breaking news
Police
-
ఇది పబ్లిసిటీ అని మీరు ఎలా చెప్పగలరు?
ఢిల్లీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతర్మంతర్లో లాఠీఛార్జ్పై సీరియస్ అయిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్రం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సీజేపీ నిరసన వీడియోలు భద్రపర్చాలని ఆదేశించింది. పబ్లిసిటీ కోసమే పిటిషన్ల వేశారన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ASG) వ్యాఖ్యలపై హైకోర్టు మండిపడింది. పబ్లిసిటీ అని ఎలా అంటారు? అంటూ ప్రశ్నించింది. సీజేపీ నిరసనకారులపై క్రూరంగా బలప్రయోగం చేశారనే ఆరోపణలపై కేంద్రం, పోలీసులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. సీసీ టీవీ, ఇతర వీడియో ఫుటేజీ సహా అవసరమైన రికార్డులను భద్రపరచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 11కు కోర్టు వాయిదా వేసింది.విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు-ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన ఏఎస్జీ ఎస్.రాజు కోర్టుకు తమ వాదనలు వినిపించారు. నిరసనల్లో పాల్గొన్న మహిళలపై వేధింపులకు పాల్పడ్డారని.. వారి మర్మంగాలపై దాడులు చేశారని.. మేకులు ఉన్న లాఠీలను ఉపయోగించారని, పోలీసుల వద్ద నేమ్బేడ్జీలు కూడా లేవని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. తమ ఆరోపణలను రుజువు చేసేలా 110 వీడియోలు ఉన్నాయని తెలిపారు.అయితే, ఏఎస్జీ రాజు ఈ వాదనలను ఖండిస్తూ... నిరసనకారులు తీవ్ర హింసాత్మకంగా ప్రవర్తించారని పలువురు పోలీసులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పిటిషన్లు కేవలం ప్రచార ఆర్భాటం కోసం పబ్లిసిటీ పొందేందుకే వేశారని వ్యాఖ్యానించారు. అయితే, చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యను ప్రశ్నిస్తూ... "ఇది పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్ అని మీరు ఎలా చెప్పగలరు? అంటూ నిలదీసింది.విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్లు ఎన్.హరిహరన్, వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. నిరసనకారులు రాజ్యాంగం ప్రసాదించిన శాంతియుత నిరసన, సమావేశమయ్యే హక్కులనే ఉపయోగించుకున్నారని తెలిపారు. -
పోలీసుల అత్యుత్సాహం
హైదరాబాద్: అమ్మవారి కల్యాణోత్సవంలో అడుగడుగునా పోలీసుల అత్యుత్సాహం కనిపించింది. వీవీఐపీలు, వీఐపీల సేవలోనే తరించి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తజనంపై ఏకంగా లాఠీలను ఝుళిపించడం విస్మయానికి గురిచేసింది. వివిధ రకాల పాస్లతో వచ్చిన భక్తులను అనుమతించకపోవడంతో వాగి్వవాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే క్రమంలో లాఠీలకు పని చెప్పారు. కల్యాణోత్సవం మొత్తం పోలీసుల చేతులమీదుగానే జరిగిందని చెప్పాలి. దేవాదాయ శాఖ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. డోనర్స్నూ గ్యాలరీలోకి అనుమతించలేదు. ఆలయానికి సుదూర ప్రాంతంలోనే రోడ్లు బ్లాక్ చేయడంతో భక్తులు చాలా దూరం నడవాల్సి వచ్చింది. -
సోషల్ మీడియా పోస్టులపైనే ఎందుకింత శ్రద్ధ?
కర్ణాటక: సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులు వేగంగా కేసులు నమోదు చేసుకుని చర్యలు తీసుకుంటున్న వైనంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎన్నో గంభీరమైన కేసులు ఉండగా, సోషల్ మీడియా పోస్టులపైనే ఎందుకింత శ్రద్ధ అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఏమిటీ కేసు? వివరాలు.. బంట్వాళ బస్టాండులో ఒక యువతి హత్య జరిగితే, సోషల్ మీడియాలో న్యాయ విద్యార్థి కిరణ్ ఆరాధ్య పోస్టు పెట్టాడు. దీంతో అతనిపై బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ కిరణ్ హైకోర్టును ఆశ్రయించాడు. కిరణ్ తరఫు లాయర్, ఎంపీ తేజస్వి సూర్య వాదిస్తూ ఊహాజనితాల మీద ఎఫ్ఐఆర్ను నమోదు చేశారని, అందులో ఏ మతాన్ని కించపరచలేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ, కేసు నమోదు చేసి రెండు రోజులే అయ్యింది, పిటిషనర్కు పోలీసులు ఇంకా నోటీసు ఇవ్వలేదని తెలిపారు. పిటిషనర్కు ఎటువంటి ఊరట కల్పించరాదని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, రాష్ట్రంలో ఎన్నో తీవ్రమైన కేసులు ఉండగా, సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు శ్రద్ధ చూపడం సమంజసం కాదని, కేసు పూర్తిగా విచారణ జరిగే వరకూ పిటిషనర్పై చర్యలు తీసుకోరాదని ఆదేశించారు. -
హైకోర్టులో AP పోలీసులకు బిగ్ షాక్
-
అదే వేదిక.. అదే పోరు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో తమ డిమాండ్ల సాధనకు బయల్దేరిన వేలాది మంది కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక, విద్యావేత్తలను లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగంతో చెదరగొట్టి, జంతర్మంతర్ వద్ద దీక్షాస్థలిని తొలగించినా ఉద్యమకారులు మళ్లీ మొదటి నుంచి తమ ఉద్యమాన్ని ఆరంభించారు. సోమవారం సాయంత్రం కార్యకర్తలందరినీ దీక్షాస్థలి నుంచి తరిమికొట్టినా మంగళవారం మధ్యాహ్నంకల్లా అందరూ మళ్లీ అదే దీక్షాస్థలికి వచ్చి నిరసనను మొదలెట్టారు. ‘‘పోలీసుల దాష్టికం చూశాక ఉద్యమం మరింత ఉధృతమైంది. సోమవారం కంటే ఎక్కువ మంది ఈరోజు దీక్షాస్థలికి చేరుకున్నారు. డజన్ల మంది విద్యార్థుల ఆత్మహత్యల బలిదానాలతో ఈ ఉద్యమం మొదలైంది. దీనిని వృథాగా పోనివ్వం.మా డిమాండ్లు నెరవేరేదాకా పోరాడతాం’’ అని ఉద్యమకారులు పునరుద్ఘాటించారు. నిరసన కార్యక్రమం మంగళవారం 32వ రోజుకు చేరిన సందర్భంగా జంతర్మంతర్లో సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ప్రసంగించారు. ‘‘సోమవారం చర్చల పేరిట మోదీ సర్కార్ మా సమయాన్ని వృథాచేసింది. కుట్రప్రకారం మా ప్రతినిధులు అశుతోష్, సౌరవ్ దాస్లను ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా నివాసానికి పిలిపించి అక్కడ వారిని నిలువరించారు. వాళ్ల మొబైల్స్ లాక్కున్నారు. ఓవైపు చర్చలంటూనే మరోవైపు వీధుల్లో విద్యార్థులను తలలు పగలగొట్టారు’’అని దీప్కే ఆగ్రహం వ్యక్తంచేశారు.లాఠీచార్జ్, అణచివేతతో తమ ఐక్యతను పోలీసులు చెదరగొట్టలేరని దీప్కే అన్నారు. ఆస్పత్రిలో వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తుండటంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని దీప్కే ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో సీజేపీ కార్యకర్తలు దీక్షాస్థలికి చేరుకున్నారు. వాంగ్చుక్ దీక్షకు గుర్తుగా జంతర్మంతర్ వద్ద ఆయన చిత్రపటాన్ని, రాజ్యాంగ ప్రతి, చర్కాను పెట్టారు. సీజేపీ నుంచి విజేత దహియా బయటకు.. సోమవారం పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న వేళ ప్రతిఘటించాల్సిందిపోయి జంతర్మంతర్ వద్ద తాపీగా బర్గర్ తింటూ కన్పించిన పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియాను సీజేపీ బయటకు పంపేసింది. ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు సీజేపీ మంగళవారం ప్రకటించింది. దహియా సోమవారం బర్గర్ తింటున్న వీడియో బయటకు రావడంతో పలువురు నిరసనకారులు ఆయన నిబద్ధతను ప్రశ్నించారు. దీనిపై దహియా స్పందించారు. ‘‘రెండ్రోజులుగా అందరిలా రోడ్లపై నిద్రలేని రాత్రులు గడిపా. ఆకలేసి బర్గర్ తినడం కూడా తప్పేనా?’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. గాయాలతో వెంటిలేటర్పై విద్యార్థినిన్యూఢిల్లీ: చలో సంసద్ సందర్భంగా సోమ వారం పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగంలో గాయపడిన 23 ఏళ్ల విద్యార్థిని సాక్షి ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్లు అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బాష్పవాయువు ప్రయోగం తర్వాత నిరసనకారులు పరుగులు తీయడంతో ఏర్పడిన తొక్కిసలాట వంటి పరిస్థితుల్లో ఆ యువతి ఊపిరి ఆడక ఇబ్బంది పడినట్లు భావిస్తున్నారు.ఆమె ముఖం, ఛాతీ, మెడ భాగాల్లో గాయాలైనట్లు సాక్షి కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటిలేటర్పై ఉన్నప్పటికీ చికిత్సకు స్పందిస్తోందని తెలిపారు. నిరసన జరిగిన సమయంలో ఆ యువతి తన బంధువుతో కలిసి అక్కడే ఉంది. ఆమె బంధువు కాలికి కూడా గాయాలయ్యాయి. దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్పూర్ ఎక్స్టెన్షన్ ప్రాంతానికి చెందిన బాధిత యువతి సాక్షి అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు అభ్యసిస్తోంది. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. -
సీజేపీ ప్రొటెస్ట్లో విద్యార్థినులపై పోలీసుల అసభ్య వైఖరి : నెట్టింట దుమారం
నీట్ పేపర్ లీక్, విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా, ఆత్మహతల్యకు పాల్పడ్డ నీట్ విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారంలాంటి డిమాండ్స్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ‘సంసద్ చలో’ మార్చ్ (పార్లమెంట్ మార్చ్) సందర్భంగా పోలీసులు ఉద్యమ కారులపై విరుచుకుపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై స్వయంగా పోలీసులే రాళ్లు రువ్వడం, లాఠీలతో విరుచుకుపడటం లాంటి ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించాయి. ముఖ్యంగా మహిళా నిరసనకారులు, విద్యార్థినుల, పోలీసుల వైఖరి, ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మహిళలు, విద్యార్థినుపై పోలీసులు వారిపై అమానుషంగా ప్రవర్తించారని ప్రతిపక్షాలు, ఉద్యమకారులు ఆరోపణలు చేశారు. కొంతమంది విద్యార్థినుల ప్రైవేట్ పార్ట్స్పై కావాలనే దాడిచేశారని సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఇదేనా బేటీ బచావ్ అంటూ పలువురు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోపై దేశవ్యాప్తంగా మహిళల భద్రత మరియు ప్రజాస్వామ్య హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బాధ్యులపై పోలీసు అధికారులపై కఠిన చర్యలుతీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.मोदी सरकार का नारी सम्मान स्वयं देखिए।भाजपा को नारी केवल तब अच्छी लगती जब वह लाडली बहन योजना का धन लेके इनको वोट करे।जहां नारी अपने अधिकारों की बात करती है तब इनकी लाठी चलती है।#AAPHelplineForStudents#JointVenture#CJPProtestUpdate#OmegaStockWatch pic.twitter.com/EtLuNW368H— Cockroach Janta Party,Kanpur (@CJPknp) July 21, 2026నిరసనకారులను, విద్యార్థినులను పోలీసులు బలవంతంగా లాగి, వాహనాల్లోకి ఎక్కించే క్రమంలో పలువురు మహిళల దుస్తులు చిరిగిపోయాయని సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. అనుమతి లేకుండా మార్చ్ నిర్వహిస్తున్నారనే నెపంతో పోలీసులు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారని, బాష్పవాయువు ప్రయోగించి బాలికలపై తీవ్రంగా విరుచుకుపడ్డారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధంలో ఉన్న సమయంలో కొందరు పోలీసు అధికారులు మహిళలను తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించారని ఒక మహిళా ఉద్యమకారిణి ఆరోపించింది. The Delhi Police intentionally attacked the private parts of girls, this is a shameful act by the police. Responsible police officer should be dismissed. pic.twitter.com/1g1gtCXgYQ— The Dalit Voice (@ambedkariteIND) July 21, 2026ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్అయితే ఈ ఆరోపణలపై పోలీసులు వివరణ ఇచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీ పరిసరాల్లో ఆంక్షలు ఉన్నాయని, నిరసనకారులు అనుమతి లేకుండా పార్లమెంట్ వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిరసనకారులలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారని, ఆ క్రమంలో గుంపును చెదరగొట్టడానికి కనీస బలప్రయోగాన్ని మాత్రమే ఉపయోగించామని స్పష్టం చేశారు. నెట్టివేతలు, బారికేడ్ల పైనుంచి పడిపోవడం మరియు తొక్కిసలాట లాంటి పరిస్థితుల వల్లే నిరసనకారులకు గాయాలయ్యాయని, కావాలని ఎవరిపై దాడి చేయలేదని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్
-
నాలుగు రోజులకోసారి దావత్ ఇవ్వాల్సిందే..!
వరంగల్ క్రైం: హనుమకొండ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ పెత్తనం హద్దులు దాటిపోయింది. బీటెక్, ఎంబీఏలు చేసి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన యువ సిబ్బందిని నిత్యం మాటలతో నరకం చూపిస్తున్న ఆ ఏఎస్ఐ హంగామాను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో సిబ్బంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన సదరు అధికారి తాను చెప్పిందే వేదం, లేదంటే డ్యూటీలు మారుస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న సిబ్బందిని ఏంట్రా.. ఏందే అని పిలుస్తారని చెబుతున్నారు. మహిళా సిబ్బంది ‘ఇదేంటి సార్.. ఇలా మాట్లాడుతారు’ అని ప్రశ్నిస్తే.. ‘ఎంటి బిడ్డ.. నీ తండ్రిలాంటి వాడిని’ అని వెంటనే మాట మారుస్తారని అంటున్నారు. అధికారులకు కాసులు.. సిబ్బందికి చీవాట్లుఈ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఎంక్వయిరీ ఈయనకే రాస్తారు. ఫిర్యాదుదారులను నయానో భయానో బెదిరించి పెద్ద మొత్తంలో వసూలు చేసి అధికారులకు కాసులు కురిపిస్తాడని, అందుకే ఇతర అధికారులు ఎంత మంది ఉన్నా ఈయనకే పిటిషన్లు అప్పజెప్పుతారన్న ఆరోపణలున్నాయి. కొందరు కానిస్టేబుళ్లు ఆయనకు నాలుగు ఐదు రోజులకోసారి దావత్ ఇవ్వాలి.. లేదంటే మాటలయుద్ధం మొదలు పెడతాడని తెలుస్తోంది. ఇక.. స్టేషన్కు వచ్చే పిటిషన్లపై ఆరా తీస్తూ తనకు సంబంధం లేకున్నా అందరికి ఫోన్లు చేసి కలవాలని హుకుం జారీ చేస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదుదారులపై తన నోటి ప్రతాపం చూపిస్తాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కో సమయంలో ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడంటే ఫిర్యాదుదారులు రావటానికి జంకుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవైపు స్టేషన్, మరోవైపు తన పై అధికారుల పనులు చక్కబెట్టడంతో ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు తయారైంది. స్టేషన్ అధికారుల పేరు చెప్పి కేసులను తనకు అనుకూలంగా సెటిల్ చేయడంలో సిద్ధహస్తుడనే పేరుంది. నిత్యం తన నోటి దురుసుతో వ్యవహరిస్తున్న ఆ అధికారి పెత్తనానికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఆయనపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు, సిబ్బంది కోరుతున్నారు. -
మహిళపై దాడి చేసింది TDP నేత అని కేసు నమోదు చేయని పోలీసులు
-
అంతా నాటకం..ట్రైనీ IPS కేసుపై పోలీస్ సంచలన వ్యాఖ్యలు
-
ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
-
ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై లోక్సభలో తక్షణం సమగ్రచర్చ నిర్వహించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సోమవారం లోక్సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పోలీసులు అధికార దుర్వీనియోగానికి పాల్పడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు, లైంగికదాడులు, ఎస్సీలపై దాడులు, రాజకీయహింస, పౌరహక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని ఆ తీర్మానంలో తెలిపారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అత్యంత కీలక అంశంగా దీనిపై సభలో అత్యవసరచర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరిగిన పలు ఘటనలను గురుమూర్తి వాయిదా తీర్మానంలో ప్రస్తావించారు. కస్టడీలోనే చంపేస్తున్నారు విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్, నెల్లూరు జిల్లా మనుబోలులో పోలీస్ కస్టడీలో దళిత యువకుడు ఏడుకొండలు మృతి, కర్నూలు జిల్లా అదోనిలో మాల గంగమ్మ, విజయవాడలో క్రాంతికుమార్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎస్కే దరియా హుస్సేన్ మరణాలు వంటివి రాష్ట్రంలో పోలీసువ్యవస్థ పనితీరుపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. వారంతా కస్టడీలోనే చనిపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. అంటే 2024 జూన్ నుంచి 2025 మార్చి వరకు మహిళలపై నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలను కూడా ఆయన తీర్మానంలో పొందుపరిచారు. ఈ కాలంలో మొత్తం 319 ఘటనలు నమోదయ్యాయని, అందులో 126 అత్యాచారాలు, లైంగికదాడులు, 12 అత్యాచారయత్నాలు, 35 లైంగిక వేధింపులు, 97 భౌతికదాడులు, 34 హత్యలు లేదా అనుమానాస్పద మరణాలు ఉన్నాయని, వేధింపుల కారణంగా 15 ఆత్మహత్యలు లేదా ఆత్మహత్యాయత్నాల కేసులు ఉన్నాయని వివరించారు. ఎస్సీలపై 69 ఘటనలు అలాగే ఎస్సీలపై జరిగిన 69 ఘటనలను కూడా గురుమూర్తి ప్రస్తావించారు. హత్యలు, కస్టడీ హింస, పోలీసుల వేధింపులు, సామాజిక బహిష్కరణ, భూ ఆక్రమణలు, ఇళ్ల కూల్చివేత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు ఇందులో ఉన్నాయన్నారు. రాజకీయ హింసకు సంబంధించి 133 ఘటనలు నమోదయ్యాయని, వాటిలో 49 హత్యలు, 6 హత్యాయత్నాలు, 6 కిడ్నాప్లు, 58 భౌతిక దాడులు, 10 ఆస్తుల ధ్వంస ఘటనలు, రాజకీయ వేధింపుల కారణంగా జరిగినట్లు ఆరోపిస్తున్న నాలుగు ఆత్మహత్యలు ఉన్నాయని వివరించారు.రాష్ట్ర పోలీసుల పనితీరుపై హైకోర్టు 12 సందర్భాల్లో ప్రతికూల వ్యాఖ్యలు చేసిన విషయాన్ని, శాంతిభద్రతలకు సంబంధించి 79 ప్రధాన ఘటనలు జరిగిన విషయాన్ని కూడా ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడంతోపాటు పౌరుల రాజ్యాంగబద్ధ హక్కుల ఉల్లంఘనకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఈ అంశంపై లోక్సభలో సమగ్రచర్చ నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక కోరాలని, నమోదైన అన్ని ఘటనలపై కాలపరిమితితో కూడిన నిష్పక్షపాత విచారణ జరిపించాలని, ఎక్కడ ఉల్లంఘనలు నిర్ధారణ అయితే అక్కడ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గురుమూర్తి డిమాండ్ చేశారు. -
మీరు దొరికిపోయే టైం వచ్చేసింది... పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
కాక్రోచ్ నిరసనతో దద్దరిల్లిన ఢిల్లీ
-
Hyd: లైంగిక వేధింపులు.. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు
హైదరాబాద్: జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. లైంగికంగా వేధించాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపణలు చేశారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్. అసభ్యకర మెసేజ్లు పంపి బూతులు తిడుతున్నాడని ఆరోపించారు. గదిలోకి తీసుకెళ్లి మెడపై కత్తిపెట్టి బెదిరించాడని తెలిపారు. ప్రైవేట్ వీడియోలు తీసి తన భర్తకు పంపించాడని ఆరోపించారు. -
పెద్దపల్లి పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన కలెక్టర్
-
బాల్ కట్వా గ్యాంగ్ దాడులు.. పోలీసులకు సవాల్
పాట్నా: అందరూ ఇంట్లో ఉండగానే చొరబడతారు. చాకచక్యంగా మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తారు. దొరికిన డబ్బు, నగలు దోచుకుని పరారవుతారు. అయితే వెళ్తూ వెళ్తూ ఇంట్లోని మహిళల జుట్టును కత్తిరించి తీసుకెళ్తుండటమే ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. దొంగతనాల కేసులను ఛేదించడమే పోలీసులకు సవాలుగా ఉంటే, ఈ ‘జుట్టు కత్తిరించే’ గ్యాంగ్ మాత్రం వారికి కొత్త తలనొప్పిగా మారింది. బిహార్లో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.నిత్యం సోషల్ మీడియాలో ‘చడ్డీ గ్యాంగ్’, ‘షట్టర్ కట్వా గ్యాంగ్’ గురించి వింటుంటాం. ఇప్పుడు ‘బాల్ కట్వా గ్యాంగ్’ బిహార్ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వారం రోజుల వ్యవధిలో ఒకే గ్రామంలో రెండు చోట్ల ఒకే తరహాలో దోపిడీలు జరిగాయి. డబ్బు, నగలతో పాటు మహిళల జుట్టును కూడా కత్తిరించి తీసుకెళ్లడంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.దొంగలు ఎత్తుకెళ్లిన డబ్బు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వారు కత్తిరించి తీసుకెళ్లిన జుట్టును ఏం చేస్తున్నారనే ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. ఇదే స్థానికుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల బిహార్లోని దర్భంగా జిల్లా దర్హార్ గ్రామంలో రెండు వేర్వేరు ఇళ్లలో ఒకే తరహాలో దోపిడీలు జరిగాయి. జూలై 8న డాక్టర్ పవన్ కుమార్ మిశ్రా ఇంట్లోకి చొరబడ్డ ఐదుగురు అగంతకులు కుటుంబ సభ్యులను బంధించి, ఇంజెక్షన్ రూపంలో మత్తుమందు ఇచ్చారు. సుమారు 20 నిమిషాల్లో రూ.5 లక్షల విలువైన బంగారం, రూ.35 వేల నగదు దోచుకుని పరారయ్యారు. వెళ్లే ముందు పవన్ మేనకోడలు, 22 ఏళ్ల కరిష్మా దేవి జుట్టును కత్తిరించి తీసుకెళ్లారు.అదే గ్రామంలో ఉపాధ్యాయుడు సుమన్ కుమార్ ఇంట్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో దోపిడీ చేసిన దుండగులు అక్కడ నిద్రిస్తున్న బాలిక జుట్టును కూడా కత్తిరించి తీసుకెళ్లారు. వరుస దోపిడీలపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. బాధిత కుటుంబాలను విచారించి, ఘటనాస్థలాలను పరిశీలించాయి. రెండు చోట్ల జరిగిన దోపిడీల తీరు ఒకే విధంగా ఉందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.మరోవైపు, దుండగులు మహిళల జుట్టును ఎందుకు కత్తిరించి తీసుకెళ్తున్నారన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దోపిడీల కంటే ఈ అంశమే స్థానికులను ఎక్కువగా కలవరపెడుతోంది. రెండు ఘటనల వెనుక ఒకే ముఠా ఉందా? జుట్టును తీసుకెళ్లడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.దర్హార్ గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భయంతో చాలా మంది గ్రామస్తులు రాత్రిళ్లు ఇళ్లకు కాపలా కాస్తూ మేల్కొని ఉంటున్నారు. అయితే నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు. -
మహిళల భద్రతపైనా అదే హైడ్రామా
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మహిళల జోలికి వస్తే అదే చివరి రోజవుతుందని చెప్పే సీఎం చంద్రబాబు, మహిళల జోలికి రావాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలని పెద్ద పెద్ద మాటలు చెప్పే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మహిళల జోలికి వస్తే ఎంతటివారినైనా ఊరుకోమని చెప్పే హోంమంత్రి అనిత, మహిళా ఎమ్మెల్యేగా ఉన్న గళ్లా మాధవి... గుంటూరు నగరంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి, నీళ్ల కుళాయి విషయంలో తనకు రూ.10 వేల కప్పం కట్టలేదనే అక్కసుతో నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేసి తీవ్రంగా కొడుతూ హింసించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో వెలుగులోకి రావడంతోనే... తొలుత విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, మహిళను వివస్త్రను చేసి కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో రావడం, ‘సాక్షి’ బయటపెట్టడంతో రాజకీయ డ్రామాకు తెర తీశారు. ఓపక్క 15న ఘటన జరిగితే, 16వ తేదీన బాధితులు తనను కలిశారని చెబుతున్న వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి.. ఇంత అమానుష ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోలేదు. 17వ తేదీ రాత్రి వరకు ఎందుకు తాత్సారం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజీ ప్రయత్నాలు చేసిన టీడీపీ నేతలు అవి ఫలించకపోవడం, వీడియోలు బయటకు రావడంతో ఇక చేసేదిలేక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 15వ తేదీన సంఘటన జరిగితే, 18వ తేదీ వరకు హోంమంత్రి గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ ఈ విషయంపై స్పందించకపోవడం చూస్తుంటే వీరికి మహిళల భద్రత పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఇదేదో మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన కాదు. జిల్లా కేంద్రమైన గుంటూరు నడిబొడ్డున ఇంత దారుణం జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? కనీసం హోంమంత్రికి సమాచారం లేదా? ఉన్నా టీడీపీ నేతలు చేసిన దారుణంపై స్పందించేందుకు మనసు రాలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏం చేసినా మనవారైతే ఓకే.. చిన్న చిన్న సంఘటనలకే నిందితులను రోడ్లపై తిప్పడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించడం వంటివి చేసే పోలీసు యంత్రాంగం.. రేంజ్ ఐజీ, జిల్లా ఎస్పీ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న కృష్ణబాబు కాలనీలో ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా కొట్టిన ఘటనకు పాల్పడిన నిందితుల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళను అంత దారుణంగా హింసించిన నిందితులను కనీసం ప్రెస్మీట్లో కూడా చూపించకుండా, దొంగచాటుగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం చూస్తుంటే పక్షపాత వైఖరి తేలుతోంది. ఎంతటి నేరం చేసినా వారు అధికార పారీ్టకి చెందిన వారైతే చాలు పోలీసులు సైతం ప్రత్యేక ప్రేమ చూపుతున్నారనేది స్పష్టమవుతోంది.ఇంత ఆలస్యమా? సంఘటన జరిగి మూడు రోజులు దాటిన తర్వాత మహిళల పట్ల అపార ప్రేమ ఉన్నట్లు, వారి భద్రత విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నట్లు నటించడంలో అధికార పార్టీ నేతలు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి నుంచి సీఎం చంద్రబాబు వరకు మూడు రోజులపాటు నిద్ర నటించి, వీడియోలు బయటకు రాగానే ఉలిక్కిపడి నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. తామేదో ఈ సంఘటనపై సీరియస్గా ఉన్నట్లు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. ఇందులో భాగంగా ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కూడా అరెస్టు చేయని పోలీసులు... వీడియోలు బయటకు రాగానే ఏకంగా ఏకంగా జిల్లా ఎస్పీ శనివారం రాత్రి మహిళా కమిషన్ చైర్పర్సన్తో కలసి బాధితురాలి ఇంటికి వచ్చ మరీ విచారణ చేయడం గమనార్హం. వీడియోలు బయటకు వచ్చేంత వరకు కనీసం దారుణ ఘటనకు కారకుడైన టీడీపీ నేత, ఆయన బంధువులను అరెస్టు చేయకపోవడం చూస్తుంటే ఈ అమానవీయ ఘటనపై ఏ స్థాయిలో స్పందించారో అర్థమవుతోంది. చివరకు సీఐను వీఆర్కు పంపి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వస్తున్నాయి. -
ప్రభుత్వ లాంఛనాలు తీసుకోకపోతే ముద్రగడ ఫ్యామిలీపై కేసు పెడతారా..
-
ఏపీలో సంచలనం రేపుతున్న మరో లాకప్ డెత్..?
-
విదేశీ యువతికి చీర సింగారించిన కానిస్టేబుల్
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో గల తాజ్ మహల్ వద్ద ఒక మహిళా కానిస్టేబుల్ చూపిన మానవత్వం నెట్టింట వైరల్గా మారింది. అర్జెంటీనాకు చెందిన పర్యాటక బృందం మంగళవారం తాజ్ మహల్ను సందర్శించడానికి వచ్చింది. అందులోని ఒక పర్యాటకురాలు సాంప్రదాయ చీరకట్టుపై ఆసక్తితో నీలం రంగు చీరను ధరించారు. అయితే, చీరకట్టు సరిగ్గా రాకపోవడంతో ఆమె నడవడానికి ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన క్విక్ రెస్పాన్స్ టీమ్కు చెందిన కానిస్టేబుల్ గుడ్డి దేవి వెంటనే స్పందించారు.ఆమె ఆ విదేశీ యువతి వద్దకు వెళ్లి, ఆ చీరను చక్కగా సరిదిద్ది, కుచ్చెళ్లు ఎలా పెట్టుకోవాలో, పల్లును ఎలా సర్దుకోవాలో ఓపిగ్గా నేర్పించారు. దీనికి సదరు పర్యాటకురాలు సంతోషం వ్యక్తం చేస్తూ, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చీరకట్టు భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతమైన వస్త్రధారణ అని ఆమె కొనియాడారు. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు, ఇది ‘అతిథి దేవో భవ’ అనే భారతీయ సంస్కృతికి నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. పర్యాటకులకు సాయం చేసిన కానిస్టేబుల్ గుడ్డి దేవి, ఇతర సిబ్బందితో పర్యాటకులు ఫొటోలు దిగి తమ ఆనందాన్ని పంచుకున్నారు.ఇది కూడా చదవండి: ఒకేసారి 9 విమానాలకు అత్యవసర సంకేతాలు! -
రథయాత్రకు 300 రైళ్లు, 800 బస్సులు
పూరీ: ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గురువారం స్వామివారి రథాలు కదిలేందుకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం భారతీయ రైల్వే 300కి పైగా ప్రత్యేక రైళ్లను, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 800 బస్సులను అందుబాటులో ఉంచింది.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు, నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బందిని రంగంలోకి దింపారు. మొత్తం 13,000 మంది పోలీసు సిబ్బందితో పాటు 15 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు పహారా కాస్తున్నారు. తీరప్రాంతంలో 500 మంది లైఫ్ గార్డులను సిద్ధంగా ఉంచారు.షెడ్యూల్ ప్రకారం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించే ప్రక్రియ జరుగుతుంది. పూరీ గజపతి మహారాజు రథాలను శుద్ధి చేసిన అనంతరం, సాయంత్రం 4 గంటలకు భక్తులు రథాలను లాగడం ప్రారంభిస్తారు. జగన్నాథుని ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు సుమారు 2.6 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వేడుకలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.ఇది కూడా చదవండి: ఎర్రకోట నెల్లాళ్లు మూసివేత.. కారణం ఇదే! -
సీఐ వేధింపులతోనే చచ్చిపోతున్నా..
