుగా కార్యాలయానికి వస్తూనే ఉన్నారని ఎన్టీవీ రిపోర్టర్లు తెలిపారు. -
పిన్నెల్లిలో కొనసాగుతున్న హైటెన్షన్ పోలీసులకు YS జగన్ వార్నింగ్
-
‘వంద మంది పోలీసులు మావాళ్లని కుమ్మేశారు’
ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్ కేంద్రంలోకి వస్తున్న తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సత్ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 100 మంది పోలీసులు తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి, తీవ్రంగా గాయపరిచారని ఆయన ఆరోపించారు.‘పోలీసులు తమ ప్రతాపం నేరస్తుల మీద చూపించాలి కానీ.. కార్యకర్తల మీద కాదు.. ఇది అధికార దుర్వినియోగమే. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. మేము దీనిపై మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)నమోదు చేస్తున్నాం" అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్రపతి శంభాజీనగర్ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎల్ఎంసీ)ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఇక్కడ మొత్తం 18 వార్డుల్లోని 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. మేజిక్ ఫిగర్ సాధించడానికి 36 స్థానాలు అవసరం కాగా, జనవరి 15న జరిగిన పోలింగ్లో నగరంలో 60.07 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ , భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) మధ్య నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే ఈ లాఠీఛార్జ్ ఘటన జరగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. #WATCH | Chhatrapati Sambhajinagar | Maharashtra Minister Sanjay Shirsat says, "Today is the counting of the votes, and on such a day. When our workers were coming into the centre, nearly 100 policemen opened lathi charge on them and wounded them severely... Action should be… pic.twitter.com/rq9E3T0WBV— ANI (@ANI) January 16, 2026రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నాలుగేళ్ల ఆలస్యం తర్వాత, శివసేనలో చీలిక వచ్చి షిండే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరుగుతున్న తొలి బీఎంసీ ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం జరిగిన పోలింగ్లో ముంబైలో 52.94 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2017లో నమోదైన 55.53 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘బీఎంసీ’ ఓట్ల లెక్కింపు వేళ.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు -
పోలీసులు కొడతారు.. టీడీపీ వాళ్లు చంపుతారు
-
కెనడా తీవ్ర ఆరోపణలు.. లారెన్స్ బిష్ణోయ్ వారి మనిషే..!
కెనడా-భారత్ మధ్యసంబంధాలు ప్రస్తుతం కొంత మెరుగుపడ్డాయి. ఇటీవలే ఇరుదేశాలు తమ రాయబారులను నియమించుకున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం భారత్పై తీవ్ర ఆరోపణలు చేసింది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ భారత్ తరపునే కెనడాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.భారత్- కెనడా మధ్య ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. ఇంతకాలం రెండుదేశాల మధ్య సంబంధాలు మెరుగ్గాలేవు. ఆ దేశంలో ఖలిస్థాన్ అనుకూల వాదులు ఎక్కువగా ఉండడం వారు తరచుగా భారత్ని విమర్శించడం జరిగేది. అంతే కాకుండా 2023లో హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండవచ్చని అప్పటి ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించారు. దీంతో ఈ ప్రకటనను భారత్ పూర్తిగా ఖండించింది. ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. కాగా ఇప్పుడిప్పుడే ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి మెరుగుపడే దశలో ఉన్నాయి.ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం సంచలన ఆరోపణ చేసింది. కెనడా పోలీసుల నివేదికలో" లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలా హింసాత్మక మైన క్రూర సంస్థ ఇది తన క్రిమినల్ చర్యలను కెనడాతో పాటు ఇతర దేశాల్లో విస్తరిస్తుంది. ఇది భారత ప్రభుత్వం తరపునే తన క్రిమినల్ చర్యలను కొనసాగిస్తుంది" అని నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ గ్యాంగ్ మాదకద్రవ్యాల రవాణా మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతుందని తెలిపారు. ఈ గ్యాంగ్ ప్రధాన ఉద్దేశం మత సంబంధిత కారణాలు కాదని దురాశ మాత్రమేనని పోలీసులు పేర్కొన్నారు. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను కెనడా ప్రభుత్వం ఇదివరకే ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. పంజాబ్కు చెందిన ఈ లారెన్స్ బిష్ణోయ్ పెద్ద గ్యాంగ్ స్టార్. ఇతని గ్యాంగ్ సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ప్రస్తుతం బిష్ణోయ్ సబర్మతీ జాతీయ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇతనిపై భారత్లో అనేక కేసులు నమోదయ్యాయి. -
ఎమ్మెల్యే ధూళిపాళ్ల అండతో నా కుమార్తెకు చిత్రహింసలు
గుంటూరు: ‘‘నా కుమార్తె వారం రోజులుగా కనిపించడం లేదు..అసలు బతికే ఉందో..చనిపోయిందో తెలియడం లేదు...అల్లుడిని అడిగితే బెదిరిస్తున్నాడు..నా బిడ్డ ప్రాణాలతో కావాలంటూ’’ ఓ తల్లి సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. కుమార్తెను చిత్రహింసలకు గురిచేస్తున్న ఆమె భర్త చెర నుంచి విడిపించాలని వేడుకుంది. నా బిడ్డ నాకు కావాలి, ప్రాణాలతో కావాలి అంటూ ఫ్లెక్సీ చేతపట్టుకుని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్లో ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడింది. వివరాలు ఇలా... బాపట్ల జిల్లా కూనపద్మావతినగర్ జగన్ కాలనీకి చెందిన నంబూరు లక్ష్మి కుమార్తె వెంకటేశ్వరమ్మ, పౌలురాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన దగ్గర్నుంచి భార్యను అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఐదు సవర్ల బంగారు గొలుసు తీసుకుని బ్యాంక్లో తనఖా పెట్టాడు. ఇటీవల మరో ఎకరం పొలం రాసివ్వాలంటూ భార్యపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. వారం రోజులుగా భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అప్పటి నుంచి ఆమె కనిపించడంలేదు. నా బిడ్డ బతికే ఉందో.. చనిపోయిందో తెలియడంలేదని లక్ష్మి వాపోయింది. కుమార్తె విషయమై అల్లుడ్ని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నాడని తెలిపింది. భర్త చిత్రహింసలు భరించలేక గతంలో కుమార్తె పలుమార్లు జిల్లా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది. పౌలురాజుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతు ఉందని, ఆయన అండదండలతోనే తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించింది. -
మాంజా చేసిన గాయం
హైదరాబాద్: పోలీసులు వద్దు వద్దంటున్నా కొందరు చైనా మాంజా వాడుతున్నారు. కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నా వాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ద్విచక్రవాహనాల్లో వెళుతున్న వారు అది తగిలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊ బైక్పై వెళుతున్న ఓ యువకుడు చైనా మాంజా కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. బొటానికల్ గార్డెన్–కొత్తగూడ ఫ్లై ఓవర్పై ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. వైజాగ్కు చెందిన కుందుం సూర్య తేజ(33) మియాపూర్లోని ఎస్ఆర్ ఎస్టేట్లో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వెళుతుండగా బొటానికల్ గార్డెన్–కొత్తగూడ ఫ్లై ఓవర్పై చైనా మాంజా ఎడమ భుజానికి తాకింది. చూసుకునే లోపు అది తీవ్ర గాయం చేసింది. స్నేహితులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన వచ్చిన వారు 108 అంబులెన్స్లో మాదాపూర్ యశోద హస్పిటల్కు తరలించారు. దాదాపు 15 సెంటీ మీటర్ల గాయం కాగా డాక్టర్లు శస్త్ర చికిత్స చేసినట్లు స్నేహితులు తెలిపారు. గచి్చబౌలి పోలీసులు వెంటనే యశోద ఆస్పత్రికి వెళ్లి బాధితుని స్టేట్మెంట్ రికార్డు చేసి కేసు నమోదు చేశారు. చైనా మాంజాలు వాడవద్దని, ఎవరైనా అమ్మినా, వాడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ బాలరాజు హెచ్చరించారు. బాలుడికి తీవ్ర గాయాలు నాగోలు గణేష్నగర్ కాలనీ చెందిన వెల్టూరు గోపాల్ కుమారుడు మనోజ్(14) 9 వ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం స్కూల్ నుంచి బైక్పై వెనుక కూర్చుని ఇంటికి వస్తుండగా, రోడ్డుపై పడివున్న చైనా మాంజా దారం కుడి పాదానికి చుట్టుకోవడంతో తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి కాలి వేలుకు రక్తం సరఫరా చేసే నరం తెగిపోయిందని తెలిపారు. ఎనిమిది కుట్లు వేసి చికిత్స అందించారు. ప్రస్తుతం మనోజ్ అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు. -
24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా
-
కాకాణి పై పోలీసుల అత్యుత్సాహం
-
సోమశిల సందర్శనపై పోలీసుల ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లా ప్రజలు, రైతుల భవిష్యత్ను తెలంగాణ సీఎంకు తాకట్టు పెట్టి.. సీమ ఎత్తిపోతల పథకాన్ని బాబు సర్కారు నిలిపివేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ పిలుపు మేరకు శనివారం చేపట్టిన సోమశిల ప్రాజెక్ట్ సందర్శనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడా లేని ఆంక్షలతో వేకువజాము నుంచే ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి నివాసాలకు పోలీసులు చేరుకుని హౌస్ అరెస్ట్లతో నానాహంగామా సృష్టించారు. సోమశిల డ్యామ్ సందర్శనకు వెళ్తే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు. రైతుల ప్రయోజనాలు తాకట్టు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడంపై శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వైఎస్సార్సీపీ పిలుపునిచి్చంది. జిల్లాలోని రైతులు సోమశిలకు చేరుకుని వారికి జరిగే అన్యాయంపై మీడియాతో మాట్లాడేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతతో జరిగే నష్టాలపై జిల్లా రైతులు కన్నెర్ర చేయడంతో ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందోనని భయపడిన ప్రభుత్వ పెద్దలు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు.సోమశిల ప్రాజెక్టు వద్దకు ఎవరినీ వెళ్లనివ్వకుండా అన్ని ప్రాంతాల్లో పోలీసులు కఠిన ఆంక్షలు పెట్టారు. రహదారులపై బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకున్నారు. నెల్లూరు నుంచి పొదలకూరు మీదుగా సోమశిల ప్రాజెక్టుకు వెళ్లే రహదారిపై మూడుచోట్ల, సర్వేపల్లి నియోజకవర్గంలోని రైతులను నిలువరించేందుకు రెండు ప్రాంతాలతోపాటు అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవే వద్ద బారికేడ్లు పెట్టి రైతులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి ఉక్కుపాదం మోపారు. కాకాణి నివాసం వద్ద ఉద్రిక్తత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన కాకాణిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఐ శ్రీనివాసరావు పోలీసు బలగాలతో వేకువజాము నుంచే కాకాణి నివాసం వద్ద కాపు కాశారు. ఆయనకు నోటీసు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, కిలివేటి సంజీవయ్యతోపాటు వందలాది మంది కార్యకర్తలు కాకాణి నివాసం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సోమశిల ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లడం నేరమా? అంటూ కాకాణి వాహనం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా నెట్టేశారు. దీంతో కాకాణితోపాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోలీసు ఆంక్షలకు నిరసనగా నెల్లూరులోని పొదలకూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించడంతో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు నేతృత్వంలో సీఐలు, ఎస్ఐలు, అదనపు బలగాలు నేతలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి కాకాణి నివాసంలో ఉంచి హౌస్ అరెస్ట్ చేశారు. కార్యకర్తలపై లాఠీచార్జి కాకాణి గోవర్ధన్రెడ్డిని పోలీసులు అడ్డుకునే సమయంలో కార్యకర్తలు ఆయనకు అడ్డుగా నిల్చోవడంతో పోలీసులు లాఠీలతో చితక్కొట్టారు. కొందరు కానిస్టేబుళ్లు అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్సార్సీపీ కార్యకర్తలను లాఠీలతో చావబాదారు. పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. తాము శాంతియుతంగా సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం చేపడితే పోలీసులు అత్యుత్సాహం ఏమిటని ప్రశి్నంచారు. పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తే గుర్తు పెట్టుకుంటామని, ఎవరిని వదిలి పెట్టబోమని మండిపడ్డారు. -
TS: లక్షల్లో పెట్టి కేసులు పరేషాన్ లో పోలీసులు
-
Sajjala : కోడి కోశారని నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు
-
Bapatla: కళ్లకు గంతలు కట్టి.. యువతిని చావబాదిన సీఐ, ఎస్సై
-
పోలీసుల నిర్లక్ష్యానికి దివ్యాంగురాలు బలి
-
కోడిని కోశారని కేసు.. పోలీసులకు కోర్టు చీవాట్లు
-
Activist Sharif: వైఎస్ఆర్ జిల్లాలో YSRCP కార్యకర్తలే లక్ష్యంగా పోలీసుల వేధింపులు
-
‘తుర్క్మన్ గేట్’ అల్లర్లలో 30 మంది గుర్తింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని తుర్క్మన్ గేట్ వద్ద బుధవారం జరిగిన హింసాత్మక ఘటనలో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించారు. ఐదుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఈ అల్లర్లకు సంబంధించిన ఆధారాల కోసం పోలీసులు సోషల్ మీడియాలో కనిపిస్తున్న సుమారు 400 వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులు, పోలీసులు ముఖాముఖి తలపడిన దృశ్యాలు ఈ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లరి మూకలు పోలీసులపై రాళ్లు, గాజు సీసాలతో దాడి చేస్తున్న దృశ్యాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆ వీడియోల ద్వారా మరికొంతమందిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.ఈ కేసుకు సంబంధించి సమాజ్ వాదీ పార్టీకి చెందిన రాంపూర్ ఎంపీ మోహిబుల్లా నద్వీకి దర్యాప్తులో పాల్గొనాలంటూ పోలీసులు నోటీసులు పంపనున్నారు. హింస జరగడానికి కొద్దిసేపటి ముందు ఆయన ఫైజ్-ఎ-ఇలాహీ మసీదు వద్దకు చేరుకున్నారని, ఆ సమయంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ ఘర్షణ వెనుక ఆయన పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు తుర్క్మన్ గేట్ సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు ఎంసీడీ (ఎంసీడీ) అధికారులు బుధవారం తెల్లవారుజామున చర్యలు చేపట్టారు. అయితే మసీదును కూల్చివేస్తున్నారనే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో రావడంతో, వందలాది మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. కొందరు నిరసనకారులు రాళ్ల వర్షం కురిపించగా, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి, భాష్పవాయువును ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సోలీసు అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘మిఠాయిల రాజధాని’ ఎక్కడ?.. ఏ స్వీట్కు ఐజీ ట్యాగ్? -
పోల్ తీసుకున్నారని.. మైనర్ బాలురలపై లాఠీచార్జ్..
-
రక్షకులా.. రాక్షసులా!
గుంటూరు జిల్లా: ‘బూటు కాళ్లతో మా పిల్లలను తొక్కుతారా? పన్నెండు మంది కలిసి పోల్ పీక్కెళితే అందులో నలుగురు దళిత బిడ్డలను మాత్రమే స్టేషన్కు పిలిపించి లాఠీలు విరిగేలా అరికాళ్లపై కొట్టడమేంటి?’ అంటూ అప్పాపురం దళితవాడ ప్రజలు పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిచి చెప్పే కనీస జ్ఞానం కూడా లేదా? లాఠీలతో కొట్టి అక్కడే నడిపిస్తారా’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురానికి చెందిన పన్నెండు మంది విద్యార్థులు వాలీబాల్ నెట్ కట్టుకునేందుకు సోమవారం ఓ వీధిలో ఉన్న టెలిఫోన్ స్తంభాన్ని(పోల్) తొలగించి, తీసుకెళ్లారు. ఆ సమయంలో స్తంభానికి చుట్టి ఉన్న విద్యుత్వైర్లు కదిలి ఇళ్లలో ఉన్న విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయంటూ ఓ మహిళ కాకుమాను పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం వారిలో నలుగురు యువకులను పోలీసులు స్టేషన్కు పిలిపించి కొట్టారని ఆరోపిస్తూ అదే రోజు రాత్రి తల్లిదండ్రులు స్టేషను వద్దకు వెళ్లి పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాలుగు గంటల పాటు రాస్తారోకో ‘మా పిల్లలను బూటు కాళ్లతో తొక్కి, లాఠీలు విరిగేలా అరికాళ్లపై కొట్టిన ఎస్ఐ ఏక్నాథ్ను సస్పెండ్ చేయాలి. కులం పేరుతో దూషించిన ఏఎస్ఐ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం అప్పాపురం దళితవాడ వాసులు బాధిత విద్యార్థులు, యువకులతో కలిసి మెయిన్ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పన్నెండు మందిలో అగ్రవర్ణాల పిల్లలు కూడా ఉన్నారని, కానీ వాళ్లను వదిలేసి దళిత బిడ్డలనే స్టేషన్కు పిలిపించి దాడి చేయడం ఏంటని ప్రశి్నంచారు. చదువుకునే పిల్లలను ఇలా విచక్షణారహితంగా కొట్టడం ఏమిటంటూ తల్లిదండ్రులు నిప్పులు చెరిగారు. బాధిత యువకులు, విద్యార్థులు స్టేషన్లో సీసీ కెమెరాల్లేని గదిలోకి తీసుకువెళ్లి పోలీసులు అమానుషంగా దాడి చేశారని వాపోయారు. స్టీల్ రాడ్లతో సైతం కొట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో వందల మంది మహిళలు, స్థానికులు రాస్తారోకోలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దళితసంఘ నాయకుడు చార్వాక దళితులకు మద్దతు పలికి, రాస్తారోకోలో పాల్గొన్నారు. దళిత బిడ్డలపై అబద్ధాలతో ఫిర్యాదు చేసిన మహిళతో పాటు కులం పేరుతో తమను, తమ పిల్లలను దూషించిన ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ చార్వాక దళితవాడ ప్రజలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో చివరికి వారు శాంతించారు. కాగా, పోలీసుల దాషీ్టకానికి బలైన దళిత విద్యార్థులకు వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ అండగా నిలిచారు. బుధవారం మధ్యాహ్నం అప్పాపురం దళితవాడలో పర్యటించిన ఆయన బాధిత విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనను ఇంతటితో వదిలేది లేదని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు. -
కర్ణాటక పోలీసులపై బీజేపీ మహిళ సంచలన ఆరోపణలు
బెంగళూరు : ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో కర్ణాటకలోని బీజేపీ మహిళపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. తన ప్రాంతంలో ఓటర్ల జాబితా నిర్వహించడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులు తన పట్ల దారుణంగా ప్రవర్తించారని వివస్త్రను చేశారని మహిళా కార్యకర్త ఆరోపించారు. సోమవారం తనను అరెస్టు చేసిన పోలీసు సిబ్బంది తనను కొట్టి, బలవంతంగా బట్టలు విప్పించారని ఆమె ఆరోపించారు. అయితే దీనిపై పోలీసల వాదన మరో ఉంది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఈ వివాదం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే...బీజేపీ కార్యకర్త సుజాత హండి, చాలుక్య నగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఎస్ఐఆర్ సర్వే సందర్బంగా తలెత్తిన ఘర్షణ కారణంగా ఆమెను అరెస్టు చేస్తున్నప్పుడు, మగ పోలీసులు తనపైదాడిచేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ, అభ్యంతర కరంగా ప్రవర్తించారని బాధితురాలి ఆరోపణ. ఈ సంఘటనకు సంబంధించి రెండు వీడియోలు వైరల్ అయ్యాయి.వాటిలో ఒకదానిలో హండిని పోలీసు వ్యాన్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలకు సంబంధించింది.🚨BJP woman worker alleges assault and stripping during SIR protest in Karnataka, police DENY CLAIMS. The woman activist is identified as Sujata Handi Cops claim 'she stripped' pic.twitter.com/dL15PuB5hQ— The Tatva (@thetatvaindia) January 7, 2026 మరోవైపు సుజాత ఆరోపణలు పోలీసులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఆమెతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణ పూర్తిగా అవాస్తవం అన్నారు. అయితే, సుజాత అరెస్టును ప్రతిఘటించి, అధికారులతో దురుసుగా ప్రవర్తించిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమే చింపేసుకుందిఅధికారులు నిర్వహిస్తున్న సర్వే సమయంలో స్థానికుల మధ్య విభేదాలు తలెత్తి, అది ఘర్షణకు దారితీసింది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు, వాగ్వాదాలు జరిగాయి, భౌతిక దాడులకుదిగారని పోలీసులుత ఎలిపారు.దీనిపై స్థానికుడు ప్రశాంత్ బొమ్మాజీ ఫిర్యాదు ఆధారంగా ఆమెను అరెస్టు జరిగినట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, సోమవారం ఎనిమిది నుండి పది మంది మహిళా అధికారులతో కలిసి హండిని అరెస్టు చేయడానికి వెళ్లారని, ఈ క్రమంలో నిందితురాలు పోలీసు వ్యాన్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆమే తన బట్టలు తీసేసిందని శశికుమార్ చెప్పారు. అక్కడున్న మహిళా అధికారులు ఆమెకు మరో జత బట్టలు అందించడానికి స్థానికుల సహాయం కోరారని, ఆమెను బట్టలు వేసుకోమని పదేపదే కోరామని చెప్పారు. అలాగే నిందితురాలు సుజాతపై గత ఐదేళ్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయన్నారు. ఐదు గత ఐదేళ్లవి కాగా, నాలుగు ఈ సంవత్సరానికి చెందినవి. ఈ నాలుగింటిలో మూడు ప్రజలు దాఖలు చేసినవి, ఒకటి పోలీసు దాఖలు చేసినట్టు వివరించారు.#WATCH | Hubballi, Karnataka: BJP worker allegedly assaulted in Hubballi, sister of victim, Vijaylakshmi says, "... We were sitting outside our house when around 30 policemen arrived. They took Sujata and all of us inside. Sujata was brutally assaulted, and her clothes were torn.… pic.twitter.com/UQooQPrs7j— ANI (@ANI) January 7, 2026సుజాత అరెస్ట్పై కమిషనర్ స్పందిస్తూ, అరెస్టు సమయంలో, ఆమె తన అనుచరులతో కలిసి పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించి ఘర్షణకు దిగిందనీ, సబ్-ఇన్స్పెక్టర్, ముగ్గురు నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారనీ, విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని ఆయన చెప్పారు.బాధితురాలి సోదరి"మా ఇంటి బయట కూర్చుని ఉండగా, సుమారు 30 మంది పోలీసులు వచ్చి సుజాతతో పాటు అందర్నీ లోపలికి తీసుకెళ్లారు. సుజాతపై దారుణంగా దాడి చేశారు, ఆమె బట్టలు చింపేశారు. మహిళా, పురుష పోలీసు అధికారుతొద్దరూ ఉన్నారు, మమ్మల్ని వదిలేయమని వేడుకున్నాం అయినా పోలీసులు సుజాతను ఈడ్చుకెళ్లారు." అని బాధితురాలి సోదరి విజయలక్ష్మి తెలిపింది. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా లోకానికే తీరని అవమానమని, సంబంధిత లీసులను వెంటనే సస్పెండ్ చేయాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి : 16 అంతస్తుల బిల్డింగ్పైనుంచి పడి టెకీ దుర్మరణం -
AP: దళితులపై పోలీసుల దమనకాండ
-
మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి దెబ్బ
రాయ్పూర్: ఛత్తీస్ఘఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బ తగిలింది. జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 7 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.లొంగిపోయిన వారిలో ఒకరు సీవైపీసిఎం, ఒకరు డీవీసీఎం, ముగ్గురు పీపీసిఎం, ముగ్గురు ఏసియం, అలాగే 18 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. మొత్తం మీద వీరిపై రూ. 64 లక్షల రివార్డ్ ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడుతూ.. ‘పూనా మార్గం ప్రచారం ప్రభావంతో మావోయిస్టులు తమ పాత మార్గాన్ని వదిలి, జనజీవన స్రవంతిలోకి వచ్చారు. సమాజంలో శాంతి, అభివృద్ధి కోసం వారు ముందుకు రావడం సంతోషకరం’ అని పేర్కొన్నారు.పోలీసుల వ్యూహం ఫలించిందిసుక్మా జిల్లాలో గత కొంతకాలంగా పోలీసులు సమాజంలో కలిసిపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, పూనా మార్గం ప్రచారం వంటి చర్యలు తీసుకున్నారు. ఈ వ్యూహం ఫలితంగా మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి, శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది. వారిని సమాజంలో తిరిగి కలిపి, సాధారణ జీవన విధానంలోకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయనున్నారు. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోవడం, ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. పూనా మార్గం ప్రచారం, పోలీసుల వ్యూహం, అభివృద్ధి కార్యక్రమాలు ఈ విజయానికి కారణమయ్యాయి. -
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
