breaking news
Student
-
నెల్లూరులో విద్యార్థిని ఆత్మహత్య
నెల్లూరు (క్రైమ్): స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమో.. సహచర విద్యార్థి వేధింపులో.. మరే ఇతర కారణమో తెలియదు గానీ పదో తరగతి చదువుతున్న ఓ బాలిక నెల్లూరు నగరంలోని ఫతేఖాన్పేటలో గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు... ఫతేఖాన్పేటలో నివసిస్తున్న తిరుపాల్, స్వాతి దంపతులకు నాగచైతన్య, లావణ్య (15) పిల్లలు. తండ్రి ఓ ఎల్రక్టానిక్ షాప్లో సూపర్వైజర్గా, తల్లి ఓ షోరూంలో పనిచేస్తున్నారు. లావణ్య తన ఇంటి సమీపంలోని ప్రియాంక ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పదో తరగతి చదువుతోంది.మూడున్నర నెలల క్రితం అదే పాఠశాలలో చదువుతున్న సహచర విద్యార్థి ఇన్స్ట్రాగామ్లో ఓ మెసేజ్ చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో 15 రోజుల ముందు స్కూల్లో లావణ్య బ్లేడ్తో కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఘటనపై యాజమాన్యాన్ని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, దురుసుగా ప్రవర్తించడంతోపాటు సదరు బాలుడికి మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో గురువారం పాఠశాలలో పరీక్ష రాసిన అనంతరం ఇంటికెళ్లిన బాలిక చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.కళాశాల నుంచి ఇంటికొచ్చి గమనించిన సోదరుడు నాగచైతన్య విషయాన్ని తల్లిదండ్రులకు, బంధువులకు తెలియజేశాడు. చిన్నబజార్ పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై బాలిక తల్లిదండ్రులు, దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ కరస్పాండెంట్ను విచారిస్తున్నారు. -
‘కిస్’ విద్యార్థి మృతి కేసు.. పప్పు కోసం ప్రాణం తీశారా?
భువనేశ్వర్: ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS)లో తొమ్మిదో తరగతి విద్యార్థి సిబా ముండా మృతి కేసు సంచలనాన్ని సృష్టిస్తోంది. హాస్టల్ బాత్రూమ్లో జారిపడి చనిపోయాడని సంస్థ యాజమాన్యం చెప్పిన మాటలు వాస్తవం కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. పప్పు ఒలికిపోవడంలో వివాదం తలెత్తిందని, ముగ్గురు సహవిద్యార్థులే అతడిపై దాడిచేసి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితుడు కియోంజర్ జిల్లాకు చెందిన మైనర్ బాలుడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.ఈ కేసుకు సంబంధించి పోస్ట్మార్టం నివేదిక అత్యంత కీలక ఆధారంగా మారింది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణం కాదని, హింసాత్మకమైన హత్య అని వైద్య నివేదిక స్పష్టం చేసింది. హాస్టల్ వాష్రూమ్లో ముగ్గురు సహచర విద్యార్థులు సిబా ముండాపై దాడి చేసి, ప్రాణాలు తీశారని పోలీసులు గుర్తించారు. నిందితులు ముగ్గురూ మైనర్లు కావడంతో వారిని అరెస్ట్ చేసి, ఖుర్దా జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం వారిని రిమాండ్ నిమిత్తం కరెక్షనల్ హోమ్కు తరలించినట్లు సమాచారం.మరోవైపు ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన కిస్ (KISS) సంస్థ తీరుపై పోలీసులు తీవ్రంగా మండిపడుతున్నారు. సాక్ష్యాలను తారుమారు చేయడం, ఇతర విద్యార్థులను బెదిరించడం తదితర ఆరోపణలతో సంస్థ అదనపు సీఈఓ ప్రమోద్ పాత్రతో సహా మొత్తం ఎనిమిది మంది అధికారులు, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థి మృతికి గల కారణాలను వివరించే వైద్య పత్రాలను తండ్రికి అందజేయకపోవడం, వారికి మృతదేహాన్ని అప్పగించడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అలాగే బాధితునికి చికిత్స అందించిన ఏడుగురు వైద్యులను కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.ఈ ఘటనపై ఒడిశా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో విద్యార్థి మరణంపై నిజాలు దాచడం తగదని, విచారణలో లోపాలు తేలితే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తన కుమారుడి మరణానికి సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని బాధితుడి తండ్రి రఘునాథ్ ముండా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: చైనా డ్యామ్ కుట్ర.. భారత్కు జల ముప్పు తప్పదా? -
కేపీహెచ్బీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
-
హైదరాబాద్: చందానగర్లో తీవ్ర విషాదం
హైదరాబాద్: నగరంలోని చందానగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారి తన స్కూల్ ఐడీ కార్డుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్కూల్లో తోటి పిల్లలు ఏడిపించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.ప్రశాంత్(9) స్థానికంగా ఓ స్కూల్లో చదువుతున్నాడు. అయితే స్కూల్ యూనిఫామ్ సరిగా లేదని తోటి పిల్లలు ఆటపట్టించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్ ఇంటికి వచ్చాడు. ఆపై బాత్రూమ్లోకి వెళ్లి తన ఐడీ కార్డుతో ఉరి వేసుకున్నాడు.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. చిన్నారి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన పోలీసులు.. ఆపై స్వగ్రామానికి తరలించారు. పిల్లాడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన విద్యాసంస్థల్లో బుల్లీయింగ్ గురించి చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.బుల్లీయింగ్కి(వేధింపులు) చట్టపరమైన శిక్షలు ఉన్నాయి. ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు, ఆన్లైన్ వేదికల్లో జరిగే వేధింపులకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు.. సంబంధిత విద్యార్థిని సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే కౌన్సెలింగ్కి పంపడం జరుగుతుంది. నేరం తీవ్రతను(వయసు రిత్యా) బట్టి శిక్షలు విధించే అవకాశం లేకపోలేదు. -
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో లైంగిక వేధింపుల కలకలం
ఎచ్చెర్ల : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో కొంత మంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తమను వేధిస్తున్నారని ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థినులు ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్, రిజి్రస్టార్, డైరెక్టర్లకు ఈ – మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, పరీక్షల నిర్వహణ విభాగంలోని బోధనేతర సిబ్బంది పాస్ చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని మెయిల్లో ఆరోపించారు. స్కాలర్షిప్ల కోసం వేలి ముద్రలు వేసే సమయంలో కొందరు బోధనేతర సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఈ నెల 11న ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి క్యాంపస్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. అయితే ఇది అనాధారిత మెయిల్ అని అధికారులు చెబుతున్నప్పటికీ... తమ పేరు బయటకు రాకుండా ఉన్నతాధికారులకు సమస్యలు నివేదించడానికి విద్యార్థులు ఇలా చేసి ఉండొచ్చని కొందరంటున్నారు. మెయిల్ ఎవరు చేశారనే కోణంలో కాకుండా ఫిర్యాదులోని వాస్తవాలపై విచారణ నిర్వహించాలని కోరుతున్నారు. మరోవైపు బోధనా సిబ్బందిలో చాలా మంది పాఠాలు చెప్పకుండా యూట్యూబ్, చాట్ జీపీటీలో చూసుకోమని సూచిస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు నేపథ్యంలో విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేజీవీడీ బాలాజీ తెలిపారు. -
బాత్రూం డోర్ కొట్టిందని మోకాళ్లపై కూర్చోబెట్టిన టీచర్
గుంటూరు: మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని టాయిలెట్కు వెళ్లేందుకు బాత్రూం డోర్ కొట్టిందని మోకాళ్లపై కూర్చోబెట్టిన సంఘటనపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గత నెల 17న జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్లో ఇచ్చిన ఫిర్యాదుకు దిక్కు లేకుండా పోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించినట్లుగా పేర్కొంటూ క్లోజ్ చేయడంతో తిరిగి విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. గుంటూరు నగరం పట్టాభిపురంలోని జీకేఆర్ హైస్కూల్ ల్లో 3వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అర్జంటుగా టాయిలెట్కు వెళ్లాల్సి రావడంతో పాఠశాలలోని బాత్రూంకు వెళ్లింది. అయితే బాత్రూం ఖాళీ లేకపోవడంతో లోపల ఉన్న వారిని త్వరగా బయటకు రావాలని పిలిచేందుకు తలుపు తట్టింది. ఈ సంఘటన గమనించిన పాఠశాలలోని ఒక టీచర్ విద్యారి్థని పెద్ద తప్పిదం చేసినట్లుగా భావించి, చెంపపై దెబ్బ కొట్టడంతోపాటు మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఈ విధంగా గంటన్నర సేపు విద్యారి్థని మోకాళ్లపై కూర్చునట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంతరం జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్యం వాగ్వాదానికి దిగింది. బాలిక తల్లి సంకు త్రిలోచనకు ముగ్గురు పిల్లలు కాగా, ఇదే పాఠశాలలో చదువుతున్నారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి వారిని పాఠశాలకు రానివ్వకుండా యాజమాన్యం అడ్డుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరపాల్సిన విద్యాశాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పాఠశాలకు వెళ్లి విచారణ జరపాల్సిన అధికారులు ఇవేమీ చేయకుండానే ఫిర్యాదు పరిష్కరించామని చెప్పి ఫిర్యాదును మూసివేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో తల్లిదండ్రులు మళ్లీ ఫిర్యాదు చేసేందుకు సోమవారం గ్రీవెన్స్కు వచ్చారు. గ్రీవెన్స్లో ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించినట్లుగా జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా పేరుతో సంబంధిత విద్యార్థిని తల్లికి పోస్టులో లేఖ పంపారు. విద్యారి్థని తల్లిదండ్రులు ఇచ్చిన సెల్ఫోన్కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని లేఖలో పేర్కొన్నారు. -
అమ్మా.. ఐశ్వర్య ఎక్కడున్నావ్!
రంగారెడ్డి జిల్లా: తన కూతురు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానానికి వెళుతుందనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. ఆ కుటుంబం కలలు కళ్ళెదుటనే కరిగి పోయాయి. మృత్యు రూపంలో వచ్చిన ఓ కారు వారి ఆశలను చిదిమి వేసింది. రోడ్డును దాటుతున్న తండ్రీ,కూతురును వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి తీవ్రంగా గాయడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కౌడిపల్లికి చెందిన యంసాని పాండు, కళ్యాణిలు హయత్నగర్లోని వినాయకనగర్ కాలనీలో ఉంటున్నారు. పాండు హయత్నగర్లో ఓ ట్రాన్స్పోర్టు కార్యాలయంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు.వారికి కుమారుడు వంశి, కూతురు ఐశ్వర్య(19) ఉన్నారు. కొడుకు కెనడాలో ఉండగా కూతురు మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల హస్టల్లో ఉంటున్న ఆమె ప్రతి శనివారం ఇంటికి వచ్చేది. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బస్సెక్కించేందుకు తండ్రికూతురును వెంట బెట్టుకుని రాగా హయత్నగర్ ఆర్టీసీ కాలనీలో ఇద్దరు జాతీయ రహదారిపై రోడ్డును దాటుతున్నారు. అదే సమయంలో ఎల్బినగర్ వైపు నుంచి వేగంగా వచ్చిన క్రెటా కారు (టీఎస్ 07కెజి 9006) వీరిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. కాలికి తీవ్ర గాయం అయిన తండ్రిని చికిత్స నిమిత్తం హయత్నగర్లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరి్పంచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోధు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ లో కుప్పకూలిన బాలిక
-
‘చచ్చిపో.. కాలేజీకి ఒకరోజైనా సెలవు ఇస్తారు’
సాక్షి,తిరుపతి: ‘నువ్వ చచ్చిపో.. చచ్చిపోతే కాలేజీకి ఒక్కరోజైనా సెలవు ఇస్తారంటూ’ అవమానించడంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.కుప్పంకు చెందిన విద్యార్థి జస్విన్ తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 10వ తేదీన ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు.అయితే,జస్విన్ ఆత్మహత్యాయత్నానికి కాలేజీ అధ్యాపకులే కారణమని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘నీకు చదువు ఎందుకు? నువ్వు చనిపోతే కాలేజీకి ఒక రోజు సెలవు వస్తుంది’ అంటూ ఓ అద్యాపకురాలు తోటి విద్యార్థుల ముందు అమానుషంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ అవమానాలు, మానసిక ఒత్తిడి తట్టుకోలేక జస్విన్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఆవేదనజస్విన్ తల్లి రాధ కన్నీటి పర్యంతమై మాట్లాడుతూ.. ‘నా కొడుకు పట్ల కాలేజీ లెక్చరర్లు దారుణంగా మాట్లాడారు. సరైన సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేసింది’ అని ఆరోపించారు. తన కుమారుడి పరిస్థితికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.యాజమాన్యం వైఖరిపై విమర్శలుఈ ఘటనపై ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పటికీ, కాలేజీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు, సంఘాలు మండిపడుతున్నాయి. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, దళిత సంఘాలు ఎన్ఆర్ఐ కళాశాల ముందు బైటాయించి నిరసనలు చేపట్టాయి. విద్యార్థులపై వేదింపులు ఆపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
నలుగురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం: కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుతున్న నలుగురు ఇంటర్ విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నకి పాల్పడ్డారు .వివరాల్లోకి వెళ్తే.. వసతి గృహంలో క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందని భావించిన హాస్టల్ వార్డెన్, ఈ విషయం గురించి వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని విద్యార్థినులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో ఆందోళన చెందిన ఆ నలుగురు విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినుల నుండి మౌఖిక వాంగ్మూలం తీసుకోవడంతో పాటు, హాస్టల్ వార్డెన్ వ్యవహారం, కళాశాల పరిపాలనలో ఉన్న లోపాలపై కూడా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. -
విజయవాడ : అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)
-
Anakapalli: గొలుగొండ కేజిబీవీలో దారుణం..విద్యార్థినికి గర్భం
అనకాపల్లి. గొలుగొండ కేజిబీవీ (కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం) మరో వివాదంలో చిక్కుకుంది. కేజీబీవీ చదువుతున్న ఓ గిరిజన బాలిక గర్భం దాల్చింది. ఆమెకు తరుచు వాంతులు కావడంతో ఏఎన్ఎమ్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ బాలిక ఐదు నెలల గర్భిణి అని డాక్టర్లు చెప్పడంతో దాన్ని దాచే పెట్టే యత్నం చేశారు. ఆ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆ బాలికను కుటుంబ సభ్యులకు అప్పచెప్పింది ఎస్ఓ సుధా. అయితే ఆ బాలిక వాంతులు కావడం గమనించిన కుటుంబ సభ్యులు.. ఏమైందని ఆరా తీయగా అసలు విషయం బటయపడింది. ఆ బాలికకు తండ్రి చనిపోవడంతో తల్లికి మరొకరతితో పెళ్లి చేశారు. ఆ బాలిక అమ్మమ్మ దగ్గర పెరుగుతూ చదువుతోంది. అయితే బాలిక గర్భం దాల్చిన విషయం బయటకు రావడంతో ఎస్ఓ సుధ రాజీనామా డ్రామాకు తెరలేపారు. ఇటీవల కాలంలో ఆ పాఠశాల తరుచు వివాదాల బారిన పడుతోంది. మొన్న రాత్రి 11 గంటల వరకు భోజనం పెట్టని వైనం బయటకు రాగా, ఆపై తల్లిదండ్రులు సైతం ఆందోళన బాట పట్టారు. తాజాగా ఓ విద్యార్థిని గర్భం దాల్చడంతో ఆమె భవిష్యత్ ప్రశార్థకంగా మారడమే కాకుండా మరో వివాదంలో గొలుగొండ కేజీబీవి పాఠాశాల చిక్కుకున్నట్లయ్యింది, -
AP: నారాయణ కాలేజీలో దారుణం
తిరుపతి: జిల్లాలోని అగరాల నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకంది. చదువు పేరుతో కాలేజ్ యాజమాన్యం పెడుతున్న వేధింపులు భరించలేక మహీధర్రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు.కాలేజ్ మూడో అంతస్తు నంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో మహీదర్రెడ్డికి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది ఆరంభంలో ఏపీలోని అనంతపురం సోమలదొడ్డి దగ్గరున్న నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 23 వ తేదీన కాలేజీ మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ీసీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. -
గళమెత్తిన విద్యార్థి దళం