సాక్షి, నరసరావుపేట, పిడుగురాళ్ల: పోలీసుల వేధింపులు తాళలేక మైనార్టీ వర్గానికి చెందిన ఓ ఉద్యోగి పుట్టినరోజు నాడే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం ఉదయం పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. సివిల్ పంచాయితీలో తలదూర్చడమే కాకుండా తాను చెప్పినట్లు వినకుంటే గంజాయి కేసు నమోదు చేస్తానని పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు బెదిరించడంతో చనిపోతున్నానని, తన చావుకి పోలీసులే కారణమని సూసైడ్ లెటర్లో షేక్ దరియా హుస్సేన్ (49) పేర్కొన్నాడు. పట్టణంలోని బిలాల్ మసీద్ సమీపంలో దరియాహుస్సేన్ తన ఇంట్లో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడి భార్య షేక్ అమిరున్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... » సత్తెనపల్లిలోని ఉర్దూ అకాడమీలో లైబ్రేరియన్గా ఉద్యోగం చేస్తున్న దరియా హుస్సేన్ 2016లో తన భార్య షేక్ అమీరున్ పేరిట రెండు రేకుల ఇళ్లను కొనుగోలు చేశాడు. పులికూరి ప్రశాంత్ పేరిట ఉన్న ఆ ఇళ్లను అతడి తల్లి లక్ష్మి విక్రయించారు. అయితే ఆ ఇళ్లు 22 ఏ జాబితాలో ఉన్నందున రిజి్రస్టేషన్ కాలేదు. దీంతో స్వా«దీన అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఏడాది తర్వాత మరికొంత నగదు చెల్లించాలంటూ లక్ష్మి ఒత్తిడి చేసింది. దీంతో దరియా హుస్సేన్ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం తుది తీర్పు దశలో ఉంది. ఈ క్రమంలో పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు ఈ నెల 14వ తేదీన ఇళ్లు ఖాళీ చేయాలంటూ దరియా హుస్సేన్ను తీవ్ర స్థాయిలో బెదిరించారు. లేదంటే గంజాయి కేసు నమోదు చేసి కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులకు గురి చేస్తామని హెచ్చరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దరియా హుస్సేన్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని మృతి చెందాడు. ఎస్పీకి పీజీఆర్ఎస్లో అర్జీలు పెట్టుకున్నా సీఐ వేధింపులు ఆగలేదని మృతుడి కుటుంబీకులు వాపోయారు. మైనార్టీ ఉద్యోగి మరణానికి కారణమైన సీఐ వెంకట్రావుపై కేసు నమోదు చేయాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రానున్న జగనన్న ప్రభుత్వంలో సీఐ వెంకట్రావు తప్పులన్నింటికి చట్ట ప్రకారం శిక్షలు పడతాయని హెచ్చరించారు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. » మృతుడు తన సూసైడ్ నోట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్లను ప్రస్తావించాడు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు, పోలీసు సిబ్బంది తనను ఇబ్బంది పెట్టారని వెల్లడించాడు. సీఐ ఎస్.వెంకట్రావు తమ ఇంటికి తాళాలు వేయించినట్లు తెలిపాడు. రాజీకి టీడీపీ నేతల యత్నం.. తన మరణానికి పోలీసులే కారణమని మృతుడు దరియా హుస్సేన్ సూసైడ్ లేఖలో పేర్కొనడంతో రంగంలోకి దిగిన టీడీపీ నేతలు రాజీ యత్నాలు ప్రారంభించారు. సామాన్యులు కావటంతో సామదాన భేదదండోపాయాలను ప్రయోగించి కేసును పక్కతోవ పట్టించే కుట్రలకు తెర తీశారు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు సివిల్ పంచాయితీలలో తలదూర్చడంతో ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్యా యత్నాలకు ఒడిగట్టడం గమనార్హం.ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళతోపాటు ఓ దళిత యువకుడు వీరిలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు ఉన్నతాధికారులు సీఐ వెంకట్రావును వెనుకేసుకొస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. పోలీసుల వేధింపులతో మరణించిన షేర్ దరియా హుస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేయాలని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా డిమాండ్ చేశారు. -
ఖాకీలకు ‘దొంగ’ పాఠం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు దర్యాప్తులో కొత్త విషయం వెలుగుచూసింది. ఈ ఏడాది మే 3న జరిగిన దోపిడీలో సుబోధ్ సింగ్ ముఠా రూ.88లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఆభరణాలను ధర్మపురి మీదుగా ఛత్తీస్ఘడ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని అసాన్సోల్ నగల వ్యాపారికి విక్రయించినట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆరాతీయగా బంగారాన్ని బిహార్ సరిహద్దుల మీదుగా నేపాల్ తరలించారని తెలుసుకున్నారు. కాగా, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి చేసిన దోపిడీని ఛేదించిన సందర్భాన్ని డిపార్ట్మెంట్లో చేరనున్న ప్రతీ పోలీస్ తెలుసుకోవాలని హోంశాఖ నిర్ణయించింది. ఇటీవల ఎంపికైన డీఎస్పీలకు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఈనెల 18న కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పాఠంగా బోధించనున్నారు. ఘటనకు ముందు రెక్కీ, దోపిడీ చేసిన విధానం, ఆధారాలు లేకుండా పరారైన వైనం, ఒక్కొక్క పనికి ఒక్కో వరుసలో నేరస్తులను ఉపయోగించిన తీరు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా దొంగలు సంప్రదింపులు జరిపిన విధానం, బిహార్ జైలులో ఉండి ఈ మొత్తం దోపిడీకి స్కెచ్ వేసిన సుబోధ్సింగ్ను కరీంనగర్కు తరలించే వరకు జరిగిన ఘటనలను ఫొటోలు, వీడియోల రూపంలో గౌస్ ఆలం స్వయంగా వివరించనున్నారు. ఇకపై డిపార్ట్మెంట్లోకి కొత్తగా వచ్చే కానిస్టేబుల్ దగ్గర నుంచి డీఎస్పీల వరకు పీఎంజే దోపిడీ కేసును కేస్ స్టడీస్గా బోధించాలని పోలీస్శాఖ నిర్ణయించనుంది. -
పోలీసులే తన తమ్ముడిని చంపేశారని చెబుతున్న మృతుడు ఏడుకొండలు అక్క ధనమ్మ
-
బెంగళూరు తొక్కిసలాట కేసు: ఐపీఎస్ అధికారులకు క్లీన్ చిట్
బెంగళూరు: గత ఏడాది జూన్ నెలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాటి బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బీ దయానందతో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కొనసాగుతున్న శాఖాపరమైన విచారణను ప్రభుత్వం ముగిస్తూ, వారికి క్లీన్ చిట్ ఇచ్చింది.ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా జనం తీవ్రంగా గాయపడ్దారు. ఘటన జరిగిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించి, బాధ్యులని భావించిన కమిషనర్ బి. దయానంద, అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్ వికాస్, నాటి డీసీపీ (సెంట్రల్) శేఖర్ సహా పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే తాజాగా సంబంధిత అధికారులు సమర్పించిన వివరణలు, పరిపాలనా విభాగం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వారిపై విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం ఆర్సీబీ యాజమాన్యమే ప్రధాన బాధ్యత వహించాలని పేర్కొంది. అనుమతులు తీసుకోకుండానే కార్యక్రమం నిర్వహించడం, జనసమూహాన్ని అదుపు చేయడంలో విఫలమవ్వడం వంటి లోపాలను ప్రభుత్వం ఎత్తిచూపింది. ఈ దుర్ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది. -
బారికేడ్లు పెట్టి పోలీసులు ఓవర్ యాక్షన్ ఇచ్చిపడేసిన బొత్స
-
కర్నూలులో ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
ఆంధ్రప్రదేశ్: కర్నూల్ జిల్లాలో ఈరోజు ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలో లారీ ఢీకొనడంతో ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా ఫ్లైఓవర్పై ఏపీ స్పెషల్ బెటాలియన్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి వాకింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో వెనుకనుంచి వచ్చిన లారీ అతనిని బలంగా ఢీకొనడంతో ఫ్లైఓవర్ పై నుండి క్రిందపడి కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఏపీ స్పెషల్ బెటాలియన్లో పోలీస్గా విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. -
పోలీసుల అదుపులో హంతకుడు?
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ షాద్నగర్/ షాబాద్: తనపై పోక్సో కేసుకు కారణమయ్యారంటూ కక్ష పెంచుకొని ఆరుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చిన కిల్లర్ రాజ్కుమార్ పోలీసులకు చిక్కినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం ఉదయం కొత్తూరు మండలం కుమ్మరిగూడ వద్ద ఎస్ఓటీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 24 గంటలపాటు సమీప అటవీ ప్రాంతంలో దాక్కున్న రాజ్కుమార్ ఆదివారం ఉదయం టిఫిన్ కోసం రోడ్డుపైకి రాగా ఓ ఎస్ఓటీ కానిస్టేబుల్ వెనుక నుంచి పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు కొత్తూరు మండలం కుమ్మరిగూడకు చెందిన సుధాకర్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి అతను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిందితుడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్లు తెలియవచ్చింది. కానీ ఈ విషయాన్ని ఫ్యూచర్సిటీ పోలీసులు ధ్రువీకరించడం లేదు. నిందితుడు చేగూరు రైల్వేట్రాక్ దాటి అడవిలోకి వెళ్లాడని.. 9 బృందాలతో అతడి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఆరుగురిని హత్య చేసిన తర్వాత రాజ్కుమార్ షాబాద్కు కారులో వెళ్లి అక్కడ కారును వదిలేసి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో రైలెక్కి పరారయ్యాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. రాజ్కుమార్ వాడిన ఫోన్ నంబర్లలో ఒకటి బిహార్లో లొకేషన్ చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని బట్టి రాజ్కుమార్ రైల్లో బిహార్కు వెళ్లి ఉండొచ్చని అనుమానంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే నిందితుడు ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన నేపథ్యంలో షాబాద్, కొత్తూరు, శంషాబాద్, పాల్మాకుల పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటల వద్ద గాలించినట్లు తెలిసింది. మరోవైపు నిందితుడి తల్లిదండ్రులు సహా నిందితుడి ఫోన్కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు.. అతనికి సహకరించిన కొందరు సన్నిహితులను శనివారం విచారించారు. రాజ్కుమార్ జాడ కోసం షాద్నగర్, షాబాద్, నందిగామ, కొత్తూరు, శంషాబాద్ పరిసరాలను జల్లెడపట్టారు. మా అదుపులో లేడు: డీసీపీ యోగేష్ గౌతం రాజ్కుమార్ తమ అదుపులో ఉన్నాడనేది వదంతి మాత్రమేనని... అందులో వాస్తవం లేదని ఫ్యూచర్ సిటీ (చేవెళ్ల జోన్) డీసీపీ యోగేష్ గౌతం స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యాపించే వదంతులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ‘శుక్రవారం రాత్రి 11:47 గంటలకు దైవాలగూడలోనే నిందితుడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఆ తర్వాత కారు చేగూరు సమీపంలో వదిలి, రైల్వేట్రాక్ దాటి రాజ్కుమార్ అడవిలోకి వెళ్లినట్లు సమాచారం ఉంది. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నాం. ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇచ్చి సహకరించాలి’అని డీసీపీ కోరారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రేమ పేరుతో బాలికను వేధించి చివరకు ఆ కుటుంబాన్ని హతమార్చిన నిందితుడు రాజ్కుమార్ను పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కళ్లముందే చెల్లి, తల్లి, నానమ్మను పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిన దివ్యాంగురాలు మేఘనను ఆదివారం ఆయన పరామర్శించారు. రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. బాధితులకు రక్షణ కల్పించడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. ఆరు హత్యలు.. ఏడురాళ్లు నిందితుడు రాజ్కుమార్.. దైవాలగూడలో బాలికను హత్య చేసిన చోట ఏడు రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ప్రచారం జరుగుతోంది. భార్య, ఇద్దరు పిల్లలు సహా బాలిక, ఆమె తల్లి, నానమ్మతోపాటు ఏడాది క్రితం మరణించిన బాలిక తండ్రిని కూడా తానే అంతమొందించినట్లు సంకేతం ఇచ్చేందుకే ఏడు రాళ్లను పేర్చి ఉంటాడన్న వాదన వినిపిస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెయిల్ డీల్ రూ. 25 లక్షలు? పోక్సో కేసు నిందితుడు రాజ్కుమార్కు ముందస్తు బెయిల్ లభించేలా పోలీసులు, అధికార పార్టీ నేతలు సహకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసం వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సహా చేవెళ్లకు చెందిన మరో అధికార పార్టీ నేత పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా నిందితుడు రాజ్కుమార్ సదరు పోలీసులకు రూ. 25 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ లభించాక రాజ్కుమార్ పోలీసు స్టేషన్ సిబ్బందితో కలిసి మద్యం సేవించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వ్యవహారంపై ఎస్ఐ రమేష్పై సస్పెన్షన్ వేటు వేసిన సీపీ..సీఐ కాంతారెడ్డికి నోటీ సులు జారీ చేశారు. మరికొందరు పోలీసు సిబ్బందిపైనా చర్యలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
పోలీసుల అదుపులో షాబాద్ ఘటన నిందితుడు?
సాక్షి, హైదరాబాద్: షాబాద్ హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులో తీసుకున్నట్లు సమాచారం. చేగూరు నుంచి లిఫ్ట్ అడిగి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళిన రాజ్ కుమార్.. పోలీస్ కానిస్టేబుల్తో టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని అడిగినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్పై కానిస్టేబుల్కు అనుమానం రాగానే పారిపోయేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసులు వెంబడించి పట్టుకున్నట్లు సమాచారం.అయితే, రాజ్కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంపై చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం మాట్లాడుతూ.. ఆరుగురు హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశామని.. నిందితుడు కోసం మొత్తం తొమ్మిది బృందాలతో గాలిస్తున్నామన్నారు. చేగూరు రైల్వే ట్రాక్ దాటి అడవి ప్రాంతంలో రాజ్ కుమార్ వెళ్లినట్లు సమాచారం. రాజ్ కుమార్ తన మొబైల్ ఫోన్ శుక్రవారం రాత్రి 11:47 స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని రాజ్ కుమార్ కోసం రైల్వే పోలీస్, ట్రాకింగ్, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.పోక్సో కేసులో నిందితుడైన రాజ్కుమార్ వరుసబెట్టి ఆరుగుర్ని అతి కిరాతకంగా హత్య చేశాడు. తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మను మట్టుబెట్టిన ఈ రాక్షసుడు, వారికి మద్దతుగా నిలిచిందనే కోపంతో కట్టుకున్న భార్యను, అభం శుభం తెలియని ఇద్దరు కొడుకుల్నీ కడతేర్చాడు. శుక్రవారం అర్ధరాత్రి ఈ హత్యాకాండ చోటు చేసుకోగా, శనివారం ఉదయం ఈ ఘోరం సంచలనం సృష్టించింది. -
Shabad POCSO Case: 6 గురి హత్య వెనుక పోలీసుల హస్తం..!
-
రాత్రివేళ రెచ్చిపోయిన పందుల దొంగలు..!
మద్దూర్(కోస్గి): సినిమా స్టోరీని తలపించేలా నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో పందుల దొంగలు హల్చల్ చేశారు. పందులను దొంగలించి వాహనంలో పారిపోతుండగా అడ్డుకున్న పోలీసులపై దాడికి ప్రయతి్నంచారు. ఓ హోంగార్డు తలపై బీరు బాటిల్తో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గురువారం అర్ధరాత్రి ఓ బొలేరో వాహనంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పందులను దొంగిలించి కోస్గి రోడ్ల గుండా వెళ్లేందుకు ప్రయతి్నంచారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో దొంగల వాహనం దారి తప్పింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి దగ్గర నూతన భవనానికి రంగులు వేస్తున్న కూలీలను దారి విషయమై దొంగలు వాకాబు చేశారు. అర్ధరాత్రి ఎక్కడ నుంచి వస్తున్నారు..మీరు ఎక్కడకు వెళ్లాలి అని పెయింటర్లు నిలదీయడంతో మారణాయుధాలు చూపించి పరారయ్యారు. ఈ విషయం పెట్రోలింగ్లో ఉన్న పోలీసులకు యువకులు సమాచారం ఇచ్చారు. విధుల్లో ఉన్న ఏఎస్సై, మరో ముగ్గురు సిబ్బందితో, ఇద్దరు పెట్రోలింగ్ బైక్పై పట్టణంలో గాలించారు. దొంగల వాహనం బస్టాండ్ ముందుకు రావడంతో పోలీసులు వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. వాహనంలోని ఓ వ్యక్తి బీరు సీసాతో బైక్పై ఉన్న హోంగార్డు సురేందర్ తలపై బలంగా కొట్టి పారిపాయాడు. తీవ్ర రక్తస్రావమైన సురేందర్ను స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా తలకు కుట్లు వేశారు. ఈ విషయమై జిల్లా పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఉదయం వరకు వాహనాలు తనిఖీ చేసినా దొంగల వాహనం దొరకలేదు. -
Alగా అంబటి రాంబాబు అని పెట్టండి ఏపీ పోలీస్ తీరుకు స్ట్రాంగ్ కౌంటర్
-
అక్రమ కేసులకు భయపడేది లేదు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు ఎట్టపరిస్థితుల్లో భయపడేది లేదని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు (గురువారం) గుంటూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు అమరావతి రైతులను పరామర్శించడానికి వెళితే టీడీపీ నాయకులు తమపై దాడి చేశారని దానిపై పోలీసుల వద్దకు వెళితే కనీసం తమ ఫిర్యాదులను కూడా తీసుకోవడం లేదన్నారు.టీడీపీ నేతలే తమపై దాడిచేసి తిరిగి వారే వైఎస్సార్సీపీ నాయకులపై కేసు పెట్టారన్నారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మెుండితోక అశోక్ ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కానిస్టేబుల్పై దాడి చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదని అతనిపై దాడి చేసింది ఎవరో అందరికీ తెలుసన్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకం పెరిగి పోయిందని పోలీస్ స్టేషన్లలోనే హత్యలు చేస్తున్నారని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని తెలిపారు. -
ప్రదాన నిందితుని ఎన్కౌంటర్
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో నాలుగోతేదీన స్నేహితురాలికి పుట్టినరోజు బహుమతి కొనేందుకు బయటకు వెళ్లి అదృశ్యమై సరస్సులో శవమై తేలిక 11 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్యోదంతంలో బుధవారం ప్రధాన నిందితుడు ప్రభాస్ మొండల్ను పశ్చిమబెంగాల్ పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ను ఇటీవల ఎన్నికల్లో ఓడించి అధికారంలోకి వచ్చిన సువేంధు అధికారి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇది తొలి పోలీస్ చర్యగా నిలిచిపోయింది. ఎన్కౌంటర్ వివరాలను సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు. హత్యాచార ఘటన పూర్వాపరాలను తెల్సుకునేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సుర్జాపూర్ హాట్లోని ఘటనాస్థలికి మంగళవారం అర్ధరాత్రిదాటాక 12.45 నిమిషాలకు నిందితుడిని పోలీసులు తీసుకెళ్లారు. అదే సమయంలో పోలీసుల నుంచి సరీ్వస్ తుపాకీని తీసుకుని మొండల్ పోలీసులపైకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు వెంటనే ఎదురుకాల్పులు జరిపారు. దీంతో బుల్లెట్ గాయాలతో రక్తమోడుతున్న నిందితుడిని హుటాహుటిన సమీప బారుయ్పూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు ధ్రువీకరించారు. బాలికను చంపేసి గోనెసంచిలో కుక్కి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడే కొలనులో పడేశారన్న వార్త తెలిసి నాలుగురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ప్రజాగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. మేజి్రస్టియల్ విచారణ తర్వాత ప్రధాన నిందితుడు మొండల్ మృతదేహానికి పోస్ట్మార్టమ్ నిర్వహించనున్నారు. మరోవైపు ఇదే ఉదంతంలో కబీర్ మొల్లా అనే మరో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్చేశారు. ఆనంద్ సర్దార్, దివాకర్ సర్దార్లను గతంలోనే అరెస్ట్చేశారు. గతంలోనే ప్రభాస్ మొండల్నూ అరెస్ట్చేయగా ఈ కేసులో మొత్తంగా అరెస్టుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ముగ్గురు నిందితులు ఉన్నారు. హత్యోదంతం వెలుగుచూసిన కొన్ని గంటలకే ఈ ఘటనలో సంబంధం ఉందనే అనుమానంతో ఒకతడిని స్థానికులు కొట్టి చంపిన విషయం తెల్సిందే. వాడి శవం నాకు అక్కర్లేదు: తల్లి పోలీసు ఎన్కౌంటర్లో నీ కుమారుడు చనిపోయాడని తల్లి సంధ్యా మొండల్కు అధికారులు సమాచారం ఇవ్వగానే ఆమె ఆగ్రహంగా స్పందించారు. ‘‘చెడు అలవాట్లకు బానిసైన వాడు నా కొడుకే కాదు. వాడి మృతదేహాన్ని నేను తీసుకోను. తాగుడు మానేయమని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినిపించుకోలేదు. వాడు చనిపోయినా నాకు ఏమాత్రం బాధ లేదు. బాలికను దారుణంగా హింసించినందుకు వాడికి తగిన శాస్తి జరిగింది. మార్చురీలో వాడి ముఖం చూసేందుకు కూడా నేను వెళ్లను. నేనే కాదు మా కుటుంబంలో ఎవరూ వాడి మృతదేహాన్ని తెచ్చుకోము’’అని తల్లి తెగేసి చెప్పారు. నేనూ బాధితురాలినే: మొండల్ భార్య భర్త మృతిచెందాక ప్రధాన నిందితుని భార్య చంపా స్పందించారు. ‘‘నా భర్త అమాయకుడు, ఈ నేరం చేయలేదు అని నేను చెప్పను. తనతో జీవిస్తూ ఎన్నో బాధలు పడ్డా. హత్యోదంతంలో ఇతని పేరు విన్పించగానే ఇలాంటిదేమో చేసే ఉంటాడని ముందుగానే ఊహించా. పెళ్లయిన నాటి నుంచి వేధింపులకు గురిచేశాడు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. ఏ పనీ చేసేవాడు కాదు’’అని ఆమె తెలిపారు. ఎన్కౌంటర్పై భిన్నాభిప్రాయాలు ప్రధాన నిందితుడు ఎన్కౌంటర్లో హతమవడంతో ఈ ఘటనకు సరైన న్యాయం జరిగిందని బీజేపీ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో 2013లో కామ్ధునీలో 20 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసునూ తిరిగితోడి నిందితులకు ‘సరైన’శిక్ష పడేలా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి దేవ్జీత్ సర్కార్ అన్నారు. అయితే ఎన్కౌంటర్లో నిందితుడిని హతమార్చడాన్ని టీఎంసీ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘సువేందు సర్కార్కు రాష్ట్ర పోలీసులపై నియంత్రణ ఉందా? రాష్ట్రంలో బెంగాల్–ఉత్తరప్రదేశ్ 2.0ను విధానం అమలుచేద్దామని చూస్తున్నారా? బెంగాల్లో బీజేపీ పాలన ఉందా? ఎన్కౌంటర్లో చంపేయడం అంటే ఆటవికంగా పాలించడమే’’అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ర్యాలీలో బాహాబాహీ.. బాలిక హత్యోదంతాన్ని నిరసిస్తూ బుధవారం కోల్కతాలోని హజ్రా రోడ్లో టీఎంసీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన నిరసన ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్నారు. దొంగలు అని నినదిస్తూ అవాంతరాలు సృష్టించారు. మానవహారంగా నిలబడి ర్యాలీని అడ్డుకోవడంతో ఆగ్రహంతో టీఎంసీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇదికాస్త తోపులాటగా మారింది. కార్యకర్తలు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపుతప్పకుండా నిలువరించారు. -
జగన్ దెబ్బకు పోలీసుల్లో కదలిక.. క్రాంతి కుమార్ కేసులో కొత్త మలుపు!
-
ఏవండో కానిస్టేబుల్ కొడుకు గారు.. గొంతు చించుకుని అరిచావ్ ఇప్పుడు మాట్లాడవే..
-
ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్తో సరిపోదు!
