హైదరాబాద్‌: చందానగర్‌లో తీవ్ర విషాదం | Tragic Incident In Hyderabad, Nine Year Old Boy Dies By Suicide After Alleged Bullying At School | Sakshi
Sakshi News home page

Hyderabad: చందానగర్‌లో తీవ్ర విషాదం

Dec 17 2025 12:08 PM | Updated on Dec 17 2025 1:07 PM

Nine Year Old Boy Dies by Suicide After Alleged Bullying at School

హైదరాబాద్‌: నగరంలోని చందానగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారి తన స్కూల్‌ ఐడీ కార్డుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్కూల్‌లో తోటి పిల్లలు ఏడిపించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

ప్రశాంత్‌(9) స్థానికంగా ఓ స్కూల్‌లో చదువుతున్నాడు. అయితే స్కూల్‌ యూనిఫామ్‌ సరిగా లేదని తోటి పిల్లలు ఆటపట్టించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్‌ ఇంటికి వచ్చాడు. ఆపై బాత్‌రూమ్‌లోకి వెళ్లి తన ఐడీ కార్డుతో ఉరి వేసుకున్నాడు.

ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. చిన్నారి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన పోలీసులు.. ఆపై స్వగ్రామానికి తరలించారు. పిల్లాడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన విద్యాసంస్థల్లో బుల్లీయింగ్‌ గురించి చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.

బుల్లీయింగ్‌కి(వేధింపులు) చట్టపరమైన శిక్షలు ఉన్నాయి. ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు, ఆన్‌లైన్‌ వేదికల్లో జరిగే వేధింపులకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు.. సంబంధిత విద్యార్థిని సస్పెండ్‌ చేయడం, ట్రాన్స్‌ఫర్‌ చేయడం లేదంటే కౌన్సెలింగ్‌కి పంపడం జరుగుతుంది. నేరం తీవ్రతను(వయసు రిత్యా) బట్టి శిక్షలు విధించే అవకాశం లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement