breaking news
Police
-
Activist Sharif: వైఎస్ఆర్ జిల్లాలో YSRCP కార్యకర్తలే లక్ష్యంగా పోలీసుల వేధింపులు
-
‘తుర్క్మన్ గేట్’ అల్లర్లలో 30 మంది గుర్తింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని తుర్క్మన్ గేట్ వద్ద బుధవారం జరిగిన హింసాత్మక ఘటనలో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించారు. ఐదుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఈ అల్లర్లకు సంబంధించిన ఆధారాల కోసం పోలీసులు సోషల్ మీడియాలో కనిపిస్తున్న సుమారు 400 వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులు, పోలీసులు ముఖాముఖి తలపడిన దృశ్యాలు ఈ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లరి మూకలు పోలీసులపై రాళ్లు, గాజు సీసాలతో దాడి చేస్తున్న దృశ్యాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆ వీడియోల ద్వారా మరికొంతమందిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.ఈ కేసుకు సంబంధించి సమాజ్ వాదీ పార్టీకి చెందిన రాంపూర్ ఎంపీ మోహిబుల్లా నద్వీకి దర్యాప్తులో పాల్గొనాలంటూ పోలీసులు నోటీసులు పంపనున్నారు. హింస జరగడానికి కొద్దిసేపటి ముందు ఆయన ఫైజ్-ఎ-ఇలాహీ మసీదు వద్దకు చేరుకున్నారని, ఆ సమయంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ ఘర్షణ వెనుక ఆయన పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు తుర్క్మన్ గేట్ సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు ఎంసీడీ (ఎంసీడీ) అధికారులు బుధవారం తెల్లవారుజామున చర్యలు చేపట్టారు. అయితే మసీదును కూల్చివేస్తున్నారనే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో రావడంతో, వందలాది మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. కొందరు నిరసనకారులు రాళ్ల వర్షం కురిపించగా, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి, భాష్పవాయువును ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సోలీసు అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘మిఠాయిల రాజధాని’ ఎక్కడ?.. ఏ స్వీట్కు ఐజీ ట్యాగ్? -
పోల్ తీసుకున్నారని.. మైనర్ బాలురలపై లాఠీచార్జ్..
-
రక్షకులా.. రాక్షసులా!
గుంటూరు జిల్లా: ‘బూటు కాళ్లతో మా పిల్లలను తొక్కుతారా? పన్నెండు మంది కలిసి పోల్ పీక్కెళితే అందులో నలుగురు దళిత బిడ్డలను మాత్రమే స్టేషన్కు పిలిపించి లాఠీలు విరిగేలా అరికాళ్లపై కొట్టడమేంటి?’ అంటూ అప్పాపురం దళితవాడ ప్రజలు పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిచి చెప్పే కనీస జ్ఞానం కూడా లేదా? లాఠీలతో కొట్టి అక్కడే నడిపిస్తారా’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురానికి చెందిన పన్నెండు మంది విద్యార్థులు వాలీబాల్ నెట్ కట్టుకునేందుకు సోమవారం ఓ వీధిలో ఉన్న టెలిఫోన్ స్తంభాన్ని(పోల్) తొలగించి, తీసుకెళ్లారు. ఆ సమయంలో స్తంభానికి చుట్టి ఉన్న విద్యుత్వైర్లు కదిలి ఇళ్లలో ఉన్న విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయంటూ ఓ మహిళ కాకుమాను పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం వారిలో నలుగురు యువకులను పోలీసులు స్టేషన్కు పిలిపించి కొట్టారని ఆరోపిస్తూ అదే రోజు రాత్రి తల్లిదండ్రులు స్టేషను వద్దకు వెళ్లి పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాలుగు గంటల పాటు రాస్తారోకో ‘మా పిల్లలను బూటు కాళ్లతో తొక్కి, లాఠీలు విరిగేలా అరికాళ్లపై కొట్టిన ఎస్ఐ ఏక్నాథ్ను సస్పెండ్ చేయాలి. కులం పేరుతో దూషించిన ఏఎస్ఐ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం అప్పాపురం దళితవాడ వాసులు బాధిత విద్యార్థులు, యువకులతో కలిసి మెయిన్ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పన్నెండు మందిలో అగ్రవర్ణాల పిల్లలు కూడా ఉన్నారని, కానీ వాళ్లను వదిలేసి దళిత బిడ్డలనే స్టేషన్కు పిలిపించి దాడి చేయడం ఏంటని ప్రశి్నంచారు. చదువుకునే పిల్లలను ఇలా విచక్షణారహితంగా కొట్టడం ఏమిటంటూ తల్లిదండ్రులు నిప్పులు చెరిగారు. బాధిత యువకులు, విద్యార్థులు స్టేషన్లో సీసీ కెమెరాల్లేని గదిలోకి తీసుకువెళ్లి పోలీసులు అమానుషంగా దాడి చేశారని వాపోయారు. స్టీల్ రాడ్లతో సైతం కొట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో వందల మంది మహిళలు, స్థానికులు రాస్తారోకోలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దళితసంఘ నాయకుడు చార్వాక దళితులకు మద్దతు పలికి, రాస్తారోకోలో పాల్గొన్నారు. దళిత బిడ్డలపై అబద్ధాలతో ఫిర్యాదు చేసిన మహిళతో పాటు కులం పేరుతో తమను, తమ పిల్లలను దూషించిన ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ చార్వాక దళితవాడ ప్రజలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో చివరికి వారు శాంతించారు. కాగా, పోలీసుల దాషీ్టకానికి బలైన దళిత విద్యార్థులకు వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ అండగా నిలిచారు. బుధవారం మధ్యాహ్నం అప్పాపురం దళితవాడలో పర్యటించిన ఆయన బాధిత విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనను ఇంతటితో వదిలేది లేదని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు. -
కర్ణాటక పోలీసులపై బీజేపీ మహిళ సంచలన ఆరోపణలు
బెంగళూరు : ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో కర్ణాటకలోని బీజేపీ మహిళపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. తన ప్రాంతంలో ఓటర్ల జాబితా నిర్వహించడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులు తన పట్ల దారుణంగా ప్రవర్తించారని వివస్త్రను చేశారని మహిళా కార్యకర్త ఆరోపించారు. సోమవారం తనను అరెస్టు చేసిన పోలీసు సిబ్బంది తనను కొట్టి, బలవంతంగా బట్టలు విప్పించారని ఆమె ఆరోపించారు. అయితే దీనిపై పోలీసల వాదన మరో ఉంది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఈ వివాదం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే...బీజేపీ కార్యకర్త సుజాత హండి, చాలుక్య నగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఎస్ఐఆర్ సర్వే సందర్బంగా తలెత్తిన ఘర్షణ కారణంగా ఆమెను అరెస్టు చేస్తున్నప్పుడు, మగ పోలీసులు తనపైదాడిచేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ, అభ్యంతర కరంగా ప్రవర్తించారని బాధితురాలి ఆరోపణ. ఈ సంఘటనకు సంబంధించి రెండు వీడియోలు వైరల్ అయ్యాయి.వాటిలో ఒకదానిలో హండిని పోలీసు వ్యాన్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలకు సంబంధించింది.🚨BJP woman worker alleges assault and stripping during SIR protest in Karnataka, police DENY CLAIMS. The woman activist is identified as Sujata Handi Cops claim 'she stripped' pic.twitter.com/dL15PuB5hQ— The Tatva (@thetatvaindia) January 7, 2026 మరోవైపు సుజాత ఆరోపణలు పోలీసులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఆమెతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణ పూర్తిగా అవాస్తవం అన్నారు. అయితే, సుజాత అరెస్టును ప్రతిఘటించి, అధికారులతో దురుసుగా ప్రవర్తించిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమే చింపేసుకుందిఅధికారులు నిర్వహిస్తున్న సర్వే సమయంలో స్థానికుల మధ్య విభేదాలు తలెత్తి, అది ఘర్షణకు దారితీసింది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు, వాగ్వాదాలు జరిగాయి, భౌతిక దాడులకుదిగారని పోలీసులుత ఎలిపారు.దీనిపై స్థానికుడు ప్రశాంత్ బొమ్మాజీ ఫిర్యాదు ఆధారంగా ఆమెను అరెస్టు జరిగినట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, సోమవారం ఎనిమిది నుండి పది మంది మహిళా అధికారులతో కలిసి హండిని అరెస్టు చేయడానికి వెళ్లారని, ఈ క్రమంలో నిందితురాలు పోలీసు వ్యాన్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆమే తన బట్టలు తీసేసిందని శశికుమార్ చెప్పారు. అక్కడున్న మహిళా అధికారులు ఆమెకు మరో జత బట్టలు అందించడానికి స్థానికుల సహాయం కోరారని, ఆమెను బట్టలు వేసుకోమని పదేపదే కోరామని చెప్పారు. అలాగే నిందితురాలు సుజాతపై గత ఐదేళ్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయన్నారు. ఐదు గత ఐదేళ్లవి కాగా, నాలుగు ఈ సంవత్సరానికి చెందినవి. ఈ నాలుగింటిలో మూడు ప్రజలు దాఖలు చేసినవి, ఒకటి పోలీసు దాఖలు చేసినట్టు వివరించారు.#WATCH | Hubballi, Karnataka: BJP worker allegedly assaulted in Hubballi, sister of victim, Vijaylakshmi says, "... We were sitting outside our house when around 30 policemen arrived. They took Sujata and all of us inside. Sujata was brutally assaulted, and her clothes were torn.… pic.twitter.com/UQooQPrs7j— ANI (@ANI) January 7, 2026సుజాత అరెస్ట్పై కమిషనర్ స్పందిస్తూ, అరెస్టు సమయంలో, ఆమె తన అనుచరులతో కలిసి పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించి ఘర్షణకు దిగిందనీ, సబ్-ఇన్స్పెక్టర్, ముగ్గురు నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారనీ, విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని ఆయన చెప్పారు.బాధితురాలి సోదరి"మా ఇంటి బయట కూర్చుని ఉండగా, సుమారు 30 మంది పోలీసులు వచ్చి సుజాతతో పాటు అందర్నీ లోపలికి తీసుకెళ్లారు. సుజాతపై దారుణంగా దాడి చేశారు, ఆమె బట్టలు చింపేశారు. మహిళా, పురుష పోలీసు అధికారుతొద్దరూ ఉన్నారు, మమ్మల్ని వదిలేయమని వేడుకున్నాం అయినా పోలీసులు సుజాతను ఈడ్చుకెళ్లారు." అని బాధితురాలి సోదరి విజయలక్ష్మి తెలిపింది. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా లోకానికే తీరని అవమానమని, సంబంధిత లీసులను వెంటనే సస్పెండ్ చేయాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి : 16 అంతస్తుల బిల్డింగ్పైనుంచి పడి టెకీ దుర్మరణం -
AP: దళితులపై పోలీసుల దమనకాండ
-
మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి దెబ్బ
రాయ్పూర్: ఛత్తీస్ఘఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బ తగిలింది. జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 7 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.లొంగిపోయిన వారిలో ఒకరు సీవైపీసిఎం, ఒకరు డీవీసీఎం, ముగ్గురు పీపీసిఎం, ముగ్గురు ఏసియం, అలాగే 18 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. మొత్తం మీద వీరిపై రూ. 64 లక్షల రివార్డ్ ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడుతూ.. ‘పూనా మార్గం ప్రచారం ప్రభావంతో మావోయిస్టులు తమ పాత మార్గాన్ని వదిలి, జనజీవన స్రవంతిలోకి వచ్చారు. సమాజంలో శాంతి, అభివృద్ధి కోసం వారు ముందుకు రావడం సంతోషకరం’ అని పేర్కొన్నారు.పోలీసుల వ్యూహం ఫలించిందిసుక్మా జిల్లాలో గత కొంతకాలంగా పోలీసులు సమాజంలో కలిసిపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, పూనా మార్గం ప్రచారం వంటి చర్యలు తీసుకున్నారు. ఈ వ్యూహం ఫలితంగా మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి, శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది. వారిని సమాజంలో తిరిగి కలిపి, సాధారణ జీవన విధానంలోకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయనున్నారు. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోవడం, ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. పూనా మార్గం ప్రచారం, పోలీసుల వ్యూహం, అభివృద్ధి కార్యక్రమాలు ఈ విజయానికి కారణమయ్యాయి. -
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
భారత స్టార్ పేసర్ క్రాంతి గౌడ్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారి కలలు ఫలించాయి. ఆమె తండ్రి మున్నా సింగ్ తిరిగి ఉద్యోగంలో చేరేందుకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.గతేడాది భారత్ తరఫున మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది క్రాంతి గౌడ్. ఇప్పటికి మొత్తంగా 15 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. వన్డేల్లో 23, టీ20లలో రెండు వికెట్లు తీసింది.తొమ్మిది వికెట్లు కూల్చి.. అయితే, గతేడాది సొంతగడ్డపై జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025లో క్రాంతి గౌడ్ అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది. ఈ మెగా టోర్నీలో మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చి.. భారత్ తొలిసారిగా చాంపియన్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించింది. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది.కూతురి ప్రతిభ.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్రాంతి గౌడ్ సముచిత రీతిలో గౌరవించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్.. క్రాంతి తండ్రి మున్నా సింగ్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్కు గర్వకారణమైన తమ ముద్దుబిడ్డ పట్ల ప్రేమను చాటుకుంటూ నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ క్రమంలోనే మున్నా సింగ్ తిరిగి పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరవచ్చని సోమవారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ క్రీడా శాఖా మంత్రి విశ్వాస్ సారంగ్ వెల్లడించారు. ‘‘అథ్లెట్ల పట్ల గౌరవం, వారి బాగోగుల గురించి మా ప్రభుత్వం పట్టించుకుంటుందనేందుకు ఇదే నిదర్శనం.మా నిర్ణయం వల్ల గౌడ్ కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి లాభం చేకూరకపోవచ్చు. అయితే, తన తండ్రి గౌరవప్రదంగా.. పోలీస్ యూనిఫామ్లో రిటైర్ అవ్వాలన్న క్రాంతి కల మాత్రం నెరవేరుతుంది’’ అని పేర్కొన్నారు. కాగా మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేసిన మున్నా సింగ్ 2012లో సర్వీస్ నుంచి తొలగించబడ్డారు.మున్నా సింగ్పై అందుకే వేటుఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో మున్నా సింగ్పై వేటు పడింది. ఈ క్రమంలో మున్నా సింగ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడింది. నిలకడైన ఆదాయంలేక చాలీచాలని డబ్బులతో.. ఒక్క పూట భోజనం కూడా దొరకడం కష్టమైన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ క్రాంతి గౌడ్ క్రికెటర్ కావాలన్న తన కలను వదల్లేదు.ట్విస్టు ఏంటంటే?కష్టాల కడలిని దాటి భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది. అంతేకాదు వరల్డ్కప్ విజయంలోనూ కీలకంగా వ్యవహరించి కీర్తిప్రతిష్టలు సంపాదించింది. ఈ క్రమంలోనే ఆమె తండ్రికి ఉద్యోగం తిరిగి వచ్చింది. అయితే, ఇక్కడే ఓ ట్విస్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్డీటీవీ వివరాల ప్రకారం.. జూన్ 8, 2012 నుంచి జనవరి 5, 2026 వరకు మున్నా సింగ్ విధుల్లో లేడు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆయనకు ప్రభుత్వం ‘నో వర్క్, నో పే’ నిబంధనను వర్తింపజేసినట్లు సమాచారం. అంటే.. 2012- 2026 వరకు సర్వీసు కోల్పోయిన మున్నా సింగ్కు ఎలాంటి జీతభత్యాలు ప్రభుత్వం చెల్లించదు. చదవండి: ఆ ముగ్గురిని చూస్తుంటే..: కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
RK Roja : అందుకే 36వ ర్యాంకు వచ్చింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి..
-
Tirupati: సాక్షి దినపత్రిక ఫొటోగ్రాఫర్ మోహనకృష్ణపై కేసు
-
ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో అమర్ దీప్ను పట్టుకున్న పోలీసులు
-
రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారు
సాక్షి, అమరావతి: ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మండిపడ్డారు. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే సీఎం చంద్రబాబు... రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సోమవారం ఆయన పోస్ట్ చేశారు. ‘‘ఒక చిన్న ఎంపీపీ ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేస్తున్న తీరు, ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బల ప్రదర్శన వేదికగా మార్చిన వైనం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని బట్టబయలు చేస్తోంది’’ అని అన్నారు.‘‘ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికలో ఓటు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా, వారిపై దాడి చేశారు. దీంతో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు. మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం... ఎంపీపీ ఎన్నికలో వారిని ఓటు వేయకుండా ఆపడమే.ఒక భయాందోళన పరిస్థితి సృష్టించి, బల ప్రయోగంతో వారి ఓటు హక్కును అడ్డుకోవడమే. ప్రజల గొంతును అణచివేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతరేయడానికి ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనల సమయంలో... పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి బహిరంగంగా మద్దతిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడడంలో విఫలమవుతున్నారు’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. మౌన ప్రేక్షకుల్లా ఎన్నికల అధికారులు ‘‘రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో కూడా అదే పరిస్థితి చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిలిచి, ఎంపీపీ ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారు’’ అని జగన్ ధ్వజమెత్తారు.‘‘ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల కిడ్నాప్, వారిపై బహిరంగంగా దాడి, పోలీసు వ్యవస్థను దుర్వీనియోగం చేయడం, ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయింది. ఒక చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఎన్నికలోనే ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత అధికార దుర్వీనియోగం చేస్తోందో తేటతెల్లం అవుతోంది. ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకిగా మారింది అన్న విషయాన్ని చాటుతోంది’’ అని జగన్ అన్నారు. -
డయల్ 100.. స్పాట్లోనే దొరికిన దొంగ
సాక్షి హైదరాబాద్: మియాపూర్ పోలీసులు శబాష్ అనిపించుకున్నారు. డయల్ 100కు కాల్ చేసిన క్షణాల్లోనే స్పందించి ఏటీఎంలో దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకొని సత్తా చాటుకున్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ బాధ్యతని దానికోసం నిరంతరం అప్రమత్తతతో ఉంటామని పోలీసులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. మాదాపూర్ జోన్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్, మార్థండనగర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద నిన్న(ఆదివారం) రాత్రి సమయంలో దొంగతనం జరుగుతోందని గుర్తుతెలియని వ్యక్తులు 100కు డైల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. ఏటీఏంలో డబ్బుల చోరీకి యత్నిస్తున్న నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అనంతపురం జిల్లా అక్కంపల్లి మండలం జార్జ్పేట్ గ్రామం వాసి కాటమయ్య (24)గా గుర్తించినట్లు తెలిపారుఏటీఏం చోరికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్దనష్టం తప్పినట్లు మియాపూర్ ఏసీపీ సీహెచ్ వై శ్రీనివాస్ కుమార్ తెలిపారు. చుట్టు ప్రక్కల ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు నమోదైతే ప్రజలు డయల్–100కు కాల్ చేయాలని ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. -
సాక్షి ఫోటోగ్రాఫర్పై పోలీసుల దాడి
-
తిరుపతిలో హైటెన్షన్ పోలీసుల లాఠీ ఛార్జ్
-
దళిత మహిళపై సీఐ దౌర్జన్యం
వేమూరు(చుండూరు): దళిత మహిళపై బాపట్ల జిల్లా చుండూరు సీఐ దౌర్జన్యం చేశాడు. ఆమెను దుర్భాషలాడడంతోపాటు తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు తెనాలి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలు శనివారం ఆస్పత్రిలోని అవుట్పోస్టులో పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ప్రకారం.. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన బంక శారద తన భర్త చంద్రకాంత్, అత్త విక్టోరియాపై గత నెల 18న బంగారం చోరీ కేసు పెట్టింది. చుండూరు సీఐ ఆనందరావు 19న శారద, చంద్రకాంత్, విక్టోరియాలను స్టేషన్కు పిలిపించి విచారణ చేశారు.చంద్రకాంత్పై సీఐ చేయిచేసుకున్నారు. భార్యాభర్తలు సక్రమంగా కాపురం చేసుకోవాలని హెచ్చరించి పంపించారు. శారద ఇంటికి రాకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. బ్రాహ్మణకోడూరు నుంచి తన బంధువులను 10 మందిని తీసుకొని శనివారం చుండూరు పోలీసుస్టేషన్కు వచ్చింది. దీంతో సీఐ ఆనందరావు బంక విక్టోరియా, చంద్రకాంత్లను స్టేషన్కు పిలిపించారు. వారిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. విక్టోరియాను పొత్తి కడుపులో పొడిచి, చేతులపై కొట్టారు. తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో విక్టోరియాను తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకు వెళ్లారు. ప్రభుత్వ వైద్య శాలల్లో చికిత్స పొందుతున్న ఆమె అవుట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు నా భార్య తప్పుడు కేసు పెట్టింది. సీఐ ఆనందరావు విచారణ చేయకుండా శనివారం పోలీసు స్టేషన్లో నా తల్లిని దుర్భాషలాడి ఇష్టారాజ్యంగా కొట్టారు. నన్ను కూడా కొట్టారు. మాకు న్యాయం చేయాలి. – బంక చంద్రకాంత్, ఆలపాడు గ్రామం -
మావోళ్లు.. ఎక్కడున్నట్టు?
‘మా అన్న నక్సల్స్లోకి వెళ్లాడు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు చాలాసార్లు మా ఇంటికి వచ్చారు. లొంగిపోవాలని చెప్పారు. నిన్న డీజీపీ చెప్పిన లిస్టులో మా అన్న పేరు లేదు. ఎక్కడున్నాడో కనీసం మావోయిస్టు బాధ్యులు కూడా చెప్పడం లేదు. అన్నలు, పోలీసులు ఎవరు ఆచూకీ చెప్పకుంటే ఎలా’అని కోరుట్ల నుంచి 44 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన బెజ్జారపు కిషన్ తమ్ముడు ఆంజనేయులు ప్రశ్న. కిషన్ భార్య కూడా తన భర్త ఎక్కడున్నాడో తెలపాలని వేడుకుంటోంది.జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి 44 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన నిజాముద్దీన్ కుటుంబ పరిస్థితి కూడా దాదాపు ఇదే. మావో టెక్ విభాగ ఇన్చార్జ్గా పనిచేసినట్టు చెప్పుకున్న నిజాముద్దీన్ ఆచూకీ ఎక్కడా దొరకడం లేదు. ఇలా ఉత్తర తెలంగాణ నుంచి నక్సల్స్ ఉద్యమంపై ఆసక్తితో అజ్ఞాతంలోకి వెళ్లి జాడ లేకుండా పోయిన వారు పదుల సంఖ్యలో ఉంటారని అంచనా.కోరుట్ల: కోరుట్ల నుంచి ప్రస్తుత మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లడానికి మూడేళ్ల ముందే అంటే.. 1982లో కోరుట్లకు చెందిన బెజ్జారపు కిషన్, మహ్మద్ నిజాముద్దీన్ నక్సల్స్లో చేరి దళాల్లో వివిధ హోదాల్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ప్రకటించిన లిస్టులో ఈ ఇద్దరి వివరాలు లేవు. ⇒ కోరుట్ల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ముక్కా వెంకటేశం డీసీఎం స్థాయిలో 1998లో యాదగిరిగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ⇒ పసుల రాంరెడ్డి తెలంగాణ పశ్చిమ డివిజన్ దళానికి డీసీఎంగా పనిచేస్తూ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వద్ద 2000 సంవత్సరంలో జరిగిన మద్దిమల్ల ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ లెక్కన కోరుట్ల నుంచి నక్సల్స్లోకి వెళ్లిన బెజ్జారపు కిషన్, నిజాముద్దీన్, తిప్పిరి తిరుపతి, ముక్కా వెంకటేశం, పసుల రాంరెడ్డిల్లో ఇద్దరు ఎన్కౌంటర్లలో మృతి చెందగా.. మరో ఇద్దరు జాడ లేకుండా పోయారు. ఏడాది క్రితం వరకు తెలంగాణ నుంచి 55 మంది వరకు మావోయిస్టుల్లో ఉన్నారని పోలీసు రికార్డులు చెబుతుండగా, ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారని..వారి పేర్లు ప్రకటించడం గమనార్హం.దీంతో ఇప్పటి వరకు ‘మావో’ల్లోనే మావారు ఉన్నారని అనుకొని వారి కోసం ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నాయి. పౌరహక్కుల సంఘాలు, ఇతర మార్గాల ద్వారా మావోయిస్టు ప్రతినిధులకు సమాచారం పంపినా ఫలితం దక్కలేదు. ఆచూకీ లేకుండా పోయిన వారు ఉద్యమంలో ఉన్నారా? జైళ్లలో ఉన్నారా ? లేకుంటే చనిపోయారా? అన్న విషయంలో మావోయిస్టులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
వరంగల్లో మూగబోయిన పోలీస్ సైరన్
సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలోని జన్మభూమి జంక్షన్ వద్ద ఆకతాయిల వీరంగం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. నడిరోడ్డుపై బీర్ సీసాలతో హంగామా చేస్తూ కొంతమంది వ్యక్తులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. గంజాయి మత్తులో రెండు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో వారిని అదుపు చేయడానికి వెళ్లిన వారిపై కూడా దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో తరచూ గొడవలు జరుగుతున్నప్పటికీ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో నివసించే వారు ప్రాణాలు గుపిట్లో పెట్టుకొని తమ గృహాలకు చేరుతున్న పరిస్థితి నెలకొంది. రోజురోజుకి ఆకతాయిల అల్లర్లు పెరుగుతున్నాయి. వారిని అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో పోలీస్ పెట్రోలింగ్ సరిగ్గా లేకపోవడం మాకు భయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు పెట్రోలింగ్ పెంచి గొడవలను అదుపులోకి తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
సీఐ అయితే ఏంటి.. ఏం పీక్కుంటావ్
అనంతపురం: ‘నువ్వు సీఐ అయితే ఏంటి? ఏం పీక్కుంటావ్!’ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి అనుచరుడు, ఆ పార్టీ కడప పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి బొజ్జ మైసూరారెడ్డి నోరుపారేసుకున్నారు. జెడ్పీ కార్యాలయం ఆవరణలోనే అనంతపురం టూటౌన్ సీఐ శ్రీకాంత్పై బూతుపురాణం విప్పారు. ఇంత జరిగినా అతన్ని రాచమర్యాదలతో జెడ్పీ సమావేశంలోకి స్వయాన ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి పిలుచుకెళ్లడం విమర్శలకు తావిచ్చింది. వైఎస్సార్సీపీ శ్రేణులపై ఒంటికాలిపై లేస్తూ అక్రమ కేసులు బనాయించే సీఐ శ్రీకాంత్ తనపై టీడీపీ నేత బొజ్జ మైసూరారెడ్డి రెచ్చిపోయినా కనీసం మందలించే సాహసం కూడా చేయలేకపోయారు.వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం అనంతపురంలోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. దీనికి టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి అనుచరులతో కలసి హాజరయ్యారు. సమావేశ మందిరంలోకి ప్రజాప్రతినిధులు, సభ్యులు మినహా ఇతరులు వెళ్లకూడదని సీఐ శ్రీకాంత్ అభ్యంతరం తెలిపారు. దీంతో టీడీపీ నాయకుడు బొజ్జ మైసూరారెడ్డి రెచ్చిపోయారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపైనే బూతులు తిడుతూ దాడి చేయబోయాడు. ‘సమావేశంలోకి వెళ్లకుండా ఆపడానికి నువ్వెవరు? మేం కూడా నీలాగే డ్యూటీలో ఉన్నాం.ఏయ్.. నువ్వు సీఐ అయితే ఏంటి? ఏం పీక్కుంటావ్!’ అంటూ రౌడీయిజం ప్రదర్శించాడు. సభ్యులు తప్ప మరెవరినీ లోపలకు అనుమతించరాదని కలెక్టర్ ఆదేశాలిచ్చారని సీఐ శ్రీకాంత్ చెబుతున్నా.. మైసూరారెడ్డి వినకుండా ‘నువ్వెంత మమ్మల్ని ఆపడానికి! మాకు కుర్చీలేదని చెప్పడానికి నువ్వెవడు’ అంటూ చెలరేగిపోయాడు. ఇంతలో పోలీసులు వచ్చి బయటకు గెంటే ప్రయత్నం చేశారు. వెంటనే ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి సమావేశం నుంచి బయటకు వచ్చి బొజ్జ మైసూరా రెడ్డిని లోపలికి తీసుకెళ్లారు. పోలీసులను తన అనుచరుడు తీవ్ర అవమానానికి గురి చేసినప్పటికీ.. ఎమ్మెల్సీ మాత్రం అతనికే వత్తాసు పలికారు. బండ బూతులతో రెచ్చిపోయినా.. టీడీపీ నాయకుడు బొజ్జ మైసూరారెడ్డి సీఐ శ్రీకాంత్ను బాహాటంగా దుర్భాషలాడినా పోలీసుల్లో ఎలాంటి చలనం కనిపించలేదు. అతనిపై కేసు నమోదు చేయకపోగా.. రాచ మర్యాదలతో సమావేశ మందిరంలోకి పంపించారు. బండ బూతులతో పబ్లిక్గా రెచ్చిపోయినా సీఐ శ్రీకాంత్ అతనిపై ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోయారు. అధికార పారీ్టకి జీహుజూర్ అంటూ సదరు నేతను అత్యంత గౌరవంగా సమావేశంలోకి పంపించి స్వామిభక్తి ప్రదర్శించారు. టీడీపీ నాయకులపై ఒకలా.. వైఎస్సార్సీపీ నాయకులపై మరొకలా వ్యవహరిస్తూ నాలుగో సింహం పూర్తిగా పక్షపాతంగా విధులు నిర్వహిస్తోందనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
సమయం లేదు మిత్రమా..
సాక్షి, హైదరాబాద్: ‘సమయం మించిపోతోంది మిత్రమా..గడువులోగా వచ్చి లొంగిపోండి. ప్రభుత్వాలు, పోలీసుల తరఫున ఏ సహకారం అందాలో అది పూర్తిగా అందిస్తాం..’అని మావోయిస్టులకు డీజీపీ బి.శివధర్రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (పీజీఎల్ఏ) పతనం అంచుకు చేరిందని, ప్రస్తుతం కేవలం 66 మంది మాత్రమే మిగిలారని తెలిపారు. ఇప్పటివరకు పట్టుబడిన మావోయిస్టుల నుంచి అత్యంత కీలక సమాచారం తెలిసిందని, వారు మావోయిస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన 52 మంది అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు రికార్డులు ఉన్నా..వాస్తవానికి 17 మంది మాత్రమే ఉన్నట్టు తెలిసిందని చెప్పారు.మడావి హిడ్మా అనుచరుడు పీజీఎల్ఏ బెటాలియన్ కమాండర్ బడ్సె సుక్క అలియాస్ దేవా (బర్సె దేవా), దర్శన్, మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి అలియాస్ రంకో సహా మొత్తం 20 మంది మావోయిస్టులు శనివారం డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. రెండు అత్యాధునిక లైట్ మెషీన్ గన్ (ఎల్ఎంజీ)లు సహా మొత్తం 48 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.రూ.20.3 లక్షల నగదు కూడా అప్పగించారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్కుమార్, శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్, ఆపరేషన్స్ అదనపు డీజీ అనిల్కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతితో కలిసి శివధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సహా మరే ఇతర రాష్ట్రాల పోలీస్ చరిత్రలోనూ ఒకే లొంగుబాటులో ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు మావోయిస్టులు విడిచిపెట్టడం ఇదే మొదటిసారి (రికార్డు) అని తెలిపారు.మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ‘అంతర్గత కలహాలు, ఆరోగ్య సమస్యలు, ప్రస్తుతం అడవుల్లో ఉండలేని పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీలకు మావోయిస్టులు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే 576 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మిగిలి ఉన్న అగ్రనేతలు సహా అందరూ వీలైనంత త్వరలో జనజీవన స్రవంతిలోకి కలుస్తారని ఆశిస్తున్నాం. గెరిల్లా ఆపరేషన్లను ముందుండి నడిపిన దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పెద్దపల్లి జిల్లా కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ లొంగుబాటుతో ఆ పార్టీ రాష్ట్ర కమిటీపై పెద్ద దెబ్బ పడినట్లయింది.రాజిరెడ్డి 1997లో ఉద్యమంలో చేరాడు. ప్రస్తుతం లొంగిపోయిన 20 మందికి మొత్తంగా రూ.1.81 కోట్ల రివార్డు అందిస్తాం. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున డీడీలు ఇస్తున్నాం..’అని డీజీపీ తెలిపారు. రాజిరెడ్డి మాట్లాడుతూ.. మారిన పరిస్థితులు, సాంకేతికత కారణంగా సాయుధ పోరాటం చేయడం కష్టమైందని చెప్పారు. అయితే తాను అనారోగ్య కారణాలతోనే లొంగిపోతున్నట్టు తెలిపారు.మిగిలిన వారు సైతం లొంగిపోవాలని సూచించారు. కాగా 2 ఎల్ఎంజీలతో పాటు అమెరికాలో తయారైన కోల్ట్ రైఫిల్, ఇజ్రాయెల్ దేశంలో తయారైన టవర్ రైఫిల్, 8 ఏకే 47లు, 10 ఇన్సాస్లు, 8 ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్)లు, 4 బీజీఎల్ (బ్యారెల్ గ్రనేడ్ లాంచర్)లు, 11 సింగిల్ షాట్లు, రెండు గ్రనేడ్లు, ఒక ఎయిర్ గన్, 93 మ్యాగ్జైన్లు, 2,206 తూటాలు మావోయిస్టులు అప్పగించారు. -
చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు
-
న్యూ ఇయర్ వేడుకల వేళ.. ఉగ్ర కుట్ర భగ్నం?
ఢిల్లీ: నూతన సంవత్సరం వేడుకల వేళ రాజస్థాన్లో కలకలం రేగింది. రాజస్థాన్ టోంక్ జిల్లాలో పేలుడు పదార్థాలు ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంచులతో ఉన్న కారును సీజ్ చేశారు. 200 కాట్రేడ్జిలు, ఐదు బండిల్స్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. నిందితులు బుండీ నుండి టోంక్కు పేలుడు పదార్థాలను తరలిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో సురేంద్ర మోచి, సురేంద్ర పట్వాలను అరెస్ట్ చేసిన పోలీసులుపలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.డీఎస్పీ మృత్యుంజయ మిశ్రా మాట్లాడుతూ.. నిఘా వర్గాల సమాచారం మేరకు పెద్ద ఆపరేషన్ చేపట్టామని.. వాహనం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని.. కేసులో అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, అమోనియం నైట్రేట్ను పేలుడు పదార్థాలతో కలిపి వాడతారు. గత నెల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో ఉపయోగించారు. ఆ ఘటనలో 15 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
తణుకులో పోలీసుల ఓవరాక్షన్..