సాక్షి,అమరావతి/తాడేపల్లి రూరల్: కర్కశ సర్కారుపై విద్యార్థి దళం గళమెత్తింది. రహదారులపై రణన్నినాదమై గర్జించింది. ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని కదంతొక్కింది. చంద్రబాబు ప్రభుత్వ దుర్నీతిపై కన్నెర్రచేసింది. ఖబడ్దార్ అంటూ హెచ్చరించింది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్íÙప్పులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా స్పందించలేదు. దీంతో సోమవారం తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ కార్యాలయ ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చారు.పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎనీ్టఆర్ జిల్లాల నుంచి భారీగా తరలివచి్చన విద్యార్థులు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కార్యాలయం వద్ద నుంచి ప్లకార్డులు, బ్యానర్లు, జెండాలు చేతబట్టి ర్యాలీగా పెట్రోల్ బంక్ మీదుగా సాంఘిక సంక్షేమ కార్యాలయ రోడ్డులోకి చొచ్చుకెళ్లారు. దీంతో పోలీసులు లాఠీలను అడ్డుపెట్టి విద్యార్థి నేతలను, విద్యార్థులను అడ్డుకునే యత్నం చేశారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం బారికేడ్లను నెట్టేసి విద్యార్థులు సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద చేరుకుని అక్కడ ధర్నాకు దిగారు.‘ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు గేట్ బయటకు నెట్టేయడం అన్యాయం, విద్యార్థులను వేధించటం తగదు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.5,600 కోట్లు, స్కాలర్ షిప్ బకాయిలు రూ.2,200 కోట్లు తక్షణమే చెల్లించాలి, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి, లేకుంటే విద్యార్థుల సత్తా ఏమిటో సర్కారుకు చూపిస్తాం.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’’ అని హెచ్చరించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థుల నినాదాలతో తాడేపల్లి హోరెత్తింది. అనంతరం పోలీసులు ఐదుగురితో కూడిన విద్యార్థుల ప్రతినిధి బృందాన్ని అధికారుల వద్దకు పంపుతామనటంతో విద్యార్థినేతలు, విద్యార్థులు ఒప్పుకోలేదు. ప్రభుత్వమే దిగివచ్చి తమ సమస్యలను వెంటనే పరిష్కరించే వరకు తాము ఎక్కడికీ ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు. విద్యార్థి నేతలను ఈడ్చిపడేసిన పోలీసులు ఆందోళన తీవ్రం కావటంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ (జోనల్) ఎ.రవిచంద్రతో పాటు మరికొంతమంది విద్యార్థులను ఈడ్చిపడేశారు. వారిని తీసుకెళ్లి ముందే సిద్ధంగా ఉంచిన లారీలోకి ఎక్కించారు. అనంతరం వారిని తెనాలి మార్గంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పారు. చివరికి దుగ్గిరాల పోలీసు స్టేషన్కు తరలించారు. వారి వెంట భారీగా విద్యార్థులు వాహనాల్లో తరలివెళ్లారు. విద్యాశాఖ మంత్రి విదేశాల్లో చక్కర్లు కొడతారా? అంతకు ముందు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య నేతృత్వంలో గుంటూరు నుంచి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రవిచంద్ర నేతృత్వంలో విజయవాడ వైపు నుంచి విద్యార్థులు బైక్లు, ఇతర వాహనాల్లో భారీ ర్యాలీగా తాడేపల్లికి చేరుకున్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాను ఉద్దేశించి చైతన్య, రవిచంద్ర మాట్లాడారు. దాదాపు ఎనిమిది క్వార్టర్స్ బకాయిలు రూ.7,800 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయాలని, ఇందులో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.5,600 కోట్లు, స్కాలర్ షిప్ బకాయిలు రూ.2,200 కోట్లు చెల్లించాలని స్పష్టం చేశారు.వీటిని చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు రాష్ట్రంలో విద్యార్థులు కష్టాల్లో ఉంటే విద్యాశాఖ మంత్రి లోకేశ్ విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం పోలీసులు పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, నరేందర్ రెడ్డి, బాజీ, రవి తదితరులను అరెస్టు చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ధర్నాలో స్టూడెంట్ యూనియన్ నాయకులు నరేంద్రరెడ్డి, గంటి, రవి, పేటేటి నవీన్, వినోద్, కోమల సాయి, రవీంద్రారెడ్డి, సందీప్, రవి, కరీం, కిరణ్, రాజే‹Ù, సతీష్, అజయ్, రామకృష్ణ, మస్తాన్, ప్రభు, హరి, సుభాని, బాలు, అబ్బాస్, సిరాజ్, శ్రీనివాస్, నవీన్, కోమల్ సాయి, సురేష్ పాల్గొన్నారు. విద్యార్థులపై కేసు నమోదు తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి విద్యార్థి సంఘ నాయకులు పానుగంటి చైతన్య, నరేంద్రరెడ్డి, అనిల్ కుమార్, రవీంద్ర, రవిచంద్ర విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. వీరిని మధ్యాహ్నం 12 గంటలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం 8 గంటల సమయంలో మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు.ప్రభుత్వం దిగిరాకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం ప్రభుత్వం దిగిరాకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం. తక్షణం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మంజూరు చేయాలి. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించారు, స్కాలర్íÙప్పులూ మంజూరు చేశారు. ఈ సర్కారు వచ్చాక అసలు చెల్లింపులు నిలిపేసింది. విద్యార్థులను చిత్రహింసలు పెడుతోంది. ఈ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతాం. – పానుగంటి చైతన్య, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పార్ట్ టైం ఉద్యోగాలకు విద్యార్థులు చంద్రబాబు సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇతర బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేయడంతో కాలేజీల యాజమాన్యాల వేధింపులను విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. హాల్టికెట్లు ఇవ్వకపోవడంతో చాలామంది పరీక్షలకు దూరమయ్యారు. దీంతో కొందరు విద్యార్థులు పార్ట్టైం ఉద్యోగాలుచేస్తూ ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. తల్లిదండ్రులు కాలేజీల ఫీజులు చెల్లించేందుకు అప్పులుచేయాల్సి వస్తోంది. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
అమెరికా అగ్నిప్రమాద ఘటనలో మరో తెలుగు విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న అల్బనీ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో రాష్ట్రానికి చెందిన తెలుగు విద్యార్థి ఉడుముల సహజారెడ్డి (24) మృతిచెందగా ఆ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన అన్వేష్ సారపెల్లి అనే తెలుగు విద్యార్థి సైతం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం శనివారం సామాజిక మాధ్యమ వేదికగా ప్రకటించింది. మృతుని కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని.. ఈ విషయంలో వీలైనంత సాయం చేస్తున్నామని తెలిపింది.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులు సహజారెడ్డి, అన్వేష్తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు అల్బనీలోని క్వెయిల్ స్ట్రీట్లో ఉన్న ఓ ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నెల 4న వారి ఇంటికి ప్రమాదవశాత్తూ మంటలు అంటుకోగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే సహజారెడ్డి 90 శాతం కాలిన గాయాలకు గురవగా అన్వేష్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పోలీసులు వారిని అల్బనీ మెడికల్ కేర్ సెంటర్ ఆస్పత్రికి... అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వెస్ట్చెస్టర్ మెడికల్ బర్న్ సెంటర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సహజారెడ్డి శుక్రవారం మృతి చెందగా అన్వేష్ శనివారం మరణించాడు. -
విద్యార్థినికి అధ్యాపకుడి లైంగిక వేధింపులు
తిరుపతి సిటీ: విద్యార్థినిని అధ్యాపకుడు లైంగికంగా వేధించిన ఘటన తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగింది. ఒడిశాకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిని వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ కుమార్ లైంగిక వేధింపులకు గురిచేసి మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థినితో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉంటుండగా ఆ దృశ్యాలను ఆ విద్యార్థినిపై కన్నువేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ తన మొబైల్లో రికార్డు చేశాడు. అనంతరం ఆ వీడియోను విద్యార్థినికి పంపించి తన కోరిక తీర్చమని బెదిరించాడు. దీంతో తనను వేధించి గర్భవతిని చేసిన డాక్టర్ లక్ష్మణ్ కుమార్, వీడియో అడ్డుపెట్టుకుని తనను బెదిరిస్తోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్పై వీసీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వీసీ, రిజిస్ట్రార్ ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. తమ కుమార్తెకు టీసీ ఇస్తే వెళ్లిపోతామని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కమిటీకి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు విద్యార్థినికి వర్సిటీ అధికారులు టీసీ ఇచ్చేసి డాక్టర్ లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేశారు. వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తోన్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్పై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై వర్సిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
గురుకుల విద్యార్థిని కిడ్నాప్ కలకలం
అమలాపురం టౌన్/ముమ్మిడివరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శివారు ఠాణేలంకలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ పాఠశాల నుంచి పదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి, మరుసటిరోజు వదిలేయడం కలకలం సృష్టించింది. ఆ బాలికను తీసుకెళ్లిన యువకుడు టీడీపీ కార్యకర్త, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు అనుచరుడు. బాలిక బంధువుల కథనం ప్రకారం.. జిల్లాలోని కాట్రేనికోన మండలానికి చెందిన బాలిక ఈ పాఠశాలలో చదువుకుంటోంది. పల్లంకుర్రు శివారు వఢ్డివారిపేటకు చెందిన టీడీపీ కార్యకర్త మోకా గిరిబాబు బుధవారం ఆ పాఠశాల వసతి గృహానికి వెళ్లి బాలిక నాయనమ్మకు ఒంట్లో బాగోలేదని, బాలికను తనవెంట పంపించాలని కోరాడు. దీనికి అక్కడి సిబ్బంది నిరాకరించారు.మరికొంతసేపటికి ఆ బాలిక మేనమామ భార్యనని చెప్పి ఓ మహిళ వసతి గృహానికి వచ్చి బాలికను తీసుకెళ్లింది. బుధవారం సాయంత్రం వరకు ఆ బాలిక తిరిగి పాఠశాలకు చేరలేదు. దీంతో ప్రిన్సిపాల్ డి.శారద బాలిక నాయనమ్మకు ఫోన్ చేశారు. మనవరాలి కోసం తాను ఎవరినీ పంపించలేదని, బాలిక ఇంటికి రాలేదని ఆమె చెప్పడంతో ప్రిన్సిపాల్ శారద ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమలాపురం డీఎస్పీ టీఎస్కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్కుమార్, ఎస్ఐ డి.జ్వాలాసాగర్ బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. బాలికను కిడ్నాప్ చేసింది మోకా గిరిబాబు అని, అతడి మరదలు అర్చన సహకరించిందని గుర్తించారు.ఎమ్మెల్యే సుబ్బరాజుతో నిందితుడు గిరిబాబు ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నిందితుడు ఆ బాలికను తీసుకొచ్చి పాఠశాల వద్ద వదిలి వెళ్లాడు. బాలిక నాయనమ్మ, బంధువులు గురువారం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. తాము గురుకుల పాఠశాలకు వెళ్లాలంటే సవాలక్ష ఆంక్షలు చెబుతారని, అటువంటిది బయటి వ్యక్తులతో ఎలా పంపించారని ప్రశ్నించారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జ్వాలాసాగర్ తెలిపారు. -
వికృత చేష్టలకు బలైన విద్యార్థిని
ఆ చిన్నారి భవిష్యత్పై ఎన్నో కలలు కనింది. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంది. తనకోసం రేయింబవళ్లు కష్టపడుతున్న తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకుంది. అందుకే వ్యయప్రయాసల కోర్చి ధర్మవరానికి వెళ్లి మరీ చదువుకునేది. కానీ బస్సులో ఓ విద్యార్థి తనకు చేసిన అవమానాన్ని తట్టుకోలేక ఉరివేసుకున్న ఆ విద్యార్థిని ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి అలసిపోయింది. బుధవారం సాయంత్రం జీవితాన్ని ముగించింది.సత్యసాయి జిల్లా: మండల పరిధిలోని పులేటిపల్లికి చెందిన స్పందన(17) ధర్మవరంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ గ్రామం నుంచి ధర్మవరానికి బస్సులో వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో ఎనిమిది రోజుల క్రితం కళాశాలకు బస్సులో వెళ్తున్న క్రమంలో ఓ విద్యార్థి ఆమెతో ఆసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె అతన్ని మందలించింది. దీంతో పట్టరాని కోపంతో ఆ విద్యార్థి బస్సులో ప్రయాణికుల ముందే స్పందనపై రెండుసార్లు దాడి చేశాడు. ఘటనపై స్పందన ధర్మవరం పట్టణంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు తమ పరిధిలోకి రాదని తప్పించుకున్నారు. చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేయగా.. అతడిని పిలిపించి మందలిస్తామన్నారు. ఓ బాలికపై భౌతిక దాడి చేస్తే మందలిస్తారా.. అంతేనా.. అని బాధపడిన చిన్నారి ఇంటికి వెళ్లి ఉరి వేసుకుంది. కుటుంబీకులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేసిన బాలిక చివరకు మృత్యువు ఒడిలోకి చేరింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించినట్లుగా యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నిండు ప్రాణం తీసిన నింద!
కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా పామర్రులోని యడదిబ్బ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థి కైలే యశ్వంత్ (15)పై పక్కింటి వ్యక్తి బొట్టు సాంబశివరావు దొంగతనం నింద మోపాడని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ ఇంట్లో రూ.1500 పోయాయని, అది బాలుడు తీసుకున్నాడని ఆరోపించాడు సాంబశివరావు. ఆ డబ్బును యశ్వంత్ పేరెంట్స్ తిరిగి ఇవ్వబోగా.. సాంబశివరావు నిరాకరించాడు. అయితే తమ ఇంట్లో ఏది పోయినా యశ్వంత్దే బాధ్యత అంటూ మరింతగా బెదిరించాడు. అంతటితో ఆగక తన బంధువైన రిటైర్డ్ ఏఎస్ఐతో ఫోన్ చేయించి బాటుడిపై ఒత్తిడి చేశాడు. సాంబశివరావు బెదిరింపులకు భయపడి, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక యశ్వంత్ మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన యడదిబ్బ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక చిన్నారి ప్రాణం అనవసరమైన నిందలతో ముగియడం స్థానికులను కలచివేసింది. -
గుంటూరు కేఎల్ వర్శిటీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, గుంటూరు కేఎల్ వర్శిటీ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీటెక్ ఫస్టియర్ విద్యార్థి సురేష్రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిచెందిన విద్యార్థి బాపట్ల కొత్తపాలెం వాసిగా గుర్తించారు.కాగా, నిన్న(డిసెంబర్ 1, సోమవారం) తెలంగాణలోని బాచుపల్లి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలోనే చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. నిజాంపేటలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆత్మహత్యకు ప్రేమ వ్యహహారమే కారణమని తెలుస్తోంది. -
ఐఐటీ బాంబే విద్యార్థిని వీడియో వైరల్, అంతగానూ ఏముంది?
హర్యానాకు చెందిన ఐఐటీ బాంబే విద్యార్థిని షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. క్యాంపస్ మెస్ ఫుడ్ ఎలా ఉంది అనే విషయాలతో తన అనుభవాన్ని పంచుకుంది.భారతదేశంలోని అగ్రశ్రేణి సంస్థలలో ఒకటైన ఐఐటీ బాంబే మెస్ గురించి అక్కడ చదువుకుంటున్న గరిమా తన యూ ట్యూబ్లో ఒక చిన్న వీడియో పోస్ట్ చేసింది. ఇక్కడ మెస్ చాలా హైజీనిక్గా ఉంటుందని,ఫుడ్ కూడా చాలా బావుంటుందని వివరించింది. అంతే ఈ చిన్న యూట్యూబ్ వీడియో వైరల్ అయింది. "నేను హర్యానా నుండి వచ్చాను, నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇతర రాష్ట్రాల ఆహార సంస్కృతిని ఇంత దగ్గరగా చూడలేదు, కానీ ఐఐటీ బాంబే నాకు ప్రతిదీ పరిచయం చేస్తోంది."అని పేర్కొంది. ఇది 12 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. 4 లక్షలకు పైగా కామెంట్లువెల్లువెత్తాయి. 2024లో పోస్ట్ చేసిన ఈ వీడియో మళ్లీ ఇపుడు వైరలవుతోంది. 1300 కమెంట్స్ రావడంతో నెట్టింట ఇంట్రస్టింగ్గా మారింది.కాగా గరిమా @garimabagar పేరుతో యూట్యూబ్ ఛానెల్ను నిర్వహిస్తోంది. IIT బాంబే మెస్ టూర్లో ప్రతి పండుగ మెస్లో మా ప్లేట్లో కనిపిస్తుంది." అంటూ అక్కడ వడ్డించే ఆహారం గురించి మాట్లాడుతుంది.పొంగల్ సమయంలో, అరటి ఆకుల్లో భోజనాన్ని వడ్డించడం,విద్యార్థులు నేలపై కూర్చుని తినడం గురించి గర్వంగా చెప్పుకొచ్చింది. పొంగల్ రోజున, క్యాంటీన్ లోపల రంగోలి సాంప్రదాయ లేఅవుట్లో భోజనం వడ్డించారు. బియ్యం, సాంబార్, చట్నీ . స్వీట్లు వంటి వంటకాలను అరటి ఆకులపై వడ్డించాన్ని ఈ వీడియో చూడవచ్చు.అంతేకాదు ఈ సంప్రదాయంలో భాగంగా విద్యార్థులు నేలపై కూర్చుని తినడానికి ,,చెప్పులు తీసేసారని, తొలిసారి, సాంప్రదాయ దక్షిణ భారత పండుగ భోజనాన్ని ఆస్వాదిస్తున్నామని నిజంగా ఇది భిన్నమైన అనుభవం అని ఈ వీడియోలో వివరించింది. మరికొన్ని రోజుల్లో పొంగల్ సందడి రానున్న సందర్భంగా మళ్లీ ఇపుడు ఈ వీడియో నెటిజన్లును ఆకట్టుకుంటోంది. -
ఎస్సీ గురుకులాల్లో ఎఫ్ఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో ఫేస్ రికగ్నేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 268 ఎస్సీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఫేషియల్ రికగ్నేషన్ మొబైల్ యాప్ ఆధారంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. గురువారం నుంచి ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో హాజరు స్వీకరించారు.విద్యార్థుల హాజరు మాత్రమే కాకుండా బోధకులు, సిబ్బంది హాజరు కూడా ఈ విధానంలోనే తీసుకుంటున్నారు. హాజ రు స్వీకరించిన వెంటనే సదరు విద్యాసంస్థ ప్రిన్సిపాల్ లాగిన్లో ఈ వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఆ తర్వాత ఆయన ఆమోదంతో సెంట్రల్ సర్వర్లో అప్లోడ్ అవుతాయి. ఎఫ్ఆర్ఎస్ ద్వారానే అన్ని కార్యక్రమాల అమలు చేపట్టనున్నట్టు ఎస్సీ గురుకుల సొసైటీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎఫ్ఆర్ఎస్ అమలు, లోటుపాట్లను సరిదిద్దేందుకు సొసైటీ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారం పాటు పరిశీలన తొలివారం రోజుల పాటు హాజరు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా సాఫ్ట్వేర్లో మరిన్ని మార్పులు చేసే అవకాశముంది. ఎఫ్ఆర్ఎస్ అమలుకు సంబంధించిన పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్దే. దీనికి సంబంధించి రాష్ట్రస్థాయి అధికారులు, మల్టిజోనల్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు, జిల్లా కోఆర్డినేటర్లకు కూడా సొసైటీ కార్యాలయం పలు సూచనలు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా హాజరు ఆధారంగానే గురుకుల నిర్వహణకు సంబంధించిన నిధులను విడుదల చేస్తుంది. ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో కూడా ఒకేసారి ఈ ఎఫ్ఆర్ఎస్ అమలు చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. -
దారుణం.. రూమ్లో ఎవరు లేని టైం చూసి ప్రియుడు..!