ఒంటిపై పోలీస్డ్రెస్.. మనసు వెన్న. ఎదుటి వారికి చిన్నపాటి సమస్య వచ్చిన వెన్నెలా కరిగిపోతారు. వారి కష్టాలను దూరం చేసేందుకు తమకు చేతనైనంత సహాయం చేస్తుంటారు. ఒకరేమో జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఎస్బీ ఏఎస్సై రాజేశుని శ్రీనివాస్, మరొకరు పెద్దపల్లి జిల్లాలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న భీమనపల్లి పృథ్వీరాజ్. వృత్తిరీత్య పోలీస్ ఉద్యోగం చేస్తున్నా సేవే ప్రవృత్తిగా ముందుకెళ్తున్నారు.కష్టాల వింటే కరిగిపోతారు..జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్బీ ఏఎస్సైగా పనిచేస్తున్న రాజేశుని శ్రీనివాస్ సామాజిక సేవలో ముందుంటున్నారు. 1989లో కానిస్టేబుల్గా విధుల్లో చేరిన శ్రీనివాస్ 2012లో హెడ్కానిస్టేబుల్గా 2019లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. జగిత్యాల వాసవి వివాహ వేదిక పేరుతో ఉచిత వివాహ పరిచయ వేదిక ద్వారా ఇప్పటి వరకు 415కు పైగా వివాహాలు చేశారు. జాబితాపూర్లో వాసవి వృద్ధాశ్రమం నిర్మాణానికి సొంతంగా 25 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ఇక్కడ వృద్ధాశ్రమం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు.వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్థిక సహాయంరాజేశుని శ్రీనివాస్ వాట్సాప్ గ్రూపు ద్వారా 56 మంది ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్య కుటుంబాలకు రూ.35,54,945 విలువ గల సహాయం అందించారు. అలాగే సేవాదళ్ వాట్సాప్ గ్రూపు ద్వారా అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రూ.7.60 లక్షల ఆర్థిక సహాయం అందించారు. నిరుపేదలైన 198 మంది వధువులకు పుస్తెమెట్టెలు, వివాహ సామగ్రి అందించారు. -
రిలీజ్ మళ్లీ అరెస్ట్.. గన్నవరం పోలీస్ స్టేషన్ లో రావణ్
-
డిప్యూటీ సీఎం కాన్వాయ్ను రూట్ మళ్లించిన పోలీసులు
సూర్యాపేట జిల్లా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోదాడ రూరల్ పోలీసులు షెడ్యూల్లో ఉన్న మార్గంలో కాకుండా మరో మార్గంలో తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. భట్టి విక్రమార్క బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో హైదరాబాద్ నుంచి మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో పార్టీ నాయకుడిని పరామర్శించేందుకు వెళుతున్న క్రమంలో అధికారులు కోదాడ మీదుగా వెళ్లేందుకు షెడ్యూల్ ఇచ్చారు. దీని ప్రకారం.. కోదాడ మీదుగా రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్రోడ్ నుంచి ఏపీలోని చైర్మహ్మద్పేట నుంచి వల్లభి వెళ్లాల్సి ఉంది.అయితే పోలీసులు కోదాడ శివారులోని దుర్గాపురం క్రాస్రోడ్ జంక్షన్ నుంచి ఖమ్మం వైపునకు కాన్వాయ్ను మళ్లించారు. అక్కడి నుంచి బొజ్జగూడెం స్టేజీ వద్దకు వెళ్లిన తర్వాత.. రూట్ ఇది కాదంటూ పోలీసులు మళ్లీ కాన్వాయ్ను వెనక్కి తిప్పి సరీ్వస్ రోడ్ మీదుగా బండపాలెం రోడ్ వద్దకు వెళ్లాక ఆ మార్గంలో వాగు ఉంది. దీంతోబండపాలెం మీదుగా చిమిర్యాల క్రాస్రోడ్ నుంచి రామాపురం క్రాస్రోడ్ దాటించొచ్చని ముందుకెళ్లారు. బండపాలెం నుంచి ముందుకు రోడ్ మార్గం లేకపోవడంతో భట్టివిక్రమార్క కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డిని పిలిచి ఎక్కడకు తీసుకెళ్తున్నావని మందలించారు. దీంతో అక్కడి నుంచి కాన్వాయ్ వెనక్కి మళ్లి కోదాడ–ఖమ్మం హైవే మీదుగా ముందుగా నిర్ణయించిన రూట్లోనే వల్లభికి వెళ్లారు. అయితే కోదాడ పోలీసుల తీరుపై భట్టివిక్రమార్క డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ విచారణ చేపట్టారు. కోదాడ రూరల్ ఎస్ఐని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసినట్టు శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రచారం సాగింది. ఈ ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ విచారణ చేశామని, శుక్రవారం ఉదయం కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డిని తన కార్యాలయానికి పిలిపించి మందలించి పంపించానని చెప్పారు. -
పోలీస్ వ్యాన్ తాళం చెవి చోరీ
హైదరాబాద్: పోలీస్ వాహనం తాళం చెవిని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్ వద్ద గురువారం మధ్యాహ్నం మాజీ మంత్రి హరీ‹Ùరావుతో పాటు మరి కొంతమందిని ముందస్తు అరెస్ట్ చేశారు. వీరందరినీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించేందుకు తెలంగాణ భవన్ వద్ద ఓ పోలీస్ వాహనాన్ని సిద్ధంగా ఉంచి హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలను ఎక్కించారు. అప్పటికే హరీష్ రావును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వందలాదిగా తరలి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ వాహనానికి అడ్డుపడ్డారు. వ్యాన్ను స్టార్ చేయడానికి హోంగార్డు రవీందర్ నాయక్ ప్రయత్నించగా తాళం చెవి కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం చెవి దొంగిలించి హరీష్రావు వెళ్లే వాహనాన్ని అడ్డుకున్నారు. అరగంటపాటు తాళం చెవి దొరకకపోవడంతో పోలీసులు తీవ్ర ఆందోళన చెందారు. అటు నుంచి వెళ్తున్న ఓ ఆటో తాళం చెవి తీసుకొని పోలీస్ వాహనాన్ని ఆన్ చేయగా వెంటనే స్టార్ట్కావడంతో ఎట్టకేలకు వ్యాన్ కదిలింది. రవీంద్రనాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ పోలీసు శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ప్రభు త్వం ఆమోదం తెలిపింది. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 5 వేల పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయిస్తూ జీఓ ఎంఎస్ నం. 78 జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియా మక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా నియామక ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పటా్నయక్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ప్రభుత్వం పోలీసు శాఖలో ఉన్న ఖాళీలు, శాఖ అవసరాలు, ఆర్థిక భారం తదితర అంశాలను సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నియామకాలకు అవసరమైన స్థానిక కేడర్ వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు తదితర వివరాలను పోలీసు నియామక మండలికి వెంటనే అందజేయాలని హోం శాఖ, డీజీపీ కార్యాలయాన్ని ఆదేశించింది. అలాగే నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని పోలీసు నియామక మండలికి సూచించింది. -
లాకప్ డెత్ కేసులో కోర్టు సంచలన తీర్పు
ముంబై: సుదీర్ఘ కాలం పాటు సాగిన ఒక కస్టోడియల్ డెత్ కేసులో మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా, సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 15 ఏళ్ల క్రితం 23 ఏళ్ల యువకుడి లాకప్ డెత్కు కారణమైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా తొమ్మిది మంది పోలీసులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.2011, మే 10వ తేదీ అర్ధరాత్రి మూడు గంటల ప్రాంతంలో పార్ధి సామాజిక వర్గానికి చెందిన బేగ్యా పవార్ (23) అనే యువకుడిని విచారణ నిమిత్తం పోలీసులు వారి అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పవార్ పోలీస్ కస్టడీలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.పోలీస్ స్టేషన్లో పవార్ను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్య పరీక్షలలో కూడా పవార్ శరీరంపై అనేక చోట్ల ఎముకలు విరిగినట్లు తేలడంతో, కస్టడీలో జరిగిన హింస నిజమేనని స్పష్టమైంది. ఘటన జరిగిన అనంతరం పవార్ తల్లిదండ్రులు అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్పైనే ఆరోపణలు ఉండటంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారు.దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, పార్ధి సామాజిక వర్గ ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసి నిస్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.బాధితుల ఆందోళనల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును రాష్ట్ర సీఐడీకి అప్పగించింది. సీఐడీ దర్యాప్తు అధికారి లోతుగా విచారణ జరిపి, కస్టడీలో యువకుడిని తీవ్రంగా కొట్టడం వల్లే మరణించాడని నిర్ధారిస్తూ కోర్టులో నివేదిక (చార్జ్షీట్) దాఖలు చేశారు.గత 15 ఏళ్లుగా సాగిన ఈ కేసు విచారణ చివరకు ముగిసింది. నాటి రిసోడ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మహాదేవ్ మాణిక్ ధాండేతో పాటు మరో ఎనిమిది మంది పోలీసులను కోర్టు దోషులుగా తేల్చింది. నిందితుల్లో ఇన్ఛార్జ్ ధాండేతో సహా ఇద్దరు పోలీసులు ఇప్పటికే సర్వీస్ నుండి రిటైర్ అయ్యారు. కాగా, కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే దోషులైన తొమ్మిది మందిని వాషిమ్ జైలుకు తరలించారు. అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత వారిని అమరావతి జైలుకు తరలించనున్నారు.కోర్టు తీర్పుపై పవార్ వృద్ధ తల్లిదండ్రులు స్పందిస్తూ..15 ఏళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగింది అని ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాటి ఘటనను గుర్తుచేసుకుంటూ.. తన కొడుకు ఎలాంటి నేరం చేయలేదని, కేవలం ప్రశ్నించడానికే తీసుకెళ్లి చంపేశారని పవార్ తల్లి కన్నీరు మున్నీరైంది. నిందితులకు శిక్ష పడేలా శ్రమించిన కోర్టుకు, ప్రాసిక్యూషన్కు, సీఐడీ దర్యాప్తు బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
డెలివరీ బాయ్ ప్రాణం తీసిన పోలీస్ వాహనం ఎలా అంటే
-
బాబు సభలో హైడ్రామా.. ఈడ్చేసిన పోలీసులు
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. మరో ఇద్దరికి రిమాండ్
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కానిస్టేబుళ్లు సాంబయ్య, బాబురావులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గన్నవరం జైలుకు సాంబయ్య, ఆవనిగడ్డ జైలుకు బాబురావును తరలించారు.కాగా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి.సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆధారాలు మాయం చేయడంలో వీరిద్దరు కీలకంగా వ్యవహారించారని తేలింది. కృష్ణలంక పీఎస్ సీసీటీవీ హర్డ్ డిస్క్ను మార్చేసినట్లు అధికారులు గుర్తించారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కృష్ణలంక పీఎస్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు బాబురావు, సాంబశివరావులను సిట్ అధికారులు నిందితులుగా చేర్చి విచారించగా ఆధారాలు మాయం చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారని తేలింది. దీంతో వీరిని కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు పోతర్లంక అశోక్ కుమార్ ఏ2,జంగం నాని ఏ3లకు ఇదివరకే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.కాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదెకృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. నెలరొజుల కిందట అమెరికా వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చిన స్థానిక ఆర్ఎంపీని నిన్న (మంగళవారం) సిట్ విచారించింది.హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలు పిలిస్తేనే అక్కడికి వెళ్లి వైద్యం చేశానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కాగా వైద్యం చేసే సమయంలో సాయికృష్ణ శరీరంపై ఎక్కడెక్కడ గాయాలున్నాయని ఆరాతీసి ఆయన స్టేట్మెంట్ను నమోదు చేశారు. ఆర్ఎంపీ విచారణలో మరిన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. -
ప్రత్యేక పోలీస్ బలగాలు రాష్ట్ర భద్రతకు బలమైన కవచం: డీజీపీ సి.వి. ఆనంద్
హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిర్వహణ, విపత్తు నిర్వహణ, వీఐపీ బందోబస్తు, ప్రత్యేక ఆపరేషన్లలో కీలక భూమిక పోషిస్తున్న తెలంగాణ స్పెషల్ బెటాలియన్లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరింత ఆధునికంగా, సాంకేతికంగా బలోపేతం చేయాలని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ అధికారులకు సూచించారు. జూబ్లీహిల్స్లోని తెలంగాణ స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని వివిధ పరిపాలనా, సాంకేతిక, సంక్షేమ అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.సమావేశానికి ముందు డీజీపీ ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలు, పరిపాలనా సెక్షన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఆయుధాల నిర్వహణ, సాంకేతిక విభాగాలు, నిర్మాణ పనులు, కార్యాలయ నిర్వహణ, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం అధికారులు సమర్పించిన ప్రజెంటేషన్ను పరిశీలించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.బెటాలియన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడం, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, వాహనాల సంఖ్యను పెంచడం, సిబ్బందికి మెరుగైన నివాస క్వార్టర్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (APSP) బెటాలియన్లు నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో సివిల్ పోలీసులకు వెన్నుదన్నుగా నిలిచి ఎన్నో కీలక ఆపరేషన్లలో విశేష సేవలు అందించాయని గుర్తు చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి పోలీస్ స్టేషన్కు ప్రత్యేక బలగాలను అనుసంధానం చేయడం ద్వారా పోలీసు వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసిందన్నారు.తాను నిజామాబాద్, వరంగల్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లాల ఎస్పీగా పనిచేసిన సమయంలో ప్రత్యేక బలగాల సేవలను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్లపై తరచూ నక్సల్స్ దాడులు జరిగేవని, అలాంటి పరిస్థితుల్లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు అత్యంత ధైర్యసాహసాలతో విధులు నిర్వహించి నక్సల్స్ నిర్మూలనలో కీలక పాత్ర పోషించాయని ప్రశంసించారు.రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం 13 స్పెషల్ బెటాలియన్లను ఏర్పాటు చేసి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాటిని అభివృద్ధి చేసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ బెటాలియన్లు ఎన్నికల సమయంలో భారీ బందోబస్తు, శాంతిభద్రతల నిర్వహణ, ముఖ్యమైన ఉత్సవాలు, మతపరమైన వేడుకలు, ప్రజాసమావేశాలు, వీఐపీ భద్రత, విపత్తు నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల రక్షణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాయని కొనియాడారు.ఇటీవల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల సమయంలో తెలంగాణ స్పెషల్ బెటాలియన్ సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యల్లో పాల్గొనడం, ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో అంకితభావంతో పనిచేశారని అభినందించారు.బెటాలియన్ల కమాండెంట్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, పరిపాలనలో క్రమశిక్షణతో పాటు మానవతా దృక్పథం కూడా ఉండాలని సూచించారు. సిబ్బంది కుటుంబ పరిస్థితులు, ఆరోగ్యం, పిల్లల విద్య, వ్యక్తిగత సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలవాలని చెప్పారు.దూర ప్రాంతాల్లో నెలల తరబడి విధులు నిర్వహించే సిబ్బందికి కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో అధికారులు వారికి అవసరమైన మానసిక బలం అందించాలని సూచించారు.విధుల్లో పారదర్శకతడ్యూటీల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించాలని, ఎలాంటి వివక్షకు తావివ్వకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు, ప్రత్యేక బందోబస్తు, వీఐపీ విధులు, ఇతర ప్రత్యేక డ్యూటీలను కూడా నిష్పాక్షికంగా కేటాయించాలని ఆదేశించారు.గతంలో 18 నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉండేవి. ఇప్పుడూ ఆ సమస్య తీరిందన్నారు. ప్రతి బెటాలియన్ పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, సమగ్ర రివ్యూ నిర్వహించాలని సూచించారు. భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీ, ఆమనగల్ ప్రాంతాల్లో కొత్త స్పెషల్ బెటాలియన్ల ఏర్పాటు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.మిత్ర కౌన్సెలింగ్ కేంద్రాలుపోలీసు సిబ్బందిలో మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ, "మిత్ర" కౌన్సెలింగ్ కేంద్రాలను మరింత సమర్థంగా వినియోగించాలని సూచించారు. విధుల ఒత్తిడి, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులతో బాధపడుతున్న సిబ్బందిని గుర్తించి వారికి నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని ఆదేశించారు.డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, ఇతర వ్యసనాల బారిన పోలీసు సిబ్బంది ఎవరూ పడకుండా అధికారులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాంటి అలవాట్లకు గురైన వారిని శిక్షించడం కంటే ముందుగా గుర్తించి, కౌన్సెలింగ్, వైద్య సహాయం ద్వారా తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు.పోలీసు సిబ్బందిలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను అధికారులు, సహచరులు ముందుగానే గుర్తించి తక్షణమే స్పందించాలని సూచించారు. ప్రతి కమాండెంట్ తన పరిధిలోని సిబ్బందితో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పారు.శిక్షణకు ఎల్లప్పుడూ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆధునిక పోలీసింగ్కు అనుగుణంగా ప్రత్యేక శిక్షణా కేంద్రాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ వినియోగం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం, మానసిక దృఢత్వంపై నిరంతర శిక్షణ అందించాలని సూచించారు.తెలంగాణ స్పెషల్ బెటాలియన్లు రాష్ట్ర పోలీసు వ్యవస్థకు వెన్నెముక వంటివని పేర్కొన్న డీజీపీ, భవిష్యత్తు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా ఆధునికీకరణ, క్రమశిక్షణ, సాంకేతికత, సిబ్బంది సంక్షేమం అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
విజయవాడ: రైతులపై పోలీసుల దాష్టీకం
సాక్షి, విజయవాడ: ధర్నాచౌక్లో తీవ్ర ఉధ్రిక్తత చోటుచేసుకుంది. రైతులపై పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ధర్నా చౌక్లో రైతులపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. సీఎం ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు రైతులు యత్నించగా.. బారికేడ్లు పెట్టి రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను దాటి సీఎం ఇంటికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ధర్నాచౌక్, స్వర్ణపాలెస్ జంక్షన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఇంటికి వెళ్లి తీరుతామని రైతులు అంటున్నారు.అన్నదాతల కష్టాలపై ఏపీ రైతు సంఘం నిరసనలు చేపట్టింది. పొగాకు, మామిడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, కౌలు రైతుల బకాయిలు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
జర్మనీలో కాల్పులు కలకలం.. ఐదుగురు పౌరులు మృతి
బెర్లిన్ : జర్మనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. దుండుగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. ఏఎఫ్పీ మీడియా కథనం ప్రకారం.. ఉత్తర జర్మనీలోని స్టేడ్ నగరంలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులకు తెగబడ్డ ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రభుత్వం ఇండోర్ గేమ్స్ నిర్వహించే ప్రాంతం సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. ప్రస్తుతం భద్రతా బలగాలు పట్టణ కేంద్రానికి వెలుపల పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని వదిలేసి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పోలిస్తే జర్మనీలో తుపాకీ నియంత్రణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందువల్ల అక్కడ ఇలాంటి సామూహిక కాల్పుల ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. హాంబర్గ్ నగరానికి పశ్చిమంగా ఉన్న ఈ స్టేడ్ పట్టణ జనాభా సుమారు 50,000 వరకు ఉంటుంది. -
పోలీసులకు అన్నీ తెలుసు.. కానీ ఆ 30 మందిపై ఎందుకు మౌనం?
-
చిత్రహింసలు పెడుతూ రెండు రోజులు లాకప్ లో ...
-
ఖాకీ దుస్తులు వేసుకుంటే ఏమైనా చేయవచ్చా?
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ట్రైనీ ఎస్ఐని కాకుండా అతడి తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేయటంపై హైకోర్టు చిత్రదుర్గ పోలీసులపై అగ్రహం వ్యక్తం చేసింది. ఒంటిపై పోలీసు యూనిఫాం ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వివరాలు.. చిత్రదుర్గ మహిళా పోలీసుస్టేషన్లో జరిగిన ఘటనకు సంబంధించి దావణగెరెకు చెందిన ఎం.దర్శన్ దాఖలు చేసిన అర్జీని హైకోర్టు న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న విచారించారు. పోలీసుల వైఖరిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రైనీ ఎస్ఐ ఒక యువతిని ప్రేమించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారు. కేసులో ప్రధాన నిందితుడిని వదిలేసి తప్పు చేయని అతడి తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పు చేయని వ్యక్తిని నిందితుడిగా పోలీసులు చూపించటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి అతడి గౌరవ మర్యాదలు ఏం కావాలని పోలీసులను నిలదీశారు. ఖాకీ దుస్తులు వేసుకుంటే ఏమైనా చేయవచ్చా? పోలీసులు ఖాకీ దుస్తులు వేసుకుంటే ఏం కావాలన్నా చేయవచ్చనే ధీమా కనపడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోస్ట్ వాటెండ్ వ్యక్తులను వదిలేసి అమాయకులను అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులను బదిలీ చేయటమే కాదు. సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు అదేశిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. చిత్రదుర్గ మహిళా పోలీసులు ఈ కేసులో నేరుగా హాజరయ్యారు. ముఖ్య నిందితుడిని వదిలేసి అతడి తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించి చిత్రదుర్గ మహిళా స్టేషన్ ఎస్ఐపై శాఖాపరమైన విచారణ చేయాలని అదేశించారు. కింది కోర్టులు ఇలాంటి విషయాన్ని తేలికగా తీసుకోవద్దని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.-బెంగళూరు -
హస్తికలు వెలికితీయండి... సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై NHRC ఆగ్రహం
-
గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అరెస్ట్
-
సిబ్బందికి రీల్స్ పిచ్చి.. అదను చూసి సెంట్రల్ జైలు నుంచి ఖైదీ జంప్!
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ సెంట్రల్ జైల్లో జరిగిన నిర్లక్ష్యంలో జైలు ఉన్నతాధికారులు చిక్కుల్లో పడ్డారు. జైల్లో విధులు నిర్వహిస్తున్న గార్డులు తమ విధులు విస్మరించి మొబైల్లో రీల్స్ చూస్తుండగా.. జీవిత ఖైదు అనుభవిస్తున్న దినేష్ అనే ఖైదీ జైలు గోడ దూకి పారిపోయాడు. ఈ ఘటనలో జైలర్ సహా 11 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ సెంట్రల్ జైలు దేశంలో అత్యంత కట్టుదిట్టమైన జైళ్లలో ఒకటి. ఇక్కడ అనేక మంది హై-ప్రొఫైల్ ఖైదీలు ఉన్నారు. ఇదే జైలులో అమ్రోహా జిల్లా నన్హెడా రాజ్పుత్ గ్రామానికి చెందిన దినేష్ (22) బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం అతనిని మరో 45 మంది ఖైదీలతో కలిసి జైలులోపల వ్యవసాయ పనులకు పంపారు.ఘటన జరిగిన మధ్యహ్నం సుమారు 12.30 గంటల సమయంలో 10 మంది జైలు సిబ్బంది పర్యవేక్షణలో ఉండగా నిందితుడు ఐదు అడుగుల ఎత్తైన గోడను ఎక్కి దినేష్ పారిపోయాడు. పారిపోయే సమయంలో జైలు సిబ్బంది మొబైల్ ఫోన్లలో రీల్స్ చూస్తున్నారని విచారణలో బయటపడింది.ఈ ఘటనపై డీజీ (ప్రిజన్స్) పీసీ మీనా తక్షణ చర్యలు తీసుకున్నారు. జైలర్ నీరజ్ కుమార్, డిప్యూటీ జైలర్ వందనా చౌధరిలను సస్పెండ్ చేశారు. అదనంగా, సీనియర్ జైలు సూపరింటెండెంట్ అవినాష్ గౌతంపై కఠినమైన శాఖా చర్యలు సిఫారసు చేశారు. మరో ఏడు మంది కింది స్థాయి సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. బరేలీ సెంట్రల్ జైల్లో సీసీటీవీ కెమెరాలు, పోలీసు పోస్టు, అదనపు భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, వరుసగా ఖైదీలు తప్పించుకోవడం జైలు నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఖైదీలను బయట పనులకు పంపినప్పుడు పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని అధికారులు అంగీకరించారు.దినేష్ను పట్టుకోవడానికి అమ్రోహా మరియు పరిసర ప్రాంతాల్లో శోధన బృందాలు ఏర్పాటు చేశారు. పోలీసులు, జైలు అధికారులు కలిసి అతని కోసం గాలిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.కాగా, జైల్లో ఖైదును అనుభవిస్తున్న ఖైదీలో తప్పించుకోవడం ఇదే తొలిసారి కాదు. 2024 అక్టోబర్లో హర్పాల్ అనే హత్యా ఖైదీ కూడా ఇక్కడి నుండి పారిపోయాడు. ఆ సమయంలో కూడా సిబ్బందిని సస్పెండ్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరువాత అతన్ని పోలీసు ఎన్కౌంటర్లో తిరిగి పట్టుకున్నారు. -
కొడుకుపై పోలీసుల ఓవరాక్షన్.. దేవభక్తుని చక్రవర్తి తండ్రి వార్నింగ్
-
వచ్చే నెల 29న వినతి పాదయాత్ర చేస్తున్నాను: Ambati
-
భార్యకు సర్ప్రైజ్.. భర్తకేమో బిగ్ షాక్!
ఆయనకు భార్య అంటే ఎంతో ఇష్టమట!. అందుకే ఈసారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయేలా జరపాలని డిసైడ్ అయ్యాడు. అర్థరాత్రి వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. రాజసంగా కనిపించే వేదికను సిద్ధం చేశాడు. ఆపైనే.. ఏదైతే చేయకూడదో ఆ పనే చేసి చిక్కుల్లో పడ్డాడు!. ప్రేమతో ప్లాన్ చేసిన వేడుక చివరకు ఆ కుటుంబానికే పెద్ద తలనొప్పిగా మారింది.అస్సాంలోని గువాహటికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ బరువా తన భార్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 22 అర్థరాత్రి ప్రత్యేక వేడుకను ఏర్పాటు చేశాడు. అయితే ఈ వేడుకను ఇంట్లో గానీ, ఫంక్షన్ హాల్లో గానీ కాకుండా నగరంలోని కుమార్ భాస్కర్ వర్మ ఫ్లైఓవర్పై నిర్వహించడం వివాదానికి దారి తీసింది. రాత్రి 12.30 గంటల సమయంలో ఫ్లైఓవర్పై బెలూన్లతో అలంకరణలు చేశారు. రోడ్డుపై రెడ్కార్పెట్ పరిచారు. పలువురు స్నేహితులు, బంధువులు అక్కడికి చేరుకుని పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. కొన్ని కార్లను ఫ్లైఓవర్పైనే నిలిపివేసి వేడుక నిర్వహించారు. ఇక్కడే అసలు చేయకూడని పని చేశాడాయన.భార్యను ఇంప్రెస్ చేయాలన్న ఆలోచన బాగానే ఉన్నా.. ఫ్లైఓవర్ను పార్టీ హాల్గా మార్చేయడం మాత్రం పోలీసులను ఇంప్రెస్ చేయలేదు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ప్రజల కోసం నిర్మించిన ఫ్లైఓవర్ను వ్యక్తిగత వేడుకలకు వినియోగించడం ఏంటని ప్రశ్నించారు. ట్రాఫిక్, ప్రజా భద్రతను ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు. దీంతో గువాహటి పోలీసులు రంగంలోకి దిగారు.14 మంది అదుపులోకిదర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గౌతమ్ బరువాను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడితో పాటు వేడుకలో పాల్గొన్న భార్య సహా మొత్తం 14 మందిని ప్రశ్నల కోసం అదుపులోకి తీసుకున్నారు. వేడుకలో ఉపయోగించిన నాలుగు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.Businessman Gautam Baruah was detained by Bharalumukh Police on Monday after a video showing a birthday celebration atop the Kumar Bhaskar Varma Flyover in Guwahati went viral on social media.According to police officials, Baruah was summoned for questioning in connection with… pic.twitter.com/TSRHU8nZ2t— Hate Detector 🔍 (@HateDetectors) June 23, 2026కేసులు నమోదుగౌతమ్ బరువాపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, పబ్లిక్ న్యూసెన్స్కు సంబంధించిన నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు.పోలీసులు ప్రస్తుతం మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని, విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. సోషల్ మీడియాలో ఇదంతా చూసిన వాళ్లు.. ఇంత ప్రేమ చూపించాలా బాస్!" అని కొందరు, ఇలాంటి ఐడియాలు మాకెందుకు రావు? అని కొందరు భర్తలు లోలోపల కుళ్లుకుని ఉండొచ్చనే జోకులు పేలుతున్నాయి. -
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్, సీసీ పుటేజ్ మాయం ఎందుకు చేసారంటే ..!
-
ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!
హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం కీసర పోలీస్ స్టేషన్లో ఏసీపీ చక్రపాణి వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన స్వామి భార్య జ్యోతి, కుమారుడితో కలిసి చీర్యాలలోని ఈడెన్ గార్డెన్లో ఉంటున్నారు. జ్యోతికి తుర్కపల్లికి చెందిన నవీన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది.గత నెల 29న నవీన్.. జ్యోతి ఇంటికి వచ్చాడు. తమ వివాహేతర సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని జ్యోతి సహకారంతో నవీన్ బాలుడిని నేలపై బలంగా కొట్టగా మృతిచెందాడు. బాలుడు ప్రమాదవశాత్తు మంచంపై నుండి పడిపోవడం వల్ల మృతిచెందాడని నిందితురాలు భర్తను నమ్మించింది. ఆ తరువాత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖననం బాలుడి మృతదేహాన్ని వెలికితీసి ఫొరెన్సిక్ పరీక్షలు చేశారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర సాక్షాల ప్రకారం తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, హరిప్రసాద్ పాల్గొన్నారు. -
హైదరాబాద్లో భారీ వర్షం.. పోలీసుల కీలక సూచన
సాక్షి, హైదరాబాద్: ఈ రోజు ( సోమవారం) హైదరాబాద్కు భారీ వర్షహెచ్చరిక ఉన్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షం దృష్ట్యా విద్యాసంస్థలు, ఐటీ కార్యాలయాలు త్వరగా విధులు ముగించి ముందు బయలుదేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ సర్వీసులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కీలక సూచన చేశారు. కాగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది -
మంచిని పెంచే ‘సరిగమల ఖాకీ’
పోలీసులంటేనే నిత్యం ఏదో ఒక ఒత్తిడి, బందోబస్తులు, కేసులు, గొడవలు, కొట్లాటలు ఒక్కోసారి వ్యక్తిగత జీవితానికి కూడా సరిగ్గా సమయం ఇవ్వలేని విధులు... కానీ తనకున్న కళతో ఓ అధికారి ఒక వైపు వి«ధులను సక్రమంగా నిర్వహిస్తూనే మరో వైపు సమాజంలో యువతను, పౌరుల్లో స్ఫూర్తి నింపుతూ ముందుకు సాగుతున్నాడు.నగరంలోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న బోడసింగి సురేష్ కుమార్ దేశ భక్తిగీతాలు ఆలపించడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు నిజ జీవిత సంఘటనలపై పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. 2007 బ్యాచ్కు చెందిన సురేష్ గతంలో పని చేసిన జిల్లాలో సైతం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదో ఒక ప్రాంతంలో యువతను, స్థానికంగా ఉండే ప్రజలకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.పాటకు దేన్నైనా మార్చే శక్తి ఉంటుందని, మంచిని పెంచడానికి పది మందిలో స్ఫూర్తిని నింపి మంచి మార్గంలో నడిపించేందుకు పాట ఒక ఆయుధంగా పని చేస్తుందనే విషయాన్ని తాను నమ్ముతానని సురేష్ కుమార్ చెబుతున్నారు. ఇప్పటి వరకు సురేష్ కుమార్ సమాజాన్ని మేల్కొల్పేందుకు రచించిన జై భారత్ జెండా, షీ టీమ్స్ వల్ల అమ్మాయిలకు ఎటువంటి రక్షణ లభిస్తుందో తెలియజేసే పాట, పల్లెను వదిలి పట్నానికి రాలేని ఓ పల్లెటూరి వ్యక్తి బాధ, అడవుల వల్ల కలిగే ప్రయోజనాలు, అడవుల పరిరక్షణకై ఓ పాట, తండ్రి ప్రాముఖ్యత, పిల్లల కోసం తండ్రి చేసే త్యాగాలు, తండ్రి కష్టాన్ని తెలియజేసేలా రచించిన పాట ఇలా ఎన్నో రకాల పాటలను పాడి ఆకట్టుకున్నారు.ఏదైనా విషయాన్ని పాట రూపంలో చెప్తే అందరూ అటెన్షన్లోకి వస్తారని అందులోనూ ఖాకీ యూనిఫాం ధరించి తాను పాట పాడుతుంటూ అంతా కూడా ఆసక్తిగా చూడటంతో పాటు పాట భావాన్ని అర్థం చేసుకొని మంచి మాటలు వినేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. కరోనా సమయంలో కూడా భయపడవద్దని, ఎలా ఉండాలో చెప్పేందుకు ప్రత్యేకంగా ఓ సాంగ్ను తయారు చేయించి మరీ పాడారు.పాట రూపంలో చెప్తే అందరూ వింటారు..చదువుకునే రోజుల నుంచే నాకు పాటలంటే ఇష్టం. పోలీస్ ఉద్యోగం వచ్చినా కూడా పాడే అలవాటును మాత్రం వదులుకోలేదు. శాంతి భద్రతల పరిరక్షణతో ఓ వైపు కషి చేస్తూనే మరో వైపు సమాజంలో మంచిని పెంచేందుకు పాటల రూపంలో కషి చేస్తూనే ఉన్నా. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్షర జ్ఞానం లేని వారినే కాదు బాగా చదువుకున్న వాళ్ళను కూడా సైబర్ నేరగాళ్ళు మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని తీసుకొని సైబర్ నేరగాళ్ళతో అప్రమత్తంగా ఉండాలంటూ ఓ పాటను తయారు చేయించి పాడబోతున్నాను. మా ఉన్నతాధికకారులు కూడా నా ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. - బోడసింగి సురేష్ కుమార్, సీఐ రాంగోపాల్పేట -
క్రాంతికుమార్ది ప్రభుత్వ హత్యే
లబ్బీపేట/కృష్ణలంక(విజయవాడతూర్పు): పోలీసుల వేధింపుల వల్లే పేరుపోగు క్రాంతికుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని, ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుపోగు క్రాంతికుమార్ మరణంపై సీబీఐ విచారణ జరిపి అందుకు కారకులైన పోలీసులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల వల్ల గతనెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పార్టీ అధికార ప్రతినిధి షేక్ ఆసిఫ్, పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తదితరులు ఆదివారం పరామర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం తీరు వల్లే రక్షకభటులు భక్షక భటులుగా మారుతున్నారని, ప్రజలు, సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే పోలీసు వేధింపులకు రాష్ట్రంలో 12 మంది చనిపోయారని మండిపడ్డారు. ట్యాక్సీ నడుపుకుంటూ బతుకుబండి లాగుతున్న క్రాంతిని ఇన్ఫార్మర్గా మారాలని సీఐ నాగరాజు వేధించారని, లేదంటే గంజాయి కేసు పెడతానని బెదిరించారని, ఈ వేధింపులకు భయపడే క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడని ధ్వజమెత్తారు.క్రాంతి బలవన్మరణానికి సీఐతోపాటు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, డీజీపీ, సీఎం, హోంమంత్రి బాధ్యత వహించాలని, క్రాంతి ముగ్గురు పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత తక్షణం ఆ కుటుంబాన్ని పరామర్శించి క్షమాపణ చెప్పి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం క్రాంతి కుటుంబం పనిచేసిందని, దానికి కానుకగా అతని శవాన్ని ప్రభుత్వం ఇచ్చిందని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించకపోతే సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు వెలుగులోకి వచ్చేవి కావని, ఈ రెండు ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. సాయికృష్ణ, క్రాంతి మరణాలపై పవన్కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. -
పోలీసులు నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు
-
ఒకటి కాదు.. నాలుగు లాకప్ డెత్ కేసులు..! కూటమి వెనుకడుగుకు కారణాలు ఇవేనా?
-
వినుకొండలో ఉద్రిక్తత.. బ్రహ్మనాయుడుని అడ్డుకున్న ఖాకీలు
-
నా కొడుకు చనిపోయే ముందు చివరి మాటలు.. క్రాంతి కుమార్ తండ్రి షాకింగ్ కామెంట్స్
-
మరి సీఐ వెనక ఉన్న బాస్ ల సంగతేంటి..? సెక్షన్-238 కేసులో కీలకం..!
-
ఫోరెన్సిక్ టీమ్ కి కీలక ఆధారాలు ఇవే!
-
నా కొడుకు ఇక లేడయ్యా..