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: తణుకులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద 144 సెక్షన్ విధించారు. జనవరి 5న వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేస్తామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రకటించగా.. వైఎస్సార్ విగ్రహం చుట్టూ రెవెన్యూ అధికారులు ఇనుక కంచె వేశారు.ఎట్టిపరిస్థితుల్లోనూ వైఎస్సార్ విగ్రహాన్ని ప్రారంభిస్తామన్న కారుమూరి తేల్చి చెప్పారు. ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి సహా 13 మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. విగ్రహం వద్ద పోలీసులు పహారా కొనసాగుతుంది.కాగా, ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే తణుకు ప్రాంతం రాష్ట్రంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన సంఘటనలతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తణుకు వై.జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ కట్టి టీడీపీ సానుభూతిపరులు చేసిన నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్సీ కట్టడంపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడం, తమ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, ఆపై రెండు ఫ్లెక్సీలు పోలీసులు తొలగింపచేయడం రాష్ట్రంలో హాట్టాపిక్గా మారింది. -
MLA బొజ్జల సుధీర్ రెడ్డిని విచారించనున్న చెన్నై పోలీసులు
-
Sajjanar: న్యూ ఇయర్ వేళ.. క్యాబ్, ఆటో డ్రైవర్లకు సజ్జనార్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే క్యాబ్, ఆటో డ్రైవర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన ఎక్స్లో ట్వీట్ చేశారు. ప్రధాన హెచ్చరికలున్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడతాయి. ఈ నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదు.నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.మీకు ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే…— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 30, 2025ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్షాట్లను ప్రయాణికులు సేకరించి వాటిని పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ వివరాలను హైదరాబాద్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్ 91 94906 16555 కు పంపాలని విజ్ఞప్తి చేశారు. -
Magazine Story: దారి తప్పిన నాలుగో సింహం పోలీసుల మెడకు ఉచ్చు
-
నేరం రుజువు కాకముందే ఖాకీల శిక్ష
సాక్షి, అమరావతి: ఇప్పటికే బరితెగించి వ్యవహరిస్తున్న ఏపీ పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం నిర్భీతిగా బేఖాతరు చేసే స్థాయికి చేరారు. రెడ్బుక్ రాజ్యాంగ అరాచకాలకు వత్తాసు పలకడమే ఏకైక కర్తవ్యంగా రాజ్యాంగ ధర్మాన్ని నిస్సిగ్గుగా పోలీసు శాఖ విస్మరిస్తోంది. నిందితుల అరెస్టు, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై స్వయంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం విస్మయపరుస్తోంది. ఆయా అంశాలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు ఏమిటీ?.. ఏపీ పోలీసుల బరితెగింపు ఏ స్థాయికి చేరిందన్న అంశాలు పరిశీలిస్తే...నిందితులను పరేడ్ చేయించకూడదుడీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం ఏదైనా కేసుల్లో నిందితులను అరెస్టు విషయంలో పోలీసులు కచ్చితంగా నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. నిందితులను అరెస్టు చేయడం, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియలో అనుసరించాల్సిన విధి విధానాలను నిర్దేశించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం.. ⇒ ఒక కేసులో నిందితులుగా ఉన్నంత మాత్రాన వారు నేరస్తులుగా భావించలేం. నేరం నిరూపితం కానంతవరకు నేరస్తులు కారు.⇒ ఇక నిందితుల సామాజిక గౌరవానికి పోలీసులు భంగం కలిగించ కూడదు. వారి గౌరవాన్ని పోలీసులు కచ్చితంగా పరిరక్షించాలి. అరెస్టు చేసిన నిందితులను బహిరంగంగా నడిపిస్తూ పరేడ్ చేయించకూడదు. వారిని ప్రజలకు కనిపించేలా ప్రదర్శించకూడదు. ⇒ నిందితులను సోదా చేసే ప్రక్రియ గౌరవప్రదంగా ఉండాలి. వారి వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించకూడదు. ⇒ అరెస్టు సమయంలో పోలీసులు బల ప్రయోగం చేయడం సరికాదు. ⇒ నిందితులు తప్పించుకునేందుకు యత్నిస్తే, గాయాలు కాకుండా వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించాలి. అంతేగానీ అరెస్టు కోసమని చెప్పి గాయపరచ కూడదు.సుప్రీం కోర్టు చెప్పినా లెక్క చేయం: ఏపీ పోలీసుల నిర్భీతి నిందితుల గౌరవానికి భంగం కలిగించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తాము లెక్కచేయబోమంటూ బాబు సర్కార్ హయాంలో ఏపీ పోలీసులు బరితెగిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కక్ష పూరితంగా అరెస్టు చేసిన పలువురు నిందితులను రోడ్డుపై నడిపించి పరేడ్ చేయించడం పోలీసుల దాషీ్టకానికి నిదర్శనం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను సంప్రదాయ జాతర తరహాలో నిర్వహించిన అభిమానులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. నరికిన పొట్టేళ్ల తలలను దండగా చేసి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీకి వేసి వేడుకలు చేసిన టీడీపీ అభిమానులను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.కానీ సాధారణ జాతర శైలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన వైఎస్సార్సీపీ అభిమానులపై మాత్రం కక్ష గట్టారు. శ్రీసత్యసాయి, అనంతపురం, ఉభయ గోదావరి తదితర జిల్లాల్లో ఏకంగా 13 కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న యువకులను అరెస్టు చేశారు. అంతేకాదు...వారిని తీవ్రంగా కొట్టారు. అనంతరం వారిని నడిరోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించారు. తద్వారా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. నిందితుల సామాజిక గౌరవానికి భంగం కలిగించారు. వారి వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాశారు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్క లేదని తేల్చి చెప్పారు. వాహనాలు లేవు.. అందుకే నడిపించాం: డీజీపీ గుప్తా బాధ్యతా రహిత స్పందన నిందితుల గౌరవానికి భంగం కలిగించ కూడని.. వారిని రోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించకూడదని సుప్రీంకోర్టు డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ‘సుప్రీంకోర్టు చెబితే మాత్రం మేమేందుకు చేస్తాం’ అన్నట్టుగా సాక్షాత్తూ ఏపీ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా స్పందించడం విభ్రాంతి కలిగిస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా నిందితులను రోడ్డుపై పరేడ్ చేయించడంపై మీడియా ప్రతినిధులు ఆయనను సోమవారం ప్రశ్నించారు. దీనిపై డీజీపీ పూర్తి బాధ్యతారహితంగా స్పందించారు. ‘నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు పోలీసుల వద్ద వాహనాలు లేవు. అందుకే నడిపించి తీసుకువెళ్లాం’ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.తద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర పోలీసు శాఖకు ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పోలీసు శాఖ చీఫ్ స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఇక ఇతర పోలీసు అధికారుల ఎలా వ్యవహరిస్తారన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సామాన్యుల గురించి ఎందుకు పట్టించుకుంటారని, పౌర హక్కుల మాటేమిటని మేధావులు, ప్రజాస్వామ్య హితైషులు ప్రశి్నస్తున్నారు. డీజీపీ గుప్తా ఒక దుస్సంప్రదాయానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వావ్.. మహిళల కోసం డ్రైవింగ్ శిక్షణ
సాక్షి హైదరాబాద్: మహిళా సాధికారదతతో స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం కీలక చర్యలు చేపడుతుంది. హైదరాబాద్ పోలీసుల సహకారంతో హైదరాబాద్లోని మహిళలకు డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్లో వారికి శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం 21-45 సంవత్సరాల మద్య వయసున్న మహిళలు (కేవలం హైదరాబాద్ వాసులే) అర్హులని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉచిత డ్రైవింగ్ శిక్షణతో పాటు లైసెన్స్ జారీలో సహాయం కల్పించనున్నట్లు తెలిపారు. వాటితో పాటు వాహనానికి లోన్ లేదా లీజ్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. వీటికి డ్రైవింగ్లో ఎటువంటి అనుభవం లేకున్నా అప్లై చేసుకోవచ్చన్నారు. జనవరి 3 శుక్రవారం అంబర్పేట్ పోలీస్ గ్రౌండ్ వేదికగా ఈ కార్యక్రమం జరపనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాలకు 89788 62299 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు.స్టీరింగ్ పట్టండి.. స్వశక్తితో ఎదగండి!హైదరాబాద్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ పోలీసుల సహకారంతో డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వనున్నారు.… pic.twitter.com/NMIdrEmJZX— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 29, 2025 -
హదీ హంతకులు భారత్లోకి రాలేదు
షిల్లాంగ్: ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఒస్మాన్ హదీ హంతకులు భారత్లోకి ప్రవేశించారంటూ బంగ్లాదేశ్ పోలీసులు చేసిన ఆరోపణలను బీఎస్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ చేస్తున్నవి నిరాధార, తప్పుదోవ పట్టించే ప్రకటనలని మేఘాలయలో బీఎస్ఎఫ్ చీఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఓపీ ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. హదీ హత్య కేసులో ఫైసల్ కరీం మసూద్, ఆలంగిర్ షేక్ అనే కీలక అనుమానితులిద్దరు హలువాఘాట్ బోర్డర్ పాయింట్ మీదుగా స్థానికుల సాయంతో భారత్లోకి ప్రవేశించినట్లు బంగ్లాదేశ్లోని ఢాకా మెట్రోపాలిటన్ అదనపు పోలీస్ కమిషనర్ ఇస్లాం ఆదివారం ఆరోపించారు. ‘భారత్లోకి పారిపోయాక ఒకరు వీళ్లను మేఘాలయలోని తురా నగరానికి తీసుకెళ్లాడు’అని ఇస్లాం చెప్పారు. ‘అనంతరం వీళ్లను భారత అధికారులు నిర్బంధించారు. ఈ విషయమై అనధికారిక వర్గాల ద్వారా భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిందితులను వెనక్కి తీసుకొస్తాం’ అని అన్నారు. ఆ ఇద్దరు నిందితులు భారత్లోకి ఎప్పుడు ప్రవేశించారనే విషయం ఆయన వెల్లడించలేదు. బంగ్లా పోలీస్ అధికారి ప్రకటనపై ఉపాధ్యాయ్ స్పందిస్తూ..‘హలువాఘాట్ సెక్టార్ మీదుగా ఎవరూ మేఘాలయలోకి ప్రవేశించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు’అని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అసత్యాలని తెలిపారు. గారో హిల్స్ ప్రాంతంలోని హలువాఘాట్ ద్వారా కొందరు వ్యక్తులు మన భూభాగంలోకి ప్రవేశించినట్లు తమకు ఎటువంటి నిఘా సమాచారం అందలేదని మేఘాయ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వివిధ నిఘా, భద్రతా సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మోహరించిన జవాన్లు అత్యంత అప్రమత్తతతో ఉన్నారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. దొంగచాటుగా ఎవరైనా ప్రవేశించిన పక్షంలో వారిని గుర్తించి, పట్టుకుని తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. -
10 నిమిషాల్లో 200 మంది పోలీసులను దించుతా..!
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ ముందు గంటపాటు హైడ్రామా నడిచింది. తన కొడుకుతోపాటు మరో ముగ్గురిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టారని శనివారం రాత్రి ఓ మహిళ రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు నాగమణి తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం ఉదయం తాడేపల్లి ఎస్ఐ సాయి తమ ఇంటికి వచ్చి తన కుమారుడిని గంజాయి విక్రయిన్నాడనే ఆరోపణలతో స్టేషన్కు తీసుకెళ్తున్నామని చెప్పారన్నారు. ఆధార్ కార్డు, ఇతర ప్రూఫ్లు ఇస్తే పంపించేస్తామని నమ్మబలికారని తెలిపారు. అవన్నీ తీసుకున్నాక స్టేషన్లో కాకుండా పక్కన వేరే గదిలో పెట్టి చిత్ర హింసలకు గురిచేశారన్నారు. తమ కుమారుడు తేజ ముంతతోపాటు గాందీనగర్లో నివసించే దినేష్ ప్రేమ్చంద్, యర్రబాలెంలో నివాసం ఉండే పవన్లను కూడా ఇదే తరమాలో తీసుకొచ్చారని ఆరోపించారు. దీనిపై నిలదీస్తే అసభ్య పదజాలంతో తనను దూషించారని వాపోయారు. ఇంతలో ఒక నాయకుడు అటుగా రావడంతో సీఐ అరాచకాలను నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కాళ్లు పట్టుకుని ఆమె బతిమిలాడారు. ఓ నాయకుడు ఆ మహిళను సీఐ వద్దకు తీసుకెళ్లగా అందరి సమక్షంలోనే ‘‘200 మంది పోలీసులను 10 నిమిషాల్లో దించుతాను. మర్యాదగా చెప్పింది చెయ్యి. కపట్రాల తిప్పలో నీలాంటి వాళ్లను ఎంతోమందిని చూశాను. ఎవరు ఏం చేస్తారో చూస్తాను’’ అంటూ పెద్దపెద్దగా మాట్లాడారు. విధులకు ఆటంకం కలిగించినట్లు ఆమెపై కేసు పెట్టండని సిబ్బందిని ఆదేశించారు. మరో మహిళ కూడా సీఐ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదంతా చూసి ఎస్ఐలు అవాక్కయ్యారు. సోమవారం అదుపులోకి తీసుకున్న వారిపై శనివారం ప్రకాషః్ నగర్ శ్మశానవాటిక వద్ద పట్టుకున్నట్లు కేసు నమోదు చేయడం ఏంటని, ఇది తమ తలకు చుట్టుకునేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సక్రమంగా ఉన్నతాధికారులు విచారణ చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. -
దారి తప్పే ఖాకీలకు ‘మిత్ర’ సాయం
సాక్షి, హైదరాబాద్: ఆపదలో ఉన్న ఎవరికైనా మొదట గుర్తొచ్చేది పోలీసులు. విపత్తులైనా, శాంతిభద్రతల సమస్యలైనా వెంటనే డయల్ 100కి కాల్ చేస్తాం. అదే పోలీసులకు ఆపదొస్తే..? అనుకోని కష్టాలతో ఆత్మహత్య వంటి విపరీత నిర్ణయాలు తీసుకునేంతగా కుంగిపోతే? అలాంటి వారికి ‘మిత్ర’అనే శిక్షణ కార్యక్రమం అండగా నిలుస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్, మద్యపానం, విపరీతంగా అప్పులు చేయడం వంటి కారణాలతో దారితప్పుతున్న సిబ్బందిని గాడిలో పెట్టి వారిలో తిరిగి స్థైర్యాన్ని నింపేందుకు పోలీస్ మిత్ర బృందాలు కృషిచేస్తున్నాయి.నిత్యం సవాళ్లతో కూడిన విధుల్లో ఉండే పోలీసుల మానసిక, శారీరక ఆరోగ్యం కాపాడే లక్ష్యంతో స్వాతిలక్రా బెటాలియన్స్ అడిషనల్ డీజీగా ఉన్న సమయంలో టీజీఎస్పీలో ‘మిత్ర’ను 2023లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో ఉత్తమ ఫలితాలు వస్తుండటంతో ప్రస్తుత అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ ఇందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జమ్మూకశ్మీర్లో సీఆర్పీఎఫ్ సిబ్బంది కోసం నిర్వహించిన ‘లవ్ యూ జిందగీ’ కార్యక్రమం దీనికి స్ఫూర్తి అని అధికారులు తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖలోని ఇతర విభాగాలకూ దీన్ని విస్తరించే అవకాశం ఉంది. 8 రోజులు తరగతులు టీజీఎస్పీలోని 13 బెటాలియన్స్ నుంచి ఎంపిక చేసిన 68 మంది మాస్టర్ ట్రైనర్ సర్టీఫికేషన్ కోర్సు పూర్తి చేశారు. వీరంతా ప్రతి బెటాలియన్లో ఐదుగురు చొప్పున ‘మిత్ర’శిక్షకులుగా పనిచేస్తున్నారు. ఫిర్యాదులొచ్చిన వారితోపాటు ఆసక్తి ఉన్న వారిని గుర్తించి 20–30 మంది చొప్పన బ్యాచ్లుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు. మూడేళ్లలో 9,153 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో ఎంతోమంది తమను తాము మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ‘8 రోజుల కోర్సులో మానసిక ఆరోగ్యం, అవగాహన పెంచడం, కుటుంబ, ఆర్థిక అంశాల నిర్వహణ, లింగ సమానత్వం అనే అంశాలపై ప్రధానంగా దృష్టి పెడతాం. వారి ఇబ్బందులు తెలుసుకుని వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం’అని ట్రైనింగ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎన్వీ రమణ తెలిపారు. సిబ్బందిలో మార్పు తెస్తోంది: సంజయ్ కుమార్ జైన్, అడిషనల్ డీజీ, టీజీఎస్పీ పోలీస్ ఉద్యోగంలో ఒత్తిడి తప్పదు. మానసిక, శారీరక ఒత్తిడిని ఎలా జయించాలన్న అంశాలపై బెటాలియన్స్ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాం. మిత్ర శిక్షణతో సిబ్బందిలో మార్పు కనిపిస్తోంది. ఈ కోర్సును మరింత ప్రభావంతంగా మార్చేందుకు కొత్త అంశాలను జోడించి మార్పులు చేస్తాం. ముందు ఎంతో కోపం ఉండేది: కానిస్టేబుల్, 8వ బెటాలియన్ నాకు గతంలో ఎంతో కోపం ఉండేది. ఏ చిన్న విషయమైనా గొడవ పెట్టుకునే వాడిని. అలా ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ, మిత్ర కోర్సు తర్వాత నాలో మార్పు వచ్చింది. ఏ పరిస్థితి అయినా వెంటనే రియాక్ట్ కాకుండా కాస్త స్థిమితంగా ఆలోచించాకే మాట్లాడుతున్నా. గతంలో విచ్చలవిడిగా క్రెడిట్కార్డు వాడేవాడిని. అప్పులు పెరిగేవి. ఇప్పుడు దుబారా ఖర్చులు తగ్గించుకున్నా. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా..: కానిస్టేబుల్, 3 బెటాలియన్ గతంలో ఎంతో ఎమోషనల్గా ఉండేవాడిని. ఆర్థిక ఇబ్బందులతో ఒకసారి ఆత్మహత్యవరకు వెళ్లాను. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా.. ముందు కాస్త ఆలోచించాకే నిర్ణయాలు తీసుకుంటున్నా. ఇంట్లో కూడా ఎంతో కోపంగా ఉండేవాడిని. కుటుంబ విలువ తెలుసుకున్నా, బడ్జెట్ డైరీ పెట్టుకొని అనవసర ఖర్చులు తగ్గించడం నేర్చుకున్నా. వీటి గురించి నాతోటి సిబ్బందికీ చెబుతున్నా. వ్యసనాలన్నీ వదిలేశాను..నేను గతంలో మద్యంతోపాటు ఎన్నో చెడు అలవాట్లకు బానిసనయ్యాను. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నా. నా ప్రవర్తన చూసి ఉన్నతాధికారులు ఎన్నోసార్లు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ నాలో మార్పు రాలేదు. కానీ మిత్ర శిక్షణకు వచ్చిన తర్వాత నన్ను నేను మార్చుకున్నా. చెడు అలవాట్లు పక్కన పెట్టా. నా గౌరవం కూడా పెరిగింది. – హెడ్కానిస్టేబుల్, 8వ బెటాలియన్ -
ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఏటీఎస్.. యాంటీ టెర్రర్ గ్రిడ్
న్యూఢిల్లీ: దేశంలోని పోలీసు వ్యవస్థ కోసం ఏటీఎస్(అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్)ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అదేవిధంగా, యాంటీ టెర్రర్ గ్రిడ్ను కూడా అందుబాటులోకి తేవడం ద్వారా ఉగ్రదాడులను ప్రతి స్థాయిలోనూ ఉమ్మడిగా వేగంగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలవుతుందని చెప్పారు. ‘వ్యవస్థీకృత నేరాలపై 360– డిగ్రీల దాడి’అనే కొత్త పథకాన్ని త్వరలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జీరో టెర్రర్ పాలసీకి ఇది అత్యంత కీలకంగ మారనుందని ఆయన వివరించారు. దేశ రాజధానిలో శుక్రవారం మొదలైన రెండు రోజుల యాంటీ టెర్రరిజమ్ కాన్ఫరెన్స్–2025లో మంత్రి అమిత్ షా ప్రసంగించారు. ‘బలవంతంగా డబ్బు వసూలు చేయడమనే ఏకైక లక్ష్యంతో వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు ఏర్పడుతాయి. వాటి నేతలు విదేశాలకు పారిపోయి, అక్కడే స్థిరపడిపోయాక.. ఇక్కడుండే నెట్వర్క్ ఉగ్ర గ్రూపుల ఆ«దీనంలోకి వెళ్లిపోతున్నాయి. అటు తర్వాత, ఆ నెట్వర్క్ ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు దోహదపడుతోంది’అని అమిత్ షా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్గనైజ్డ్ క్రైం నెట్వర్క్ డేటాబేస్, వెపన్స్ డేటా బేస్ ఫర్ లాస్ట్, లూటెడ్ అండ్ రికవరీ ఆరŠమ్స్కు సంబంధించిన రెండు డేటాబేస్లను ఆయన ప్రారంభించారు. జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) రూపొందించిన ఈ డేటాబేస్లను దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా విభాగాలు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. వీటితోపాటు ఉగ్రవాదులు, నేరగాళ్లకు సంబంధించిన డేటాబేస్లను కూడా రూపొందించాలని సూచించారు. -
ఎవడో ప్రోగ్రాంలో దూరుతున్నాడు.. మేము 4గంటలకు పోయి దండా వెయ్యాలా?
-
భక్తులపై లాఠీ ఛార్జ్.. కవరేజ్ చేస్తున్న సాక్షి ఫోటోగ్రాఫర్ పై దాడి
-
జన నాయగణ్ భారీ ఈవెంట్.. మలేసియా పోలీసుల షాక్.!
పాలిటిక్స్ ఎంట్రీ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న చిత్రం జన నాయగన్. రాజకీయ అరంగేట్రానికి ముందు ఇదే నా చివరి సినిమా అవుతుందని ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా పొంగల్ బరిలో నిలిచింది.ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే గ్రాండ్ ఆడియా లాంఛ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. తమిళులు ఎక్కువగా ఉండే మలేసియాలో ఈ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి దాదాపు లక్షమందికి పైగా ఫ్యాన్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 27న జరగనున్న ఈవెంట్ ద్వారా గిన్నిస్ రికార్డ్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.అయితే ఈ భారీ ఈవెంట్ నేపథ్యంలో మలేసియా పోలీసులు అలర్ట్ అయ్యారు. కౌలాలంపూర్లో జరగనున్న ఈ బిగ్ ఈవెంట్పై ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయవద్దని ముందస్తుగానే హెచ్చరించారు. టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రసంగాలు చేయవద్దని మలేసియా పోలీసులు సూచించారు. రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయడం, బ్యానర్ల వినియోగంపై నిషేధం విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ బుకిట్ జలీల్ స్టేడియంలో జరగనుంది.కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. -
రౌడీ షీటర్ పండుకు స్పెషల్ ట్రీట్ మెంట్
-
దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు
-
దారి తప్పుతున్న యువ ఖాకీలు
ఒకప్పుడు సరదాగా మొదలైన బెట్టింగ్ ఇప్పుడు అనేక మందికి వ్యసనంగా మారింది. అయితే కేవలం సాధారణ పౌరుల జీవితాలను మాత్రమే ఛిన్నాభిన్నం చేస్తోందని అనుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఈ మహమ్మరి కోరల్లో చిక్కుకుని పోలీస్ సిబ్బంది కూడా దారి తప్పుతున్నారు. అందుకు వరుసగా వెలుగుచూసిన ఉదంతాలే కారణం!ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలై.. సర్వం కోల్పోయి.. తన దగ్గర గన్మెన్గా పని చేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకు ముందు.. ఈ వలయంలో చిక్కుకున్న ఓ అధికారి(అంబర్పేట ఎస్సై భానుప్రకాశ్) దాని నుంచి బయటపడేందుకు ఏకంగా సర్వీస్ రివాల్వర్తో పాటు ఓ కేసులో రికవరీ బంగారాన్ని తాకట్టపెట్టాడనే అభియోగాల కింద విచారణ ఎదుర్కొంటున్నారు.ఈ మధ్యలో.. నగరంలోని ఉప్పల్లో ఫిల్మ్నగర్ పీఎస్లో పని చేసే ఓ యువ కానిస్టేబుల్ ఆన్లైన్ బెట్టింగ్ల ఉన్న ఇంటిని అమ్మేసుకుని.. విధులకు దూరంగా ఉంటూ వస్తూ.. చివరకు ఒత్తిళ్ల నడుమ మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అలాగే ఆ మధ్య సంగారెడ్డి టౌన్ పోలీస్స్టేషన్లో పని చేసిన ఓ కానిస్టేబుల్ పిస్టల్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఈ భూతమే ఉందనే ప్రచారం నడిచింది. చిన్న మొత్తాలతో ప్రారంభించిన ఆన్లైన్ గేమింగ్ వ్యసనం.. ఆ తరువాత పెద్ద అప్పులకు దారితీస్తోంది. గేమ్లలో డబ్బులు కోల్పోయి, సహోద్యోగులు.. స్నేహితుల వద్ద అప్పులు చేసి తిరిగి ఇవ్వలేని స్థితికి పోలీసు సిబ్బంది చేరుకుంటున్నారు. అప్పులు తీర్చమని ఒత్తిడి పెరగడంతో చివరకు.. మానసికంగా తీవ్రంగా కలత చెంది తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.బెట్టింగ్ మహమ్మారి కోరల్లో పోలీసులు.. అందునా యువ సిబ్బంది చిక్కుకుపోతుండడం ఇటు ఉన్నతాధికారులకూ ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్ వ్యసనం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన ఉండి.. అందునా టెక్నాలజీపై పట్టుఉన్న సిబ్బంది కూడా ఆ వ్యసనంలో మునిగిపోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. దీన్ని అత్యవసరంగా కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పోలీస్ శాఖలో బలంగా వినిపిస్తోంది. -
సోషల్ మీడియాలో పోస్టులా.. అయితే ఇది మీకోసమే?
సోషల్ మీడియా ఈ రోజుల్లో దీని ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ ఏదో రూపకంగా సామాజిక మాధ్యమాలలో వచ్చే న్యూస్ చూస్తుంటాం. కొన్ని సార్లు మెసేజ్లను ఫార్వర్డ్ చేస్తుంటాం. అయితే మనం ఫార్వడ్ చేసే సమాచారం వల్ల మనకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు.ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రచారం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. నిజనిర్ధారణతో సంబంధం లేకపోవడం,ఎటువంచి ఖర్చు లేకపోవడంతో ఎవరికి తోచినట్లు వారు ఇష్ఠారీతిన సోషల్ మీడియా ప్రచారం చేపడుతున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు సామాజిక మాధ్యమాలలో జరిగే అసత్య ప్రచారాల వల్ల మహిళలు, పిల్లల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అయితే వాటిపై సరైన అవగాహాన లేకపోవడంతో కొంతమంది అటువంటి మెసేజ్లను గమనించకుండా వేరే వారికి ఫార్వర్డ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అటువంటి మెసేజ్లపై జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మెసేజ్లు ఫార్వర్డ్ చేసేముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. మీరు రాసే వార్త నిజమో కాదో నిర్ధారించుకుని, ఆ తర్వాత దాన్ని ఫార్వర్డ్ చేయాలి. వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో చేసే మేసేజ్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. తప్పుడు వార్తల్ని ప్రచారం చేయకూడదు. తప్పుడు ప్రచారంలో భాగస్వాములు కావొద్దు. సెన్సేషనలిజం కోసం పాకులాడుతూ తప్పుడు వార్తలు సష్టించవద్దు.ఏదైనా మెసేజ్లను ఫార్వర్డ్ చేసే ముందు అది సరైందా కాదా దానివల్ల ఏవరి మనోభావాలైనా దెబ్బతింటాయా అనే విషయం గుర్తుంచుకోవాలని పోలిీసులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. -
అయ్యో.. బాబో అన్నా.. పత్తాలేని ఏపీ పోలీస్
సాక్షి, అమరావతి: ‘ఇంటిపేరు కస్తూరి వారు.. ఇల్లంతా గబ్బిలాల కంపు’ అన్నట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ తీరు. టెక్నాలజీకి తాను అంబాసిడర్నని, ఐటీ, ఏఐలను తానే కనిపెట్టానని తరచూ గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు బండారం బట్టబయలైంది. ఆపదలో ఉన్న బాధితులకు తక్షణ సహాయం అందించి రక్షణ కల్పించే టోల్ ఫ్రీ నంబర్ 112 వ్యవస్థ పనితీరులో ఏపీ ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉంది. బాధితులకు ఆపన్న హస్తం అందించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమై దేశంలోనే అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది.బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్ 2.0)ను ఏపీ ప్రభుత్వం అసలు అందుబాటులోకి తేనేలేదన్నది తేటతెల్లమైంది. ఈ విషయాన్ని మరెవరో కాదు సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు ‘40 ఇయర్స్ ఇండస్డ్రీ’ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు అసలు ప్రజలకు రక్షణ కల్పించాలంటే ఏమేం చేయాలో ఆయన చెప్పారు. ఇప్పటికైనా స్పందించండి అని అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ నెల 8న లేఖ రాయడంతో ఏపీ ప్రభుత్వ అసమర్థత జాతీయస్థాయిలో బట్టబయలైంది. మొద్దునిద్రలో ఏపీ పోలీస్ అయ్యా.. ఆపదలో ఉన్నాం. సహాయం చేయండి’ అని బాధితులు మొరపెట్టుకుంటుంటే.. ఏపీ పోలీసులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. చంద్రబాబు రెడ్బుక్ కక్షసాధింపు చర్యలకు కొమ్ముకాసే పనిలో బిజీగా ఉన్నాం.. సామాన్యుల బాధలను పట్టించుకోం అన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణం స్పందించి ఆపన్న హస్తం అందించడంలో ఏపీ పోలీసులు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన చేదు వాస్తవం ఇదీ. అగ్రస్థానంలో చండీగఢ్ పోలీసులు బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసు, అగ్నిమాపక, ఇతర అత్యవసర సేవలను ఏకీకృత వ్యవస్థకు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 112ను ప్రవేశపెట్టింది. ఆ నంబరుకు బాధితులు చేస్తున్న కాల్స్పై దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు ఎలా స్పందిస్తున్నారన్న అంశాన్ని కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది. దేశ వ్యాప్తంగా 112కు వస్తున్న ఫిర్యాదులపై పోలీసుల సగటు స్పందన సమయం 18.28 నిమిషాలుగా ఉంది. అంటే బాధితుల నుంచి ఫోన్ కాల్ రాగానే 18.28 నిముషాల్లోనే పోలీసులు వారికి తగిన సహాయం అందించి రక్షణ కల్పిస్తున్నారు. ఒకప్పుడు ఈ దేశంలో పోలీసుల సగటు స్పందన సమయం 25 నిమిషాలుగా ఉండేది. కేంద్ర హోంశాఖ సమర్థంగా పర్యవేక్షించిన తరువాత సగటు స్పందన సమయం 18.28 నిముషాలకు తగ్గింది. ఇక బాధితులకు తక్షణం సహాయం అందించడంలో కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ పోలీసులు దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. చండీగఢ్ పోలీసులు కేవలం 5.58 నిమిషాల్లోనే బాధితులకు రక్షణ కల్పిస్తుండటం విశేషం.’’ అని అమిత్షా లేఖలో పేర్కొన్నారు. మీరు వెనుకబడి ఉన్నారు.. ఇప్పటికైనా స్పందించండి పోలీసు వ్యవస్థను పటిష్ట పరచడంలో సీఎం చంద్రబాబు వైఫల్యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన లేఖలో ఏమాత్రం మొహమాటం లేకుండా ఎత్తిచూపారు. పోలీసు వ్యవస్థలోని లోపాలపై కుండబద్దలు కొట్టారు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలను ఆయన వివరించారు. బాధితులకు తక్షణం సహాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్ 2.0)ను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ అత్యాధునిక విధానాన్ని తక్షణం అమలు చేయాల్సిన ఆవశ్యకత గురించి కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్వహించిన జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో పలుమార్లు దిశానిర్దేశం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా సరే ఏపీ ప్రభుత్వం తదనుగుణంగా స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తద్వారా బహుళ సిగ్నల్స్, ఆర్టిఫీషియల్ / మెషిన్ లెర్నింగ్ ఎనేబుల్డ్ ఫీచర్స్, డేటా ఎనలిటిక్స్, ఇంటర్ ఆపరేటరీ, స్టేట్ డేటా ఎక్స్చేంజ్ మొదలైన ఆధునాతన సాంకేతిక మౌలిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఈఆర్ఎస్ఎస్ 2.0 ఆపరేషన్ ప్రొసీజర్ను 21 రాష్ట్రాలు మాత్రమే ప్రవేశపెట్టాయని అమిత్ షా పేర్కొన్నారు. టెక్నాలజీని తానే కనిపెట్టానని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏపీలో ఇప్పటివరకు ‘ఈఆర్ఎస్ఎస్ 2.ఓ’ ను ప్రవేశపెట్టనే లేదన్నది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. 2026, మార్చి 31నాటికి ‘ఈఆర్ఎస్ఎస్ 2.0’ను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి అమిత్ షా ఆ లేఖలో గుర్తు చేశారు కూడా. ఇక బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు వీలుగా చేపట్టాల్సిన చర్యలనూ అమిత్ షా తన లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. అమిత్షా చేసిన సూచనలు..» 112సేవలపై విస్తృత ప్రచారం కల్పించండి. » బాధితులకు 24/7 అత్యవసర సేవలు అందించేలా ఎమర్జెన్సీ వాహనాల సంఖ్య పెంచండి. » ఎమర్జెన్సీ వాహనాల్లో మొబైల్ డేటా టెర్మినల్స్(ఎండీటీ)లను ఏర్పాటు చేయండి. » 24 గంటలూ పనిచేసేలా తగినన్ని వర్క్ స్టేషన్లు, కాల్సెంటర్లను ఏర్పాటు చేయండి. » అత్యాధునిక సమాచార సాంకేతికత అందించే ప్రైమరీ రేట్ ఇంటర్ఫేస్(పీఆర్ఐ) లైన్లు తగినన్ని ఏర్పాటు చేయండి. » రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, ఆస్పత్రుల జీఐఎస్ మ్యాప్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. » డేటా ఇండికేటర్లను ఎప్పటికప్పుడు ఎన్ఎస్ఎస్ పోర్టల్ ద్వారా పర్యవేక్షించండి. » సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్కంప్యూటింగ్( సిడాక్)తో కనెక్టివిటీ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. » నేర, ఘటనాస్థలాలకు వీలైనంత త్వరగా వెళ్లే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురండి.బెడిసికొట్టిన సర్కారు కుతంత్రం.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు ఎస్పీల సమావేశంలో నానాపాట్లు పడింది. ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందించడంలో సత్వరం స్పందిస్తున్నామని నమ్మించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఈ అత్యవసర సేవలు అందిస్తున్నామని ఆ నివేదికలో పేర్కొంది. కానీ, అత్యవసర సేవలు అందించడంలో రాష్ట్ర పోలీసులు దారుణంగా విఫలమవుతున్నారని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో తీవ్రంగా ఆక్షేపించారు. అత్యవసర సేవలు అందించేందుకు ఏకంగా 25.50 నిమిషాల సుదీర్ఘ సమయం తీసుకుంటున్నారని ఆ లేఖలో ఆయన కుండబద్దలు కొట్టారు. కానీ, 10 నిమిషాల్లోనే ఆ సేవలు అందిస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం అవాస్తవ గణాంకాలను నివేదికలో పేర్కొని అడ్డంగా దొరికిపోయింది.వైఎస్సార్సీపీ హయాంలో భద్రతకు భరోసాతక్షణ అత్యవసర సేవలు పట్టణాల్లో 5 నిమిషాల్లోనే.. గ్రామీణ ప్రాంతాల్లో 8 నిమిషాల్లోనే.. ఆపదలో ఉన్నవారిని తక్షణం ఆదుకోవడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత సమర్థంగా వ్యవహరించింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అయితే కేవలం 3 నిముషాల నుంచి 5 నిముషాల్లోనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు రక్షణ కల్పించేవారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే గరిష్టంగా 8 నిÐషాల్లోనే పోలీసులు బాధితులకు అండగా నిలిచేవారు. హత్యలు, లైంగికదాడులు జరగకుండా నిరోధించేవారు. దాడులు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేవారు. బాధితులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేవారు. ఇక ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన దిశ యాప్ మహిళల భద్రతకు పూర్తి భరోసానిచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పెట్రోలింగ్ వాహనాలు, దిశ క్రైమ్ డిటెక్షన్ వాహనాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫోరెన్సిక్ ల్యాబ్లు.. ఇలా అధునాతన వ్యవస్థను నెలకొల్పి దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకే దిశ యాప్ జాతీయ స్థాయిలో ఏకంగా 22 అవార్డులను గెలుచుకుంది. గుజరాత్, మహారాష్ట్ర, పల్పింమ బెంగాల్ తదితర రాష్ట్రాల పోలీసు బృందాలు ఆంధ్ర ప్రదేశ్లో పర్యటించి దిశ యాప్ పనితీరును, ఇక్కడి పోలీసులు చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నాయి. ఈ తరహా యాప్లనే ఆ రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టాయి. -
మున్సిపల్ కార్మికులపై విరిగిన లాఠీ
నెల్లూరు (బారకాసు): సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టేందుకు వెళ్తున్న మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. మహిళలని కూడా చూడకుండా తోసేశారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. కిందపడిపోయిన కొందరు.. లాఠీచార్జ్లో మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందర్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు 45 రోజులుగా సమ్మె చేస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. దీంతో వారంతా గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడించేందుకు కార్యాలయ సమీపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చేందుకు యత్నించారు. మరోవైపు మేయర్ స్రవంతి రాజీనామా ఆమోదం కోసం కౌన్సిల్ అత్యవసర సమావేశం జరుగుతోంది. తమ సమస్యలపై వినతిపత్రాన్ని అధికారులకు అందజేయాలనే ఉద్దేశంతో కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు కార్మికుల్ని అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝుళిపించడంతో కార్మికులు కిందపడిపోయారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు తాకరాని చోట తాకుతూ గందరగోళం సృష్టించారు. కార్మికులను ఇష్టానుసారం లాఠీలతో కొట్టారు. సీఐటీయూ నేతలు, కార్యకర్తలతోపాటు అనేకమంది మహిళా కార్మికులకు గాయాలయ్యాయి. రక్తగాయాలైన మహిళల్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం 63 మంది కార్మికులు, యూనియన్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లలో ఎక్కించి ముత్తుకూరు పోలీస్స్టేషన్కు తరలించారు. కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, కమిషనర్ నందన్, ఇన్చార్జి మేయర్ రూప్కుమార్యాదవ్ వచ్చి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని చెప్పగా కార్మికులు అంగీకరించలేదు. మంత్రి నారాయణ, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. చివరికి అరెస్ట్ చేసిన వారిని తీసుకొచ్చి కార్పొరేషన్ కార్యాలయం వద్ద విడిచి పెట్టడంతో నిరసనను తాత్కాలికంగా విరమించారు. -
పసి పిల్లలను విక్రయిస్తున్న ముఠా ఆటకట్టు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఢిల్లీ, ముంబైల నుంచి పసి పిల్లలను తీసుకొచ్చి, పిల్లలులేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టుచేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై నగరంలోని కొత్తపేట, భవానీపురం, నున్న పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదుచేశారు. నిందితుల నుంచి ఐదుగురు పసిపిల్లలతోపాటు, రూ.3.30 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు గురువారం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.విజయవాడ సితార సెంటర్కు చెందిన బలగం సరోజిని సులభంగా డబ్బులు సంపాదించేందుకు పిల్లల్లేని వారికి అక్రమంగా పిల్లలను విక్రయించడాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కిరణ్శర్మ, ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ఆమెకు పరిచయమయ్యారు. వారు అక్కడి నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి సరోజినికి ఇచ్చేవారు. ప్రతిఫలంగా వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వరకూ సరోజిని ఇచ్చేది. ఇలా తీసుకొచ్చిన చిన్నారులను తిరిగి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించేది. వీరికి విజయవాడలో మరికొందరు కూడా జతకలిశారు. వీరంతా గతంలో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చారు. అమ్మకానికి సిద్ధంగా ఉండగా.. ఇక ఢిల్లీకి చెందిన కిరణ్శర్మ, భారతిల నుంచి ఇద్దరు పిల్లలను.. ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ల నుంచి మరో ముగ్గురు పిల్లలను సరోజిని తీసుకొచ్చి అమ్మకానికి సిద్ధంగా ఉంచింది. అయితే, పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు ఈ విషయం తెలిసింది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ కె. లతాకుమారి, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, భవానీపురం, నున్న ఇన్స్పెక్టర్లు ఏకకాలంలో దాడులు నిర్వహించి కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో ఐదుగురిని, నున్న పోలీస్స్టేషన్ పరిధిలోని ఉడా కాలనీలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నలుగురు పిల్లలను, రూ.3.30 లక్షల నగదును స్వా«దీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి విజయవాడలో వివిధ ప్రాంతాలకు చెందిన బలగం సరోజిని (31), గరికముక్కు విజయలక్ష్మి (41), వాడపల్లి బ్లెస్సీ, ఆముదాల మణి, షేక్ ఫరీనా, వంశీకిరణ్కుమార్, శంక యోహాన్, పతి శ్రీనివాసరావు, సత్తెనపల్లికి చెందిన షేక్ బాబావలి, తెలంగాణలోని ఘట్కేసర్కు చెందిన ముక్తిపేట నందిని.. మొత్తం పదిమందిని అరెస్టుచేసినట్లు సీపీ తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, ఏడీసీపీలు జి. రామకృష్ణ, ఏసీపీ కె. లతాకుమారి, ఎన్వీ దుర్గారావు, స్రవంతి రాయ్, పలువురు సీఐలు పాల్గొన్నారు. -
హైదరాబాద్: చందానగర్లో తీవ్ర విషాదం
హైదరాబాద్: నగరంలోని చందానగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారి తన స్కూల్ ఐడీ కార్డుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్కూల్లో తోటి పిల్లలు ఏడిపించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.ప్రశాంత్(9) స్థానికంగా ఓ స్కూల్లో చదువుతున్నాడు. అయితే స్కూల్ యూనిఫామ్ సరిగా లేదని తోటి పిల్లలు ఆటపట్టించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్ ఇంటికి వచ్చాడు. ఆపై బాత్రూమ్లోకి వెళ్లి తన ఐడీ కార్డుతో ఉరి వేసుకున్నాడు.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. చిన్నారి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన పోలీసులు.. ఆపై స్వగ్రామానికి తరలించారు. పిల్లాడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన విద్యాసంస్థల్లో బుల్లీయింగ్ గురించి చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.బుల్లీయింగ్కి(వేధింపులు) చట్టపరమైన శిక్షలు ఉన్నాయి. ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు, ఆన్లైన్ వేదికల్లో జరిగే వేధింపులకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు.. సంబంధిత విద్యార్థిని సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే కౌన్సెలింగ్కి పంపడం జరుగుతుంది. నేరం తీవ్రతను(వయసు రిత్యా) బట్టి శిక్షలు విధించే అవకాశం లేకపోలేదు. -
స్టేషన్కు రా.. కేసు రాజీ చేసుకో..!