అన్నమయ్య జిల్లా: దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఉంటూ బీబీఎం చదువుతున్న ఏపీలోని అన్నమయ్య జిల్లా యువతి దారుణ హత్యకు గురైంది. నగరంలో మాదనాయకనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా బిక్కంవారిపల్లి నివాసులైన రెడ్డప్ప, జగదాంబ దంపతుల కుమార్తె దేవిశ్రీ (21) హతురాలు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈమె గత మూడేళ్లుగా బెంగళూరులోని ప్రముఖ కళాశాలలో బీబీఎం చదువుతూ బంధువుల ఇంట్లో ఉంటోంది. ఆదివారం ఉదయం దేవిశ్రీ... ప్రేమ్వర్ధన్ అనే స్నేహితునితో కలిసి తన స్నేహితురాలి రూంకి వెళ్లింది. అక్కడే ఆమెను ప్రేమ్వర్ధన్ కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు. దేవీశ్రీ పెద్దమ్మ మాట్లాడుతూ ఆదివారం 11 గంటలకు స్నేహితురాలి రూంకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిందని, ఏం జరిగిందో తెలియదని, తమకు న్యాయం చేయాలని విలపించింది. దేవిశ్రీ, ప్రేమవర్ధన్ ప్రేమికులని అనుమానాలున్నాయి. ఎందుకు హత్య చోటుచేసుకుందీ అనేది నిందితుడు దొరికితే గానీ తెలియదని పోలీసులు చెబుతున్నారు. ర్యాగింగ్ చేసేవాడని చెప్పిందిదేవిశ్రీ పెదనాన్న మాట్లాడుతూ కాలేజీలో తనను ఆ యువకుడు ర్యాగింగ్ చేస్తున్నాడని ఆమె చెప్పేదన్నారు. మూడు నెలల క్రితమే తెలిపిందని, కళాశాల వారికి సమాచారమిచ్చినా పట్టించుకోలేదని చెప్పారు. మూడు నెలల్లో కాలేజీ అయిపోతుందని ఇటీవలే చెప్పిందని, అంతలోనే ఘోరం జరిగిందని వాపోయాడు. -
మనస్తాపంలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి హైదరాబాద్ : హబ్సిగూడలో దారుణం జరిగింది. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయని మనస్తాపం చెంది శ్రీవైష్ణవి అనే విద్యార్థిని ఆత్మహాత్య చేసుకుంది. విద్యార్థిని శ్రీ చైతన్య స్కూల్లో పదవతరగతి చదువుతుంది. ప్రమాద ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యార్థి ఆత్మహత్య కేసు: ‘ఆమె’ వివరణే కీలకం కానుందా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 16 ఏళ్ల శౌర్య పటిల్ అనే విద్యార్థి, తన స్కూల్లో టీచర్ల అవమానాలు, ఒత్తిడి కారణంగా మెట్రో స్టేషన్ నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థి మరణానికి దారితీసిన పరిణామాలను వెలుగులోకి తెచ్చే ప్రక్రియలో అతనిని చివరిసారిగా చూసిన దీప్షిక అనే ప్రధాన సాక్షి వివరణ పోలీసు విచారణకు కీలక ఆధారంగా మారింది.ఇ-రిక్షాలో జరిగిన బాధాకర ఘటన45 ఏళ్ల గృహిణి అయిన దీప్షిక తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తన కుమారుడు, మరొక విద్యార్థితో మధ్యాహ్నం 2.15 గంటలకు పాఠశాల వెలుపల ఇ-రిక్షాలో ఎక్కారు. కొద్దిసేపటికి అదే వాహనంలో ఆ విద్యార్థి కూడా వారితో చేరాడు. ప్రారంభం నుండి అతడు తీవ్రంగా ఆందోళనలో ఉన్నట్లుగా కనిపించాడని ఆమె తెలిపింది. ఏడాది పొడవునా హింసించారు: విద్యార్థి వేదనఆ విద్యార్థిని ఎందుకు ఏడుస్తున్నావని తాను అడిగినప్పుడు సదరు విద్యార్థి పాఠశాలలో అవమానాలు, మందలింపులు ఎదురవుతున్నాయని, ఏడాది అంతా ఒత్తిడి చేస్తూ ప్రతి చిన్న తప్పులకు కూడా తన తల్లిదండ్రులను పదేపదే పిలిపించారని వేదనతో చెప్పాడని ఆమె వెల్లడించింది. అందులో ప్రధానంగా నలుగురు ఉపాధ్యాయుల పేర్లు ప్రస్తావిస్తూ వారి వల్లే నేను ఇబ్బందులు పడుతు న్నట్లు తనకు చెప్పినట్లు దీప్షిక అనే మహిళ స్పష్టం చేసింది. తరచుగా పాఠశాలకు వచ్చే క్రమంలో తాను భరించలేని ఒత్తిడికి గురయ్యానని కూడా విద్యార్థి చెప్పినట్లు నివేదికలో ఆమె పేర్కొంది.ఆమె దిగేటప్పుడు విద్యార్థి వద్ద ప్రయాణానికి డబ్బు లేకపోవటంతో రూ.10 ఇచ్చిందని, అతను ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయిన కాసేపటికి ఈ విషాదాంతం వెలుగులోకి వచ్చినట్లు ఆమె తెలిపింది.సూసైడ్ నోట్లో వేధింపుల ఆరోపణలుపోలీసుల చేతిలో ఉన్న విద్యార్థి వ్యక్తిగత నోట్లో ఉపాధ్యాయుల చేత అవమానాలు ఎదుర్కొన్న క్రమాన్ని వెల్లడించాడు.. కొన్ని నెలలుగా తనపై కొనసాగిన వేధింపుల పర్వాన్ని వివరించాడు. అందులో నలుగురు ఉపాధ్యాయుల పేర్లు కూడా రాసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పోలీసు చర్యలు, పాఠశాల స్పందనవిద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనతో ముడిపడినట్లు ఆరోపణులు ఎదుర్కొంటున్ననలుగురు ఉపాధ్యాయులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది స్కూల్ యాజమాన్యం. -
అవమానాన్ని తట్టుకోలేక ఉరేసుకున్నాడు..!
మనుషులు ఇలా కూడా ఉంటారా.. ఇలానే ఉంటారు అనేది కొన్ని సందర్భాల్లో మనకు బోధపడుతూ ఉంటుంది. అవతల వ్యక్తులను బాధపెట్టి, వారు అమితానందాన్ని పొందడం కొంతమందికి అలవాటు. ఒక మనిషిని చచ్చిపోయేంతగా ప్రేరేపించడం అంటే అది మన నైతిక విలువను కోల్పోవడమే. అది ఎంతటి వివాదామైన కావొచ్చు.. మనిషి ఊపిరి తీసుకునేలా ప్రేరేపించడం విలువలు కోల్పోతున్న సమాజానికి నిదర్శనం.మనిషికి ఒక భాష రాకపోతే చచ్చేలా కొట్టి,.. చివరకు చచ్చిపోయేలా ప్రేరేపించిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. హిందీ వర్సెస్ మరాఠీ వివాదం ఎంతో కెరీర్ ఉన్న విద్యార్థి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. అర్నవ్ ఖారే.. వయసు 19 ఏళ్లు. థానేలో ఉంటాడు. ఫస్ట్ ఇయర్ డిగ్రీ సైన్స్ స్టూడెంట్. ప్రతీరోజూ ముంబైలోని ములంద్ ప్రాంతానికి కాలేజ్కి వెళ్తూ వస్తున్నాడు. కాలేజ్కి వెళ్తున్నాడు.. కానీ క్లాస్లకు రెగ్యులర్గా హాజరు కావడం లేదు. ఏదో తెలియని అభద్రతా భావం అతనిలో . అందుకే కాలేజ్లకు డుమ్మూ కొడుతూ వస్తున్నాడు. దీనికి కారణం అవమానం అనే ‘మహమ్మారి. కాలేజ్తో పాటు, తాను రోజూ ప్రయాణించే ట్రైన్లో సైతం అవమానాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. తనకు మరాఠీ రాదనే తోటి, సాటి వారు రోజూ ఎగతాళి చేయడం, టార్చర్ పెట్టడం భరించలేకపోతున్నాడు. ఒక రోజైతే ఆ విద్యార్థిని ట్రైన్లో కొట్టారు,. ‘వీడికి మరాఠీ రాదు’ అంటూ చివరికి చేయి కూడా చేసుకున్నారు పలువురు ప్రబుద్ధులు. దాంతో ములంద్ వెళ్లాల్సిన ఆ యువకుడు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోయాడు. అదే విషయాన్ని తండ్రికి ఫోన్లో చెప్పాడు. ఆపై ఇంటికి వచ్చేసి ఉరేసుకున్నాడు. తండ్రి తన డ్యూటీ ముగించకుని వచ్చేసరికి విగతా జీవిలా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. ఇది తండ్రి జిజేంద్ర ఖైరేకు మనోవేదనను తీసుకొచ్చింది. భాష మాట్లాడలేదని తన కుమారుడిని కొట్టారని, భాష రాకపోవడంతో కాలేజ్లోనే కాకుండా ట్రైన్లోనే అవమానిస్తూ వచ్చారన్నాడు. ఇదే విషయాన్ని తనకు ఫోన్ చేసి చెప్పాడని, ఇంటికొచ్చి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని రోదిస్తున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎవర్నీ అరెస్ట్ చేయలేదు. మహారాష్ట్రలో హిందీ–మరాఠీ భాషా వివాదం కొత్తది కాదు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య. అయితే, 2025 ఏప్రిల్ నుండి ప్రభుత్వం పాఠశాలల్లో మరాఠీని రాష్ట్ర భాషగా తప్పనిసరి చేసి, హిందీని మూడో భాషగా పెట్టిన నిర్ణయం తర్వాత వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చిందిమరాఠీ వర్సెస్ హిందీ వివాదంపై తాజాగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటన ఇది. గత నెలలో విమానంలో ముంబైకి వెళ్తున్న ఒక ప్రయాణికుడు.. మరొక ప్రయాణికుడ్ని మరాఠీలో మాట్లాడమని బలవంతం చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. -
ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య.. తండ్రి సంచలన ఆరోపణలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో టీచర్ల వేధింపులు భరించలేక విద్యార్థి శౌర్య పాటిల్ (16) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్లో విజ్ఞప్తి చేశాడు. దీంతో, హెడ్ మాస్టర్ సహా మరో నలుగురు సిబ్బందిని స్కూల్ యాజమాన్యం విధుల నుంచి తప్పించింది. అయితే, సస్పెన్షన్కు ముందు శౌర్య ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి పాఠశాలలో పరిస్థితులను అంచనా వేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ విద్యా శాఖ అధికారులు తెలిపారు.మరోవైపు.. శౌర్య పాటిల్ తండ్రి ప్రదీప్ పాటిల్ తాజాగా మాట్లాడుతూ..‘నా బిడ్డను టీచర్లే బలి తీసుకున్నారు. వారిని కేవలం సస్పెండ్ చేస్తే సరిపోదు. సస్పెన్షన్ తాత్కాలికం మాత్రమే. ఎఫ్ఐఆర్లో వారి పేర్లను చేర్చి ఉపాధ్యాయులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నా. మరికొద్ది రోజుల్లోనే మా అబ్బాయిని వేరే పాఠశాలకు పంపించేందుకు సిద్ధమయ్యాం. ఈ విషయాన్ని శౌర్యకు కూడా చెప్పడంతో సరే అన్నాడు. కానీ, పాఠశాల నుంచి మేము వెళ్లిపోతున్నామనే కారణంతో టీచర్లు ఇలా వేధింపులకు గురి చేశారు. వారి వేధింపుల కారణంగా కలత చెంది ఇలా చనిపోయాడు. ఇకపై పిల్లలతో ఏ ఉపాధ్యాయుడు అలా ప్రవర్తించకూడదనే సందేశాన్ని మనం పంపాలి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని సెయింట్ కొలంబాస్ పాఠశాలలో టీచర్ల వేధింపులు భరించలేక మెట్రో స్టేషన్ నుంచి దూకి పదో తరగతి విద్యార్థి శౌర్య పాటిల్(16) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా తన సూసైడ్ నోట్లో.. ‘అమ్మా నన్ను క్షమించు. స్కూల్ సిబ్బంది వేధింపులకే నేనీ పని చేస్తున్నా. మరణించాక నా అవయవాలు ఏమైనా పనికి వస్తే వాటిని అవసరమైన వారికి అమర్చండి. అమ్మా.. నీ హృదయాన్ని చాలాసార్లు బాధపెట్టా. ఇప్పుడు ఆఖరిసారిగా చేస్తున్నా’ అంటూ పేర్కొన్నాడు.ఇక, విద్యార్థి ఆత్మహత్యపై రాజేంద్ర నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో భాగంగా పోలీసులు.. సదరు విద్యార్థి స్నేహితులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకుల నుండి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. కాగా, విద్యార్థి ఆత్మహత్య ఘటన దేశ రాజధానిలో చర్చనీయాంశంగా మారింది. -
ఏయూ హాస్టళ్లలో వికృత చేష్టలు
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వరుస వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సమయంలో వరుస పరిణామాలు ఏయూ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ప్రధానంగా ఏయూ వసతి గృహాల్లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు హాస్టళ్లలో భోజనం, సదుపాయాలపై విద్యార్థులు రోడ్డెక్కారు. తాజాగా విదేశీ విద్యార్థిని మద్యం తాగాలని సహచర విద్యార్థులు బలవంతం చేయడం వంటి వికృత చేష్టలు బయటపడ్డాయి. దీనిపై బంగ్లాదేశ్కు చెందిన సదరు విద్యార్థి ఏకంగా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సమక్షంలో ఫిర్యాదు చేస్తే గాని అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. హాస్టళ్లపై పర్యవేక్షణ లోపం ఏయూలో 40కిపైగా వసతి గృహాలు ఉన్నాయి. వీటిపై ఏయూ అధికారుల పర్యవేక్షణ లోపం ప్రతీసారి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. హాస్టళ్లలో కనీస సదుపాయాలు, విద్యార్థులకు సరైన భోజనాల విషయంలో కూడా అధికారులు దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. పురుగుల భోజనాలు, నీళ్ల సాంబారు, ఉడకని అన్నం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. హాస్టళ్లలో భోజనాలు బాగోలేవని విద్యార్థులు ఇటీవల ఏయూ వీసీ చాంబర్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో నేరుగా వీసీ వచ్చి వారికి సరి్ధచెప్పాల్సి వచ్చింది. అలాగే మహిళా ఇంజనీరింగ్ హాస్టల్లో నీటి, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. శాతవాహన హాస్టల్ విద్యార్థికి ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో కూడా ఆక్సిజన్ పెట్టేవారు లేక మరణించాడంటూ మరోసారి విద్యార్థులు రోడ్డెక్కారు. ఇలా ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు హాస్టల్స్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. వసతి గృహాల్లో మద్యం కలకలం ఏయూ వసతి గృహాల్లో మద్యం వార్తలు కలకలం రేపుతున్నాయి. బంగ్లాదేశ్ విద్యార్థిని మద్యం తాగాలని బలవంతం చేయడం, తాగనందుకు దాడి చేసిన వ్యవహారం ఏయూలో హాట్ టాపిక్గా మారింది. సదరు విద్యార్థి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో మంగళవారం ఏయూలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్ హరేందిరప్రసాద్, కమిషనర్ శంఖబ్రత బాగి్చల సమక్షంలోనే ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. గతంలో కూడా శాతవాహన హాస్టల్లో మద్యం మత్తులో విద్యార్థులు కొట్లాటకు దిగిన సందర్భాలు ఉన్నాయి. హాస్టళ్లలో పరిస్థితులపై విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ.. వార్డెన్లు గానీ, ఏయూ అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో కొంత మంది మరింత పెచ్చు మీరుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.ప్రత్యేక కమిటీ ఎక్కడ? ఏయూ వసతి గృహాల్లో బయటి వ్యక్తులు లేకుండా, డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల ఆనవాళ్లు రాకుండా, ర్యాంగింగ్ ఫ్రీ క్యాంపస్గా తీర్చిదిద్దేందుకు ఏయూ పాలకులు గతంలో పది మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వర్సిటీలో ఉన్న అన్ని వసతి గృహాల్లో నిత్యం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఆ సమయంలో కొన్ని హాస్టళ్లలో నాన్ బోర్డర్స్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే మత్తు పదార్థాలు యూనివర్సిటీలోకి వస్తున్నట్లు తెలుసుకున్నారు. వాటికి చెక్ పెట్టేందుకు కళాశాలల ప్రిన్సిపాళ్లు, హాస్టల్స్ వార్డెన్లతో కలిపిన బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ బృందం ఏమైందన్నది ఎవరికీ తెలియడం లేదు. ఇటీవల కాలంలో హాస్టళ్లలో తనిఖీలు తగ్గిపోయాయి. ఒకటి, రెండు చోట్ల సందర్శనలు చేసి మమ అనిపించేస్తున్నారు. దీంతో కొన్ని హాస్టళ్లలో కొందరు విద్యార్థులు శృతిమించుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
డ్యాన్స్ ఇరగదీసిన బుడ్డోడు
-
వంద గుంజీలు.. చిన్నారి మృతి
పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్ పరిధిలో గల వాసాయిలో జరిగిన ఒక ఘటన పలువురిలో ఆందోళనను నింపింది. పాఠశాలకు కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చిందనే నెపంతో 12 ఏళ్ల ఆరో తరగతి విద్యార్థిని కాజల్ గోండ్కు ఉపాధ్యాయుడు కఠినమైన శిక్ష విధించారు. భుజాలపై స్కూల్ బ్యాగు ఉంచుకుని, ఏకబిగిన వంద గుంజీలు తీయాలంటూ ఆదేశించాడు.పాఠశాల తరగతులు ముగిసి, ఇంటికి చేరుకున్న కాజల్ తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. వెంటనే తల్లిదండ్రులు ఆ చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచనమేరకు ఆ చిన్నారిని ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. కాజల్ తల్లి షీలా గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..ఉపాధ్యాయులు విధించిన శిక్ష కారణంగా కాజల్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పింది. తనలాగే మరికొందరు పిల్లలు కూడా 50 నుండి 100 గుంజీలు తీసినట్లు కాజల్ తెలిపింది. రెండుమూడు నిమిషాల ఆలస్యం అయిన కారణంగా టీచర్ తమ కూతురికి కఠిన శిక్ష విధించారని, అప్పటి నుంచి ఆమెకు అనారోగ్య సమస్యలు పెరిగాయని ఆ తల్లి కన్నీటితో మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది.ఈ సంఘటనపై ముంబైలోని సర్ జెజె మార్గ్ పోలీస్ స్టేషన్లో తొలుత ప్రమాదవశాత్తూ సంభవించిన మృతిగా (Accidental Death) కేసు నమోదైంది. తరువాత ఈ కేసు వాలివ్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యింది. పాఠశాలలో విధించిన అమానుష శిక్ష కారణంగానే తమ కుమార్తె మరణించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జేజే ఆస్పత్రి వైద్యులు కాజల్ కుటుంబ సభ్యులకు తెలిపిన వివరాల ప్రకారం.. కాజల్కు ఆస్తమా సమస్య ఉంది. ఇలాంటి పరిస్థితిలో, అదనపు బరువున్న బ్యాగును మోస్తూ, అధిక సంఖ్యలో గుంజీలు తీసిన కారణంగా ఆమె అంతర్గత రక్తస్రావానికి గురైంది. అది ఆ చిన్నారి మరణానికి దారితీసింది. పాఠశాలల్లో పిల్లలపై కఠిన శిక్షలు విధించడానికి ఉదాహరణగా నిలిచిన ఈ ఘటన మరోసారి కలకలం రేపింది.ఇది కూడా చదవండి: పెళ్లి బృందంపై కారు విధ్వంసం.. నలుగురు మృతి -
22 మంది బాలికలకు అస్వస్థత
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ప్రమాదఘంటికలు మోగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇప్పటికే గతనెలలో పార్వతీపురం జిల్లా కురుపాం ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు గురై ఇద్దరు బాలికలు మరణించారు. 120 మంది అస్వస్థతకు గురయ్యారు. అయినా ప్రభుత్వంలో మార్పు రాలేదు. ఆశ్రమ పాఠశాలల్లో వసతులు మెరుగు పరచడం లేదు. ఫలితంగా తాజాగా అల్లూరి జిల్లా రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 22 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు.మిగిలిన వారు రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 8వ తరగతి విద్యార్థులు కీర్తి ప్రసస్న, హాసినిలకు తొలుత జ్వరంతోపాటు విరేచనాలు కావడంతో నర్సీపట్నానికి తరలించారు. అక్కడి నుంచి కేజీహెచ్కు తరలించారు. ఆదివారం ఉదయం నుంచి పాఠశాలకు చెందిన మరో 20 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వారంతా తీవ్ర జ్వరంతోపాటు రక్త విరేచనాలతో బాధపడ్డారు. ఇంత మంది బాలికలు ఒక్కసారే అనారోగ్యానికి గురికావడంతో కలెక్టర్ దినేష్కుమార్ వైద్యం అందించాలని ఆదేశాలిచ్చారు.దీంతో రాజేంద్రపాలెం పీహెచ్సీలో వైద్యురాలు స్నేహలతరెడ్డి చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం గుమ్మడి కాయ కూర, రాత్రి బంగాళదుంపల కూరతో బాలికలు భోజనం తిన్నారు. అస్వస్థతకు కారణాలు ఏమిటన్నది పూర్తిగా తెలియడం లేదు. ఆదివారం అనారోగ్యంతో భారవి,శ్రీవల్లి, గంగాభవాని, హాసిని, ప్రసన్న, పద్మ, అచ్యుత, నాలుగో తరగతికి చెందిన సునీత, హేమ, దివ్య, బంగారం, నాగమణి, రాజేశ్వరి, వి.పూజ, ఆమని, డి.లలిత, జి.మీనాక్షి భారత, కృష్ణవేణి పీహెచ్సీలో చేరారు. వీరిలో 15 మందికి విరేచనాలయ్యాయి.మిగిలిన వారికి జ్వరం రావడంతో చికిత్స చేస్తున్నారు. బాలికల ఆశ్రమ పాఠశాలలో 300 మంది విద్యార్థులున్నారు. ఒకవేళ ఆహారం కలుషితమైతే వీలైనంత ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉంది. వైద్యులు స్నేహలతరెడ్డి మాట్లాడుతూ కలుషిత నీటి వల్ల అనారోగ్యంపాలై ఉండవచ్చన్నారు. పీహెచ్సీలో చాలని బెడ్లురాజేంద్రపాలెం పీహెచ్సీలో చికిత్స పొందుతున్న చిన్నారులకు బెడ్లు చాలలేదు. దీంతో ఒక్కో బెడ్పై ఇద్దరు బాలికలకు చికిత్స అందిస్తున్నారు. ఒక బెడ్పై మాత్రం ముగ్గురు బాలికలను పడుకోబట్టి చికిత్స చేస్తున్నారు. -
నా కొడుకును కొట్టి చంపేశారు!
శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల: ట్రిపుల్ ఐటీ విద్యార్థి మరణంతో ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎంపురంలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రాంగణంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సుమారు మూడు వేల మంది విద్యార్థుల ధర్నాలు, నినాదాలతో హోరెత్తింది. తోటి విద్యార్థి సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో ఇన్నాళ్లు వారిలో దాగి ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ మంచి విద్యార్థిని అన్యాయంగా చంపేశారనే భావన వారిని తీవ్రంగా కలచివేసింది. దీంతో కొన్నేళ్లుగా కళాశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు చేస్తున్న ఆగడాలు బట్టబయలవ్వడమే కాక కళాశాలలో ఇన్నాళ్లు గుట్టుగా జరుగుతున్న అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏమీ తెలియదట.. విద్యార్థి సృజన్ను రాత్రంగా సీనియర్లు కొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నా.. మరుసటి రోజు ఉదయం సృజన్ ఆత్మహత్య చేసుకున్నా అంబులెన్సు వస్తే గానీ తనకు తెలియదని క్యాంపస్ డైరెక్టర్ చెప్పడం అక్కడి యాజమాన్య నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. గతంలోనూ ఆత్మహత్య ఘటనలు జరగడంతో పోలీసుల సాయంతో ఈ సారి కూడా గొడవను సద్దుమణిగేలా చేద్దామని యాజమాన్యం తీవ్రంగా ప్రయతి్నంచింది. కానీ విద్యార్థుల ఆగ్రహం, ఆందోళనల ముందు ఇటు పోలీసులు, అటు కళాశాల యాజమాన్యం తలొగ్గక తప్పలేదు. కుటుంబసభ్యులు, విద్యార్థులు ఆ రాత్రి కొట్టింది తొమ్మిది మంది అని చెప్పినప్పటికీ పోలీసులు ఎట్టకేలకు 8 మందిని అదుపులోకి తీసుకోవడంతో కాస్త శాంతించి వెనుదిరిగారు. బుధవారం రాత్రే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించినా.. శుక్రవారం విద్యార్థులు, సృజన్ కుటుంబీకుల ఆందోళనలు సద్దుమణిగాకే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు ఘటనకు బాధ్యులైన ఎనిమిది మంది విద్యార్థులు వై.అమిత్, ఎస్కే అనీష్ అహ్మద్, బి.అభిష్క్, జె.చిన్నబాబు, షేక్ అజీల్, ఎస్కే మస్తాన్, ఎస్కే సమీర్, ఎ.భానుప్రకాష్లను సస్పెండ్ చేశారు. తప్పుడు ప్రచారంపై మండిపాటు.. యాజమాన్యం పూర్తి నిర్లక్ష్య ధోరణి కనిపించడం.. మీడియా ముందు వాస్తవాలు చెప్పేందుకు కూడా ఆంక్షలు పెట్టడంతో విద్యార్థులు తట్టుకోలేకపోయారు. దీనికితోడు ‘సృజన్ బ్యాక్లాగ్స్ ఉంచేశాడు.. కళాశాలలో ఉన్న అమ్మాయితో చెడుగా ప్రవర్తించాడు.. అమ్మాయి సోదరుడు ఒక్కరే రెండు చెంపదెబ్బలు కొట్టాడు..’ వంటి తప్పుడు వదంతులు సృష్టించారంటూ మండిపడ్డారు. ఉదయం నుంచే ధర్నా.. సృజన్ తల్లిదండ్రులు, కుటుంబీకులు గురువారం ఉదయం 6 గంటలకు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పక ముందే డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ ఎం.అవతారం, ఎస్ఐ వి.సందీప్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో విద్యార్థులు రెండు బృందాలుగా విడిపోయి ధర్నాకు దిగారు. తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని సృజన్ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ లోగా కళాశాల యాజమాన్యం సమక్షంలో సృజన్ తల్లిదండ్రులతో డీస్పీ వివేకానంద, సీఐ అవతారంలు చర్చించారు. విద్యార్థుల ఆందోళనను విరమించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకోవడం, సృజన్ తల్లిదండ్రులు సైతం విజ్ఞప్తి చేయడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.అవన్నీ అబద్ధాలే.. సృజన్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. బ్యాక్లాగ్స్ ఉంచేశాడని, మంచివాడు కాడని, చదువు వల్ల చనిపోయాడన్నది నిజం కాదు. సీనియర్స్ దాడి చేశారన్నది నిజం. ముందు రోజు సృజన్పై దాడి ఎవరికీ తెలియదు. ఆత్మహత్య చేసుకున్నాక తప్పుగా పోలీసులకు వెళ్లింది. 11వ తేదీ రాత్రి 11 నుంచి 3 గంటల వరకు సీనియర్లు 9 మంది కొట్టి వేధించారు. తెల్లవారేసరికి అంతా పరీక్షలకు వెళ్లాం. సృజన్ రాలేదు. వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సృజన్ జూనియర్ విద్యారి్థనిని చెల్లి అని పిలుస్తాడు. అదే భావంతో ఉంటాడు. నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యారి్థని కజిన్కు ఈ విషయం నచ్చేది కాది. సృజన్ను హెచ్చరించాడు కూడా. అయినప్పటికీ సృజన్ చనిపోయే ముందు అమ్మాయి పిలిచి మాట్లాడటం వేరే వాళ్ల ద్వారా వారికి తెలిసింది. అందుకే ఇలా జరిగింది. – సృజన్ క్లాస్మేట్స్ ఏం ప్రయోజనం.. ఎంతమంది ధర్నాలు చేస్తే ఏంటి.? ఎంతమంది పోలీసులు వస్తే ఏంటి..? చెట్టంత కొడుకుపోయాడు. – జ్యోతి, సృజన్ తల్లి చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు.. మా మేనల్లుడు సృజన్ కుర్చీ వేసుకుని ఫ్యాన్కు ఉరేసుకున్నాడన్నారు. అది నిజం కాదు. వాడి ఎత్తు 5.9 అడుగులు. ఫ్యాన్ కూడా అందేస్తుంది. రాత్రి 11 నుంచి 3 వరకు హింసించి, కొట్టి చంపేశారు. అలా తెచ్చి ఫ్యాన్కు ఉరేసినట్లు కట్టారు. – చుక్కా శంకరరావు, మేనమామ కొట్టి చంపేశారు... నేను ఆటోడ్రైవర్ను. ఇంటర్ నుంచి ఇదే కళాశాలలో సృజన్ను చదివిస్తున్నాను. కుమారుడిని అన్యాయంగా కొట్టి చంపేశారు. కొట్టినవారిలో ఐదారుసార్లు డిబార్ అయినవారు కూడా ఉన్నారు. మీ సృజన్ అటువంటి వాడు కాదని, కావాలనే చెడు వ్యక్తిగా చిత్రీకరించారని 2వేల మందికి పైగా విద్యార్థులు అంటున్నారంటే మావాడు ఏమీ తప్పు చేయలేదని గ్రహించాలి. పోలీసులు న్యాయం చేయాలి. – శివకృష్ణ ప్రసాద్, సృజన్ తండ్రి -
హాస్టల్ విద్యార్థిని బ్యాగ్లో ప్రెగ్నెన్సీ కిట్, మంగళసూత్రం
గుంటూరు జిల్లా: నగరం నడిబొడ్డున ఉన్న పరివర్తన భవన్ (ఎస్సీ వెల్ఫేర్ కాలేజీ బాలికల హాస్టల్)లో ఓ విద్యార్థిని బ్యాగ్లో ప్రెగ్నెన్సీ కిట్, మంగళసూత్రం, మెట్టెలు ఉన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంక్షేమ హాస్టల్స్లో ఉండే విద్యార్థినుల బ్యాగులు చెక్ చేసే క్రమంలో వారం రోజుల కిందట పరివర్తన భవన్లోని ఓ విద్యార్థిని బ్యాగులో ఇవి బయటపడ్డాయి. వెంటనే సిబ్బంది వార్డెన్కి చెప్పగా, వార్డెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. బయటకు పొక్కడంతో బుధవారం రాత్రి సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ లావణ్యవేణి హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో అపరిశుభ్ర వాతావరణం చూసి నివ్వెరపోయారు. 2గంటలకుపైగా ప్రతి గదిని తనిఖీ చేశారు. ముగ్గురు వార్డెన్లు ఉన్నప్పటికీ హాస్టల్ను ఈ విధంగా గాలికి వదిలేస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో మళ్లీ వస్తానని హెచ్చరించి, అక్కడి నుంచి వెళ్లినట్లు సమాచారం. విద్యారి్థని బ్యాగ్లో దొరికిన ప్రెగ్నెన్సీ కిట్ వ్యవహారంపై ఏఎస్డబ్ల్యూఓ శైలజను వివరణ కోరగా అటువంటి ఘటనలు గాని, ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన ఏఎస్డబ్ల్యూఓ(అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్), హాస్టల్ వార్డెన్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆ శాఖ డీడీ(డిప్యూటీ డైరెక్టర్)ను ఆదేశించినట్లు తెలుస్తోంది. నెలకిందట ఇదే హాస్టల్కు చెందిన ఓ విద్యార్థినిని ఓ ఆకతాయి హైదరాబాద్కు తీసుకువెళ్లాడు. 3 రోజులపాటు పోలీసులు శ్రమించి ఆ విద్యార్థినిని హాస్టల్ అధికారులకు అప్పగించారు. ఈ విషయంలో విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు వచ్చి అధికారులపై మండిపడ్డారు. గతేడాది డిసెంబర్లో ఇదే పరివర్తన భవన్లో ఓ విద్యార్థిని ప్రసవించిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అప్పటి వార్డెన్ను సస్పెండ్ చేశారు. హాస్టల్ నిర్వహణపై పాలకులు, అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చెప్పేందుకు ఈ వరుస ఘటనలే నిదర్శనం. -
సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల : జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో బుధవారం ఉదయం ప్రత్తిపాటి సృజన్ (21) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యార్థి మృతిపై స్థానికంగా విభిన్న కథనాలు వినిపిస్తుండగా పోలీసులు మాత్రం తల్లిదండ్రులు వస్తే కానీ ఏమీ చెప్పలేమని, ప్రస్తుతం విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన సృజన్ ఎచ్చెర్ల ఎస్ఎంపురం సమీపంలోని ట్రిపుల్ ఐటీ ఇంజినీర్ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులందరితో సరదాగా ఉండే సృజన్ బుధవారం ఉదయం11 గంటలకు కళాశాలలోనే నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంది. ఈలోగా మొదటి అంతస్తులో ఉన్న ఈసీ డిపార్ట్మెంట్ విద్యార్థుల్లో ఒకరికి ఫోన్ చేసి రూంలో ఎవరైనా ఉన్నారా అని సృజన్ అడిగాడు. ఎవరూ లేరని చెప్పడంతో గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఎగ్జామ్ నుంచి వచ్చాక గది తలుపులు మూసి ఉండటంతో వెంటిలేటర్ నుంచి గమనించిన విద్యార్థులు ఏదో జరిగిందని అనుకుంటుండగా మెస్ ఆఫీసర్ రావడం.. అంతా చూసేసరికి ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించడంతో అవాక్కయ్యారు. వెంటనే కళాశాల యాజమాన్యం గుంటూరులో ఉన్న సృజన్ తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు హుటాహుటిన బయల్దేరారు. ఎస్ఐ వి. సందీప్ తమ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. విభిన్న కథనాలెన్నో.. కాగా సృజన్ ఆత్మహత్యపై అక్కడ విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. బ్యాక్లాగ్స్ 11 సబ్జెక్టులు ఉండటంతో ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని కొందరు అనుకుంటుండగా.. ఓ అమ్మాయితో స్నేహంగా ఉండటం.. ఆమె అన్నదమ్ములు అదే కళాశాలలో చదువుతుండటం.. వారు ఒకట్రెండు సార్లు సృజన్ను హెచ్చరించడం చేశారని తెలిసింది. అంతేకాక మంగళవారం రాత్రి పది మందివరకు కళాశాలలో ప్రవేశించారని, వారి వెనుక ఆ విద్యార్థులున్నారని, సృజన్ను కొట్టారని సమాచారం. ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తల్లిదండ్రులు వచ్చేంతవరకు ఏమీ చెప్పలేమన్నారు. ఐదుగురితో పోలీస్ పికెట్ మృతిచెందిన విద్యార్థి దళిత సామాజికవర్గానికి చెందడంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నలుగురు కానిస్టేబుళ్లు, ఒక ఎస్ఐతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
స్కూల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా కడప శివారులోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు రింగురోడ్డు సర్కిల్ వద్ద ఉన్న ఓ ప్రయివేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కె.జస్వంతి (14) సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండూరు మండలం పాలూరు గ్రామానికి చెందిన కె.రవిశంకరరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల పెద్దకుమార్తె జస్వంతి ఓ ప్రయివేట్ స్కూల్ హాస్టల్లో ఉంటోంది. ఉదయం 6.40 గంటల సమయంలో జస్వంతి తాను ఉంటున్న గదికి గడియ వేసుకుంది. అదే గదిలో ఉంటున్న మరో విద్యార్థిని పాలు తాగేందుకు మెస్ వద్దకు వెళ్లి 6.55 గంటల సమయంలో రూం వద్దకు వచ్చి కిటికీలోంచి చూడగా చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది గది తలుపుల్ని పగులగొట్టి లోనికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న జస్వంతిని కడప నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. దీంతో రిమ్స్ ఆస్పత్రికి విద్యారి్థని మృతదేహాన్ని తరలించారు. యాజమాన్యం తీరుపై మండిపడ్డ డీఈవో విద్యార్థిని జస్వంతి మృతి చెందిన విషయం తెలిసి విచారణ నిమిత్తం జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ పాఠశాలకు రాగా.. సిబ్బంది పాఠశాల తాళాలు తెరవలేదు. అరగంటకు పైగా వేచి డీఈవో వేచి ఉండాల్సిన పరిస్థితి కల్పించారు. దీంతో ఆయన పాఠశాల ప్రిన్సిపాల్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం డీఈఓ వచి్చనా స్పందించరా, మీ తీరు ఏమిటో దీనిని బట్టి అర్థమవుతోంది అని మండిపడ్డారు. డీఈవో వెంట మండల విద్యాధికారులు సుబ్బరాయుడు, రమాదేవి ఉన్నారు.ఏం జరిగిందో చెప్పని పాఠశాల యాజమాన్యం ఉదయం 7.55 గంటల సమయంలో విద్యార్థిని కళ్లు తిరిగి కిందపడిపోయినట్టు ఆమె తండ్రి రవిశంకర్రెడ్డికి స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్చేసి చెప్పారు. బాలిక తల్లిదండ్రులు రిమ్స్ మార్చురీ వద్దకు చేరుకోగా.. బిడ్డ మృతి చెందిందని చెప్పడంతో తీవ్రంగా రోదించారు. సుమారు రెండు గంటలు పైగా మార్చురీ వద్ద వేచి ఉన్నప్పటికీ పాఠశాల యాజమాన్యం బిడ్డ ఎలా మృతి చెందిందనే విషయం చెప్పలేదని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన చెందారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా నినాదాలు చేస్తూ బాలిక మృతదేహంతో పాఠశాలకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ వద్దకు చేరుకుని వాహనాలను రహదారికి అడ్డుగా ఉంచి అడ్డుకున్నారు. దీంతో బాలిక బంధువులు, పోలీసుల మధ్య దాదాపు గంటసేపు వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. చివరకు పోలీసులు పోస్టుమార్టం జరిగితేనే వాస్తవాలు తెలుస్తాయని విద్యార్థిని బంధువులకు నచ్చజెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