భారత స్టార్ పేసర్ క్రాంతి గౌడ్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారి కలలు ఫలించాయి. ఆమె తండ్రి మున్నా సింగ్ తిరిగి ఉద్యోగంలో చేరేందుకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.గతేడాది భారత్ తరఫున మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది క్రాంతి గౌడ్. ఇప్పటికి మొత్తంగా 15 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. వన్డేల్లో 23, టీ20లలో రెండు వికెట్లు తీసింది.తొమ్మిది వికెట్లు కూల్చి.. అయితే, గతేడాది సొంతగడ్డపై జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025లో క్రాంతి గౌడ్ అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది. ఈ మెగా టోర్నీలో మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చి.. భారత్ తొలిసారిగా చాంపియన్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించింది. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది.కూతురి ప్రతిభ.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్రాంతి గౌడ్ సముచిత రీతిలో గౌరవించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్.. క్రాంతి తండ్రి మున్నా సింగ్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్కు గర్వకారణమైన తమ ముద్దుబిడ్డ పట్ల ప్రేమను చాటుకుంటూ నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ క్రమంలోనే మున్నా సింగ్ తిరిగి పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరవచ్చని సోమవారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ క్రీడా శాఖా మంత్రి విశ్వాస్ సారంగ్ వెల్లడించారు. ‘‘అథ్లెట్ల పట్ల గౌరవం, వారి బాగోగుల గురించి మా ప్రభుత్వం పట్టించుకుంటుందనేందుకు ఇదే నిదర్శనం.మా నిర్ణయం వల్ల గౌడ్ కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి లాభం చేకూరకపోవచ్చు. అయితే, తన తండ్రి గౌరవప్రదంగా.. పోలీస్ యూనిఫామ్లో రిటైర్ అవ్వాలన్న క్రాంతి కల మాత్రం నెరవేరుతుంది’’ అని పేర్కొన్నారు. కాగా మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేసిన మున్నా సింగ్ 2012లో సర్వీస్ నుంచి తొలగించబడ్డారు.మున్నా సింగ్పై అందుకే వేటుఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో మున్నా సింగ్పై వేటు పడింది. ఈ క్రమంలో మున్నా సింగ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడింది. నిలకడైన ఆదాయంలేక చాలీచాలని డబ్బులతో.. ఒక్క పూట భోజనం కూడా దొరకడం కష్టమైన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ క్రాంతి గౌడ్ క్రికెటర్ కావాలన్న తన కలను వదల్లేదు.ట్విస్టు ఏంటంటే?కష్టాల కడలిని దాటి భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది. అంతేకాదు వరల్డ్కప్ విజయంలోనూ కీలకంగా వ్యవహరించి కీర్తిప్రతిష్టలు సంపాదించింది. ఈ క్రమంలోనే ఆమె తండ్రికి ఉద్యోగం తిరిగి వచ్చింది. అయితే, ఇక్కడే ఓ ట్విస్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్డీటీవీ వివరాల ప్రకారం.. జూన్ 8, 2012 నుంచి జనవరి 5, 2026 వరకు మున్నా సింగ్ విధుల్లో లేడు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆయనకు ప్రభుత్వం ‘నో వర్క్, నో పే’ నిబంధనను వర్తింపజేసినట్లు సమాచారం. అంటే.. 2012- 2026 వరకు సర్వీసు కోల్పోయిన మున్నా సింగ్కు ఎలాంటి జీతభత్యాలు ప్రభుత్వం చెల్లించదు. చదవండి: ఆ ముగ్గురిని చూస్తుంటే..: కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
RK Roja : అందుకే 36వ ర్యాంకు వచ్చింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి..
-
Tirupati: సాక్షి దినపత్రిక ఫొటోగ్రాఫర్ మోహనకృష్ణపై కేసు
-
ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో అమర్ దీప్ను పట్టుకున్న పోలీసులు
-
రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారు
సాక్షి, అమరావతి: ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మండిపడ్డారు. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే సీఎం చంద్రబాబు... రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సోమవారం ఆయన పోస్ట్ చేశారు. ‘‘ఒక చిన్న ఎంపీపీ ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేస్తున్న తీరు, ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బల ప్రదర్శన వేదికగా మార్చిన వైనం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని బట్టబయలు చేస్తోంది’’ అని అన్నారు.‘‘ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికలో ఓటు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా, వారిపై దాడి చేశారు. దీంతో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు. మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం... ఎంపీపీ ఎన్నికలో వారిని ఓటు వేయకుండా ఆపడమే.ఒక భయాందోళన పరిస్థితి సృష్టించి, బల ప్రయోగంతో వారి ఓటు హక్కును అడ్డుకోవడమే. ప్రజల గొంతును అణచివేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతరేయడానికి ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనల సమయంలో... పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి బహిరంగంగా మద్దతిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడడంలో విఫలమవుతున్నారు’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. మౌన ప్రేక్షకుల్లా ఎన్నికల అధికారులు ‘‘రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో కూడా అదే పరిస్థితి చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిలిచి, ఎంపీపీ ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారు’’ అని జగన్ ధ్వజమెత్తారు.‘‘ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల కిడ్నాప్, వారిపై బహిరంగంగా దాడి, పోలీసు వ్యవస్థను దుర్వీనియోగం చేయడం, ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయింది. ఒక చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఎన్నికలోనే ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత అధికార దుర్వీనియోగం చేస్తోందో తేటతెల్లం అవుతోంది. ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకిగా మారింది అన్న విషయాన్ని చాటుతోంది’’ అని జగన్ అన్నారు. -
డయల్ 100.. స్పాట్లోనే దొరికిన దొంగ
సాక్షి హైదరాబాద్: మియాపూర్ పోలీసులు శబాష్ అనిపించుకున్నారు. డయల్ 100కు కాల్ చేసిన క్షణాల్లోనే స్పందించి ఏటీఎంలో దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకొని సత్తా చాటుకున్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ బాధ్యతని దానికోసం నిరంతరం అప్రమత్తతతో ఉంటామని పోలీసులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. మాదాపూర్ జోన్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్, మార్థండనగర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద నిన్న(ఆదివారం) రాత్రి సమయంలో దొంగతనం జరుగుతోందని గుర్తుతెలియని వ్యక్తులు 100కు డైల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. ఏటీఏంలో డబ్బుల చోరీకి యత్నిస్తున్న నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అనంతపురం జిల్లా అక్కంపల్లి మండలం జార్జ్పేట్ గ్రామం వాసి కాటమయ్య (24)గా గుర్తించినట్లు తెలిపారుఏటీఏం చోరికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్దనష్టం తప్పినట్లు మియాపూర్ ఏసీపీ సీహెచ్ వై శ్రీనివాస్ కుమార్ తెలిపారు. చుట్టు ప్రక్కల ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు నమోదైతే ప్రజలు డయల్–100కు కాల్ చేయాలని ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. -
సాక్షి ఫోటోగ్రాఫర్పై పోలీసుల దాడి
-
తిరుపతిలో హైటెన్షన్ పోలీసుల లాఠీ ఛార్జ్
-
దళిత మహిళపై సీఐ దౌర్జన్యం
వేమూరు(చుండూరు): దళిత మహిళపై బాపట్ల జిల్లా చుండూరు సీఐ దౌర్జన్యం చేశాడు. ఆమెను దుర్భాషలాడడంతోపాటు తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు తెనాలి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలు శనివారం ఆస్పత్రిలోని అవుట్పోస్టులో పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ప్రకారం.. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన బంక శారద తన భర్త చంద్రకాంత్, అత్త విక్టోరియాపై గత నెల 18న బంగారం చోరీ కేసు పెట్టింది. చుండూరు సీఐ ఆనందరావు 19న శారద, చంద్రకాంత్, విక్టోరియాలను స్టేషన్కు పిలిపించి విచారణ చేశారు.చంద్రకాంత్పై సీఐ చేయిచేసుకున్నారు. భార్యాభర్తలు సక్రమంగా కాపురం చేసుకోవాలని హెచ్చరించి పంపించారు. శారద ఇంటికి రాకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. బ్రాహ్మణకోడూరు నుంచి తన బంధువులను 10 మందిని తీసుకొని శనివారం చుండూరు పోలీసుస్టేషన్కు వచ్చింది. దీంతో సీఐ ఆనందరావు బంక విక్టోరియా, చంద్రకాంత్లను స్టేషన్కు పిలిపించారు. వారిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. విక్టోరియాను పొత్తి కడుపులో పొడిచి, చేతులపై కొట్టారు. తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో విక్టోరియాను తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకు వెళ్లారు. ప్రభుత్వ వైద్య శాలల్లో చికిత్స పొందుతున్న ఆమె అవుట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు నా భార్య తప్పుడు కేసు పెట్టింది. సీఐ ఆనందరావు విచారణ చేయకుండా శనివారం పోలీసు స్టేషన్లో నా తల్లిని దుర్భాషలాడి ఇష్టారాజ్యంగా కొట్టారు. నన్ను కూడా కొట్టారు. మాకు న్యాయం చేయాలి. – బంక చంద్రకాంత్, ఆలపాడు గ్రామం -
మావోళ్లు.. ఎక్కడున్నట్టు?