చిత్తూరు అర్బన్: ‘ఏం నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మాకేం వేరే పనిలేదా? ముందు స్టేషన్కి రా.. వచ్చి కేసును రాజీచేసుకో..’ అంటూ ఓ పోలీసు అధికారి మహిళా న్యాయవాదికి ఫోన్చేసి బెదిరించారు. జిల్లా కేంద్రం చిత్తూరులో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. నగరానికి చెందిన ఓ మహిళా న్యాయవాది ఒకరిపై గతంలో ఫిర్యాదు చేయగా స్టేషన్లో కేసు నమోదైంది. ఆమెపైన కూడా కౌంటర్ కేసు ఉంది. దీనిపై చట్టప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించుకున్న మహిళా న్యాయవాది కేసును కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కు చెప్పారు. కానీ రాజకీయ నేతల నుంచి ఆ పోలీసు అధికారికి ఫోన్ వచ్చింది. కేసు రాజీచేయించాలని ఆదేశించారు. దీంతో రెచ్చిపోయిన ఆ అధికారి.. మహిళా న్యాయవాదికి ఫోన్చేసి దురుసుగా మాట్లాడారు. దీంతో ఫోన్కాల్ కట్చేసిన ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. -
ఏజెన్సీలో బలగాలకు చిక్కిన మావోయిస్టులు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన డీవీసీఎం(డివిజన్ కమిటీ) ఇన్చార్జ్తో సహా మొత్తం 16 మంది మావోయిస్టులు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో పోలీసు బలగాలకు చిక్కినట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం సిర్పూర్ యూ మండలం బాబ్జిపేట, కకర్బుడ్డి ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చిన కామారెడ్డి జిల్లాకు చెందిన డీవీసీఎం ఎర్రగొల్ల రవితో మరో ఇద్దరు డీవీసీఎం కేడర్తోపాటు 16 మంది పోలీసుల అదుపులో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వీరిని ఏకే 47, ఇన్సాస్ రైఫిల్ వంటి ఆయుధాలతో సహా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. దీనిపై పోలీసులు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మొదటగా రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే పట్టుబడిన వారిలో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినవారు ఉన్నారు. వీరిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టు తెలిసింది. నిఘా వర్గాల సమాచారంతో కొద్ది రోజులుగా ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, సిర్పూర్ యూ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలసి భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మావోల కదలికలు గుర్తించి దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో తీవ్ర నిర్బంధ పరిస్థితులు ఏర్పడడంతో సేఫ్ జోన్గా భావించి వీరంతా ఏజెన్సీకి వచ్చారా, లేక పోలీసులకు లొంగుబాటులో ఇది ఓ భాగమా? ఇంకా ఏదైనా కారణమా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న వారికి హాని తలపెట్టకుండా కోర్టులో ప్రవేశపెట్టాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికాపంత్ను ఈ విషయంపై ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా, ఎలాంటి సమాచారమున్నా, పై అధికారులే వెల్లడించే అవకాశముందన్నారు. -
మావోయిస్టుల లొంగుబాటుపై ప్రెస్నోట్
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టులకు పునారావాసం కల్పించడానికి సరైన ఏర్పాట్లు చేసిందని బీజాపూర్ జిల్లా పోలీసులు తెలిపారు. "పునారావాసం - పునరుజ్జీవనం" కార్యక్రమం ద్యారా మావోయిస్టులకు నూతన జీవితం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజాపూర్లో మంగళవారం 34మంది నక్సల్స్ లొంగిపోయారు. ఈ మేరకు బీజాపూర్ పోలీసులు ప్రెస్నోట్ విడుదల చేశారు.ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మంగళవారం 34 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు బీజాపూర్ పోలీసులు ప్రకటించారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు కాగా 27 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. వారిపై రివార్డు రూ. 84 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారందరికి పునరావాసం పునరుజ్జీవనం కార్యక్రమం ద్వారా నూతన జీవితం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. బీజాపూర్ జిల్లాలో జనవరి1, 2024 నుంచి మెుత్తం 824 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోగా 1079 మంది అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. 220 మంది నక్సల్స్ ఎన్కౌంటర్లలో మరణించినట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి కొత్తజీవితం కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మిగిలిన వారు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులకు పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అంపశయ్యపై ఉంది. కేంద్ర బలగాల ఎన్కౌంటర్లలో ఆ పార్టీ సభ్యులు పెద్దసంఖ్యలో మృతిచెందారు. దానితో పాటు అధిక సంఖ్యలో పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
'అందరికీ ఫిర్యాదురహిత, సౌకర్యవంతమైన దర్శనం'
సాక్షి శబరిమల: "అందరికి ఫిర్యాదురహిత సౌకర్యవంతమైన దర్శనం" అనే పోలీసుల విజన్ని అమలు అయ్యేలా చేశామని కేరళ ఏడీజీపీ శ్రీజిత్ అన్నారు. శబరిమల యాత్ర ప్రారంభమైన 28 రోజుల తర్వాత గత ఏడాది కంటే సుమారు 4.5 లక్షల మందికి పైగా ఎక్కువ మంది యాత్రికులు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. సింపుల్గా చెప్పాలంటే సగటున రోజుకి దాదాపు 80 వేల మందికి పైగా వచ్చారని అన్నారు. గత సోమవారం అత్యధిక సంఖ్యలో ఏకంగా ఒక లక్ష మందికి పైగా యాత్రికలు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. నవంబర్ 24న కూడా ఇలా భక్తుల సంఖ్య లక్ష దాటిందని గుర్తు చేశారు.ఇదంతా అయ్యప్ప మహిమే..దర్శనం చేసుకున్న యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులెవ్వరూ దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండటం లేదా ఫిర్యాదు చేయడం వంటివి చేయలేదని అన్నారు. ఇదంతా అయ్యప్ప స్వామి దయ వల్లనే అని చెప్పారు. నిజానికి అధికారులెవ్వరూ యాత్రికులెవరిని ఆపరు, ఇబ్బంది పెట్టరని, కూడా చెప్పారు. భక్తులను పర్వతం ఎక్కడానికి అవకాశం ఇస్తే..భక్తలు ఎవరూ వేచి ఉండాల్సి అవసరం ఏర్పడదు, అలాగే వాళ్లు నేరుగా పుణ్యక్షేత్రానికి చేరుకుని 18వ మెట్టు ఎక్కి ఆ హరిహరసుతుడిని ఎలాంటి ఫిర్యాదుల లేకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకోగలుగుతారని అన్నారు..అదెలా సాధ్యమన్నది అతుపట్టడం లేదు..కాగా మకరవిళక్కు వరకు ప్రతిరోజూ వర్చువల్ క్యూ బుకింగ్లు పూర్తయ్యాయని చెప్పారు. అలాగే ప్రతిరోజూ వర్చువల్ క్యూ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని అన్నారు. ఈసారి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే శనివారం ఆదివారం రద్దీ తక్కువగా ఉంటుందని, బదులుగా, సోమవారం, మంగళవారం రద్దీ ఎక్కువయ్యిందని చెప్పారు. చెప్పాలంటే బుధవారం మధ్యాహ్నం నాటికి రద్దీ తగ్గుముఖం పడుతోందని అన్నారు. విచిత్రం ఏంటంటే చాలా బుకింగ్లు ఉన్నప్పటికీ అలా ఎలా స్వామి కైంకర్యాలకు ఆటంకం లేకుండా, అటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సవ్యంగా జరిగిపోతోందో మాకు కూడా తెలియడం లేదని ఆనందంగా చెప్పుకొచ్చారు. అయితే తామే ఎక్కడకక్కడ పోలీసులతో మోహరించి భక్తులెవ్వరూ దర్శనం కోసం వేచి ఉండకుండా పకడ్బందీగా చేయగలిగినన్నీ ఏర్పాట్లు చేశామని కూడా చెప్పారు. స్పాట్ బుకింగ్ పెంపు ఎప్పుడంటే..సన్నిధానం వద్ద జనసమూహం ఎక్కువగా లేనప్పుడు, పోలీసు ప్రత్యేక అధికారి, ప్రత్యేక కమిషనర్, దేవస్వం కార్యనిర్వాహక అధికారులను సంప్రదించి స్పాట్ బుకింగ్ పెంచుతామని అన్నారు. జనసమూహం తక్కువగా ఉన్న రోజుల్లో, 10 వేలకు పైనే స్పాట్ బుకింగ్లు ఇస్తామని అన్నారు. అయితే యాత్ర మూడోరోజున యాత్రికులు ఎందుకు ఇబ్బంది పడ్డారో కూడా వివరించారు.ఆ రోజు యాత్రికులు క్యూలో ఉన్నప్పుడు షెడ్ స్థంభం దెబ్బతినడంతో దాన్ని తొలగించడంతో కాస్త సమస్యలు రావడంతోనే భక్తులు ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. సాధ్యమైనంతవరకుఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు కేరళ పోలీసు అత్యున్నతాధికారి శ్రీజిత్.(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..) -
కారుకు అడ్డంగా బండి పెట్టి నడి రోడ్డుపై రౌడీయిజం.. సీదిరిని లాక్కెళ్లిన పోలీసులు
-
సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు చేపట్టింది. జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీలతో తాడేపల్లికి వైఎస్సార్సీపీ నేతలు తరలివస్తున్నారు. వైఎస్సార్సీపీ ర్యాలీల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.పలు చోట్ల కోటి సంతకాల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అన్యాయంగా అడ్డుకోవడంపై అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అడ్డుకుంటున్నారని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైఎస్సార్సీపీ ర్యాలీలు చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పూర్తి చేసింది.విజయనగరంలో కోటి సంతకాల ర్యాలీకి అనుమతి నిరాకరణవిజయనగరంలో కోటి సంతకాల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 30 అమలులో ఉందంటూ విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీగోవిందరావు అనుమతి నిరాకరించారు. వైఎస్సార్ జంక్షన్కు. వైఎస్సార్సీపీ శ్రేణులు, విద్యార్థులు భారీగా చేరుకున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగింది. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగింది. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ నెల 10 న అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన కార్యక్రమానికి విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరుకున్న సంతకాలు ఇవాళ (సోమవారం) అక్కడి నుంచి ప్రత్యేక వాహనాలలో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. -
‘మధ్యలో ఏంటి బాసూ’ గజరాజుకు కోపం వచ్చింది
-
టీడీపీ కనుసన్నల్లో కిడ్నాప్ లు.. ఏపీ పోలీసులపై ఆరోపణలు
-
కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన పచ్చ పోలీసులు..!
-
ఖాకీలా.. కిడ్నాపర్లా!
సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఖాకీలు అధికారిక కిరాయి గూండాల్లా, కిడ్నాపర్లుగా వ్యవహరిస్తున్నారు. ఖాకీ చొక్కాలు వదిలేసి పసుపు చొక్కాలు తొడిగేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాలనే చట్టాలుగా మార్చేసి నెల్లూరు నవాబుపేట పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ బీఫారంపై గెలిచిన కార్పొరేటర్లను టీడీపీ అధికారంలోకి రావడంతో బెదిరించి పచ్చ కండువా కప్పారు.అయితే ఆ పార్టీలో ఇమడలేక.. అధికార పార్టీని ఎదురించి తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధపడిన కార్పొరేటర్లపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను పురమాయించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ కార్పొరేటర్లు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరుతున్నారనే సమాచారంతో మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో ఖాకీలు నెల్లూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు.వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వారు బయటకు రాగానే కిరాయి కిడ్నాపర్ల మాదిరిగా ప్రైవేట్ వాహనాలను అడ్డుపెట్టి, బలవంతంగా వారి వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లను లాక్కొని, ఎక్కడికి తీసుకెళ్తున్నారో వారి కుటుంబ సభ్యులకు సైతం సమాచారం అందకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పోలీస్స్టేషన్లు తిప్పుతూ చిత్ర హింసలకు గురిచేశారు. చివరకు తాము టీడీపీలోనే కొనసాగుతున్నామంటూ వీడియోలు రిలీజ్ చేయించి, వారిని టీడీపీ నేతలకు అప్పగించి వచ్చారు. కేసుల పేరుతో అదుపులోకి..నెల్లూరు పోలీసుల ముందు ప్రొఫెషనల్ కిడ్నాపర్లు, గూండాలు కూడా దిగదుడుపేనని ఈ ఘటన రుజువు చేస్తోంది. అధికార పార్టీ నేతలు చెబితే పోలీసులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నేతలను హింసించడంలో కిరాయి గూండాల్లా వ్యవహరిస్తున్నారు. ఎంపీపీలు, మున్సిపాలిటీ చైర్మన్లు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులను బెదిరించి, అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో మాట వినని వారిని కేసుల పేరుతో అదుపులోకి తీసుకోవడం.. గంజాయి కేసులు, నకిలీ మద్యం కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.తాడేపల్లి నుంచి అదృశ్యంనెల్లూరు కార్పొరేషన్లోని మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ ఒక్క డివిజన్లో కూడా గెలవలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్పొరేటర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువాలు కప్పారు. అయినప్పటికీ వారు సాంకేతికంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుగానే చెలామణి అవుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో వైఎస్సార్సీపీ బీఫారంతో గెలిచి టీడీపీలోకి జంప్ అయిన ఐదుగురు కార్పొరేటర్లు తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్మెహన్రెడ్డి సమక్షంలో తిరిగి గురువారం వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.దీంతో మంత్రి నారాయణ ఆదేశాలతో నెల్లూరు నవాబుపేట పోలీసులు తాడేపల్లిలో వైఎస్ జగన్మెహన్రెడ్డి క్యాంప్ కార్యాలయం సమీపంలో మాటు వేసి.. నెల్లూరు 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర, 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ కుమారుడు శ్రీధర్ను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో అదృశ్యమయ్యారు. రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తిప్పుతూ వారిని మంత్రి నారాయణ అనుచరులు, వేమిరెడ్డి సోదరులకు అప్పగించారు. తద్వారా టీడీపీ నిర్వహిస్తున్న కార్పొరేటర్ల క్యాంప్లోకి తరలించే వరకు కీలక పాత్ర పోషించారు.కేసులు.. అరెస్ట్ అన్నారు.. తీరా టీడీపీ క్యాంప్నకు చేర్చారువైఎస్సార్సీపీకి చెందిన గిరిజన కార్పొరేటర్ రవిచంద్రతోపాటు మరో కార్పొరేటర్ తనయుడు శ్రీధర్ను అదుపులోకి తీసుకున్నది వాస్తమేనని నవాబుపేట పోలీసులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో ఒప్పుకున్నారు. అదుపులో ఉన్న ఆ ఇద్దరిని చూపించాలని గురువారం రాత్రి పోలీస్స్టేషన్కు ఆ ఇద్దరు నేతలు చేరుకుని పోలీసులను ప్రశ్నించడంతో వారిపై కేసులు ఉన్నాయని, అరెస్ట్ చేశామని, శుక్రవారం కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. కానీ తెల్లారే సరికి పోలీసులు రూటు మార్చి, నోటీసు ఇచ్చి పంపేశామంటూ చెబుతున్నారు.నోటీసులు ఇచ్చే కేసులో వారిని తాడేపల్లికి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని, గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం తెల్లారే వరకు రహస్యంగా ఉంచడం ఏమిటని, వారిని టీడీపీ క్యాంప్నకు అప్పగించడం ఏమిటని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు నిలదీస్తున్నారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అధికార పార్టీ నేతల క్యాంప్లోకి వెళ్లాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఓ కార్పొరేటర్ తనయుడు తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ పోలీసులతోపాటు అధికార పార్టీ నాయకులు కూడా తనపై చేయి చేసున్నారని.. మంత్రి నారాయణ, మరికొందరు పచ్చి బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. -
పెరోల్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ మీద పీడీ యాక్ట్
-
ఏ స్టేషన్ లో అక్రమ కేసులు పెట్టారో అదే స్టేషన్ లో... పోలీసులకు వార్నింగ్
-
పోలీసులం.. ఏదైనా చేసే హక్కు ఉంది!
తెనాలి అర్బన్: ప్రశాంతంగా ఉండే గుంటూరు జిల్లా తెనాలిలో ‘పోలీసుల అత్యుత్సాహంవల్ల’ గురువారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. టుటౌన్ సీఐ రాములు నాయక్ పోలీసులతో మాజీ శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఇంటికి చేరుకుని, మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి ఇక్కడ ఉన్నట్లు సెల్ టవర్ ద్వారా సమాచారం ఉందని, ఇంటిని సోదా చేయాలని డ్రైవర్, వాచ్మన్ వద్ద హడావుడి చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న శివకుమార్ ఇంటి బయటకు వచ్చి ఇదేమి పద్ధతని ప్రశ్నించారు. ఇంతలో మాట మార్చి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని, నోటీసులు తీసుకోవాలంటూ హైడ్రామాకు తెరతీశారు. దీనిని వ్యతిరేకిస్తూ బయటకు నడుచుకుంటూ వస్తున్న ఆయనను సీఐ అడ్డుకుని బయటకు వెళ్ళేందుకు అనుమతి లేదని తెలిపారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని శివకుమార్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తాము పోలీసులమని ఏదైనా చేసే హక్కు ఉంటుందని సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. వాగ్వివాదం నడుమ శివకుమార్ తన కారు ఎక్కటంతో సీఐ అడ్డుగా నిలుచున్నారు. అయితే అప్పటికే అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు శివకుమార్కు అండగా నిలిచాయి. ఈ క్రమంలో పోలీసుల వలయాన్ని ఆయన ఛేదించి గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. చేసేదిలేక పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయవద్దు: అన్నాబత్తునిఈ సందర్భంగా శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రశాంతంగా ఉండే తెనాలి పట్టణాన్ని కలుషితం చేయాలని చూస్తే సహించేది లేదు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో రాజ్యం చేయాలని చేస్తే భయపడే వారు ఎవరు లేరు. ఈ వ్యవహారం మొత్తానికి మంత్రి నాదెండ్ల మనోహర్ బాధ్యత వహించాలి. వైఎస్సార్సీపీ పాలనలో ఇలాంటి వాటికి తావివ్వలేదు. పోలీసులు ఇదేవిధంగా వ్యవహరిస్తే వారి అక్రమాలను బయటపెట్టడానికి కూడా వెనుకాడబోము. ఎవరో మెప్పుకోసం పోలీస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఊరుకోం’ అని స్పష్టం చేశారు. పోలీసుల ప్రవర్తనపై మంత్రి మనోహర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
పోలీసులు అదుపులో లూథ్రా బ్రదర్స్
గోవా అగ్నిప్రమాద ఘటనలో ప్రధాన నేరారోపణలు ఎదుర్కొంటున్న లుథ్రా బ్రదర్స్ను ఎట్టకేలకు థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి పాస్పోర్టులు స్వాధీనం చేసుకొని వారికి సంకెళ్లు వేశారు. ఈ రోజు ఊదయం భారత విదేశాంగ శాఖ సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలిద్దరి పాస్ పోర్టులను సస్పెండ్ చేసిన కొద్దిసేపటికే వారి అరెస్టు జరిగింది.గత శనివారం గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్క్లబ్లో అగ్రి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే ఈ క్లబ్ యజమానులైన లూథ్రా బ్రదర్స్ థాయిలాండ్ పరారయ్యారు. దీంతో ప్రమాదంపై తీవ్రంగా స్పందించిన గోవా ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో నిందితులను వదలబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వారి ఇద్దరిపై పోలీసులు లూకౌట్ జారీ చేశారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిద్దరిపై బ్లూకార్నర్ ఇష్యూ చేసింది. దీంతో థాయిలాండ్ పోలీసులు ఫుకెట్లోని ఓ రెస్టారెంట్లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి బేడీలు వేశారు. కాగా వీరిద్దరిని పట్టుకోవడానికి ఇదివరకే గోవా పోలీసులు థాయిలాండ్కు బయిలు దేరినట్లు తెలుస్తోంది.అధికారిక ప్రక్రియ పూర్తయిన అనంతరం వారిద్దరిని గోవా పోలీసులకు అప్పగిస్తున్నట్లు సమాచారం. భారత్- థాయిలాండ్ దేశాల మధ్య 2013లో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ జరిగింది. దీనిప్రకారం ఒక దేశంలో నేరం చేసి మరో దేశంలో తలదాచుకుంటే ఆ నేరస్థులను సంబంధిత దేశానికి అప్పగించాలి. ఈ ఒప్పందానికి అనుగుణంగా ప్రస్తుతం థాయిలాండ్ లూథ్రా బ్రదర్స్ను భారత్కు అప్పగిస్తుంది. ఈ ఒప్పందం 2015 జున్ 9నుంచి అమలులోకి వచ్చింది. కాగా ఈ శనివారం అర్థరాత్రి గోవాలోని నైట్ రోమియో నైట్క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టాగా క్లబ్లో సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో క్లబ్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇది వరకే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి చేసుకోమని వేధిస్తోంది
ఛత్తీస్గఢ్లో ఒక మహిళా డీఎస్పీపై కేసు నమోదయ్యింది. కల్పనాఅనే మహిళా డీఎస్పీ తన వద్ద నుంచి రూ.రెండు కోట్ల రుపాయలు కాజేసిందని దీపక్ థండన్ అనే వ్యాపార వేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా తన భార్యకు విడాలకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు.ఛత్తీస్గఢ్ రాయిపూర్కు చెందిన దీపక్ థండన్ అనే వ్యాపారవేత్త, కల్పనా అనే మహిళా డీఎస్పీపై సంచలన ఆరోపణలు చేశారు. కల్పనా తనను తీవ్రంగా వేధిస్తుందని తెలిపారు. 2021లో తామిద్దరం తొలిసారిగా కలుసుకున్నామని కొద్దిరోజులకే ఇద్దరం సన్నిహితంగా మెదిలామన్నారు. ఆ తర్వాత నుంచి కల్పనా తన వద్ద నుంచి పెద్ద మెుత్తంలో డబ్బు గుంజసాగిందన్నారు. తనకు రూ.12 లక్షల విలువ గల డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చానని, రాయ్పూర్లో ఉన్న ఒక హోటల్ తన సోదరుడి పేరు మీదకు మార్చేలా ఒత్తిడి తెచ్చిందని తెలిపారు.ఆ తర్వాత కొంతకాలానికే కల్పనా రూ.30 లక్షలు విలువజేసే మరో ప్రాపర్టీ తన పేరు మీదకు మార్చాలనడంతో ఆ విధంగా చేశానన్నారు. అంతేకాకుండా తనకు రూ. 22లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చానని ఆ వాహనం తన భార్య పేరు మీద తీసుకున్నానని తెలిపారు. కాగా ఇప్పుడు తన భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లిచేసుకోవాలని వేధిస్తోందని తెలిపారు. తమ సంబంధం విషయం తన భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయని దీపక్ అన్నారు.ఈ నేపథ్యంలో డీఎస్పీ వేధింపులు తట్టుకోలేక తన భార్యతో కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను డీఎస్పీ కల్పనా కొట్టిపడేసింది. ఆ వ్యాఖ్యలన్ని నిరాధారమైనవని తెలిపింది. -
పోలీసుల అదుపులో గోవా నైట్క్లబ్ యజమాని
గోవాలో మారణహోమం సృష్టించిన బిర్చ్ బై నైట్ రోమియ్ నైట్ క్లబ్ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆ క్లబ్ యజమానులు సౌరవ్, గౌరవ్ లపై ఇంటర్ఫోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీచేయగా తాజాగా ఆ క్లబ్లో సహా యజమానిగా ఉన్న అజయ్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ శనివారం గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై సీరియస్గా ఉన్న ఆ రాష్ట్ర సీఎం ఆ యజమానులకు చెందిన మరో క్లబ్ను కూల్చివేయాలని నిన్న అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు నిన్న మరో క్లబ్ను నేలమట్టం చేశారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం జరిగిన క్లబ్కు కో పార్టనర్గా ఉన్న అజయ్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో కేవలం తాను క్లబ్ పార్టనర్ మాత్రమేనని అంతకు మించి తనకు ఏమి తెలియదని గుప్తా తెలిపినట్లు సమాాచారం. అజయ్ గుప్తాను విచారణ నిమిత్రం పోలీసులు రిమాండ్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రమాద ఘటన జరిగిన కొద్దిసేపటికే క్లబ్ యజమానులు సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలిద్దరూ థాయ్లాండ్ పారిపోయారు. దీంతో వారిద్దరిపై పోలీసులు లూకౌట్ నోటీలుసు ఇష్యూ చేయగా, ఇంటర్నేషనల్ ఏజేన్సీ ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. బ్లూకార్నర్ నోటీసులు జారీ చేయడానికి సాధారణంగా వారం రోజుల సమయం పడుతుందని కానీ ఈ ప్రమాద ఘటన తీవ్రత నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీలు తక్షణమే స్పందించి కేవలం రెండు రోజుల్లో బ్లూకార్నర్ నోటీసులు వచ్చేలా కృషి చేశాయని గోవా పోలీసు అధికారులు తెలిపారు.అంతేకాకుండా ప్రస్తుతం పరారీలో ఉన్న లూథ్రాబ్రదర్స్ను పట్టుకోవడానకి గోవాకు చెందిన ప్రత్యేక పోలీసుల బృందం థాయ్లాండ్కు వెళ్లాయని పేర్కొన్నారు. గోవా ప్రమాద ఘటనకు కారణమైన వారిని పట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామని దానికోసం సీబీఐతోపాటు ఇంటర్పోల్ సహాయం తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. లూథ్రా బ్రదర్స్కు ఆర్థిక కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. న్యూఢిల్లీలోని రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీస్ లూథ్రా బ్రదర్స్ పాస్పోర్ట్ ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని వారికి నోటీసులు జారీ చేసింది.ఈ శనివారం అర్థరాత్రి బిర్చ్ బై నైట్ రోమియ్ నైట్ క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణం ఆ క్లబ్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే అని తేలింది. నైట్ క్లబ్కు వెళ్లే దారులు ఇరుకుగా ఉండడంతో సరైన సమయానికి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోలేక పోయిందని అధికారులు తెలిపారు. దానితో పాటు క్లబ్ నిర్మాణం తాటాకులతో చేపట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని పేర్కొన్నారు. -
పోలీసు పహారాలో గ్లోబల్ సమ్మిట్
భారత్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్కు భారీ పోలీసు వహారా ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్కు విదేశీ ప్రముఖులతో పాటు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్న సందర్భంగా ఎలాంటి అవచనీయ సంఘటనలు జరగకుండా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు అడుగడుగునా పోలీసు పహారాను ఏర్పాటు చేశారు.దీనికి గాను కింది స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయి అధికారుల వరకు బందోబస్తు మీద నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతిఒక్క అధికారి ఈ సమ్మిట్కలో ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. అందులో భాగంగా సమ్మిట్లోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ను ఎస్టాబ్లిష్ చేసి వెయ్యికి పైగా సీసీ కెమెరాల ద్వారా ప్రతి సెకను కదలికలను గమనిస్తున్నారు.శంషాబాద్ విమానాశ్రయం టూ ఫ్యూచర్ సిటీఈ అంతర్జాతీయ సమ్మిట్ కోసం పోలీసు శాఖ నెల రోజుల నుంచి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తూ ఫ్యూచర్ సిటీలోనే మకాం వేసి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.ఈ బందోబస్తు ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి సహా సీనియర్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. నిన్నటి రోజు సదస్సులో అనేక మంది ప్రముఖులు పాల్గొనగా వీరిలో పలువురు శంషాబాద్ విమానాశ్రయంలో దిగి ఫ్యూచర్ సిటీకి రోడ్డు మార్గాన వచ్చారు. అలా వచ్చిన ప్రతినిధులు, ప్రముఖుల కోసం రహదారి వెంట వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరితో పాటు బాంబు స్వార్డ్, డాగ్ స్క్వాడ్ బృందం నిరంతరం తనిఖీలు నిర్వహించారు.ఆకట్టుకున్న పోలీసు స్టాల్సమ్మిట్లో ఏర్పాటు చేసిన పోలీసు స్టాల్ విదేశీయులను తదితరులను ఆకట్టుకున్నది. తెలంగాణ పోలీసు శాఖ తరపున సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మహిళా భద్రతా విభాగం సాధించిన విజయాలను వారికి అర్థమయ్యే విధంగా వారి భాషలోనే వివరిస్తూ కరపత్రాలను పంచారు. ఆంగ్లంలోవున్న ఈ కరపత్రాలు అందరికీ ఆకట్టుకున్నాయి. పోలీసు శాఖ సాధించిన విజయాలను కూడా వారు వివరించారు. అలాగే సమ్మిట్ ప్రాంతంలో రోడ్డు మార్గంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు కలియతిరిగుతూ వాహనాల తనిఖీ నిర్వహించి హెల్మెట్ లేనివారికి అవగాహన కల్పించారు. -
నేను.. మీ శిరోధైర్యాన్ని!
కర్నూలు: నాకే బాధేస్తోంది... ఇలా నా గురించి, నా అవసరం గురించి మీతో చెప్పక తప్పడం లేదు. జిల్లాలో నన్ను విస్మరిస్తున్న తీరును పోలీసులు విస్తృతంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మార్పు కనిపించకపోవడంతో తట్టుకోలేక మీ ముందుకు వచ్చి నా గోడు వినిపిస్తున్నా.. ఇంతకూ నేనెవరనేగా... ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. మీ ప్రయాణంలో మీ తలకు రక్షణగా ఉండే హెల్మెట్ను. మీ ప్రాణం విలువ మీ కంటే నాకే బాగా తెలుసు. రహదారి ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయిన వారి కుటుంబాలను చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇదంతా ఎందుకంటే ఇటీవల నన్ను ధరించని వారు జిల్లాలో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా తీరు మార్చుకోకపోవడంతో ఎంతో బాధ కలుగుతోంది. అనాలోచిత చర్యల ద్వారా జరిగిన ప్రమాదాల్లో యువకులే అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో పెళ్లి కాని వారు కొందరు ఉంటే పెళ్లయి ఏడాది, రెండేళ్లకే అనంత లోకాలకు చేరినవారు మరికొందరు. ఇందులో ఏ ఒక్కరూ నా విలువను గుర్తించినా నేడు వారి కుటుంబీకులతో ఆనందంగా ఉండేవారు. ఇప్పటికైనా మీరు మారండి.. నా మాట వినండి.. నన్ను తలకెక్కించుకోండి. తలకు పెట్టుకుంటే ప్రాణం దక్కించుకున్నట్లే... ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు నన్ను తప్పనిసరిగా ధరించాలి. ప్రమాదం జరిగినప్పుడు అది ఊగి కింద పడకుండా బెల్టు పెట్టుకోవాలి. రహదారి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించే ఐఎస్ఐ మార్కును పరిశీలించి వినియోగించండి. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే తల దెబ్బ తగలకుండా ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు. మీ శరీర భాగంలో నేను అండగా ఉండే తలే కీలకం. ఇందులోనూ మెదడు చాలా సున్నితమైంది. దెబ్బ తగలకుండా నేను కాపాడతా.. అందుకే నన్ను ధరించండి.. ధైర్యంగా ఉండండి. నన్ను ధరిస్తే జుట్టు ఊడిపోతుందనేది కేవలం అపోహనే. ఈ విషయం ఇప్పటికే వైద్యపరంగా రుజువైంది. నేను రక్షగా ఉంటే జుట్టు కాలుష్యం బారిన పడదు. జుట్టు ఊడుతుందన్న భయంతో మహిళలు నన్ను ధరించేందుకు వెనుకాడుతుంటారు. ఇది తగదని గుర్తుంచుకోండి. ముఖం పూర్తిగా కప్పి ఉంచేవి వాడటం వల్ల తలకు, ముఖానికి రక్షణగా ఉంటా. చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా? నన్ను వినియోగించకపోవడం వల్ల పోలీసులు జిల్లాలో 9,540 కేసులు నమోదు చేశారు. అపరాధ రుసుం రూపంలో పదకొండు మాసాల కాలంలో మీరు రూ.3.50 కోట్లు మూల్యం చెల్లించారు. నన్ను ధరిస్తే రక్షణతో పాటు సొమ్ము కూడా మిగులుతుందన్న వాస్తవాన్ని గ్రహించుకోండి. ఇట్లు... మీ హితం కోరే హెల్మెట్ -
ఢిల్లీలో గోవా పోలీసుల తనిఖీలు
న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదం సంభవించిన గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేట్’నైట్ క్లబ్ యజమానులు గౌరవ్ లూథ్రా, సౌర భ లూథ్రాల న్యూఢిల్లీ నివాసానికి పోలీసు బృందం సోమవారం చేరుకుంది. హడ్సన్ లే న్లోని వారి ఇంట్లో తనిఖీలు చేయగా లూథ్రా సోదరులు కనిపించలేదు. వారి ఆచూకీని తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. నైట్ క్లబ్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే భరత్ కోహ్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గోవా పోలీసులు ఇప్పటివరకు క్లబ్ చీఫ్ జనరల్మేనేజర్ రాజీవ్ మోదక్, జనరల్ మేనేజర్ వివేక్ సింగ్, బార్ మేనేజర్ రాజీవ్ సింఘానియా, గేట్ మేనేజర్ రియాన్షు ఠాకూర్లను అరెస్టు చేశారు. క్లబ్ మేనేజర్ను విచారిస్తుండగా భరత్ కోహ్లీ ప్రస్తావన రావడంతో.. ఆయనను అరెస్టు చేశారు. -
దళిత యువకుడిపై సీఐ దౌర్జన్యం
నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన దళిత యువకుడు, వైఎస్సార్సీపీ యూత్ పట్టణ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై పట్టణ సీఐ గఫూర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధితుడు విడుదల చేసిన వీడియో ప్రకారం.. ఈశ్వరరావు వేధిస్తున్నాడంటూ ఆయన భార్య లక్ష్మి పట్టణ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. విచారణ కోసం ఈశ్వరరావును పిలిపించిన పోలీసులు.. రాత్రంతా స్టేషన్లోనే ఉంచారు. సీఐ గఫూర్ తనపై భౌతిక దాడి చేశారని, దీంతో తనకు వినికిడి సమస్య తలెత్తిందని, దాడితో పాటు జాతి పేరుతో తనను సీఐ తిట్టారని ఆరోపించాడు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై టౌన్ సీఐ గఫూర్ను వివరణ కోరగా తాను చేయిచేసుకోలేదని తెలిపారు. ఈశ్వరరావుపై దాడిని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక ఖండించింది. భార్య, భర్తల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప, భౌతికంగా దాడి చేయడాన్ని ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ కన్వీనర్ బూసి వెంకటరావు ఖండించారు. దాడిపై విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యురాలు విజయ భారతికి ఫిర్యాదు చేసినట్లు వెంకటరావు తెలిపారు. -
పోలీసులూ జైలుకెళ్లారు!!