అమ్మా.. భయమేస్తోందే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్, జేఈఈ పరీక్షల తేదీలు ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. చాలా మందిలో పరీక్షల భయం కనిపిస్తోంది. ‘మమ్మీ.. భయమేస్తోందే..’అంటూ ఇంటర్ హాస్టల్ విద్యార్థులు తల్లులకు ఫోన్లు చేసి వాపోతున్నారు. జిల్లా ఇంటర్ అధికారులు ఈ విషయాన్ని ఇటీవల బోర్డు ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాలేజీల్లో ఒక్కసారిగా బోధన సమయం పెరగడం.. అంతర్గత పరీక్షలు ఎక్కువ నిర్వహించాలనే ఆలోచన విద్యార్థుల భయానికి కారణంగా పేర్కొంటున్నారు.దీనికితోడు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. బోధన సమయాన్ని ఎక్కువ చేశాయి. ఇంటర్ సిలబస్తోపాటు జేఈఈ, ఈఏపీసెట్, నీట్ వంటి పరీక్షల శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. రోజువారీ, వారాంతపు, నెలవారీ అంతర్గత పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వాటిల్లో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులను సెక్షన్ల వారీగా విడగొడుతున్నాయి. ఇవన్నీ విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అధికారులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.8 లక్షల మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. వారిలో సుమారు 90 వేల మందే ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదువుతున్నారు. మిగతా వారంతా ప్రైవేటు కాలేజీల్లోనే చదువుతున్నారు. ఇక ఇంటికి పంపలేం పరీక్షలయ్యే వరకు విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఇంటికి పంపలేమని ప్రైవేటు కాలేజీలు తల్లిదండ్రులకు తేల్చిచెబుతున్నాయి. ‘మీ వాడు మేథ్స్లో వీక్గా ఉన్నాడు. సెక్షన్ మారుస్తున్నాం’అని చెప్పే కాలేజీలూ ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. ‘చదవడం లేదా?.. ఇలా అయితే ఎలా’అంటూ నిలదీస్తున్నారు. ఒక్కసారిగా కట్టడి చేయడం, కఠిన నిబంధనలు పెట్టడంతో విద్యార్థులు భయపడుతున్నారు.ప్రైవేటు హాస్టళ్లలో సమయ పాలన మార్చారు. ఉదయం 4 గంటలకే లేపడం, రాత్రి 11 గంటల వరకూ స్టడీ అవర్స్ పేరుతో కూర్చోబెట్టడం విద్యార్థులకు కొత్తగా ఉంది. ఇప్పటివరకు క్లాస్ రూంలో చెప్పిన పాఠాలకు భిన్నంగా షార్ట్కట్ పేరుతో బోధన చేయడం కూడా కొత్తగా ఉందని ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి శశాంక్ పేర్కొన్నాడు. చాలాచోట్ల భోజనం చేసేందుకు తగిన సమయం కూడా ఇవ్వడం లేదు. ఆటలు పూర్తిగా రద్దు చేశారు. పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్కే పరిమితం చేశారు. ఇంటికి ఫోన్ చేసేందుకూ అవకాశం ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీలు ఆదివారం మాత్రమే తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాయి. ఆ చాప్టర్లంటే వణికి పోతున్నారు కొన్ని చాప్టర్లు ఎంత చదివినా విద్యార్థులకు బోధపడటం లేదు. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అకడమిక్గానే ఇప్పటివరకు చదివినట్టు విద్యార్థులు చెబుతున్నారు. జాతీయ పోటీపరీక్షల కోసం భిన్నంగా చెబుతున్నారని వారు అంటున్నారు. గతంలో చదివింది ఇప్పుడు చదివే దానికి పొంతనే ఉండటం లేదంటున్నారు. మేథ్స్లో మ్యాట్రిక్స్ అండ్ డిటరి్మనేట్స్లో ఎడ్జాయింట్, ఇన్వర్స్, ప్రాపర్టీస్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో కొత్త విధానం ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాల్సి వస్తోందని ఇంటర్ విద్యార్థి సందీప్ చెప్పాడు. ప్రాబబులిటీ డిస్ట్రిబ్యూషన్స్లో నార్మల్ చాప్టర్స్ను ఇప్పుడు సుదీర్ఘంగా చేయాల్సి వస్తోందంటున్నారు.సర్కిల్స్, పారా»ొలా, ఎల్లిప్స్, హైపర్బోలా, వెక్టర్ ఆల్జీబ్రాలో స్కాలర్ ప్రొడక్ట్, వెక్టర్ ప్రొడక్ట్ వంటివి సాధారణ సెక్షన్లో ఉండే విద్యార్థులకు అంతుబట్టడం లేదు. ఒక్కసారిగా వాటిని భిన్నమైన రీతిలో బోధించడమే అందుకు కారణమని విద్యార్థులు చెబుతున్నారు. ఫిజిక్స్లో ఎలక్రి్టక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆల్టర్నేటింగ్ కరెంట్ వంటి చాప్టర్లలో కొత్త అంశాలను జాతీయ పరీక్షల కోసం అధ్యాపకులు చెబుతున్నారు. వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయంటున్నారు. కెమెస్ట్రీలోనూ సెల్ పొటెన్షియల్స్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, మెకానిజం బేస్డ్ రియాక్షన్స్ను పాఠ్యపుస్తకంలో లేని కొత్త అంశాలతో పరీక్షల కోణంలో చెప్పడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఒత్తిడికి తాళలేక ఆత్మహత్యలు.. కొన్నేళ్లుగా ఇంటర్ విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా అనేక మంది బలవన్మరణాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. బోధన సమయంలో ఒత్తిడి, ఫలితాలు తారుమారు కావడం, జాతీయ స్థాయిలో ర్యాంకులు వారిని కుంగదీస్తున్నాయి. 2019లో 22 మంది, 2022లో 543 మంది, 2024లో ఏడుగురు, 2025లో ముగ్గురు విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాగా, ఈ పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెడతామని.. ఒత్తిడి పెంచుతున్న కాలేజీల వివరాలు సేకరించాలని జిల్లా ఇంటర్ అధికారులను ఆదేశించినట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించేలా బోధించాలని కాలేజీల యాజమాన్యాలు మాకు తేల్చిచెబుతున్నాయి. దీంతో విద్యార్థులపై మేం ఒత్తిడి పెంచక తప్పడం లేదు. కానీ దీనివల్ల దుష్ఫలితాలు ఎదురుకావచ్చు. – రణదీప్ పల్లవ్, ఇంటర్ అధ్యాపకుడు ర్యాంకుల ఆందోళనలో విద్యార్థులు నెల రోజుల వ్యవధిలో 10 మంది ఇంటర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చా. మాకు ర్యాంకులు వస్తాయా? మేం ఏం చదవాలనే ఆందోళన వారిలో కనిపించింది. – సరితా వినీత్, మానసిక వైద్యురాలు -
టెక్సాస్లో కారంచేడు యువతి మృతి
బాపట్ల జిల్లా: ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. తన డిగ్రీ పూర్తిచేసి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. ఇంతలోనే మృత్యువు కబళించింది. ఛాతీలో నొప్పి, దగ్గు ఉన్నా పెద్దగా లెక్కచేయలేదు. దీంతో.. ఎప్పటిలాగే పడుకున్న ఆమె మరుసటి రోజు లేవలేదు. స్నేహితులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం అమెరికాలోని టెక్సాస్లో చోటుచేసుకుంది. వివరాలివీ..బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబానికి చెందిన యార్లగడ్డ రామకృష్ణ, వీణాకుమారిలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తె యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) ఇంజినీరింగ్ అయిన తరువాత ఎంఎస్ చేసేందుకు అప్పులుచేసి కుమార్తెను అమెరికాకు పంపించారు. తను కూడా ఎంతో కష్టపడి చదివి మాస్టర్స్ డిగ్రీ పొందింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఆమెకు రెండు, మూడ్రోజులుగా దగ్గు, ఛాతీలో నొప్పి వచి్చనా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆమె శుక్రవారం నిద్రలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. రాజ్యలక్ష్మి మృతి తల్లిదండ్రులతో పాటు, స్థానికులను కూడా కలచివేసింది. ఆమె మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతో కష్టపడి తనను మంచి స్థాయిలో చూడాలని ఆశపడిన తల్లిదండ్రుల కల నెరవేర్చకుండానే తనువు చాలించిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. -
ప్రేమ పేరుతో విద్యార్థినిపై అధ్యాపకుడి వేధింపులు
నర్సీపట్నం : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థినిపై గెస్ట్ లెక్చరర్ వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. ఈ కళాశాలలో రెండేళ్లుగా మండల కేంద్రమైన గొలుగొండకు చెందిన కోనా నారాయణరావు గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తూ జనసేన పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. పార్టీ పదవి కోసం ఈయన పేరును ఇటీవల స్థానిక నాయకత్వం సిఫారసు కూడా చేసినట్లు తెలిసింది. అయితే, ఇటీవలే డిగ్రీ ఫస్టియర్లో చేరిన ఓ విద్యార్థినిని నారాయణరావు ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. నిజానికి.. వివాహితుడైన నారాయణరావుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.తాను గతంలో ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని, ఆమె అచ్చు నీలాగే ఉంటుందని అతను ఆ విద్యార్థినికి చెప్పుకొచ్చాడు. నువ్వు అంగీకరిస్తే నిన్ను చదివించి అన్ని విధాలా చూసుకుంటానంటూ లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ విద్యార్థిని ఈ విషయాన్ని సహచర విద్యార్థులకు చెప్పింది. ఈ విషయం విద్యార్థి సంఘాల నాయకుల వరకు వెళ్లడంతో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగి కళాశాల ముందు బైఠాయించారు. ఆ అధ్యాపకుడిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అంతవరకు తరగతులకు హాజరుకాబోమని భీష్మించారు.భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని ప్రిన్సిపాల్ ఎస్.రాజు, ఇతర అధ్యాపకులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తప్పును సరిదిద్దేందుకు అవకాశం ఇవ్వాలని విద్యార్థినులను కోరారు. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. దీంతో చేసేదిలేక ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది నారాయణరావుతో రాజీనామా చేయించారు. నారాయణరావు గతంలో యలమంచిలి, అరకులలో కూడా పనిచేశాడు. అక్కడ కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నట్లు తెలిసింది. -
కోనసీమ జిల్లాలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
కోనసీమ జిల్లా: పట్టణంలో ఒక ప్రయివేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సూర్యనగర్కు చెందిన చిర్రా రంజిత(11)పట్టణంలోని ఒక ప్రయివేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. మంగళవారం యథావిధిగా స్కూల్కు వెళ్లిన రంజిత సాయంత్రం సమయంలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి ఇంటి వద్ద ఎవ్వరూ లేని సమయంలో ఇంటిలో చున్నీతో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రంజిత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రామచంద్రపురం ఎస్సై ఎస్. నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడి వేధింపుల కారణంగానే ఇలా జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
చిత్తూరు సీతమ్స్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
-
నందినీకి ఏమైనా జరిగితే..!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రానికి సమీపంలోని మురకంబట్టు వద్ద ఉన్న సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు రగిలిపోయాయి. అధ్యాపకుల కక్ష సాధింపు వల్ల తమ బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఈ మేరకు కళాశాల ఎదుట శనివారం ధర్నాకు దిగారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కళాశాలలో తృతీయ సంవత్సర విద్యార్థిని నందిని గత నెల 31న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. అధ్యాపకులు తీవ్రంగా అవమానించడంతో మానసికంగా కుంగిపోయి చావుకు తెగించిందన్నారు. విద్యారి్థనికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పిన యాజమాన్యం ఇప్పుడు మిన్నకుండిపోయిందని ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ సెలవు ఇవ్వని యాజమాన్యం శనివారం సెలవు ప్రకటించిందని ఆరోపించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని, వేలూరులోని ఓ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య చికిత్సకు తల్లిదండ్రుల వద్ద చిల్లిగవ్వ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యారి్థనికి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.నా బిడ్డను బతికించండి ‘కాయకష్టం చేసి బిడ్డను చదివించుకున్నాం. మరో ఏడాది గడిస్తే బిడ్డ ప్రయోజకురాలు అవుతుందని ఆశపడ్డాం. ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాం. అధ్యాపకులు కక్ష గట్టి మా బిడ్డను పొట్టనబెట్టుకోవాలని చూశారు. ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉంది..’ అంటూ విద్యార్థిని తల్లి దీప్తి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన కుమార్తె నందినిని అధ్యాపకులు బయట తరిమేసి కొట్టడం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. వారం రోజులుగా అధ్యాపకులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని తోటి విద్యార్థులే చెబుతున్నారని ఆరోపించారు.పోలీసులు, ట్రైనీ కలెక్టర్ చర్చలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు నిత్యబాబు, నెట్టికంఠయ్య, శ్రీనివాసులు« ధర్నా వద్దకు చేరుకుని తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. అదే విధంగా ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్ కళాశాల వద్దకు విచ్చేసి విద్యారి్థని తల్లితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాలలో ఘటన జరిగిన తర్వాత యాజమాన్యం అంతా తామే చూసుకుంటామని చెప్పి ప్రస్తుతం ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని తెలిసిందన్నారు. ప్రిన్సిపల్కి కాల్ చేసి హెచ్చరించినట్టు పేర్కొన్నారు. విద్యారి్థని కుటుంబీకులకు న్యాయం చేయకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, చిత్తూరు జిల్లా స్టూడెంట్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ సద్దాం, బాధితులకు మద్దతుగా హరీషారెడ్డి, మనోజ్రెడ్డి, దినే‹Ù, ఏఐఎస్ఎఫ్ నాయకులు సంజయ్, ఆసిఫ్, జగన్, ఎస్ఎఫ్ఐ నాయకులు మన్సూర్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
నిన్ను కలవాలని ఉంది.. శివాజీపార్క్కి వస్తావా?
ఎంవీపీకాలనీ: విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థి కోన సాయితేజ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న అతడి బలవన్మరణం కలకలం రేపింది. ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులతోనే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు, అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాల విద్యార్థులు ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. సహచర విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన మేరకు.. తోటి విద్యార్థులతో సరదాగా ఉండే సాయితేజ కొంతకాలంగా తరగతులకు హాజరుకావడంలేదు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా అధ్యాపకులు వేధిస్తున్నట్లు తల్లిదండ్రులు, తమ్ముడి వద్ద పలుమార్లు వాపోయాడు. ఐదో సెమిస్టర్లో భాగంగా స్టాటిస్టిక్స్ రికార్డ్ పూర్తిచేసి ఇటీవల అధ్యాపకురాలికి సబి్మట్ చేశాడు. అందులో కరెక్షన్స్ ఉన్నాయంటూ ఆమె రికార్డ్ను రిజెక్ట్ చేస్తూ వచ్చారు. దీంతో కొన్ని రోజులుగా సాయితేజ మరింత మనస్తాపానికి గురయ్యాడు. చాలాసార్లు కరెక్షన్లు చేసినా అధ్యాపకురాలు రికార్డ్ తీసుకోలేదు. దీంతో మరోసారి కరెక్షన్స్ చేసి సబి్మట్ చేసేందుకు గురువారం తల్లిదండ్రులతో కలిసి కాలేజీకి వెళ్లాడు. సాయంత్రం వరకు ఆ అధ్యాపకురాలు కళాశాలకు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళదామని తల్లిదండ్రులు చెప్పారు. ముందు మీరు వెళ్లండి, నేను తరువాత వస్తా.. అని సాయితేజ తల్లిదండ్రులకు, తమ్ముడికి చెప్పాడు. వారు కళాశాలకు వెళ్లి ఎంతసేపు చూసినా.. సాయితేజ రాలేదు. ఫోన్ కూడా తీయలేదు. దీంతో ఇసుకతోటలోని ఇంటికి వెళ్లిన వారికి సాయితేజ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించి, అతడిని మెడికవర్ హాస్పటల్కు తరలించారు. అప్పటికే సాయితేజ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఎంవీపీ పోలీసులు అక్కడికు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. ఏడాదిగా లైంగిక వేధింపులు ఏడాది కాలంగా సాయితేజ ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులకు గురవుతున్నట్లు సహచర విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. సహచర విద్యార్థులతో పాటు తమ్ముడికి కూడా సాయితేజ చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. ఒక అధ్యాపకురాలు ‘ఉదయాన్నే నన్ను ఎందుకు విష్ చేయడంలేదు.. నిన్ను కలవాలని ఉంది.. శివాజీపార్క్కి వస్తావా?.. నాగురించి ఒకసారైనా ఆలోచించవా..’ వంటి మెసేజ్లు పంపటంతోపాటు తరచు వాట్సాప్ కాల్స్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నట్లు సాయితేజ చెప్పాడని స్నేహితులు తెలిపారు. మరో అధ్యాపకురాలు సబ్జెక్ట్ పరంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు. సాయితేజ ఆత్మహత్యకు కారణమైన ఆ ఇద్దరు మహిళా అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలంటూ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతరం లైంగిక వేధింపులకు సంబంధించిన వాట్సాప్ సందేశాల జిరాక్స్లను ఏబీవీపీ ప్రతినిధి నితిన్తో కలిసి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావుకు అందజేశారు. సాయితేజ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసులు తెలిపారు. ఫిర్యాదుతో పాటు వాట్సాప్ సందేశాల ప్రతులను కూడా పోలీసులకు అందించారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
ప్రిన్సిపాల్ మందలించారని..