‘మా అన్న నక్సల్స్లోకి వెళ్లాడు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు చాలాసార్లు మా ఇంటికి వచ్చారు. లొంగిపోవాలని చెప్పారు. నిన్న డీజీపీ చెప్పిన లిస్టులో మా అన్న పేరు లేదు. ఎక్కడున్నాడో కనీసం మావోయిస్టు బాధ్యులు కూడా చెప్పడం లేదు. అన్నలు, పోలీసులు ఎవరు ఆచూకీ చెప్పకుంటే ఎలా’అని కోరుట్ల నుంచి 44 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన బెజ్జారపు కిషన్ తమ్ముడు ఆంజనేయులు ప్రశ్న. కిషన్ భార్య కూడా తన భర్త ఎక్కడున్నాడో తెలపాలని వేడుకుంటోంది.జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి 44 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన నిజాముద్దీన్ కుటుంబ పరిస్థితి కూడా దాదాపు ఇదే. మావో టెక్ విభాగ ఇన్చార్జ్గా పనిచేసినట్టు చెప్పుకున్న నిజాముద్దీన్ ఆచూకీ ఎక్కడా దొరకడం లేదు. ఇలా ఉత్తర తెలంగాణ నుంచి నక్సల్స్ ఉద్యమంపై ఆసక్తితో అజ్ఞాతంలోకి వెళ్లి జాడ లేకుండా పోయిన వారు పదుల సంఖ్యలో ఉంటారని అంచనా.కోరుట్ల: కోరుట్ల నుంచి ప్రస్తుత మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లడానికి మూడేళ్ల ముందే అంటే.. 1982లో కోరుట్లకు చెందిన బెజ్జారపు కిషన్, మహ్మద్ నిజాముద్దీన్ నక్సల్స్లో చేరి దళాల్లో వివిధ హోదాల్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ప్రకటించిన లిస్టులో ఈ ఇద్దరి వివరాలు లేవు. ⇒ కోరుట్ల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ముక్కా వెంకటేశం డీసీఎం స్థాయిలో 1998లో యాదగిరిగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ⇒ పసుల రాంరెడ్డి తెలంగాణ పశ్చిమ డివిజన్ దళానికి డీసీఎంగా పనిచేస్తూ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వద్ద 2000 సంవత్సరంలో జరిగిన మద్దిమల్ల ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ లెక్కన కోరుట్ల నుంచి నక్సల్స్లోకి వెళ్లిన బెజ్జారపు కిషన్, నిజాముద్దీన్, తిప్పిరి తిరుపతి, ముక్కా వెంకటేశం, పసుల రాంరెడ్డిల్లో ఇద్దరు ఎన్కౌంటర్లలో మృతి చెందగా.. మరో ఇద్దరు జాడ లేకుండా పోయారు. ఏడాది క్రితం వరకు తెలంగాణ నుంచి 55 మంది వరకు మావోయిస్టుల్లో ఉన్నారని పోలీసు రికార్డులు చెబుతుండగా, ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారని..వారి పేర్లు ప్రకటించడం గమనార్హం.దీంతో ఇప్పటి వరకు ‘మావో’ల్లోనే మావారు ఉన్నారని అనుకొని వారి కోసం ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నాయి. పౌరహక్కుల సంఘాలు, ఇతర మార్గాల ద్వారా మావోయిస్టు ప్రతినిధులకు సమాచారం పంపినా ఫలితం దక్కలేదు. ఆచూకీ లేకుండా పోయిన వారు ఉద్యమంలో ఉన్నారా? జైళ్లలో ఉన్నారా ? లేకుంటే చనిపోయారా? అన్న విషయంలో మావోయిస్టులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
వరంగల్లో మూగబోయిన పోలీస్ సైరన్
సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలోని జన్మభూమి జంక్షన్ వద్ద ఆకతాయిల వీరంగం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. నడిరోడ్డుపై బీర్ సీసాలతో హంగామా చేస్తూ కొంతమంది వ్యక్తులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. గంజాయి మత్తులో రెండు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో వారిని అదుపు చేయడానికి వెళ్లిన వారిపై కూడా దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో తరచూ గొడవలు జరుగుతున్నప్పటికీ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో నివసించే వారు ప్రాణాలు గుపిట్లో పెట్టుకొని తమ గృహాలకు చేరుతున్న పరిస్థితి నెలకొంది. రోజురోజుకి ఆకతాయిల అల్లర్లు పెరుగుతున్నాయి. వారిని అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో పోలీస్ పెట్రోలింగ్ సరిగ్గా లేకపోవడం మాకు భయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు పెట్రోలింగ్ పెంచి గొడవలను అదుపులోకి తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
సీఐ అయితే ఏంటి.. ఏం పీక్కుంటావ్
అనంతపురం: ‘నువ్వు సీఐ అయితే ఏంటి? ఏం పీక్కుంటావ్!’ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి అనుచరుడు, ఆ పార్టీ కడప పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి బొజ్జ మైసూరారెడ్డి నోరుపారేసుకున్నారు. జెడ్పీ కార్యాలయం ఆవరణలోనే అనంతపురం టూటౌన్ సీఐ శ్రీకాంత్పై బూతుపురాణం విప్పారు. ఇంత జరిగినా అతన్ని రాచమర్యాదలతో జెడ్పీ సమావేశంలోకి స్వయాన ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి పిలుచుకెళ్లడం విమర్శలకు తావిచ్చింది. వైఎస్సార్సీపీ శ్రేణులపై ఒంటికాలిపై లేస్తూ అక్రమ కేసులు బనాయించే సీఐ శ్రీకాంత్ తనపై టీడీపీ నేత బొజ్జ మైసూరారెడ్డి రెచ్చిపోయినా కనీసం మందలించే సాహసం కూడా చేయలేకపోయారు.వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం అనంతపురంలోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. దీనికి టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి అనుచరులతో కలసి హాజరయ్యారు. సమావేశ మందిరంలోకి ప్రజాప్రతినిధులు, సభ్యులు మినహా ఇతరులు వెళ్లకూడదని సీఐ శ్రీకాంత్ అభ్యంతరం తెలిపారు. దీంతో టీడీపీ నాయకుడు బొజ్జ మైసూరారెడ్డి రెచ్చిపోయారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపైనే బూతులు తిడుతూ దాడి చేయబోయాడు. ‘సమావేశంలోకి వెళ్లకుండా ఆపడానికి నువ్వెవరు? మేం కూడా నీలాగే డ్యూటీలో ఉన్నాం.ఏయ్.. నువ్వు సీఐ అయితే ఏంటి? ఏం పీక్కుంటావ్!’ అంటూ రౌడీయిజం ప్రదర్శించాడు. సభ్యులు తప్ప మరెవరినీ లోపలకు అనుమతించరాదని కలెక్టర్ ఆదేశాలిచ్చారని సీఐ శ్రీకాంత్ చెబుతున్నా.. మైసూరారెడ్డి వినకుండా ‘నువ్వెంత మమ్మల్ని ఆపడానికి! మాకు కుర్చీలేదని చెప్పడానికి నువ్వెవడు’ అంటూ చెలరేగిపోయాడు. ఇంతలో పోలీసులు వచ్చి బయటకు గెంటే ప్రయత్నం చేశారు. వెంటనే ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి సమావేశం నుంచి బయటకు వచ్చి బొజ్జ మైసూరా రెడ్డిని లోపలికి తీసుకెళ్లారు. పోలీసులను తన అనుచరుడు తీవ్ర అవమానానికి గురి చేసినప్పటికీ.. ఎమ్మెల్సీ మాత్రం అతనికే వత్తాసు పలికారు. బండ బూతులతో రెచ్చిపోయినా.. టీడీపీ నాయకుడు బొజ్జ మైసూరారెడ్డి సీఐ శ్రీకాంత్ను బాహాటంగా దుర్భాషలాడినా పోలీసుల్లో ఎలాంటి చలనం కనిపించలేదు. అతనిపై కేసు నమోదు చేయకపోగా.. రాచ మర్యాదలతో సమావేశ మందిరంలోకి పంపించారు. బండ బూతులతో పబ్లిక్గా రెచ్చిపోయినా సీఐ శ్రీకాంత్ అతనిపై ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోయారు. అధికార పారీ్టకి జీహుజూర్ అంటూ సదరు నేతను అత్యంత గౌరవంగా సమావేశంలోకి పంపించి స్వామిభక్తి ప్రదర్శించారు. టీడీపీ నాయకులపై ఒకలా.. వైఎస్సార్సీపీ నాయకులపై మరొకలా వ్యవహరిస్తూ నాలుగో సింహం పూర్తిగా పక్షపాతంగా విధులు నిర్వహిస్తోందనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
సమయం లేదు మిత్రమా..
సాక్షి, హైదరాబాద్: ‘సమయం మించిపోతోంది మిత్రమా..గడువులోగా వచ్చి లొంగిపోండి. ప్రభుత్వాలు, పోలీసుల తరఫున ఏ సహకారం అందాలో అది పూర్తిగా అందిస్తాం..’అని మావోయిస్టులకు డీజీపీ బి.శివధర్రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (పీజీఎల్ఏ) పతనం అంచుకు చేరిందని, ప్రస్తుతం కేవలం 66 మంది మాత్రమే మిగిలారని తెలిపారు. ఇప్పటివరకు పట్టుబడిన మావోయిస్టుల నుంచి అత్యంత కీలక సమాచారం తెలిసిందని, వారు మావోయిస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన 52 మంది అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు రికార్డులు ఉన్నా..వాస్తవానికి 17 మంది మాత్రమే ఉన్నట్టు తెలిసిందని చెప్పారు.మడావి హిడ్మా అనుచరుడు పీజీఎల్ఏ బెటాలియన్ కమాండర్ బడ్సె సుక్క అలియాస్ దేవా (బర్సె దేవా), దర్శన్, మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి అలియాస్ రంకో సహా మొత్తం 20 మంది మావోయిస్టులు శనివారం డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. రెండు అత్యాధునిక లైట్ మెషీన్ గన్ (ఎల్ఎంజీ)లు సహా మొత్తం 48 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.రూ.20.3 లక్షల నగదు కూడా అప్పగించారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్కుమార్, శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్, ఆపరేషన్స్ అదనపు డీజీ అనిల్కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతితో కలిసి శివధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సహా మరే ఇతర రాష్ట్రాల పోలీస్ చరిత్రలోనూ ఒకే లొంగుబాటులో ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు మావోయిస్టులు విడిచిపెట్టడం ఇదే మొదటిసారి (రికార్డు) అని తెలిపారు.మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ‘అంతర్గత కలహాలు, ఆరోగ్య సమస్యలు, ప్రస్తుతం అడవుల్లో ఉండలేని పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీలకు మావోయిస్టులు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే 576 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మిగిలి ఉన్న అగ్రనేతలు సహా అందరూ వీలైనంత త్వరలో జనజీవన స్రవంతిలోకి కలుస్తారని ఆశిస్తున్నాం. గెరిల్లా ఆపరేషన్లను ముందుండి నడిపిన దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పెద్దపల్లి జిల్లా కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ లొంగుబాటుతో ఆ పార్టీ రాష్ట్ర కమిటీపై పెద్ద దెబ్బ పడినట్లయింది.రాజిరెడ్డి 1997లో ఉద్యమంలో చేరాడు. ప్రస్తుతం లొంగిపోయిన 20 మందికి మొత్తంగా రూ.1.81 కోట్ల రివార్డు అందిస్తాం. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున డీడీలు ఇస్తున్నాం..’అని డీజీపీ తెలిపారు. రాజిరెడ్డి మాట్లాడుతూ.. మారిన పరిస్థితులు, సాంకేతికత కారణంగా సాయుధ పోరాటం చేయడం కష్టమైందని చెప్పారు. అయితే తాను అనారోగ్య కారణాలతోనే లొంగిపోతున్నట్టు తెలిపారు.మిగిలిన వారు సైతం లొంగిపోవాలని సూచించారు. కాగా 2 ఎల్ఎంజీలతో పాటు అమెరికాలో తయారైన కోల్ట్ రైఫిల్, ఇజ్రాయెల్ దేశంలో తయారైన టవర్ రైఫిల్, 8 ఏకే 47లు, 10 ఇన్సాస్లు, 8 ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్)లు, 4 బీజీఎల్ (బ్యారెల్ గ్రనేడ్ లాంచర్)లు, 11 సింగిల్ షాట్లు, రెండు గ్రనేడ్లు, ఒక ఎయిర్ గన్, 93 మ్యాగ్జైన్లు, 2,206 తూటాలు మావోయిస్టులు అప్పగించారు. -
చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు
-
న్యూ ఇయర్ వేడుకల వేళ.. ఉగ్ర కుట్ర భగ్నం?
ఢిల్లీ: నూతన సంవత్సరం వేడుకల వేళ రాజస్థాన్లో కలకలం రేగింది. రాజస్థాన్ టోంక్ జిల్లాలో పేలుడు పదార్థాలు ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంచులతో ఉన్న కారును సీజ్ చేశారు. 200 కాట్రేడ్జిలు, ఐదు బండిల్స్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. నిందితులు బుండీ నుండి టోంక్కు పేలుడు పదార్థాలను తరలిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో సురేంద్ర మోచి, సురేంద్ర పట్వాలను అరెస్ట్ చేసిన పోలీసులుపలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.డీఎస్పీ మృత్యుంజయ మిశ్రా మాట్లాడుతూ.. నిఘా వర్గాల సమాచారం మేరకు పెద్ద ఆపరేషన్ చేపట్టామని.. వాహనం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని.. కేసులో అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, అమోనియం నైట్రేట్ను పేలుడు పదార్థాలతో కలిపి వాడతారు. గత నెల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో ఉపయోగించారు. ఆ ఘటనలో 15 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
తణుకులో పోలీసుల ఓవరాక్షన్..