లంచాలు తీసుకుంటూ చిక్కి, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టి, అవకతవకలకు పాల్పడి, నేరాలు చేసి, చివరకు రాజకీయ కక్షసాధింపుల వల్ల– రకరకాల కారణాలతో పోలీసులు జైలు పాలైన ఉదంతాలను వింటుంటాం. కొన్ని కేసుల దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించడానికి కోర్టు అనుమతితోనూ పోలీసులు జైలు లోపలకు వెళతారు. అయితే ఎలాంటి ఆధారం లేకుండా, అగమ్యగోచరంగా ఉన్న ఓ కేసు దర్యాప్తుకు అవసరమైన సమాచారం సేకరించడానికి అరెస్టైన ఓ పోలీసు అధికారి కొన్ని రోజులు జైల్లో, ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీల మధ్య గడిపాడు. ఇది 2007 సెప్టెంబర్లో చోటు చేసుకుంది. గోకుల్చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసు దర్యాప్తు నేపథ్యంలో ఈ ఉదంతం జరిగింది. హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీపార్క్ల్లో 2007 ఆగస్టు 25న సాయంత్రం జంట పేలుళ్లు జరిగాయి. అదే రోజు దిల్సుఖ్నగర్లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో మరో పేలని బాంబు పోలీసులకు దొరికింది. ఆ రెండు చోట్లా జరిగిన పేలుళ్లలో 45 మంది మరణించారు. దాదాపు మూడువందల మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి సరిగ్గా వంద రోజుల ముందు 2007 మే 18 మధ్యాహ్నం హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం ప్రార్థనల్ని టార్గెట్గా చేసుకున్న ఉగ్రవాదులు రెండు బాంబులు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి పేలగా, మరోదాన్ని స్వా«ధీనం చేసుకున్న పోలీసులు దాన్ని నిర్వీర్యం చేశారు. ఈ విధ్వంసంలో 11 మంది మరణించగా, 19 మంది గాయపడ్డారు.హైదరాబాద్లో వంద రోజుల వ్యవధిలో రెండు విధ్వంసాలు జరగడంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. అప్పటికే మక్కా మసీదు పేలుడు కేసు సీబీఐకి బదిలీ కాగా, గోకుల్చాట్, లుంబినీపార్క్ పేలుళ్ల కేసు దర్యాప్తునకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ (సిక్) ఏర్పాటైంది. ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిలో ఉగ్రవాదంపై పట్టున్న అధికారులను డిప్యుటేషన్పై సిక్లో నియమించారు. అప్పటికే ఉగ్రవాద కేసుల్లో అరెస్టయి, బయటకు వచ్చిన వ్యక్తులు, అనుమానితులు, వారి అనుచరులు– ఇలా వందల మందిని అదుపులోకి తీసుకున్న సిక్ – వీరి విచారణ కోసం హైదరాబాద్ శివార్లలోని అనేక గెస్ట్ హౌస్లు, ఫామ్హౌస్లు ఇంటరాగేషన్ కేంద్రాలుగా ఉపయోగించుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు ఎలాంటి ఆధారం చిక్కలేదు. భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబీకులు, న్యాయవాదులు, పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరిగింది.ఆధారాలు దొరక్కపోవడంతో సిక్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. అప్పట్లో హైదరాబాద్లోని జైళ్లల్లో ఖైదీల వద్ద సెల్ఫోన్లు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు అప్పటికే రిమాండ్లో ఉన్న ఉగ్రవాదులను కలవడానికి వారి సంబంధీకులు వచ్చిపోతుండే వాళ్లు. ఈ పరిణామాలను గమనించిన ఓ పోలీసు అధికారికి ఓ ఆలోచన వచ్చింది. గోకుల్చాట్, లుంబినీపార్క్ పేలుళ్లకు సంబంధించిన సమాచారం ఏదైనా జైల్లో ఉన్న ఉగ్రవాదులకు తెలిసే అవకాశం ఉంటుందని భావించారు. జైల్లో ఉన్న వారిని ప్రశ్నిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని అనుకున్నారు. ఈ ఆలోచన బాగానే ఉన్నా, వారిని ప్రశ్నించడం ఎలా అన్నదే ఎవరికీ అంతుచిక్కలేదు. న్యాయస్థానం అనుమతి లేకుండా జైల్లోకి వెళ్లి ప్రశ్నించలేరు. కస్టడీలోకి తీసుకోవడానికి వారిపై ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేవు. పిటిషన్లు వేసినా, పెద్ద సంఖ్యలో ఖైదీలను ప్రశ్నించడానికి కోర్టు అనుమతి లభించదు. ఇవన్నీ బేరీజు వేసిన ఓ అధికారికి వచ్చిన ఆలోచనే– నమ్మకమైన సమర్థుడైన పోలీసు అరెస్టు. ఉగ్రవాదులు నమ్మే వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసుకుని, ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైలుకు పంపడానికి ఉన్నతాధికారులూ అంగీకరించారు. అంతే.. సిక్లో ఉన్న అధికారులంతా తమ వద్ద పని చేసిన, చేస్తున్న వారిలో అలాంటి పోలీసు కోసం వెతికారు. అప్పట్లో ఆంధ్రా ప్రాంతంలో పని చేస్తున్న ఓ పోలీసు దీనికి సమర్థుడని అంతా అంగీకరించారు. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి పోలీసు సిద్ధంగా ఉన్నా, జైలులోకి ఎలా పంపాలన్న దానిపై భారీ తర్జనభర్జన జరిగింది. చివరకు గుడుంబా ప్యాకెట్లు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై హైదరాబాద్లోని ఓ పోలీసుస్టేషన్లో ఆ పోలీసుపై కేసు నమోదు చేయించారు. అందులో అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్ ఖైదీగా పంపారు. ఆ పోలీసు దాదాపు 15 రోజులు జైల్లో ఉండి సమాచార సేకరణకు ప్రయత్నించారు. జైల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిక్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చాకచక్యంగా జైల్లో గడిపిన సదరు పోలీసు అధికారి, ఈ పేలుళ్లపై వారికి ఎలాంటి సమాచారం లేదని నిర్ధారించుకున్నాక బెయిల్పై బయటకు వచ్చారు. ఆపై ఈ కేసులు ఆక్టోపస్కు బదిలీ కావడంతో సిక్ కథ ముగిసింది. దీంతో ‘జైలుకు వెళ్లిన పోలీసు’ తాను పని చేసే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆపై కొన్నాళ్లకు నాటకీయ పరిణామాల మధ్య ఆ గుడుంబా కేసు క్లోజ్ అయింది. కొన్నాళ్లకు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) హైదరాబాద్ జంట పేలుళ్లకు కారణమని తెలిసింది. 2007 సెప్టెంబరు 13న ఢిల్లీలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనికీ ఐఎం బాధ్యత ప్రకటించుకుంది. ఈ కేసులను దర్యాప్తు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిందితుల షెల్టర్ గుర్తించారు. అక్కడి జామియానగర్లోని బాట్లాహౌస్ ఎల్–18 ఫ్లాట్లో 2008 సెప్టెంబర్ 15న జరిగిన ఎన్కౌంటర్లో ఆతిఖ్ అలియాస్ బషర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, ముగ్గురు పట్టుబడ్డారు. ఈ ఉదంతంతో ఐఎం డొంక కదిలింది. ఈ ఆధారాలతో ముందుకు వెళ్లిన ముంబై క్రైమ్ బ్రాంచ్ దేశ వ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు సైతం ఉండటంతో సిక్ డీల్ చేసిన కేసులు కొలిక్కి వచ్చాయి. వీరిని పీటీ వారెంట్లపై తీసుకువచ్చి అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ మూడు కేసుల్లో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన ఐదుగురిలో అనీఖ్, అక్బర్లపై 2018 సెప్టెంబర్ 4న నేరం రుజువైంది. వీరికి అదే నెల 10న ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.శ్రీరంగం కామేష్ -
వరలక్ష్మి శరత్ కుమార్ ‘పోలీస్ కంప్లెయింట్’ సినిమా స్టిల్స్
-
ఐ బొమ్మ రవికి మరోసారి పోలీసు కస్టడీ
సాక్షి హైదరాబాద్ : సినీ పైరసీకేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు మరోసారి పోలీసు కస్టడీ విధించింది. రవిని మూడురోజుల పాటు కస్టడీలో విచారించాలని దానికి అనుమతివ్వాలని పోలీసులు కోరగా కోర్టు అనుమతులిచ్చింది. దీంతో రేపు పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు. మూడు కేసుల్లో రవిని పోలీసులు విచారించనున్నారు. అనంతరం సోమవారం బెయిల్ పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది.కాగా గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ రవి అలియాస్ (ఇమ్మడి రవి) పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. తొలుత ఒక కేసులో రవిని అరెస్టు చేసి ఓ సారి కస్టడీకి తీసుకుని మరోసారి కస్టడీ పొడిగించుకున్నారు. అనంతరం మరో కేసులో అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ ప్రిజినర్స్ ట్రాన్సిట్ వారెంట్ వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ రెండు కేసుల్లో ఈ విధంగానే చేశారు.అనంతరం మిగిలిన మూడు కేసుల్లోనూ ఈ విధంగానే ప్రక్రియ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు కోర్టు అనుమతిచ్చింది. కాగా ప్రస్తుతం ఐబొమ్మ రవి సినీ పైరసీలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో రెస్టారెంట్ బిజినెస్ పెట్టే ఆలోచనలో రవి ఉన్నట్లు వారు పేర్కొన్నారు. -
ఛత్తీస్గఢ్లో మైనింగ్ వద్దంటూ ఆందోళన
ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో అమెరా ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ విస్తరణ అంశంలో చెలరేగిన వివాదం తీవ్ర హింసకు దారి తీసింది. మైనింగ్ విస్తరణను అడ్డుకునేందుకు స్థానిక గిరిజనులు పెద్దఎత్తున తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఘర్షణ చెలరేగి గిరిజనులు దాడి చేయడంతో 40మందికి పైగా పోలీసులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.సుర్గుజా జిల్లా ఘటనపై జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ "ఇక్కడ మైన్ కోసం 2016లోనే భూసేకరణ పూర్తయింది. దానికి పరిహారం కూడా అందజేశాం. కానీ ఇప్పుడు కొంతమంది పరిహారాన్ని నిరాకరించి మైనింగ్ కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారు. మేము గ్రామస్థులతో మరోసారి మాట్లాడుతాం వారికి నచ్చజెప్పి మైనింగ్ కార్యకలాపాలు జరిగేలా చేస్తాం" అని అడిషనల్ కలెక్టర్ సునీల్ నాయక్ అన్నారు. ఈ ఘర్షణలో చాలా మంది పోలీసులకు గాయాలయ్యాయని వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని తెలిపారు.మైనింగ్ పై గ్రామస్థులు మాట్లాడుతూ.. "మాగ్రామం అంటే మాకు చాలా ఇష్టం. మా గ్రామాన్ని మేము ఏ కంపెనీలకు ఇవ్వదలచుకోలేదు. మేమెక్కడికి వెళ్లాలి? ఎంతోకాలంగా మా కుటుంబాలు ఇక్కడే పెరిగాయి, పనిచేశాయి, సంపాదించాయి. మేముకూడా ఇక్కడే ఉంటున్నాము ఇప్పుడు కంపెనీలకు భుమి ఇస్తే మా పిల్లల సంగతేంటి?" అని అక్కడి గ్రామస్తురాలు అన్నారు.అయితే ఈ ఘటనలో తొలుత పోలీసులే తమపై లాఠీ ఛార్జ్ చేశారని గ్రామస్థులు అంటుండగా గిరిజనులే తమపై రాళ్లు రువ్వారని పోలీసులు అంటున్నారు ఇరు వర్గాలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.అయితే ఈ వివాదంపై అమెరా ఓపెన్ కాస్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు కోసం పర్సోడికల, అమెరా, పుహ్ పుత్ర, కట్ లోనా గ్రామాలలో ఈ భూమిని 2001 సంవత్సరంలో సేకరించి, 2011లో పనులు ప్రారంభించాము. 2019 కొంతమంది స్వార్థప్రయోజనాల కారణంగా మైన్ ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. 2024లో తిరిగి ప్రారంభించినప్పడి నుంచి దశలవారిగా భూసేకరణ చేపడుతున్నామని ఇది వరకూ రూ.10 కోట్ల పరిహారం అందిచామని తెలిపారు. పర్సోడికల వైపు మైనింగ్ విస్తరిస్తున్న సమయంలో నిరసనలు రావడంతో నవంబర్ 8నుంచి మైనింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. -
Film Nagar: అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి పై కేసు నమోదు
-
పెళ్లయిన 24 గంటలకే... ఎంత దారుణం..
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వరకట్న వేధింపుల దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పూర్లోని జుహి ప్రాంతానికి చెందిన లుబ్నా, మొహమ్మద్ ఇమ్రాన్లకు నవంబర్ 29న ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. కోటి కలలతో లుబ్నా మరుసటి రోజు తన అత్తమామల ఇంటిలో అడుగుపెట్టింది. అయితే ఆమె కలలు 24 గంటలు ముగియకుండానే కల్లలయ్యాయి. అదనపు కట్నం కోసం ఆమెను వేధించి, భర్త ఇమ్రాత్తో పాటు అతని కుటుంబ సభ్యులు లుబ్నాను బయటకు గెంటేశారు.లుబ్నా తన అత్తమామల ఇంటికి వచ్చిన వెంటనే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ లేదా దానికి బదులుగా రెండు లక్షల నగదు ఇవ్వాలని వరుడి కుటుంబం డిమాండ్ చేసింది. ‘నేను ఇంటికి వచ్చిన వెంటనే గొడవ మొదలైంది. మాకు బుల్లెట్ బైక్ ఇవ్వలేదు.. వెంటనే ఇంటికి వెళ్లి రూ. రెండు లక్షలు తీసుకురా అంటూ వారు తనను కొట్టడం ప్రారంభించారు’ అని లుబ్నా పోలీసులకు వివరించింది. అత్తామామలు తనను కొట్టడమే కాకుండా, తమ పుట్టింటివారు పెట్టిన నగలు, నగదును కూడా వారు బలవంతంగా తీసేసుకున్నారని బాధితురాలు ఆరోపించింది.లుబ్నా తల్లి మెహతాబ్ మాట్లాడుతూ తమ కుమార్తె వివాహానికి లక్షలు ఖర్చు చేశామని, తమ శక్తి మేరకు సోఫా సెట్, టీవీ, వాషింగ్ మెషిన్, కిచెన్ సామాగ్రి తదితర విలువైన బహుమతులు ఇచ్చామని తెలిపారు. పెళ్లికి ముందు బైక్ డిమాండ్ గురించి ఎలాంటి ప్రస్తావన తేలేదని, ఒకవేళ ముందే అడిగి ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకోమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో తమ కుమార్తె కన్నీటితో ఇంటికి వచ్చి జరిగిన దారుణాన్ని వివరించిందని మెహతాబ్ తెలిపారు.ఈ ఘటనపై లుబ్నా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మొహమ్మద్ ఇమ్రాన్, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని, పెళ్లికి ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని లుబ్నా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వరకట్న దాహంతో పెళ్లైన మరుసటి రోజే కొత్త కోడలిని వేధింపులకు గురిచేసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.ఇది కూడా చదవండి: చూపు లేకున్నా.. శరీరం సహకరించకున్నా.. -
‘సాక్షి’ మీడియాకు నోటీసులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాక్షి మీడియాపై టీడీపీ నాయకులు కక్షగట్టారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనధికార పీఏ సతీష్ అనైతిక వ్యవహారాలపై ఓ ఒంటరి మహిళ (దివంగత ఉపాధ్యాయుడి భార్య) ఆవేదనను, ఫిర్యాదులను ప్రజల ముందు ఉంచినందుకు కొందరు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వితంతు మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆరి్థకంగా దోచుకోవడమే కాకుండా లైంగికంగా వేధించిన సతీష్ వ్యవహారాన్ని ‘సాక్షి’తో పాటు పలు మీడియా చానళ్లు ప్రజల ముందుకు తెచ్చాయి.ఈ తరుణంలో బాధితురాలికి అండగా నిలుస్తూ తన పీఏపై చర్యలు తీసుకోవాల్సిన మంత్రి సంధ్యారాణి కేవలం ‘సాక్షి’ మీడియాను టార్గెట్ చేశారు. తమపై వార్తలు ప్రచురించి, చానల్లో ప్రసారం చేయడాన్ని భరించలేక ఏకంగా ‘సాక్షి’ మీడియాపైకి పోలీసులను ఉసిగొల్పారు. సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుంచి విజయనగరం ‘సాక్షి’ కార్యాలయానికి సోమవారం వచ్చిన పోలీసులు నోటీసులు అందజేశారు. పీఏ సతీష్కు వ్యతిరేకంగా కథనాలు ఇచి్చనందుకు పోలీస్ స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.మక్కువ మండల టీడీపీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు లెటర్ హెడ్పై టీడీపీ సాలూరు పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ తదితరుల ఫిర్యాదు మేరకు 353(1)(బి), 353(1)(సి), 356(1), 356(2) బీఎన్ఎస్ 67 ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. -
Vizianagaram: సాక్షి మీడియాకు సాలూరు పోలీసుల నోటీసులు
-
డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసిన మన ఈగల్ టీం
సాక్షి, న్యూఢిల్లీ: సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్లు ఉంది ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల తీరు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆటలను కట్టడి చేసిన తెలంగాణ ఈగల్ టీం పోలీసులు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడే వాళ్లకు, దేశం నలుమూలల నుంచి తెలంగాణకు డ్రగ్స్ను సరఫరా చేసే వారికి దేశ రాజధాని వేదికగా భయం పుట్టించారు. నెలల పాటు నిద్రాహారాలు లేకుండా కష్టపడి కేసు ను ఛేదించిన మన పోలీసుల క్రెడిట్ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ చోరీ చేస్తోంది. కంటిపై కునుకులేదు: దేశం నలుమూలల నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయాన్ని గుర్తించిన తెలంగాణ ఈగల్ టీం.. దీనిని అరికట్టేందుకు నడుం బిగించింది. ఇందుకోసం 105 మంది పోలీసులను ఫీల్డ్లో పెట్టింది. మూడు నెలల పాటు ఢిల్లీతోపాటు యూపీలోని నోయిడాను జల్లెడ పట్టింది. ఒక్కో ఫోన్ నంబర్, ఒక్కో బ్యాంకు ఖాతా ఆధారంగా డ్రగ్ సరఫరా ముఠా జాడను కనుగొంది. వారు డ్రగ్స్ ఎలా సరఫరా చేస్తున్నారో చూసేందుకు పగలు రాత్రీ అహర్నిశలు కష్టపడింది. ఢిల్లీ, నోయిడా వీధుల్లో మారువేషంలో రెక్కీ నిర్వహించింది. ఈగల్ డైరెక్టర్ సైతం పురవీధుల్లో తిరిగారు. అన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఆపరేషన్ను ప్రారంభించారు. దీంతో కొద్దిరోజుల క్రితం ఈ డ్రగ్ ముఠా ఆటకు చెక్ పెట్టారు. ఇంత కష్టపడిన వీరికి మాత్రం ఏవిధమైన ప్రతిఫలం దక్కలేదని చెప్పడంలో సందేహం లేదు.ఈగల్ క్రెడిట్ చోరీస్థానికంగా ఆపరేషన్ చేస్తున్నందుకు ఈగల్ టీం ఢిల్లీ క్రైం బ్రాంచ్ సాయం కోరింది. వీరి పర్యవేక్షణ, సహాయ, సహకారాలతో ఆపరేషన్ చేసింది. ఈ ఆపరేషన్లో 50 మందికి పైగా అదుపులోకి తీసుకోగా.. రూ.12 కోట్ల విలువైన డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదంతా తమవల్లే సాధ్యమైందని, తాము లేకపోతే ఇంతపెద్ద నెట్వర్క్ను చేధించడం కష్టమయ్యేదంటూ ఢిల్లీ పోలీసులు గొప్పలు చెప్పుకుంటున్నారు. మీడియా సమావేశంలో ఈగల్ టీం ఎస్పీ సీతారామ్ ఈ ఆపరేషన్ను వివరిస్తున్న సమయంలో తెలుగు మీడియా కొన్ని ప్రశ్నలు వేయగా.. ఆయన సమాధానం చెబుతున్నారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ జాయింట్ సీపీ సురేంద్ర కుమార్ సీటులో నుంచి పదేపదే పైకి లేవడంతో.. సీతారామ్ సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడ్డారు. ఈగల్ టీం కష్టాన్ని చెప్పుకోనివ్వకపోవడం మరింత నిరాశ, నిస్పృహలకు దారితీస్తోంది. ఎంతో కాలంగా ఢిల్లీలో డ్రగ్ దందా నడుస్తుంటే పట్టుకోలేని స్థానిక పోలీసులు తెలంగాణ పోలీసులు వచ్చి రెక్కీ వేసి, తమకు సహకరించాలని ఆపరేషన్లో వెంటపెట్టుకున్నారు. ఇంత చేసినా క్రెడిట్ను ఈగల్ టీంకు ఇవ్వకుండా వాళ్లే కొట్టేయాలని భావించడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని మన పోలీసులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. -
పెంచలయ్య హత్య కేసులో పురోగతి
సాక్షి, నెల్లూరు జిల్లా: ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య కుట్రదారు ఆరని కామాక్షిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్కు తరలించారు. బోణిగానితోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఏ1 నిందితుడు జేమ్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు. జేమ్స్ కాలుకి బుల్లెట్ తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.పెంచలయ్య హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ‘‘పెంచలయ్య గంజాయి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేస్తుండేవాడు. అదే కాలనీకి చెందిన గంజాయి వ్యాపారి ఆరవ కామాక్షి పెంచలయ్యపై కక్ష పెంచుకొంది. తన వ్యాపారానికి అడ్డం వస్తున్నాడని హతమార్చడానికి కుట్ర పన్నింది. స్కూల్ నుంచి బిడ్డను తీసుకొస్తున్న క్రమంలో పెంచలయ్యపై దాడి చేశారు..పది మంది పాశవికంగా పొడిచి చంపారు. A1 జేమ్స్ ను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. నేడు కామాక్షిని గంజాయి పట్టుబడ్డ కేసులో అరెస్టు చేశారు. పీటీ వారెంట్ కింద ఈ కేసులో కామాక్షిని అదుపులోకి తీసుకుంటాం. ఈ హత్య కేసులో మొత్తం 14 మంది వున్నారు. 9 మందిని అరెస్ట్ చేశాం. మిగతా ఐదుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు.ప్రజానాట్య మండలి, డీవైఎఫ్ఐ ఆగ్రహంకామ్రేడ్ పెంచలయ్యను గంజాయి గూండాలు హత్య చేయడంపై ప్రజానాట్య మండలి, డీవైఎఫ్ఐ నేతలు మండిపడ్డారు. కామ్రేడ్ పెంచలయ్య హత్యకు గురికావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో గంజాయి గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయని డీవైఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం గంజాయి గ్యాంగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. -
పెంచలయ్య హత్య కేసులో పురోగతి
-
అక్కడ మింగేసి.. ఇక్కడ కక్కేసి..
సాక్షి, న్యూఢిల్లీ: పోలీసుల అదుపులో ఉన్న అంతర్జాతీయ డ్రగ్ ముఠా నుంచి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆఫ్రికా నుంచి మన దేశంలోకి డ్రగ్ తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. విమానాశ్రయాల్లో పోలీసుల కళ్లుగప్పి ఈ డ్రగ్ దందా సాగిస్తున్నట్లు ఢిల్లీ క్రైం బ్రాంచ్, తెలంగాణ ఈగల్ టీం పోలీసుల విచారణలో ప్రాథమికంగా వెల్లడైనట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఈ డ్రగ్ దందాకు స్వస్తి పలికేందుకు తెలంగాణ పోలీసులు త్వరలో పలు సంస్కరణలను తీసుకురానున్నట్లు సమాచారం. ముందు మింగేసి.. తర్వాత కక్కేసి తూర్పు ఆఫ్రికా నుంచి భారత్కు వస్తున్న యువతీ యువకులు అడ్డదారిలో డ్రగ్ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పలు దేశాల నుంచి వచ్చే వారు అక్కడి ఎయిర్పోర్టుల్లోకి రాగానే చెక్ఇన్కు ముందే వాష్రూమ్కు వెళ్తున్నారు. వీరివద్ద ఉన్న పిల్స్ను మింగేస్తున్నారు. ఆ తర్వాత ఇమిగ్రేషన్ పూర్తి చేసుకుంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ తదితర విమానాశ్రయాల్లో దిగగానే బ్యాగేజ్కు ముందే వాష్రూమ్కు వెళ్తున్నారు. ఇక్కడ ఓ లిక్విడ్ను తాగి కొందరు విరేచనం, మరికొందరు వాంతుల ద్వారా మింగిన ఆ పిల్స్ను బయటకు తీస్తున్న విషయాన్ని చెప్పడంతో పోలీసులు షాక్ అయినట్లు తెలిసింది. మిగతా డ్రగ్ను ప్రైవేటు పార్ట్స్లో కొద్దికొద్దిగా అమర్చి తెస్తున్నట్లుగా సమాచారం. అలా తెచ్చిన ఆ డ్రగ్ క్యాప్సిల్స్ను హైదరాబాద్లోని కస్టమర్లకు కొరియర్ ద్వారా పంపుతున్నట్లు గుర్తించారు. పంపేది ఒకరు.. అడ్రస్, ఫోన్ మరొకరిది డ్రగ్ దందాను నైజీరియన్లు చాలా తెలివిగా చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఢిల్లీ, నోయిడా వంటి నగరాల నుంచి హైదరాబాద్కు రోజూ డ్రగ్ను సరఫరా చేస్తున్నారు. వాళ్లు ఫ్రం అడ్రస్ ఈ ముఠాలోని మరొకరిది ఇస్తున్నారు. అలాగే ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు ఫోన్ నంబర్ను సైతం ఇతరులది ఇస్తున్నారు. కొందరు మరింత తెలివితో.. ఫోన్ నంబర్లలో 9 అంకెలు కరెక్ట్వి రాసి, చివరి అంకెను తప్పుగా వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో కొరియర్ అందుకునే వ్యక్తి కూడా అతడు/ఆమె నంబర్ ఇవ్వకుండా వాళ్ల స్నేహితులు, ఇంటి వాచ్మన్, కారు డ్రైవర్, సన్నిహితుల నంబర్లు ఇస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ఖాతాకు రెండువేలకు పైనే కస్టమర్లు వందలాది మ్యూల్ ఖాతాల ద్వారా లావాదేవీలు జరుపుతున్న నిందితులు నిక్, భద్రూదీన్లు ఖాతాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఒక్కో బ్యాంకు ఖాతాను దాదాపు రెండు వేల మందికి ఇస్తున్నట్లు సమాచారం. ఇలా హైదరాబాద్ నుంచి రోజూ 1975 మంది కస్టమర్లు బుక్ చేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులకు.. ఇంతకంటే ఎక్కువ మందే ఉన్నట్లు ఆలస్యంగా తెలిసింది.దాదాపు 30–40 ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు సాగిస్తున్నట్లు సమాచారం. కాగా, మరికొన్ని పోలీస్ టీంలు ఢిల్లీలోనే మకాం వేసి ఈ డ్రగ్ ఎక్కడి నుంచి వస్తున్నదో తెలుసుకునే ప్రయత్నంలో రెక్కీ నిర్వహిస్తున్నారు. డ్రగ్ ముఠాలో కీలకంగా ఉన్న ఇథియోపియాకు చెందిన కొందరు మహిళలను ఓ హోటల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసు అధికారులను ‘సాక్షి’ప్రశ్నించగా, అధికారికంగా ప్రకటించేందుకు తమకు కొంత సమయం కావాలన్నారు. -
ఢిల్లీ పేలుడు కేసు: విదేశీ డిగ్రీ వైద్యులపై నిఘా!
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడుపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు విదేశీ డిగ్రీ కలిగిన వైద్యులపై నిఘా సారించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), చైనా నుంచి ఎంబీబీఎస్ డిగ్రీలు పొంది, ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుల వివరాలను అందించాలంటూ ఢిల్లీ పోలీసులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు.ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి జారీ చేసిన నోటీసులో ‘ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని, పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూఎఈ, చైనా నుండి డిగ్రీ పొందిన వైద్యులు మీ ఆసుపత్రిలో ఉంటే, వారి వివరాలను అందించండి. దీనిని అత్యవసరమైనదిగా పరిగణించండి’ అని ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అల్ ఫలా విశ్వవిద్యాలయంలో తమ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఢిల్లీ పేలుడుకు సంబంధించి విశ్వవిద్యాలయంలోని 30 మంది వైద్యుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ వైద్యులను.. ఉమర్ ప్రవర్తన గురించి ప్రశ్నించారు. తోటి వైద్యులు ఉమర్ ప్రవర్తన దురుసుగా ఉండేదని, కొంతమందిని మాత్రమే తన గదిలోకి అనుమతించేవాడని వెల్లడించారు.ఉమర్ ఉపయోగించిన ఫోన్లలో ఒకటి జమ్ముకశ్మీర్ పోలీసుల దగ్గరుంది. దర్యాప్తు సంస్థ ఈ ఫోన్లో నాలుగు వీడియోలను కనుగొంది. వాటిలో ఒకటి ఇప్పటికే బహిరంగపరిచారు. అందులో ఉమర్.. జిహాద్తో పాటు మానవ బాంబులను సమర్థించాడు. మిగిలిన మూడు వీడియోలు కూడా ఉమర్ చిత్రీకరించనవే. ఒక్కొక్కటి మూడు నుండి ఐదు నిమిషాల వ్యవధితో ఉన్నాయి. ఉమర్ ఫోన్ సాయంతో దర్యాప్తు సంస్థ అతని సహచరులను, నెట్వర్క్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకూ జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయ్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే (జమ్ముకశ్మీర్), డాక్టర్ షాహీన్ సయీద్ (ఉత్తరప్రదేశ్)లను అరెస్టు చేశారు.ఇది కూడా చదవండి: శ్రీలంకకు ‘ఆపరేషన్ సాగర్ బంధు’ -
సతీష్ అరెస్ట్! లైంగిక వేధింపుల కేసులో మంత్రి కొడుకు?
-
మంత్రి పేరు చెప్పి నన్ను బెదిరించాడు
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాలూరు: ‘‘మంత్రి సంధ్యారాణి అనధికార పీఏ బందాపు సతీష్ నన్ను ఆర్థికంగా దోచుకోవడమే కాక వేధించాడు. అతడు చెప్పినట్లు వినకపోతే నన్ను, నా కుటుంబాన్ని కోలుకోలేంత దెబ్బకొడతానని బెదిరించాడు. ఇవిగో.. వాట్సాప్ మెసేజ్లు, ఫొటోలు’’ అంటూ సాలూరుకు చెందిన ఒంటరి మహిళ పోలీసులకు చూపించారు. శుక్రవారం సాలూరు స్టేషన్లో ఆమెను పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా ఆమె తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పోలీసులకు వివరించారు. అనంతరం రాత్రి సాలూరు ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. కాగా, మంత్రి అనధికార పీఏ అరాచకాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ మీడియాపై టీడీపీ నాయకులు అక్కసు వెళ్లగక్కారు. శుక్రవారం ఉదయం ర్యాలీగా పోలీస్ స్టేషన్ ముందు సాక్షి ప్రతులను దహనం చేశారు. సీఐ అప్పలనాయుడికి ఫిర్యాదు చేశారు.‘‘అనధికార పీఏ...’ సతీష్ రాజీనామామంత్రి అనధికారిక పీఏగా అరాచకాలకు పాల్పడిన సతీష్ శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశాడు. తనకు పరపతి, పేరు పెరుగుతుండడాన్ని సహించలేక కొందరు టార్గెట్ చేశారని లేఖలో పేర్కొన్నారు. తన కారణంగా మంత్రి సంధ్యారాణికి చెడ్డ పేరు, ఇబ్బంది రాకూడదనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పాడు. అయితే, అనధికారిక పీఏగా కొనసాగుతూ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.మంత్రి పీఎస్పై లైంగిక దాడి కేసు స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనధికార పీఏ (పీఎస్) బందాపు సతీష్ పై లైంగికదాడి కేసు నమోదైంది. టీచర్గా పనిచేస్తున్న భర్త కరోనాతో చనిపోయిన తన నుంచి కారుణ్య నియామకం కోసం డబ్బులు వసూలు చేయడంతోపాటు మానసికంగా, శారీరకంగా వేధించాడని, లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించాడని బాధితురాలు గురువారం ఎస్పీ కార్యాలయంలో ఇచి్చన ఫిర్యాదులో పేర్కొంది. సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఆమెను విచారణ జరిపారు. అనంతరం ఆమెను సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. సతీష్పై 64(1),74,79, 318(4), 329(3),115(2), 324(4) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కింద పోలీసులు కేసు నమోదుచేశారు. -
ఎన్ కౌంటర్ భయం.. లొంగిపోయిన కీలక మావోయిస్టులు
-
TG: సోషల్ మీడియాలో ‘సూసైడ్’ పోస్టులు!