సాక్షి, అమరావతి: పోలీసులు మా అబ్బాయిని కొడుతుంటే ఆ అరుపులు వినిపించాయి. ఏడెనిమిది మంది కొట్టి.. చంపేసేంతటి తప్పు ఏంచేశాడయ్యా.. పోలీసులు అన్యాయంగా మా పిల్లాడిని పొట్టన పెట్టుకున్నారయ్యా..’ అంటూ లాకప్డెత్ అయిన సాయికృష్ణ తల్లి కన్నీటి పర్యంతమైంది. గురువారం సాయంత్రం సాయికృష్ణ తల్లిని, కుటుంబ సభ్యులను విజయవాడ కృష్ణలంకలోని వారి నివాసంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కన్నీరు మున్నీరు అవుతూ, బొంగురు పోయిన కంఠంతో, తన కొడుకును ఏవిధంగా పోలీసులు కొట్టి చంపారో పూసగుచ్చినట్లు వివరించారు.ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి మే 9న సాయికృష్ణను తీసుకొచ్చారు. అక్కడ స్టేషన్లో ఉంచారని కొంత మంది కుర్రాళ్లు చెబితే అక్కడి వెళ్లి, మా కొడును చూపండయ్యా అని వేడుకున్నాను. అక్కడ కానిస్టేబుల్ ఓ సమాధానం, ఎస్సై మరో సమాధానం ఇచ్చారు. పైన ఉన్నాడని, రేపు ఇంటికి పంపుతామని చెప్పారు. ఆ తర్వాత పలుమార్లు ఎండలో స్టేషన్ చుట్టూ తిరిగాను. స్టేషన్కు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న యువకులు సైగలు చేశారు. కానీ నాకు సరిగా కనిపించలేదు. మా అబ్బాయి అరుపులు వినిపించాయి.పైకి వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ లాకప్లో ఉన్న వారు మావాడిని ఏవిధంగా కొట్టింది చెప్పారు. కాళ్ల గోళ్లు పీకేసి, ఆర్ఎంపీ డాక్టర్తో కట్టు కట్టించారని, కాళ్లకు ఇంజక్షన్లు వేయడంతో కాళ్లు పని చేయకుండా పోయాయని తెలిపారు. మెడలు విరిచారని చెప్పారు. అమ్మను చూపించండని వేడుకొంటున్నా కనికరించకుండా బలవంతంగా ఇద్దరు కానిస్టేబుళ్లు పిల్లాడిని ఈడ్చుకొని వెళ్లి రూంలో పడేశారు. ఆ తర్వాత సాయికృష్ణ గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పలేదు. చివరకు డౌట్ వచ్చి డీజీపీకి ఫిర్యాదు చేశాం.ఆ ఫిర్యాదు సీపీ వద్దకు వచ్చింది. అప్పుడు పోలీసులు వచ్చి అయిందేదో అయ్యింది.. రాజీ చేసుకుందామని దూతలను పంపారు. ఆ దూత తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి అమ్మిశెట్టి వాసు. దీంతో మాకు పూర్తి డౌట్ వచ్చింది. జూన్ 2వ తేదిన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. నాకు ఏమీ వద్దయ్యా.. నా కొడుకును చంపిన వారందరినీ శిక్షించాలి. ఒక్కగానొక్క కొడుకును ఏడెనిమిది మంది కొట్టి చంపేంత తప్పు ఏమి చేశాడు? శవం లేకపోతే కనీసం బూడిదైనా ఇప్పించండని అడిగినా పట్టించుకోలేదు. సీఐ నాగరాజు మా కుమారుడిని చంపేస్తానని ముందే చెప్పాడు. అన్నంత పనీ చేశాడు. ఫొటో చేయించి దండేసుకో అని హేళనగా మాట్లాడాడు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. తాము అన్ని విధాల అండగా ఉంటామని ఆ కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు.. ఈ ఘటన గురించి సాయికృష్ణ మేనమామలు ముళ్లపూడి నవరంగ్, నాగేశ్వరరావు, సోదరి విజయలక్ష్మి, న్యాయవాది అయిన పినతల్లి కనకదుర్గ జగన్కు వివరించారు. ‘సాయికృష్ణ లాంటి వారు సీఐ నాగరాజు చేతిలో దెబ్బతిని చాలా మంది చనిపోయారు. ఆయన పోలీసు స్టేషన్కు రమ్మన్నారంటే చాలు ఈ ప్రాంతంలో యువకులు హడలి పోతున్నారు. ఆయనకొట్టే కొట్టుడును తటుకోలేక పారిపోతున్నారు. మా అబ్బాయి కూడా చాలా రోజులుగా ఇక్కడ లేడు. గిగ్ వర్కర్గా జొమాటోలో పని చేస్తున్నాడు. అలాంటి వాడిని ఇక్కడికి తెచ్చి చంపేశారు.ఇదంతా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే జరిగింది’ అని చెప్పారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మేనమామ నవరంగ్ మే 21న సీఐ నాగరాజు వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ వీడియోను చూపించారు. దీంతో పాటు సాయికృష్ణను కొడుతుంటే చూసిన ఓ అబ్బాయి సెల్ఫీ వీడియోను జగన్కు చూపించారు.ఆ వీడియోలో ఏముంది అంటే.. నాకళ్లారా చూశా.. లాకప్లోనే ఉన్నాడు: ప్రత్యక్ష సాక్షి మహంకాళి చందు‘నా పేరు మహంకాళి చందు అలియాస్ పూరి.. గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి అనే వ్యక్తిని కృష్ణలంక పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్లో ఉన్నా. ఆ రోజు ఏం చేశారో నాకు తెలుసు. ఒక తల్లికి జరిగిన నష్టం.. మరో తల్లికి కలిగిన కష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఆరోజు ఏం జరిగిందో చెబుతున్నా.. ఈ వీడియో తీస్తున్నందుకు నాకు భయం వేస్తోంది. కానీ ధైర్యం చేసి చెబుతున్నా.. నేను లాకప్లో ఉండగా అతన్ని తెచ్చి చిత్రహింసలు పెట్టారు. అది నేను చూశాను. దాని గురించి బయటకు వచ్చి చెబుదామనుకున్నా చాలాసార్లు.. నాకు జరిగింది జువైనల్ కోర్టు దగ్గరకు వెళ్లి లాయర్లకు చెబితే పోలీసులకే సపోర్టు చేశారు.అందుకే ఎవరికీ చెప్పలేదు. అన్యాయంగా చంపేసి నీ కొడుకును చంపేశామని చెప్పడం న్యాయం కాదు. పైగా సాయి గురించి జనాలకు చెడ్డగా చెబుతున్నారు.. అతను అమ్మాయిలను ఏడిపించాడని ప్రచారం చేస్తున్నారు. మరి ఏ అమ్మాయి అయినా ఫిర్యాదు చేసిందా? పోలీసుల థర్డ్ డిగ్రీ ఎలా ఉంటుందంటే.. శరీరంపై కొన్ని చోట్ల కరెంట్ షాక్ ఇస్తారు. దాని గురించి కోర్టులో చెప్పకూడదని బెదిరిస్తారు. ఏది ఏమైనా చంపే హక్కు వారికి లేదు. తప్పు చేసిన వాడిని జైల్లో పెట్టాలి. అంతే. ఏ శిక్ష వేయాలో కోర్టు నిర్ణయిస్తుంది. బాబురావు, నాని ఆ రోజు సాయిని పట్టుకుని కొడుతున్నారు.సీలింగ్ తెగిపోయిందని చెబుతున్నా సీఐ వినలేదు. ఆ తర్వాత ఆ రోజు నన్ను, మిగతా వాళ్లను స్టేషన్ నుంచి బయటకు పంపారు. సీఐ నాగరాజు చాలా చేశారు. బయటకు రాలేదు. ఒక తల్లిగా ఆమె ఎంత బాధ పడుతుందో అందరూ చూస్తున్నాం. బాబురావు మనుషులను ఎంత దారుణంగా కొడతాడో చాలా మంది దగ్గర వీడియోలు ఉన్నాయి. నాకు ఒక అవకాశం ఇస్తే మీడియా ముందుకు వస్తా.. చాలా మంది నిన్ను చంపుతారు.. వీడియో చేయొద్దు అని నాకు చెబుతున్నారు.. ఏం జరిగినా నష్టం లేదు. నా తల్లికి కూడా ఇదే జరుగుద్ది.ఏపీలో న్యాయం బతకాలి’ అని మహంకాళి ఆ వీడియోలో చెప్పాడు. కాగా, సాయికృష్ణ కుటుంబ పరామర్శలో జగన్ వెంట వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్కుమార్, సింహాద్రి రమేష్, పార్టీ నేతలు వంగవీటి నరేంద్ర, రామిరెడ్డి, కొండారెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, ఆళ్ల చెల్లారావు, పుప్పాలకుమారి, అవుతు శైలజారెడ్డి తదితరులు ఉన్నారు. -
సాయికృష్ణ కేసులో కూటమి ట్రిపుల్ గేమ్: అంబటి
సాక్షి, గుంటూరు: కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులు వేధించారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అతని మృతిపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేసును రాజీ చేసుకోవాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. సాయికృష్ణ చనిపోయిన విషయం చంద్రబాబు, వవన్ కల్యాణ్లకు తెలుసని అంబటి రాంబాబు అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అంబటి రాంబాబు గుంటూరులో మాట్లాడారు. సాయి కృష్ణ వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి ఘటన గతంలో దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. సాయి కృష్ణ మృతదేహాన్ని దహనం చేయడమనేది దారుణం అని రాంబాబు పేర్కొన్నారు. మేము దీన్నిరాజకీయం చేయాలని అనుకోవడం లేదు. ఒక తల్లి ఆవేదన చెబుతున్నాం. సాయి కృష్ణ రౌడీ అని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది. చంద్రబాబు సీరియస్ అంటూ రాస్తున్నారు. ఒక సీనియర్ ఐపిఎస్ చేత విచారణ ప్రభుత్వం అంటుంది. సాయికేష్ణ బ్రతికి లేడు. సీనియర్ ఐపిఎస్ విచారణలో ఏం తేలుస్తారో నేను చెబుతాను వినండి. సాయి కృష్ణ చాలా కేసులో నిందితుడిగా ఉన్నాడు. గ్యాంగ్ వార్ లో ఏమై పోయాడో తెలియదు అని నివేదిక ఇస్తారని అంబటి పేర్కొన్నారు. విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పిఎస్ లో జరిగింది. సాయికృష్ణ చంపిన తర్వాత ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు సి ఐ నాగరాజు చెప్పాడు. హోంమంత్రి, డిజిపి, సిపి అందరూ కలిసే మృతదేహాన్ని దహనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటిది హత్య అయితే రెండో నేరం మృతదేహం దహనం చేయడం. పవన్ కల్యాణ్ అమాయకుడో నాకు తెలియదు. ఆయన సమక్షంలోనే సీనియర్ ఐపిఎస్ చేత విచారణ జరిపిస్తారా? చంద్రబాబుకు ఇది న్యాయమేనా అని అంబటి ప్రశ్నించారు. ఈ కేసును సిబిఐ విచారణ జరిపించాలని, విజయవాడ పోలీస్ కమీషనర్ ను సస్పెండ్ చేయాలి. ఈ కేసులో ఎవరెవరూ ఉన్నారో అందరికి శిక్షపడాలి. పవన్ కల్యాణ్ డూడూ బసవన్నలా తల ఊపుతున్నాడు. పవన్ కల్యాణ్ వాట్సప్ నంబర్ పంపితే ఆ తల్లి ఆవేదన పంపుతాను. చంద్రబాబుకి మనస్సు లేదు. పవన్ కల్యాణైనా స్పందిస్తాడని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
సాయికృష్ణ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్
-
సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గాదె సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసులు కొట్టి చంపేసి, శవాన్ని తగులబెట్టేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సాయికృష్ణకు పెట్టిన చిత్రహింసలు, సాయికృష్ణ మృతదేహం∙ఫొటోలను ఆయన బయటపెట్టారు. ఇందుకు సంబంధించి ఒక సంచలన వీడియోను మంగళవారం రాత్రి విడుదల చేశారు. అందులో అంబటి ఏం చెప్పారంటే.. ‘23 ఏళ్ల గాదె సాయికృష్ణ కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యువకుడు అని, అతనిపై కొన్ని కేసులు ఉన్నాయని మే 9న మార్కాపురం నుంచి విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు కస్టడీలోకి తీసుకుని స్టేషన్కు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్రశ్నగా మిగిలింది. సాయికృష్ణ ఉన్నాడా? చనిపోయాడా? సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రశ్నగా మారింది. వాస్తవానికి గాదె సాయికృష్ణ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. ఆయన మేనమామ, వారి కుటుంబం రాధా, రంగాతో పనిచేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే గాదె సాయికృష్ణ మీద కొన్ని కేసులు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ క్రమంలో గాదె సాయికృష్ణ చనిపోయాడని మాకు సమాచారముంది. సహజంగా లాకప్ డెత్ జరిగితే మసిపూసి మారేడు కాయ చేసి, కుటుంబ సభ్యులకు అప్పజెప్పి.. రాజీ కుదుర్చుకుని వెళ్లిపోతారు. ఇక్కడ దానికి భిన్నంగా మృతదేహాన్నే మాయం చేశారు. మృతదేహాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేసేశారు. టూ వీలర్పై ముందు ఒక కానిస్టేబుల్.. వెనుక మరో కానిస్టేబుల్ కూర్చుని.. మధ్యలో శవాన్ని పెట్టుకుని వెళ్లారు. అక్కడ దహనం చేసి, బూడిద కూడా మాయం చేశారు. అయితే పోలీసులు.. కోర్టుకు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు.. వెతుకుతున్నాము. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతుకుతున్నామని చెబుతున్నారు. సాయికృష్ణ తల్లికి సీఐ నాగరాజు ‘మీ అబ్బాయ్ నాకు ఎదురు తిరిగాడు. వాడిని చంపేస్తాను. దండ రెడీ చేసుకో.. అని చెప్పి, మరీ చంపేసిన ఘటన ఇది. నీపై దాడిచేసి ఉండవచ్చు. అయితే పోలీసులు తీసుకొచ్చి చంపేస్తారా? రక్షకభట నిలయంలోనే భక్షణ చేసే కార్యక్రమం పోలీసులు చేస్తున్నారంటే ఏమిటి ధైర్యం? నేరం చేస్తే వారిని శిక్షించాల్సింది కోర్టులుఇటీవల తమిళనాడు మధురై కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తండ్రీకొడుకులు.. ఇద్దరినీ తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి పోలీసులు చంపేస్తే, దానిపై న్యాయ విచారణ జరిపి తొమ్మిది మంది పోలీసులను దోషులుగా నిర్ణయించి, తొమ్మిది మందికి ఉరిశిక్ష వేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఘటనలో బాధితుల కుటుంబానికి రూ.కోటి 40 లక్షలు నష్టపరిహారం చెల్లించారు. అలాంటి కఠిన నిర్ణయం కోర్టు తీసుకుంది. ఎందుకంటే పౌరుడికి జీవించే హక్కు ఉంది. నేరం చేస్తే వారిని శిక్షించాల్సింది పోలీసులు కాదు.. న్యాయస్థానాల అధికారాన్నీ పోలీసులు చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తుంటే ఇది ధర్మమేనా? సాయికృష్ణ నేరస్తుడైనా కూడా శిక్షను కోర్టులు నిర్ణయించాలి తప్ప.. సీఐలు, ఎస్సైలు కాదు. సాయికృష్ణను చంపేశారు.. కాబట్టి తల్లిదండ్రులు, బంధువులతో బేరాలు ఆడుతున్నారు. కోటి రూపాయలు ఇస్తాం.. మీరు కేసు వెనక్కు తీసుకోండని బతిమాలుతున్నారు. రేటు కూడా పెంచుతున్నారు. పోలీసులు సఫలమవుతారో, విఫలమవుతారో చూడాలి. డీజీపీ నుంచి కమిషనర్ వరకు ఈ నేరం తెలిసే జరిగిందని బయట చర్చ జరుగుతోంది. ఎవరైతే పోలీసులు మనిషి ప్రాణాన్ని తీసేశారో ఆ పోలీసు అధికారులకు శిక్ష పడేంత వరకు సమాజం కూడా పోరాటానికి మద్దతు ఇవ్వాలి’ అని అంబటి కోరారు.సాయికృష్ణ ఉంటే చూపించండిపోలీసులు చంపేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు హోం మంత్రి సమాధానం చెప్పాలి...బాధ్యులపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ కృష్ణలంకకి చెందిన గాదె సాయికృష్ణ కనిపించకుండాపోవడానికి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు డీసీపీ కేజీవీ సరితను మంగళవారం కలిసి వినతిపత్రమిచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజులుగా సాయికృష్ణ కనిపించడం లేదని, పోలీసులే తీసుకెళ్లి చంపేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్న సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడో తెలియజేయాలని, ఈ ఘటన వెనుక దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయవాడ పోలీసులపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని, సివిల్ సెటిల్మెంట్లు, స్టేషన్ సెటిల్మెంట్లతో వారు బిజీ అయిపోయారన్నారు. వాస్తవాలు తెలియాలి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గాదె సాయికృష్ణ కనబడటం లేదని ఆయన తల్లి చెప్పిన మాటల ఆధారంగా వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణను ఇంటినుంచి తీసుకెళ్లినట్టు తల్లి చెబుతోందన్నారు. పోలీసులు ఇష్టానుసారంగా కొట్టి చంపేశారని ఆమె,ఇతర కుటుంబ సభ్యులు చెబుతున్నారని వివరించారు. సాయికృష్ణ విషయంలో పోలీసులు మౌనం వీడాలని, రాష్ట్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో పోలీసుల తీరుపై ఎన్నో విమర్శలు వస్తున్నాయన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోలేరని చెప్పారు. వైఎస్సార్సీపీ తరఫున సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, తూర్పు నియోజకవర్గ పరిశీలకుడు సర్నాల తిరుపతిరావు, సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీతో కట్టుకట్టి కాలిగోళ్లు పీకేసి!
సాక్షి, టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో సంచలనంగా మారిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఏపీలో పోలీసుల పనితీరు, దారుణంగా క్షీణించిన శాంతి భద్రతల దుస్థితిని బట్టబయలు చేస్తోంది. సాయికృష్ణను చిత్ర హింసలకు గురిచేసి కటకటాల వెనకే కనుమరుగు చేశారా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. పోలీసులు చంపేశారయ్యా..! శవాన్ని అయినా ఇప్పించండయ్యా..! అంటూ సాయికృష్ణ తల్లి, మేనమామ ప్రాథేయపడటం దీనికి బలం చేకూరుస్తోంది. పోలీసులు తన కుమారుడిని తీసుకొచ్చారని సాయికృష్ణ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నా.. తమ ముందు వెంటనే హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించినా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. కేసు వాపసు తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అక్రమ కేసుల్లో ఇరికిస్తామని హెచ్చరిస్తున్నట్లు సాయికృష్ణ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ ఎక్కడ ఉన్నారనేది మిస్టరీగా మారింది. అయితే సాయికృష్ణ లాకప్ డెత్కు గురైనట్లు అత్యధికులు భావిస్తున్నారు. చంద్రబాబు సర్కారు రెడ్బుక్ పాలనలో పోలీసుల అరాచకానికి సాయికృష్ణ ఉదంతం తాజా తార్కాణంగా నిలుస్తోందని పేర్కొంటున్నారు. 2025 డిసెంబరు 3 తరువాత కేసులు ఏవీ లేకున్నా పోలీసులు ఎలా అదుపులోకి తీసుకున్నారు? దీని వెనుక కుట్రదాగి ఉందనే అనుమానం వ్యక్తం అవుతోంది. సాయికృష్ణను పోలీసులు ఏ విధంగా తీసుకెళ్లారు? ఎంతగా చిత్రహింసలు పెట్టారు? అనేది అతడి మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు ‘సాక్షి’ చానల్లో బహిర్గతం చేశారు. ఆయన ఏమన్నారంటే.. కూటమి ఎక్కడికి పోయింది? సాయికృష్ణ వంద శాతం లేడు. హ్యూమన్ రైట్స్ లాయర్లు, బార్ కౌన్సిల్ ద్వారా తొమ్మిది మందిని వెంట పెట్టుకుని మార్కాపురం వెళితే.. అయ్యా అరెస్టు చేసిన మాట వాస్తవమే. ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు. ఫలానా పేర్లు ఇవీ..! ఇలా మాట్లాడుకున్నారు. చేతులు వెనక్కి కట్టి జంతువుల కన్నా హీనంగా తీసుకువచ్చారన్నారు. నా మేనల్లుడు నాకు కావాలి. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. 45 రోజులుగా ఈ పార్టీలన్నీ ఏమై పోయాయి? కూటమి ఎక్కడికిపోయింది?మాకు మా బిడ్డ కావాలి. ఆ నాగరాజు మీద కేసు కూడా వద్దండీ. మాకు ఆఫర్ చేసిన రూపాయి కూడా వద్దు. ఈ రూపాయి ఎవరెవరు ఆఫర్ చేశారో, వాళ్లకు తెలుసు! తగలబెట్టే అధికారం ఎవరిచ్చారు..? పిల్లవాడ్ని చంపే అధికారం ఎవరిచ్చారండి? తగలబెట్టే అధికారం ఎవరిచ్చారండి? మీరు అరెస్టు చేశారు.. కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి.. బెయిల్ పెట్టుకుని బయటకు తెచ్చుకుంటాం. అనేక సంవత్సరాలుగా అరెస్టు వారెంట్లు రీకాల్ చేసుకునే వారున్నారు. వాడేమైనా కసబ్.. బర్మా నుంచి వచ్చిన కాందిశీకుడా? ఐఎస్ఐ తీవ్రవాదా? మావాడి బాడీ ఇవ్వాలి.. లేదంటే బూడిద ఇవ్వండి మాకు సపోర్ట్ చేస్తున్న లాయర్లను కూడా భయపెడుతున్నారు. మేం చావుకైనా సిద్ధమే! మా మేనల్లుడి చావు బతుకులు గురించి తెలియాలి. మావాడి బాడీ ఇవ్వాలి. లేదంటే బూడిద ఇవ్వండి.. లేదా డేట్ చెప్పండి.. కర్మకాండలు చేసుకుంటాం. మాకు కేసులు, కులాలు, పార్టీలు కాదు కావాల్సింది. అన్నీ వదిలేసి ప్రశాంతంగా బతుకుతున్నా. మమ్మల్ని కెలికారు. ఈ విషయంలో ఎక్కడికైనా వెళతా. సుప్రీం కోర్టు, హ్యూమన్ రైట్స్కు వెళతా. సీబీఐ వద్దకు వెళతా. వదిలే సమస్యే లేదు. ఆ ఏడుగుర్ని సస్పెండ్ చేయకపోతే.. ఈయన కొట్టుడు మొదలుపెడితే ఆగడండి..! గోళ్లు పీకే అవసరం ఎవరికి ఉందండి? గోళ్లు పీకాల్సిన పని ఏంటండి? ఎంత మంది పిల్లల గోళ్లు పీకేశాడండి..! అదే డాక్టరు వచ్చి పట్టకారు పెట్టి గోళ్లు పీకేయటం.. మళ్లీ కట్టుకట్టడం..! ఈయన సెటిల్మెంట్లు, యవ్వారాలు విజయవాడలో నాయకులకు తెలియదా? మా ఆవేదన ఆలోచించండి. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కక్ష లేదు. తప్పు చేసిన ఆ ఏడుగురు మినహాయించి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాకు గౌరవం. ఆ ఏడుగుర్ని సస్పెండ్ చేయకపోతే డిపార్ట్మెంట్ మీద పోరాటం చేస్తాం. కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి నేను ఎలాంటి వెనుకడుగు వేయను. అమ్మా.. లేడమ్మా..! ‘అమ్మా.. లేడమ్మా! ఆయనకు మేం చెప్పలేం.. ఆయన మామూలుగా కొట్టలేదు. అమ్మా.. మామీద పెట్టమాకమ్మా.. మీ పిల్లోడు లేడమ్మా.. చచ్చిపోయాడు... అమ్మా ఏమనుకోవద్దమ్మా.. నన్ను మాత్రం ఇరికించవద్దమ్మా..’ అని ఆ స్టాఫే మాకు మొత్తం చెప్పారు. గోళ్లు తీసిన దగ్గర నుంచి.. కొట్టి పారేసిన దగ్గర నుంచి.. చంపి బాత్రూమ్లో పడేసిన దగ్గర నుంచి.. మొత్తం సమాచారం ఉంది. బాడీ తీసుకువెళ్లిన విధానం అంతా ఉంది. సాయికృష్ణ మిస్సింగ్పై విచారణాధికారిగా ఏసీపీ దుర్గారావు.. సాయికృష్ణ మిస్సింగ్పై విచారణ నిమిత్తం ప్రత్యేక అధికారిగా పశ్చిమ ఏసీపీ ఎన్.వి దుర్గారావును నియమిస్తూ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మిస్సింగ్పై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గోళ్లు పీకింది.. చంపింది వాస్తవం..!మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవు. ఇప్పుడు కూడా సీఐ నాగరాజు అంటే మాకు గౌరవమే. మాకు మా పిల్లాడి బాడీ కావాలి. అతడిని చంపింది వాస్తవం. కొట్టింది వాస్తవం. ఆస్పత్రికి తీసుకెళ్లి ఆర్ఎంపీతో గోళ్లు పీకించింది వాస్తవం. ఇంకా నేను చెప్పకూడదు. ఈ కేసుకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. మీడియాలో పెట్టలేను. పార్టీలకు అతీతంగా వాస్తవాన్ని మాట్లాడా. ఇదే కూటమికి సపోర్ట్ చేశా. ఇదే కూటమి ఇప్పుడు ఏం చేస్తుందా? అని ఎదురు చూస్తున్నా. నీ కొడుకుకు దండ వేసుకో.. ఫొటో రెడీ చేసుకో.. చంపేస్తున్నా..! మా బాబును తీసుకెళ్లే ముందు తల్లి వద్దనున్న ఫోన్ తీసుకున్నారు. ఫోన్ ట్యాప్ చేసి మార్కాపురంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు. మా చెల్లికి అనుమానం వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్లు వెళ్లటం లేదు. మీ అబ్బాయిని అరెస్టు చేశారని, కృష్ణలంక స్టేషన్లో లాకప్లో ఉన్నాడని మా ప్రాంతానికి చెందిన వ్యక్తులు చెబితే అక్కడకు వెళ్లాం. కానీ కృష్ణను చూపించలేదు. ఫోన్ ఇవ్వలేదు. 24 సంవత్సరాల కుర్రాడు. వాయిదాకు రాలేదని ఇంత చేయటం అవసరమా? మీరు కొడుతున్నారని భయపడి ఎక్కడికో పారిపోయి బతుకుతుంటే వాడి వల్ల సమస్య ఏమైనా ఉందా? వారెంట్ పెండింగ్ ఒక్కటే కదా.. కొత్త కేసులు ఏమైనా ఉన్నాయా? బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చాడు కదా.. ఎందుకయ్యా వాడిని ఇలా చేస్తున్నారని అడిగితే సీఐ దుర్భాషలాడారు. నీ కొడుకుకు దండ వేసుకో.. ఫొటో రెడీ చేసుకో.. నీ కొడుకుని చంపేస్తున్నా..! అని అన్నారు. -
శవాన్ని బూడిద చేసేశారా..!? సాయికృష్ణ కేసుపై కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
నా ట్రాక్టర్లనే ఆపుతారా.. కాంగ్రెస్ నాయకుడి హల్చల్
సాక్షి, యాదాద్రి భువనగిరి: ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు వీరంగం సృష్టించడం స్థానికంగా కలకలం రేపింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంధమల్ల అశోక్ పోలీసు స్టేషన్ లోనే రక్షక భటులకు వార్నింగ్ ఇచ్చారు. నా ఇసుక ట్రాక్టర్లు ఎలా ఆపుతారా అని పోలీసులను బెదిరించారు. ఒళ్లు పగులుతుంది నీ సంగతేంటో చూస్తానని పోలీస్ స్టేషన్లో నానా హంగామా సృష్టించాడు. కాగా గత కొంతకాలంగా ఆలేరు, బిక్కేరు వాగు, రాజపేట, మోటకొండూరు ప్రాంతల నుంచి ఇసుక మట్టి అక్రమ రవాణా జరుగుతుంది. మోటకొండూరు మండలం వర్టూరు చెరువు నుంచి కూడా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇసుక రవాణాను అడ్డుకున్న వారిని సైతం కొంతమంది నేతలు ఇలానే బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆలేరు కాంగ్రెస్ నాయకుడే ఇసుక అక్రమ రవాణాకు అండదండలు అందించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ బెదిరింపుల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
పెన్నులు కొనుగోలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!
లక్నో: వేసవి సెలవులు ముగిశాయి. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కావాల్సిన బ్యాగ్స్,బుక్స్, పెన్నులు కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్టేషనరీ షాపులకు క్యూకట్టారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ పోలీస్శాఖ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసింది. స్టేషనరీ షాపుల్లో కొనుగోలు చేసే పెన్నుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.పెన్నుల్లా కనిపించేవన్నీ పెన్నులు కాదని.. సంఘ విద్రోహ శక్తులు పెన్నులకు బదులు..వాటి ఆకారంలో ఉండే బాంబుల్ని తయారు చేశారని తెలిపింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని విడుదల చేసింది.ఉత్తరప్రదేశ్లో పెన్ ఆకారంలో ఉన్న అనుమానాస్పద వస్తువులపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. బులంద్షహర్ జిల్లా పోలీసులు (ఖుర్జా పోలీస్ స్టేషన్ పరిధి) ఈ అడ్వైజరీని విడుదల చేశారు. పెన్లా కనిపించే అనుమానాస్పద వస్తువులను తాకరాదని ప్రత్యేక సూచనలు చేశారు. ఇవి విస్ఫోటక పరికరాలుగా మార్పిడి చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.ప్రజలు రోడ్లపై, పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో లేదా ఎడారిలాంటి ప్రాంతాల్లో కనిపించే వస్తువులను తాకకుండా 112 ఎమర్జెన్సీ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారం అత్యంత కీలకమని, శిక్షణ పొందిన భద్రతా సిబ్బందే ఇలాంటి వస్తువులను పరిశీలించాని తెలిపారు. ప్రజలు సూచనలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు. అంతా ఉత్తుత్తే..తాజాగా సమాచారం ప్రకారం.. పెన్నులా కనిపించే ఒక వస్తువు చివర ఉన్న బటన్ను నొక్కగానే బాంబులు పేలుతాయని, కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రాణాలు కోల్పోయారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వైరల్ వార్తల్లో నిజం లేదని తేలింది. ముందుగా ఈ తరహా పెన్నులపై అప్రమత్తంగా ఉండాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు సూచనలు జారీ చేశారని ప్రచారం జరిగింది. కానీ, తాము ఎలాంటి సూచనలు ఇవ్వలేదని యూపీ పోలీసులు మీడియాకు స్పష్టంగా తెలిపారు. -
పాకిస్థాన్లో కాల్పులు.. పదేళ్ల విదేశీ చిన్నారి మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో విషాదం చోటుచేసుకుంది. ఒక పోలీసు అధికారి చేసిన పొరపాటుతో పదేళ్ల ముక్కపచ్చలారని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దొంగతనానికి సంబంధించిన ముఠాను ఛేదిస్తున్న క్రమంలో జరిపిన కాల్పుల్లో పోరపాటున విదేశీయులకు బుల్లెట్లు తగిలాయి. ఈ ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన బాలిక అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఒక పోలీసు అధికారిని అరెస్టు చేశారు.పంజాబ్ పోలీసుల కథనం ప్రకారం, దోపిడీ జరిగినట్లు సమాచారం రావడంతో పోలీసులు వెను వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో అనుమానితులు కుటుంబ కారులో పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఒక కుటుంబానికి చెందిన వాహనాన్ని అడ్డగించారు. వారు ఆపకపోవడంతో అధికారి పొరపాటుగా భావించి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. అయితే ఈకాల్పుల ఘటనలో దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియాకు చెందిన 10 ఏళ్ల హానియా అనే బాలిక మరణించగా, ఆమె తండ్రి, సోదరుడు గాయపడ్డారని తెలిపారు. దీంతో ఈ కాల్పులకు కారణమైన అధికారని పోలీసులు అరెస్టిు చేశారు.కాగా ఆస్ట్రేలియా పెర్క్కు సంబంధించిన బాధితులు పాకిస్థాన్లోని తమ బంధువులను కలవడానికి వచ్చారని ఆ సమయంలో కాల్పులు జరిగాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఆస్ట్రేలియ ప్రధాని ఆంటోనియా ఆల్బనీస్ విచారం వ్యక్తం చేశారు. దీనిపై పారదర్శకమైన విచారణ జరగాలని కోరారు. గాయపడిన వారికి ఆస్ట్రేలియా కాన్సులేట్ సహాయం అందిస్తున్నట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.An Australian family's been caught up in a horror shooting while on holidays in Pakistan. Police opened fire, killing a nine-year-old girl and wounding her father and brother, apparently mistaking them for thieves. pic.twitter.com/zAZxr1ccou— 7NEWS Sydney (@7NewsSydney) June 13, 2026 -
నీట్ రీ ఎగ్జామ్కు ముందే భారీ స్కామ్..నలుగురు అరెస్ట్
ముజఫర్పూర్: నీట్ యూజీ రీ ఎగ్జామ్కు కౌంట్డౌన్ ప్రారంభమైన వేళ బీహార్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష వివాదం సర్దుమణగక ముందే, అభ్యర్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షలు గుంజాలని చూసిన నలుగురు నిందితులను ముజఫర్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మాకు డబ్బులు అందాయి, నీట్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ పంపుతున్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను బురిడీ కొట్టించిన ఈ గ్యాంగ్ నెట్వర్క్ను పోలీసులు చేధించారు.సోషల్ మీడియా వేదికగా ఫేక్ పేపర్ల దందాబీహార్లోని ముజఫర్పూర్లో పట్టుబడిన ఈ ముఠా.. ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా నీట్ అభ్యర్థులను ట్రాప్ చేసినట్లు ఎస్ఎస్పీ కాంతేష్ కుమార్ మిశ్రా వెల్లడించారు. వివిధ పోటీ పరీక్షల నకిలీ ప్రశ్నపత్రాలను చూపిస్తూ, అవే అసలైన పేపర్లు అని నమ్మించి నిందితులు ఆన్లైన్ ద్వారా భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. విద్యార్థుల నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ల ద్వారా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయించుకుని ఆపై చేతులెత్తేయడం ఈ ముఠా ప్రధాన వ్యూహం.మనీష్ ఇచ్చిన సమాచారంతో గ్యాంగ్ అరెస్ట్ఈ నెల జూన్ 2వ తేదీన సికింద్పూర్ పోలీసులు మనీష్ అనే వ్యక్తిని నకిలీ పేపర్లు విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా, ఈ నీట్ ఫేక్ పేపర్ల స్కామ్ వెనుక ఉన్న అసలు రహస్యాలు బయటపడ్డాయి. మనీష్ ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ముజఫర్పూర్ పోలీసులు.. హర్ష్, అమన్ కుమార్, కన్హయ్య కుమార్, హర్ష్ కనేడియా అనే మరో నలుగురు నిందితులను వేటాడి పట్టుకున్నారు.జూన్ 21న కట్టుదిట్టంగా నీట్ రీ-ఎగ్జామ్మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా రద్దయిన ఈ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), విద్యా మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పరీక్ష పారదర్శకత కోసం అధికారులు ‘పరీక్ష కర్మయోగి’ అనే ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. -
మీడియా ముందే పోలీసుల ఓవరాక్షన్
-
మాస్ పోలీస్
వెండితెరపై తమ అభిమాన హీరో మాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తే థియేటర్స్లో ఆ హీరో ఫ్యాన్స్కు పూనకాలు వచ్చేస్తాయి. అన్యాయం చేస్తున్న విలన్స్ను పోలీస్ ఆఫీసర్ గెటప్లో హీరో రఫ్ఫాడిస్తుంటే థియేటర్స్ విజిల్స్, చప్పట్ల సౌండ్స్తో మారుమోగి పోతాయి. మరి... థియేటర్స్లో ఈ మాస్ వైబ్రేషన్ను క్రియేట్ చేసి, ప్రేక్షకులను అలరించేందుకు ఖాకీ చొక్కా వేసుకుని, లాఠీ పట్టిన వెండితెర మాస్ పోలీస్లపై ఓ లుక్ వేయండి.మళ్లీ వస్తున్నాడు ముత్తువేల్ పాండియన్ పోలీస్ స్టోరీస్ అంటే రజనీకాంత్కు ఇటీవలి కాలంలో కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతున్నట్లుంది. గడిచిన ఐదేళ్ల కాలంలో మూడుసార్లు (దర్బార్, జైలర్, వేట్టయాన్) రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్గా వెండితెరపై కనిపించారు. ఆయన తాజా చిత్రం ‘జైలర్ 2’లోనూ పోలీస్ ఆఫీసర్గానే నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘జైలర్’. ఇందులో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్గా రజనీకాంత్ నటించారు.ఫ్లాష్బ్యాక్ సీన్స్లో పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా సూపర్ హిట్గా నిలవడంతో ఈ సినిమాకు సీక్వెల్గా ‘జైలర్ 2’ తెరకెక్కింది. ఈ ‘జైలర్ 2’ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్గా రజనీకాంత్ నటించారు. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇక ‘జైలర్’ చిత్రంలో నటించిన రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగిబాబు, మోహన్లాల్ ‘జైలర్ 2’ చిత్రంలోనూ నటించారు.కొత్తగా ఎస్జే సూర్య, మిథున్ చక్రవర్తి, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్ ఈ సినిమాలో భాగమయ్యారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే... ఈ సినిమాలో హృతిక్ రోషన్ నార్త్కు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. తొలుత ఈ పాత్రకు షారుక్ ఖాన్ను అనుకున్నారు. కానీ ఫైనల్గా హృతిక్ రోషన్ ఓకే అయ్యారు. దాదాపు నలభై సంవత్సరాల క్రితం రజనీకాంత్ నటించిన ‘భగవాన్ దాదా’ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా హృతిక్ రోషన్ నటించారు. మళ్లీ ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత రజనీకాంత్–హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషం.సంక్రాంతికి వస్తారా! సిల్వర్ స్క్రీన్పై సింగమ్ అంటే సూర్య అని ఇట్టే చెప్పేస్తారు యాక్షన్ సినిమా లవర్స్. పోలీస్ ఆఫీసర్గా ‘సింగమ్’ సిరీస్ సినిమాల్లో సూర్య తన యాక్టింగ్తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. నిజానికి ‘సింగమ్’ సిరీస్ చిత్రాలకంటే ముందే, ‘కాక్క కాక్క’ అనే ఓ తమిళ సినిమాలో సూర్య పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఈ సినిమానే వెంకటేశ్ హీరోగా తెలుగులో ‘ఘర్షణ’గా రీమేక్ అయ్యింది. ఇలా... సూర్య పోలీస్ ఆఫీసర్గా నటించిన ప్రతిసారీ ఆ సినిమా హిట్ అయి పోతుంది. కాగా సూర్య ప్రస్తుతం మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో సూర్యది పోలీస్ ఆఫీసర్ పాత్ర అని తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిందని కూడా సమాచారం. నజ్రియా నజీమ్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ యువ నటుడు, ‘ప్రేమలు, లోక: చాప్టర్ 1’ చిత్రాల ఫేమ్ నస్లెన్ కె. గఫూర్ మరో కీలక పాత్ర చేస్తున్నారు. సూర్య కెరీర్లోని ఈ 47వ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ కానుందనే ప్రచారం సాగుతోంది.అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక కొంత కాలంగా వరుస సినిమాల వైఫల్యాలతో ఇబ్బందిపడిన సూర్య ఇటీవల ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు యూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ‘కరుప్పు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత సూర్య నుంచి రాబోతున్న సినిమాపై ఆయన ఫ్యాన్స్లో, తమిళ ఇండస్ట్రీలో అంచనాలున్నాయి.తొలిసారి పోలీస్ ఆఫీసర్గా... సిల్వర్ స్క్రీన్పై ప్రభాస్ కటౌట్ పోలీస్ ఆఫీసర్గా సూపర్బ్గా సూట్ అవుతుంది. ఆరడుగుల ప్రభాస్ పోలీస్ గెటప్లో స్క్రీన్పై కనిపిస్తే, ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు. థియేటర్స్లో విజిల్స్ మోత మోగి పోతాయి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘స్పిరిట్’లో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇటీవల ప్రభాస్ పోలీస్ గెటప్ ఉండగా, ఓ థియేటర్ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్ను హైదరాబాద్లో చిత్రీకరించారు. భూషణ్కుమార్, ప్రణయ్రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘స్పిరిట్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా కాంచన, ప్రకాష్రాజ్, వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘మిర్చి’ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో తల్లీకొడుకులుగా నటించారు ప్రభాస్, నదియా. ‘స్పిరిట్’ సినిమా కోసం మళ్లీ నదియా, ప్రభాస్ కలిసి నటిస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ సమా చారం. అలాగే ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్స్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ప్రధానంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే ప్రభాస్ కనిపిస్తారు. కానీ ఈ చిత్రంలో ప్రోఫెసర్గానూ, గ్యాంగ్స్టర్గానూ ప్రభాస్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.10 సంవత్సరాలు... 55 ట్రాన్స్ఫర్స్ ‘పెళ్లి, చాలా బాగుంది, మా బాలాజీ, మనసిచ్చి చూడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు వడ్డే నవీన్. కాగా, యాక్టర్గా కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ త్రిమూర్తులు అనే పాత్రలో వడ్డే నవీన్ నటించారు. రాశీ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు.కమల్తేజ నార్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. పది సంవత్సరాల్లో 55 సార్లు ట్రాన్స్ఫర్ అయిన కానిస్టేబుల్ త్రిమూర్తులు కొన్ని ఇబ్బందుల్లో పడతాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం నాటి కేసును సాల్వ్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో త్రిమూర్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? ఈ కేసుకు, త్రిమూర్తులకు ఉన్న సంబంధం ఏంటి? అన్నదే ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమా కథనం అని తెలిసింది. ఇక ఈ సినిమాతో నిర్మాతగా మారారు వడ్డే నవీన్.పవర్ఫుల్ పోలీస్ ‘కూలీ నెంబరు 1, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా టబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల... వైకుంఠపురములో..’ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేశారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో టబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ సంయుక్త, దునియా విజయ్కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.ఇటీవల ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో డీసీపీ (డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్)గా టబు కనిపించారు. ఈ చిత్రంలో బెగ్గింగ్ మాఫియాను అరికట్టే మిషన్ను టేకప్ చేస్తారట ఆమె. పూరి కనెక్ట్స్, జె.బి. మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఫుల్ మాస్వెండితెరపై ఇప్పటివరకు ఎక్కువగా బ్యూటిఫుల్ హీరోయిన్గానే కనిపించారు సాయి పల్లవి. ధనుష్ ‘మారి 2’, నాని ‘ఎమ్సీఏ’ సినిమాల్లో మాత్రం సాయి పల్లవి క్యారెక్టర్లో చిన్నపాటి మాస్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. కానీ ఈసారి ఫుల్ మాస్ అవతార్లో కనిపించేందుకు ఆమె సిద్ధమయ్యారని తెలిసింది. ధనుష్ హీరోగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రానుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్గా నటిస్తున్నారు. మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.కాగా, ఈ చిత్రంలో సాయి పల్లవి ఓ వపర్ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్లో కనిపించనున్నారని కోలీవుడ్ సమాచారం. వెండితెరపై పోలీస్ ఆఫీసర్గా కనిపించేందుకు ఆమె శిక్షణ కూడా తీసుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా. అలాగే ఈ చిత్రంలో మమ్ముట్టి కూడా పోలీస్ అధికారి పాత్రలోనే కనిపిస్తారట. అంతేకాదు... మమ్ముట్టి పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. హిట్ 4 తెలుగు సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘హిట్’ సిరీస్ సినిమాల్లో హీరో పోలీస్ ఆఫీసర్గానే కనిపిస్తారు. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన ‘హిట్’లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’లో అడివి శేషు, ‘హిట్ 3’లో నాని పోలీస్ ఆఫీసర్లుగా నటించారు. ఇక ‘హిట్ 3’ ఎండింగ్లో ‘హిట్ 4’ చిత్రంలో కార్తీ హీరోగా నటిస్తారని స్పష్టం చేసింది యూనిట్. అయితే ప్రస్తుతం ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కార్తీ హీరోగా నటిస్తున్నారు. ఇదొక కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా. మరోవైపు ‘హిట్’ సిరీస్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను ఓ లవ్స్టోరీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఇలా దర్శకుడు కల్యాణ్తో కార్తీ, హీరో రోషన్తో శైలేష్ వారి వారి సినిమాలను పూర్తి చేసిన తర్వాత, ‘హిట్ 4’ సినిమా సెట్స్కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.బొగ్గు గనుల నేపథ్యంలో...! తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా, రాంకీ, రవీంద్ర విజయ్, ఆడుకలం నరేన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రంలో బొగ్గు కుంభకోణాలకు సంబంధించిన దోషులను పట్టుకునే పోలీస్ ఆఫీసర్గా సంయుక్త నటించారని తెలిసింది.అంతేకాదు... ఈ సినిమా కోసం సంయుక్త కొన్ని పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్లు సినిమాలో హైలైట్గా ఉంటాయని తెలిసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను ‘ది బ్లాక్గోల్డ్’ సినిమాలో ఆడియన్స్ చూస్తారని ఆల్రెడీ చిత్రయూనిట్ పేర్కొంది. యోగేష్ కేఎమ్సీ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది.వీరే కాదు... మరికొంతమంది హీరో, హీరోయిన్లు కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారని తెలిసింది. మరికొందరు పోలీస్ స్టోరీ నేపథ్యంలో వచ్చే కథలను వింటున్నారు.– ముసిమి శివాంజనేయులు -
పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న బంగ్లా క్రికెటర్!
బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెటర్, ఆఫ్-స్పిన్నర్ మొహమ్మద్ నయీమ్ హసన్ పోలీసుల చేతిలో చావుదెబ్బలు తినడం సంచలనం కలిగించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తాను క్రికెటర్ అని చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని బంగ్లా క్రికెటర్ వాపోయాడు. ఈ విషయం తెలుసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నయీమ్ హసన్పై దాడిని ఖండిస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పోలీసు కమిషనర్ క్షమాపణ..కాగా క్రికెటర్ నయీమ్ హసన్పై పోలీసుల దాడి విషయాన్ని తెలుసుకున్న చట్టోగ్రామ్ మెట్రోపాలిటన్ పోలీస్ (సీఎంపీ) కమిషనర్ హసన్ మహమ్మద్ షౌకత్ అతడి నివాసానికి వెళ్లాడు. నయీమ్ హసన్ను వేధించారనే ఆరోపణలపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఘటనపై నయీమ్ హసన్కు క్షమాపణ చెప్పారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..బంగ్లాదేశ్లో జరిగే ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ముగించుకుని నయీమ్ హసన్ విమానంలో ఢాకా నుంచి చిట్టగాంగ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగా, శుక్రవారం రాత్రి సుమారు 11:25 గంటల సమయంలో లంకన్ బజార్ ఫ్లైఓవర్ కింద పోలీసులు ఆయన ప్రయాణిస్తున్న ఆటోను ఆపారు. ఆ తర్వాత నయీమ్ హసన్ను ఆటో నుంచి బలవంతంగా దించి పోలీసు వాహనం ఎక్కించారు. తాను క్రికెటర్ను అని చెప్పినప్పటికీ మాట వినిపించుకోకుండా తనపై దౌర్జన్యంగా దాడి చేశారని నయీమ్ హసన్ తెలిపాడు. అతడు మాట్లాడుతూ..‘వారు డ్రైవర్ నుంచి పత్రాలు తీసుకున్నారు. అవసరమైతే నా బ్యాగ్ కూడా తనిఖీ చేసుకోమని నేను వారితో చెప్పాను. కానీ వారు నా గొంతు పట్టుకుని.. 'కారు ఎక్కు' అంటూ వారి వాహనంలోకి తీసుకెళ్లారు. ఎందుకు నా గొంతు పట్టుకున్నారు? అని నేను ప్రశ్నించగా, వారు నన్ను బయటకు తోసేసి, కొట్టి, అసభ్యకరంగా తిట్టారు. నేను దేశం తరఫున టెస్ట్ మ్యాచ్లు ఆడే జాతీయ క్రికెటర్ను అని చెప్పినా మొదట వినిపించుకోలేదు. ఆ తర్వాత నేను బోర్డుకు సమాచారం అందించడం, వాళ్లకు పై అధికారుల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో వదిలేశారు’ అని నయీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఇక త్వరలో జింబాబ్వేతో జరగనున్న టెస్ట్ సిరీస్కు బంగ్లాదేశ్ జట్టులో నయీమ్ హసన్కు చోటు దక్కింది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2018లో బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మొహమ్మద్ నయీమ్ హసన్ 14 టెస్టుల్లో 235 పరుగులు చేయడంతో పాటు తన ఆఫ్ స్పిన్ బౌలింగ్తో 48 వికెట్లు పడగొట్టాడు.చదవండి: సెమీస్లో ముగిసిన పీవీ సింధు పోరాటం -
విజయవాడలో బ్రదర్స్ వార్..! కేశినేని నానిపై కేసు నమోదు..
-
వరలక్ష్మి, నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే?
వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ పోలీస్ కంప్లైంట్. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు.ఈ సినిమా కథేంటంటే..గర్భిణి మహిళ హత్యతో ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. క్షుద్రపూజల పేరుతో జరిగినట్లు అనుమానిస్తున్న ఈ హత్య కేసు సంవత్సరాల పాటు మూలన పడిపోతుంది. డాడీ కావాలంటూ చిన్నారి అద్వైత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతోనే అసలు కథ మొదలవుతుంది. పాప తాను డాడీ అని పిలిచిన వాళ్లంతా చనిపోతారు. ఒక నిబద్ధత కలిగిన పోలీస్ అధికారి(వరలక్ష్మి శరత్కుమార్) ఈ కేసును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో అసలు కథ మొదలవుతుంది. అప్పుడే పోలీస్ అధికారి భర్త డాక్టర్ రామ్ ( నవీన్ చంద్ర ) అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు పోలీస్ అధికారిణి ఏ నిర్ణయం తీసుకుంది. వరుస హత్యల వ్యవహారం వెనుక ఏం జరుగుతుంది? వారిని ఎవరు చంపేశారు? ఈ మరణాల వెనుక నిజంగా అతీంద్రియ శక్తులున్నాయా? అన్నదే అసలు కథ.ఎలా ఉందంటే.డైరెక్టర్ సంజీవ్ మేగోటి చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్కు హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కథలో మిస్టిరీయస్ అంశాల్లో ప్రేక్షకులను మెప్పించారు. హారర్, మిస్టరీ, యాక్షన్ అంశాలను చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్లో ఎక్కువగా ట్విస్ట్లు ఆడియన్స్ను థ్రిల్కు గురి చేస్తాయి.ఇంటర్వెల్ తర్వాత కథ వేగం పెరుగుతుంది. కేసు దర్యాప్తు సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేస్తాయి. ఈ కేసుల్లో బయటపడే రహస్యాలు ప్రేక్షకులను చివరి వరకు కుర్చీలో కట్టిపడేసేలా ఉన్నాయి. ముఖ్యంగా హారర్ సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ కథకు బలం. సంజీవ్ సస్పెన్స్తో పాటు థ్రిల్లింగ్ కలిగించే కథను అందించారు. అయితే కొన్ని సీన్స్ బోర్ కొట్టేలా అనిపిస్తాయి. అక్కడక్కడ కథలో లాజిక్ మిస్సయినట్లు ప్రేక్షకుడికి అనిపిస్తుంది. మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథతో చెప్పే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కథలు ఇష్టపడేవాళ్లు ఈ మూవీని ఓసారి ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..నవీన్ చంద్ర తన పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దర్యాప్తు అధికారిగా మెప్పించారు. వరలక్ష్మి శరత్కుమార్ మరోసారి తన టాలెంట్ను ప్రదర్శించారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. కృష్ణసాయి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా సూపర్స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతంలో ఆయన ప్రదర్శన అభిమానులను అలరిస్తుంది. రాగిణి ద్వివేది, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమిని సురేష్, విజయభాస్కర్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు.ఇక సాంకేతికత విషయానికొస్తే ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాత్రి సీన్లు, హారర్ ఎపిసోడ్స్ను విజువల్గా బాగా తీర్చిదిద్దారు. ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో అందించిన నేపథ్య సంగీతం ఫర్వాలేదు. అనుగోజు రేణుకా బాబు కొన్ని సీన్స్ మరింత కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
ఫస్ట్ పక్కకు జరుగు.. అంబటి VS పోలీస్
-
కుక్క దొరికింది.. చిన్నారి ఏమైందో..?
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం చిక్కుళ్ల అగ్రహారం గ్రామంలో ఆరు రోజుల కిందట అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) ఆచూకీ ఇప్పటి వరకూ తెలియరాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు భవాని, గణేష్ తోపాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆ చిన్నారితోపాటు అదృశ్యమై మూడు రోజుల అనంతరం మంగళవారం ప్రత్యక్షమై, మళ్లీ పరారైన పెంపుడు కుక్క బుధవారం అర్ధరాత్రి ఎట్టకేలకు డాగ్ క్యాచర్ బృందానికి చిక్కింది. దీంతో కీలక ఆధారం లభించిందని పోలీసులు భావించారు.ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి... దానిని వదిలిపెడితే.. అది సంచరించే మార్గంలో పోలీసులు గాలించి చిన్నారి ఆచూకీ కనిపెట్టాలని భావించారు. అయితే, ట్రాకర్ అందుబాటులో లేకపోవడంతో గురువారం అది సాధ్యం కాలేదు. ఆ కుక్కను రోజంతా గణేష్ ఇంటి ముందర మామిడి చెట్టు వద్ద కట్టి, పోలీసుల సంరక్షణలో ఉంచారు. కొంతసేపు ప్రశాంతంగా ఉంటున్న ఆ కుక్క అప్పుడప్పుడు సమీపంలోని వ్యక్తులపై దాడికి యత్నిస్తోంది.పెద్దాపురం డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, యాంటీ నక్సల్ స్క్వాడ్స్, ఎన్డీఆర్ఎఫ్, అటవీ అధికారుల బృందాలు గాలింపు చర్యలు కొనసాగించాయి. అనుమానిత ప్రాంతాలపై నిఘా ఉంచి, డ్రోన్తో జల్లెడ పట్టారు. సీసీ టీవీ ఫుటేజ్లు సేకరించి పరిశీలిస్తున్నారు. మరోవైపు గ్రామంలోని ఇంటింటా ఎన్యూమరేషన్ చేశారు. కొండ ప్రాంతంలో చిన్నారి లేకపోవచ్చని, కిడ్నాప్ లేదా గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. జ్ఞానేశ్వరి ఆరు రోజులుగా ఎక్కడుందో, ఎలా ఉందో, ఏమైపోయిందోనని కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. -
పోలీస్ రిక్రూట్మెంట్ ఉందని వెళితే పొలంలో పనిష్మెంట్!
లక్నో: ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్, గూగుల్ మ్యాప్స్ తోడు లేకుండా అడుగు బయటకు అడుగువేయలేం. అయితే అదే టెక్నాలజీని గుడ్డిగా నమ్మితే జీవితాలే తలకిందులవుతాయని నిరూపించే ఒక ఘటన వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్లో యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష రాయడానికి బయల్దేరిన నలుగురు అభ్యర్థులు, గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలో వెళ్లి, పరీక్షా కేంద్రానికి బదులు పంట పొలాల్లోకి చేరుకున్నారు. తప్పు తెలుసుకుని పరీక్షా కేంద్రానికి పరుగులు తీసేసరికి సమయం దాటిపోవడంతో, వారి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైంది.గూగుల్ మ్యాప్స్ మాయవిశాల్, ధర్మేంద్ర మాలిక్, అరుణ్ కుమార్, నకుల్ కుమార్ అనే నలుగురు అభ్యర్థులు ముజఫర్నగర్లోని ‘దీప్చంద్ గ్రెయిన్ ఛాంబర్ ఇంటర్ కాలేజ్’లో పరీక్ష రాయాల్సి ఉంది. వారు తమ అడ్మిట్ కార్డ్లోని సెంటర్ కోడ్ను గూగుల్ మ్యాప్స్లో ఎంటర్ చేసి ప్రయాణమయ్యారు. అయితే, ఆ మ్యాప్ వారిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సింది పోయి, షామ్లీ జిల్లాలోని జాంధేరి గ్రామంలోని వ్యవసాయ పొలాల మధ్యకు తీసుకెళ్లింది. చుట్టూ చూస్తే కాలేజీ కాకుండా పంట పొలాలు కనిపించడంతో వారు షాక్కు గురయ్యారు. తాము తప్పుడు లొకేషన్కు వచ్చామని గ్రహించేసరికే జరగకూడనంత నష్టం జరిగిపోయింది.సమయంతో పోరాటం.. చేజారిన అవకాశంసమయం మించిపోతుండటంతో ఆ నలుగురు అభ్యర్థులు తీవ్ర ఆందోళనతో ముజఫర్నగర్ వైపు పరుగులు తీశారు. స్థానికులను దారి అడుగుతూ, పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎలాగోలా ముజఫర్నగర్ చేరుకునేసరికి పరీక్షా కేంద్రం గేట్లు మూతపడ్డాయి. పరీక్ష ప్రారంభ ప్రక్రియ ముగిసిపోవడంతో అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు. దీనితో రాత్రింబవళ్లు కష్టపడి చదివినా పరీక్ష రాయకుండానే వారు వెనుదిరగాల్సి వచ్చింది. -
పోలీసులపై గంజాయి స్మగ్లర్ల దాడి
చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చి పోతున్నారు. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా మీదుగా మైదాన ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను వెంబడించిన పోలీసులపైనే దాడికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. చింతపల్లి మండలంలో గంజాయి స్మగ్లర్లు దాడికి పాల్పడడంతో పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చింతపల్లి మండలం ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు వచ్చి న ముందస్తు సమాచారం మేరకు అన్నవరం పోలీసులు లోతుగెడ్డ వంతెన సమీపంలో రామారావుపాలెం–మేడూరు జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ నిర్వçహించారు. అదే సమయంలో ఏఓబీ సరిహద్దు ప్రాంతం బలపం కోరుకొండ నుంచి రామారావుపాలెం మీదుగా అటుగా వచ్చి న వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లు ఒక్కసారిగా పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలతో పోలీసులపైకి దూసుకెళ్లారు. దీంతో స్మగ్లర్లను నిలువరించడానికి పోలీసులు ప్రయత్నించడంతో మరింత రెచ్చిపోయి పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడడంతో అన్నవరం ఎస్ఐ రెండు రౌండ్లు తుపాకీని గాల్లోకి పేల్చారు.తప్పించుకుని పారిపోతున్న నలుగురిని పట్టుకోగా, మరో నలుగురు పారిపోయారు. వారి నుంచి రూ.కోటి విలువైన 290 కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో రాజస్థాన్కు చెందిన అర్జున్కుమార్, విశాఖపట్నంకు చెందిన ఇమ్రాన్ఖాన్, మల్కన్జిల్లా(ఒడిశా)కు చెందిన కిసాన్కార్, అల్లూరి జిల్లా బలపం గ్రామానికి చెందిన పాంగి శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. అన్నవరం పోలీసులు ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. -
విమానాశ్రయం వద్ద పోలీసుల ఓవరాక్షన్
-
బాలికపై అఘాయిత్యం చేసి.. పైనుంచి తోసేసి..
ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కీచకుడి దుర్మార్గం బట్టబయలైంది. వేసవి సెలవుల కోసం తాత ఇంటికి వచ్చిన ఓ 12 ఏళ్ల బాలికపై అతను అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆపై ఆ బాలికను హతమార్చేందుకు ప్రయత్నించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరకు బాధితురాలు అసలు విషయం చెప్పడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేసే వ్యక్తి కుమార్తె తన భర్తతో గొడవపడి తండ్రి వద్దకు వచ్చి ఉంటోంది. ఆమె కుమార్తె అయిన 12 ఏళ్ల బాలిక కూడా తల్లి, తాత వద్దకు వేసవి సెలవుల్లో వచ్చింది. అదే అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో ఉంటున్న మహ్మద్ గౌస్ (50) బాలికపై కన్నేశాడు. 15 రోజుల క్రితం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె ఈ విషయాన్ని ఓ ఫ్లాట్లోని మహిళకు చెప్పగా బాలికను ఒంటరిగా బయటకు పంపొద్దని సూచించింది. అదే అదునుగా.. : ఈ నెల 6న గౌస్ భార్య ఇంట్లో లేని వేళ తన ఫ్లాట్ ఉన్న అంతస్తులోకి బాలిక రావడాన్ని గమనించిన గౌస్.. ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు ఈ విషయాన్ని బయటపెడుతుందనే ఉద్దేశంతో ఆమెను హతమార్చేందుకు ఐదో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. అనంతరం ఏమీ తెలియని వాడిలా కిందకు వచ్చి బాలిక కళ్లు తిరిగి పడిపోయి ఉంటుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సోమవారం సాయంత్రానికి కాస్త కోలుకున్న బాలిక.. అత్యాచారం, హత్యాయత్నం గురించి తన మేనమామకు చెప్పగా ఆయన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి టూటౌన్ పోలీసు స్టేషన్లో గౌస్పై కేసు పెట్టారు. అనంతరం బాధితురాలి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం సేకరించారు. ఈ మేరకు గౌస్పై పోక్సో కేసుతోపాటు హత్యాయత్నం కూడా నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మంత్రి పొంగులేటి భరోసా..: బాలిక వెన్నెముక, పక్కటెముకలు విరిగిపోయాయని.. కోలుకోవడానికి చాలాకాలం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితురాలి తండ్రి, సర్పంచ్తో ఫోన్లో మాట్లాడారు. ‘ముందు పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి.. నేనున్నా’అని ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం వెంటనే హైదరాబాద్లోని నిమ్స్కు తరలించాలని.. వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. నిందితుడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. -
ఇంటి వద్ద హై టెన్షన్.. అడ్డుకున్న పోలీసులు ఇచ్చిపడేసిన మార్గాని భరత్
-
వరలక్ష్మి హారర్ థ్రిల్లర్.. సూపర్స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్
నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం పోలీస్ కంప్లైంట్. ఈ మూవీ హరర్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార గీతాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెంచేశాయి.తాజాగా కృష్ణసాయి, కృతి వర్మలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. సూపర్స్టార్ కృష్ణపై రూపొందించిన ఈ గీతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూపర్స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను వీక్షించిన సూపర్స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చిత్ర యూనిట్ను ప్రత్యేకంగా అభినందించారు. పాట అద్భుతంగా వచ్చిందని ప్రశంసిస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. 'సూపర్స్టార్ కృష్ణ గారి సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కృష్ణపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మెచ్చుకోవడం మా యూనిట్కు ఎంతో గర్వకారణం. ఆయన ఆశీర్వాదాలు మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ చిత్రాన్ని 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లో పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ చుట్టూ కథ సాగుతుంది. హారర్ థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ ఉండే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది” అన్నారు. ఈ మూవీలో కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, కృతి వర్మ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. -
పాత వాహనాలు కొంటున్నారా..? కీలక సూచనలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో దొంగ వాహనాల చలామణికి అడ్డుకట్ట వేయడంతో పాటు, పాత వాహనాల కొనుగోలుదారులను మోసాల నుంచి రక్షించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ కవచ్' ఆకస్మిక తనిఖీల్లో సెకండ్ హ్యాండ్ వాహన డీలర్లు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ గారు సోమవారం కీలక మార్గదర్శకాలతో కూడిన అడ్వైజరీని జారీ చేశారు.సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలపై మోటార్ వాహనాల చట్టం-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989, భారతీయ న్యాయ సంహిత -2023లో ఉన్న నిబంధనలను అడ్వైజరీలో ప్రధానంగా పేర్కొన్నారు. యజమాని వివరాల ధృవీకరణ లేకుండా వాహనాలను కొనుగోలు చేసినా, తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించేందుకు ఒడోమీటర్లను ట్యాంపరింగ్ చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.అడ్వైజరీలోని ప్రధానాంశాలు!● డీలర్లు ఏదైనా పాత వాహనాన్ని కొనుగోలు చేసే ముందు విక్రయదారుడి గుర్తింపును పక్కాగా ధృవీకరించుకోవాలి. ఇందుకోసం విక్రేత ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాల నకలును సేకరించడంతో పాటు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో ఉన్న పేరు, చిరునామాతో వాటిని సరిపోల్చుకోవాలి.● ఒకవేళ అసలు యజమాని కాకుండా వేరొక ప్రతినిధి ద్వారా విక్రయం జరుగుతున్నట్లయితే, చట్టబద్ధమైన పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.● ఒకవేళ విక్రేత గుర్తింపు లేదా వాహన యాజమాన్య వివరాలు సంతృప్తికరంగా ధృవీకరించబడకపోతే.. అటువంటి వాహనాన్ని డీలర్లు తమ వద్దకు తీసుకోవడం గానీ, ప్రకటనలు ఇవ్వడం గానీ లేదా తిరిగి విక్రయించడం గానీ పూర్తిగా నిషేధం.● వాహనం కొనుగోలు చేసే ముందే అది దొంగిలించబడినదా, బ్లాక్ లిస్టులో ఉందా లేదా ఏదైనా ప్రమాదానికి గురైందా అన్న విషయాన్ని వాహన్ పోర్టల్ ద్వారా నిర్ధారించుకోవాలి.● వాహనంపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలానాలు, రోడ్డు పన్ను బకాయిలతో పాటు ఎటువంటి టోల్ గేట్ బకాయిలు లేకుండా చూసుకోవాలి. ఫైనాన్స్ క్లియరెన్స్ వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలి.● ఇతర రాష్ట్రాల వాహనాల విక్రయాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. వాహన్ పోర్టల్ రికార్డులలో సదరు వాహనానికి సంబంధించి ఎటువంటి ఇతర భారాలు లేవని (ఎన్కంబరెన్స్ ఫ్రీ), స్పష్టమైన యాజమాన్య హక్కులు (క్లియర్ టైటిల్) ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే వాహన బదిలీ లేదా డెలివరీ ప్రక్రియ చేపట్టాలి.● వాహనాల ఓడోమీటర్ రీడింగ్లను మార్చడం లేదా ఇంజిన్, ఛాసిస్ నంబర్లను ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరం. తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించి కస్టమర్లను మోసం చేయడం శిక్షార్హమైన నేరం. బాధ్యులపై బిఎన్ఎస్ సెక్షన్ 318తో పాటు వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు ఉంటాయి.● డీలర్లు వాహనాన్ని తమ వద్దకు తీసుకున్నప్పుడు, అలాగే వేరొకరికి డెలివరీ చేసే సమయంలో ఓడోమీటర్ రీడింగ్ను నమోదు చేయడంతో పాటు, ఇంజిన్/ఛాసిస్ నంబర్లను ఫోటో తీసి భద్రపరచుకోవాలి.● మోటారు వాహనాల చట్టం-1988 లోని సెక్షన్ 192A, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్-1989 లోని రూల్ 50 నిబంధనల ప్రకారం.. వాహనంపై కంపెనీ ముద్రించిన ఇంజిన్, ఛాసిస్ నంబర్లను గానీ, ఇతర గుర్తింపు చిహ్నాలను గానీ మార్చడం, చెరపడం, ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరం.● ఒకవేళ ఏ వాహనానికైనా ఈ గుర్తింపు నంబర్లు ట్యాంపరింగ్కు గురైనా లేదా అసలు లేకపోయినా.. ఆ వాహనాన్ని దొంగిలించినదిగా భావించి పోలీసులు తక్షణమే సీజ్ చేస్తారు. అంతేకాకుండా, సదరు వాహనాన్ని తమ వద్ద ఉంచుకున్న రీసెల్లర్లపై ‘భారతీయ న్యాయ సంహిత (BNS)-2023’ సెక్షన్ 317(2) కింద దొంగ సొత్తును కలిగి ఉన్నట్లుగా పరిగణించి కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.● కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) జారీ చేసిన జీఎస్ఆర్ 901(ఇ) (తేదీ: 22 డిసెంబరు, 2022) నిబంధనల ప్రకారం.. సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి లేదా సంస్థ మోటార్ వాహన నిబంధనల (CMVR-1989) రూల్ 48 కింద సంబంధిత ప్రాంతీయ రవాణా అధికారి (RTO) కార్యాలయం నుంచి తప్పనిసరిగా అధికారిక లైసెన్స్ (అథరైజేషన్ సర్టిఫికేట్) పొంది ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు లేకుండా వ్యాపారం సాగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయి.● డీలర్లు తమ వద్ద జరిగే ప్రతి వాహన లావాదేవీకి సంబంధించి డిజిటల్ లేదా రాతపూర్వక రూపంలో ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించాలి. ఈ రిజిస్టర్లో కొనుగోలుదారు, విక్రయదారుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, వారి సంతకాలతో పాటు లావాదేవీ జరిగిన తేదీ, సమయాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలి.● అలాగే వాహనం రిజిస్ట్రేషన్ నంబరు, ఇంజిన్, ఛాసిస్ నంబర్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు.. తిరిగి కస్టమర్కు డెలివరీ ఇచ్చే సమయంలో ఉన్న ఒడోమీటర్ రీడింగ్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.● వాహనం డీలర్ వద్ద ఉన్న సమయంలో జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు లేదా ఇతర దుర్వినియోగాలకు మోటారు వాహన నిబంధనల రూల్ 55ఇ ప్రకారం డీలర్లదే పూర్తి కస్టడీ ఆధారిత బాధ్యత.● మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 2(30) కింద అసలు యజమానికి ఉండే చట్టబద్ధమైన యాజమాన్య బాధ్యతకు ఇది పూర్తిగా భిన్నమైనది. టెస్ట్ డ్రైవ్, సర్వీసింగ్ లేదా ఇతర అవసరాల కోసం వాహనాన్ని బయటకు తీసిన ప్రతిసారీ డ్రైవర్ పేరు, లైసెన్స్ నంబర్, వెళ్లే ఉద్దేశం, ప్రయాణ సమయం, ప్రయాణించిన దూరం (మైలేజీ) వివరాలను 'ఎలక్ట్రానిక్ ట్రిప్ రిజిస్టర్' లో తప్పనిసరిగా నమోదు చేయాలి.● డీలర్ల కస్టడీలో ఉన్నప్పుడు వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా లేదా అసాంఘిక కార్యకలాపాలకు వాడబడినా.. అసలు వాహన యజమాని (ఆర్సీ ఓనర్) అనవసరంగా సివిల్, క్రిమినల్ కేసులతో పాటు మోటారు ప్రమాదాల క్లెయిమ్ల ట్రిబ్యునల్ (MACT) వ్యాజ్యాల్లో చిక్కుకోకుండా రక్షించేందుకే ఈ నిబంధనలను తీసుకువచ్చారు.సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాలలో వాహనాలకు సంబంధించి తప్పుడు ఫోటోలు, అవాస్తవ సమాచారంతో ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకర్షించడం నేరమని సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. ఈ నియమ నిబంధనలను ఉల్లంఘించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు, వారిపై భారతీయ న్యాయ సంహిత లోని దొంగతనం (సెక్షన్ 303), దొంగిలించిన సొత్తును కలిగి ఉండటం (సెక్షన్ 317), మోసం (సెక్షన్ 318), ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం (సెక్షన్ 221/222) కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఈ ప్రక్రియకు అందరూ పూర్తిగా సహకరించాలని కోరారు. -
నా ఇంటిపై దాడి చేసిన వాడిని ఒక్కడినైనా అరెస్ట్ చేశారా..! ఛీ.. మీరు పోలీసులా..?
-
‘కింగ్స్ అండ్ క్వీన్’ ఓ మచ్చుతునక మాత్రమే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొన్ని పబ్బులు అసాంఘిక కార్యకలాపాలకు, దందాలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఈ క్రమంలోనే కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ డెకాయ్ ఆపరేషన్ చేయడంతో మంజీరా మాల్లోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ వ్యవహారం వెలుగులోకి వచి్చంది. స్థానిక పోలీసులతో కుమ్మక్కై తమ వ్యవహారాలు కొనసాగిస్తున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి దందాలకు వ్యవస్థీకృతంగా నడపటంతో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతడితో పాటు అతడు నడిపిన పబ్స్పై గతంలోనూ అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. యువతులను రప్పించి.. ఈ పబ్స్ దందాలో ఏళ్లుగా ఉన్న ఓ వ్యక్తి వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకువస్తున్నాడని తెలిసింది. అలా వచ్చే వారికి బస, భోజనం తదితరాలన్నీ అతడే సమకూరుస్తుంటాడు. ఇక్కడ ఉన్నన్ని రోజులూ వారు వినియోగించడానికి తాత్కాలిక ఫోన్లు, నెంబర్లు వారిని తీసుకువచి్చన వాళ్లే కేటాయిస్తున్నారు. ఓసారి పబ్కు వచి్చన యువకుల ఫోన్ నెంబర్లు ఈ యువతులు తీసుకుంటారు. తమ వద్ద ఉన్న తాత్కాలిక నెంబర్లకు వారికి ఇస్తారు. ఇలా నిత్యం వారితో చాటింగ్ చేస్తూ పదేపదే అదే పబ్కు వచ్చేలా ఆకర్షిస్తుంటారు. ఇలా చేసిందుకు నిర్వాహకులు వీరికి అదనంగా చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో కస్టమర్ చేసిన బిల్లు నుంచి కమీషన్ కూడా ఇస్తారు. దీనికి అదనంగా ఆయా యువకుల నుంచి ఈ యువతులు కంపెనీ ఇచి్చనందుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తుంటారు. కొన్ని చోట్ల శ్రుతి మించి..ఈ యువతీ యువకుల వ్యవహారాలు పబ్లకు ఆకర్షించడం, మద్యం తాగడం.. తాగించడం, డ్యాన్సులతో ఆగట్లేదు. ఇదే అదనుగా ద్వితీయ, తృతీయ శ్రేణులకు చెందిన కొన్ని పబ్స్లో అసాంఘిక కార్యకలాపాలు శ్రుతి మించుతున్నాయి. దీనికోసం ఆయా చోట్ల ఏకాంత ప్రదేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అదనంగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ యువతుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై ఈ దందాలతో పాటు ఓ డ్యాన్సర్తో అసభ్యంగా ప్రవర్తించిన కేసు కూడా నమోదైనట్లు తెలిసింది. అతడి వ్యవహారాలు ఆయా ఠాణాలకు చెందిన అధికారులకు తెలిసినా ‘అనివార్య కారణాల’ నేపథ్యంలో మిన్నకుండిపోతున్నారని సమాచారం. ఇకపైనా టాస్్కఫోర్స్, ఎస్ఓటీలతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు పబ్స్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. -
కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో డీసీపీ రితిరాజ్ స్పై ఆపరేషన్
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతంలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా ఆపరేషన్ నిర్వహించారు. సెక్యూరిటీని తప్పించుకుని పబ్లోకి ప్రవేశించి, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ప్రత్యక్షంగా గమనించారు.డీసీపీ స్వయంగా పబ్ యాక్టివిటీని చిత్రీకరించి, వెంటనే లోకల్ పోలీసులను పిలిపించారు. అనంతరం సోదాలు నిర్వహించి, పబ్లో పనిచేస్తున్న సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో మొత్తం 9 నుంచి 10 మంది సిబ్బంది అరెస్టు అయ్యారు. యాజమాన్యం యువతుల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కూకట్పల్లి ప్రాంతంలో పబ్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
యువతుల ద్వారా కస్టమర్లకు వల వేస్తున్న పబ్ యాజమాన్యం
-
హైదరాబాద్: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..
-
విమానంలో లగేజీ గొడవ, పోలీసు చేయి కొరికేసింది
విమాన ప్రయాణాల్లో ప్రయాణికులకు చాలా టెన్షన్ ఉంటుంది. విమానంలో ఎలాంటి వస్తువులు తీసుకెళ్లవచ్చు అనే సందేహాలు మొదలు, సయానికి సెక్యూరిటీ చెకప్ ముగించుకుని గేట్లోకి వెళ్లడం, లగేజీ నిర్దేశించిన బరువులో ఉందా లేదా చూసుకోవడం దాకా చాలా తతంగమే ఉంటుంది. ముఖ్యంగా పరిమితి కంటే లగేజీ బరువు కాస్త ఎక్కువైనా ప్యాసెంజర్లకు చుక్కలే. అదనపు చార్జీల (Excess baggage fee) మోత మోగుతుంది. ఇక్కడే చాలా వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఇటీవల అర్జెంటీనాలోని ఒక విమానాశ్రయంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఎక్స్ట్రా లగేజీ ఫీజుకు సంబంధించిన హైడ్రామా ఊహించని రేంజ్కి చేరింది.అసలేం జరిగింది?‘మిర్రర్ యూకే’ కథనం ప్రకారం.. అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరెస్ (Buenos Aires) లో గ ‘జార్జ్ న్యూబెరీ ఎయిర్పార్క్’ లో జెట్స్మార్ట్ (JetSmart) విమానంలో ఈ సంఘటన జరిగింది. కొర్డోబాకు వెళ్లాల్సిన ఆ విమానం ఎక్కేందుకు ఒక మహిళా ప్రయాణికురాలు వచ్చింది. అయితే, ఆమె పరిమితికి మించి క్యాబిన్ లగేజీని తీసుకురావడంతో, దానికి అదనపు రుసుము చెల్లించాలని ఎయిర్పోర్ట్ సిబ్బంది కోరారు. దానికి ఆమె నిరాకరించడంతో బోర్డింగ్ గేట్ వద్ద వివాదం మొదలైంది.గేట్ వద్ద గొడవ జరుగుతున్నప్పటికీ, ఆమె సిబ్బంది కళ్లుగప్పి ‘ఫ్లైట్ JA 3104’ లోపలికి వెళ్ళిపోయింది. ప్రామాణిక బోర్డింగ్ నియమాలను ఉల్లంఘించి ఆమె విమానం ఎక్కేసిందని గ్రహించిన సిబ్బంది, వెంటనే భద్రతా సిబ్బందిని ఎలర్ట్ చేశారు.నిజానికి బోర్డింగ్ గేట్ వద్దే ముగిసిపోవాల్సిన ఈ గొడవ, ఆమె విమానం లోపలికి వెళ్లడంతో మరింత వివాదాస్పందగా మారింది. అప్పటికే ప్రయాణికులంతా తమ సీట్లలో కూర్చుని, విమానం టేకాఫ్కు సిద్ధమవుతోంది. ఆ సమయంలో పోలీసులు విమానంలోకి ప్రవేశించి, ఆమెను కిందకు దించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ఆ మహిళ ఒక్కసారిగా ఒక మహిళా పోలీస్ అధికారిణి కుడి చేతిపై గట్టిగా కొరికింది. ఈ ఊహించని ఘటనతో విమానంలోని ప్రయాణికులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడుతీవ్ర ఘర్షణ తర్వాత ఎయిర్పోర్ట్ పోలీసుల ఎట్టకేలకు ఆమెను నియంత్రించి, విమానం నుండి కిందకు దించేశారు. దీనిపై అర్జెంటీనా 'నేషనల్ క్రిమినల్ అండ్ కరక్షనల్ ఫెడరల్ కోర్ట్ నెం. 3' ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. గాయపడిన మహిళా అధికారిణి, షిఫ్ట్ సూపర్వైజర్, జెట్స్మార్ట్ విమాన సిబ్బంది నుండి దర్యాప్తు అధికారులు స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ప్రస్తుతం కోర్టు ఈ కేసును పరిశీలిస్తోంది.ఇదీ చదవండి: సీజేపీ ధర్నాలో ఆసక్తికర డిమాండ్, విద్యామంత్రిగా ఆయన? -
స్పా సెంటర్ల ముసుగులో దారుణాలు
-
గోపిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
సాక్షి, గుంటూరు: నరసరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటివద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఇంటినుంచి బయటకు వచ్చిన గోపిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి మధ్య తోపులాట జరిగింది.దీంతో పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అవినీతిపై బహిరంగ చర్చకు గోపిరెడ్డి సిద్ధమవ్వగా.. కోటప్పకొండ వెళ్లకుండా గోపిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై చర్చకు భయమెందుకంటూ ప్రశ్నించారు.కాగా, నియోజకవర్గంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన అధికార, ప్రతిపక్ష నాయకులు ఎవరి పావులు వారు కదుపుతున్నారు. అందులో భాగమే సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు ఒకరినొకరు ప్రజలకు తాము చేసిన సేవలను ప్రజలకు తెలియచేయాలని నిర్ణయించారు.నియోజకవర్గంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది, అందజేసిన సంక్షేమంపై శుక్రవారం చర్చించేందుకు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిద్ధమయ్యారు. అభివృద్దిపై తొలుత సవాల్ విసిరింది డాక్టర్ చదలవాడే. దీనికి స్పందించిన డాక్టర్ గోపిరెడ్డి.. చర్చకు తాను సిద్ధమని, ఆ చర్చా వేదిక పట్టణంలోని టౌన్హాలు లేదా కోటప్పకొండ వేదికగా ఉంటే బాగుంటుందని సూచించారు.దీనిపై గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తానూ కోటప్పకొండ వేదికగా సిద్ధమేనని డాక్టర్ చదలవాడ పేర్కొన్నారు. దీనిపై డాక్టర్ గోపిరెడ్డి స్పందిస్తూ కోటప్పకొండ దిగువ భాగంలో చర్చకు ఏర్పాట్లు చేయాలని, తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.2019–24 మధ్యలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా నియోజకవర్గ ప్రజలకు తాము రూ.2476 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమం అందజేసినట్లు ఇప్పటికే డాక్టర్ గోపిరెడ్డి ప్రకటించారు. పేదలందరికీ ఇళ్లు పథకం పరిశీలిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో 14,700 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కరికీ ఇళ్ల పట్టా అందజేయలేదు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితులకు రూ.7.45 కోట్లు అందజేశారు.జగనన్న విద్యాదీవెన ద్వారా 22,243 మంది విద్యార్థులకు రూ.70.7 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. వసతి దీవెన ద్వారా మరో రూ.18 కోట్లు అందజేశారు. సుమారు రూ.74 కోట్ల వ్యయంతో రోడ్లను అభివృద్ధి చేశారు. పింఛన్ కానుక ద్వారా రూ.356.32 కోట్లు, అమ్మ ఒడికి రూ.119,80 కోట్లు, రైతు భరోసా కింద రూ.138.76 కోట్లు, డ్వాక్రా రుణమాఫీ ద్వారా రూ.144 కోట్లు, రుణాలు రూ.975 కోట్లు, నాడు–నేడు ద్వారా రూ.31.78 కోట్లు, 42 గ్రామ సచివాలయాల నిర్మాణానికి రూ.16.35 కోట్లు, 36 హెల్త్ క్లినిక్లకు రూ.6.82 కోట్లు, 31 ఆర్బీకేలను రూ.6.75 కోట్లు, విద్యుత్ సబ్స్టేషన్లకు రూ.13 కోట్లు, 11 కమ్యూనిటీ సెంటర్లను రూ.7.13 కోట్లను ఖర్చు చేశారు.మిల్క్కసెంటర్లు రూ.6.13 కోట్లు, నాలుగు ప్రైమరీ హెల్త్ సెంటర్లకు రూ.6.07 కోట్లు, రూ.80 లక్షల వ్యయంతో అర్బన్ హెల్త్కేర్ సెంటర్, 2,718 మంది విద్యార్థులకు ట్యాబ్లు, పలు పాఠశాలల్లో టచ్ర్స్కీన్లు 148, స్మార్టు టీవీలు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ తాగునీటికి రూ.78 కోట్లు, జేఎన్టీయూ నిర్మాణానికి రూ.150 కోట్లు , 34.68 కి.మీ. సీసీ రోడ్లు, 15 కి.మీ. సీసీ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. -
మాటలు జాగ్రత్త... సీదిరి అప్పల రాజు Vs SI
-
YSRCP vs POLICE గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
-
ఫ్యాన్స్కి షాక్.. వేడుకలకు పోలీసులు నో..?
బెంగళూరు: ఐపీఎల్- 19 విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. విన్నింగ్ సెలబ్రేషన్స్ను పబ్లిక్ రోడ్లపై వేడుకలు జరుపుకోవడాన్ని నిషేధించారు. 2025లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్సీబీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలో అత్యధికంగా ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుగా ఆర్సీబీకీ మంచి రికార్డుంది. ఇక వారి స్వంత రాష్ట్రంలో అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్కు అక్కడి పోలీసులు షాక్ ఇచ్చారు. భద్రతా కారణాల రీత్యా బెంగళూరు నగర వీధుల్లో బహిరంగ వేడుకలను పోలీసులు నిషేధించారు. గతేడాది జరిగిన ఘోర తొక్కిసలాట సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సిటీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ "బెంగళూరు సిటీ పోలీస్ ప్రేక్షకులు, అభిమానులకు వీధుల్లో బహిరంగంగా వేడుకలు జరుపుకోవద్దని, ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని అడ్వైజరీ జారీ చేసింది. మేము వాహనాలను తనిఖీ చేస్తున్నాము. బహిరంగ వేడుకలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించము. ఎవరైనా వేడుకలు జరుపుకోవాలనుకుంటే, వారు తమ ఇళ్ల లోపలే జరుపుకోవచ్చు," అని పేర్కొన్నారు. కాగా గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సమయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంతో వేలాది మంది అభిమానులు ఎం. చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో సంబరాల కోసం గుమిగూడారు. అపరిమితంగా వచ్చిన ఈ జనసందోహం వల్ల ఘోర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అభిమానులు మృతి చెందారు. -
780 మందిని అరెస్టు చేసిన పోలీసులు
పారిస్ సెయింట్-జెర్మైన్ ఛాంపియన్స్ లీగ్ ముగిసిన తర్వాత హింస చెలరేగిన విషయం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరిగిన ఫైనల్లో పారిస్ సెయింట్-జెర్మైన్ విజయం సాధించడంతో వేలాది మంది పారిస్ వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఆ సమయంలో కొన్ని గ్రూపులు పోలీసులతో ఘర్షణలకు దిగాయి. గత ఏడాది పారిస్ సెయింట్-జెర్మైన్ ఇదే పోటీని గెలిచిన సమయంలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంతో ఫ్రాన్స్ అంతటా సుమారు 22,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అయినప్పటికీ ఇప్పుడు కూడా హింస చెలరేగింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 780 మందిని అరెస్టు చేసినట్లు ఫ్రెంచ్ అధికారులు ఆదివారం ప్రకటించారు. వారిలో 450 మందికి పైగా ఇప్పటికీ తమ అదుపులోనే ఉన్నారని తెలిపారు. వారు భద్రతా సిబ్బందే లక్ష్యంగా నిందితులు బాణసంచాను విసేరేశారని చెప్పారు. అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ న్యునెన్జ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 57 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. ఫ్రాన్స్ అంతటా ఫుట్బాల్ అభిమానులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో మొత్తం 219 మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు. పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. 25 వయస్సు ఉన్న ఓ యువకుడు తన మోటోక్రాస్ బైక్పై పారిస్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ర్యాంప్ వద్ద కాంక్రీట్ బ్లాక్లను ఢీకొట్టి మరణించాడు. ఓ వివాదంలో కత్తి దాడికి గురైన మరో యువకుడు పారిస్లో తీవ్రంగా గాయపడ్డాడని ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.దేశవ్యాప్తంగా సుమారు 15 నగరాల్లో దొంగతనాలు, దోపిడీలు జరిగాయని, 71 మున్సిపాలిటీల్లో హింసాత్మక ఘటనలు నమోదయ్యాయని పేర్కొంది. గత ఏడాది పారిస్ సెయింట్-జెర్మైన్ ఛాంపియన్స్ లీగ్ విజయం తర్వాత జరిగిన వేడుకలతో పోల్చితే ఈ సారి అరెస్టుల సంఖ్య 32 శాతం పెరిగిందని చెప్పింది. పారిస్ రాజధానిలో బస్సు, రైలు సేవలకు అంతరాయం కలిగించేలా చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు వేలాది మంది పోలీసులను మోహరించారు. ఆదివారం ఈఫిల్ టవర్ సమీపంలో జరిగే విజయోత్సవ ర్యాలీ భద్రత కోసం సుమారు 6,000 మంది పోలీసులను మోహరించారు. -
ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు.. 8 మంది అరెస్ట్
ఢిల్లీ పోలీసులు పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీం, షాజాద్ భట్టి నెట్వర్క్తో సంబంధం ఉన్న ఎనిమిది మంది ఉగ్రవాదులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేశారు. వారి వద్ద కీలకమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం, విజయ్ అలియాస్ షూటర్కు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్లలో ఉగ్రవాద, నేర కార్యకలాపాలు నిర్వహించే కీలక బాధ్యతను పాక్ ఉగ్రవాద సంస్థ అప్పగించింది. దీంతో ఢిల్లీ-ఎన్సిఆర్లోయూలో ఉగ్రవాదులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పంజాబ్, చండీగఢ్లలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు, మంత్రిత్వ శాఖలు, భద్రతా దళాలపై దాడులకు వారు కుట్ర పన్నుతున్నారని పోలీసులు తెలిపారు. నిందితులందరూ పాకిస్తాన్, దుబాయ్లలోని హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నారన్నారు. వీరిలో ప్రధాన నిందితుడి కోసం గాలింపులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అరెస్టయిన నిందితుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన విజయ్ అలియాస్ షూటర్, జార్ఖండ్కు చెందిన నితీష్ పాశ్వాన్, మహారాష్ట్రకు చెందిన తౌకీర్ రిజ్వాన్ అహ్మద్ షేక్ మరియు సాజిద్ మెహబూబ్ షేక్ అలియాస్ అర్బాజ్ ఖాన్, పంజాబ్కు చెందిన హర్విందర్ సింగ్, గగన్దీప్ సింగ్, మంజీత్ సింగ్, నేపాల్ పౌరుడు అంగ్ కమీ లామాలు ఉన్నారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఒక పిస్తోల్, మందుగుండు సామాగ్రి, గ్రానైట్లు, బైకులు, మెుబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
పెద్ది మేకర్స్ దూకుడు.. అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు..!
రామ్ చరణ్ పెద్ది మేకర్స్ రిలీజ్కు ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మూవీ పైరసీ, లీక్ విషయంలో మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించగా.. వీరికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో ముందస్తు లీక్లు కాకుండా చర్యలకు మార్గం సుగమమైంది.తాజాగా పెద్దిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు దిగింది. ఈ సినిమాపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. గుంటూరు, హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నట్లు పెద్ది టీమ్ దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులకు మేకర్స్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు సోషల్ మీడియా కార్యకలాపాలపై పెద్ది మూవీ టీమ్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
లేడీస్ హాస్టల్లో రహస్య ఫొటోలు.. ప్రియుడికి పంపిన మహిళ!
స్నేహితురాళ్ల అశ్లీల ఫొటోలు తీసి ప్రియుడికి పంపిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి టౌన్ ప్రాంతానికి చెందిన మకరజ్యోతి (39) అనే మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయిన ఆమె, పాలయంకోట్టైలోని ఒక ప్రైవేట్ మహిళా హాస్టల్లో గది అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆ సమయంలో కోయంబత్తూరుకు చెందిన ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో హాస్టల్లో తనతో పాటు ఉంటున్న ఇతర మహిళల రోజూవారి కార్యకలాపాలను వారికి తెలియకుండానే మకరజ్యోతి సెల్ఫోన్లో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా తీసిన అశ్లీల చిత్రాలను ఆమె కోయంబత్తూరులో ఉన్న తన ప్రియుడికి పంపుతున్నట్టు తెలిసింది. హాస్టల్ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహిళా పోలీసులు విచారణ చేశారు. విచారణలో తోటి మహిళలను అశ్లీలంగా ఫొటోలు తీసినట్లు నిర్ధారణ కావడంతో, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. -చెన్నై -
భార్యను రూ.50 వేలకు అమ్మేసి..
బనస్కాంత: గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో జరిగిన ఒక అమానవీయ ఘటన సమాజానికి తలవుంపులు తెచ్చింది. రూ. 50 వేల కోసం భార్యను స్నేహితులకు అమ్మేసి, ఆమెపై 10 రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిగేలా చేసిన ఒక దుర్మార్గుడి ఉదంతం అందరినీ నివ్వెరపోయేలా చేస్తోంది.మిస్సింగ్ డ్రామాతో..మే 11న తన భార్య అదృశ్యమైందని పాలన్పూర్ పశ్చిమ పోలీస్ స్టేషన్లో సదరు భర్త ఫిర్యాదు చేశాడు. అయితే, రెండు రోజుల తరువాత అతను కూడా అదృశ్యం కావడంతో, అనుమానం వచ్చిన అతని తండ్రి పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు భర్త తీరుపై వారికి అనుమానం తలెత్తింది. దీంతో వారు ప్రణాళికతో దర్యప్తు నిర్వహించి, నిందితుని నోటి నుంచే నేరాన్ని కక్కించారు.10 రోజుల నరకంపోలీసులు నిందితుడిని, ఆ తర్వాత బాధితురాలిని గుర్తించి విచారించగా, విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. తన భార్యను స్నేహితులకు రూ. 50 వేలకు అమ్ముకున్నట్లు విచారణలో తెలిపాడు. ఆ పది రోజులు ఆమెను బందీని చేసి, పదేపదే లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా, ఆమె ఒంటిపై ఉన్న నగలను కూడా దోచుకుని అమ్మేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారం, మానవ అక్రమ రవాణా, నేరపూరిత కుట్ర వంటి తీవ్రమైన సెక్షన్ల కింద భర్తపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన భర్తతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి గతంలో కూడా బాలికలను లోబర్చుకుని, కిడ్నాప్ చేసిన క్రిమినల్ చరిత్ర ఉందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిగ్నేష్ గామిత్ తెలిపారు. -
Mumbai: హౌసింగ్ సొసైటీలో బక్రీద్ వివాదం.. రంగంలోకి పోలీసులు!