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: తణుకులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద 144 సెక్షన్ విధించారు. జనవరి 5న వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేస్తామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రకటించగా.. వైఎస్సార్ విగ్రహం చుట్టూ రెవెన్యూ అధికారులు ఇనుక కంచె వేశారు.ఎట్టిపరిస్థితుల్లోనూ వైఎస్సార్ విగ్రహాన్ని ప్రారంభిస్తామన్న కారుమూరి తేల్చి చెప్పారు. ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి సహా 13 మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. విగ్రహం వద్ద పోలీసులు పహారా కొనసాగుతుంది.కాగా, ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే తణుకు ప్రాంతం రాష్ట్రంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన సంఘటనలతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తణుకు వై.జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ కట్టి టీడీపీ సానుభూతిపరులు చేసిన నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్సీ కట్టడంపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడం, తమ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, ఆపై రెండు ఫ్లెక్సీలు పోలీసులు తొలగింపచేయడం రాష్ట్రంలో హాట్టాపిక్గా మారింది. -
MLA బొజ్జల సుధీర్ రెడ్డిని విచారించనున్న చెన్నై పోలీసులు
-
Sajjanar: న్యూ ఇయర్ వేళ.. క్యాబ్, ఆటో డ్రైవర్లకు సజ్జనార్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే క్యాబ్, ఆటో డ్రైవర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన ఎక్స్లో ట్వీట్ చేశారు. ప్రధాన హెచ్చరికలున్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడతాయి. ఈ నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదు.నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.మీకు ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే…— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 30, 2025ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్షాట్లను ప్రయాణికులు సేకరించి వాటిని పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ వివరాలను హైదరాబాద్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్ 91 94906 16555 కు పంపాలని విజ్ఞప్తి చేశారు. -
Magazine Story: దారి తప్పిన నాలుగో సింహం పోలీసుల మెడకు ఉచ్చు
-
నేరం రుజువు కాకముందే ఖాకీల శిక్ష
సాక్షి, అమరావతి: ఇప్పటికే బరితెగించి వ్యవహరిస్తున్న ఏపీ పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం నిర్భీతిగా బేఖాతరు చేసే స్థాయికి చేరారు. రెడ్బుక్ రాజ్యాంగ అరాచకాలకు వత్తాసు పలకడమే ఏకైక కర్తవ్యంగా రాజ్యాంగ ధర్మాన్ని నిస్సిగ్గుగా పోలీసు శాఖ విస్మరిస్తోంది. నిందితుల అరెస్టు, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై స్వయంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం విస్మయపరుస్తోంది. ఆయా అంశాలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు ఏమిటీ?.. ఏపీ పోలీసుల బరితెగింపు ఏ స్థాయికి చేరిందన్న అంశాలు పరిశీలిస్తే...నిందితులను పరేడ్ చేయించకూడదుడీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం ఏదైనా కేసుల్లో నిందితులను అరెస్టు విషయంలో పోలీసులు కచ్చితంగా నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. నిందితులను అరెస్టు చేయడం, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియలో అనుసరించాల్సిన విధి విధానాలను నిర్దేశించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం.. ⇒ ఒక కేసులో నిందితులుగా ఉన్నంత మాత్రాన వారు నేరస్తులుగా భావించలేం. నేరం నిరూపితం కానంతవరకు నేరస్తులు కారు.⇒ ఇక నిందితుల సామాజిక గౌరవానికి పోలీసులు భంగం కలిగించ కూడదు. వారి గౌరవాన్ని పోలీసులు కచ్చితంగా పరిరక్షించాలి. అరెస్టు చేసిన నిందితులను బహిరంగంగా నడిపిస్తూ పరేడ్ చేయించకూడదు. వారిని ప్రజలకు కనిపించేలా ప్రదర్శించకూడదు. ⇒ నిందితులను సోదా చేసే ప్రక్రియ గౌరవప్రదంగా ఉండాలి. వారి వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించకూడదు. ⇒ అరెస్టు సమయంలో పోలీసులు బల ప్రయోగం చేయడం సరికాదు. ⇒ నిందితులు తప్పించుకునేందుకు యత్నిస్తే, గాయాలు కాకుండా వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించాలి. అంతేగానీ అరెస్టు కోసమని చెప్పి గాయపరచ కూడదు.సుప్రీం కోర్టు చెప్పినా లెక్క చేయం: ఏపీ పోలీసుల నిర్భీతి నిందితుల గౌరవానికి భంగం కలిగించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తాము లెక్కచేయబోమంటూ బాబు సర్కార్ హయాంలో ఏపీ పోలీసులు బరితెగిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కక్ష పూరితంగా అరెస్టు చేసిన పలువురు నిందితులను రోడ్డుపై నడిపించి పరేడ్ చేయించడం పోలీసుల దాషీ్టకానికి నిదర్శనం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను సంప్రదాయ జాతర తరహాలో నిర్వహించిన అభిమానులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. నరికిన పొట్టేళ్ల తలలను దండగా చేసి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీకి వేసి వేడుకలు చేసిన టీడీపీ అభిమానులను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.కానీ సాధారణ జాతర శైలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన వైఎస్సార్సీపీ అభిమానులపై మాత్రం కక్ష గట్టారు. శ్రీసత్యసాయి, అనంతపురం, ఉభయ గోదావరి తదితర జిల్లాల్లో ఏకంగా 13 కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న యువకులను అరెస్టు చేశారు. అంతేకాదు...వారిని తీవ్రంగా కొట్టారు. అనంతరం వారిని నడిరోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించారు. తద్వారా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. నిందితుల సామాజిక గౌరవానికి భంగం కలిగించారు. వారి వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాశారు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్క లేదని తేల్చి చెప్పారు. వాహనాలు లేవు.. అందుకే నడిపించాం: డీజీపీ గుప్తా బాధ్యతా రహిత స్పందన నిందితుల గౌరవానికి భంగం కలిగించ కూడని.. వారిని రోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించకూడదని సుప్రీంకోర్టు డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ‘సుప్రీంకోర్టు చెబితే మాత్రం మేమేందుకు చేస్తాం’ అన్నట్టుగా సాక్షాత్తూ ఏపీ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా స్పందించడం విభ్రాంతి కలిగిస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా నిందితులను రోడ్డుపై పరేడ్ చేయించడంపై మీడియా ప్రతినిధులు ఆయనను సోమవారం ప్రశ్నించారు. దీనిపై డీజీపీ పూర్తి బాధ్యతారహితంగా స్పందించారు. ‘నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు పోలీసుల వద్ద వాహనాలు లేవు. అందుకే నడిపించి తీసుకువెళ్లాం’ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.తద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర పోలీసు శాఖకు ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పోలీసు శాఖ చీఫ్ స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఇక ఇతర పోలీసు అధికారుల ఎలా వ్యవహరిస్తారన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సామాన్యుల గురించి ఎందుకు పట్టించుకుంటారని, పౌర హక్కుల మాటేమిటని మేధావులు, ప్రజాస్వామ్య హితైషులు ప్రశి్నస్తున్నారు. డీజీపీ గుప్తా ఒక దుస్సంప్రదాయానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వావ్.. మహిళల కోసం డ్రైవింగ్ శిక్షణ
సాక్షి హైదరాబాద్: మహిళా సాధికారదతతో స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం కీలక చర్యలు చేపడుతుంది. హైదరాబాద్ పోలీసుల సహకారంతో హైదరాబాద్లోని మహిళలకు డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్లో వారికి శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం 21-45 సంవత్సరాల మద్య వయసున్న మహిళలు (కేవలం హైదరాబాద్ వాసులే) అర్హులని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉచిత డ్రైవింగ్ శిక్షణతో పాటు లైసెన్స్ జారీలో సహాయం కల్పించనున్నట్లు తెలిపారు. వాటితో పాటు వాహనానికి లోన్ లేదా లీజ్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. వీటికి డ్రైవింగ్లో ఎటువంటి అనుభవం లేకున్నా అప్లై చేసుకోవచ్చన్నారు. జనవరి 3 శుక్రవారం అంబర్పేట్ పోలీస్ గ్రౌండ్ వేదికగా ఈ కార్యక్రమం జరపనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాలకు 89788 62299 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు.స్టీరింగ్ పట్టండి.. స్వశక్తితో ఎదగండి!హైదరాబాద్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ పోలీసుల సహకారంతో డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వనున్నారు.… pic.twitter.com/NMIdrEmJZX— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 29, 2025 -
హదీ హంతకులు భారత్లోకి రాలేదు
షిల్లాంగ్: ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఒస్మాన్ హదీ హంతకులు భారత్లోకి ప్రవేశించారంటూ బంగ్లాదేశ్ పోలీసులు చేసిన ఆరోపణలను బీఎస్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ చేస్తున్నవి నిరాధార, తప్పుదోవ పట్టించే ప్రకటనలని మేఘాలయలో బీఎస్ఎఫ్ చీఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఓపీ ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. హదీ హత్య కేసులో ఫైసల్ కరీం మసూద్, ఆలంగిర్ షేక్ అనే కీలక అనుమానితులిద్దరు హలువాఘాట్ బోర్డర్ పాయింట్ మీదుగా స్థానికుల సాయంతో భారత్లోకి ప్రవేశించినట్లు బంగ్లాదేశ్లోని ఢాకా మెట్రోపాలిటన్ అదనపు పోలీస్ కమిషనర్ ఇస్లాం ఆదివారం ఆరోపించారు. ‘భారత్లోకి పారిపోయాక ఒకరు వీళ్లను మేఘాలయలోని తురా నగరానికి తీసుకెళ్లాడు’అని ఇస్లాం చెప్పారు. ‘అనంతరం వీళ్లను భారత అధికారులు నిర్బంధించారు. ఈ విషయమై అనధికారిక వర్గాల ద్వారా భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిందితులను వెనక్కి తీసుకొస్తాం’ అని అన్నారు. ఆ ఇద్దరు నిందితులు భారత్లోకి ఎప్పుడు ప్రవేశించారనే విషయం ఆయన వెల్లడించలేదు. బంగ్లా పోలీస్ అధికారి ప్రకటనపై ఉపాధ్యాయ్ స్పందిస్తూ..‘హలువాఘాట్ సెక్టార్ మీదుగా ఎవరూ మేఘాలయలోకి ప్రవేశించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు’అని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అసత్యాలని తెలిపారు. గారో హిల్స్ ప్రాంతంలోని హలువాఘాట్ ద్వారా కొందరు వ్యక్తులు మన భూభాగంలోకి ప్రవేశించినట్లు తమకు ఎటువంటి నిఘా సమాచారం అందలేదని మేఘాయ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వివిధ నిఘా, భద్రతా సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మోహరించిన జవాన్లు అత్యంత అప్రమత్తతతో ఉన్నారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. దొంగచాటుగా ఎవరైనా ప్రవేశించిన పక్షంలో వారిని గుర్తించి, పట్టుకుని తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. -
10 నిమిషాల్లో 200 మంది పోలీసులను దించుతా..!