వనపర్తికి చెందిన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి 30 సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో ఆయన తండ్రితో పరీక్షల ఫీజుపై గొడవ జరిగింది. దీనికి కలత చెందిన ఆ విద్యార్థి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. నిమిషాల వ్యవధిలోనే సైబర్ పోలీసులకు ఓ అలర్ట్ వెళ్లింది. ఆలస్యం చేయకుండా లోకల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆ విద్యార్థి దగ్గరకు చేరుకొని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.హైదరాబాద్ సాక్షి: క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఎన్నో జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. ఏవరో తిట్టారనే కోపంతో లేదంటే జీవితంలో విఫలమయ్యమనే బాధతో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడి తమ జీవితాలను ముగించి తమను నమ్ముకున్న వారికి తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులపై వెంటనే స్పందించి బాధితుల ఆత్మహత్య ప్రయత్నాలను తెలంగాణ సైబర్ పోలీసులు భగ్నం చేస్తున్నారు. తెలంగాణ సైబర్ పోలీసులు ఆత్మహత్యల్ని నిరోధించడానికి సరికొత్త సాంకేతికతను వాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా ఆత్మహత్య ప్రేరేపిత వీడియోలు, చిత్రాలు పోస్ట్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులకు సమాచారం చేరేలా సిస్టమ్ రూపొందించారు. హెచ్చరికలు రావడంలో తక్షణమే స్పందించి వారి ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ అలర్ట్స్ తో గడిచిన నాలుగు వారాల్లో 12 మందిని బలవన్మరణాలకు పాల్పడకుండా కాపాడినట్లు పోలీసులు తెలిపారు...నిజామాబాద్ లో ఒక వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహాత్య చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారు. ఆ అలర్ట్స్ సైబర్ పోలీసులకు వెళ్లడంతో వెంటనే పోలీసులు అతనిని రక్షించారు. ఇలా గడిచిన 4 వారాలలో 12 మందిని రక్షించినట్లు సైబర్ పోలీసులు తెలిపారు.సామాజిక మాధ్యమాలలో ఆత్మహాత్యలకు సంబంధించిన ఏదైనా వీడియోలు లేదంటే ఫోటోలు ప్రచురితమైతే దానికి సంబంధించిన సమాచారం వెంటనే సైబర్ పోలీసులకు చేరుతోంది. ఈ విధంగా సమాచారాన్ని అందించేలా పలు సామాజిక మాధ్యమాలతో తెలంగాణ సైబర్ పోలీసు విభాగం ఒప్పందం జరిపినట్లు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. సోషల్ మీడియాలో ఏవైనా అభ్యంతకర పోస్టులు పెడితే 10 నిమిషాలలోపే మాకు హెచ్చరికలు వస్తాయి. దీంతో మేము సంబంధిత పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేస్తాం అని శిఖా గోయల్ అన్నారు. దీనివల్ల ఇప్పటి వరకూ ఎన్నో ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. -
వీడో తేడా : వీడి మెంటల్ స్టంట్స్కి అంతే లేదు, అందుకే!
అమ్మాయి కనిపిస్తే చాలు అది వీధిలోఅయినా, ఆన్లైన్లో అయినా కావాలని ఏదో కరంగా కమెంట్లు చేయడం, ఉద్దేశపూర్వకంగా వేధించడం, ట్రోలింగ్ చేయడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయింది. అలాంటివారికి చెంపపెట్టులాంటిదీ వార్త. అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయికి బుద్ధి చెప్పేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. బిహార్ షరీఫ్ నివాసి అయిన ఒక యువకుడు అమ్మాయిల ముందు విన్యాసాలు చేయడం, వారిని వేధించడం,అశ్లీల పాటలు ప్లే చేయడం అతని పని. సుభాష్ పార్క్, నలంద కాందహార్, రాజ్గిర్ ఫిట్నెస్ పార్క్ . ఇవే అతని అడ్డాలు. ఇన్స్టాగ్రామ్ ఖాతా సృజన్ ఫ్లిప్పర్. pic.twitter.com/Ks7TYeRvUX— The Nalanda Index (@Nalanda_index) October 22, 2025 అకస్మాత్తుగా రోడ్డు మధ్యలోకి చొరబడి అమ్మాయిలను భయపెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా జిల్లీ పోలీసు యంత్రంగా రంగంలోకి దిగింది. నలంద జిల్లాలో ఒక యువకుడు పాఠశాల విద్యార్థినులను బెదిరించడానికి, వేధించేందుకు, పట్టపగలు నడిరోడ్డుమీద ప్రమాదకరమైన విన్యాసాలు చేసేవాడు. ఈ దృశ్యాలు కనలంద జిల్లాలో వైరల్ అయ్యాయి. ఈ ఆందోళనకరమైన దృశ్యాలపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిలు సురక్షితంగా ఉండేలా అతనిపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. आप वीडियो में जिस रीलबाज को देख रहे हैं वह बिहार शरीफ का रहने वाला है और इसके इंस्टाग्राम का नाम srijan flipper हैं। इसका काम लड़कियों के सामने स्टंट मारना और उनको परेशान करना और अश्लील गाने बजाना है। सुभाष पार्क नालंदा खंडहर राजगीर फिटनेस पार्क इसका मुख्य अड्डा है। बिहार पुलिस… pic.twitter.com/cTTAcNY4rh— The Nalanda Index (@Nalanda_index) October 22, 2025 ఆన్లైన్లో షేర్ అయిన ఈ వీడియోల ప్రకారం, ఇతగాడు ట్రాఫిక్లో రోడ్డు మధ్యలోకి వచ్చి పిచ్చి పిచ్చి స్టంట్స్తో అమ్మాయిలపైకి దూకి, భయపెట్టేవాడు. దీంతో బాధిత అమ్మాయిలు, తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నలంద పరిపాలనా అధికారులు తగిన చర్యలు తీసుకోవల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. ఇలాంటి ధోరణులుమరింత ముదిరి, తీవ్రమైన ప్రమాదం జరగక ముందు పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులు కోరారు. ఇప్పటికే పెరుగుతున్న ఆన్లైన్ ట్రెండ్స్పై ఆందోళన రేకెత్తించిందీ ఘటన. ఇంటా, బయటా ఎక్కడైనా అమ్మాయిలను వేధించినా, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించే పేరుతో పిచ్చి పిచ్చి "స్టంట్స్" చేసినా తగిన గుణపాఠం తప్పదనే సంగతిని గుర్తుంచుకోవాలంటున్నారు పెద్దలు ఇలాంటి వాడిని జూలోని బోనులోపెట్టాలి, ఎవరికి ఎలాంటి హాని లేకుండా వాడి విన్యాసాలుసాగుతాయి , ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడికి బుద్ధి చెప్పకపోతే.. ఇలాంటి వాళ్లు మరికొందరు తయరవుతారని మరికొందరు మండిపడ్డారు. తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
54 మంది మృతి చెందితే.. ఇంత నిర్లక్ష్య దర్యాప్తా?
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో జరిగిన భారీ ప్రమాదంపై ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 54 మంది మృతి చెందిన ఘటన దర్యాప్తుపై అధికారుల ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ప్రశ్నించింది. దారుణ ఘటన జరిగి ఐదు నెలలు కావొస్తున్నా దర్యాప్తు ఏమీ తేల్చకపోవడాన్ని తప్పు బట్టింది. 237 మంది సాక్షులను విచారించినా ఎలాంటి పురోగతి లేకపోవడం సరికాదంది. ఘటనకు కారణాలేంటి, బాధ్యలెవరనేది గుర్తించకపోవడమేంటని అడిగింది.ఇలాంటి ప్రమాదంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా..ఒక డీఎస్పీని నియమిస్తారా అని ప్రశ్నించింది. తదుపరి విచారణ రోజున తమ ముందు హాజరై దర్యాప్తునకు సంబంధించిన వివరాలు అందజేయాలని దర్యాప్తును అధికారిని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది.పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ప్రమాదంలో 54 మంది మృతి చెందగా, 28 మంది గాయపడ్డారని, 8 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందని హైదరాబాద్ స్నేహపురి కాలనీకి చెందిన రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం విదితమే. ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనలు లేకపోవడం, బాధిత కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోందన్నారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పరిశ్రమ సిబ్బందిని ఎందుకు విచారించలేదు పిటిషనర్ తరఫున న్యాయవాది వసుధ నాగరాజ్ వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగి నాలుగు నెలలు కావొస్తున్నా దర్యాప్తు మందకొడిగా సాగుతోందన్నారు. పరిహారం పంపిణీ పూర్తి స్థాయిలో జరగలేదని, బాధ్యులైన వారిని అరెస్టు చేయలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిపుణుల కమిటీ నివేదికను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని దర్యాప్తు సంస్థకు ఇటీవలే అందజేశామన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.సిగాచి పరిశ్రమ తరఫు హాజరైన న్యాయవాది కౌంటర్ దాఖలుకు రెండు వారాలు సమయం కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘మరణించిన, గాయపడిన కార్మికుల కుటుంబాలకు ‘సిగాచి’ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లించే చర్యలు చేపట్టాలని గత విచారణ సందర్భంగా ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాం. ఆ మేరకు మరణించిన, గాయపడిన కార్మికులతో పాటు కనిపించకుండా పోయిన వారికి చెల్లించిన పరిహారం వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరఫున ఏఏజీ న్యాయస్థానానికి సమరి్పంచారు. దర్యాప్తులో భాగంగా 237 మంది సాక్షులను అధికారులు విచారించారని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఘటనపై పూర్తి చార్జిïÙట్ దాఖలు చేయడానికి మరో 15 మంది సాక్షులను విచారించాల్సి ఉందన్నారు.సాక్షుల వివరాలను పరిశీలిస్తే మరణించిన, గాయపడిన కార్మికుల బంధువులు, కొందరు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. పరిశ్రమ యాజమాన్యాన్ని, ఉద్యోగులను విచారించినట్లు పేర్కొనలేదు’అని అభిప్రాయపడింది. దర్యాప్తుకు సంబంధించిన రికార్డులు, కేసు డైరీ లాంటి వివరాలతో దర్యాప్తు అధికారి తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు పరిశ్రమకు రెండు వారాలు సమయానికి అనుమతించింది. తదుపరి విచారణ డిసెంబర్ 9న మధ్యాహ్నం 2.15కు వాయిదా వేసింది. -
పోలీసుల దర్యాప్తు తీరుపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం
-
హాంకాంగ్ ప్రమాదానికి కారణం ఏంటంటే..
హాంకాంగ్ వాంగ్ హాక్ కోర్ట్ టవర్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 65కు చేరుకుంది. 70 మంది తీవ్రగాయాలపాలవగా , 237 మంది ఆచూకీ లభించడంలేదు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు. ఇంత తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. బుధవారం హాంకాంగ్ లోని వాంగ్ పుక్ కోర్ట్ టవర్స్ లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 65 మంది దుర్మరణం చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాద ఘటనపై ఆదేశ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో ఇంత పెద్దఎత్తున మంటలు చెలరేగడానికి ఆ భవన మరమ్మత్తులో ఉపయోగిస్తున్న సామాగ్రి కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. భవన నిర్మాణం ప్రతి కిటికీలలో స్టైరోఫామ్ తో తయారు చేయబడిన వస్తువులను ఉపయోగించారని దాని కారణంగానే మంటలు ఇంత పెద్దఎత్తున వ్యాపించాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్టైరోఫామ్ అనేది పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్. దీనిని నిర్మాణరంగంలో, ఫుడ్ ప్యాకేజింగ్ లలో అధికంగా ఉపయోగిస్తారు. అయితే స్టైరోఫామ్ కు మండే స్వభావం అధికంగా ఉంటుంది. దీనికి మంటలు అంటుకుంటే అంత తేలికగా ఆర్పలేము. ఉష్ణోగ్రత తక్కువ ఉన్న ప్రదేశాలలో కూడా ఇది అధికంగా మండుతుంది. అంతేకాకుండా ఇది మండుతున్నప్పుడు అధిక మోతాదులో కార్బన్ డై యాక్సైడ్ విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో భవన మరమ్మత్తులో ఇంత హానీకర వస్తువులను ఎందుకు ఉపయోగించారు అని పోలీసులు విచారణ చేపడుతున్నారు.కాగా హాంకాంగ్ లోని అసోసియేయేట్ ప్రెస్ ప్రచురించిన నివేదిక ప్రకారం మరమ్మత్తులు చేపడుతున్న ఇంజినీరింగ్ కంపెనీ ఎటువంటి భద్రత ప్రమాణాలు పాటించలేదని నివేదించింది. హాంకాంగ్ లో నిన్న ప్రమాదం జరిగిన భవంతి 1980లో నిర్మించారు. ఆ టవర్స్ లో 2వేలకు పైగా అపార్ట్ మెంట్స్ ఉండగా 4వేలకు మందికి పైగా నివసిస్తున్నారు. ఇటీవల ఆ భవనాలకు మరమ్మత్తులు చేస్తుండగా ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. -
సిగాచీ ఘటన.. పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి హైదరాబాద్: సిగాచీ పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఇది సాధారణ ఘటన కాదని 54 మంది కార్మికులు సజీవ దహానమైన భారీ ప్రమాదమని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ అన్నారు. ఇంత తీవ్రమైన ప్రమాద ఘటనలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడమేంటని ఏఏజీ తేరా రజినీకాంత్ రెడ్డిని ప్రశ్నించారు.సంగారెడ్డిలో సిగాచీ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో దర్యాప్తు జరుగుతున్న తీరుపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. 54 మంది కార్మికులు మృతిచెందితే ఇంకా దర్యాప్తు జరుగుతుంది అని చెప్పడమేంటని ఏఏజీ తేరా రజనీకాంత్ రెడ్డిని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ఇంత పెద్దఘటనకు డీఎస్పీని ఎందుకు దర్యాప్తు అధికారిగా నియమించారని అడిగారు. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సి ఉండవచ్చుగా అని ప్రశ్నించారు. 237మంది సాక్షులను విచారించినా ఇప్పటి వరకూ కేసులో ఎలాంటి పురోగతి లేదా అని అడిగారు.సిగాచీ ప్రమాద ఘటనపై బాబురావు అనే వ్యక్తి ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. పేలుడు సంబవించి ఐదు నెలలు దాటినా ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిపుణుల కమిటీ సైతం పరిశ్రమ నిర్వహణలో లోపాలున్నాయని తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వచేశారని కమిటీ గుర్తించిందని న్యాయవాది పేర్కొన్నారు. పేలుడు తీవ్రతతో ఎనిమిది మంది శరీరాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని కోర్టుకు తెలిపారు.వాదనలు విన్న కోర్టు పోలీసు దర్యాప్తు నివేదిక కోర్టుకు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది. ఆ విచారణకు డీఎస్పీ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా పాశామైలారంలోని సిగాచీ ఫార్మా ప్లాంట్ లో ఈ ఏడాది జూన్ 30 న భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. -
Vizag: క్రిప్టో బాధితుల్లో దాదాపు 200 మంది పోలీసులు
-
TG: దీక్షలో ఉంటే డ్యూటీ చేయకూడదు
హైదరాబాద్ : మతపరమైన దీక్షలపై పోలీసు శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది. మత పరమైన దీక్షలు తీసుకుంటే పోలీసులు సెలవులు తీసుకోవాలని అంతేగాని డ్యూటీలో ఉండగా దీక్షలు చేయడానికి వీలు లేదని తెలిపింది. ఈ మేరకు డ్యూటీలో ఉండగా నిబంధనలు ఉల్లంఘించారని కంచన్ బాగ్ ఎస్సైకి మెమో జారీ చేసింది. పోలీసుల జట్టు, గడ్డం పెంచుకోకూడదని సివిల్ డ్రైస్ లో డ్యూటీ చేయకూడదని ఆదేశించింది.అయ్యప్ప దీక్షలో ఉంటేనే నిబంధనలు గుర్తుకువస్తాయా?తాజా తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడే పోలీసులకు నిబంధనలు గుర్తుకువస్తాయా? అంటూ ప్రశ్నించారు. హిందూవులకే ఇలాంటి రూల్స్ ఉంటాయా అంటూ ప్రశ్నించారు. రంజాన్ సమయంలో ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలన్నారు రాజాసింగ్.అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసులకు మెమో ఇవ్వడం దారుణమని వీహెచ్పీనేత శశిధర్ అన్నారు. గడ్డం పెంచుకున్న ముస్లింలకు ఈ విధంగా నోటీసులు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. రంజాన్ మాసంలో మాత్రం వారికి ఎందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నారని పోలీసులను అడిగారు . -
నీతో మాట్లాడాలి పోలీస్స్టేషన్కు రా..
సాక్షి టాస్క్ ఫోర్స్: సాక్షి పత్రికలో ప్రచురితమైన ఒక వార్తకు సంబంధించి స్టేషన్కు వచ్చి సమాధానం చెప్పాలంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి సాక్షి విలేకరిని సీఐ, ఎస్ఐ బెదిరించారు. ఎస్ఐ మరో అడుగు ముందుకేసి మరీ దురుసుగా మాట్లాడారు. తొలుత సాక్షి టెక్కలి విలేకరికి ఫోన్ చేసిన కోటబోమ్మాళి ఎస్ఐ వి.సత్యనారాయణ.. ఒకసారి స్టేషన్కు రా.. నీతో మాట్లాడాలి అన్నారు.దేనికి సార్ అని విలేకరి అడగగా.. ‘తినేముందు రుచి చూడటమెందుకు.. ఎలాగో తింటావుగా..’ అన్నారు. దీంతో విలేకరి టెక్కలి రూరల్ సీఐ శ్రీనివాసరావుకు ఫోన్ చేయగా.. ‘ఈ రోజు యాక్సిడెంట్ ఐటమ్ ఎవరు రాశారు. మామూళ్ల మత్తులో పోలీసులు అనే విధంగా ఐటెమ్ రాశారు. మీకేమైనా ఎవిడెన్స్ ఉన్నాయా. కలెక్టర్ గారు కోటి రూపాయలు తీసుకున్నారని ఆరోపిస్తే మీరు రాసేస్తారా. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా. మీరు ఆన్సర్ చేస్తారా. మారి్నంగ్ స్టేషన్కు రండి..’ అంటూ హుకుం జారీచేశారు. అసలు జరిగిందేమిటి? కోటబోమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు గ్రామం సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన నలుగురు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిలో కోటబోమ్మాళి పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డుపై లారీలు పార్కింగ్ చేయడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు వచి్చనా హైవే పెట్రోలింగ్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అంశంపై సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపైనే అక్కడ ఎస్ఐ, సీఐ ఇలా ఫోన్చేసి స్టేషన్కు వచ్చి సమాధానం చెప్పాలంటూ హుకుం జారీచేశారు. ఇందులో ఎస్ఐ సత్యనారాయణ విలేకరితోనే అంత దురుసుగా మాట్లాడుతుంటే ఇక సామాన్యుడి పట్ల ఎలా వ్యవహరిస్తారో అనే సందేహం కలుగుతోంది. -
ముంబై-వారణాశి చిన్నారి ఆరోహి : సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా కళ్లు చెమర్చే కథ
ఒడిలో ఆదమర్చి నిద్రపోతున్న బిడ్డ అకస్మాత్తుగా మాయమైపోతే.. ఆ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి బాధ వర్ణనాతీతం. ఎవరెత్తుకుపోయారో.. ఏం చేశారో, ఏమైపోయిందో.. అసలు బతికి ఉందో లేదో తెలియక ప్రతీక్షణం నరకయాతన తప్పదు. ఆరు నెలలు పాటు మానసిక క్షోభను అనుభవించారో తల్లితండ్రులు.కానీ ఆ బిడ్డ ఆచూకీ దొరికేదాకా పోలీసులు కూడా అదే ఆవేదనను అనుభవించడమే ఈ వార్తలోని ప్రత్యేకత. చిన్నారి దొరికేదాకా వారికి ఊపిరి ఆడలేదు. సొంత బిడ్డ పోయినట్టుగా విలవిల్లాడి పోయారు. రాత్రింబవళ్లు కష్టపడ్డారు. చివరికి ఆరు నెలలకు వారి కష్టం ఫలించింది. అలా ఈ ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం అనుకోకుండా అటు తల్లి దండ్రుల జీవితాల్లోనూ, ఇటు పోలీసు అధికారుల జీవితాల్లోనూ ఒక మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.అసలు కథ ఏంటంటే..అది మే 20, (2025) రాత్రి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. షోలాపూర్కు చెందిన ఒక సాధారణ జంట. తమ కలల పంట అయిన నాలుగేళ్ల ఆరోహిని వెంట బెట్టుకొని ఈ దంపతులు, తన తండ్రి చికిత్స కోసం ముంబైకి వచ్చారు. ప్రయాణంలో అలసిపోయారు. కాసేపు సేద దీరుతామని అలా కూర్చున్నారు. ఇంతలో తల్లిగా మాగన్నుగా నిద్ర పట్టింది. ఉన్నట్టుండి ఒడిలో ఉన్న బిడ్డ మాయమైపోయింది. కళ్లు మూసి తెరిచేలోపే అంతా జరిగిపోయింది. దీంతో కంటిధారగా విలపించిన వారు పోలీసులను ఆశ్రయించారు. అనేక సార్లు అధికారులను వేడుకున్నారు. బిడ్డ ఫోటోను రైళ్లలో, మురికివాడల్లో, అనాథాశ్రమాలలో అపరిచితులకు చూపించారు. అలా ఆరు నెలలు తిండీ తిప్పలు లేకుండా గడిపారు. కళ్లుమూసినా, తెరిచినా ‘‘ఆరోహి…ఆరోహి’’ ఒకటే ఒకటే ధ్యాస. బిడ్డ ఏమైపోయిందీ అనీ. మాయ దారి నిద్ర బిడ్డను దూరం చేసిందనే బాధతో నిద్రకే దూరమయ్యారు.అటు ముంబై పోలీసులుకూడా ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఆరోహి పోస్టర్లను ముద్రించారు, లోకమాన్య తిలక్ టెర్మినస్ నుండి భూసావల్ నుండి వారణాసి కాంట్ వరకు ప్రతి ప్లాట్ఫామ్పైనా అతికించారు. పేపర్లలలో ప్రకటనలు ఇచ్చారు. మరో విధంగా చెప్పాలంటే చేయని ప్రయత్నం లేదు. చివరికి జర్నలిస్టులను సంప్రదించారు. కొంతమంది అధికారులైతే చిన్నారిని తమ సొంత బిడ్డలా భావించి ఫోటోను తమ చొక్కా జేబుల్లో పెట్టుకొని మరీ ఆచూకీ కోసం ప్రయత్నించారు.ఆనందం వెల్లివిరిసిన క్షణాలునవంబర్ 13న, వారణాసిలోని ఒక స్థానిక రిపోర్టర్ ఆరోహి పోస్టర్ చూశాడు. అంతే అతడి బుర్రలో ఏదో క్లిక్ అయింది. నిద్రలో మరాఠీ పదాలు మాట్లాడే ఒక అమ్మాయిని గురించి తెలుసుకొని వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. మరుసటి రోజు ఉదయం, ముంబై పోలీస్ ఇన్స్పెక్టర్ వారణాసిలో ల్యాప్టాప్ ముందు కూర్చుని వీడియో కాల్చేవాడు. అపుడు స్క్రీన్పై ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. పింక్ ఫ్రాక్లో తన పాప. అదృశ్యమైన రోజుధరించింది అదే రంగుగౌను. ముంబైలో అధికారి వెనుక నిలబడి ఉన్న తల్లి తన కూతుర్ని తల్లికి నోట మాట రాలేదు. తండ్రి మాత్రం కళ్లనీళ్లతో సంతోషంగా "అది నా ఆరోహి... అది నా బిడ్డ..." అని అరవడం మొదలు పెట్టాడు.అంతే వేగంగా స్పందించిన పోలీసులు విమానంలో పాపను తీసుకొచ్చారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ మొత్తం అక్కడ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కొత్త బెలూన్లు , నీలి రంగు కొత్త ఫ్రాక్. కానీ చిన్నారి బయటకు వచ్చి ఖాకీ యూనిఫాంల సముద్రాన్ని చూసి తొలుత నివ్వెర పోయింది. మరుక్షణం పరుగెత్తుకుంటూ వచ్చి చేతులు చాచి, ఆమె సమీపంలోని అధికారిని మెడ చుట్టూ చేతులు వేసి చుట్టేసింది. ఆరు నెలలు మాయమైపోయిన అందమైన చిరునవ్వుతో, స్వచ్ఛంగా, నోరారా విరబూసిన నవ్వులు చూసిన ప్రతీ హృదయం ఆనందంతో ఒప్పొంగి పోయింది. తల్లిదండ్రులైతే నిశ్చేష్టులైపోయారు. గొంతు పూడుకుపోయింది. అడుగు ముందుకు పడలేదు. దీంతో పోలీసులే ఆమెను కన్నవారి వద్దకు తీసుకెళ్లారు. తల్లి బిడ్డను తడిమితడిమి చూసుకుంది. ఆరు నెలలపాటు దూరమైన తన బంగారాన్ని ఆత్రంగా నిమురుకుంది. తండ్రి అయితే ఆ చిన్ని పాదాలపై మోకరిల్లిపోయాడు. ఇది నిజమేనా అనుకుంటూ బిడ్డ, భగవంతుడా నా బిడ్డను నాకు తిరికి నాకిచ్చావు అంటూ ఆ తల్లిదండ్రులు ఒకర్నొకరు తడిమి తడిమి చూసుకున్నారు. ఒకరి కన్నీరు ఒకరు తుడుచుకున్నారు. ఆరు నెలల ఆవేదన, చీకటి వారి కౌగిలింతలు, ముద్దుల్లో దూదిపింజలా తేలిపోయింది.ఇంతకీ పాప ఎక్కడెళ్లిపోయిందిరైల్వే స్టేషన్లో మాయమైన పాప, వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న వారణాసి(varanasi)లో తేలింది. ఆమెను ఎత్తుకు పోయిన కిడ్నాపర్ చెరనుంచి తప్పించుకుందో, లేదంటే వాళ్లే వదిలివేశారో తెలియదు కానీ, జూన్లో రైల్వే పట్టాల దగ్గర ఏడుస్తూ, చెప్పులు లేకుండా, బిక్కు బిక్కు మంటూ కనిపించడంతో, అనాథాశ్రమం అక్కున చేర్చుకుంది. నీడనిచ్చి కొత్త పేరు కూడా ఇచ్చింది. తన అసలు పేరు గుర్తులేని ఆ చిన్నారి “కాశీ”గా మారిపోయింది. కానీ రాత్రిళ్లు మాత్రం దుప్పటి అంచుని పట్టుకుని "ఆయ్" (మరాఠీలో అమ్మ) అని మౌనంగా రోదించేది. ఆ జ్ఞాపకమే ఆమెను కన్నతల్లి ఒడికి తిరిగి తీసుకెళ్లింది.కిడ్నాపర్ మాత్రం ఎవరు?ఏంటి అనేది మాత్రం తెలియదు. కానీ ముంబైలో తప్పిపోయి, కాశీలో తేలి, తిరిగి తల్లి ఒడికి చేరింది. ఇలాంటి తప్పిపోయిన పిల్లలను తిరిగి కన్న ఒడికి చేర్చే ఇలా కన్నీటి గాథలు విన్నపుడు ఖాకీలు కూడా మనుషులే. వారిలోనూ మానవత్వం ఉంది అన్న మాటలు అక్షర సత్యాలు అనిపించకమానదు. హ్యాట్సాఫ్..!ఆనంద్ మహీంద్ర పొగడ్తలు మోహిని మహేశ్వరి అనే ట్విటర్ హ్యాండిల్లో షేర్ అయిన ఈ ఘనటపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఎక్స్లో స్పందించారు. ముంబై పోలీసులను ప్రశంసించారు. మీరు ఆశను, ఆనందాన్ని గొప్ప బహుమతిగా ఇచ్చారు. ఈ ఒక్క కారణంతోనే మీరు మీరు ప్రపంచంలోని అత్యుత్తమ దళాలలో ఒకరు అంటూ కొనియాడటం విశేషం. ఈ కథనం నెట్టింట వైరల్గా మారింది.ముంబై పోలీసులపై చిన్మయి శ్రీపాద, ఇతర సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా అభినందనలు వెల్లువెత్తాయి On the night of May 20, 2025, a little girl in a faded pink frock fell asleep on her mother’s lap at Chhatrapati Shivaji Maharaj Terminus. Her parents, simple people from Solapur, had come to Mumbai for her father’s treatment. They were exhausted. Just for a moment, the mother… pic.twitter.com/Cc2u5gv1lU— Mohini Maheshwari (@MohiniWealth) November 23, 2025A 4-year-old girl missing for six months was located at an orphanage in Varanasi through the efforts of @MraMargPS .Following a complaint from her parents reporting her kidnapping from Mumbai CST, the investigation uncovered that the accused had taken her by train from Lokmanya… pic.twitter.com/IAe6iM0Dyl— मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) November 15, 2025 -
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న iBOMMA రవి
-
మళ్లీ పెళ్లి కోసం చిన్నారి కిడ్నాప్
గోల్కొండ: విడాకులు తీసుకున్న ఓ జంట మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవడానికి పథకం వేసిన ఆ జంట బాలిక కిడ్నాప్కు పథకం వేశారు. ఈ వివరాలను సౌత్ వెస్ట్ జోన్ అదనపు డీసీపీ కృష్ణగౌడ్ ఆదివారం గోల్కొండలోని టోలిచౌకీ ఏసీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... హకీంపేట్కు చెందిన మహ్మద్ ఫయాజ్ (25) గోల్కొండకు చెందిన సల్మాబేగం అలియాస్ సమ్రీన్ (24) ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే అతి కొద్ది కాలంలోనే విడాకులు తీసుకున్నారు. ఆటో డ్రైవర్ అయిన ఫయాజ్ హకీంపేట్లో ఉంటూ మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండేళ్లుగా ఫయాజ్ తన మొదటి భార్య సల్మా బేగంను తరచూ కలుసుకుంటున్నాడు. కొద్దికాలం క్రితం ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఈ పెళ్లికి ఫయాజ్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయితే తనకు విడాకుల సమయంలో సల్మాబేగం గర్భవతి అని విడాకుల అనంతరం ఆమెకు ఆడపిల్ల పుట్టిందని ఫయాజ్ తన తల్లిదండ్రులను నమ్మించి పెళ్లికి ఒప్పుకోవాలని ఒత్తిడి చేశాడు. అనంతరం పాపను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం సల్మాబేగం గోల్కొండ సాలేనగర్లోని ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న సఫియాబేగం అనే నాలుగేళ్ల చిన్నారిని మాయమాటలు చెప్పి ఎత్తుకొచ్చింది. ఫయాజ్ సల్మాతో పాటు చిన్నారిని హకీంపేట్లోని తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ సమయంలో అతడి రెండవ భార్య పుట్టింటికి వెళ్లింది. కాగా అదే రోజు సాయంత్రం కిడ్నాప్కు గురైన చిన్నారి తల్లిదండ్రులు గోల్కొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆటో డ్రైవర్ అయిన ఫయాజ్ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉండగా ఫయాజ్తో పాటు సల్మాబేగంలను అదుపులోకి తీసుకున్నారు. అదే ఇంట్లో ఉన్న కిడ్నాప్కు గురైన చిన్నారిని కూడా పోలీసులు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. నిందితుల నుంచి ఆటోను, రెండు మొబైల్ ఫోన్లను స్వా«దీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ప్రెస్ మీట్లో గోల్కొండ ఇన్స్పెక్టర్ బి.సైదులు, టోలిచౌకీ డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పాల్గొన్నారు. -
మళ్లీ పెళ్లి కోసం చిన్నారి కిడ్నాప్
గోల్కొండ: విడాకులు తీసుకున్న ఓ జంట మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవడానికి పథకం వేసిన ఆ జంట బాలిక కిడ్నాప్కు పథకం వేశారు. ఈ వివరాలను సౌత్ వెస్ట్ జోన్ అదనపు డీసీపీ కృష్ణగౌడ్ ఆదివారం గోల్కొండలోని టోలిచౌకీ ఏసీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... హకీంపేట్కు చెందిన మహ్మద్ ఫయాజ్ (25) గోల్కొండకు చెందిన సల్మాబేగం అలియాస్ సమ్రీన్ (24) ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే అతి కొద్ది కాలంలోనే విడాకులు తీసుకున్నారు. ఆటో డ్రైవర్ అయిన ఫయాజ్ హకీంపేట్లో ఉంటూ మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండేళ్లుగా ఫయాజ్ తన మొదటి భార్య సల్మా బేగంను తరచూ కలుసుకుంటున్నాడు.కొద్దికాలం క్రితం ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఈ పెళ్లికి ఫయాజ్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయితే తనకు విడాకుల సమయంలో సల్మాబేగం గర్భవతి అని విడాకుల అనంతరం ఆమెకు ఆడపిల్ల పుట్టిందని ఫయాజ్ తన తల్లిదండ్రులను నమ్మించి పెళ్లికి ఒప్పుకోవాలని ఒత్తిడి చేశాడు. అనంతరం పాపను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం సల్మాబేగం గోల్కొండ సాలేనగర్లోని ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న సఫియాబేగం అనే నాలుగేళ్ల చిన్నారిని మాయమాటలు చెప్పి ఎత్తుకొచ్చింది. ఫయాజ్ సల్మాతో పాటు చిన్నారిని హకీంపేట్లోని తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ సమయంలో అతడి రెండవ భార్య పుట్టింటికి వెళ్లింది.కాగా అదే రోజు సాయంత్రం కిడ్నాప్కు గురైన చిన్నారి తల్లిదండ్రులు గోల్కొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆటో డ్రైవర్ అయిన ఫయాజ్ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉండగా ఫయాజ్తో పాటు సల్మాబేగంలను అదుపులోకి తీసుకున్నారు. అదే ఇంట్లో ఉన్న కిడ్నాప్కు గురైన చిన్నారిని కూడా పోలీసులు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. నిందితుల నుంచి ఆటోను, రెండు మొబైల్ ఫోన్లను స్వా«దీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ప్రెస్ మీట్లో గోల్కొండ ఇన్స్పెక్టర్ బి.సైదులు, టోలిచౌకీ డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పాల్గొన్నారు. -
‘నా బిడ్డ తెల్లగా ఉందేంటి?’.. భార్యను కడతేర్చిన కసాయి భర్త
పాట్నా: బీహార్లో విషాదం చోటు చేసుకుంది. తాళికట్టిన భార్యనే దారుణంగా హతమార్చాడో కసాయి భర్త. కారణం తను నల్లగా ఉన్నా.. తనకు పుట్టిన బిడ్డ తెల్లగా ఉండటమే. పోలీసుల వివరాల మేరకు.. కతిహార్ జిల్లా అబాద్పూర్ థానా పరిధి నారాయణ్పూర్ గ్రామంలో మహిళ హత్య కేసు స్థానికంగా తీవ్రంగా కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలు,అనుమానం, ఇరుగుపొరుగు వారు సూటి పోటి మాటలు ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది.అజమ్నగర్లోని జల్కి గ్రామానికి చెందిన సుకుమార్ దాస్, మౌసుమి దాస్ దంపతులకు మూడు నెలల క్రితం బిడ్డ పుట్టాడు. అయితే ఆ బిడ్డ చర్మరంగు తెల్లగా ఉంది. తాను నల్లగా ఉండటంతో దాని గురించి చుట్టుపక్కలవారు అనవసర వ్యాఖ్యలు, ఎగతాళి చేశారు. అవి సుకుమార్లో అనుమానాలు పెంచాయి. ఆ అనుమానం కాస్తా పెనుభూతంలా మారింది. దీంతో బిడ్డ పుట్టిన మరుక్షణం నుంచి సాఫిగా సాగిపోతున్న దాంపత్య జీవితంలో చిచ్చు రాజేశాయి.ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మధ్యవర్తిత్వం చేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సరికాదా ఆ తగాదాలు మరింత తీవ్రమయ్యాయి. చేసేది లేక బాధితురాలు పుట్టింటుకొచ్చింది. ఆ మరుసటి రోజే ముందస్తు ప్లాన్ ప్రకారం.. అత్తింట్లో ఉన్న భార్యను భర్త అత్యంత క్రూరంగా దాడి చేసి గొంతుకోసి ప్రాణం తీశాడు. అనంతరం సుకుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్
-
Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత
-
పరకామణి కేసులో విచారణ ఎదుర్కొన్న టీటీడీ మాజీ AVSO సతీష్కుమార్
-
వల్లభనేని వంశీకి సపోర్ట్ చేస్తావా? మహిళా అడ్వాకెట్ పై కక్షసాధింపు..