నల్గొండ జిల్లా: ప్రిన్సిపాల్ మందలించడంతోపాటు, ఉపాధ్యాయురాలు విద్యార్థుల ముందు హేళనగా మాట్లాడారని మనస్థాపం చెందిన విద్యార్థిని శుక్రవారం సాయంత్రం డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తిరుమలగిరి సాగర్కు చెందిన సభావట్ శ్రీను, కళ దంపతుల కుమార్తె సభావట్ మౌనిక దేవరకొండ పట్టణ పరిధిలో గల టీటీడబ్ల్యూఆర్ఎస్ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మౌనిక వారం క్రితం తన ఇంటికి వెళ్లి శుక్రవారం పాఠశాలకు వచ్చింది. అయితే విద్యార్థిని తరచుగా పాఠశాలకు గైర్హాజరు అవుతుండడంతో ప్రిన్సిపాల్ మందలించారు. అదేవిధంగా ఉపాధ్యాయురాలు తోటి విద్యార్థినుల ముందు మౌనికతో హేళనగా మాట్లాడారు. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని సాయంత్రం హాస్టల్ గదిలో ఉన్న డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు చెప్పడంతో హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. టీచర్ల వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. గతంలోనూ పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందని గంటసేపు తరగతి బయట నిలబెట్టడంతో కళ్లు తిరిగి కిందపడిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. -
బాలికపై జనసేన నేత లైంగిక దాడి
ఐ.పోలవరం: రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అక్రమాలు, దౌర్జన్యాలు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాల్లో కూటమి నేతలు ముందుంటున్నారు. కాకినాడ జిల్లా తునిలో ఇటీవల గురుకుల పాఠశాల విద్యార్థినిపై టీడీపీ నాయకుడు నారాయణరావు అఘాయిత్యానికి పాల్పడటం, ఆనక అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తెలిసిందే. ఇప్పుడు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ జనసేన నాయకుడు ఆరో తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తండ్రి లేని 11 ఏళ్ల బాలికకు చాక్లెట్లు ఇచ్చి, మాయమాటలతో లోబరుచుకుని పలు పర్యాయాలు లైంగిక దాడి జరిపాడు. ఈ బాగోతం బయటపడితే పరువు పోతుందని కొందరు కూటమి నేతలు ఆ బాలిక తల్లితో పాటు బంధువులతో కేసు లేకుండా రాజీ చేసేందుకు యత్నించారు. రాజకీయంగా తీవ్ర ఒత్తిళ్లు కూడా తెచ్చారు. అయినప్పటికీ బాలిక తల్లి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి నిలదీయడంతో.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం సమీప గ్రామానికి చెందిన బాలికపై బాణాపురానికి చెందిన జనసేన యువజన నాయకుడు రాయపురెడ్డి సత్యవెంకటకృష్ణ (బాబీ) ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బాలిక తన తల్లితో కలసి పూరి గుడిసెలో నివసిస్తోంది. ఆ బాలికకు బాబీ మాయమాటలు చెప్పి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని ఒక భవనం నుంచి ఆ బాలికతో కలసి బాబీ గురువారం బయటకు వస్తుండగా ఆమె తల్లి అనుమానంతో నిలదీసింది. దీంతో తనపై బాబీ అనేక పర్యాయాలు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆ బాలిక చెప్పింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. వారు గురువారం రాత్రి జిల్లా ఎస్పీ రాహుల్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. వెంకట కృష్ణపై పోక్సో, బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. రాజీకి తీవ్ర యత్నాలు బాబీని కేసు నుంచి తప్పించేందుకు, రాజీ చేసేందుకు జనసేన, టీడీపీ నేతలు తెరవెనుక తీవ్రంగా యతి్నంచారు. అయితే, బాలిక తల్లి సహా కుటుంబ సభ్యులు ససేమిరా అనడంతో చివరకు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ శుక్రవారం కేసు నమోదు చేసి, విచారణ జరిపారు. డీఎస్పీ కథనం ప్రకారం.. నిందితుడు బాబీ ఐ.పోలవరం జెడ్పీ హైసూ్కల్లో విద్యాకమిటీ సభ్యుడు. క్రీడాకారుడు కావడంతో విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇస్తుంటాడు. బాధితురాలు నిందితుడికి సమీప బంధువు. ఆమె తండ్రి రెండేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి ఆక్వా కార్మికురాలు. నిందితుడు ఆ బాలికకు తరచూ చాక్లెట్లు కొనిపెడుతూ తన బంధువుకు చెందిన ఖాళీగా ఉన్న ఇంట్లో అఘాయిత్యానికి బరితెగిస్తున్నట్టు విచారణలో తేలిందని డీఎస్పీ చెప్పారు. నిందితుడి బారిన పడిన వారిలో ఇంకొందరు బాలికలూ ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పరారీలో ఉన్న నిందితుడు బాబీని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.వైఎస్సార్సీపీ నేతల పరామర్శబాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ముమ్మిడివరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పొన్నాడ వెంకటసతీష్ కుమార్, పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, కాశి మునిబాలకుమారి తదితరులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
తమ్ముడు మామూలోడు కాదు
-
పదహారేళ్లకే ప్రసవం
అనంతపురం సిటీ: పదహారేళ్లు నిండకనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ బాలిక. విశ్వసనీయ సమాచారం మేరకు.. యాడికి మండలానికి చెందిన బాలిక (16) పదో తరగతి వరకు చదివింది. కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో చేర్పించినా చదువు మానేసి, డ్రాపవుట్గా మిగిలిపోయింది. అమ్మానాన్న కూలీ పనులకు వెళ్తే, తను ఇంటి పట్టున ఉండేది. అమ్మమ్మ ఊరైన కర్నూలు జిల్లా మద్దికెరకు తరచూ వెళ్లొచ్చేది. ఈ క్రమంలో మద్దికెరకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ దగ్గరవడంతో బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమంటే ఉద్యోగం వచ్చాక చేసుకుంటానంటూ రాజా దాటవేస్తూ వచ్చాడు. విషయం తెలిసినా 9 నెలలు నిండే వరకు కుటుంబ సభ్యులు కూడా గోప్యత పాటిస్తూ వచ్చారు. బుధవారం స్థానికంగా ఉండే ఆర్ఎంపీ వద్దకు బాలికను తీసుకెళ్లి ఐదు నెలల గర్భిణి అని చెప్పారు. గర్భవిచ్ఛిత్తికి మాత్రలు కావాలని అడిగిన వెంటనే అతను రాసిచ్చేశాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లి మింగిన కాసేపటికి విపరీతమైన రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు భయపడిపోయారు. వెంటనే గ్రామ ఆశా వర్కర్ దృష్టికి తీసుకెళ్తే ఆమె మందలించి గుత్తిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. బాలిక పరిస్థితి చూసిన అక్కడి వైద్యులు అడ్మిట్కు నిరాకరించడంతో పాటు వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించాలని చెప్పడంతో బాలికను ఇక్కడికి తీసుకొచ్చి బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో చేర్చారు. బాలిక అర్ధరాత్రి ఒంటిగంట తరువాత సాధారణ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత తెలిపారు.రంగంలోకి అధికారులువిషయం తెలిసిన వెంటనే ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ అరుణకుమారి, మిషన్ వాత్సల్య–మిషన్ శక్తి జిల్లా కో–ఆర్డినేటర్ బీఎన్ శ్రీదేవి, డీసీపీఓ మంజునాథ్, సఖి మేనేజర్ శాంతామణి, చైల్డ్లైన్ జిల్లా కో–ఆర్డినేటర్ కృష్ణమాచారి రంగంలోకి దిగారు. పోలీసులతో కలసి సర్వజనాస్పత్రికి చేరుకుని బాలికతో మాట్లాడారు. వివరాలు చెప్పేందుకు బాలిక అంగీకరించకపోవడంతో ఆమె తల్లిదండ్రులను సఖి సెంటర్కు పిలిపించి విచారించారు. మాయమాటలతో లొంగదీసుకొని, బాలికను తల్లిని చేసిన మద్దికెరకు చెందిన రాజాపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరో గిరిజన విద్యార్థిని బలి
సీతంపేట: ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో గిరిజన విద్యార్థి బలైంది. పార్వతీపురం మన్యం జిల్లా హడ్డుబండి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న మండంగి కవిత జ్వరం, ఊపిరితిత్తుల వ్యాధిలో విశాఖ కేజీహెచ్లో శుక్రవారం మృతిచెందింది. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ కవిత స్వగ్రామమైన డొంబంగివలసతోపాటు రాజుగాడిగూడ, ఈతమానుగూడ, పూతికవలస, పుట్టిగాం, కోమటిగూడ, చీడిమానుగూడ, చింతమానుకాలనీ, గూడంగి కాలనీకి చెందిన గిరిజనులంతా శనివారం పార్వతీపురం మన్యం జిల్లా హడ్డుబంగి గేటు బయట తరలి వచ్చి మృతదేహంతో ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు మాట్లాడుతూ ‘గిరిజన విద్యార్థులు పిట్టల్లారాలిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా?.. విద్యార్థుల ఆరోగ్యం పట్టదా?.. ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేకపోవడం దారుణం.. కురుపాంలో ఇద్దరు విద్యార్థినులు మృతిచెందితే వారి కుటుంబాలకు వైఎస్సార్సీపీ బాధ్యతగా రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేíÙయా చెల్లించింది. కూటమి ప్రభుత్వం కనీసం స్పందించలేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్లలో ఇప్పటి వరకు 21 మంది విద్యార్థులు చనిపోయారని, ఈ నెలలో వరుసగా ఆరుగురు మృతి చెందినా, సంబంధిత శాఖామంత్రి, ఎమ్మెల్యేలకు చీమకుట్టినట్టయినా లేదన్నారు.జిల్లాలోని వివిధ వసతిగృహాల్లో 15 వేల మంది బాలికలు చదువుతుంటే వీరిలో 30 శాతం మందికి సికిల్ సెల్ ఎనిమియా ఉందని రిపోర్టులు చెబుతున్నాయన్నారు. ఏడాదిన్నరగా దోమతెరల పంపిణీ లేదన్నారు. హాస్టల్ తలపులు, కిటికీలకు మెస్లు లేవని, తాగునీటి సమస్య వెంటాడుతుందని, సరైన మెనూ అందడంలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన ప్రాంతాలు అంటే నా ఆత్మ.. ఎక్కడైనా స్పందిస్తానన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడంలేదో చెప్పాలన్నారు. గిరిజనుల మరణాల పట్ల దృష్టిసారించాలని, లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.బాలిక కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేíÙయా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, గిరిజన బిడ్డల చావుకు ఆ శాఖమంత్రి సంధ్యారాణి వచ్చి సమాధానం చెప్పేవరకు మృతదేహాన్ని పాఠశాల నుంచి తరలించేది లేదని గిరిజన సంఘాల నాయకులు తెగేసి చెప్పారు. పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పాఠశాలకు వచ్చి గిరిజనులతో మాట్లాడారు. విచారణ జరిపి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
తుని లైంగిక దాడి నిందితుడి ఆత్మహత్య
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాల విద్యార్థిని(13)పై లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు (62) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు కథనం ప్రకారం...విద్యార్థినిపై లైంగిక దాడి యత్నానికి సంబంధించి తుని కొండవారపేటకు చెందిన నారాయణరావుపై పోలీసులు బుధవారం ఉదయం కేసు నమోదు చేశారు. సాయంత్రం 5 గంటలకు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10.30 సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు రూరల్ స్టేషన్ నుంచి పోలీసులు ఎస్కార్ట్తో తుని బయల్దేరారు. ఈ క్రమంలో బహిర్భూమికి వెళ్లాలని నారాయణరావు చెప్పడంతో మార్గంమధ్యలో కోమటిచెరువు వద్ద వాహనం ఆపారు. జోరుగా వాన కురుస్తుండడంతో ఎస్కార్ట్ సిబ్బంది చెట్టు కింద నిల్చున్నారు. నారాయణరావు చెరువు వద్దకు వెళ్లాడు. కొంతసేపటికి పెద్ద శబ్దం వినిపించడంతో ఎస్కార్ట్ సిబ్బంది వెళ్లి చూశారు. నారాయణరావు కనిపించలేదు. చెరువులో దూకి పారిపోయాడా? ప్రమాదవశాత్తు జారిపడ్డాడా? అనే అనుమానంతో గాలింపు చేపట్టారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అర్ధరాత్రి వరకు వెదికినా నారాయణరావు ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి, చెరువులో వలలు వేశారు. క్విక్ క్యూఆర్టీ టీమ్ చెరువు చుట్టూ గాలించింది. ఉదయం నారాయణరావు మృతదేహం లభించింది. పోలీసులు మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
H1B వీసా ఫీజు విషయంలో విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
-
Kazakhstan: భారత వైద్య విద్యార్థికి బ్రెయిన్ స్ట్రోక్.. జైపూర్ తరలింపు
జైపూర్: కజకిస్తాన్లో వైద్య విద్యనభ్యసిస్తున్న రాజస్థాన్కు చెందిన రాహుల్ ఘోసల్యా(22) బ్రెయిన్ స్ట్రోక్కు లోనై, ప్రాణాలతో పోరాడుతున్నాడు. వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్న అతనిని, మరింత మెరుగైన వైద్యం కోసం రాజస్థాన్లోని జైపూర్నకు తరలించారు.వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం జైపూర్ జిల్లాలోని షాపురాకు చెందిన రాహుల్ ఘోసల్యా 2021 నుండి కజకిస్తాన్లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అక్టోబర్ 8న బ్రెయిన్ స్ట్రోక్కు గురైన అతను చాలా రోజులుగా కజకిస్తాన్లోని ఒక ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నాడు. తాజాగా రాహుల్ ఘోసల్యాను ఎయిర్ అంబులెన్స్లో జైపూర్కు తరలించి, అక్కడి సవాయి మాన్ సింగ్ (ఎస్ఎంఎస్)ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ వైద్యులు, జిల్లా అధికారుల బృందం పర్యవేక్షణలో బాధితుడిని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చేర్చించారు. ప్రస్తుతం రాహుల్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ దీపక్ మహేశ్వరి నేతృత్వంలోని వైద్యబృందం రాహుల్కు ప్రత్యేక చికిత్స అందిస్తోంది.రాహుల్ ఆరోగ్య సంరక్షణకు నలుగురు సభ్యుల వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. విమానాశ్రయం నుండి ఆస్పత్రికి రాహుల్ను తరలించేందుకు ఒక ప్రత్యేక క్రిటికల్ కేర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దీనికి ముందు రాహుల్ కుటుంబం ఈ విషయమై సోషల్ మీడియా ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. అతనికి అధునాతన వైద్య సంరక్షణ అందించేందుకు భారత్ తీసుకురావాలని అభ్యర్థించింది. ఈ నేపధ్యంలో పలు సామాజిక సంస్థలు రాహుల్ కుటుంబానికి మద్దతునిచ్చాయి. రాహుల్ను భారత్కు తీసుకురావడంలో సహకారాన్ని అందించాయి. -
సీనియర్ వేధింపులు.. రాలిన విద్యా కుసుమం
సాక్షి, బెంగళూరు: భార్యను చంపిన భర్త, యువతిని చంపిన దుండగుడు.. ఇంతలోనే బెంగళూరులో మరో దుర్ఘటన జరిగింది. సీనియర్ వేధింపులను తాళలేక బాగలూరులో ఓ పీజీ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సనా పర్వీన్ (19)గా గుర్తించారు. సనా మరణానికి కాలేజీలో సీనియర్ రిఫాన్ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. సనా చదివే కాలేజీలోనే రిఫాన్ చదువు పూర్తి చేసుకుని కాలేజీ వదిలి వెళ్లిపోయాడు. అయినప్పటికీ సనాకు వేధింపులు ఆపలేదు. కేరళకు చెందిన రిఫాన్ గత పది నెలల నుంచి తరచుగా కాలేజీకి వచ్చి వెళ్లేవాడు. పీజీ వద్దకు కూడా వచ్చి సనాను ప్రేమ పేరుతో ఒత్తిడి చేసేవాడు. పలుమార్లు కాలేజీలో గొడవలు కూడా జరిగినట్లు ఆమె స్నేహితులు తెలిపారు. ఇది తట్టుకోలేక ఆమె పీజీలోని గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పై బాగలూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. మహిళా సంఘాల నిరసన మరోవైపు మహిళలకు, యువతులకు భద్రత కల్పించాలని, దౌర్జన్యాలను అరికట్టాలని ఏఐడీఎస్ఓ సహా పలు స్త్రీవాద, వామపక్ష సంఘాల కార్యకర్తలు బెంగళూరు ఫ్రీడంపార్క్లో ధర్నా చేశారు. మహిళలు సమాజంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని, దాడులు అధికమైనట్లు వాపోయారు. ప్రభుత్వం దుండగులకు ముకుతాడు వేయాలని నినాదాలు చేశారు. -
‘నన్ను చూస్తూ వెలికిగా నవ్వాడు, అందుకే కోపంతో..’ సారీ చెప్పిన దీపిక
ఏకంగా ప్రొఫెసర్పై.. అదీ పోలీసుల సమక్షంలో చెయ్యి చేసుకుంది ఓ విద్యార్థి సంఘం నాయకురాలు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. ఆమె క్షమాపణలు చెప్పేదాకా ఊరుకునేది లేదని లెక్చరర్ల సంఘం ఆందోళనకు దిగింది. ఈ తరుణంలో ఆమె వివరణ ఇచ్చుకుంది. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ, ఏబీవీపీ సభ్యురాలు దీపిక ఝా(Deepika Jha) ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ప్రొఫెసర్ సుజీత్ కుమార్పై ఆమె చెయ్యి చేసుకున్నారు. క్రమశిక్షణా కమిటీ భేటీలో.. అందునా అక్కడ ఉన్న పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. శుక్రవారం క్షమాపణలు చెబుతూ దీపికా ఝా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆయన (సుజీత్ కుమార్) నన్ను తదేకంగా చూశారు. నోటికొచ్చినట్లు తిట్టారు. బెదిరించారు. వెటకారంగా నవ్వారు. తట్టుకోలేకపోయా. అందుకే అలా చేయాల్సి వచ్చింది అని తన చర్యను సమర్థించుకున్నారామె. This is what happens when authority abuses power and impulse overtakes discipline.A drunk, politically biased DU professor misbehaved with students — police intervened but made no arrest.DUSU JS Deepika Jha reacted wrongly.This is not ABVP’s way.pic.twitter.com/d53LetxRiP— Gaurav (@gjha88) October 17, 2025బహిరంగంగా సిగరెట్ కాల్చడంతో విద్యార్థులు పాడైపోతారని ఆయన్ని మేం ఆపే ప్రయత్నం చేశాం. దీంతో ఆయన క్రమశిక్షణా కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో నాతో అనుచితంగా వ్యవహరించాడు. కోపంతో అలా చేయాల్సి వచ్చింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని చెబుతూనే జరిగిందానికి టీచర్స్ కమ్యూనిటీకి క్షమాపణలు తెలియజేశారామె. అయితే.. ఈ ఘటనపై కామర్స్ ప్రొఫెసర్ సుజీత్ కుమార్ వెర్షన్ మరోలా ఉంది. కాలేజీ స్టూడెంట్ కౌన్సిల్లో మూడు పోస్టులకు జరిగిన ఎన్నికల వ్యవహారమే దీనంతటికి కారణమని అంటున్నారాయన. ఈ ఎన్నికకు సంబంధించిన ఎన్ఎస్యూఐ(కాంగ్రెస్ విద్యార్థి విభాగం) సభ్యులపై ఏబీవీపీ సభ్యులు దాడి చేశారని.. దీంతో వాళ్లను సస్పెండ్ చేశామని.. ఆ వ్యవహారంపై చర్చించే సమయంలో కమిటీ ముందు కూడా మరోసారి దాడి జరిగిందని అన్నారాయన. ఈ వ్యవహారంలో తనను రాజీనామా చేయాలంటూ ఎబీవీపీ సభ్యులు ఒత్తిడి చేశారని, ఆ టైంలో దీపిక వచ్చి తనపై దాడి చేసిందని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారాయన. #WATCH | Delhi: On being slapped by DUSU Joint Secretary, Professor Sujeet Kumar says, "...I am the convener of the discipline committee in my college and it is my responsibility to maintain law and order in college... The day before yesterday, we had a fresher's function at our… pic.twitter.com/2scFkzg3kx— ANI (@ANI) October 17, 2025ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోషియేషన్(DUTA) భగ్గుమంది. దీపికా ఝాతో ఆ ప్రొఫెసర్కు క్షమాపణలు చెప్పించాల్సిందేనని పట్టుబడుతోంది. మరోవైపు.. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI) సైతం ఘటనను తీవ్రంగా ఖండించింది. తీవ్ర దుమారం రేపడంతో ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ నీతా సెహగల్ నేతృత్వంలోని కమిటీ రెండు వారాల్లో నివేదికను వీసీ యోగేష్ సింగ్కు సమర్పించనుంది. -
ఆశ్రమ పాఠశాలల్లో మృత్యు ఘంటికలు!