ముంబై: మహానగరం ముంబైలోని మీరా రోడ్ ప్రాంతంలో గల ఒక హౌసింగ్ సొసైటీలో బక్రీద్ నేపథ్యంలో మేకల క్రయవిక్రయాలు, బలి ఇచ్చే అంశంపై తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సొసైటీ ఆవరణలో బలి కోసం మేకలను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు స్థానికులు, బజరంగ్దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు.వివాదం మొదలైంది ఇలా..మీరా రోడ్లోని 'పూనం క్లస్టర్ 1' హౌసింగ్ సొసైటీలో 550కి పైగా ఫ్లాట్లు ఉన్నాయి. ఏటా బక్రీద్ సందర్భంగా ముస్లిం కుటుంబాలు మేకలను తెచ్చి బలి ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈసారి సొసైటీలో తాత్కాలిక షెడ్ వేయడంపై కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బజరంగ్దళ్ కార్యకర్తలను సొసైటీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి కత్తితో దాడి చేయగా, అడ్డుకోబోయిన హర్ష సింగ్ అనే కార్యకర్త చేతికి గాయాలయ్యాయి.పోలీసుల పహారా.. ఉద్రిక్త వాతావరణందాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అదనపు బలగాలతో సొసైటీ పరిసరాల్లో మోహరించారు. మంగళవారం మధ్యాహ్నం సుమారు 100 మందికి పైగా బజరంగ్దళ్ సభ్యులు సొసైటీ బయట హనుమాన్ చాలీసా పఠిస్తూ ఆందోళన చేశారు. ఉద్రిక్తతలు పెరగడంతో ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. ఇంతలో బజరంగ్దళ్ సభ్యులు పందిని లోపలికి తీసుకువచ్చే ప్రయత్నం చేయగా, పోలీసులు వెంటనే అడ్డుకుని వారిని చెదరగొట్టారు.పరిష్కారం దిశగా..పరిస్థితిని చక్కదిద్దేందుకు మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలతో చర్చలు జరిపి, మున్సిపాలిటీ కేటాయించిన ప్రత్యేక ప్రాంతానికి మేకలను తరలించాలని నిర్ణయించారు. అనంతరం అక్కడి నుంచి మేకలను తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, దాడికి సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ వివాదంపై స్థానిక రాజకీయ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.ఇది కూడా చదవండి: హమాస్ మిలిటరీ చీఫ్ హతం.. ఇజ్రాయెల్ ప్రకటన! -
ఏపీ పోలీసుల బరితెగింపు
-
తండ్రిని చంపాడనే కక్షతోనే హత్య
సూర్యాపేటటౌన్: సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇరవై ఏళ్ల క్రితం తన తండ్రి మిద్దె రవీందర్ను చంపాడనే కక్షతోనే ఆయన కుమారుడు మిద్దె జీవన్తోటు మరో ఐదుగురు కలిసి చింతలపాటి మధును హత్య చేసినట్టు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ కేసు వివరాలను సోమవారం ఎస్పీ విలేకరులకు వెల్లడించారు. చింతలపాటి మధు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య మౌనిక సూర్యాపేట టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా.. శనివారం తెల్లవారుజామున యర్కారం శివారులోని కల్వర్టు కింద గోనె సంచిలో మధు మృతదేహాన్ని గుర్తించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాళ్లగడ్డలోని ఓ ఇంట్లో హత్య జరిగినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. సోమవారం ఉదయం విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై టేకుమట్లలో ప్రధాన నిందితుడు మిద్దె జీవన్తోపాటు మిద్దె ఆనంద్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కుట్ర బయటపడింది.మిద్దె రవీందర్ హత్యకు ప్రతీకారంగా..: 2007లో అప్పటి యర్కారం సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య జరగ్గా.. ఆ కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో రవీందర్ కుమారుడు మిద్దె జీవన్ తన తండ్రిని హత్య చేసిన మధును ఎలాగైనా చంపాలనుకున్నాడు. జీవన్ తన స్నేహితులు చింత సైదులు, మేదరి ప్రసాద్ల సాయం తీసుకున్నాడు. శుక్రవారం దావత్ ఉందని చెప్పి మధును సైదులు, ప్రసాద్ తాళ్లగడ్డలో సైదులు అద్దెకు తీసుకున్న ఇంటికి పిలిపించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే మద్యం సేవించారు.మధు మద్యం మత్తులో ఉండగా.. జీవన్తోపాటు మిద్దె ఆనంద్ అక్కడకు చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన వెంటనే ప్రసాద్ మధు చేతులు, కాళ్లు పట్టుకోగా.. మటన్ కొట్టే కత్తితో సైదులు మధుపై దాడి చేశాడు. వెంటనే ఆ కత్తిని తీసుకున్న జీవన్ మధు మెడ, ముఖం, భుజాలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. హత్య అనంతరం మధు మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి యరా>్కరం శివారులోని కల్వర్టు కింద పడేశారు. మధు బైక్ను మరో ప్రాంతంలో వదిలేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్ఫోన్లను అడివెంల సమీపంలోని కాల్వలో పడేసి పరారయ్యారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా, ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, బైక్, ఐదు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. భవాని పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. -
బంగారం రికవరీ పేరిట దంపతులకు పోలీసుల వేధింపులు!
తెనాలి రూరల్: బంగారు ఆభరణాల రికవరీకి తనను, తన భర్తను పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ కొట్టి వేధించారని ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. బాపట్ల జిల్లా కూచిపూడికి చెందిన కటారి తిరుపతమ్మ, సాయిబాబు దంపతులు తెనాలిలో ఉంటున్నారు. కొత్తపేటలోని సువర్ణ అపార్ట్మెంట్లో సాయిబాబు వాచ్మన్. తిరుపతమ్మ అదే అపార్ట్మెంటులోని ఇళ్లలో పనులు చేసుకుంటోంది. అపార్ట్మెంట్లో ఉండే స్వర్ణలత అప్పుడప్పుడూ తిరుపతమ్మ దంపతులకు బంగారు వస్తువులను ఇచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తెప్పించుకుంటూ ఉండేది.ఈ క్రమంలో తిరుపతమ్మ దంపతులు బంగారాన్ని విడిపించి ఇవ్వకుండా తనను మోసం చేశారని స్వర్ణలత వారం క్రితం పోలీస్స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీనిపై తిరుపతమ్మ దంపతులను స్టేషన్కు పిలిపించి పోలీసులు ఇటీవల విచారించారు. మళ్లీ పిలిచినప్పుడు రావాలని పంపేశారు. ఆ తర్వాత తిరుపతమ్మ మారీసుపేటలో తన అత్తయ్య వాచ్మన్గా ఉంటున్న ఓ అపార్ట్మెంటుకు శనివారం వెళ్లింది. నేరం ఒప్పుకోవాలంటూ పోలీసులు తనను కొట్టి వేధించారని సెల్ఫీ వీడియో తీసుకుని గడ్డిమందు తాగింది. ఈ విషయం తెలిసిన సాయిబాబు ఆమెను తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాడు.మెరుగైన చికిత్స కోసం ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కాగా, పోలీసులు శనివారం రాత్రి పొద్దుపోయాక సాయిబాబు నుంచి తీసుకున్న స్టేట్మెంట్లో..స్వర్ణలతకు బంగారం ఇవ్వాల్సింది నిజమేనని అంగీకరించారు. తమను అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని సాయిబాబు చెప్పారు. కాగా, తిరుపతమ్మ దంపతులను పిలిపించి మాట్లాడామని వారిని వేధించడం, కొట్టడం చేయలేదని వన్ టౌన్ సీఐ సీహెచ్.రాంబాబు ’సాక్షి’కి తెలిపారు. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
నారాయణఖేడ్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎల్గోయి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ హత్య ఉదంతం తొమ్మిది రోజుల అనంతరం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మనూరు మండల కేంద్రానికి చెందిన కల్పనకు నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన చంబనోళ్ల ముత్యంరెడ్డి (36)తో 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పదేళ్లలోపు కూతురు, కుమారు డు ఉన్నాడు.మృతుడు ముత్యంరెడ్డి నారాయణఖేడ్ పట్టణంలో మోటారు వైండింగ్ మెకానిక్గా పనిచేస్తున్నా డు. కల్పన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసి ఈ మధ్య కాలంలో ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా చేరింది. కాగా ఈ నెల 16వ తేదీ నుంచి ముత్యంరెడ్డి కనిపించకుండా పోయాడు. దీంతో తన భర్త కనిపించడం లేదని కుటుంబీకులతో కలిసి కల్పన నారాయణఖేడ్ పోలీస్స్టేషన్లో ఈ నెల 18న ఫిర్యాదు చేసింది.పోలీసులు ముత్యంరెడ్డి కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో కేసును సవాల్గా తీసుకున్నారు. భార్య కల్పన ఫోన్ కాల్స్పై నిఘాపెట్టగా 16న తన ప్రియుడైన మనూరు మండలం ఎల్గోయికి చెందిన గైని పండరి అలియాస్ చింటుతో చాలా సార్లు ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా ముత్యంరెడ్డిని హత్యచేసి ఎల్గోయిలోని పండరి చేనులో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు నేరం అంగీకరించారు. పోలీసులు ఆదివారం గోతిలోంచి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్వకేట్ హత్యలో కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: మసబ్ ట్యాంక్ పరిధిలో దారుణహత్యకు గురైన అడ్వకేట్ మెుయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు కీలక ఆదారాలు సేకరించారు. అడ్వకేట్ హత్యలో ఆరుగురు నిందితులు పాల్గొన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ హత్యకు వాడింది స్కార్పియో వాహనంగా గుర్తించి ఆ యజమానిని ప్రశ్నించారు. అయితే ఆ వాహనాన్ని ఆరునెలల క్రితమే తాను వేరే వ్యక్తులకు అమ్మానని కానీ కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని యజమాని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ వాహనం ఎవరు కొనుగోలు చేసిన వ్యక్తి ఏవరా అనే విషయం పోలీసులు విచారణ చేస్తున్నారు.కాగా నిన్న( శనివారం) మాసబ్ట్యాంక్ పరిధిలో ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాక్రోచ్ జనతా పార్టీ.. అభిజిత్ దిప్కే ఇంటికి పోలీసుల భద్రత
ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ. సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చి కేవలం ఒక వారం వ్యవధిలోనే ప్రధాన పార్టీల సోషల్ మీడియా సభ్యత్వాన్ని దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నివాసానికి పోలీసులు భద్రత కల్పించారు. అతని నివాసం వద్ద అవాంచనీయ ఘటనలు జరగకుండా నిరంతరం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీకేజీలు, విద్యా సంబంధిత సమస్యలపై మీమ్స్,రాజకీయ వ్యాఖ్యానాల ద్వారా గతవారం సోషల్మీడియాలో పురుడుపోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ కొద్ది రోజుల్లోనే రెండుకోట్లకు పైగా ఫాలోవర్స్ను దాటిపోయింది. సీజేఐ ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన వాఖ్యల నేపథ్యంలో ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతాపార్టీ సంచలనం సృష్టిస్తున్ననేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఇంటికి పోలీసులు రక్షణ కల్పించారు. అతని నివాసం వద్ద రద్దీ లేకుండా చూసేందుకు, ఎంఐడీసీ వాలుజ్ ప్రాంతంలోని ఆయన నివాసానికి తాము ఇరవై నాలుగు గంటల సాధారణ పోలీసు భద్రతను కల్పించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ అతుల్కర్ తెలిపారు. అంతేకాని ఎటువంటి బెదిరింపులు దీనికి కారణం కాదని పేర్కొన్నారు. కాగా కాక్రోచ్ జనతా పార్టీకి పాకిస్థాన్, బిలియనీర్ జార్జ్ సోరోస్ నెట్వర్క్ల నుంచి మద్దతు లభిస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈ ఆరోపణలను కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఖండించారు. మా పార్టీకి పాకిస్థాన్తో ఎలాంటి సంబంధం లేదు. కేంద్రమంత్రి చేసిన ఆరోపణలు నిరాదారమైనవన్నారు. పార్టీ ఉద్దేశ్యం కేవలం భారతీయ ప్రజల సమస్యలను వినిపించడం, యువతలో అవగాహన పెంచడమేనని స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీకి కేవలం భారత్లోనే 94శాతం మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిపారు. పార్టీ డిజిటల్ ఉద్యమంపై విస్తృతమైన అణచివేత జరుగుతోందని, తమ సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ, వెబ్సైట్ను తొలగించారని లేదా హ్యాక్ చేశారని, దీంతో తమ అధికారిక వేదికల్లో దేనికీ తమకు ప్రాప్యత లేకుండా పోయిందని అభిజిత్ దిప్కే ఆరోపించారు. -
ముంబై రోడ్లపై భిక్షాటన చేస్తూ దొరికిన మెడికో
నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన 25 ఏళ్ల వైద్య విద్యార్థి 47 రోజుల పాటు అదృశ్యమై, చివరకు ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ పోలీసుల కంటపడ్డాడు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ యువకుడు, ఇన్ని రోజుల తరువాత తన కుటుంబానికి చేరువకావడంతో స్థానికలు కంట తడి పెట్టుకున్నారు.నాందేడ్ జిల్లాకు చెందిన అభయ్ సురేష్ బెల్కోని, హోమియోపతి మెడిసిన్ (బీహెచ్ఎంఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఏప్రిల్ 4న జల్గావ్లోని తన కళాశాలకు బయలుదేరిన అభయ్, దారిలో తన బ్యాగ్, ఫోన్ ముఖ్యమైన పత్రాలను పోగొట్టుకున్నాడు. తరువాత ముంబైకి చేరుకున్న అతను, ఆకలి తట్టుకోలేక రోడ్ల మీద బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు. అభయ్ అదృశ్యంపై అతని కుటుంబ సభ్యులు ఏప్రిల్ 6 నుండే తీవ్ర ఆందోళన చెందుతూ, మే 16న తమ్సా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ముంబై పోలీసుల చొరవతో..ముంబైలోని మలాడ్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన యాంటీ-బెగ్గింగ్ (బిచ్చగాళ్లపై) డ్రైవ్లో అభయ్ పోలీసులకు దొరికాడు. అతను శారీరకంగా చాలా బలహీనంగా ఉండటమే కాకుండా, మానసిక పరిస్థితి సరిగా లేక తన గురించి స్పష్టంగా చెప్పలేకపోయాడు. అయినప్పటికీ, పోలీసులు ఎంతో ఓపికగా ప్రయత్నించి, అతని పేరు, ఊరు వివరాలను సేకరించారు. ఆ వివరాలను నాందేడ్ పోలీసులకు తెలియపరచగా, అతను గల్లంతైన విద్యార్థి అని నిర్ధారణ అయ్యింది. అభయ్ దొరికిన విషయాన్ని పోలీసులు అతని తండ్రికి తెలియజేశారు. 47 రోజుల సుదీర్ఘ వేదన తర్వాత, తన కుమారుడు క్షేమంగా తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. -
ఆమె వచ్చింది.. పెళ్లి చేస్తాం.. ఇక కిందకి దిగు!
కర్ణాటక: పాగల్ ప్రేమికుని వ్యవహారం తీవ్ర రచ్చకు కారణమైంది. ప్రియురాలు పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడు విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి నానా రభస సృష్టించాడు. ఈ సంఘటన బెంగళూరు శివార్లలో ఆనేకల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక చిన్నయ్యనపాళ్యకు చెందిన సోమశేఖర్ అనే యువకుడు విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కారు. మూడేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆమె ఇప్పుడు ప్రేమ, పెళ్లికి తిరస్కరించిందని బాధితుడు తెలిపాడు. జనం అతన్ని కిందకు దిగమని కేకలు వేసినా దిగేది లేదని చెప్పాడు. ఇది తెలిసి విద్యుత్ సిబ్బందిని కరెంటును నిలిపివేసి ఆనేకల్ పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు ఎంతగా అతన్ని కోరినా.. ప్రియురాలు ఇక్కడికి వచ్చేవరకు దిగేది లేదని సోమశేఖర్ గట్టిగా కేకలు వేశాడు.యువతిని రప్పించిదీంతో పోలీసులు సదరు యువతిని తాళి, పసుపు కుంకుమ తీసుకుని రావాలని చెప్పగా ఆమె, తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. నీ ప్రియురాలు వచ్చిందని, ఆమెతో వివాహం బాధ్యత తమదే అని, నిన్ను ఎవరూ ఏమి చేయరు, కిందికి వచ్చేయాలని మైకులో పోలీసులు ప్రకటించారు. అయితే అతనికి టవర్ను ఎక్కినంత సులువుగా దిగడానికి రాలేదు. తాడు కట్టి కిందకు దిగడానికి సహాయం చేశారు. చివరకు క్షేమంగా దిగడంతో కథ సుఖాంతమైంది. సోమశేఖర్ అంతకుముందే ఇంటి పైకెక్కి షీట్లు పగలగొట్టి హంగామా చేశాడని స్థానికులు తెలిపారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. -
సీసీటీవీతో పాక్కు కీలక సమాచారం.. గుట్టురట్టు
చండీగఢ్: పంజాబ్ పోలీసులు పాకిస్థాన్ కుతంత్రాన్ని తిప్పికొట్టారు. పఠాన్కోటలో భారత సైన్యం, పారామిలటరీ దళాల సమాచారాన్ని సీసీటీవీ నిఘాచిత్రాల ద్వారా లాహార్కు చేరవేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.పంజాబ్లోని చక్ ధరివాల్ గ్రామానికి చెందిన బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టు అనే వ్యక్తి భారత సైన్యం, పారామిలిటరీ దళాల కదలికలపై నిఘా పెట్టేందుకు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారి-44లోని పఠాన్కోట్-జమ్మూ మార్గంలో ఒక వంతెన సమీపంలోని దుకాణంలో రహస్యంగా సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. దానిలోని నిఘా సమాచారాన్ని పాకిస్థాన్, విదేశాల్లోని ఆపరేటివ్లకు ఎలక్ట్రానిక్గా పంపినట్లు పేర్కొన్నారు. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నిందితుడు దీనిని ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఇందుకు గానూ దుబాయ్లోని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి రూ. 40 వేల అందుకున్నాడని పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక సీసీటీవీ కెమెరాతో పాటు ఇంటర్నెట్ వైఫై రౌటర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో అతనితో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశామని వారందరూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణ తేలిందన్నారు. ఈ నెట్వర్క్ సరిహద్దు సంబంధాలను గుర్తించడానికి గూఢచర్యాన్ని గుర్తించడానికి విచారణ వేగవంతం చేశామని పోలీసులు పేర్కొన్నారు.కాగా గత నెలలో పాకిస్థాన్ మద్దతు ఉన్న రెండు గూఢచార ముఠాలను పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఈ ముఠాలు, చైనాలో తయారైన అత్యాధునిక సౌరశక్తితో పనిచేసే సీసీటీవీ కెమెరాలను ఉపయోగించి, కీలకమైన సైనిక స్థావరాల లైవ్ విజువల్స్ను పాకిస్తాన్లోని తమ హ్యాండ్లర్లకు ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. దేశ భద్రతకు ఎంతో కీలకమైన సమాచారం పాక్కు చేరడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. -
ఆడలేక మద్దెల ఓడు చందంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు!
ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుకు సోషల్ మీడియా భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. సామజిక మాధ్యమాల్లో ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలివ్వలేక ప్రశ్నించే వారిని అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. పోలీసు వ్యవస్థ కూడా రెడ్బుక్ అరాచకాలకు అలవాటు పడిపోయి అదే పనిలో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ పవన్, కీలక మంత్రి లోకేశ్ల ప్రకటనల్లోని డొల్లతనాన్ని, గతంలో చేసినదాని కంటే భిన్నంగా ఉన్న విషయాన్ని సోషల్ మీడియా ఎత్తి చూపుతోంది. దీంతో కూటమి సర్కారు గంగవెర్రులెత్తుతోంది. ఎల్లోమీడియా సాయంతో కొద్దోగొప్పో సానుకూల ప్రచారం చేసుకుంటున్నా.. సోషల్ మీడియా ధాటిని మాత్రం తట్టుకోలేకపోతోంది. మామూలుగానైతే సోషల్ మీడియాలో ఏదైనా అభ్యంతరకర పోస్టులు, అసభ్యకరమైన వ్యాఖ్యలు వస్తే చర్యలు తీసుకుంటూంటారు కానీ... ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలను తొలగించేందుకు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులే రంగంలోకి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి పోస్టుల తొలగింపు కోసం పోలీసులు స్వయంగా గూగుల్, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలకు లేఖలు రాస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టుల వల్ల ఇబ్బంది పడ్డవారు లేదా సంస్థలు కోర్టు ఆదేశాల ద్వారా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తూంటాయి కానీ.. అంత ప్రాసెస్ ఎందుకు అనుకున్నారేమో తెలియదు కాని, పోలీసులు తమ అధికార బలం ప్రయోగిస్తున్నారట. పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే ఫేస్బుక్ తదితర వేదికలు స్పందిస్తున్నాయట. ఒకవైపు కేసులతో సోషల్ మీడియా యాక్టివిస్టులను భయపెట్టాలని చూడడం, మరో వైపు పోలీసులు సాయంతో పోస్టులు తొలగించేయడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీలో బలమైన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పోలీసుల దుశ్చర్యలపై పోరాటాలు చేస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు రీసర్వే, 30 వేల మంది మహిళల మిస్సింగ్ వంటి అనేక అంశాలపై అసత్యాలు ప్రచారం చేశారు. టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా ఆకాశమే హద్దుగా అబద్ధాలు సృష్టించింది. వదంతులు ప్రచారం చేసింది. అయినా అప్పట్లో వారిపై ఈ తరహా కేసులు రాలేదు. కాని కూటమి అధికారంలోకి రాగానే సోషల్ మీడియాపై తమ పెత్తనం చెలాయించే పని మొదలుపెట్టారు. సోషల్ మీడియా విమర్శలకు కూటమి సర్కారు ఎందుకు జంకుతోందో తెలుసుకోవడం ఆసక్తికరం. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను హైదరాబాద్లోని వారి స్వగృహాల్లో కలిశారు. ఇది జరగడానికి కొద్ది రోజుల ముందే మంత్రి లోకేశ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో తరిమేశారని, అప్పుడు చంద్రబాబు ఏపీకి వచ్చి ఇక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడపడాన్ని ఆరంభించారని వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో ప్రశ్నల పరంపర మొదలైంది. ‘‘చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి కదా విజయవాడ వెళ్లిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాక ప్రధాని ఏపీ పాలకులను అమరావతిలో కదా.. కలవాల్సింది? హైదరాబాద్లో ఎందుకు కలిశారు? అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పలువురు మంత్రుల కుటుంబాలు అమరావతిలో కాకుండా హైదరాబాద్ లోనే ఉంటున్నాయని, వీరు చుట్టపుచూపుగా వారం వారం అమరావతి వచ్చిపోతున్నారని వెళుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇదే పాయింట్ ఎత్తిచూపి ఎద్దేవ చేశారు. అంతేకాక 2018లో బీజేపీతో విడిపోయాక చంద్రబాబు, మోడీలు పరస్పరం ఎంత తీవ్రమైన విమర్శలు చేసుకుందీ.. చివరికి వ్యక్తిగతంగా కుటుంబ ప్రస్తావనలు తెచ్చింది కూడా సోషల్ మీడియా గుర్తు చేసింది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఈవిఎమ్ల ట్యాంపరింగ్ జరిగిందని, దమ్ముంటే ఎవరైనా చర్చకు రావచ్చని గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మీడియా సలహాదారుగా పనిచేసిన పరకాల ప్రభాకర్ సవాల్ చేస్తున్నారు. ఎల్లో మీడియా ఈ వార్తలను పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం పరకాల చేసిన వ్యాఖ్యలను ఖండించ లేకపోతోంది. దీనిని ప్రస్తావిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఒక ప్రశ్న సంధించారు. పరకాల ఇన్ని ఆరోపణలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం కేసు కూడా పెట్టలేకపోయిందని, దీనిని బట్టి ఆ ఆరోపణలలో వాస్తవం ఉందని అనుకోవల్సి వస్తుందని అన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని బెంగాల్ దుర్గ అని కోల్కతాలోనే అభివర్ణించారు. మోడీని ఢిల్లీ మహిషాసురుడిగా పోల్చుతూ ఆమె చేతిలో చిత్తు అవుతారని చంద్రబాబు ప్రసంగించారు. అదే చంద్రబాబు ఈసారి బీజేపీ గెలిచిన సందర్భంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీకి నమస్కరిస్తున్న తీరుపై వచ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి.మంత్రి లోకేశ్కు మద్దతుగా 99 పైసలకే పరిశ్రమలకు భూములు కేటాయించడం గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు అనగానే ఇతర రాష్ట్రాలలో అవే పరిశ్రమలు వందల కోట్లు ఖర్చు చేసి భూములు ఎలా కొనుగోలు చేస్తున్నది వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేయడానికి చంద్రబాబు సర్కార్ కూడా నిర్ణయం చేసింది. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ తదితరులు ఆంగ్ల మీడియంపై ఎలాంటి విమర్శలు చేసింది వివరించే పేపర్ క్లిపింగ్గులు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా కనిపించాయి. ఇవే కాదు..చంద్రబాబు ఆయా సందర్భాలలో చేసిన చిత్ర, విచిత్రమైన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. సహజంగానే ఇలాంటివి చంద్రబాబు టీమ్కు ఇబ్బంది కలిగిస్తూంటాయి. తమ పరువుకు భంగం కలుగుతోందని, ప్రభుత్వ పరపతి దెబ్బతింటోందని భావిస్తాయి. ఇదీ నేపథ్యం.. ఎలాగైనా సోషల్ మీడియాను అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది భావ ప్రకటన స్వేచ్చకు విరుద్ధమని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన ఒక ప్రకటన చేస్తూ టీడీపీ మద్దతుదారులు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే పోలీసులు శరవేగంగా స్పందించడం పరిపాటై పోయిందన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్ ) తొలగించాలని, వారి అక్కౌంట్లను బ్లాక్, లేదా సస్పెండ్ చేయాలని పోలీసులే సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లకు నోటీసులు పంపుతున్నారని జగన్ అన్నారు. ఇది సోషల్ మీడియాపై వ్యవస్థీకృతంగా సెన్సార్ షిప్ విధించడమేనని విమర్శించారు. జగన్ ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసుల నుంచి కాని ఎలాంటి సమాధానం రాలేదు. కొద్ది రోజుల క్రితం మాజీ ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి, మాజీ మంత్రి కన్నబాబులు కూడా పలు ఉదాహరణలు ఇస్తూ పోలీసులు అక్రమంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు ప్రెస్ కాన్ఫరెన్స్ లలో మాట్లాడిన విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను తొలగించాలని పోలీసులు లేఖలు రాశారట.ఇ దంతా కొత్త ట్రెండ్. గతంలో రాజకీయ విమర్శలపై ఇలా ప్రభుత్వాలు వ్యవహరించలేదు.మహా అయితే వారి వాదన చెబుతారు. ఖండనలు ఇస్తారు. అవేమీ ఇవ్వకుండా వీడియోలు తొలగించే పనిలో పోలీసులను ప్రయోగిస్తున్నారంటూ ప్రభుత్వం ఎంత భయపడుతోందో అర్థం అవుతోంది. ఇవన్ని చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే మీరేమన్నా చేసుకోండి..మా మొండి వైఖరి మాదే..మా రెడ్బుక్ రాజ్యాంగం మాదే.. ఏమైనా మా తప్పులను ప్రశ్నిస్తే ఊరుకోం..అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుండడం అత్యంత దుర్మార్గంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఎప్పటికి మారేనో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తల్లితో సహజీవనం.. ఆమె కూతురిపై లైంగిక దాడి
మేడ్చల్ జిల్లా: తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై అల్వాల్ పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. మచ్చ»ొల్లారంలో నివసించే ఓ మహిళ (33) మహిళ భర్తకు దూరంగా ఉంటూ 15 సంవత్సరాల కూతురితో కలిసి నివాసముంటోంది. స్థానికంగా ఉండే దుర్గాప్రసాద్ (34) తో సహజీవనం చేస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయలో దుర్గాప్రసాద్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. -
అత్తాపూర్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
-
మామిళ్ళపల్లిలో హై టెన్షన్.. జూపూడిని ఈడ్చుకెళ్లిన పోలీసులు
-
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
సాక్షి, హైదరాబాద్: బండి సాయి భగీరథ్ పక్కా పథకం ప్రకారమే పోలీసులకు చిక్కాడని కేసు దర్యాప్తులో పాల్గొన్న కీలక పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో ఆధారాలు దొరకకుండా చేయాల్సిన పనులన్నీ పరారీలో ఉండగానే పూర్తి చేసిన తర్వాతే పోలీసుల అదుపులోకి వచ్చాడని చెప్పారు. ఈనెల 16న భగీరథ్ను అరెస్టు చేసిన తర్వాత నిందితుడిని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఠాణాలో రెండున్నర గంటలపాటు కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్ నిందితుడిని సుదీర్ఘంగా విచారించా రు. అయితే విచారణ సమయంలో భగీరథ్ పోలీసులకు ఖాళీ సెల్ఫోన్ మాత్రమే అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఫోన్లో సిమ్ లేదని, ఎక్కడుందని విచారణాధికారి నిందితుడిని ప్రశ్ని ంచగా.. సిమ్ కార్డ్ ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పినట్లు తెలిసింది. విచారణాధికారులు న్యా యనిపుణులతో చర్చించిన అనంతరం పోక్సో కేసులో కీలకమైన సాక్ష్యాధారాలు ధ్వంసం చేశాడని గుర్తించి, భగీరథ్పై కొత్తగా ‘ఆధారాలు మాయం’సెక్షన్ను జోడించారు. ఈ మేరకు ఛార్జ్ షీట్లో భగీరథ్పై బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 238ను జోడించారు. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని వారం రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు మేడ్చల్ న్యాయస్థానంలో కస్టడీ పిటీషన్ను దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకొని నార్సింగిలోని సర్వీస్ అపార్ట్మెంట్, మెయిన్బాద్ ఫామ్హౌస్, పరిసర ప్రాంతాలలో సీన్ రీకన్స్ట్రక్షన్స్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. -
ఫలించిన గిరిజన యువకుడి 13 ఏళ్ల న్యాయపోరాటం
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఓ గిరిజన యువకుడు చేసిన 13 ఏళ్ల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. అతడికి కానిస్టేబుల్గా ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేసు ఉందన్న విషయాన్ని దాచిపెట్టాడన్న కారణంతో ఆ గిరిజన యువకుడికి ఉద్యోగం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. సమాజంలోని ఉన్నతవర్గాల వారు ఎన్నో క్రిమినల్ కేసులున్నా దేశంలో అత్యున్నత పదవులకు పోటీపడుతున్నప్పుడు.. ఒక పేద గిరిజన యువకుడికి చిన్న సంఘటన ఆధారంగా ఉద్యోగం నిరాకరించడం అన్యాయమని పేర్కొంది. ఇలా సమాజంలో వెనుకబడిన యువతకు అవకాశాలు నిరాకరిస్తే, వారు అసాంఘిక శక్తుల వైపు మళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. యువత చేసిన చిన్న తప్పులకు వారిని జీవితాంతం శిక్షించకూడదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తుచేసింది. వాస్తవం చెప్పకపోవడాన్ని ఆటోమేటిక్ అనర్హతగా కూడా పరిగణించరాదంది. పిటిషనరయిన గిరిజన యువకుడిపై నమోదైంది హత్య, దోపిడీ లేదా అత్యాచారం వంటి తీవ్రమైన నేరం కాదని, కేవలం గ్రామంలో జరిగిన ఒక చిన్న ఘర్షణ అని, అందులోనూ అతను 13వ నిందితుడని పేర్కొంది. ఈ కేసు మినహా అతడిపై అంతకు ముందుగానీ, తర్వాతగానీ ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని గుర్తుచేసింది. గ్రామీణ గిరిజన ప్రాంతానికి చెందిన పిటిషనర్.. ఉద్యోగం పోతుందనే అమాయకత్వపు భయంతోనే తనపై కేసు నమోదైన సమాచారాన్ని దాచిపెట్టాడే తప్ప, అందులో ఎటువంటి దురుద్దేశం లేదని పేర్కొంది. సమాచారం దాచిపెట్టిన ప్రతి సందర్భాన్ని ఘోర తప్పిదంగా భావించి ఉద్యోగాన్ని యాంత్రికంగా రద్దుచేయడం చెల్లదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంగా చెప్పిందని గుర్తుచేసింది. అధికారులు విచక్షణతో, కేసు తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకోవాలంది. పిటిషనర్ ఎంపిక రద్దును చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా పరిగణిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. అలాగే పిటిషనర్ ఎంపికను రద్దుచేస్తూ అధికారులు 2011, 2014 సంవత్సరాల్లో జారీచేసిన రెండు మెమోలను రద్దుచేసింది. తీర్పు వచ్చిన రోజు నుంచి నాలుగు వారాల్లో పిటిషనర్ను పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) పోస్టులోకి నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్కు వేతన సదుపాయాలు, సీనియారిటీ, ఇతర సేవా ప్రయోజనాలు కల్పించాలంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుబేందు శమంతో ధర్మాసనం ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. పెంచలయ్య నిర్దోషి అని కోర్టు చెప్పినా.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళేనికి చెందిన గిరిజన యువకుడు దొడ్ల పెంచలయ్య 2008లో కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగానికి తాత్కాలికంగా ఎంపికయ్యారు. గ్రామంలో రాజకీయ కారణాల వల్ల 2010లో పెంచలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత పోలీసులు ఎంపికయిన అభ్యర్థుల పూర్వ చరిత్రను పరిశీలించే సమయంలో పెంచలయ్యపై కేసు గురించి తెలిసింది. దీంతో పోలీసులు పెంచలయ్య నియామకాన్ని రద్దుచేస్తూ 2011లో ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై 2013లో పెంచలయ్య న్యాయపోరాటం ప్రారంభించారు. తొలుత ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అక్కడ కేసు పెండింగ్లో ఉండగానే పెంచలయ్యపై నమోదైన కేసును కింది కోర్టు కొట్టేసింది. అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అయితే ట్రిబ్యునల్ మాత్రం పెంచలయ్య పిటిషన్ను కొట్టేసింది. అటు తరువాత ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి సైతం పెంచలయ్యకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై ఆయన ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ అప్పీల్పై జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి న్యాయం చేసింది. -
ఐదేళ్లలో అభివృద్ధి చేస్తాం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదేళ్లలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రూపురేఖలు మార్చడం తమ తదుపరి లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. నిర్దేశిత లక్ష్యం 2026 మార్చి 31లోగా దేశంలో మావోయిస్టులను నిర్మూలించడంలో కృషి చేసిన పోలీసులు, భద్రతా బలగాలను సోమవారం జగదల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు. దీంతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన సేవా కేంద్రాలను నేతనార్ గ్రామంలో అమిత్ షా ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తమ దగ్గర అభివృద్ధి జరగకపోవడం వల్లే ఆయుధాలు చేపట్టామనే తప్పుడు ప్రచారం చేస్తూ మావోయిస్టులు బస్తర్ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఇటీవల మూడు వేల మంది మావోయిస్టులు లొంగిపోతే, అందులో రెండు వేల మందికి కనీసం రాయడం, చదవడం రాదని, ఈ ప్రాంతానికి మావోయిస్టులు చేసిన అన్యాయాలకు ఇదో ఉదాహరణ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేసిన కృషితో ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులను నిర్మూలించామని పేర్కొన్నారు.15 శాతం బస్తర్ ఆదివాసీల కోసం...నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సూచనలతో బస్తర్లో గుజరాత్ తరహాలో పాడి పరిశ్రమ అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని అమిత్ షా చెప్పారు. ఇకపై వచ్చే ఉద్యోగాల భర్తీ ప్రకటనల్లో 15 శాతం ఉద్యోగాలను బస్తర్ ఆదివాసీల కోసం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టులను నిర్మూలించేందుకు 2018 నుంచి విస్త్రృత ప్రయత్నాలు జరిగాయని అమిత్షా అన్నారు.ఢిల్లీలో పెద్ద పెద్ద భవనాల్లో కూర్చుని కాగితాలు, కంప్యూటర్ల మీద ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31వ తేదీని గడువుగా పెట్టుకున్నామని అమిత్ షా గుర్తుచేశారు. పై స్థాయిలో ఎన్ని ప్లాన్లు వేసినా వాటి క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తారనేది కీలకమని, ఆ విషయంలో వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు, పారా మిలిటరీ బలగాలు, స్పెషల్ ఫోర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేశాయని కితాబునిచ్చారు. ఆ ఆపరేషన్లో పాల్గొన్న బలగాలకు ఆయన అభినందనలు తెలిపారు.తెలంగాణకు అభినందనలుబస్తర్లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి దిశానిర్దేశం చేసే నేతల్లో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారున్నారు. దీంతో నిర్దేశిత గడువులోగా మావోయిస్టులను నిర్మూలించడంలో తెలంగాణ పోలీస్ అధికారులు కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో జగదల్పూర్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ భద్రతా సలహాదారు శివధర్రెడ్డి (మాజీ డీజీపీ), తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, మల్కాజ్గిరి సీపీ బి.సుమతి (ఎస్ఐబీ మాజీ చీఫ్), డీజీపీ ఆపరేషన్స్ (ఆక్టోపస్, గ్రేహౌండ్స్) అనిల్ కుమార్ను అమిత్షా సత్కరించారు. మావోయిస్టు కార్యకలాపాల నిరోధానికి శివధర్రెడ్డి విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయ్, హోంమంత్రి విజయ్శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మహిళా రైతులపైన పోలీసుల దాష్టికం
-
పక్కకు తప్పుకోండి.. జోగి రమేష్ను అడ్డుకున్న పోలీసులు
-
లాఠీలు.. తూటాలకు భయపడం.. శవంతో జక్కంపూడి వార్నింగ్
-
మామిళ్లపల్లిలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి జోగి రమేశ్ చేపట్టిన మామిళ్లపల్లి పర్యటనకు పోలీసులు అడ్డుతగిలారు. అధికారులు సీజ్ చేసిన గోడౌన్ను పరిశీలించేందుకు, రైతుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో సోమవారం ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మరోసారి అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జోగి రమేశ్ కార్యకర్తలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో ఈ మధ్య కాలంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మొక్కజొన్న రైతులపై జరిగిన దాడులు, అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అక్రమ కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చింది. దీంతో సర్కార్ కూటమి కుట్రలకు దిగింది. -
గంగాతీరంలో హై అలర్ట్.. అసలేం జరిగింది?