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ ముందు గంటపాటు హైడ్రామా నడిచింది. తన కొడుకుతోపాటు మరో ముగ్గురిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టారని శనివారం రాత్రి ఓ మహిళ రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు నాగమణి తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం ఉదయం తాడేపల్లి ఎస్ఐ సాయి తమ ఇంటికి వచ్చి తన కుమారుడిని గంజాయి విక్రయిన్నాడనే ఆరోపణలతో స్టేషన్కు తీసుకెళ్తున్నామని చెప్పారన్నారు. ఆధార్ కార్డు, ఇతర ప్రూఫ్లు ఇస్తే పంపించేస్తామని నమ్మబలికారని తెలిపారు. అవన్నీ తీసుకున్నాక స్టేషన్లో కాకుండా పక్కన వేరే గదిలో పెట్టి చిత్ర హింసలకు గురిచేశారన్నారు. తమ కుమారుడు తేజ ముంతతోపాటు గాందీనగర్లో నివసించే దినేష్ ప్రేమ్చంద్, యర్రబాలెంలో నివాసం ఉండే పవన్లను కూడా ఇదే తరమాలో తీసుకొచ్చారని ఆరోపించారు. దీనిపై నిలదీస్తే అసభ్య పదజాలంతో తనను దూషించారని వాపోయారు. ఇంతలో ఒక నాయకుడు అటుగా రావడంతో సీఐ అరాచకాలను నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కాళ్లు పట్టుకుని ఆమె బతిమిలాడారు. ఓ నాయకుడు ఆ మహిళను సీఐ వద్దకు తీసుకెళ్లగా అందరి సమక్షంలోనే ‘‘200 మంది పోలీసులను 10 నిమిషాల్లో దించుతాను. మర్యాదగా చెప్పింది చెయ్యి. కపట్రాల తిప్పలో నీలాంటి వాళ్లను ఎంతోమందిని చూశాను. ఎవరు ఏం చేస్తారో చూస్తాను’’ అంటూ పెద్దపెద్దగా మాట్లాడారు. విధులకు ఆటంకం కలిగించినట్లు ఆమెపై కేసు పెట్టండని సిబ్బందిని ఆదేశించారు. మరో మహిళ కూడా సీఐ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదంతా చూసి ఎస్ఐలు అవాక్కయ్యారు. సోమవారం అదుపులోకి తీసుకున్న వారిపై శనివారం ప్రకాషః్ నగర్ శ్మశానవాటిక వద్ద పట్టుకున్నట్లు కేసు నమోదు చేయడం ఏంటని, ఇది తమ తలకు చుట్టుకునేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సక్రమంగా ఉన్నతాధికారులు విచారణ చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. -
దారి తప్పే ఖాకీలకు ‘మిత్ర’ సాయం
సాక్షి, హైదరాబాద్: ఆపదలో ఉన్న ఎవరికైనా మొదట గుర్తొచ్చేది పోలీసులు. విపత్తులైనా, శాంతిభద్రతల సమస్యలైనా వెంటనే డయల్ 100కి కాల్ చేస్తాం. అదే పోలీసులకు ఆపదొస్తే..? అనుకోని కష్టాలతో ఆత్మహత్య వంటి విపరీత నిర్ణయాలు తీసుకునేంతగా కుంగిపోతే? అలాంటి వారికి ‘మిత్ర’అనే శిక్షణ కార్యక్రమం అండగా నిలుస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్, మద్యపానం, విపరీతంగా అప్పులు చేయడం వంటి కారణాలతో దారితప్పుతున్న సిబ్బందిని గాడిలో పెట్టి వారిలో తిరిగి స్థైర్యాన్ని నింపేందుకు పోలీస్ మిత్ర బృందాలు కృషిచేస్తున్నాయి.నిత్యం సవాళ్లతో కూడిన విధుల్లో ఉండే పోలీసుల మానసిక, శారీరక ఆరోగ్యం కాపాడే లక్ష్యంతో స్వాతిలక్రా బెటాలియన్స్ అడిషనల్ డీజీగా ఉన్న సమయంలో టీజీఎస్పీలో ‘మిత్ర’ను 2023లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో ఉత్తమ ఫలితాలు వస్తుండటంతో ప్రస్తుత అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ ఇందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జమ్మూకశ్మీర్లో సీఆర్పీఎఫ్ సిబ్బంది కోసం నిర్వహించిన ‘లవ్ యూ జిందగీ’ కార్యక్రమం దీనికి స్ఫూర్తి అని అధికారులు తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖలోని ఇతర విభాగాలకూ దీన్ని విస్తరించే అవకాశం ఉంది. 8 రోజులు తరగతులు టీజీఎస్పీలోని 13 బెటాలియన్స్ నుంచి ఎంపిక చేసిన 68 మంది మాస్టర్ ట్రైనర్ సర్టీఫికేషన్ కోర్సు పూర్తి చేశారు. వీరంతా ప్రతి బెటాలియన్లో ఐదుగురు చొప్పున ‘మిత్ర’శిక్షకులుగా పనిచేస్తున్నారు. ఫిర్యాదులొచ్చిన వారితోపాటు ఆసక్తి ఉన్న వారిని గుర్తించి 20–30 మంది చొప్పన బ్యాచ్లుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు. మూడేళ్లలో 9,153 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో ఎంతోమంది తమను తాము మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ‘8 రోజుల కోర్సులో మానసిక ఆరోగ్యం, అవగాహన పెంచడం, కుటుంబ, ఆర్థిక అంశాల నిర్వహణ, లింగ సమానత్వం అనే అంశాలపై ప్రధానంగా దృష్టి పెడతాం. వారి ఇబ్బందులు తెలుసుకుని వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం’అని ట్రైనింగ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎన్వీ రమణ తెలిపారు. సిబ్బందిలో మార్పు తెస్తోంది: సంజయ్ కుమార్ జైన్, అడిషనల్ డీజీ, టీజీఎస్పీ పోలీస్ ఉద్యోగంలో ఒత్తిడి తప్పదు. మానసిక, శారీరక ఒత్తిడిని ఎలా జయించాలన్న అంశాలపై బెటాలియన్స్ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాం. మిత్ర శిక్షణతో సిబ్బందిలో మార్పు కనిపిస్తోంది. ఈ కోర్సును మరింత ప్రభావంతంగా మార్చేందుకు కొత్త అంశాలను జోడించి మార్పులు చేస్తాం. ముందు ఎంతో కోపం ఉండేది: కానిస్టేబుల్, 8వ బెటాలియన్ నాకు గతంలో ఎంతో కోపం ఉండేది. ఏ చిన్న విషయమైనా గొడవ పెట్టుకునే వాడిని. అలా ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ, మిత్ర కోర్సు తర్వాత నాలో మార్పు వచ్చింది. ఏ పరిస్థితి అయినా వెంటనే రియాక్ట్ కాకుండా కాస్త స్థిమితంగా ఆలోచించాకే మాట్లాడుతున్నా. గతంలో విచ్చలవిడిగా క్రెడిట్కార్డు వాడేవాడిని. అప్పులు పెరిగేవి. ఇప్పుడు దుబారా ఖర్చులు తగ్గించుకున్నా. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా..: కానిస్టేబుల్, 3 బెటాలియన్ గతంలో ఎంతో ఎమోషనల్గా ఉండేవాడిని. ఆర్థిక ఇబ్బందులతో ఒకసారి ఆత్మహత్యవరకు వెళ్లాను. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా.. ముందు కాస్త ఆలోచించాకే నిర్ణయాలు తీసుకుంటున్నా. ఇంట్లో కూడా ఎంతో కోపంగా ఉండేవాడిని. కుటుంబ విలువ తెలుసుకున్నా, బడ్జెట్ డైరీ పెట్టుకొని అనవసర ఖర్చులు తగ్గించడం నేర్చుకున్నా. వీటి గురించి నాతోటి సిబ్బందికీ చెబుతున్నా. వ్యసనాలన్నీ వదిలేశాను..నేను గతంలో మద్యంతోపాటు ఎన్నో చెడు అలవాట్లకు బానిసనయ్యాను. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నా. నా ప్రవర్తన చూసి ఉన్నతాధికారులు ఎన్నోసార్లు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ నాలో మార్పు రాలేదు. కానీ మిత్ర శిక్షణకు వచ్చిన తర్వాత నన్ను నేను మార్చుకున్నా. చెడు అలవాట్లు పక్కన పెట్టా. నా గౌరవం కూడా పెరిగింది. – హెడ్కానిస్టేబుల్, 8వ బెటాలియన్ -
ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఏటీఎస్.. యాంటీ టెర్రర్ గ్రిడ్
న్యూఢిల్లీ: దేశంలోని పోలీసు వ్యవస్థ కోసం ఏటీఎస్(అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్)ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అదేవిధంగా, యాంటీ టెర్రర్ గ్రిడ్ను కూడా అందుబాటులోకి తేవడం ద్వారా ఉగ్రదాడులను ప్రతి స్థాయిలోనూ ఉమ్మడిగా వేగంగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలవుతుందని చెప్పారు. ‘వ్యవస్థీకృత నేరాలపై 360– డిగ్రీల దాడి’అనే కొత్త పథకాన్ని త్వరలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జీరో టెర్రర్ పాలసీకి ఇది అత్యంత కీలకంగ మారనుందని ఆయన వివరించారు. దేశ రాజధానిలో శుక్రవారం మొదలైన రెండు రోజుల యాంటీ టెర్రరిజమ్ కాన్ఫరెన్స్–2025లో మంత్రి అమిత్ షా ప్రసంగించారు. ‘బలవంతంగా డబ్బు వసూలు చేయడమనే ఏకైక లక్ష్యంతో వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు ఏర్పడుతాయి. వాటి నేతలు విదేశాలకు పారిపోయి, అక్కడే స్థిరపడిపోయాక.. ఇక్కడుండే నెట్వర్క్ ఉగ్ర గ్రూపుల ఆ«దీనంలోకి వెళ్లిపోతున్నాయి. అటు తర్వాత, ఆ నెట్వర్క్ ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు దోహదపడుతోంది’అని అమిత్ షా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్గనైజ్డ్ క్రైం నెట్వర్క్ డేటాబేస్, వెపన్స్ డేటా బేస్ ఫర్ లాస్ట్, లూటెడ్ అండ్ రికవరీ ఆరŠమ్స్కు సంబంధించిన రెండు డేటాబేస్లను ఆయన ప్రారంభించారు. జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) రూపొందించిన ఈ డేటాబేస్లను దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా విభాగాలు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. వీటితోపాటు ఉగ్రవాదులు, నేరగాళ్లకు సంబంధించిన డేటాబేస్లను కూడా రూపొందించాలని సూచించారు. -
ఎవడో ప్రోగ్రాంలో దూరుతున్నాడు.. మేము 4గంటలకు పోయి దండా వెయ్యాలా?
-
భక్తులపై లాఠీ ఛార్జ్.. కవరేజ్ చేస్తున్న సాక్షి ఫోటోగ్రాఫర్ పై దాడి
-
జన నాయగణ్ భారీ ఈవెంట్.. మలేసియా పోలీసుల షాక్.!
పాలిటిక్స్ ఎంట్రీ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న చిత్రం జన నాయగన్. రాజకీయ అరంగేట్రానికి ముందు ఇదే నా చివరి సినిమా అవుతుందని ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా పొంగల్ బరిలో నిలిచింది.ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే గ్రాండ్ ఆడియా లాంఛ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. తమిళులు ఎక్కువగా ఉండే మలేసియాలో ఈ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి దాదాపు లక్షమందికి పైగా ఫ్యాన్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 27న జరగనున్న ఈవెంట్ ద్వారా గిన్నిస్ రికార్డ్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.అయితే ఈ భారీ ఈవెంట్ నేపథ్యంలో మలేసియా పోలీసులు అలర్ట్ అయ్యారు. కౌలాలంపూర్లో జరగనున్న ఈ బిగ్ ఈవెంట్పై ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయవద్దని ముందస్తుగానే హెచ్చరించారు. టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రసంగాలు చేయవద్దని మలేసియా పోలీసులు సూచించారు. రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయడం, బ్యానర్ల వినియోగంపై నిషేధం విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ బుకిట్ జలీల్ స్టేడియంలో జరగనుంది.కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. -
రౌడీ షీటర్ పండుకు స్పెషల్ ట్రీట్ మెంట్
-
దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు
-
దారి తప్పుతున్న యువ ఖాకీలు
ఒకప్పుడు సరదాగా మొదలైన బెట్టింగ్ ఇప్పుడు అనేక మందికి వ్యసనంగా మారింది. అయితే కేవలం సాధారణ పౌరుల జీవితాలను మాత్రమే ఛిన్నాభిన్నం చేస్తోందని అనుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఈ మహమ్మరి కోరల్లో చిక్కుకుని పోలీస్ సిబ్బంది కూడా దారి తప్పుతున్నారు. అందుకు వరుసగా వెలుగుచూసిన ఉదంతాలే కారణం!ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలై.. సర్వం కోల్పోయి.. తన దగ్గర గన్మెన్గా పని చేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకు ముందు.. ఈ వలయంలో చిక్కుకున్న ఓ అధికారి(అంబర్పేట ఎస్సై భానుప్రకాశ్) దాని నుంచి బయటపడేందుకు ఏకంగా సర్వీస్ రివాల్వర్తో పాటు ఓ కేసులో రికవరీ బంగారాన్ని తాకట్టపెట్టాడనే అభియోగాల కింద విచారణ ఎదుర్కొంటున్నారు.ఈ మధ్యలో.. నగరంలోని ఉప్పల్లో ఫిల్మ్నగర్ పీఎస్లో పని చేసే ఓ యువ కానిస్టేబుల్ ఆన్లైన్ బెట్టింగ్ల ఉన్న ఇంటిని అమ్మేసుకుని.. విధులకు దూరంగా ఉంటూ వస్తూ.. చివరకు ఒత్తిళ్ల నడుమ మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అలాగే ఆ మధ్య సంగారెడ్డి టౌన్ పోలీస్స్టేషన్లో పని చేసిన ఓ కానిస్టేబుల్ పిస్టల్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఈ భూతమే ఉందనే ప్రచారం నడిచింది. చిన్న మొత్తాలతో ప్రారంభించిన ఆన్లైన్ గేమింగ్ వ్యసనం.. ఆ తరువాత పెద్ద అప్పులకు దారితీస్తోంది. గేమ్లలో డబ్బులు కోల్పోయి, సహోద్యోగులు.. స్నేహితుల వద్ద అప్పులు చేసి తిరిగి ఇవ్వలేని స్థితికి పోలీసు సిబ్బంది చేరుకుంటున్నారు. అప్పులు తీర్చమని ఒత్తిడి పెరగడంతో చివరకు.. మానసికంగా తీవ్రంగా కలత చెంది తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.బెట్టింగ్ మహమ్మారి కోరల్లో పోలీసులు.. అందునా యువ సిబ్బంది చిక్కుకుపోతుండడం ఇటు ఉన్నతాధికారులకూ ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్ వ్యసనం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన ఉండి.. అందునా టెక్నాలజీపై పట్టుఉన్న సిబ్బంది కూడా ఆ వ్యసనంలో మునిగిపోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. దీన్ని అత్యవసరంగా కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పోలీస్ శాఖలో బలంగా వినిపిస్తోంది. -
సోషల్ మీడియాలో పోస్టులా.. అయితే ఇది మీకోసమే?