మక్కువ (పార్వతీపురం మన్యం): ఆశ్రమ పాఠశాలల్లో చేరి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న అడవి బిడ్డల కలలు ఆవిరైపోతున్నాయి. చదువుల మాట దేవుడెరుగు.. ఆశ్రమ పాఠశాలల నుంచి సురక్షితంగా ఇంటికి వస్తే చాలు అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి నెలకొంది. కలుషిత తాగునీరు, అనారోగ్యం, సరైన వైద్యం అందకపోవడం వల్ల ఏడాది వ్యవధిలో 15 మంది గిరిజన విద్యార్థులు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గం సాలూరులోనే నలుగురు విద్యార్థులు చనిపోవడం గమనార్హం. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో 11 ఏళ్ల వయసున్న చిన్నారి అనే విద్యార్థి కిడ్నీ సమస్య బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి మృతిపార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసబద్ర పంచాయతీ మూలవలస గ్రామానికి చెందిన తాడంగి చిన్నారి (11) బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న చిన్నారి అనారోగ్యానికి గురైనట్లు ఈనెల 13వ తేదీన తల్లిదండ్రులు ముగిరి, కాంతమ్మకు పాఠశాల యాజమాన్యం సమాచారం అందించింది. చిన్నారి తల్లిదండ్రులు అదే రోజు పాఠశాలకు చేరుకొని విద్యార్థిని సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించగా విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. కలుషిత నీరు కారణంగా అనారోగ్యానికి గురై, కిడ్నీలు పాడవడంతోనే తమ బిడ్డ మృతి చెందినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గిరిజన, ప్రజా సంఘాల ఆందోళన..రైతు కూలీసంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ, జిల్లా నాయకులు అసిరి, పీడీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు కె.సోమేష్, గిరిజన సంఘం నేత మండల గిరిధర్రావు తదితరులు మూలవలస చేరుకుని విద్యార్థి మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఐటీడీఏ అధికారులు గ్రామానికి వచ్చి విద్యార్థి మృతికి సమాధానం చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని ఆశ్రమ పాఠశాలకు తరలించి నిరసన చేపడతామని హెచ్చరించారు. గిరిజన బిడ్డల ఆరోగ్యం గురించి మంత్రి సంధ్యారాణి కనీసం పట్టించుకోవడంలేదని, అనారోగ్యంతో పిట్టల్లా రాలిపోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకాల కోసం చేసిన మొదటి సంతకం ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 ఏళ్ల బాలుడు కిడ్నీలు పాడై చనిపోవడం ఏమిటని మండిపడ్డారు. తాగునీటి సమస్యతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆశ్రమ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, ఆర్వో ప్లాంట్లు మూలకు చేరినా బాగు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీటీడబ్ల్యూ విజయశాంతి, ఏటీడబ్ల్యూ కృష్ణవేణిని చుట్టుముట్టిన ప్రజాసంఘాలు, గిరిజన నేతలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి చిన్నారి చనిపోయాడని మండిపడ్డారు. ఏఎన్ఎం పోస్టుల భర్తీ, ఆర్వో ప్లాంట్ మరమ్మతుల గురించి ప్రభుత్వం దృష్టికి తెస్తామని డీటీడబ్ల్యూఓ పేర్కొన్నారు.ఈ ఏడాది జూన్లో జియ్యమ్మవలస మండలం టీకే జమ్ముకు చెందిన గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఆరో తరగతి విద్యార్థిని కె.తనూజ, గత నెల 26న గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడకు చెందిన పువ్వల అంజలి, ఈ నెల ఒకటో తేదీన కురుపాం మండలం దండసూర గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని తోయక కల్పన పచ్చకామెర్లతో ప్రాణాలు కోల్పోయారు. కురుపాం బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 180 మందికిపైగా బాలికలు పచ్చకామెర్ల బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మక్కువ మండలం నంద గ్రామానికి చెందిన కేజీబీవీ విద్యార్థిని బిడ్డిక కీర్తన (17), పాచిపెంట మండలంలో మూడో తరగతి విద్యార్థిని శాంత కొద్దినెలల కిందట మృతిచెందగా.. సాలూరు మండలంలోని మామిడిపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని తాడంగి పల్లవి(12) రెండు రోజుల కిందట చనిపోయింది. తాజాగా మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాల విద్యార్థి చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.మన్యంలో మరణ మృదంగం గతేడాది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి బి.ఈశ్వరరావు, పార్వతీపురం మండలం రావికోన గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఆరో తరగతి విద్యార్థి పి.రాఘవ, గుమ్మలక్ష్మీపురం మండలం వామాసి గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల మండంగి గౌతమ్ మలేరియాతో చనిపోయాడు. కొమరాడ కేజీబీవీ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని కె.శారద, గుమ్మలక్ష్మీపురం బాలికల ఆశ్రమ పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని ఎన్.అవంతిక, కురుపాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల నాలుగో తరగతి విద్యార్థి నితిన్, జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి జీవన్కుమార్, గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ముకు చెందిన మూడో తరగతి చదువుతున్న జి.దినేష్ మృతిచెందారు.కన్నెత్తి చూడని విద్యాశాఖ మంత్రిఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే కాదు.. ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంల్లోనూ గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా.. కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కురుపాంలో ఇద్దరు గిరిజన బాలికలు మృతి చెందిన ఘటనను కప్పిపుచ్చేందుకు మంత్రులు ప్రయత్నించారు. విద్యార్థులు ఇళ్ల వద్దే మరణించారని.. ప్రభుత్వానికి ఏం సంబంధమంటూ మంత్రి సంధ్యారాణి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. పరిహారం సంగతి తర్వాత చూస్తామని.. మట్టి ఖర్చులే ఇవ్వగలమని చెప్పడం ప్రభుత్వ దారుణ వైఖరికి అద్దం పడుతోంది. గిరిజన విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉప ముఖ్యమంత్రిగానీ, విద్యాశాఖ మంత్రి గానీ సమీక్షించిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నుంచి ఒక ప్రకటన కూడా లేదు. విశాఖలో పర్యటించిన విద్యాశాఖ మంత్రి కేజీహెచ్కు వెళ్లి గిరిజన బిడ్డల ఆరోగ్యంపై కనీసం ఆరా తీయలేదు. విద్యార్థుల చావులకు కారణాలను కప్పిపుచ్చుతూ ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది.పిల్లలు చనిపోతున్నా పట్టదా..?మా కుమారుడు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం అందిన వెంటనే పాఠశాలకు వెళ్లాం. సాలూరు, విజయనగరం, కేజీహెచ్ ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. చక్కగా చదువుకుని ప్రయోజకుడు అవుతాడనుకుంటే చిన్న వయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. పిల్లలు అనారోగ్యంతో మృతి చెందుతున్నా పట్టించుకునేవారే లేరు. – తాడంగి ముగిరి (చిన్నారి తండ్రి, మూలవలస గ్రామం)తాగునీటి సమస్యే కారణం..విద్యార్థి చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో ఈనెల 8వ తేదీన శంబర పీహెచ్సీలో పరీక్షలు నిర్వహించగా మలేరియా పాజిటివ్ వచ్చింది. 10వ తేదీన పార్వతీపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆరోగ్యంగా ఉన్నాడంటూ పంపించేశారు. చిన్నారి 13వ తేదీన మళ్లీ అనారోగ్యానికి గురికాగా సాలూరు, విజయనగరం, విశాఖ ఆస్పత్రులకు తరలించినా ప్రయోజనం లేకపోయింది. చిన్న వయసులో కిడ్నీలు పాడవడం దారుణం. దీనికి తాగునీటి సమస్యే ప్రధాన కారణం. ప్రభుత్వం చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలి. – కె.సోమేష్, పీడీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం జిల్లా -
సరైన ప్రశంసలతోనే... జీనియస్ మైండ్ సెట్!
‘‘అమ్మా.. నేను క్లాస్ ఫస్ట్ వచ్చా!’’ ‘‘వావ్... కంగ్రాచ్యులేషన్స్ నాన్నా. నువ్వు తెలివైనవాడివి! ’’ అని మెచ్చుకుంది తల్లి. తల్లి ప్రశంసలతో ఆ బిడ్డ కాసేపు సంతోషపడుతుంది. గర్వపడుతుంది. కానీ వారం తర్వాత కాస్త కష్టమైన టాపిక్ రాగానే, ‘‘నేను తెలివైనవాడినైతే ఇది ఎందుకు రాలేదు?’’ అని ఆలోచనలో పడిపోతుంది. అక్కడినుంచి మెల్లగా మోటివేషన్ పోతుంది. ప్రశంస అంటే కేవలం మాటలు కాదు. అది మెదడులోని న్యూరాన్లకు ఇచ్చే సూచన. ప్రతి మాట మీ బిడ్డ మెదడులో కొత్త కనెక్షన్లు నెలకొల్పుతుంది. అందుకే మెచ్చుకోవడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెచ్చుకున్నా తప్పేనా? పిల్లలు ఏదైనా సాధించగానే ‘‘శభాష్, నువ్వు బెస్ట్, నువ్వు ఇంటెలిజెంట్’’ అని టీచర్లు, పేరెంట్స్ మెచ్చుకుంటారు. ఇలాంటి తప్పు రకమైన ప్రశంసలు పిల్లలను ట్రాప్లో పడేస్తాయి. ఇతరులతో పోల్చే ప్రశంస తాత్కాలికంగా ఉత్సాహాన్నిస్తుంది. కాని, ‘ఇతరులకంటే ముందుండడమే నాకు విలువ’ అనే తప్పు నమ్మకాన్ని ఏర్పరుస్తాయి.చిన్న విషయాలకే పెద్ద ప్రశంసలు ఇస్తే వాటి విలువ తగ్గిపోతుంది.నువ్వు సక్సెస్ అయితేనే ప్రశంసిస్తామనే తీరు చాలా ప్రమాదకరం. దీంతో ఆప్యాయతను పర్ఫార్మెన్స్తో లింక్ చేసుకుంటారు. తరచుగా ప్రశంసలపై ఆధారపడితే పిల్లలు అంతర్గత కుతూహలం కోల్పోతారు. స్వతంత్రంగా ప్రయత్నించడం తగ్గిపోతుంది. ప్రశంసలో నిజాయితీ లేకపోతే పిల్లల నమ్మకం దెబ్బతింటుంది. సైన్స్ ఏమంటుంది?పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వడంపై మానసిక శాస్త్రవేత్తలు, న్యూరో సైంటిస్టులు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. మీరిచ్చే ప్రశంసలు వారి మెదడును, మైండ్ సెట్ను షేప్ చేస్తాయని వాటిలో వెల్లడైంది. న్యూరోప్లాస్టిసిటీ: మన మెదడు అనుభవాల ఆధారంగా రీవైర్ చేసుకుంటుంది. ప్రయత్నం, పద్ధతి, పట్టుదలపై ఇచ్చే ప్రశంస డోపమైన్ అనే ‘మోటివేషన్ కెమికల్’ను విడుదల చేస్తుంది.ఎపిజెనెటిక్స్: జీన్స్ మన జీవితాన్ని నిర్ణయించవు. ఏ జీన్స్ ‘ఆన్’ అవ్వాలి, ఏవి ‘ఆఫ్’ అవ్వాలనేది వాతావరణం నిర్ణయిస్తుందని ఎపిజెనెటిక్స్ పరిశోధనలు చెప్తున్నాయి. సెల్ఫ్–డిటర్మినేషన్ థియరీ: పిల్లలు సక్సెస్ అవ్వాలంటే అటానమీ, కాంపిటెన్స్, రిలేటెడ్నెస్ అనే మూడు అవసరాలు తీరాలి. సరైన ప్రశంస ఈ మూడింటినీ అందిస్తుంది. ఫ్లో సైకాలజీ: ఫ్లో స్టేట్ అంటే నైపుణ్యాలు, సవాళ్లు సమపాళ్లలో ఉండే స్థితి. సరైన ప్రశంస పిల్లలను ఫ్లో స్టేట్ వైపు నెడుతుంది. అప్పుడే పిల్లల అసలు జీనియస్ వెలుగులోకి వస్తుంది.సరైన ప్రశంసలకు 10 టిప్స్...‘‘నువ్వు స్టెప్ బై స్టెప్గా చేసిన తీరు చాలా నచ్చింది’’ అని ప్రాసెస్ని గుర్తించండి.‘‘నీ ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి. సైంటిస్ట్లా ఆలోచిస్తున్నావు’’ అని క్యూరియాసిటీకి విలువనివ్వండి. ‘‘ఎన్నిసార్లు ఫెయిల్ అయినా వదల్లేదు, అదే నిజమైన శక్తి’’ అని ప్రయత్నాన్ని హైలైట్ చేయండి.‘‘నీ ఆలోచన ప్రత్యేకంగా ఉంది’’ అని ఒరిజినాలిటీని సెలబ్రేట్ చేయండి. ‘‘గతంలో కష్టమనిపించింది ఇప్పుడు బాగా చేశావు. ఇదే నిజమైన అభివృద్ధి’’ అని ఇంప్రూవ్మెంట్పై ఫోకస్ చేయండి.‘‘నీ వ్యాస పరిచయం చాలా స్పష్టంగా ఉంది’’ అని స్పెసిఫిక్గా చెప్పండి.‘‘ఒకే సమస్యకు పలు మార్గాల్లో ప్రయత్నించడం చాలా స్మార్ట్ స్ట్రాటజీ’’ అని ప్రాబ్లమ్ సాల్వింగ్ని ప్రోత్సహించండి.‘‘ఈ ప్రాజెక్ట్లో ఏ భాగం నీకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది?’’ అని రిఫ్లెక్షన్కి దారి చూపండి.‘‘ఈ పనిని ప్రేమగా చేసినప్పుడు ఎంత అందంగా వచ్చిందో గమనించావా?’’ అని ఎఫర్ట్తో పాటు ఎమోషన్ని గుర్తించండి.‘‘ఇది బాగా చేశావు, ఇప్పుడు నెక్ట్స్ లెవెల్ ప్రయత్నిస్తావా?’’ అని ప్రశంసని చాలెంజ్తో కలిపి ఇవ్వండి. సైకాలజిస్ట్ విశేష్ ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ (చదవండి: వయసు 84 ఏళ్లు..కానీ ఇతడి టాలెంట్ మాములుగా లేదుగా..!) -
లివర్ మార్పిడి తప్పదా!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హెపటైటిస్–ఏ బారినపడిన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్లో కొందరి పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోందా?... ఈ వ్యాధి సోకినవారు వెంటనే కోలుకునే స్థితిలో లేరా?.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గిరిజన బిడ్డలు ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారా?.. అంటే వైద్య నిపుణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకవైపు ఇప్పటికే కురుపాం ఆశ్రమ పాఠశాలలో వందల మంది విద్యార్థులను వణికిస్తున్న హెపటైటిస్–ఏ... పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలకూ పాకింది. ఇక్కడ కూడా వందల మంది విద్యార్థులు హెపటైటిస్–ఏతో ఇబ్బంది పడుతున్నట్టు పరీక్షల ద్వారా తెలుస్తోంది. అయితే, సాధారణ హెపటైటిస్–ఏ వేరియంట్ కంటే పిల్లలకు సోకిన వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు గుర్తించారు. గోప్యంగా ఉంచిన ప్రభుత్వం!ఈ వ్యాధి బారినపడిన వారు వెంటనే కోలుకుంటున్న పరిస్థితి కూడా లేదని వైద్యులు గుర్తించినట్టు సమాచారం. అందువల్ల మూకుమ్మడిగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఒక విద్యార్థికి అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ స్టేజీ–1గా కూడా వైద్యులు గుర్తించారు. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల పరిస్థితి విషమిస్తే కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్ప్లాంటేషన్)కి కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వైద్య నిపుణులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు అవసరమైన వైద్య సదుపాయాలు లేవు. వెంటనే కాలేయ మార్పిడికి అవసరమైన ప్రొటోకాల్స్ను సిద్ధం చేసుకుని, తగిన వైద్య సదుపాయాలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంటే మంచిదని ప్రభుత్వానికి వైద్య నిపుణులు సూచించినట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కాకుండా వివరాలన్నీ గోప్యంగా ఉంచుతూ గిరిజన విద్యార్థులు, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల కిందటే గుర్తించినా...! పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం ఆశ్రమ పాఠశాలలో నెల కిందటే ఒక విద్యార్థికి హెపటైటిస్–ఏ సోకిందని వైద్యులు గుర్తించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా వైద్యాధికారులతోపాటు జిల్లా యంత్రాంగం మొత్తానికి సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలిసినప్పటికీ వైద్య బృందం వెంటనే విద్యార్థులు అందరికీ పరీక్షలు కూడా చేయకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి.ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆదేశాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మరొకరు కూడా మృతి చెందినప్పటికీ... హెపటైటిస్–ఏ కారణం కాదని చెబుతున్నారు. మరోవైపు తాజా పరీక్షల్లో ఈ కొత్త వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని తేలినందున హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి కురుపాం ఆశ్రమ పాఠశాలతోపాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలోని విద్యార్థులకు, వారిని కలిసినవారికి, ఆయా గ్రామాల్లో వెంటనే మూకుమ్మడిగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. -
ప్రాణవాయువు అందక ప్రాణం పోయింది
కళ్యాణదుర్గం/బ్రహ్మసముద్రం: కేజీబీవీ సిబ్బంది నిర్లక్ష్యం... ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సకాలంలో అందకపోవడం... ఓ విద్యార్థిని ప్రాణాన్ని బలిగొంది. తమ బిడ్డను మంచి చదువులతో ఉన్నత స్థానంలో చూడాలనుకున్న తల్లిదండ్రుల కలల్ని కల్లలు చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లి (గొల్లలదొడ్డి)లో ఉంటున్న మహేష్, పద్మక్కకు నలుగురు సంతానం. పెద్ద కుమార్తె జి.చందన (14) బ్రహ్మసముద్రం కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. తెల్లారేవరకు ఇబ్బంది పడింది. తర్వాత విధుల్లో ఉన్న సిబ్బందికి తెలిపింది. సిబ్బంది ఉదయం ఆరు గంటలకు చందన తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వెంటనే వచ్చి ఇంటికి తీసుకెళ్లాలని తండ్రికి సూచించారు. 9 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన మహేష్, కుటుంబసభ్యులు చందనను బ్రహ్మసముద్రంలోని ప్రైవేట్ వైద్యుడి వద్దకు, తర్వాత పీహెచ్సీకి తరలించారు. అయితే, ఆ సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ అందించేందుకు కరెంటు లేదు. గంటపాటు వేచి ఉన్నా విద్యుత్తు రాలేదు. ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితుల్లో వైద్య సిబ్బంది సూచన మేరకు అంబులెన్స్లో ఉదయం 10.30కు కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పలు పరీక్షలు చేసి చికిత్స అందించారు. 11.15 ప్రాంతంలో చందన మృతి చెందింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేజీబీవీకి వెళ్లి వివరాలు సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. కాగా, చందన మృతదేహాన్ని ఆర్డీటీ ఆసుపత్రి నుంచి నేరుగా ఇంటికి తరలించేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పోలీసులు ఇలా వ్యవహరించారన్న విమర్శలు వినిపించాయి. కేజీబీవీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చందన చనిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. శుక్రవారం సాయంత్రం చందన మృతదేహాన్ని స్వగ్రామం పడమటి కోడిపల్లి (గొల్లలదొడ్డి)కి తీసుకెళ్లిన అనంతరం ఒక్కసారిగా ఆగ్రహంతో బ్రహ్మసముద్రం కేజీబీవీ వద్దకు చేరుకున్నారు. ఇన్చార్జ్ ఎస్ఐ లోకేష్ పాఠశాల గేట్లకు తాళం వేసి ఎవ్వరినీ లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. విద్యార్థిని బంధువులు అక్కడే బైఠాయించారు. తహసీల్దార్ సుమతి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే చెప్పి, ఆక్సిజన్ పెట్టి ఉంటే బతికేదిచందనకు మూడేళ్ల క్రితం గుండెకు ఆపరేషన్ చేయించాం. గురువారం అర్ధరాత్రి నుంచే ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడింది. కసూ్తర్బా సిబ్బంది ముందే సమాచారం ఇచ్చి ఉంటే బిడ్డను బతికించుకునేవాళ్లం. కేజీబీవీ సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకనే చందన చనిపోయింది. – నరసింహమూర్తి, చందన చిన్నాన్న -
ఆలస్యంగా వచ్చారు.. రంగు డబ్బా తీసుకురండి
వేములవాడఅర్బన్: దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యాసంస్థలు శనివారం పున ప్రారంభమయ్యాయి. ఈక్రమంలోనే పలువురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో కళాశాల అధ్యాపకులు వారికి ఫైన్ వేశారు. పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డులోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆలస్యంగా బుధవారం రావడంతో ఒక్కొక్కరికి ఒక్కో రంగుడబ్బా కొని అప్పగించాలని హుకూం జారీ చేశారు. దూరం నుంచి వచ్చామని తమ వద్ద డబ్బులు లేవని చెప్పినా అధ్యాపకులు వినిపించుకోకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై కళాశాల వైస్ప్రిన్సిపాల్ అనురాధను ‘సాక్షి’ వివరణ కోరగా కళాశాల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదన్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నందునా వారిలో క్రమశిక్షణ పెంచాలని తాము రంగుడబ్బాలు తీసుకురావాలని ఫైన్గా వేసినట్లు తెలిపారు. విద్యార్థులు కొనుగోలు చేసి తెచ్చిన రంగు డబ్బాలతోనే కళాశాల, పాఠశాల ఆవరణలో పెయింటింగ్ వేయిస్తామని స్పష్టం చేశారు. -
అమెరికా డల్లాస్లో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో గన్ కల్చర్ మరో నిండు ప్రాణం బలి తీసుకుంది. టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో తెలంగాణకు చెందిన చంద్రశేఖర్ పోలే(27) కన్నుమూశాడు(Telangana Student Dies Dallas Gun Fire). భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రశేఖర్ పోలే స్వస్థలం హైదరాబాద్ ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి. బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం చంద్రశేఖర్ డల్లాస్ వెళ్లాడు. ఆరు నెలల కిందటే అతని మాస్టర్స్ డిగ్రీ పూర్తైంది. అయితే ఫుల్టైం ప్లేస్మెంట్ కోసం ఎదురు చూసే క్రమంలో స్థానికంగా ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బుల్లెట్ గాయాలతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బీఎన్ రెడ్డిలోని చంద్రశేఖర్ కుటుంబం నివాసం ఉండే కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. ‘‘బీడీఎస్ పూర్తి చేసి.. ఉన్నత పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది.... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారాయన.బీడీఎస్ పూర్తి చేసి, పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన… pic.twitter.com/RJy8BdteiD— Harish Rao Thanneeru (@BRSHarish) October 4, 2025సీఎం రేవంత్ విచారంఅమెరికాలో హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అమెరికాలో పోలే చంద్రశేఖర్ మరణం ఆవేదన కలిగించింది. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహకారం అందిస్తాం అని ఒక ప్రకటనలో తెలిపారు. -
లండన్లో తెలుగు విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా : జిల్లాలోని మేడిపల్లి మండలం దమ్మనపేట్లో విషాదచాయలు అలుముకున్నాయి. దమ్మనపేట్కు చెందిన ఎనుగు మహేందర్ రెడ్డి (26) అనే అనే విద్యార్థి లండన్లో దుర్మరణం చెందాడు. ఉన్నత విద్యను అభ్యసించడానికి లండన్కు వెళ్లిన మహేందర్రెడ్డికి గుండెపోటు రావడంతో మృత్యువాత పడినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నిన్న(శుక్రవారం, అక్టోబర్ 3వ తేదీ) రాత్రి మహేందర్రెడ్డి చనిపోయిన విషయాన్ని అతని స్నేహితులు తండ్రి రమేష్రెడ్డికి తెలియజేశారు. ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం లండన్కు వెళ్లాడు మహేందర్రెడ్డి. కుమారడు ప్రయోజకుడు అవ్వడానికి లండన్ వెళ్లి ఇలా మృతి చెందడం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తండ్రి శోకసంద్రంలో మునిగిపోయారు. -
నెల్లూరు మెడికల్ స్టూడెంట్ గీతాంజలి కేసులో బిగ్ ట్విస్ట్!