-
పోలీసులకు పెను సవాల్.. iBOMMA One వచ్చేసింది
-
చిట్ట చివరన ఏపీ పోలీస్.. చట్టం.. చతికిల!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగం.. అధికార దుర్వినియోగం.. రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి చంద్రబాబు సర్కారు రాజకీయ పాలన ఫలితాలు ఎలా ఉన్నాయో స్వయంగా కేంద్ర ప్రభుత్వ నివేదిక సాక్షిగా మరోసారి బట్టబయలైంది! కుప్ప కూలినట్లు వెల్లడైంది. పనితీరులో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ కక్ష సాధింపు చర్యలకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ఫలితం ఇదీ!దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరుపై కేంద్ర హోంశాఖ రూపొందించిన 2025 నివేదికలో ఏపీ పోలీసు శాఖ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. పోలీసు సంస్కరణల్లో భాగంగా ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ నాగరిక సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టాల అమలుపై కేంద్ర హోంశాఖ తాజా నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు శాఖల పనితీరును మదించి ఈ ర్యాంకులు ప్రకటించింది.ఏపీ పోలీసు శాఖ 100 పాయింట్లకు గానూ కేవలం 16 పాయింట్లే తెచ్చుకుని 36 స్థానానికి పడిపోవడం గమనార్హం. అయితే మావోయిస్టులను కట్టడి చేశామని, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దాదాపు 50 మందిని పట్టుకున్నామని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు గొప్పలు చెప్పుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నిజానికి ఇదంతా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో, కేంద్ర బలగాల ద్వారా జరిగిందని.. ఏపీ పోలీసుల ద్వారా అరెస్టును మాత్రమే చూపించారని పరిశీలకులు పేర్కొంటున్నారు. బీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాల అమలులో దేశంలోనే అట్టడుగున ఏపీ పోలీసు శాఖ ఉందని పేర్కొన్న కేంద్ర హోం శాఖ నివేదిక 16.70 శాతం పాయింట్లతో చిట్టచివరన 100 మార్కుల పరీక్షలో కనీసం 35 మార్కులు తెచ్చుకుంటే పాస్ అయినట్లు లెక్క! మరి బీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాల అమలులో ఏపీ పోలీసు శాఖ వంద పాయింట్లకు ఎన్ని సాధించిందో తెలుసా..? కేవలం 16.70 పాయింట్లకే పరిమితమైంది. అంటే కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేక చతికిలపడింది. కేంద్ర హోంశాఖ నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ అయ్యింది. జాబితాలో చిట్ట చివరన అంటే 36వ స్థానంలో నిలిచింది. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కలిపి దేశంలో పోలీసు శాఖ సగటు పాయింట్లు 36. అంటే దేశ సగటును కూడా ఏపీ పోలీసు శాఖ చేరుకోలేకపోయింది.నాలుగు విభాగాలుగా పనితీరు మదింపు పౌరులకు సత్వరం, సక్రమంగా పోలీసు సేవలను అందించడం.. బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో సంస్కరణలు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి అమలులో ఉన్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ), ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) చట్టాల స్థానంలో బీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాలను ప్రవేశపెట్టింది. పోలీసు సంస్కరణల్లో భాగంగా చేపట్టాల్సిన చర్యలను నిర్దేశించింది. కేసుల నమోదు, దర్యాప్తు, విచారణలో పారదర్శకతకు పెద్దపీట వేసింది. అందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు మార్గదర్శకాలను రూపొందించింది.తద్వారా పోలీసులు నిబంధనలను ఉల్లంఘించకుండా పౌరులకు సత్వరం సక్రమంగా సేవలు అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఈ క్రమంలో బీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాలను వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలా అమలు చేస్తున్నాయో కేంద్ర హోంశాఖ విశ్లేషించింది. ప్రధానంగా నాలుగు విభాగాలుగా పోలీసు శాఖల పనితీరును మదించింది. పరిపాలన సంస్కరణలకు 20 శాతం, నిర్వహణపరమైన సమర్థతకు 45 శాతం, సమాచార–సాంకేతికత అమలు (ఐసీటీ అప్లికేషన్స్)కు 25 శాతం, పోలీసు – వైద్య – ఆరోగ్య – న్యాయ శాఖల మధ్య సమన్వయానికి 10 శాతం చొప్పున పాయింట్లు కేటాయించింది. మొత్తం 100 పాయింట్లకు పోలీసు శాఖల పనితీరును మదించింది. దేశంలో మొదటి స్థానంలో అసోంబీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాల అమలులో దేశంలో అసోం మొదటి స్థానం సాధించింది. మొత్తం వంద పాయింట్లకు అసోం పోలీసు శాఖ ఏకంగా 72.03 శాతం పాయింట్లు సాధించడం విశేషం. హర్యానా 62.70 పాయింట్లతో రెండో స్థానంలో, సిక్కిం 60.87 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి. ఉగ్రవాద కార్యకలాపాలతో అట్టుడుకుతున్నప్పటికీ జమ్మూ–కశ్మీర్ 59.20 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చివరకు బిహార్ కూడా 47.92 పాయింట్లు సాధించి 15వ స్థానం దక్కించుకుంది.అక్రమ చొరబాట్లతో అతలాకుతలమవుతున్నప్పటికీ మణిపూర్ 45.74 పాయింట్లతో 21 స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మాత్రం 16.70 పాయింట్లకు పరిమితమై దేశంలోనే అట్టడుగున 36 స్థానానికి పడిపోయింది. చంద్రబాబు సర్కారు రెడ్బుక్ రాజ్యాంగం పోలీసు వ్యవస్థను ఎంతగా భ్రష్టు పట్టించిందన్నది ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. బాబు సర్కారు రాజకీయ కుట్రలకు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, ఇతర టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులు కొమ్ముకాస్తుండటంతో ఏపీ పోలీసు శాఖ పరువు బజారున పడిందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నాలుగు విభాగాల్లోనూ విఫలం..కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు విభాగాల్లోనూ రాష్ట్ర పోలీసులు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అందులో ఏపీ పోలీసుల దారుణ పనితీరు ఇలా ఉంది..!పాలన సంస్కరణలకు కూటమి మోకాలడ్డుపరిపాలన సంస్కరణల విభాగంలో 20 పాయింట్లకుగానూ ఏపీ పోలీసు శాఖకు కేవలం 8.77 పాయింట్లే లభించాయి. కేసుల దర్యాప్తులో అధికారులు సక్రమంగా వ్యవహరించేందుకు తెచి్చన సంస్కరణలను ఇందులో నిర్దేశించారు. ఉదాహరణకు గతంలో ఏదైనా నేరం జరిగితే దర్యాప్తు అధికారి ఘటనా స్థలానికి చేరుకుని స్కెచ్ వేయించి ఫొటో తీసి కేస్ డైరీ (సీడీ) ఫైల్లో నమోదు చేసేవారు. అయితే ఈ ప్రక్రియలో లొసుగులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించింది. దీంతో ఘటనా స్థలంలో కేవలం ఫోటో కాకుండా స్కెచ్ వేస్తున్నప్పుడు వీడియో తీయాలని, ఆ వెంటనే నేరుగా సీడీ ఫైల్లో అప్లోడ్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.తద్వారా స్కెచ్ వేస్తున్న సమయం, సీడీ ఫైల్లో అప్లోడ్ చేసిన సమయం రికార్డు అవుతాయి. అందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారులు, ఇతరులకు ట్యాబ్లు ఇవ్వడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్నే పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్కు కేవలం ఒక ట్యాబ్ను మాత్రమే అందించింది. పట్టణ ప్రాంతాల పోలీస్ స్టేషన్ల పరిధిలో రోజుకు సగటున నాలుగు కేసులు నమోదు అవుతున్నాయి. కానీ ఒక్క ట్యాబ్ మాత్రమే ఉంది.దాంతో తీవ్రత తక్కువ ఉన్న కేసుల దర్యాప్తునకు ట్యాబ్ తీసుకెళుతున్నారు. రాజకీయ కక్ష సాధింపులతో పాల్పడిన నేరాల దర్యాప్తునకు ట్యాబ్లు తీసుకువెళ్లడం లేదు. అధికార టీడీపీ కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలు, హత్యాచార ఘటనలను తొక్కిపెడుతుండటంతో పోలీసు వ్యవస్థ పనితీరు దారుణంగా దిగజారింది. ఫలితంగా పాలన సంస్కరణల విభాగంలో 20 పాయింట్లకు ఏపీ పోలీసు శాఖ 8.77 పాయింట్లే తెచ్చుకుంది. కుప్పకూలిన నిర్వహణ సామర్థ్యంకీలకమైన శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తులో ఏపీ పోలీసు శాఖ పనితీరు అత్యంత నాసిరకంగా ఉంది. ఈ విభాగంలో మొత్తం 45 పాయింట్లకు ఏపీ పోలీసు శాఖకు కేవలం 7.93 పాయింట్లే రావడం అందుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సది్వనియోగం చేసుకునేందుకు పోలీసు అధికారులు, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలి. ఫోరెన్సిక్ పరిజ్ఞానం, సైబర్ టెక్నాలజీ, ఆధునిక దర్యాప్తు విధానాలపై సమగ్ర అవగాహన కల్పించాలి.కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆధునిక దర్యాప్తు ప్రక్రియలపై కనీస శిక్షణ కూడా అందించలేదు. ‘అప్పా’ ఏర్పాటును విస్మరించింది. టీడీపీ కూటమి నేతలు బరితెగించి పాల్పడుతున్న కేసుల దర్యాప్తును నీరుగార్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హత్యలు, లైంగిక దాడులు, సోషల్ మీడియాలో వేధింపులు, ఫోరెన్సిక్, సైబర్ నేరాలకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులు నీరుగారుతున్నాయి. పోలీసులకు శిక్షణ గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దానివల్లే ఈ విభాగంలో ఏపీ పోలీసు శాఖకు కేవలం 7.93 పాయింట్లే వచ్చాయి.సమాచార, సాంకేతికతలో గుండు సున్నా చంద్రబాబు ప్రభుత్వం పోలీసు శాఖను ఏ స్థాయికి దిగజార్చిందో కేంద్ర హోంశాఖ నివేదికలోని ‘సమాచార సాంకేతిక అమలు (ఐసీటీ అప్లికేషన్స్) విభాగం బట్టబయలు చేసింది. ఈ విభాగంలో 25 పాయింట్లకుగానూ ఏపీ పోలీసులకు వచి్చంది గుండు సున్నా. ఈ విభాగం కింద రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, డేటా కమ్యూనికేషన్ల వ్యవస్థ, వెబ్సైట్ల సక్రమ నిర్వహణ తదితర అంశాలను కేంద్రం నిర్దేశించింది. ఒక నిందితుడిని పోలీస్ స్టేషన్కు ఎప్పుడు తెచ్చారు?.. లాకప్ పరిస్థితులు.. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి ఎప్పుడు తరలించారు?.. న్యాయస్థానంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు..? లాంటి ప్రక్రియలన్నీ సక్రమంగా పాటించేందుకు విధి విధానాలను నిర్దేశించింది.అందుకే సీసీ కెమెరాల ఏర్పాటును ప్రధానంగా ప్రస్తావించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని చెవికెక్కించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు ఎంత హెచ్చరించినా సరే.. 9 నెలలుగా పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కారణం.. రెడ్బుక్ వేధింపులతో వైఎస్సార్సీసీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టు చేస్తుండటమే! కనీసం వారిని అరెస్టు చేసిన విషయం కూడా చెప్పకుండా వివిధ పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భౌతికంగా, మానసికంగా హింసిస్తోంది.టీడీపీ కూటమి సర్కారు పాలనలో రాజమహేంద్రవరంలో ఓ దళితుడిని అర్ధనగ్నంగా లాకప్లో హింసించిన విషయం తెలిసిందే. ఇక వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అదుపులోకి తీసుకుని వేధించింది. రెడ్బుక్ దౌర్జన్యాలు, వేధింపులు బయటపడకూడదనే పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు. ఇక సాంకేతిక మౌలిక సదుపాయల పేరుతో నిధులు పక్కదారి పట్టించారు. కన్సల్టెన్సీ పేరుతో అస్మదీయ కంపెనీకి రూ.10 కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను పట్టించుకోలేదు. అందుకే కేంద్ర హోంశాఖ ఐసీటీ విభాగంలోనూ ఏపీ పోలీసులకు సున్నా మార్కులు ఇచ్చింది.సమన్వయం శూన్యంకేసుల సమగ్ర దర్యాప్తు, పౌరులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసు, ఫోరెన్సిక్, వైద్య –ఆరోగ్య, కోర్టులు, జైళ్ల శాఖలను సమన్వయపరుస్తూ ఒక గొడుగు కిందకు తేవాలి. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ నిర్దేశించిన సమన్వయం విభాగంలో మొత్తం 10 పాయింట్లకు ఏపీ పోలీసు శాఖకు దక్కిన పాయింట్లు సున్నా. ఒక్క పాయింట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఈ విభాగం కింద ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయిన తరువాత అన్ని విభాగాలను సమన్వయం చేయాలి. ఎఫ్ఐఆర్ కాపీ, కేసు దర్యాప్తు వివరాలు, ఫోరెన్సిక్, వైద్యుల నివేదిక, విచారణ ప్రక్రియ, తీర్పు, నేరస్తుడిని జైలుకు తరలించడం, ఇతర వివరాలన్నీ కంప్యూటర్లో ఒక్క క్లిక్లో అందుబాటులో ఉండాలి.అందుకోసం ప్రతి కేసుకు ప్రత్యేకంగా నంబరు కేటాయించాలి. పోలీస్ స్టేషన్, ఫోరెన్సిక్ విభాగం, ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు, జైళ్ల శాఖలకు తక్షణం అందుబాటులో ఉంచాలి. తద్వారా అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఈ విభాగం గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కూటమి నేతల అరాచకాలు, అక్రమాల కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించడమే లక్ష్యంగా సమన్వయం లేకుండా చేస్తోంది. అన్ని విభాగాలను ఒకే ఛత్రం కిందకు తేవడం లేదు. అందుకే ఈ విభాగం పనితీరులో కేంద్ర హోంశాఖ ఏపీ పోలీసు శాఖకు సున్నా మార్కులు కేటాయించింది. -
స్థానిక పత్రికా ఆఫీసుపై దాడులు : ఖండించిన కశ్మీర్ టైమ్స్
జాతి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందంటూ జమ్మూ -కాశ్మీర్ పోలీసులకు చెందిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) గురువారం జమ్మూలోని కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై దాడి చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో ఈ దాడులు చేపట్టింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ప్రారంభమైన సోదాలలో Ak-47 కార్ట్రిడ్జ్లు, పిస్టల్ రౌండ్లు , మూడు గ్రెనేడ్ లివర్లు స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అసంతృప్తిని వ్యాప్తి చేయడం, వేర్పాటువాదాన్ని కీర్తించడం లాంటివి, భారతదేశం, కేంద్రపాలిత ప్రాంతం, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంకరమనే ఆరోపణల కింద కాశ్మీర్ టైమ్స్పై కేసు నమోదు చేశారు. కాశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉందని ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది.ఇదీ చదవండి: Delhi Blast Case : మరో నలుగురు ప్రధాన నిందితులు అరెస్ట్మరోవైపు మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఆరోపణలను కాశ్మీర్ టైమ్స్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులకు సంబంధించిన తమకు అధికారికర సమాచారమేదీ లేదని ఒక ప్రకటనలో తెలిపింది.. రాష్ట్రానికి హానికలిగించే కార్యకలాపాలు అంటూ ఎస్ఐఏ చేసిన ఆరోపణలని నిరాధారమైనవని పేర్కొంది. తమ కార్యాలయంపై దాడి తమ వాయిస్ను అణచివేసేందుకు చేసే మరో ప్రయత్నంలో భాగమేనని ఆరోపించింది. తమ కార్యాలయం గత నాలుగు సంవత్సరాలుగా మూసివేశామని, ప్రింట్ ఎడిషన్ 2021-2022లో నిలిపివేయగా, డిజిటల్గా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని వివరించింది. రాష్ట్రానికి తమ కార్యాలయాలపై దాడి చేసే అధికారం ఉండవచ్చు. కానీ నిజాలను మాట్లాడే తమ నిబద్ధతపై దాడి చేయదని పేర్కొంది. జర్నలిజం నేరం కాదు. జవాబుదారీతనం రాజద్రోహం కాదు. తాము తమపై ఆధారపడిన వారికి సమాచారం ఇవ్వడం కొనసాగిస్తామనం ఎడిటర్లుప్రబోధ్ జమ్వాల్, అనురాధ భాసిన్ ప్రకటించారు. -
‘ఏడ్చినా.. పట్టించుకోను’.. టీచర్ వేధింపులకు విద్యార్థి బలి
న్యూఢిల్లీ: పాఠశాలలో ఉపాధ్యాయుల నుంచి ఎదురైన అవమాన భారానికి ఒక విద్యార్ధి బలయ్యాడు. ఢిల్లీలోని ఒక ప్రముఖ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం అందరిలో విషాదాన్ని నింపింది. మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆ బాలుడు.. తన ఆత్మహత్యకు పాఠశాల ఉపాధ్యాయుల వేధింపులేనని కారణమని ఆరోపిస్తూ ఒక సూసైడ్ నోట్ను వదిలివెళ్లాడు. ఈ ఘటన తల్లిదండ్రులను, స్థానికులను తీవ్రంగా కలచివేసింది.కుమారుడిని కోల్పోయిన తండ్రి సదరు పాఠశాలలోని ముగ్గురు ఉపాధ్యాయులు, పాఠశాల ప్రిన్సిపాల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తన కొడుకును మానసికంగా హింసించడం వల్లే ప్రాణాలను తీసుకున్నాడని ఆ తండ్రి కన్నీరుమున్నీరవుతూ పోలీసులకు తెలిపాడు. ప్రతిరోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం 7.15 గంటలకు ఆ బాలుడు పాఠశాలకు వెళ్లాడు. అయితే మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ సమీపంలో గాయాలతో ఆ బాలుడు పడి ఉన్నట్లు తండ్రికి ఫోన్ వచ్చింది. బాలుడిని ఆస్పత్రికి తరలించే లోపే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతుని తండ్రి ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘గత కొద్ది రోజులుగా నా కుమారుడిని పాఠశాలలోని ముగ్గురు ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ వేధిస్తున్నారు. మంగళవారం ఒక డ్రామా క్లాసులో నా కుమారుడు పడిపోతే, ఒక టీచర్ అతనిని అవమానించి, అతిగా నటిస్తున్నావని ఎగతాళి చేశారు. దీంతో నా కుమారుడు ఏడవడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ, ఆ టీచర్ నువ్వు ఎంత ఏడ్చినా పట్టించుకోను అని అన్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రిన్సిపాల్ అక్కడే ఉన్నా, తన కుమారునిపై వేధింపులను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని తండ్రి ఆరోపించారు.10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతుండటంతో, స్కూల్ ఉపాధ్యాయులు వేసే మార్కుల విషయంలో ఇబ్బంది ఎదురుకాకూడదనే ఉద్దేశంతో తాము పాఠశాల యాజమాన్యంపై గట్టి చర్య తీసుకోలేకపోయామని తండ్రి తెలిపారు. పరీక్షలు అయ్యాక వేరే స్కూల్లో చేరవచ్చని తన కుమారునికి హామీ ఇచ్చానని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బాలుని బ్యాగులో దొరికిన సూసైడ్ నోట్లో.. తన అవయవాలు పని చేసే స్థితిలో ఉంటే వాటిని అవసరమైన వారికి దానం చేయాలని కోరాడు. అలాగే ఈ లెటర్ చదివినవారు ఈ నంబర్కు కాల్ చేసి, తాను చేసిన పనికి చింతిస్తున్నానని, పాఠశాలలో జరిగిన దానిని తట్టుకునేందుకు తనకు వేరే మార్గం లేదని భావిస్తున్నానని తెలిపాడు.తన పాఠశాల ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లను తెలియజేస్తూ, వారిపై చర్యలు తీసుకోవాలని, తద్వారా మరే విద్యార్థీ తనలాంటి దుస్థితిని ఎదుర్కోకుండా చూడాలని వేడుకున్నాడు. లేఖలో ఆ టీనేజర్ తన కుటుంబాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. తన అన్నయ్యకు, తండ్రికి క్షమాపణలు చెప్పాడు. ఎల్లప్పుడూ తనకు మద్దతుగా నిలిచిన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ, తండ్రిని, సోదరుడిని చక్కగా చూసుకోవాలని కోరాడు. ఒకవైపు పరీక్షల ఒత్తిడి, మరోవైపు టీచర్ల వేధింపులతో కుంగిపోయిన ఆ విద్యార్థి బలవన్మరణంతో తోటి విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: భారత్పై దాడికి జైష్ కుట్ర.. నిధుల సేకరణకు పిలుపు -
పోలీసులకు కేజీఎఫ్ హీరో మదర్ ఫిర్యాదు.. అంతా ఆ సినిమా వల్లే!
కేజీఎఫ్ హీరో యశ్ మదర్ పుష్పలత పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది నిర్మాతగా ఆమె నిర్మించిన కోతలవాడి మూవీ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూవీ ప్రమోషన్స్ విషయంలో తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. ఈ మేరకు చిత్ర ప్రమోటర్ హరీష్ అరసుపై బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. తనకు రూ.65 లక్షలు మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనను బెదిరించాడని పుష్పలత పోలీసులకు తెలిపారు.కాగా.. పాన్-ఇండియా స్టార్ యశ్ తల్లి పుష్పలత.. పిఏ ప్రొడక్షన్స్ అనే తన సొంత చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ పేరు పుష్ప, ఆమె భర్త అరుణ్ కుమార్ మొదటి అక్షరాలు వచ్చేలా పెట్టారు. ఈ బ్యానర్లో తన మొదటి ప్రాజెక్ట్ కోతలవాడి పేరుతో సినిమా తెరకెక్కిచారు. ఈ చిత్రానికి శ్రీ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు పృథ్వీ అంబార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. -
మావోయిస్టుల ఖేల్ ఖతం.. క్లైమాక్స్ కు ఆపరేషన్ కగార్
-
వీళ్లందరినీ తలుపుకొట్టి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు
-
సాయుధపోరుతో మొదలై.. ‘హిడ్మా’ జీవితం సాగిందిలా..
మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా మృతితో మావోయిస్టు ఉద్యమంపై గట్టి దెబ్బ పడింది. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో హిడ్మా హతమయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మడావి హిడ్మా పేరు వినిపించేది. ఆయనను పట్టుకోవడం చాలా కష్టమని, హిడ్మా ఎప్పటికప్పుడు నివాస ప్రాంతాలు మారుస్తుంటారని చెబుతుంటారు. ఇంతకీ మడావి హిడ్మా మావోయిస్టుల ఉద్యమాన్ని ఏవిధంగా ముందుకు నడిపారు? ఇందుకోసం ఎటువంటి విధానాలను ఆశ్రయించారనే వివరాల్లోకి వెళితే..మూడంచెల భద్రతావ్యవస్థహిడ్మాకు మూడంచెల భద్రతావ్యవస్థ ఉండేదని చెబుతారు. దగ్గరగా ఉండే టీమ్-Aలో 10 మంది సభ్యులు, మధ్యలో ఉండే టీమ్-Bలో 20 మంది, వెలుపలి రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. దళంలో ఇతరులకు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడని, ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేస్తారని చెబుతారు. హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం ఇద్దరు సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం. ఎక్కడైనా క్యాంప్ వేసినా అందరితో కలివిడిగా ఉండకపోగా, ప్రత్యేక క్యాంపులో ఉంటారు. హిడ్మాను ఎవరైనా కలవాలంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాలని సమాచారం. కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం ఆరు నెలలకోసారి కూడా హిడ్మా కనిపించడట. దండకారణ్య ప్రాంతం హిడ్మా అడ్డాగా ఉందని చెబుతారు.ఏ భారీ దాడి జరిగినా..ఇటు సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ టార్గెట్గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మా లోయలో జరిపిన దాడిలో హిడ్మా కీలకపాత్ర పోషించారు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్తో పాటు 27 మంది చనిపోయారు. నాటి ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక చాన్నాళ్ల తర్వాత 2021 ఏప్రిల్లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్స్టేషన్ పరిధిలో అంబూష్ చేశారు. ఈ ఘటనలో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన భద్రతాదళాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఘటన తర్వాత హిడ్మా పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా ఆరాన్పూర్ దగ్గర ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 10 డీఆర్జీ జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత భద్రతాదళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మానే ఉన్నాడనే ప్రచారం జరగడం సర్వసాధారణమైంది.అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలుఅటు హిడ్మా సొంతూరు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువ్వర్తి. ఆయన మురియా తెగకు చెందిన ఆదివాసీ. బాలసంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా విప్లవ భావాలను నరనరాన ఒంట బట్టించుకున్నారు. పదోతరగతి వరకే చదివినా.. ఇంగ్లిష్లో గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలడు. ఇక మావోయిస్టులు నడిపే స్కూల్లో చదువుతూ భద్రన్న నేతృత్వంలో సాయుధపోరులో తొలి అడుగులు వేశాడు. ఆపై జేగురుగొండ ఏరియా దళ కమాండర్గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్లో జరిగిన టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు. ఈ దాడిలో 76 మంది CRPF జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నారు. గెరిల్లా పోరులో హిడ్మాకు మెళకువలు నేర్పింది కూడా చలపతే. ఇలా ఒక మెట్టు తర్వాత మరో మెట్టు ఎక్కుతూ వచ్చిన హిడ్మా అనేక మావోయిస్టు ఆపరేషన్లను ముందుండి నడిపారు. ఇప్పుడు హిడ్మా మృతితో మావోయిస్టు ఉద్యమానికే పెద్ద దెబ్బపడినట్లయ్యింది.ఇది కూడా చదవండి: హిడ్మా స్కెచ్ వేస్తే.. మావోయిస్టుల మాస్టర్ మైండ్ హ(ఖ)తం -
జ్యూస్ తాగించి మహిళపై గ్యాంగ్ రేప్
సాక్షి, బళ్లారి/రాయచూరు రూరల్: ఓ మహిళకు జ్యూస్ తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకా మడ్లూరు గ్రామానికి చెందిన మహిళ (39)ను బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నమ్మించి, మాయ మాటలు చెప్పి ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లి జ్యూస్ తాగించారు. ఆమెపై నలుగురు అత్యాచారం చేయడంతో బాధితురాలు యలబుర్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి అత్యాచారానికి పాల్పడిన లక్ష్మణ కెంచప్ప, బసవరాజ్ సక్రప్ప, భీమప్ప, శశికుమార్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం హొసపేటె నుంచి కొప్పళకు బకాయి డబ్బులిస్తామని చెప్పిన యువకుడి మాటలు నమ్మి బాధిత మహిళ వచ్చింది. ఆమె తనకు పరిచయం ఉన్న లక్ష్మణ్కు అప్పు ఇచ్చింది. దానిని పొందడానికి ఆ మహిళను కుష్టిగికి పిలిపించారు. లక్ష్మణ్, మరో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంలో ఆమెను యలబుర్గా తాలూకా మడ్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ జ్యూస్లో మత్తు మందు కలిపి తాగించి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలు కొప్పళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
బిహార్ ‘ఫలితం’పై వివాదం.. మేనల్లుడు హత్య
గుణ: బీహార్ ఎన్నికల ఫలితాలపై సరదాగా మొదలైన చర్చ చివరికి రక్తపాతానికి దారి తీసింది. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల వయస్సున్న శంకర్ మాంఝీ తన సొంత మామల చేతిలో హత్యకు గురయ్యాడు. బీహార్లోని శివహార్ జిల్లాకు చెందిన శంకర్ బతుకుదెరువు కోసం గుణకు వచ్చి, కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న తన మేనమామలు రాజేష్ మాంఝీ (25), తూఫానీ మాంఝీ (27)లతో పాటు ఉంటున్నాడు.. ఈ ముగ్గురు మధ్య మొదలైన రాజకీయ వాదన చివరికి విషాదానికి దారితీసింది.రాత్రివేళ మద్యం మత్తులో ఉన్న ఈ ముగ్గురూ బిహార్ ఎన్నికల ఫలితాల గురించి వాదించుకోవడం మొదలుపెట్టారు. పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనూప్ భార్గవ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించిన వివరాల ప్రకారం శంకర్.. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి మద్దతుదారుడు. అతని మామలు రాజేష్, తూఫానీలు జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ) పార్టీకి మద్దతు ఇచ్చారు. పార్టీలపరమైన అభిమానం వారిని ఉన్మాదులను చేసింది. మాటల యుద్ధం కాస్తా శారీరక ఘర్షణకు దారితీసింది.రాజేష్, తూఫానీలు, శంకర్ను దారుణంగా కొట్టి, కనీస కనికరం లేకుండా, అతనిని పక్కనే ఉన్న బురద గుమ్మి దగ్గరకు లాక్కెళ్లారు. తరువాత అతనిని నేలకేసి కొట్టి, ఊపిరాడకుండా చేసి, బరదలో వదిలేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన శంకర్ను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. శంకర్ను ఆస్పత్రికి తీసుకువచ్చేలోగానే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాంట్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ భార్గవ నేతృత్వంలో రాజేష్ మాంఝీ, తూఫానీ మాంఝీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులిద్దరూ తమ మేనల్లుడిని తామే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. నిందితులపై పోలీసులు హత్య కేసు (సెక్షన్ 302) నమోదు చేశారు. ఈ ఘటనతో గుణలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇది కూడా చదవండి: ‘మిషన్ బెంగాల్’: బూత్ స్థాయి నుంచే ‘మమత’పై బీజేపీ దాడి? -
ఐ బొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్.. వచ్చింది విడాకుల కోసం కాదు!
ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటికొస్తున్నాయి. విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న రవిని పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇది కాస్తా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రవి అరెస్ట్తో సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే తన భార్యతో విడాకుల కేసు కోసమే ఇండియాకు వస్తుండగా రవి అదుపులోకి తీసుకున్నారని వార్తలొచ్చాయి. అందరూ అదే నిజమనుకున్నారు.కానీ తీరా చూస్తే ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు రవి విడాకుల కోసం ఇండియాకు రాలేదని తెలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న ఆస్తుల విక్రయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని టాక్. అంతేకాకుండా అతను 2022లోనే ఓ ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. భారత పౌరసత్వాన్ని వదులుకొని రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ సిటిజన్షిప్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా.. 2022 నుంచి కరేబియన్ దీవుల్లోనే నివాముంటున్నారు. అయితే టెక్నాలజీని వాడుకోవడంలో కింగ్ అయిన ఇమ్మడి రవి.. పైరసీ సైట్ ఐ బొమ్మను స్థాపించాడు. దాదాపు కొన్ని వేల సినిమాలను ఐ బొమ్మ ద్వారా అందుబాటులో ఉంచాడు. ఓటీటీ కంటెంట్ను డీఆర్ఎం టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. మూవీరూల్జ్ ద్వారా కంటెంట్ తీసుకుని హెచ్డీ ఫార్మాట్లోకి మార్చి ఐబొమ్మ సైట్లో అప్లోడ్ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. -
ఇమ్మడి రవి అరెస్ట్లో బిగ్ ట్విస్ట్.. ఐ-బొమ్మ నుంచి మరో మెసేజ్!
సాక్షి,హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను గందరగోళంలోకి నెట్టిన పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. సినిమాలను పైరసీ చేస్తూ అటు సినీ పరిశ్రమకు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరిన ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఐబొమ్మ వెనుక మరికొందరి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.అందుకు ఊతం ఇచ్చేలా ఐబొమ్మ వెబ్సైట్ ఓ మెసేజ్ను విడుదల చేసింది. అందులో..‘మీరు ఇటీవల మా గురించి విని ఉండచ్చు. ప్రారంభం నుండి మా విశ్వసనీయ అభిమానిగా మీరు ఉన్నారు. ఏదేమైనా, మా సేవలు మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేశామని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నాము’ అని ఉంది. అరెస్టు అనంతరం, సీసీఎస్ పోలీసులు ఇమ్మడి రవితోనే ఐబొమ్మ వెబ్సైట్ను మూసేయించారు. అయినప్పటికీ ఇవాళ ఆ సైట్ నుంచి తాజా మెసేజ్ రావడంతో ఇమ్మడి రవితో పాటు మరికొందరు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
IBOMMA; SS రాజమౌళి స్వీట్ వార్నింగ్
-
హిందూపురంలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, పుట్టపర్తి/కదిరి: హిందూపురంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. శనివారం హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి తెగబడిన నేపథ్యంలో ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన నాయకులు ఆదివారం హిందూపురం బయలుదేరారు. అయితే, వారందరినీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని నిర్బంధంలో ఉంచారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డిని కదిరిలో అడ్డుకుని హిందూపురం వెళ్లకుండా ఆంక్షలు విధించారు. పెనుకొండ నుంచి హిందూపురం బయలుదేరిన మాజీ మంత్రి, పార్టీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ను హిందూపురం రానివ్వలేదు. పెనుకొండలోనే అడ్డుకోవడంతో ఆమె అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.హిందూపురం చేరుకున్న పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులను స్థానిక ఇందిరమ్మ కాలనీ వద్ద అడ్డుకున్నారు. తమ పార్టీ కార్యాలయాన్ని సందర్శించేందుకు ఎందుకు అనుమతించరంటూ పార్టీ నేతలు పోలీసులపై తిరగబడ్డారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వారిని అక్కడి నుంచి పెనుకొండకు తరలించారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అనంతపురంలోనే హౌస్ అరెస్టు చేశారు. పుట్టపర్తి నుంచి వెళ్లకూడదని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డికి నోటీసులు ఇచ్చారు.ధర్మవరం నుంచి హిందూపురం వెళ్లరాదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఇంటి వద్దనే అడ్డుకున్న పోలీసులు ఆంక్షలు విధించారు. కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బుల్ను లేపాక్షి మండలం చోళసముద్రం టోల్ప్లాజా వద్ద అడ్డుకుని.. బలవంతంగా లేపాక్షి పోలీసు స్టేషన్కు తరలించారు. వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ నేత వేణురెడ్డిని పట్టణంలో గృహ నిర్బంధం చేశారు. ర్యాలీలు, నిరసనలు చేయకూడదని షరతులు విధించారు. ఆయన పోలీసుల తీరుపై మండిపడటంతో చివరకు బయటకు వదిలారు. అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక భర్త, పార్టీ నేత వేణురెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. రామప్ప అనే ఎస్సీ కులానికి చెందిన వ్యక్తితో హిందూపురం వన్ టౌన్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారు. ఆయనతో పాటుగా పార్టీ బూత్ కమిటీల జిల్లా అధ్యక్షుడు వాలీ్మకి లోకేష్, దివాకర్, వసీమ్, నవీన్, మనోజ్, ఇర్ఫాన్లపైనా కేసులు నమోదయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకే టీడీపీ గూండాలు హిందూపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి ధ్వజమెత్తారు. ఆయనను పోలీసులు కదిరిలో అడ్డుకుని పార్టీ నేత పూల శ్రీనివాసరెడ్డి గృహానికి తీసుకెళ్లి హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సతీశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని రాజ్యాంగేతర శక్తులు పాలిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ధ్వజమెత్తారు.హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రోద్బలంతోనే ఆయన పీఏల ఆదేశాల మేరకు టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటరీ పరిశీలకుడు రమేష్ రెడ్డి అన్నారు. హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక, మడకశిర సమన్వయకర్త ఈర లక్కప్ప, మాజీ ఎంపీ తలారి రంగయ్యతో కలిసి ఆదివారం హిందూపురంలో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని పరిశీలించారు. -
ఐ-బొమ్మ రవి అరెస్టుపై ఆయన తండ్రి ఏమన్నారంటే?