సోషల్ మీడియా ఈ రోజుల్లో దీని ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ ఏదో రూపకంగా సామాజిక మాధ్యమాలలో వచ్చే న్యూస్ చూస్తుంటాం. కొన్ని సార్లు మెసేజ్లను ఫార్వర్డ్ చేస్తుంటాం. అయితే మనం ఫార్వడ్ చేసే సమాచారం వల్ల మనకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు.ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రచారం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. నిజనిర్ధారణతో సంబంధం లేకపోవడం,ఎటువంచి ఖర్చు లేకపోవడంతో ఎవరికి తోచినట్లు వారు ఇష్ఠారీతిన సోషల్ మీడియా ప్రచారం చేపడుతున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు సామాజిక మాధ్యమాలలో జరిగే అసత్య ప్రచారాల వల్ల మహిళలు, పిల్లల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అయితే వాటిపై సరైన అవగాహాన లేకపోవడంతో కొంతమంది అటువంటి మెసేజ్లను గమనించకుండా వేరే వారికి ఫార్వర్డ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అటువంటి మెసేజ్లపై జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మెసేజ్లు ఫార్వర్డ్ చేసేముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. మీరు రాసే వార్త నిజమో కాదో నిర్ధారించుకుని, ఆ తర్వాత దాన్ని ఫార్వర్డ్ చేయాలి. వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో చేసే మేసేజ్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. తప్పుడు వార్తల్ని ప్రచారం చేయకూడదు. తప్పుడు ప్రచారంలో భాగస్వాములు కావొద్దు. సెన్సేషనలిజం కోసం పాకులాడుతూ తప్పుడు వార్తలు సష్టించవద్దు.ఏదైనా మెసేజ్లను ఫార్వర్డ్ చేసే ముందు అది సరైందా కాదా దానివల్ల ఏవరి మనోభావాలైనా దెబ్బతింటాయా అనే విషయం గుర్తుంచుకోవాలని పోలిీసులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. -
అయ్యో.. బాబో అన్నా.. పత్తాలేని ఏపీ పోలీస్
సాక్షి, అమరావతి: ‘ఇంటిపేరు కస్తూరి వారు.. ఇల్లంతా గబ్బిలాల కంపు’ అన్నట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ తీరు. టెక్నాలజీకి తాను అంబాసిడర్నని, ఐటీ, ఏఐలను తానే కనిపెట్టానని తరచూ గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు బండారం బట్టబయలైంది. ఆపదలో ఉన్న బాధితులకు తక్షణ సహాయం అందించి రక్షణ కల్పించే టోల్ ఫ్రీ నంబర్ 112 వ్యవస్థ పనితీరులో ఏపీ ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉంది. బాధితులకు ఆపన్న హస్తం అందించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమై దేశంలోనే అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది.బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్ 2.0)ను ఏపీ ప్రభుత్వం అసలు అందుబాటులోకి తేనేలేదన్నది తేటతెల్లమైంది. ఈ విషయాన్ని మరెవరో కాదు సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు ‘40 ఇయర్స్ ఇండస్డ్రీ’ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు అసలు ప్రజలకు రక్షణ కల్పించాలంటే ఏమేం చేయాలో ఆయన చెప్పారు. ఇప్పటికైనా స్పందించండి అని అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ నెల 8న లేఖ రాయడంతో ఏపీ ప్రభుత్వ అసమర్థత జాతీయస్థాయిలో బట్టబయలైంది. మొద్దునిద్రలో ఏపీ పోలీస్ అయ్యా.. ఆపదలో ఉన్నాం. సహాయం చేయండి’ అని బాధితులు మొరపెట్టుకుంటుంటే.. ఏపీ పోలీసులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. చంద్రబాబు రెడ్బుక్ కక్షసాధింపు చర్యలకు కొమ్ముకాసే పనిలో బిజీగా ఉన్నాం.. సామాన్యుల బాధలను పట్టించుకోం అన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణం స్పందించి ఆపన్న హస్తం అందించడంలో ఏపీ పోలీసులు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన చేదు వాస్తవం ఇదీ. అగ్రస్థానంలో చండీగఢ్ పోలీసులు బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసు, అగ్నిమాపక, ఇతర అత్యవసర సేవలను ఏకీకృత వ్యవస్థకు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 112ను ప్రవేశపెట్టింది. ఆ నంబరుకు బాధితులు చేస్తున్న కాల్స్పై దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు ఎలా స్పందిస్తున్నారన్న అంశాన్ని కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది. దేశ వ్యాప్తంగా 112కు వస్తున్న ఫిర్యాదులపై పోలీసుల సగటు స్పందన సమయం 18.28 నిమిషాలుగా ఉంది. అంటే బాధితుల నుంచి ఫోన్ కాల్ రాగానే 18.28 నిముషాల్లోనే పోలీసులు వారికి తగిన సహాయం అందించి రక్షణ కల్పిస్తున్నారు. ఒకప్పుడు ఈ దేశంలో పోలీసుల సగటు స్పందన సమయం 25 నిమిషాలుగా ఉండేది. కేంద్ర హోంశాఖ సమర్థంగా పర్యవేక్షించిన తరువాత సగటు స్పందన సమయం 18.28 నిముషాలకు తగ్గింది. ఇక బాధితులకు తక్షణం సహాయం అందించడంలో కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ పోలీసులు దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. చండీగఢ్ పోలీసులు కేవలం 5.58 నిమిషాల్లోనే బాధితులకు రక్షణ కల్పిస్తుండటం విశేషం.’’ అని అమిత్షా లేఖలో పేర్కొన్నారు. మీరు వెనుకబడి ఉన్నారు.. ఇప్పటికైనా స్పందించండి పోలీసు వ్యవస్థను పటిష్ట పరచడంలో సీఎం చంద్రబాబు వైఫల్యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన లేఖలో ఏమాత్రం మొహమాటం లేకుండా ఎత్తిచూపారు. పోలీసు వ్యవస్థలోని లోపాలపై కుండబద్దలు కొట్టారు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలను ఆయన వివరించారు. బాధితులకు తక్షణం సహాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్ 2.0)ను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ అత్యాధునిక విధానాన్ని తక్షణం అమలు చేయాల్సిన ఆవశ్యకత గురించి కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్వహించిన జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో పలుమార్లు దిశానిర్దేశం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా సరే ఏపీ ప్రభుత్వం తదనుగుణంగా స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తద్వారా బహుళ సిగ్నల్స్, ఆర్టిఫీషియల్ / మెషిన్ లెర్నింగ్ ఎనేబుల్డ్ ఫీచర్స్, డేటా ఎనలిటిక్స్, ఇంటర్ ఆపరేటరీ, స్టేట్ డేటా ఎక్స్చేంజ్ మొదలైన ఆధునాతన సాంకేతిక మౌలిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఈఆర్ఎస్ఎస్ 2.0 ఆపరేషన్ ప్రొసీజర్ను 21 రాష్ట్రాలు మాత్రమే ప్రవేశపెట్టాయని అమిత్ షా పేర్కొన్నారు. టెక్నాలజీని తానే కనిపెట్టానని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏపీలో ఇప్పటివరకు ‘ఈఆర్ఎస్ఎస్ 2.ఓ’ ను ప్రవేశపెట్టనే లేదన్నది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. 2026, మార్చి 31నాటికి ‘ఈఆర్ఎస్ఎస్ 2.0’ను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి అమిత్ షా ఆ లేఖలో గుర్తు చేశారు కూడా. ఇక బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు వీలుగా చేపట్టాల్సిన చర్యలనూ అమిత్ షా తన లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. అమిత్షా చేసిన సూచనలు..» 112సేవలపై విస్తృత ప్రచారం కల్పించండి. » బాధితులకు 24/7 అత్యవసర సేవలు అందించేలా ఎమర్జెన్సీ వాహనాల సంఖ్య పెంచండి. » ఎమర్జెన్సీ వాహనాల్లో మొబైల్ డేటా టెర్మినల్స్(ఎండీటీ)లను ఏర్పాటు చేయండి. » 24 గంటలూ పనిచేసేలా తగినన్ని వర్క్ స్టేషన్లు, కాల్సెంటర్లను ఏర్పాటు చేయండి. » అత్యాధునిక సమాచార సాంకేతికత అందించే ప్రైమరీ రేట్ ఇంటర్ఫేస్(పీఆర్ఐ) లైన్లు తగినన్ని ఏర్పాటు చేయండి. » రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, ఆస్పత్రుల జీఐఎస్ మ్యాప్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. » డేటా ఇండికేటర్లను ఎప్పటికప్పుడు ఎన్ఎస్ఎస్ పోర్టల్ ద్వారా పర్యవేక్షించండి. » సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్కంప్యూటింగ్( సిడాక్)తో కనెక్టివిటీ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. » నేర, ఘటనాస్థలాలకు వీలైనంత త్వరగా వెళ్లే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురండి.బెడిసికొట్టిన సర్కారు కుతంత్రం.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు ఎస్పీల సమావేశంలో నానాపాట్లు పడింది. ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందించడంలో సత్వరం స్పందిస్తున్నామని నమ్మించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఈ అత్యవసర సేవలు అందిస్తున్నామని ఆ నివేదికలో పేర్కొంది. కానీ, అత్యవసర సేవలు అందించడంలో రాష్ట్ర పోలీసులు దారుణంగా విఫలమవుతున్నారని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో తీవ్రంగా ఆక్షేపించారు. అత్యవసర సేవలు అందించేందుకు ఏకంగా 25.50 నిమిషాల సుదీర్ఘ సమయం తీసుకుంటున్నారని ఆ లేఖలో ఆయన కుండబద్దలు కొట్టారు. కానీ, 10 నిమిషాల్లోనే ఆ సేవలు అందిస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం అవాస్తవ గణాంకాలను నివేదికలో పేర్కొని అడ్డంగా దొరికిపోయింది.వైఎస్సార్సీపీ హయాంలో భద్రతకు భరోసాతక్షణ అత్యవసర సేవలు పట్టణాల్లో 5 నిమిషాల్లోనే.. గ్రామీణ ప్రాంతాల్లో 8 నిమిషాల్లోనే.. ఆపదలో ఉన్నవారిని తక్షణం ఆదుకోవడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత సమర్థంగా వ్యవహరించింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అయితే కేవలం 3 నిముషాల నుంచి 5 నిముషాల్లోనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు రక్షణ కల్పించేవారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే గరిష్టంగా 8 నిÐషాల్లోనే పోలీసులు బాధితులకు అండగా నిలిచేవారు. హత్యలు, లైంగికదాడులు జరగకుండా నిరోధించేవారు. దాడులు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేవారు. బాధితులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేవారు. ఇక ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన దిశ యాప్ మహిళల భద్రతకు పూర్తి భరోసానిచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పెట్రోలింగ్ వాహనాలు, దిశ క్రైమ్ డిటెక్షన్ వాహనాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫోరెన్సిక్ ల్యాబ్లు.. ఇలా అధునాతన వ్యవస్థను నెలకొల్పి దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకే దిశ యాప్ జాతీయ స్థాయిలో ఏకంగా 22 అవార్డులను గెలుచుకుంది. గుజరాత్, మహారాష్ట్ర, పల్పింమ బెంగాల్ తదితర రాష్ట్రాల పోలీసు బృందాలు ఆంధ్ర ప్రదేశ్లో పర్యటించి దిశ యాప్ పనితీరును, ఇక్కడి పోలీసులు చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నాయి. ఈ తరహా యాప్లనే ఆ రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టాయి. -
మున్సిపల్ కార్మికులపై విరిగిన లాఠీ