హరిద్వార్: లక్షలాది మంది భక్తులు నిత్యం పుణ్యస్నానాలు ఆచరించే పవిత్ర పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్లోని హరిద్వార్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రసిద్ధ ‘హర్ కీ పౌరి’ ఘాట్ను బాంబులతో పేల్చేస్తామంటూ సోమవారం పోలీసులకు వచ్చిన ఒక బెదిరింపు ఫోన్ కాల్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అత్యంత రద్దీగా ఉండే ఈ ఆధ్యాత్మిక ప్రాంతంలో బాంబు హెచ్చరికల వార్త తెలియగానే నగరవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.పోలీసులను పరుగులు పెట్టించిన ఫోన్ కాల్పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఒక వ్యక్తి ఎమర్జెన్సీ నంబర్ 112 కు ఫోన్ చేశాడు. నాలుగు రోజుల్లో హర్ కీ పౌరి సహా హరిద్వార్లోని పలు కీలక ప్రాంతాలను బాంబులతో పేల్చేస్తామని బెదిరించాడు. ఈ హెచ్చరికతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసి, నగరం నలుమూలల హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు బహుళ పోలీస్ బృందాలను ఏకకాలంలో రంగంలోకి దించారు.లోకేషన్ ట్రేసింగ్.. నిందితుడి అరెస్ట్బెదిరింపు కాల్ రాగానే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్, దర్యాప్తు బృందాలు ఆ ఫోన్ నంబర్, లొకేషన్ను ట్రేస్ చేశాయి. నిందితుడిని పౌరీ జిల్లాలోని యమకేశ్వర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల సోహన్ సింగ్ రావత్గా గుర్తించి, వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల విచారణలో ఊహించని వాస్తవం వెలుగుచూసింది. తాను పీకలదాకా మద్యం సేవించి ఉన్నానని, కేవలం మత్తులోనే ఈ బాంబు బెదిరింపు కాల్ చేశానని నిందితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.హర్ కీ పౌరి ప్రాముఖ్యతశ్రీ మహావిష్ణువు పాదముద్రలు ఉన్నాయని భావించే హర్ కీ పౌరి ఘాట్కు ఎంతో ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. ఇక్కడ సాయంత్రం జరిగే గంగా హారతికి, 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తుతారు. ఇంతటి పవిత్రమైన ప్రదేశంపై బెదిరింపులు రావడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. నిందితుడు సోహన్ సింగ్పై హరిద్వార్ నగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు హరిద్వార్ ఎస్ఎస్పీ నవనీత్ సింగ్ భుల్లర్ తెలిపారు.ఇది కూడా చదవండి: రైలు బోగీలో మహిళ మొండెం.. లక్నోలో దారుణం -
మామిళ్ళపల్లి కి బైరెడ్డి.. కారు అడ్డం పెట్టి పోలీసుల అత్యుత్సాహం
-
బండి భగీరథ్ కోసం ఐదు ప్రత్యేక.. బృందాలతో గాలింపు
-
బండి భగీరథ్ ఇంట్లో పోలీసుల సోదాలు!
-
హైదరాబాద్ లో హై టెన్షన్...బండి భగీరథ్ కోసం గాలింపు
-
బెంగాల్లో అర్ధరాత్రి భారీ విధ్వంసం
అసన్సోల్: పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఉద్రిక్ల వాతావరణం ఏర్పడింది. లౌడ్ స్పీకర్ల శబ్ద పరిమితులపై పోలీసులు ఇచ్చిన సూచనలు చివరకు అపార్థాలకు దారితీసి, తీవ్ర విధ్వంసానికి కారణమయ్యాయి. జహంగీరి మహల్లా పోలీస్ అవుట్పోస్టుపై మూకల దాడి, రాళ్ల రువ్వడం, వాహనాల ధ్వంసంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది.వదంతులు సృష్టించిన చిచ్చుముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆదేశాల మేరకు, మతపరమైన ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల శబ్దాన్ని తగ్గించాలని పోలీసులు అసన్సోల్లోని రైల్పార్ ప్రాంత ప్రజలకు సూచించారు. ఇదే విషయమై మసీదు కమిటీతో పోలీసులు మాట్లాడుతుండగా.. శుక్రవారం రాత్రి ప్రార్థనలను అడ్డుకుంటున్నారనే వదంతులు క్షణాల్లో వ్యాపించాయి. దీంతో ఒక వర్గానికి చెందిన అసాంఘిక శక్తులు ఒక్కసారిగా రెచ్చిపోయి, జహంగీరి మహల్లా (నయా మహల్లా) పోలీస్ స్టేషన్పై మూకుమ్మడి దాడికి దిగాయి.వాహనాలు ధ్వంసంవదంతులతో రగిలిపోయిన ఆందోళనకారులు నేరుగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి, విధ్వంసం సృష్టించారు. లోపల ఉన్న వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా, పోలీసుల పైనా రాళ్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో స్టేషన్ బయట, పరిసర వీధుల్లో పార్క్ చేసిన అనేక వాహనాలను దుండగులు ధ్వంసం చేశారు. అసన్సోల్ నార్త్ ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ తెలిపిన వివరాల ప్రకారం కేవలం శబ్దాన్ని మసీదు ప్రాంగణానికే పరిమితం చేయాలని పోలీసులు కోరినందుకే ఈ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి.రంగంలోకి కేంద్ర బలగాలుపరిస్థితి చేయి దాటిపోతుండటంతో అదనపు భద్రతా బలగాలు, కేంద్ర బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఈ విధ్వంసానికి కారణమైన నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు.ఇది కూడా చదవండి: అప్పుల ఊబిలో.. చమురు మంటల్లో.. -
పోలీసులకు బండి భగీరథ్ మెయిల్
-
ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఘరానా దొంగలు
సాక్షి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ జ్యువెలరీ షాపు కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. నిందితులందరినీ కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. చోరి నిందితులను బిహార్, బెంగాల్లో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా కరీంనగర్ సీపీ మీడియాతో మాట్లాడారు. "నిందితులు ఆరు రాష్ట్రాల్లో చోరీలు చేశారు. బంగారం వ్యాపారస్థునితో పాటు మరో నలుగురు నిందితులను అరెస్టు చేశాం. మెుత్తం ఈ నెట్వర్క్లో 17 మంది ఉన్నట్లు గుర్తి్ంచాం. చోరిలో 12 మంది నిందితులు పాల్గొన్నారు. పట్టుబడిన నిందితులపై 48 కేసులు ఉన్నాయి. దొంగలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోరీ చేసేందుకు ప్లాన్ వేశారు. దొంగతనంలో మెుత్తం 13 మంది దొంగలు పాల్గొనగా వారిలో ముగ్గురిని అరెస్టు చేశాం అన్నారు.ఈ దోపిడీ సుభోద్ సింగ్ అనే వ్యక్తి మార్గదర్శకంలోనే జరిగింది. 12 రోజుల పాటు ఆపరేషన్ చేపట్టి దొంగలను పట్టుకున్నాం. దొంగలంతా రెండు నెలల క్రితమే రాష్ట్రానికి వచ్చారని పక్కా ప్లాన్ ప్రకారమే దోపిడీ చేశారని కరీంనగర్ సీపీ పేర్కొన్నారు. కాగా ఈ దొంగల ముఠా కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులో పట్టపగలే తుపాకీలతో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు
-
కొడుకు నిందితుడైతే..తండ్రిని హింసిస్తారా?
సాక్షి, అమరావతి : ఓ కేసులో కొడుకు నిందితుడిగా ఉంటే అతని తండ్రిని తీసుకెళ్లి పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చెన్నూరు మండలం మంగళపూరు గ్రామానికి చెందిన రోజూవారి కూలీ గడుతోటి పోలయ్య కొడుకు ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే అతను అందుబాటులో లేకపోవడంతో పోలీసులు గత నెల 18న పోలయ్యను స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ హింసించి, తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ పోలయ్య హైకోర్టును ఆశ్రయించారు.పోలీసులు తన హక్కులను హరించారని, బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశించడంతో పాటు తనకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పోలయ్య తరఫున న్యాయవాది వి.సురేంద్రరెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల దాడి వల్ల పోలయ్యకు అయిన గాయాల తాలుకా వైద్య రికార్డులను, ఘటనపై స్థానిక పత్రికల్లో వచి్చన కథనాలను కూడా కోర్టు ముందుంచారు. అలాగే వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 18న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీని భద్రపరచేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టుకు విన్నవించారు. పక్కా ఆధారాలు ఉన్నాయి.. పిటిషనర్ పోలయ్యను హింసించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పోలీసుల దెబ్బల వల్ల తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారని, ఇందుకు సంబంధించిన వైద్య నివేదికలు, ఫొటోలు ఆయనపై జరిగిన దాడిని ధ్రువీకరిస్తున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దాషీ్టకానికి పాల్పడి, పిటిషనర్ మానవ హక్కులను హరించినందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ సహా, గూడూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, కానిస్టేబుళ్లు దాస్, చిన్నా ఈ నెల 14న స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే బాధ్యులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.పోలీసులకు చెంపపెట్టు లాంటిదిఅధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే పోలీసులకు హైకోర్టు ఆదేశాలు చెంపపెట్టు. దళితులను, రైతులను అమానుషంగా స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసే పోలీసులను న్యాయస్థానం మెట్లెక్కించే వరకు న్యాయపోరాటం చేస్తాం. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఉదాసీనంగా ఉంటే వారు కూడా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడం. ప్రతి ఒక్కరిపై ప్రైవేట్ కేసులు వేసి న్యాయస్థానంలో నిలబెడతాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పచ్చచొక్కాలు తొడిగిన పోలీసులపై క్రిమినల్ చర్యలు తప్పవు. – కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీమంత్రి -
పోలీసులు వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్యాయత్నం
కర్నూలు: పోలీసుల వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ యువజన విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు బాలాంజనేయులు అలియాస్ బాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పాత ఆర్టీఓ కార్యాలయం పక్కనున్న కమలానగర్లో నివాసం ఉంటున్న బాలు ఇంటికి మంగళవారం మధ్యాహ్నం కర్నూలు మూడో పట్టణ క్రైం పార్టీ పోలీసులు వెళ్లి సీఐ పిలుస్తున్నాడు.. రావాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో బాలాంజనేయులు ఇంట్లో ఉన్న కత్తితో చేయి కోసుకున్నాడు. భారీగా రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.గత ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో ఈయనపై మూడో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల ఓ చికెన్ సెంటర్ మహిళతో గొడవకు సంబంధించి పోలీసులు బాలును స్టేషన్కు రావాలంటూ బెదిరిస్తున్నారు. దీంతో తాను ఎలాంటి తప్పు చేయకపోయినా టీడీపీ నాయకుల ఒత్తిడితోనే వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుడితో పాటు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్రమంగా సారా, డ్రగ్స్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఎస్వీ మోహన్రెడ్డి పరామర్శ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి బాధితుడు బాలాంజనేయులును పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినప్పటికీ పోలీసులు వేధిస్తున్నారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని, పోలీసుల వైఖరిని ఎండగడతామని ఎస్వీ మోహన్రెడ్డి వారికి హామీ ఇచ్చారు. -
బాబూ.. అది పుష్పక విమానం కాదు..
విశాఖపట్నం: సాగర తీరంలో ఈ యువకుల ప్రయాణం చూస్తుంటే.. అది బైకులా కాకుండా అందరూ ఇట్టే ఇమిడిపోయే ‘పుష్పక విమానం’లా కనిపిస్తున్నట్టుంది. నిబంధనల ప్రకారం ఇద్దరికే చోటున్నా, ఏకంగా నలుగురు ఎక్కి ‘చతుర్ముఖ’ ప్రయాణంతో ట్రాఫిక్ రూల్స్ను నడిరోడ్డుపై గాలికొదిలేశారు. అటు హెల్మెట్ లేదు.. ఇటు భద్రతా లేదు.. కేవలం సరదా కోసం ప్రాణాలను పణంగా పెడుతూ చేస్తున్న ఈ సాహసం ఏ మాత్రం అదుపు తప్పినా తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తుంది. -
చెయ్యి తియ్యి ఫస్ట్.. ఇచ్చిపడేసిన మార్గాని భరత్
-
చిలకలగూడ యువకుడి కేసులో 10 మంది నిందితుల అరెస్ట్
-
ఎస్బీఐ బ్యాంకులో భారీగా డబ్బు మాయం..!
హైదరాబాద్: యూసుఫ్గూడ ఎస్బీఐలో రూ.23 లక్షలు మాయమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. యూసుఫ్గూడ ఎస్బీఐలో క్యాష్ ఇన్చార్జ్గా అబ్బిరెడ్డి యాదగిరిరెడ్డి పని చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 7న యూసుఫ్గూడ బ్రాంచిలోని పాత ఏటీఎం స్ధానంలో ఎస్పీఆర్ మిషన్ను ఏర్పాటు చేయాలని బ్యాంకు నిర్ణయించింది. బ్యాంకు రికార్డులో రూ 27.5 లక్షలు ఎంట్రీ చేశారు. బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీయకుండానే తీసినట్లుగా బోగస్ ఎంట్రీలు సృష్టించారు. మరుసటి రోజు యాదగిరి రెడ్డి ఇతర సిబ్బందితో కలిసి ఏటీఎంలోని డబ్బు పెట్టెలను బ్యాంకు స్ట్రాంగ్ రూంకు తరలించారు. బ్యాంకు అధికారులు డబ్బు పెట్టెలను లెక్కించి చూడగా.. నగదులో తేడా వచి్చంది. రూ23 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. సీసీ టీవీ కెమెరాలు పరిశీలించగా.. యాదగిరి రెడ్డి ఉద్దేశపూర్వకంగానే మోసానికి పాల్పడి, డబ్బును కాజేసినట్లు బ్యాంకు అదికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఎస్బీఐ చీఫ్ మేనేజర్ కిరణ్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దొరికిన దొంగలు?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. చోరీ జరిగి వారం రోజులు కాగా కమిషనరేట్ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాల్లో వారంరోజుల పాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలుకోణాల్లో గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు చోరీ చేసిన నగలను బిహార్లో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. బిహార్ నుంచి కరీంనగర్ తీసుకొస్తున్నట్లు తెలిసింది.ప్రత్యేక బృందాలతో...ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో ఉన్న ప్రముఖ పీఎంజే జువెల్లరీస్లో బంగారం దోపిడీ, కాల్పుల ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. షాపు తెరిచేటప్పుడు, జనసంచారం లేని సమయాన్ని ఎంచుకుని దుండగులు ప్రణాళికాబద్ధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు జరపగా నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నగరం నలువైపులా నాకాబందీ చేçపట్టారు. దుండగుల ప్రణాళిక, తప్పించుకున్న తీరు చూస్తే ముందస్తు రెక్కీతో జరిగిందని అంచనాకు వచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్ను సేకరించి, దుండగులు ఉపయోగించిన వాహనాలు, మార్గాలు, కదలికల ఆధారంగా కీలక ఆధారాలు గుర్తించారు.బిహార్లో నగలు విక్రయిస్తుండగాదర్యాప్తులో భాగంగా దొంగలు ఘటన అనంతరం కరీంనగర్ నుంచి ధర్మపురి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారు ఉపయోగించిన పల్సర్ బైక్ను వదిలిపెట్టి గోదావరినదిని దాటి పరారైనట్లు సీసీ కెమెరాలు, స్థానిక సమాచారంతో నిర్ధారించారు. ఈ మార్గం ద్వారా వారు మహారాష్ట్ర లేదా ఛత్తీస్గఢ్ వైపు వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దోపిడీ కేసు వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి దోపిడీ ఘటనలతో పోల్చి చూశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, పాతనేరస్తులు, గతంలో దొంగతనాలకు పాల్పడిన గ్యాంగులతో విచారణ చేపట్టి నిందితుల కదలికలను, సేకరించిన సమాచారంతో బిహార్ రాష్ట్రంలో నగలు విక్రయిస్తుండగా దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
మమతా, అభిషేక్లకు పోలీసుల షాక్!
కోల్కతా: కాలం మారుతుంటుంది.. దీనితోపాటు ప్రజలు, అధికార యంత్రాంగాలు కూడా మారుతుంటాయి. పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామ క్రమంలో కోల్కతా పోలీసులు కూడా మారిపోయారు. వారు తమ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, పలువురు ఇతర తృణమూల్ కాంగ్రెస్ నాయకులను అన్ఫాలో చేశారు. ఇదే సమయంలో పోలీసులు ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పీఎంఓ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ఖాతాలను ఫాలో కావడం మొదలుపెట్టారు. దీనికితోడు టీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు పలువురు నేతల నివాసాల వద్ద ఉన్న అదనపు భద్రతను కూడా తొలగించారు.బెంగాల్లో భారీ రాజకీయ మార్పుపశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత సువేందు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 55 ఏళ్ల సువేందు అధికారి.. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహిత రాజకీయ అనుచరునిగా మెలిగారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక నేతగా వ్యవహరించారు. కాగా సువేందు అధికారి స్థిరమైన పరిపాలనను అందిస్తారని, బెంగాల్ ప్రజల అంచనాలను అందుకుంటారని అమిత్ షా నమ్మకం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: కేబినెట్లో ఏకైక మగువ.. ఎవరీ అగ్నిమిత్ర పాల్? -
ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా? ఏపీ పోలీసులపై జగన్ సీరియస్
-
చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం... రాజకీయ ఆయుధంలా పోలీసులను వాడుకుంటున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటుండడంతో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. అసమ్మతిని అణచి వేయడానికి, ప్రశ్నించే గొంతులను నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను చంద్రబాబు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హలో ఇండియా..!’ ఏపీలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు వాడుకుంటున్న తీరును చూడాలంటూ శుక్రవారం ఆయన తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగంప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటైన వాక్ స్వాతంత్య్రాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్–19లో పొందుపరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే వారిని బెదిరించడానికి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంలా వాడుతున్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా, ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులపైనా రాజకీయ కక్ష సాధింపులు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. Hello India !!!!!AP CM N. Chandrababu Naidu has been using the police department as his political agents to curb dissent, suppress opposition voices, and systematically curtail Freedom of Speech in Andhra Pradesh.Article 19 of the Indian Constitution guarantees Freedom of… pic.twitter.com/bZKo2kFCW3— YS Jagan Mohan Reddy (@ysjagan) May 8, 2026టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగంప్రభుత్వ బరితెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతోంది. వారి ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను నిలదీస్తూ అందుకు బాధ్యులైన అధికార పార్టీ నాయకులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్ చేసినా ఏమాత్రం సహించలేకపోతున్నారు. వెంటనే వారి పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావడమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. కోర్టులు అనేక సందర్భాల్లో తప్పుబట్టినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి ఏకపక్షంగా కక్ష సాధింపుతో చట్ట విరుద్ధంగా పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయిఅధికార టీడీపీ తమ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా రోజూ వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ, విష ప్రచారం చేస్తూ దూషణలతో కూడిన దారుణ పోస్టులు పెడుతోంది. నిత్యం వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తోంది. వాటిపై విపక్ష వైఎస్సార్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సాక్ష్యాధారాలు చూపినా కనీసం కేసు నమోదు చేయడం లేదు. ఎఫ్ఐఆర్ల ఊసే లేదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో హేయంగా వ్యవహరిస్తోంది. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించడమే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిపైనే దాడిగా భావించాల్సి వస్తోంది.స్వేచ్ఛ స్థానంలో భయం.. జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు.. పోలీసు యంత్రాంగం, వ్యవస్థ రాజకీయ ఆయుధంగా మారడం.. ఒక విమర్శను నేరంగా పరిగణించే పరిస్థితి ఉన్న రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కష్టం. హేయమైన చర్యలు, అణచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార దుర్వినియోగానికి పాల్పడటం.. పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఆ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేలా వ్యవహరించడం.. ప్రతిపక్షం గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేయడం.. సోషల్ మీడియాపై నియంత్రణ.. అసమ్మతిని అణచి వేయడం లాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.సోషల్ మీడియాపై సెన్సార్షిప్టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవడం లేదు. వారి పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ, వారి తప్పులను ఎండగడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్) తొలగించాలని, వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పోలీసు శాఖ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు నోటీసులు పంపిస్తోంది.ఆ విధంగా వ్యవస్థీకృతంగా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ.. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా చూడడం.. ఎక్కడా అసమ్మతి గళం వినిపించకుండా ప్రయత్నించడం.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దిశలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనం. బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడం, విమర్శలను సహించలేకపోవడం, పారదర్శకత లోపించడం వల్ల ఏర్పడిన అభద్రతా భావంతో పెల్లుబుకుతున్న అసహనం.. దానివల్ల కక్షపూరిత, నిరంకుశ విధానాలను ప్రభుత్వ చర్యలు తేటతెల్లం చేస్తున్నాయి. -
పోలీసుల అరాచకాలకు ఆ హోటల్ అడ్డా!
సాక్షి, అమరావతి: విజయవాడ పటమట పోలీసులు.. పోలీస్స్టేషన్ సమీపంలోని ప్రైవేట్ హోటల్ ‘కార్తికేయ ప్రైడ్’ను అడ్డాగా చేసుకుని దందాలు చేస్తున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ 70 ఏళ్ల వృద్ధుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. అనధికారికంగా హోటల్ను పోలీస్ స్టేషన్గా ఉపయోగిస్తూ వ్యక్తులను ఆ హోటల్కి తీసుకెళ్లి నిర్బంధించడం, కొట్టడం, బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకోవడం.. సివిల్, ఆస్తి వివాదాల బలవంతపు రాజీలు చేస్తుండటం, చట్ట విరుద్ధంగా కాల్ డీటెయిల్ రికార్డులు సేకరించడం.. అనుమతి లేకుండా డిజిటల్ సర్వైలెన్స్ చేస్తుండటం వంటి పిటిషన్లోని ఆరోపణలు తీవ్రమైనవని హైకోర్టు స్పష్టం చేసింది. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు పోలీస్స్టేషన్, ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజీల మొత్తాన్ని భద్రపరచాలని పటమట పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ అధికారుల ప్రమేయం పల్నాడు జిల్లా, అందుకూరు గ్రామానికి చెందిన కర్నాటి వీరభద్రరావు హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే జస్టిస్ లీసా గిల్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నేకంటి మల్లికార్జునరావు వాదనలు వినిపిస్తూ కార్తికేయ ప్రైడ్ హోటల్లో పోలీసుల సెటిల్మెంట్లన్నీ కూడా విజయవాడ అదనపు డిప్యూటీ కమిషనర్ ఎన్బీఎం మురళీకృష్ణ, పటమట సీఐ పవన్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. పిటిషనర్ వీరభద్రరావును సైతం పోలీసులు ఇదే రీతిలో కార్తికేయ ప్రైడ్ హోటల్లో నిర్బంధించి, కొట్టి, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు.వాస్తవాలు తెలియాలంటే పటమట పోలీస్స్టేషన్తో పాటు హోటల్ సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) తిరుమాను విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ, ఈ పిల్కు విచారణార్హత లేదన్నారు. ఇవే అభ్యర్థనలతో పిటిషనర్ ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు.పటమట పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పోలీసు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చారని, వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పిటిషనర్ ఆరోపణలపై పూర్తి వివరాలు తెప్పించుకుని కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్ మేజి్రస్టేట్ ముందు కూడా ఇవే విషయాలను చెప్పారని గుర్తు చేస్తూ.. వాస్తవాలను నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది.