సాక్షి,విశాఖ: ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్టును ఆయన తండ్రి అప్పారావు సమర్ధించారు. ఇమ్మడి రవి అరెస్టు వేళ మీడియా తండ్రి అప్పారావును కదలించింది. ‘రవి నేరం చేయలేదని నేను చెప్పను పరిణామాలు చూసి నేరం చేసినట్టు అంగీకరించాల్సిందే. రవి ఇంటికి వచ్చి రెండేళ్లు అవుతుంది. పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఊరుకుంటారా..?. కోట్లు సంపాదించడం అంటే మాటలా..నేను సాదాసీదా జీవితం గడుపుతున్నాను. రవి తప్పు చేసి చేయలేదంటే ఊరుకుంటారా..?.రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యా, భర్తలిద్దరికీ విభేదాలు ఉన్నాయి. ఏది ఏమైనా రవి చేసింది తప్పే’అని వ్యాఖ్యానించారు. ఇమ్మడి రవి అరెస్టు ఇలావిదేశాల్లో ఉన్న ఇమ్మడి రవి భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు హైదరాబాద్కు వచ్చాడు. ఆ సమయంలో రవి గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో ఇమ్మడి రవి తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇమ్మడి రవి విడుదలైన కొత్త సినిమాను పైరసీ చేయడం వాటిని ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లలో అప్లోడ్ చేస్తుండేవాడు. తద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదని కొత్త మార్గాల్ని ఎంచుకున్నాడు. అందుకు టెలిగ్రామ్ను వేదిక చేసుకున్నాడు. టెలిగ్రామ్లో యూజర్లు సినిమా లింక్స్ క్లిక్ చేస్తే బెట్టింగ్ యాప్స్,గేమింగ్ యాప్స్ యాడ్స్ వచ్చేవి.వాటి ద్వారా భారీ ఆదాయాన్ని గడించాడు.పోలీసుల దర్యాప్తు ఇలా అదే సమయంలో తెలంగాణ సీఐడీ పోలీసులు బెట్టింగ్, గేమింగ్ యాప్స్పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్పై సిట్ను ఏర్పాటు చేశారు. ఆ దర్యాప్తులో ఉండగా పోలీసులకు ఇమ్మడి రవి సైతం బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఐబొమ్మ,బప్పం టీవీలో పైరసీ సినిమా చూసే సమయంలో అనైతిక గేమింగ్, బెట్టింగ్ యాప్స్కు సంబంధిత యాడ్స్ను ప్రసారం చేసేవాడు. పైరసీ సినిమాను ఓపెన్ చేయాలన్నా, డౌన్లోడ్ చేయాలన్నా, ఇంటర్వెల్ తర్వాత సినిమా చూడాలన్నా, సినిమా చూసే సమయంలో పాజ్ క్లిక్ మళ్లీ చూడాలన్నా ఆ యాడ్స్ను క్లిక్ చేసేలా వ్యవస్థను తయారు చేశాడు. ఇమ్మడి రవి అనుచరులు అరెస్టుఅలా పోలీసులు బెట్టింగ్ యాప్స్పై దర్యాప్తు చేస్తుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్లో పైరసీ కంటెంట్కు సంబంధించి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వారిలో శివాజీ,ప్రశాంత్ ఉన్నారు. వారిద్దరూ ఇమ్మడి రవికి ప్రధాన అనుచరులుగా పోలీసులు భావిస్తున్నారు. వాళ్లిద్దరూ అరెస్ట్ అనంతరం కూకట్పల్లి నుంచి తప్పించుకుని నెలకొకసారి దేశాలు మారుతూ వచ్చాడు. కూకట్ పల్లి నుంచి నెదర్లాండ్, ఫ్రాన్స్, కరేబీయన్ దీవుల్ని అడ్డగా చేసుకొని పైరసీ సైట్లను నిర్వహించాడు. ఐబొమ్మ రవి ప్రస్తుతం భార్యతో విడాకుల కేసులో హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరవుతున్నాడు. అదే క్రమంలో తదుపరి విచారణ కోసం అతడు ఫ్రాన్స్ నుంచి కూకట్ పల్లికి రాగా.. రవిని పోలీసులు అరెస్టు చేశారు. రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన విషయం అతడి దగ్గరి వ్యక్తుల నుంచి పోలీసులకు లీకైందని కూడా ఒక గుసగుస వినిపిస్తోంది. 70కి పైగా పైరసీ సైట్లు కూకట్పల్లిలో ఓ ఇంట్లో అతనిని అరెస్టు చేసే సమయంలో వందల సంఖ్యలో హార్డ్ డిస్క్లు, ఐబొమ్మ, బప్పం టీవీలో విడుదల చేసేందుకు అప్లోడ్ చేసిన కొత్తగా విడుదలైన సినిమాలు, సర్వర్లను మెయింటైన్ చేసేందుకు వినియోగించిన సాఫ్ట్వేర్లు కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్లను సీజ్ చేశారు. 2018 నుంచి నివాసం ఉంటున్న ఫ్లాట్ను కేంద్రంగా చేసుకున్న ఇమ్మడి రవి ఐబొమ్మ,బప్పంటీవీలలో సినిమాలను అప్లోడ్ చేసేవారని,కరేబియన్ దీవుల్లో సైతం కార్యకలాపాలు కొనసాగించినట్లు తేలింది. ఐబొమ్మ, బప్పంటీవీలను ప్రధానంగా ఉంచుకొని.. అదనంగా మరో 70కి పైగా ఆపరేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారాల్ని సేకరించారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అన్నాడనిఅనంతరం, తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీని నిలిపివేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఈ వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ ఇమ్మడి రవి విసిరిన సవాలను స్వీకరించి అతడితోనే ఐబొమ్మ, బప్పం టీవీలను నిలిపివేయించారు. ఇమ్మడి రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్లను, బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. -
YSRCP నేతలపై పోలీస్ జులుం హిందూపూర్ హైటెన్షన్
-
స్పా ముసుగులో వ్యభిచారం
ఒంగోలు టౌన్: స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేసిన పోలీసులు ఒక విటుడు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బాలాజీరావుపేట పోలేరమ్మ గుడి సమీపంలో ఒక డాబాపై స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో ఒన్టౌన్ సీఐ నాగరాజు శనివారం తన సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేశారు. దాడి చేసిన సమయంలో ఒక విటుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వారితో పాటు నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు చెప్పారు. నగరంలో ఎక్కడైనా వ్యభిచార గృహాలు నిర్వహించడం, గంజాయి విక్రయిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
మాజీ AVSO సతీశ్ కుమార్ మృతి కేసులో సీన్ రీకన్ స్ట్రక్షన్
-
నాపేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించారు:సజ్జనార్
-
ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)
-
టీటీడీ మాజీ ఏవీఎస్వో అనుమానాస్పద మృతి!
తాడిపత్రిటౌన్/గుంతకల్లు/అనంతపురం సెంట్రల్/ తిరుమల తిరుపతి దేవస్థానం/పత్తికొండ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఏవీఎస్ఓ, ప్రస్తుత గుంతకల్లు రైల్వే పోలీస్ (జీఆర్పీ) సీఐ వై. సతీష్కుమార్ (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి సమీపంలోని రైల్వేట్రాక్ పక్కన శుక్రవారం ఆయన మృతదేహం లభించింది. టీటీడీ పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ గుంతకల్లు నుంచి తిరుపతికి రైల్లో వెళుతూ ఇలా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పరకామణి కేసులో విచారణకు వెళుతున్న ఆయను ఎవరైనా రైలు నుంచి తోసి హత్య చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సతీష్ కుమార్ 2023లో టీటీడీలో ఏవీఎస్ఓగా ఉన్న సమయంలో పరకామణి ఉద్యోగి రవికుమార్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి ఆ కేసులో కీలక సాక్షిగా మారారు. ఈ ఏడాది జూలైలో జీఆర్పీ సీఐగా గుంతకల్లుకు బదిలీ అయ్యారు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. గుంతకల్లుకు బదిలీపై వచి్చన తర్వాత పట్టణంలోని ఉరవకొండ రోడ్డులోని విశాల్ మార్టు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈయనకు భార్య మమత, కుమార్తె తారా (8), కుమారుడు రోహిత్(3) ఉన్నారు.విచారణకు వెళుతూ..పరకామణి కేసులో ఈ నెల ఆరో తేదీన తిరుపతిలో సీఐడీ విచారణకు హాజరైన సతీష్ కుమార్.. మరోసారి హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు నిజాముద్దీన్–తిరుపతి (రాయలసీమ ఎక్స్ప్రెస్) రైల్లో టూ టైర్ ఏసీలో తిరుపతికి బయలుదేరారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం రైల్వేట్రాక్ వద్ద ముఖం, శరీర భాగాలపై తీవ్రగాయాలతో మృతిచెందిన వ్యక్తిని గుర్తించిన రైల్వేట్రాక్ మెన్ షంషీర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాల కోసం ఆరా తీయగా.. గుంతకల్లు రైల్వే రిజర్వ్డు ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్గా తేలింది. దీంతో పై అధికారులకు సమాచారం చేరవేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ షీమోíÙ, జిల్లా ఎస్పీ జగదీష్ , ఏఎస్పీ రోహిత్కుమార్ ఘటన స్థలానికి చేరుకుని.. మృతికి కారణాలు, ఆధారాల కోసం విచారణ చేపట్టారు. డాగ్స్కా్వడ్, ఫొరెన్సిక్ నిపుణులతో పరిశీలించారు. గుంతకల్లు రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పరిశీలించారు. ఆయన ప్రయాణించిన బోగీలోని ప్రయాణికుల వివరాలనూ ఆరా తీస్తున్నారు. దీంతోపాటు సహచర ఉద్యోగులతో సతీష్ కుమార్ వ్యవహారశైలిపై విచారిస్తున్నట్లు సమాచారం. మృతికి కారణాలు విచారణలో తేలాల్సి ఉందని రైల్వే డీఎస్పీ శ్రీనివాసులు ఆచారి విలేకరులకు తెలిపారు. సతీష్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.2012 బ్యాచ్ అధికారికర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన బ్రహ్మయ్య, చిదంబరమ్మ దంపతుల మొదటి కుమారుడు సతీష్ కుమార్. ఈయనది పేద కుటుంబం, తండ్రి మరణంతో తమ్ముడు శ్రీహరితో కలిసి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ కష్టపడి చదవి పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించారు. సతీష్ కుమార్ 2012 బ్యాచ్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకున్న చివరి బ్యాచ్ వీరిదే. తొలిపోస్టింగ్ చిత్తూరు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్గా వచి్చంది. తర్వాత చాలా ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే పనిచేశారు.2012 బ్యాచ్లో రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన వారిలో కూడా సతీష్కుమార్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన బ్యాచ్మేట్స్ చాలా మంది ఇంకా ఆర్ఎస్ఐలుగానే ఉన్నారు. పరకామణి చోరీ కేసు నమోదైన సమయంలో ఈయన ఏవీఎస్ఓగా పనిచేస్తున్నారు. ఈనెల ఆరున సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మరోసారి హాజరుకావాల్సి ఉందని గుంతకల్లు నుంచి తిరుపతికి బయలుదేరారు. అంతలోనే ఇలా జరగడంపై చాలా మంది బ్యాచ్మేట్స్, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆరో తేదీ విచారణకు హాజరై వచ్చిన తర్వాత కొందరు సహచరులతో మాట్లాడుతూ తనకు మెమో ఇస్తారని, లేదా సస్పెండ్ చేస్తారని వాపోయినట్లు తెలిసింది.నిష్పక్షపాతంగా విచారణ చేయాలిసతీష్ కుమార్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కుమ్మర శాలివాహన సంఘం నాయకులు గోపాల్, ఓబుళపతి, నాగేంద్ర, రామాంజనేయులు తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం అనంతపురం సర్వజనాస్పత్రి మార్చురీ వద్ద ఆందోళన చేశారు. సతీష్కుమార్ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఐడీ అధికారులతో సిట్ ఏర్పాటు చేసి పారదర్శకంగా దర్యాప్తు చేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సతీష్ కుమార్ భార్య మమతను సంప్రదించాలని ‘సాక్షి’ ప్రయతి్నంచగా ఆమె సెల్ఫోన్ను పోలీసు అధికారులు స్వా«దీనం చేసుకున్నట్లు బంధువుల ద్వారా తెలిసింది. ఆమెను మీడియాతో మాట్లాడనీయకుండా కట్టడి చేశారు. పోలీసులు ఆమె సెల్ఫోన్ను తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉందని బంధువులు ప్రశ్నిస్తున్నారు.పోస్టుమార్టం పూర్తిసతీష్కుమార్ మృతదేహానికి అనంతపురం సర్వజనాస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మృతదేహాన్ని స్వగ్రామం కర్నూలు జిల్లా పత్తికొండకు తరలించారు. తొలుత మృతదేహానికి సీటీస్కాన్ చేశారు. అనంతరం వైద్యులు పోస్టుమార్టం చేశారు. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. జిల్లా ఎస్పీ జగదీష్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా సతీష్ వినియోగిస్తున్న సెల్ఫోన్ను విజయవాడ ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. దాదాపు 3 గంటలకు పైగా జిల్లా ఎస్పీ జగదీష్ ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోనే ఉన్నప్పటికీ చివరకు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కాగా, సతీష్ కుమార్ మృతి ఘటనకు సంబంధించి వివరాలు ఆరా తీసేందుకు సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అనంతపురానికి చేరుకున్నట్లు సమాచారం.హత్య కోణంలో దర్యాప్తు చేయాలి: బీజేపీసాక్షి, అమరావతి: తిరుపతి పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి సతీష్కుమార్ అనుమానాస్పద మరణం ఆందోళనకరమని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘రైల్వే ట్రాక్పై మృతదేహం లభించడం దర్యాప్తును మరింత తీవ్రమైన కోణంలో పరిశీలించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఈ ఘటనను హత్య కోణంలో దర్యాప్తు చేయమని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతున్నాం. ఈ కేసుకు సంబంధించిన సాక్షులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈ మరణం వెనుక ఎవరి హస్తం ఉన్నా కఠినంగా శిక్షించాలి. నిజం వెలుగులోకి రావాలి’ అంటూ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్నారాయణ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఏరా చిన్నా.. పోలీసులతోనే ఆటలా?
నిండా పాతికేళ్లు కూడా లేని ఓ కుర్రాడు పోలీసులకే సవాల్ విసిరాడు. దమ్ముంటే పట్టుకోండి.. అంటూ పుష్ప రేంజ్ సవాల్ విసిరాడు. సోషల్ మీడియాలో అది కాస్త వైరల్ అయ్యింది. అటు ఇటు తిరిగి ఖాకీలకు చేరడంతో వాళ్లూ దానిని అంతే సీరియస్గా తీసుకున్నారు. "Catch Me If You Can" అంటూ సవాల్ చేసిన ఓ యువకుడిని పట్టుకుని ఓ వీడియో తీయించారు. పుణెలో ఓ కుర్రాడు తన కవాసాకి నింజా బైక్కు "Will Run" అనే నెంబర్ ప్లేట్ పెట్టి.. సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ మరో కుర్రాడు ఆ బైక్ తీసి వైరల్ చేశాడు. ఈ పోస్ట్ను గమనించిన పుణె పోలీసులు "We can, and we will" అంటూ స్పందించారు. Ft. Catch me if u can @CPPuneCity @PuneCityTraffic @nachiket1982 pic.twitter.com/wBnEIJMPLq— NitishK (@nitipune007) November 11, 2025 We can, and we will…Just a matter of time.Watch this space for updates! #ChallengeAccepted https://t.co/DyezD3Yn8U— पुणे शहर पोलीस (@PuneCityPolice) November 12, 2025కొన్ని గంటల్లోనే రాహిల్ను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం అతని బైక్, అతని క్షమాపణ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ తప్పు చేశాను, మీరు చేయకండి" అంటూ రాహిల్ వీడియోలో చెప్పాడు. సదరు యువకుడ్ని 21 ఏళ్ల రాహిల్గా, వీడియో పోస్ట్ చేసింది అతని స్నేహితుడు నితీష్గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. పోలీసులు "Street's not the place to play, boy!" అంటూ గట్టిగా హెచ్చరించారు. Street’s not the place to play, boy!We always keep our promises. 😉Turns out the guy wasn't elusive enough. Played dangerous games, won dangerous prizes.#NoConsolationPrize#ChallengeCompleted#ElusionEndsHere#CaughtYou#AlwaysForPunekars#PunePolice@CPPuneCity https://t.co/zAoMI5Yld6 pic.twitter.com/mlAGVvz4ro— पुणे शहर पोलीस (@PuneCityPolice) November 12, 2025ఇదే తరహాలో గత వారం గురుగ్రామ్లో ఇద్దరు యువకులు బైక్ మీద మద్యం సేవిస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై కూడా అధికారులు సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని, ప్రజల భద్రతకు ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
రైల్వే ట్రాక్పై టీటీడీ మాజీ ఏవీఎస్వో మృతదేహం
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవీఎస్వో సతీష్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై విగతజీవిగా పడి కనిపించారు. పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును గతంలో విచారించిన సతీష్ను.. ఆపై నిందితుడిగా సిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం గుంతకల్ రైల్వే ఆర్ఐగా పని చేస్తున్న ఆయన్ని ఈ నెల 6వ తేదీన సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం విచారణ జరిపింది. అయితే.. మరోసారి విచారణకు రావాలంటూ అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీంతో వేధింపులు భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సతీష్ను వేధించారు: వైఎస్సార్సీపీసతీష్ కుమార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని అంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ‘‘పరకామణి కేసులో రవికుమార్ ని పట్టుకున్నదే సతీష్ కుమార్. అలాంటి వ్యక్తి చనిపోవడం అనుమానాస్పదంగా ఉంది. సతీష్ మృతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపించాలి. వాస్తవాలు ఏంటో బయటి ప్రపంచానికి తెలియచేయాలి. సతీష్ను వేధించారు. భూమన కరుణాకరరెడ్డిని ఆ కేసులో లాగాలని సతీష్ పై ఒత్తిడి చేశారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయాలలో కి లాగటం బాధాకరం. ఈ కేసులో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే సతీష్ ఆత్మహత్య చేసుకున్మాడో అర్థం చేసుకోవచ్చు. తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని సతీష్ కుమార్ తన ఫ్రెండ్స్ దగ్గర చాలా సార్లు చెప్పారు. నాలుగు రోజుల సతీష్ విచారణ లో ఏం జరిగిందో బయట పెట్టాలి. వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
Red Fort: ఢిల్లీ పేలుడు కేసులో ముమ్మర దర్యాప్తు
-
ఉగ్రవాదుల టార్గెట్ జనవరి 26.. వెలుగులోకి సంచలన నిజాలు
-
Delhi Blast: టార్గెట్ జనవరి 26.. జైషే మహమ్మద్ బిగ్ ప్లాన్
-
బారికేడ్లు బద్దలు కొడుతూ.. పోలీసులపై అంబటి ఉగ్రరూపం
-
రాత్రి నా పర్యటనకు అమనుతి ఇచ్చి ఇప్పడు రద్దు చేయడం ఏంటి..?
-
తాడిపత్రిలో ర్యాలీ ఆపిన పోలీసులు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన పెద్దారెడ్డి
-
ఆపరేషన్ క్లీన్ : 260 మంది ఆఫ్రికన్ల అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ దందా, విదేశీయుల అక్రమ వలసలపై పోలీసు బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఆఫ్రికా దేశాలకు చెందిన 260 మందిని అదుపులోకి తీసుకున్నాయి. ఆదివారం ద్వారక, బిందాపూర్, డబ్రి, ఉత్తమ్ నగర్, మోహన్ గార్డెన్, తిలక్ నగర్, నిహాల్ విహార్లను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని, గడువు దాటిన విదేశీయులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్(పశ్చమ రేంజ్) జతిన్ నర్వాల్ చెప్పారు. ఒక్క ద్వారకలోనే మహిళలు, చిన్నారులు సహా 20 మంది పట్టుబడ్డారన్నారు. చదవండి: లగ్జరీ అపార్ట్మెంట్ : గోడకు పెన్సిల్తో రంధ్రం?! వైరల్ వీడియో ఎలాంటి అనుమతి పత్రాలు లేని, వీరివద్ద డ్రగ్స్ కూడా దొరికాయన్నారు. ఎక్కువగా నైజీరియన్లే ఉన్నారన్నారు. వీరితోపాటు ఐవరీ కోస్ట్, సెనెగల్, సియెర్రా లియోన్, కామెరూన్, ఉగాండా, కెన్యా, జింబాబ్బే, ఘనా దేశాలకు చెందిన వారు కూడా పట్టుబడ్డట్లు చెప్పా రు. చట్టపరమైన ఎలాంటి నిబంధనలను పాటించకుండా విదేశీయులకు ఇళ్లను అద్దెకు ఇచ్చిన యజమానులను సైతం నిర్బంధంలోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద -
మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు
-
కానిస్టేబుళ్లకు రామచరితమానస్ , గీతా పాఠాలు ఎక్కడో తెలుసా?
భోపాల్: పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ పొందుతున్న వారందరికీ భగవద్గీత తరగతులు నిర్వహించాలని మధ్యప్రదేశ్ పోలీసుల శిక్షణ విభాగం నిర్ణయించింది. ఇది వారు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఎనిమిది శిక్షణ పాఠశాలల సూపరింటెండెంట్లకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శిక్షణ) రాజా బాబు సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో దాదాపు 4,000 మంది యువతీ యువకులు తొమ్మిది నెలల పాటు కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్నారు, ఇది గత జూలైలో ప్రారంభమైంది. The saffronisation (भगवाकरण) of Madhya Pradesh police. These young recruits have a mandatory training which involves recitation of Hindu verses.... Although had it been that they are trained to practice all the religions it wouldn't have been a problem.Now imagine a hardcore… pic.twitter.com/rZ27N4yyse— Vishnukant Tiwari (@vishnukant_7) November 7, 2025రామచరితమానస్ పఠనం ఐపీఎస్ అధికారి సింగ్, ఈ శిక్షణ తరగతులను జూలైలో ప్రారంభించినప్పుడే.. రామచరితమానస్ పఠనానికి కూడా ఆదేశించారు. ఇది వారిలో క్రమశిక్షణను పెంపొందిస్తుందని అప్పుడే ఆయన స్పష్టం చేశారు. తాజాగా, శిక్షణ పాఠశాలల డైరెక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సాధ్యమైతే, శ్రీకృష్ణుడి పవిత్ర మాసమైన మార్గశిరంలో శిక్షణలో భాగంగా... కనీసం భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని చదవడం ప్రారంభించాలని సూచించారు. కాగా, ఈ అధికారి గతంలో 2019 ప్రాంతంలో గ్వాలియర్ రేంజ్ పోలీసు అధిపతిగా పనిచేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్రచారాన్ని ప్రారంభించి, స్థానిక జైలు ఖైదీలు, ఇతరులకు భగవద్గీత ప్రతులను పంపిణీ చేశారు. (తండ్రి త్యాగం, కొడుకు సర్ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగం) -
NRI భాస్కర్ రెడ్డిని బూతులు తిడుతూ.. సర్కార్ శాడిజంపై హైకోర్టు సీరియస్..
-
సెల్పీ వీడియోతో సవాల్ చేశాడు.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో..!
-
NRI భాస్కర్ రెడ్డిని కొట్టిన పోలీసు అధికారులు
-
ప్రియుడి కోసం... భర్త ఖతం
మీరట్: ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి గుట్టుగా నడుపుతున్న ప్రేమ వ్యవహారం ఆమె భర్తకు తెలిసింది. దీనిని గ్రహించిన ఆమె భర్త ఎక్కడ రచ్చ చేస్తాడోనని భయపడి, అతనిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడి సాయం తీసుకుంది. ఒక ప్లాన్ ప్రకారం భర్త అడ్డు తొలగించుకుంది. అయితే ఆ తర్వాత చట్టం ఏం చేసింది?ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఒక యువకుని మృతదేహం అతను ఉంటున్న గ్రామం వెలుపలి పొలంలో పోలీసులకు కనిపించింది. మృతదేహంపై మూడు బుల్లెట్ల గుర్తులు కనిపించాయి. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత దీనిని దోపిడీ కోసం చేసిన హత్యగా భావించారు. అయితే తదుపరి దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పోలీసులు అగ్వాన్పూర్ గ్రామంలో ఉంటున్న మృతుడి భార్య అంజలి విచారించేందుకు ఉపక్రమించగా, ఆమె ఇంటి నుంచి పరారైనట్లు తేలింది. అయితే అంజలికి అదే గ్రామానికి చెందిన అజయ్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు కనుగొన్నారు.దీంతో పోలీసులు అజయ్ను విచారించేందుకు ప్రయత్నించారు. అయితే అతను కూడా ఇంట్లో లేడని తెలిసింది. ఈ జంట అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తరువాత పోలీసులు వారికోసం వెదుకులాట సాగించి, ఎట్టకేలకు అదుపులోనికి తీసుకున్నారు. విచారణ సమయంలో అజయ్ నిజం వెల్లడించాడు. అంజలి భర్త రాహుల్ తమ సంబంధం గురించి తెలుసుకున్నాడని, దీంతో అంజలి కలత చెందిందని, తరువాత ఆమె భర్తను చంపేందుకు ఒక ప్లాన్ చేసిందని అతను చెప్పాడు. ఈ నేపధ్యంలోనే అజయ్ స్వయంగా రాహుల్ను పొలాల దగ్గర కలుసుకుందామని చెప్పాడు. అతను రాగానే అతనిపై రాహుల్ మూడుసార్లు తుపాకీ కాల్పులు జరిపాడని దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: ట్రంప్కు ‘శాంతి బహుమతి’?.. డిసెంబర్ ఐదున ప్రదానం -
క్రికెట్ బెట్టింగ్.. ఖాకీల ‘బ్యాటింగ్’!
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ దందా కొందరు ఖాకీలకు కాసులు కురిపిస్తోంది. బుకీలు (పందేలు అంగీకరించేవారు) తమ డెన్లను మార్చుకోవడాన్నీ పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. గోవా కేంద్రంగా అనేక రహస్య ఆపరేషన్లు చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. అక్కడ పట్టుకొని రాష్ట్ర/నగర సరిహద్దుల్లో వదిలేసే మధ్యలోనే బేరసారాలన్నీ పూర్తయిపోతున్నాయి. ఈ వ్యవహారాల కోసం కొందరు ఎస్పీలు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. రాజధానిలోని కొన్ని విభాగాలకు పంటర్ల ఫోన్లలో ఉండే ఐడీలు కాసులు కురిపిస్తున్నాయి. ఖాకీల చేతిలో ‘దెబ్బతిన్న’బుకీలు తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోవడంతో ఈ వ్యవహారాలు బయటకు పొక్కట్లేదు. దేశంతో సంబంధం లేకుండా దందా మొదట్లో భారత్ జట్టు పాల్గొనే మ్యాచ్లకే పంటర్లు (పందెం కాసేవారు) ఉండేవారు. భారత్–పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇవి జోరుగా సాగేవి. ఆ తర్వాతి కాలంలో భారత్ జట్టు ఆడుతున్నా, లేకున్నా దాయాది దేశంతోపాటు కొన్ని కీలక జట్ల మధ్య జరిగే మ్యాచ్లకు బెట్టింగ్ పెట్టడం మొదలైంది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రపంచంలో ఏ మూలన ఏ మ్యాచ్ జరుగుతున్నా బుకీల బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు. ఇంటర్నెట్, వెబ్సైట్లు అందుబాటులోకి వచి్చన తర్వాత ఇంగ్లండ్లో జరిగే లీగ్ మ్యాచ్లకు ఇక్కడ బెట్టింగ్ నడుస్తోంది. స్థానికంగా అనేక ఇబ్బందులు వస్తుండటంతో... ఒకప్పుడు ఈ బెట్టింగ్స్ అంగీకరించే బుకీలు ఆయా నగరాలు, పట్టణాల్లో ఉండి దందా చేసేవారు. పందెం రాయుళ్లు, పందేల వివరాలను నమోదు చేసుకోవడానికి, స్లిప్స్ జారీ చేయడానికి, నగదు లావాదేవీల కోసం వారు అందుబాటులో ఉండటం అనివార్యమయ్యేది. దీంతో ప్రతి ప్రాంతంలో ఉండే బుకీలు, వారి వద్ద పనిచేసే కలెక్షన్ ఏజెంట్లు, ఉద్యోగుల వివరాలు స్థానిక పోలీసులకు తెలిసేవి. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడంతో బుకీలు ప్రస్తుతం తమ పంథాను పూర్తిగా మార్చేశారు. ఉత్తరాదిలోని కొన్ని నగరాలను అడ్డాగా చేసుకొని పనిచేస్తున్నారు.ప్రధానంగా గోవాలోని వివిధ ప్రాంతాల్లో ఈ బుకీల డెన్లు ఉంటున్నాయి. పందెం కాయడం నుంచి నగదు ఇచ్చిపుచ్చుకోవడం వరకు అంతా ఆన్లైన్ అయిపోవడంతో వీరి పని మరింత తేలికైంది. బుకీల పం«థా మారినట్టే పోలీసులు, ప్రత్యేక బృందాలు, విభాగాలు సైతం తమ పంథా మార్చుకున్నాయి. ఊహకి అందని విధంగా విరుచుకుపడుతూ వసూళ్లకు పాల్పడుతున్నాయి. అక్కడే నిర్బంధించి...తీసుకొస్తూ మార్గ మధ్యలో... స్థానికంగా ఉన్న మాజీ బుకీలు, తమ వేగుల ద్వారా ఉత్తరాది, గోవాలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్న బుకీల వివరాలు తెలుసుకుంటున్నారు. రహస్య ఆపరేషన్ల పేరుతో అక్కడకు వెళుతున్న బృందాలు ఆయా బుకీలను అదుపులోకి తీసుకుంటున్నాయి. వీలుంటే అక్కడే నిర్బంధించి, లేదంటే ఇక్కడకు తరలిస్తూ వారి సంబం«దీకులు, అనుచరులతో బేరసారాలు చేస్తున్నాయి. అలా వీలైనంత వసూలు చేసుకొని ఆ బుకీలను విడిచిపెడుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, కమిషనరేట్లలో ఉన్న ప్రత్యేక విభాగాలు ఈ వ్యవహారాల్లో బిజీగా ఉంటున్నాయి.మరో అడుగు ముందుకేసిన ఓ ఎస్పీ ఏకంగా ఈ వసూళ్ల కోసమే ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని వినికిడి. గోవా–ఔటర్ రింగ్ రోడ్డు మధ్య అదుపులోకి తీసుకోవడాలు, బుకీల సంబం«దీకుల్ని బెదిరించి దొరికినంత వసూలు చేసి వదిలి పెట్టడం జరిగిపోతున్నాయి. ఆ బుకీలు ఇచి్చన సమాచారంతో ఇక్కడ ఉన్న వారి అనుచరులను బెదిరిస్తూ వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు.ఐడీల కోసం ప్రత్యేకంగా వేగులుఆన్లైన్ బెట్టింగ్ నిషేధం తర్వాత పోలీసులు కొత్త దందా ప్రారంభించారు. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్ల ద్వారా పందేలు కాయాలంటే పంటర్లకు రిజి్రస్టేషన్, ప్రత్యేక ఐడీలు ఉండాలి. ఇవి ఎవరి ఫోన్లలో ఉన్నా యో తెలుసుకుంటున్న పోలీసులు, ప్రత్యేక విభాగాలు ఆ వివరాలను సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ ఐడీలు ఎవరెవరి ఫోన్లలో ఉన్నాయో గుర్తించడానికి ప్రత్యేకంగా వేగుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని వర్గాలకు చెందిన యువతను ఆకర్షించడంతోపాటు ఒకసారి ఐడీ తో చిక్కి, తమ ‘డిమాండ్లు’నెరవేర్చిన వారిని ఇలా వేగు లుగా మార్చుకుంటున్నారు. వీరిచ్చే సమాచారంతో ఫో న్లో ఐడీ ఉన్న వారిని అదుపులోకి తీసుకోవడం... అరె స్టు, కేసు పేరుతో బెదిరించి దండుకోవడం ఇటీవల పెద్ద దందాగా మారిపోయింది. అత్యున్నతాధికారులు ఈ వ్యవహారాలపై దృష్టి పెడితేనే కిందిస్థాయి అధికారులు, ఉన్నతాధికారులకు చెక్ పడే అవకాశం ఉంటుంది. -
హక్కులకు ‘సుప్రీం’ ఛత్రం
‘మన పోలీసులకు తగినంత సామర్థ్యం లేదు. సంస్థాగతంగా, శిక్షణపరంగా ఎన్నో లోపాలున్నాయి. పోలీసు వ్యవస్థపై తగిన పర్యవేక్షణ కూడా లేదు’– ఇవి ఇటీవల ఏదో ఉదంతంలో ఎవరో చేసిన వ్యాఖ్యలు కాదు. సరిగ్గా నూట ఇరవై మూడేళ్ల క్రితం బ్రిటిష్ వలస పాలకుల హయాంలో ఫ్రేజర్ నేతృత్వంలోని రెండో పోలీస్ కమిషన్ నివేదికలోని మాటలు. దేశంలో తరచుగా జరిగే ఉదంతాలు వింటుంటే అప్పటికీ, ఇప్పటికీ పెద్దగా మారిందేమీ లేదని అర్థమవుతుంది. మిగిలినవాటి మాటెలా ఉన్నా పౌరుల్ని అరెస్టు చేయటం విషయంలో నిబంధనలు సక్రమంగా పాటించే సంస్కృతి పోలీసులకు అలవడ లేదు. అందుకే ఎవరినైనా అరెస్టు చేయదల్చుకున్నప్పుడు నిందితులకు అర్థమయ్యే భాషలో అందుకు గల కారణాలను వెంటనే తెలియజెప్పాలని, వారిని ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో... ఎందుకు చేస్తున్నారో... ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయో లిఖిత పూర్వకంగా చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏజీ మసీహ్ల ధర్మాసనం గురువారం తేల్చిచెప్పింది. ఒకవేళ అందుకు వ్యవధి లేకపోతే కోర్టులో హాజరు పరచటానికి రెండు గంటల ముందైనా నెరవేర్చాలని నిర్దేశించింది. అలా చేయకపోతే ఆ అరెస్టూ, రిమాండ్ కూడా చట్టవిరుద్ధమే అవుతాయని స్పష్టం చేసింది.మన దేశంలో దాదాపు 40 శాతం అరెస్టులు స్వల్ప కారణాలపైనే జరుగుతాయి. వీరిలో అత్యధికులు అట్టడుగు వర్గాలవారు కనుక తమను ఎందుకు అరెస్టు చేశారో కూడా తెలియదు. పోలీసులు చెప్పరు. ‘కామన్ కాజ్’ సంస్థ ఇటీవల విడుదల చేసిన ‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా’ నివేదిక అరెస్టుల విషయంలో కులం, మతం, రాజకీయ అనుబంధాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పింది. 17 రాష్ట్రాల్లో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ల వరకూ వేలాది మందితో మాట్లాడి ఈ నివేదిక రూపొందించారు. అరెస్టుల విషయంలో నిబంధనలన్నీ తు.చ. తప్పకుండా పాటిస్తామని కేవలం 41 శాతం మంది చెప్పారు. ఒక మతం లేదా కులానికి చెందినవారు సహజంగా నేరగాళ్లన్న భావన నిలువెల్లా పాతుకుపోయింది. ఇలాంటివారి విషయంలో ఇక నిబంధనలేం పాటిస్తారు? ఈ నేపథ్యంలో తాజా తీర్పు ఒక ఊరట. నిజానికి సుప్రీంకోర్టు ఇలా చెప్పటం మొదటి సారేమీ కాదు. గత ఫిబ్రవరిలో జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం సైతం విహాన్ కుమార్ కేసులో పోలీసులకు రాజ్యాంగం నిబంధనలను గుర్తు చేయాల్సి వచ్చింది. నిరుడు పంకజ్ బన్సాల్, ప్రబీర్ పురకాయస్థల కేసుల్లోనూ సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈ సంగతే చెప్పాయి. అరెస్టులకు సంబంధించి రాజ్యాంగం 22వ అధికరణంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏకపక్ష అరెస్టు లేదా నిర్బంధం నుంచి పౌరులకు రక్షణనిస్తున్నాయి. మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచటానికి ముందే అరెస్టుకు దారితీసిన కారణాలేమిటో నిందితులకు తెలియాలనీ, న్యాయవాదిని నియమించుకుని సమర్థించుకునే అవకాశం ఉండాలనీ, బెయిల్ కోరవచ్చనీ ఆ అధికరణం చెబుతోంది. గతంలో సీఆర్పీసీ (ఇప్పుడు బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 57, అరెస్టయినవారిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని నిర్దేశిస్తోంది. కానీ 22వ అధికరణానికి అనుగుణమైన చట్టాలు కొరవడటం పోలీసుల ఇష్టారాజ్యానికి దారితీస్తోంది. మన దేశంలో అరెస్టు చేయటానికి ‘సహేతుకమైన అనుమానం’ ఉంటే సరిపోతుంది. అమెరికాలో ‘సంభావ్యమైన కారణం’ చూపాలి. ఈ వ్యత్యాసం వల్లే అక్రమ అరెస్టులు రివాజవుతున్నాయి. ఫలితంగా ‘చట్టం నిర్దేశించిన విధానంలో తప్ప పౌరుల జీవితాన్నీ, వారి వ్యక్తిగత స్వేచ్ఛనూ హరించ రాద’ని చెప్పే రాజ్యాంగంలోని 21వ అధికరణం కూడా ఉల్లంఘనకు గురవుతోంది. అక్రమ అరెస్టు ఆ వ్యక్తిపైన మాత్రమేకాక అతనితో సంబంధం ఉన్న వారందరిపైనా ప్రభావం చూపుతుందనీ, వారి మానసిక సమతౌల్యాన్నీ, సామాజిక సంక్షేమాన్నీ దెబ్బతీస్తుందనీ సుప్రీంకోర్టు చేసిన తాజా హెచ్చరిక పాలకులకు కనువిప్పు కావాలి. నేరాలు పెరిగాయనో, చట్టాలంటే భయం లేకుండా పోయిందనో పోలీసులు చట్ట బాహ్యతను ఆశ్రయించటం నీతిమాలినతనం. పాలకులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు
సాక్షి, తాడేపల్లి: కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై వైఎస్సార్సీపీని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి సైతం పోలీసులు వచ్చారు. కర్నూలు బస్సు ప్రమాదానికి మద్యం కారణమనే విషయం అందరికీ తెలిసినా.. దీనిపై పోస్టులు పెట్టిన వారిపై ఇప్పటివరకూ కేసులు పెట్టిన పోలీసులు.. ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఏదో రకంగా వైఎస్సార్సీపీని వేధించాలనే లక్ష్యంతో కూటమి కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు.. ఇవాళ(శుక్రవారం, నవంబర్ ) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నోటీసులు ఇచ్చారు.కర్నూలు బస్సు దగ్ధం కేసులో నోటీసులు జారీ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. బస్సు దగ్దానికి మద్యమే కారణమని ప్రచారం చేశారంటూ నోటీసులు ఇచ్చారు. ప్రచారం వెనుక వైఎస్సార్సీపీ ఉందంటూ కేసు పెట్టారు. ఇప్పటికే 27 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా పూడి శ్రీహరిని కూడా ఈ కేసులో కర్నూలు ఖాకీలు చేర్చారు. బాబు సర్కార్.. నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది: టీజేఆర్పోలీసుల నోటీసులపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పందిస్తూ.. ‘‘కర్నూలు బస్సు దగ్దానికి మద్యమే కారణం.. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ అదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మా పార్టీ కేంద్ర కార్యాలయానికే పోలీసులు వచ్చారు. మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. ప్రజలు, ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు.ఇలాంటి నోటీసులు, కేసులకు మేము భయపడము. కర్నూలు బస్సు దగ్దానికి కారణమైన బైకర్లు మద్యం ఎక్కడ తాగారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?. మృతుని శరీరంలో ఎంత ఆల్కాహాల్ ఉందో రిపోర్టుని ఎందుకు బయట పెట్టలేదు?. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ దొరుకుతోంది. విశాఖలో దొరికిన డ్రగ్స్ వివరాలు హోంమంత్రి ఎందుకు బయట పెట్టటం లేదు?. ఎవరి ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ దొరికాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు. -
2010 నాటి హత్య కేసు.. 2025లో ఛేదించారు ఇలా
న్యూఢిల్లీ: భార్యను హత్యచేసి, ఏమి తెలియనట్టు ఆత్మహత్యగా చిత్రీకరించాడో వ్యక్తి. నకిటీ సూసైడ్ నోట్ డ్రామా ఆడాడు. కానీ నేరం చేసిన వాడు ఎప్పటికైనా చట్టం చేతికి చిక్కక తప్పదు. అలా 15 ఏళ్ల తరువాత అసలు గుట్టు రట్టు చేశారు పోలీసులు.15 సంవత్సరాల నాటి క్రిమినల్ కేసును ఛేదించారు ఢిల్లీ పోలీసులు. ఈ కేసులో భార్యను హత్య చేసినగుజరాత్కు చెందిన నరోత్తం ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. రహస్య సమాచారం ఆధారంగా మంగళవారం ఢిల్లీ పోలీసు బృందం వడోదరలోని చోటా ఉదయపూర్ ప్రాంతంలో ప్రసాద్ను అరెస్టు చేసింది. అతనిపై తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.2010 నాటి కేసు2010 మే 31 ఢిల్లీలోని జహంగీర్పురిలోని ఒక ఇంటి నుండి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఇంటి తలుపు తెరిచినప్పుడు, 25 ఏళ్ల మహిళ మృతదేహాన్ని గుర్తించారు. పక్కనే ఒక సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే భర్త పరారీలో ఉండటంతో అనుమానాలు వ్యక్తమైనాయి అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ప్రసాద్ (బాధితురాలి భర్త) పై అనుమానం వ్యక్తం చేశారు. అతని ఆచూకీ తెలిపినవారికి రూ. 10,000 రివార్డు ప్రకటించారు.2025లో ఛేదించారు ఇలా..ప్రసాద్ రాజస్థాన్లోని సికార్ నివాసి. భార్యను హత్య చేసిన తరువాత అక్కడినుంచి రాజస్థాన్కు పారిపోయాడు. చోటా ఉదయపూర్లోని ఒక కాటన్ ఫ్యాక్టరీలో మేనేజర్గా పని చేస్తున్నాడు. అయితే అప్పటినుంచి అతనికోసం గాలిస్తున్న పోలీసులు, పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం విచారణలో నిందితుడు అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. వివాహమైన కొన్నాళ్లకే తమ మధ్య గొడవలు పెరిగాయని తెలిపాడు. ఆ కోపంతో భార్యను హత్య చేసి, పోలీసులను తప్పుదారి పట్టించడానికి నకిలీ సూసైడ్ నోట్ రాశానని కూడా నిందితుడు ఒప్పుకున్నాడు. -
ఆర్థిక నేరాల దర్యాప్తుపై పోలీసు అధికారులకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మోసాల కేసుల దర్యాప్తులో సాంకేతికత వినియోగం, ఇతర సాధనాలు, డిజిటల్ ఫోరెన్సిక్ అంశంపై సీఐడీ, 3 కమిషనరేట్లకు చెందిన అధికారులకు ఐసీఏఐ–డీఏఏబీ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా–న్యూఢిల్లీ డిజిటల్ అకౌంటింగ్ అండ్ అష్యూరెన్స్ బోర్డు) ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ మేరకు హైదరాబాద్లోని ఐసీఏఐ భవన్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో సీఐడీతోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన మొత్తం 40 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు.ఈ బృందంలో ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్ ర్యాంకుల అధికారులు ఉన్నారు. రాష్ట్ర పోలీసు విభాగంలో తొలిసారిగా నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణలో ఆర్థిక మోసాల కేసులను దర్యాప్తు చేస్తు న్న అధికారుల దర్యాప్తు నైపుణ్యాలను మరింత మెరుగుపరచడం, తాజా డిజిటల్ ఫోరెన్సిక్ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక మోసాల నిరోధంలో ఈ శిక్షణ కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
టీడీపీ డైరెక్షన్లో ఖాకీల ‘డ్రగుల్బాజీ’ చిత్రం
విశాఖ సిటీ: తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లో విశాఖ ఖాకీలు చూపిన కక్షపూరిత డ్రగ్స్ కథా చిత్రంలో అసలు వ్యవహారం బయటపడింది. బెంగుళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ తరలించారన్న నెపంతో ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసిన కేసు.. ఇప్పుడు పోలీసుల మెడకు చుట్టుకునేలా ఉంది. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి(23)ని డ్రగ్స్ కేసులో ఇరికించినట్లు అతడి తల్లిదండ్రులు సీసీ ఫుటేజ్ ఆధారాలను బయటపెట్టారు. పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాలు.. సీసీ ఫుటేజీలు, ఇతర వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పక్కా స్కెచ్ ప్రకారమే..? విశాఖలో డ్రగ్స్ కేసులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డితోపాటు ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న మురాడ గీత్ చరణ్, తంగి హర్షవర్ధన్ నాయుడులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. కొండారెడ్డి ఆదేశాల మేరకు గీత్ చరణ్ బెంగుళూరు నుంచి 48 ఎల్ఎస్డీ బ్లాట్స్ను విశాఖకు తీసుకువచి్చనట్లు పోలీసులు చెప్పారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం 5.45కు రైల్వే న్యూకాలనీ సాయిబాబా మందిరంలో వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అక్కడ హర్షవర్ధన్నాయుడుతో కలిసి ఓలా స్కూటీపై వచ్చిన కొండారెడ్డికి గీత్ చరణ్ ఆ డ్రగ్స్ ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా టాస్్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే కొండారెడ్డి తల్లిదండ్రులు రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్ వీడియోలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఒక్కడినే పట్టుకున్నారు 2వ తేదీ ఉదయం 7.10కి మద్దిలపాలెం ప్రాంతంలో ఉన్న జయభేరి కొండారెడ్డి ఓలా స్కూటీపై సింగిల్గా వెళుతున్నట్లు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ వెనుకే ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి కొండారెడ్డిని ఆపారు. అందులో ఒక వ్యక్తి బైక్ దిగి కొండరెడ్డి చెంపపై కొట్టాడు. ఇంతలో మరో ఏడు బైక్లపై 14 మంది చేరుకున్నారు. కొండారెడ్డిని బైక్పై ఎక్కించుకుని తీసుకువెళుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. వీరు పోలీసులేనని కొండారెడ్డి తల్లిదండ్రులు చెబుతున్నారు. టీడీపీ మాధ్యమాల్లో ఉదయమే పోస్టులెలా సాధ్యం? పోలీసులు మాత్రం 2వ తేదీ సాయంత్రం 5.45కు అరెస్టు చేసినట్లు మీడియాకు వెల్లడించడంతో పాటు ఎఫ్ఐఆర్లో కూడా అలాగే నమోదు చేశారు. అతడిని సాయంత్రం అరెస్టు చేస్తే.. టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆ రోజు ఉదయం 11.45 గంటలకే కొండారెడ్డిని అరెస్టు చేసినట్లు ఫొటోలు ప్రత్యక్షమవడం విశేషం. వైఎస్సార్ సీపీ నాయకులతో కొండారెడ్డి కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం గమనార్హం. మద్దిలపాలెం నుంచి తీసుకెళ్లి..! ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దిలపాలెంలో సింగిల్గా వెళుతున్న కొండారెడ్డిని కొట్టి తీసుకువెళ్లినట్లు కెమెరాలో స్పష్టంగా ఉంది. పోలీసులు మాత్రం ఆ రోజు సాయంత్రం 5.45కు ఫోర్త్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే న్యూకాలనీ వద్ద స్నేహితులిద్దరితో కలిసి ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో చూపించారు. జీపీఎస్తో గుట్టు రట్టు..! కొండారెడ్డి ఓలా స్కూటీకి జీపీఎస్ ఉంది. మద్దిలపాలెంలో అతడిని పట్టుకున్న తర్వాత స్కూటీని టాస్్కఫోర్స్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి స్టేషన్కు 3.1 కిలోమీటర్లు ప్రయాణించినట్లు రికార్డు అయింది. కానీ సాయంత్రానికి 14.3 కిలోమీటర్లు ప్రయాణించినట్లు ఉంది. రైల్వే న్యూకాలనీలో అరెస్టు చేసినట్లు చూపించాలని ముందుగానే ప్లాన్ చేసుకుని ఆ స్కూటీని అక్కడికి తీసుకువెళ్లినట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న కారణంగానే రాజకీయ కుట్రలో భాగంగానే ప్రభుత్వం, పోలీసులు తన కుమారుడు కొండారెడ్డిపై డ్రగ్స్ కేసు నమోదు చేసినట్లు అతడి తండ్రి సూర్యనారాయణరెడ్డి ఆరోపిస్తున్నారు. -
‘బోరబండకు నేనొస్తున్నా..ఎవరు అడ్డుకుంటారో చూస్తా’
సాక్షి,హైదరాబాద్: బోరబండకు నేనొస్తున్నా..ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాలు విసిరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్ గురువారం బోరబండలో బహిరంగ సమావేశం నిర్వహించేందుకు పోలీసుల నుంచి అనుమతి కోరారు. బండి సంజయ్ విజ్ఞప్తిపై పోలీస్ శాఖ బహిరంగ నిర్వహించేందుకు ముందు అనుమతి ఇచ్చింది. తొలుత అనుమతిచ్చి ఆ తర్వాత రద్దు చేసింది. బహిరంగ సమావేశం నిర్వహించేందుకు పోలీసులు అనుమతి రద్దు చేయడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి ఇచ్చి ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలో పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరబండకు నేనొస్తున్నా.ఎవరు అడ్డుకుంటారో చూస్తా. ఇట్లాంటి అడ్డంకులు బీజేపీ ఎన్నో ఎదుర్కొని పోరాడింది. బీజేపీ కార్యకర్తలారా, ప్రజలారా.. సాయంత్రం బొరబండకు తరలిరండి’ అంటూ పిలుపునిచ్చారు. -
బాబుకు బిగ్ షాక్..! వణుకుతున్న టీడీపీ పెద్ద తలకాయలు
-
హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
విశాఖపట్నం: వీఐపీ రోడ్డు సమీపంలోని ఆర్చిడ్ వెల్నెస్ స్పా సెంటర్లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు, 3వ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ పైడయ్య తమ సిబ్బందితో కలిసి బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్పా సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అసాంఘిక కార్యకలాపాలు(వ్యభిచారం) నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో ఒక గదిలో ఓ విటుడు మహిళతో ఉండగా, మరో తొమ్మిది మంది మహిళలు పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తేలింది. వీరందరినీ వ్యభిచార కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సెంటర్లో పనిచేస్తున్న కల్లూరు పవన్ కుమార్, జానా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సెంటర్కు కాసిరెడ్డి అరుణ్ కుమార్ పేరు మీద అనుమతులు ఉండగా, థాయ్ స్పా మసాజ్ ముసుగులో డబ్బు కోసం మహిళలను లైంగిక దోపిడీకి గురిచేస్తున్నట్లు వెల్లడైంది. స్పా సెంటర్పై కేసు నమోదు చేసి, యజమానులు ఏ1గా కాసిరెడ్డి అరుణ్ కుమార్ (పరారీలో), ఏ2గా రాహుల్ (పరారీలో), సిబ్బంది ఏ3గా కల్లూరు పవన్ కుమార్, ఏ4గా జానా శ్రీనివాస, విటుడు ఏ5గా చీలి రామచంద్ర ప్రసాద్లను పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ. 7 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసు అధికారులకు ప్రభుత్వం జీతభత్యాలు ఇవ్వడం లేదు
సాక్షి, అమరావతి: రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులను వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లో ఉంచి ఎలాంటి జీతాలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం విచారణ జరిపింది. గురుమూర్తి తరఫు న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘‘విధి నిర్వహణలో నిక్కచి్చగా వ్యవహరిస్తారనే పేరున్న పోలీసు అధికారులను చాలాకాలంగా ప్రభుత్వం వీఆర్లో ఉంచింది. ప్రభుత్వం సహేతుక కారణాలు లేకుండానే ఇలా చేసింది. ఇది చట్ట విరుద్ధం. 199 మంది అధికారులకు జీతభత్యాలు అందడం లేదు. వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. పోలీసు సంస్కరణల విషయమై ప్రకాశ్సింగ్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ప్రతి రాష్ట్రం పాటించాల్సి ఉంది’’ అని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ప్రకాశ్సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికే తీసుకెళ్లాలని పిటిషనర్కు స్పష్టం చేసింది. జీతాలు అందక ఇబ్బందులు పడుతుంటే సంబంధిత పోలీసు అధికారులే కోర్టుకు వస్తారని, వారి తరఫున వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడమే మేలని పిటిషనర్కు సూచించింది. -
దొంగలించి ‘ట్రేడ్-ఇన్’ ద్వారా కొత్త ఫోన్!
దొంగిలించబడిన ఐఫోన్ల వ్యాపారాన్ని అరికట్టే ప్రయత్నంలో టెక్ దిగ్గజం యాపిల్ సహకరించడం లేదని యూకే మెట్రోపాలిటన్ పోలీస్ సర్వీస్ (Met Police) తీవ్రంగా ఆరోపించింది. దొంగిలించబడిన ఫోన్లకు క్రెడిట్ పొందేందుకు నేరస్థులు యాపిల్ ట్రేడ్-ఇన్ (Trade-in) ప్రోగ్రామ్ను దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.యూకే పార్లమెంటు సభ్యులకు (MPs) మెట్ పోలీస్ సమర్పించిన నివేదికలో.. యాపిల్ సంస్థకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ మొబైల్ ప్రాపర్టీ రిజిస్టర్ (NMPR)కు అవకాశం ఉందని తెలిపారు. ట్రేడ్-ఇన్ పరికరాల నెట్వర్క్ స్థితిని తనిఖీ చేయడానికి మాత్రమే యాపిల్ ప్రతిరోజూ దీన్ని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో ఫోన్ల దొంగతనానికి సంబంధించిన అంశాలను తనిఖీ చేయడం లేదని చెప్పారు. అంటే ఎవరైనా ఐఫోన్లు దొంగతనం చేసి ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా క్రెడిట్లు పొంది తిరిగి కొత్త ఫోన్ను పొందవచ్చు. లేదా యాపిల్ గిఫ్ట్ కార్డులు పొందవచ్చు. యాపిల్ సరైన తనిఖీలు చేయకుండా దొంగిలించబడిన పరికరాలు మళ్లీ చలామణిలోకి రావడానికి సమర్థవంతంగా అనుమతిస్తుందని పోలీసులు చెబుతున్నారు.నేషనల్ మొబైల్ ప్రాపర్టీ రిజిస్టర్ (NMPR) అనేది దొంగిలించబడిన పరికరాలను గుర్తించడానికి, తిరిగి వాటిని బాధ్యులకు ఇవ్వడానికి చట్ట పరంగా అధికారులు ఉపయోగించే డేటాబేస్. యాపిల్ తన ట్రేడ్-ఇన్ పథకంలో ఈ రిజిస్టర్ను ఉపయోగించడం లేదని పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.క్రెడిట్ పాయింట్లువినియోగదారులు తమ పాత ఐఫోన్ను మార్చుకున్నప్పుడు కొత్త ఐఫోన్ కొనుగోలుకు ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్లో ఉదాహరణకు సుమారు 670 యూరోల వరకు క్రెడిట్ పాయింట్లు ఇస్తారు. సరైన దొంగతనం తనిఖీలు లేకుండా దొంగిలించబడిన ఐఫోన్లను ఈ వ్యవస్థలోకి అంగీకరించి తిరిగి విక్రయించడం లేదా పునరుద్ధరిరిస్తున్నట్లు(Refurbished) పోలీసులు చెబుతున్నారు.పెరిగిన దొంగతనాలుమెట్ పోలీస్ అందించిన సమాచారం ప్రకారం 2024లోనే లండన్లో 80,000 కంటే ఎక్కువ ఫోన్లు దొంగిలించబడ్డాయి. ఇది 2023లో నమోదైన 64,000 దొంగతనాల కంటే పెరిగింది. దొంగిలించబడిన ఈ ఫోన్ల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలంటే 50 మిలియన్ యూరోలు ఖర్చవుతుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఫోన్లలో 75% పైగా విదేశాలకు తరలివెళ్తున్నాయని, అక్కడ వాటిని విడదీసి విడిభాగాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.యాపిల్ ప్రతిస్పందనమెట్ పోలీస్ విమర్శలను యాపిల్ ఖండించింది. దొంగిలించబడిన డివైజ్ల కోసం కంపెనీ Stolen Device Protection వంటి చర్యలు తీసుకుంటుందని హైలైట్ చేసింది. ఫోన్ యజమాని ధ్రువీకరణ లేకుండా నేరస్థులు డివైజ్లోని డేటాను తొలగించడం లేదా తిరిగి విక్రయించకుండా నిరోధించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: భవిష్యత్తు బంగారు లోహం! -
అడుగుకో ఆంక్ష... రోడ్డుకో బారికేడ్!
గుడివాడ రూరల్: నాయకులకు నోటీసులు... కార్యకర్తలపై ఆంక్షలు... ప్రజలకు అడ్డంకులు... మొత్తంగా పర్యటనను విఫలం చేయడానికి కుయుక్తులు..! కానీ, అశేష జనం ముందు... వారి అభిమానం ముందు ఇవేమీ నిలవలేదు...! పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం పన్నిన పన్నాగాలు విఫలమయ్యాయి. కృష్ణా జిల్లాలో మోంథా తుపాను బాధిత రైతులను పరామర్శించి, వారి పంట పొలాల పరిశీలనకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యకమ్రం దిగ్విజయమైంది. జగన్ పర్యటనను విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులను బెదిరించింది. తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తు వేశారు. అయితే, ఇవేవీ ఫలించలేదు. పైగా ప్రజలు భారీగా, స్వచ్ఛందంగా తరలి వస్తుండడంతో ఇక ఓవర్ యాక్షన్కు దిగారు. దీనికి గోపువానిపాలెం ఘటన సరైన ఉదాహరణ. జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు గోపువానిపాలెం అడ్డ రోడ్డుకు చేరుకోగా పోలీసులు బారికేడ్లు, రోప్లతో అడ్డగించారు. రోడ్డు మార్జిన్లో నిల్చుని ఉన్నా చెదరగొట్టారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సంగతి తెలిసిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అక్కడకు వచ్చి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అయితే, సమాధానం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో కైలే అనిల్, ౖవైఎస్సార్సీపీ శ్రేణులు పమిడిముక్కల సీఐ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. దారులు మూసి.. చెక్పోస్టులు పెట్టి... వైఎస్ జగన్ను చూసేందుకు అభిమానులు కార్లు, బైక్లు, ట్రాక్టర్లతో పాటు కాలినడకన తండోపతండాలుగా తరలిరావడంతో కూటమి ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపింది. వందలమందిని మోహరించి బారికేడ్లు, తాళ్లతో చెక్పోస్టులు పెట్టి అడ్డంకులు సృష్టించింది. వైఎస్ జగన్ పర్యటించే గ్రామాలకు ఉన్న అన్ని దారులను మూసివేయించింది. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ వైఎస్ జగన్కు సైతం షరతులు విధించింది. 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ అధికార దర్పం చూపించింది. ప్రధాన కూడళ్లు జనసంద్రం... పోలీసుల అవాక్కు రైతులు వైఎస్ జగన్ను కలవకుండా భారీగా బలగాలను మోహరించినా, రోప్ పార్టీలతో అడ్డుకునే ప్రయత్నం చేసినా, ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ నిలిపివేసినా ప్రధాన కూడళ్లు జనసంద్రంగా మారడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. మరోవైపు కూటమి పాలనలో తమకు జరుగుతున్న అన్యాయాలు, ఎదురవుతున్న నిర్లక్ష్యంపై రైతులు, ప్రజలు జగన్కు వినతిపత్రాలు ఇచ్చారు. కాగా, రైతులు, ప్రజలు, అభిమానులు పోటెత్తడంతో వైఎస్ జగన్ పర్యటన ఉదయం 9.45 కు మొదలై సాయంత్రం 5 గంటల వరకు సాగింది. మచిలీపట్నం, గూడూరుల్లోనూ... మచిలీపట్నంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ రాక కోసం వేచి ఉండగా బందరు డీఎస్పీ చప్పిడి రాజా ఇంతమంది ఇక్కడ ఉండొద్దంటూ చెదరగొట్టారు. బైక్లపై ర్యాలీగా కార్యకర్తలు, అభిమానులు వచ్చే క్రమంలో తాళాలు లాక్కునేందుకు ప్రయతి్నంచారు. మధ్యాహ్నం బ్రిడ్జి నీడ కింద ఉండగా ఇక్కడ ఉండొద్దని ఇనగుదురు సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనాల పెగ్గులు తీసేయమని సిబ్బందికి హుకుం జారీ చేశారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత పేర్ని కిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, అభిమానులు మచిలీపట్నం వైపు వెళ్లకుండా చెక్పోస్టు ఏర్పాటు చేసి దారి మళ్లించారు. డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతకుముందు తాడిగడపలోనూ రైతులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వస్తున్న యువతను ఆపి తాళాలు లాక్కున్నారు. మచిలీపట్నం, సుల్తాన్నగర్, ఎస్ఎన్ గొల్లపాలెంలో బారికేడ్లు పెట్టి ప్రజలను వెళ్లనివ్వలేదు. దీంతో రైతులు పొలాల నుంచి నడుచుకుంటూ జగన్ వద్దకు చేరుకున్నారు. గండిగుంట, నెప్పల్లి సెంటర్లో పోలీసులు ఆటంకాలు కల్పించారు. జగన్ కాన్వాయ్తో పాటు వస్తున్న వాహనాలను నిలిపివేశారు. పామర్రు, బల్లిపర్రుకు భారీగా చేరుకున్న రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు ఆపేశారు. మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి నుంచి రామరాజుపాలెం వైపు ఎవరినీ రానివ్వకుండా అడ్డరోడ్డ వద్ద బారికేడ్లను పెట్టారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామరాజుపాలెం అడ్డరోడ్డు నుంచి గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. బందరు వైపు నుంచి సీతారామపురం గ్రామానికి వెళ్లే రోడ్డుపై బారికేడ్లతో ఓవర్యాక్షన్ చేశారు. కనీసం బైక్లనూ అనుమతించలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి వరికోటి అశోక్బాబును అదుపులోకి తీసుకుని, ఆయనవెంట వచ్చిన వాహనాలతో పాటు స్టేషన్కు తరలించారు. సీతారామపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు కవ్వించారు. అయినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రతిఒక్కరూ అత్యంత సంయమనం పాటించారు. -
జనం రాకుండా అడ్డుకోవడానికి వందలాది -పోలీసుల మోహరింపు
-
కోయంబత్తూరు ఘటన: సినీ ఫక్కీలో నిందితుల అరెస్ట్
కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను సినీ ఫక్కీలో పోలీసులు అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్ శరవణ సుందర్ నిందితుల అరెస్టును ధృవీకరించారు. అరెస్టు సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురు నిందితుల కాళ్లపై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని శరవణ సుందర్ పేర్కొన్నారు. కోయంబత్తూరు నగర శివార్లలోని వెల్లకినారులో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారు అక్కడి నుంచి తప్పించుకోబోయారు. ఈ నేపధ్యంలో పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడిన నిందితులు గుణ, కరుప్పసామి, కార్తీక్ అలియాస్ కాళీశ్వరన్లను కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఎన్కౌంటర్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారని శరవణ సుందర్ ‘ఏఎన్ఐ’కి తెలిపారు.కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో ఆదివారం సాయంత్రం ఒక విద్యార్థినిని ముగ్గురు మువకులు అపహరించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. దాడి జరిగిన సమయంలో ఆ విద్యార్థిని తన స్నేహితునితోపాటు కారులో ఉన్నారని ‘హిందుస్తాన్ టైమ్స్’ గతంలో నివేదించింది. ఆ సమయంలో ముగ్గురు నిందితులు కలిసి కారు అద్దాలు పగలగొట్టి, ఆ యువతిని, అతని స్నేహితుడిని కొట్టి, గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేశారని తెలియవచ్చింది.ఈ ఘటన దరిమిలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై తమిళనాడులో క్షీణిస్తున్న శాంతిభద్రతలను, మహిళలు, పిల్లలపై పెరుగుతున్న లైంగిక నేరాలపై ‘ఎక్స్’ పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకె అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇలాంటి సంఘటనలు పెరిగిపోయాయని, సామాజిక వ్యతిరేక శక్తులు అటు చట్టానికి, ఇటు పోలీసులకు భయపడటం లేదని అన్నామలై ఆరోపించారు. డీఎంకే మంత్రుల నుండి పోలీసు అధికారుల వరకు అందరూ న్యాయాన్ని కాపాడే బదులు నేరస్తులను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లున్నదని అన్నామలై అన్నారు. ఇది కూడా చదవండి: భారత ట్రక్కు డ్రైవర్ కేసులో మరో మలుపు -
‘డబ్బులు చెల్లిస్తా.. నన్ను వదిలేయండి సార్’..అమెరికాలో భారత యువతి
వాషింగ్టన్: అమెరికాలో మరో భారత యువతి దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికింది. పైగా తాను దొంగతనం చేయలేదని బుకాయించింది. తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లించడం మరిచిపోయానంటూ ప్రాధేయపడింది. కావాలంటే ఇప్పుడు తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లిస్తా. నన్ను వదిలేయండి’ అంటూ చేతులు జోడించి అక్కడి పోలీసుల్ని వేడుకుంది. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్కు చెందిన ఓ యువతి టూరిస్ట్ వీసాతో అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సమయంలో అమెరికాకు చెందిన ఓ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఓ షాప్లో తనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం, అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా.. సదరు షాపు యజమాని ..తన షాపులో ఓ యువతి దొంగతనం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తు వీడియోలో.. ఆ యువతి ఎలా శిక్ష విధించకుండా వదిలేయమని కోరింది. తాను షాపులు వస్తువుల్ని కొనుగోలు చేశానే తప్పా.. దొంగతనం చేయలేదని, కొనుగోలు చేసిన వస్తువులకు ఇప్పుడే డబ్బులు చెల్లిస్తానని చెప్పడం ఆవీడియోలో చూడొచ్చు. కాగా, ఆ యువతి వివరాలు, ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. 👉ఇదీ చదవండి: చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?కొద్దిరోజుల క్రితం కొద్దిరోజుల క్రితం మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ అని కోరినప్పటికీ పోలీసులు ఆమెను కటకటాల వెనక్కు పంపారు. -
‘రోహిత్ ఆర్య’ ఎన్కౌంటర్లో ట్విస్ట్
ముంబై: ఆడిషన్స్ పేరుతో చిన్నారులను కిడ్నాప్ చేసి, పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన ముంబై చిత్ర నిర్మాత ‘రోహిత్ ఆర్య’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.రోహిత్ ఆర్య అప్సర మీడియా ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్లను దక్కించుకున్నాడు. వాటిల్లో విద్యాశాఖలో పూర్తి చేసిన ప్రాజెక్టు నిమిత్తం రోహిత్ ఆర్యకు మహా ప్రభుత్వం రూ. 2 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఆ మొత్తం ఇవ్వలేదని కారణంతో రోహిత్ ఆర్య పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్2022-2023లో ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్ అనే పట్టణ పారిశుధ్య డ్రైవ్ ప్రాజెక్ట్ బాధ్యతల్ని నాటి మహరాష్ట్ర ప్రభుత్వం రోహిత్ ఆర్యకు అప్పగించింది. అప్సర మీడియా పేరుతో ఆ ప్రాజెక్ట్ పనుల్ని చేసింది. ప్రభుత్వ ప్రాజెక్ట్లో శుభ్రతా చర్యలు సూచించటం, రిపోర్ట్ చేయటం, విద్యార్థులు,సిబ్బందికి అవగాహన కల్పించింది. ఈ ప్రాజెక్ట్ కోసం 2023 జూన్ 30న నాటి ప్రభుత్వం రూ. 9.9 లక్షలు చెల్లించింది.ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మహరాష్ట్రలో ప్రభుత్వం మారడం, నూతన ప్రభుత్వానికి రోహిత్ ఆర్య చేస్తున్న ప్రాజెక్ట్పై అసంతృప్తిని వ్యక్తి చేసింది. అంతేకాదు ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేసింది. ప్రభుత్వం నిర్ణయంతో రోహిత్ ఆర్యకు భారీ మొత్తంలో నష్టం వచ్చింది.సంవత్సరం తర్వాత మరోసారిఆ నష్టాల నుంచి బయటపడేందుకు ఏడాది తర్వాత ప్రభుత్వం ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని, ఈసారి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని కోరాడు. దీనికోసం రూ. 2.42 కోట్లు డబ్బు ఇవ్వాలని మరొక డిమాండ్ను సమర్పించాడు. అదే సమయంలో ‘ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్’ డైరెక్టర్ హోదాలో ఆర్య పాఠశాలల నుంచి రిజిస్టేషన్ ఫీజును వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఫీజును వసూలు చేయడానికి ఆర్యకు అధికారం లేదని ప్రభుత్వం తెలిపింది.పైగా,పాఠశాలల నుంచి వసూలు చేసిన డబ్బును ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ కోసం నిధులు సేకరించనని హామీ ఇచ్చి అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. కానీ ఆర్య డబ్బును జమచేయకపోగా.. అఫిడవిట్ దాఖలు చేయలేదని ప్రభుత్వం తెలిపింది.ఈ క్రమంలో ఆడిషన్స్ పేరుతో గురువారం పిల్లల్ని కిడ్నాప్ చేసి మహరాషష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన మొత్తాన్ని డిమాండ్ చేశారు. లేదంటే పిల్లల్ని చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. పిల్లల్ని విడిపించేలా పోలీసులు ఆర్యతో చర్చలు జరిపారు. ఆ సమయంలో పిల్లల ప్రాణాలు తీసేందుకు రోహిత్ ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. అనంతరం రోహిత్ ఆర్యను ఆస్పతత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రోహిత్ ఆర్య కన్నుమూశారు. -
ముంబైలో 17 మంది పిల్లల కిడ్నాప్.. రక్షించిన పోలీసులు
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో గురువారం కిడ్నాప్ కలకలం సృష్టించింది. వెబ్సిరీస్ రూపొందించేందుకు ఆడిషన్స్ పేరిట ఓ వ్యక్తి ఎనిమిది నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల్ని ఆర్ఏ స్టూడియోకి రప్పించి కిడ్నాప్ చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు 17 మంది పిల్లల్ని, ఒక వృద్ధుడిని, మరో వ్యక్తిని రక్షించారు. పోలీసులపై కాల్పులు జరిపిన కిడ్నాపర్ రోహిత్ ఆర్య (50) ఎదురు కాల్పుల్లో మృతిచెందాడు. ఆ స్టూడియోలో పనిచేసే కిడ్నాపర్ మానసిక పరిస్థితి సరిగా లేదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన వివరాలను సంయుక్త పోలీస్ కమిషనర్ సత్యనారాయణన్ మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు..అసలేం జరిగింది?ముంబైలో పొవాయ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మహావీర్ క్లాసిక్ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఆర్ఏ స్టూడియో ఉంది. ఇందులో పనిచేసే రోహిత్ ఆర్య రెండు రోజులుగా ఒక వెబ్సిరీస్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. గురువారం దాదాపు 100 మంది వచ్చారు. వీరిలో 17 మందిని ఆపేసి ఒక గదిలో బంధించాడు. దీంతో భయపడిన పిల్లలు కేకలు వేయడంతో రహదారిపై వెళుతున్న ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య బృందం, క్విక్ రెస్పాన్స్ బృందాలతో కలిసి స్టూడియోకు వచ్చారు. ఆలోపే ఆర్య ఒకటిన్నర నిమిషం నిడివితో ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేశాడు. ‘ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నా ప్లాన్ అమలుచేద్దామనుకున్నా. అందుకే పిల్లల్ని కిడ్నాప్ చేశా. నేను కొందరిని ప్రశ్నించి వాళ్ల సమాధానాలు వినాలనుకుంటున్నా. పోలీసులు ఏమైనా తెలివితేటలు ప్రదర్శిస్తే.. తర్వాత ఈ పిల్లలకు ఏదైనా హాని జరిగితే దానికి నేను బాధ్యుడిని కాదు. పోలీసులు అతి తెలివి చూపిస్తే ఈ స్టూడియో మొత్తాన్ని తగలబెడతా..’ అని ఆ వీడియోలో చెప్పాడు. ఆర్యను శాంతిపజేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో పోలీసులు స్టూడియో లోపలికి వెళ్లేందుకు మార్గం వెతికారు. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన సాయంతో మొదటి అంతస్తు కిటికీ వద్దకు చేరుకున్నారు. తర్వాత ఎనిమిదిమంది కమెండోలు బాత్రూమ్ ద్వారా స్టూడియో లోపలికి ప్రవేశించారు. పోలీసుల రాకను గమనించిన ఆర్య తన చేతిలో ఉన్న లైటర్ చూపిస్తూ పిల్లల వద్ద ఉన్న రసాయన డబ్బాలను తగులబెడతానని బెదిరిస్తూనే ఎయిర్గన్తో పోలీసులపై కాల్పులు మొదలెట్టాడు. ⇒ పోలీసులు ఎదురుకాల్పులు జరపటంతో ఆర్యకు బుల్లెట్ల గాయాలయ్యాయి. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారని జోన్–10 పోలీస్ డిప్యూటీ కమిషనర్ దత్తు నలవాడే చెప్పారు. బందీలందరినీ రక్షించాక స్టూడియోలో పోలీసులు ఒక ఎయిర్గన్, పలు రసాయన కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. రసాయనాలతో అతడు విధ్వంసం సృష్టించాలని కుట్రపన్ని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ను కమెండోలు కేవలం 35 నిమిషాల్లో విజయవంతంగా ముగించారు.ఎవరీ కిడ్నాపర్ ?నాగ్పూర్కు చెందిన ఆర్య సొంతంగా యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. ప్రస్తుతం ముంబైలోని చెంబూర్లో ఉంటూ ఈ స్టూడియోలో పనిచేస్తున్న అతడు 12 ఏళ్ల కిందట ‘లెట్స్ చేంజ్’ కార్యక్రమం మొదలెట్టాడు. పాఠశాల చిన్నారులను శుభ్రతకు అంబాసిడర్లుగా మార్చడం ఈ కార్యక్రమం ఉద్దేశం. నాటి విద్యాశాఖ మంత్రి దీపక్ కేసార్కర్ హయాంలో ఆర్య ఈ కాంట్రాక్టు సంపాదించాడు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అతడికి రూ.2 కోట్లు రావాల్సి ఉంది. బకాయిలు చెల్లించాలంటూ గతేడాది జనవరిలో రెండుసార్లు నిరాహారదీక్ష చేశాడు. మంత్రి నివాసం ఎదుట కూడా ధర్నా చేశాడు. దీంతో అతడికి మంత్రి రూ.7 లక్షలు, రూ.8 లక్షల చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు చెల్లలేదు. మోసపోయానని గ్రహించిన ఆర్య ఆగ్రహంతో ఈ దుస్సాహసం చేసుంటాడని భావిస్తున్నారు.