నెల్లూరు (బారకాసు): సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టేందుకు వెళ్తున్న మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. మహిళలని కూడా చూడకుండా తోసేశారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. కిందపడిపోయిన కొందరు.. లాఠీచార్జ్లో మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందర్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు 45 రోజులుగా సమ్మె చేస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. దీంతో వారంతా గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడించేందుకు కార్యాలయ సమీపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చేందుకు యత్నించారు. మరోవైపు మేయర్ స్రవంతి రాజీనామా ఆమోదం కోసం కౌన్సిల్ అత్యవసర సమావేశం జరుగుతోంది. తమ సమస్యలపై వినతిపత్రాన్ని అధికారులకు అందజేయాలనే ఉద్దేశంతో కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు కార్మికుల్ని అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝుళిపించడంతో కార్మికులు కిందపడిపోయారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు తాకరాని చోట తాకుతూ గందరగోళం సృష్టించారు. కార్మికులను ఇష్టానుసారం లాఠీలతో కొట్టారు. సీఐటీయూ నేతలు, కార్యకర్తలతోపాటు అనేకమంది మహిళా కార్మికులకు గాయాలయ్యాయి. రక్తగాయాలైన మహిళల్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం 63 మంది కార్మికులు, యూనియన్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లలో ఎక్కించి ముత్తుకూరు పోలీస్స్టేషన్కు తరలించారు. కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, కమిషనర్ నందన్, ఇన్చార్జి మేయర్ రూప్కుమార్యాదవ్ వచ్చి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని చెప్పగా కార్మికులు అంగీకరించలేదు. మంత్రి నారాయణ, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. చివరికి అరెస్ట్ చేసిన వారిని తీసుకొచ్చి కార్పొరేషన్ కార్యాలయం వద్ద విడిచి పెట్టడంతో నిరసనను తాత్కాలికంగా విరమించారు. -
పసి పిల్లలను విక్రయిస్తున్న ముఠా ఆటకట్టు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఢిల్లీ, ముంబైల నుంచి పసి పిల్లలను తీసుకొచ్చి, పిల్లలులేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టుచేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై నగరంలోని కొత్తపేట, భవానీపురం, నున్న పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదుచేశారు. నిందితుల నుంచి ఐదుగురు పసిపిల్లలతోపాటు, రూ.3.30 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు గురువారం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.విజయవాడ సితార సెంటర్కు చెందిన బలగం సరోజిని సులభంగా డబ్బులు సంపాదించేందుకు పిల్లల్లేని వారికి అక్రమంగా పిల్లలను విక్రయించడాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కిరణ్శర్మ, ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ఆమెకు పరిచయమయ్యారు. వారు అక్కడి నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి సరోజినికి ఇచ్చేవారు. ప్రతిఫలంగా వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వరకూ సరోజిని ఇచ్చేది. ఇలా తీసుకొచ్చిన చిన్నారులను తిరిగి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించేది. వీరికి విజయవాడలో మరికొందరు కూడా జతకలిశారు. వీరంతా గతంలో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చారు. అమ్మకానికి సిద్ధంగా ఉండగా.. ఇక ఢిల్లీకి చెందిన కిరణ్శర్మ, భారతిల నుంచి ఇద్దరు పిల్లలను.. ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ల నుంచి మరో ముగ్గురు పిల్లలను సరోజిని తీసుకొచ్చి అమ్మకానికి సిద్ధంగా ఉంచింది. అయితే, పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు ఈ విషయం తెలిసింది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ కె. లతాకుమారి, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, భవానీపురం, నున్న ఇన్స్పెక్టర్లు ఏకకాలంలో దాడులు నిర్వహించి కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో ఐదుగురిని, నున్న పోలీస్స్టేషన్ పరిధిలోని ఉడా కాలనీలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నలుగురు పిల్లలను, రూ.3.30 లక్షల నగదును స్వా«దీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి విజయవాడలో వివిధ ప్రాంతాలకు చెందిన బలగం సరోజిని (31), గరికముక్కు విజయలక్ష్మి (41), వాడపల్లి బ్లెస్సీ, ఆముదాల మణి, షేక్ ఫరీనా, వంశీకిరణ్కుమార్, శంక యోహాన్, పతి శ్రీనివాసరావు, సత్తెనపల్లికి చెందిన షేక్ బాబావలి, తెలంగాణలోని ఘట్కేసర్కు చెందిన ముక్తిపేట నందిని.. మొత్తం పదిమందిని అరెస్టుచేసినట్లు సీపీ తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, ఏడీసీపీలు జి. రామకృష్ణ, ఏసీపీ కె. లతాకుమారి, ఎన్వీ దుర్గారావు, స్రవంతి రాయ్, పలువురు సీఐలు పాల్గొన్నారు. -
హైదరాబాద్: చందానగర్లో తీవ్ర విషాదం
హైదరాబాద్: నగరంలోని చందానగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారి తన స్కూల్ ఐడీ కార్డుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్కూల్లో తోటి పిల్లలు ఏడిపించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.ప్రశాంత్(9) స్థానికంగా ఓ స్కూల్లో చదువుతున్నాడు. అయితే స్కూల్ యూనిఫామ్ సరిగా లేదని తోటి పిల్లలు ఆటపట్టించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్ ఇంటికి వచ్చాడు. ఆపై బాత్రూమ్లోకి వెళ్లి తన ఐడీ కార్డుతో ఉరి వేసుకున్నాడు.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. చిన్నారి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన పోలీసులు.. ఆపై స్వగ్రామానికి తరలించారు. పిల్లాడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన విద్యాసంస్థల్లో బుల్లీయింగ్ గురించి చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.బుల్లీయింగ్కి(వేధింపులు) చట్టపరమైన శిక్షలు ఉన్నాయి. ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు, ఆన్లైన్ వేదికల్లో జరిగే వేధింపులకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు.. సంబంధిత విద్యార్థిని సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే కౌన్సెలింగ్కి పంపడం జరుగుతుంది. నేరం తీవ్రతను(వయసు రిత్యా) బట్టి శిక్షలు విధించే అవకాశం లేకపోలేదు. -
స్టేషన్కు రా.. కేసు రాజీ చేసుకో..!
చిత్తూరు అర్బన్: ‘ఏం నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మాకేం వేరే పనిలేదా? ముందు స్టేషన్కి రా.. వచ్చి కేసును రాజీచేసుకో..’ అంటూ ఓ పోలీసు అధికారి మహిళా న్యాయవాదికి ఫోన్చేసి బెదిరించారు. జిల్లా కేంద్రం చిత్తూరులో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. నగరానికి చెందిన ఓ మహిళా న్యాయవాది ఒకరిపై గతంలో ఫిర్యాదు చేయగా స్టేషన్లో కేసు నమోదైంది. ఆమెపైన కూడా కౌంటర్ కేసు ఉంది. దీనిపై చట్టప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించుకున్న మహిళా న్యాయవాది కేసును కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కు చెప్పారు. కానీ రాజకీయ నేతల నుంచి ఆ పోలీసు అధికారికి ఫోన్ వచ్చింది. కేసు రాజీచేయించాలని ఆదేశించారు. దీంతో రెచ్చిపోయిన ఆ అధికారి.. మహిళా న్యాయవాదికి ఫోన్చేసి దురుసుగా మాట్లాడారు. దీంతో ఫోన్కాల్ కట్చేసిన ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. -
ఏజెన్సీలో బలగాలకు చిక్కిన మావోయిస్టులు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన డీవీసీఎం(డివిజన్ కమిటీ) ఇన్చార్జ్తో సహా మొత్తం 16 మంది మావోయిస్టులు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో పోలీసు బలగాలకు చిక్కినట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం సిర్పూర్ యూ మండలం బాబ్జిపేట, కకర్బుడ్డి ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చిన కామారెడ్డి జిల్లాకు చెందిన డీవీసీఎం ఎర్రగొల్ల రవితో మరో ఇద్దరు డీవీసీఎం కేడర్తోపాటు 16 మంది పోలీసుల అదుపులో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వీరిని ఏకే 47, ఇన్సాస్ రైఫిల్ వంటి ఆయుధాలతో సహా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. దీనిపై పోలీసులు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మొదటగా రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే పట్టుబడిన వారిలో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినవారు ఉన్నారు. వీరిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టు తెలిసింది. నిఘా వర్గాల సమాచారంతో కొద్ది రోజులుగా ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, సిర్పూర్ యూ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలసి భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మావోల కదలికలు గుర్తించి దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో తీవ్ర నిర్బంధ పరిస్థితులు ఏర్పడడంతో సేఫ్ జోన్గా భావించి వీరంతా ఏజెన్సీకి వచ్చారా, లేక పోలీసులకు లొంగుబాటులో ఇది ఓ భాగమా? ఇంకా ఏదైనా కారణమా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న వారికి హాని తలపెట్టకుండా కోర్టులో ప్రవేశపెట్టాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికాపంత్ను ఈ విషయంపై ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా, ఎలాంటి సమాచారమున్నా, పై అధికారులే వెల్లడించే అవకాశముందన్నారు. -
మావోయిస్టుల లొంగుబాటుపై ప్రెస్నోట్
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టులకు పునారావాసం కల్పించడానికి సరైన ఏర్పాట్లు చేసిందని బీజాపూర్ జిల్లా పోలీసులు తెలిపారు. "పునారావాసం - పునరుజ్జీవనం" కార్యక్రమం ద్యారా మావోయిస్టులకు నూతన జీవితం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజాపూర్లో మంగళవారం 34మంది నక్సల్స్ లొంగిపోయారు. ఈ మేరకు బీజాపూర్ పోలీసులు ప్రెస్నోట్ విడుదల చేశారు.ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మంగళవారం 34 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు బీజాపూర్ పోలీసులు ప్రకటించారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు కాగా 27 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. వారిపై రివార్డు రూ. 84 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారందరికి పునరావాసం పునరుజ్జీవనం కార్యక్రమం ద్వారా నూతన జీవితం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. బీజాపూర్ జిల్లాలో జనవరి1, 2024 నుంచి మెుత్తం 824 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోగా 1079 మంది అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. 220 మంది నక్సల్స్ ఎన్కౌంటర్లలో మరణించినట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి కొత్తజీవితం కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మిగిలిన వారు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులకు పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అంపశయ్యపై ఉంది. కేంద్ర బలగాల ఎన్కౌంటర్లలో ఆ పార్టీ సభ్యులు పెద్దసంఖ్యలో మృతిచెందారు. దానితో పాటు అధిక సంఖ్యలో పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.