-
నెల్లూరులో మెడికో విద్యార్థిని సూసైడ్
-
నెల్లూరు: ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు: ఏసీఎస్ఆర్(ACSR) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడిసిన్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని గీతాంజలి హాస్టల్ రూమ్లో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని.. నంద్యాల నుంచి నిన్నే(గురువారం) హాస్టల్కి వచ్చింది. హాస్టల్లోకి మీడియాను యాజమాన్యం అనుమతించలేదు. పోలీసులు విచారణ చేపట్టారు.విద్యార్థిని ఆత్మహత్యపై సీఐ రోశయ్య మాట్లాడుతూ.. గీతాంజలీ హాస్టల్ 3వ అంతస్తులోని రూమ్లో ఉంటుందని.. దసరా సెలవులకు తన స్వగ్రామం వెళ్లి నిన్న రాత్రి తిరిగి వచ్చిందని.. నేటి నుంచి అనాటమీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు. ఉదయం స్నేహితురాలతో కలిసి టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళిందని.. రూమ్ డోర్ లాక్ చేసుకొని ఆత్మహత్య చేసుకుందని సీఐ తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై విచారణ చేపట్టామన్నారు. స్నేహితురాలు, తల్లిదండ్రులను విచారణ చేపట్టిన తరువాత పూర్తి వివరాలు బయటకు వస్తాయని సీఐ పేర్కొన్నారు. -
టాయ్పప్పీ స్ఫూర్తితో.. లెదర్ ఫ్యాషన్ యుటిలిటీ ఆవిష్కరణ
టాయ్ పప్పీ స్ఫూర్తితో మినీ లెదర్ బ్యాగ్ రూపకల్పన చేసింది ఎఫ్డీడీఐ విద్యార్థిని స్నిగ్ధప్రియ. తనలోని నైపుణ్యానికి పదునుపెట్టి తనదైన శైలిలో నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మినీబ్యాగ్, స్లింగ్బ్యాగ్, స్పెక్ట్స్హోల్డర్ను తయారుచేసి తన క్రియేటివిటీని చాటింది. వీటిని రాయదుర్గంలోని ఎఫ్డీడీఐ–హైదరాబాద్ క్యాంపస్లో మంగళవారం ప్రదర్శించారు. కాగా స్నిగ్ధప్రియ ఎఫ్డీడీఐలో బీ.డీఈఎస్ లైఫ్స్టైల్ యాక్సెసరీస్ డిజైనర్ కోర్సులో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఎఫ్డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ తేజ్లోహిత్రెడ్డి, ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో వీటిని ఆవిష్కరించినట్లు ఆమె తెలిపారు. ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి.. భవిష్యత్తులో మంచి ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలన్నదే నా లక్ష్యం. ఆర్టిఫీషియల్ లెదర్తో ఈ మూడింటినీ తయారు చేశాను. టాయ్పప్పీ స్ఫూర్తితో వీటికి రూపకల్పన చేశాను. మినీ బ్యాగు తయారీకి ఆరు ఇంచుల లెదర్, ఒక బటన్ అవసరమైంది. దీనికి రూ.51 వ్యయం చేశాను. దీనికి స్పెక్ట్స్ హోల్డర్గా నామకరణం చేశాను. రాయదుర్గంలోని ఎఫ్డీడీఐ క్యాంపస్ నూతన ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.– స్నిగ్ధప్రియ, ఎఫ్డీడీఐ విద్యార్థి (చదవండి: మచుపిచ్చుపై..భాగ్యనగర వాసుల సాహసయాత్ర.!) -
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో.. విద్యార్థుల మరణాలు దారుణం
సాక్షి, అమరావతి: ‘గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై చనిపోతున్నారు. కొంతమంది ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఇది చాలా దారుణం. ఈ ఘటనలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలియజేయాలి. అంతేకాదు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలి’.. అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన కింద సభ్యుడు అనంత ఉదయభాస్కర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన హాస్టళ్లలో గడిచిన ఏడు నెలల్లో నలుగురు విద్యార్థులు మృతిచెందారని సభ దృష్టికి తీసుకొచ్చారు.ఈ దుర్ఘటనలపై రంపచోడవరం ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, బాధ్యులైన వారిని సస్పెండ్చేసి సమగ్ర విచారణ చేపడతామని చెప్పారన్నారు. విచారణ చేపట్టారో లేదో.. బాధ్యులపై చర్యలు తీసుకున్నారో లేదో కూడా చెప్పడంలేదని అన్నారు. ఈ మరణాలకు కారణాలేమిటో తెలియజేయడంతో పాటు విచారణ జరిపితే ఆ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందిస్తూ.. తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రస్తావన కింద ‘మండలి’లో చివరి రోజైన శనివారం ఇతర సభ్యులు ప్రస్తావించిన అంశాలు..‘నవయుగ’కు గిరిజన భూములెలా ఇస్తారు? గిరిజనుల హక్కులను కాలరాస్తూ వారి భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కేటాయిస్తారు? అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం టోకూరు, పెదవడ్డ, బూర్జా ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులను నవయుగ అనే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఇందుకోసం జీఓ–51ను జారీచేసింది. ఇది ముమ్మాటికి 1/70 చట్టాన్ని ఉల్లంఘించడమే. తక్షణమే ఆ జీఓ–51ను రద్దుచేయాలి. – కుంభా రవిబాబు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీతక్షణమే జీఓ–5ను రద్దుచేయాలి.. దొమ్మరి కులం పేరును దొమ్మిరి గిరిబలిజగా మారుస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జారీచేసిన జీఓ–5ను తక్షణమే రద్దుచేయాలి. దొమ్మరి కుల ప్రస్తావనతో తాము తీవ్ర వివక్షకు గురవుతున్నందున ఆ పేరు పూర్తిగా మాసిపోయేలా తమ సామాజికవర్గానికి కొత్తపేరు పెట్టాలని వారు కోరారు. కానీ, తిరిగి అదే పేరును కొనసాగిస్తూ బ్రాకెట్లో గిరిబలిజగా పేర్కొనడం సరికాదు. తక్షణమే ఈ జీఓను రద్దుచేయాలి. – వంకా రవీంద్రనాథ్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలక్ష మంది రోడ్డెక్కితే పట్టించుకోరా? రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్ష మందికి పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వలంటీర్ల వ్యవస్థను రద్దుచేసి ఆ పనిభారాన్ని వారిపై మోపారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు నిరసనలు, ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. తక్షణమే సచివాలయ ఉద్యోగులతో చర్చలు జరిపి, ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలి. – పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీపోలీసులకు పదోన్నతులు కలి్పంచాలి.. పోలీసు శాఖలో కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఏళ్ల తరబడి పదోన్నతులు లేకుండా ఇబ్బందిపడుతున్నారు. చాలామంది ఇన్స్పెక్టర్లు ఒక్క ప్రమోషన్ మాత్రమే తీసుకుని రిటైర్ అవుతున్నారు. తక్షణమే వారికి పదోన్నతులు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థల రక్షణకు ఏర్పాటుచేసే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నియామకాలు ఏపీలోనే చేపడితే కొత్త పోస్టులు, ప్రమోషన్ ఛానల్స్ పెరుగుతాయి. – ఏసురత్నం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీఎంపీటీసీలు, జెడ్పీటీసీల బకాయిలు చెల్లించాలి.. రాష్ట్రంలో 13 వేల మంది ఎంపీటీసీలకు రూ.100.30 కోట్లు, 660 జెడ్పీటీసీలకు రూ.9.50 కోట్ల మేర గౌరవ వేతన బకాయిలున్నాయి. వాటిని వెంటనే చెల్లించాలి. – బొమ్మి ఇజ్రాయెల్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ విశాఖలో వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలి.. విశాఖపట్నంలో మూడువేలకు పైగా వీధి వ్యాపారుల షాపులను జీవీఎంసీ అధికారులు తొలగించారు. వీరితోపాటు వారి వద్ద పనిచేసే వేలాది మంది రోడ్డునపడ్డారు. సుందరీకరణ, ట్రాఫిక్ పేరిట తొలగించడం సరికాదు. వారికి ప్రత్యామ్నాయం చూపాలి. – సూర్యనారాయణరాజు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ‘హైస్కూల్ ప్లస్’లలో ఖాళీలను భర్తీచేయాలి.. హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో 1,572 పీజీటీ శాంక్షన్ పోస్టులుండగా, 800 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 772 పోస్టులు కాంట్రాక్టు లెక్చరర్లతో కాకుండా స్కూల్ అసిస్టెంట్లతో భర్తీచేయాలి. – కల్పలతారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ‘ఒంటిమిట్ట’ పర్యాటక ప్రాజెక్టును పట్టాలెక్కించాలి.. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో కోదండ రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా పడలేదు. తక్షణమే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలి. – రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ -
పోలీసుల దర్యాప్తు ఇంత దారుణమా..?
సాక్షి, అమరావతి: ఓ దళిత విద్యార్థిని మృతి ఘటనపై దర్యాప్తులో పోలీసుల అలక్ష్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించడం సముచితమని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసే ముందు, ఈ కేసులో దర్యాప్తు పురోగతిని తెలియజేస్తూ ఒక నివేదికను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం గుంటూరు జిల్లా బుడంపాడులోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీలో అమృతలూరు మండలం, గోపాయపాలేనికి చెందిన గర్నెపూడి శ్రావణ సంధ్య పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతూ 2017 ఫిబ్రవరి 28న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన కుమార్తెది హత్య అని, దీనికి కాలేజీ యాజమాన్యంతోపాటు రూంమేట్స్ కారణమంటూ మృతురాలి తల్లి గర్నెపూడి జయలక్ష్మి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య అనే అనుమానంతో జయలక్ష్మి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత అసలు ఈ కేసును దర్యాప్తు చేయకుండా పక్కన పడేశారు. దీంతో చేసేదేమీ లేక జయలక్ష్మి 2017 జూలై 6వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె మృతిపై సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తాజా విచారణ సందర్భంగా శుక్రవారం నల్లపాడు పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది కొన్ని వివరాలను లిఖితపూర్వకంగా హైకోర్టు ముందుంచారు. వాటిని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, శ్రావణ సంధ్య 4వ ఫ్లోర్ నుంచి కింద పడే సమయంలో అక్కడ ఎవరూ లేరని పోలీసులు పేర్కొన్నారు. ఇదే పోలీసులు మృతురాలి హాస్టల్లో ఉంటున్న సహచరులను విచారించగా, వారు శ్రావణ సంధ్య 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి మరణించినట్లు పేర్కొన్నారు. ఈ పరస్పర విరుద్ధమైన పోలీసు స్టేట్మెంట్లను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్... పోలీసులు ఈ కేసులో సరిగ్గా దర్యాప్తు చేయలేదని తేల్చారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. పోలీసు శాఖ దారుణ దర్యాప్తునకు ఈ కేసు ఓ మంచి ఉదాహరణని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో శ్రావణ సంధ్య మృతి కేసులో పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయలేదన్న జయలక్ష్మి తరఫు న్యాయవాది జీవీ శివాజీ వాదనలతో ఏకీభవించడం మినహా కోర్టుకు మరో అవకాశం లేకుండాపోయిందన్నారు. -
విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేక విభాగం
విజయనగర్ కాలనీ(హైదరాబాద్): రాష్ట్రంలోని నైపుణ్యత కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతోపాటు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కూడా అందిపుచ్చుకోవడానికి సహాయకారిగా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. యువతీయువకులు తమ భవిష్యత్ను తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్నిరకాల అవకాశాలు కల్పింస్తుందని, ఆ అవకాశాలను సది్వనియోగం చేసుకొని భవిష్యత్కు ప్రణాళికలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్లోని మల్లేపల్లి ఐటీఐ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ‘ఏటీసీల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రతి నెలా రూ.2,000 స్టైపెండ్ ఇస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని, ఇది ఖర్చు కాదు. భవిష్యత్కు పెట్టుబడి. పని చేయాలన్న సంకల్పం కావాలి. కష్టపడి పనిచేయాలని’చెప్పారు. తెలంగాణ పునర్మింర్మాణంలో భాగస్వాములు కావాలి ఏటీసీల్లో శిక్షణ పొందిన తమ్ముళ్లు, చెల్లెళ్లు తెలంగాణ పునర్మింర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా ఎదగడంలో మీ వంతు కృషి చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యం కలిగిన శిక్షణ అందించాలన్న లక్ష్యంతో గత ఏడాది ఇదే ప్రాంగణంలో ఏటీసీలకు పునాదులు వేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతమున్న 65 ఏటీసీలకు అదనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో 51 ఏటీసీలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చడానికి ప్రభుత్వం కేవలం రూ. 300 కోట్లు ఖర్చు చేస్తే, టాటా సంస్థ రూ.2,100 కోట్లు ఖర్చు చేసి ఆధునిక ఏటీసీలను తీర్చిదిద్దిందని చెప్పారు. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావకాశాలు రాష్ట్రంలో ఏటా లక్షా 10 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టా పొందుతున్నా, నైపుణ్యం లేని కారణంగా చాలామందికి ఉద్యోగావకాశాలు రావడం లేదని సీఎం రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నైపుణ్యం లేనిదే ప్రైవేట్లో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని, అందుకే స్కిల్స్ పెంచాలన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి ప్రారంభించామంటే మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్నదే మా సంకల్పమన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు అనిల్కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, టాటా టెక్నాలజీస్ ప్రతినిధులు హాజరయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు. -
ఇది వర్సిటీయా.. లేక జైలా!?
బీచ్రోడ్డు (విశాఖ జిల్లా): ‘ఊపిరి పీల్చుకోలేని స్థితిలో తమ సహ విద్యార్థి ఆక్సిజన్.. ఆక్సిజన్.. అంటూ చనిపోయాడని, ఇందుకు ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు మండిపడ్డారు. ఆరు నెలలుగా వర్సిటీలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నా ఏయూ పాలకులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని, వారి నిర్లక్ష్యం ఖరీదే బీఈడీ విద్యార్థి మణికంఠ మరణమని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించడం చేతకాని వీసీ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఏయూలో బీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మణికంఠ బుధవారం ఉదయం ఊపిరి తీసుకోలేక అస్వస్థతకు గురవ్వడం.. సహ విద్యార్థులు ఏయూ ఆరోగ్య కేంద్రానికి ఫోన్ చేయడం.. అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ ఉన్నప్పటికీ.. ఆక్సిజన్ పెట్టకుండానే కేజీహెచ్కు తరలించడం.. కాసేపటికే మణికంఠ మరణించడం తెలిసిందే. ఈ ఘటనపై విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శుక్రవారం ఏయూ విద్యార్థులు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఆరు నెలలుగా తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఈడీ ప్రవేశ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి వర్సిటీలో చేరిన మణికంఠను విగతజీవిగా అప్పగించడంపై ఆయన తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అధికంగా ఉన్న పరీక్షల ఫీజులు తగ్గించాలని కోరినా పట్టించుకోలేదని, అలాంటప్పుడు వీసీగా కొనసాగటం ఎందుకని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు ఎవరి మేలు కోసమో వర్సిటీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 6వ తేదీ నాటికి సమస్యలన్నీ పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మెస్ చార్జీల పెంపు, ఫీజు రీయింబర్స్మెంట్ అతీగతీ లేదని మండిపడ్డారు. సమస్యల గురించి మాట్లాడితే ఫెయిల్ చేస్తామంటూ విభాగాధిపతులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది విశ్వవిద్యాలయమా.. లేక జైలా అని మండిపడ్డారు. పోలీసుల అత్యుత్సాహం ఏయూలో విద్యార్థులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తమను అడ్డుకుంటున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న కలెక్టరేట్ వద్ద సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు అమానుషంగా ప్రవర్తించి, భీమిలి పోలీస్ స్టేషన్కు తరలించారని వాపోయారు. మణికంఠ మృతికి నష్ట పరిహారం కోసం ఏయూ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. పురుష పోలీసులతో విద్యార్థినులపై దాడి చేయటం ఘోరమన్నారు. రాజకీయ ద్వేషంతో ఆందోళనలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. తామెలాంటి రాజకీయాలు చేయడం లేదని, సమస్యల్ని తప్పుదోవ పట్టించేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాక్ కమిటీ ఏయూను సందర్శిస్తుందని తెలిసి ఒక్క రాత్రిలోనే రోడ్లు వేసిన ఉన్నతాధికారులు.. తమ సమస్యలను మాత్రం ఆరు నెలలుగా పరిష్కరించకుండా సాగదీస్తున్నారని ధ్వజమెత్తారు.ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీఏయూ డిస్పెన్సరీలో అందిస్తున్న సేవలు, విద్యార్థి మణికంఠ మరణానికి గల కారణాలపై విచారించేందుకు డీఎంఅండ్హెచ్వో, కేజీహెచ్ సూపరింటెండెంట్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్లతో కలెక్టర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను కలెక్టర్కు సమర్పించనుంది. వారం రోజుల్లో నివేదికలోని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తరుఫున డీఎస్పీ ప్రమీల హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. పోలీసులు మాపై దాడి చేశారు మా తోటి విద్యార్థికి జరిగిన అన్యాయం, మా సమస్యల పరిష్కారం కోసం మేము ఉన్నతాధికారుల వద్దకు వెళ్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళలని కూడా చూడకుండా మాపై దాడి చేశారు. నన్ను ఒక పోలీసు మోకాలితో నెట్టి వెనక్కి తోశారు. నా చేతికి గాయాలయ్యాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఏయూను శవాల దిబ్బగా మారుస్తున్నారు. – సౌజన్య, ఎంబీఏ విద్యార్థిని వర్సిటీలో నియంత పాలన ఆంధ్ర యూనివర్సిటీలో నియంత పాలన సాగుతోంది. తనపై చాన్స్లర్ అయిన గవర్నర్ ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా వీసీ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయలేని అసమర్థ ఉన్నతాధికారులు తక్షణమే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి. – తరుణ్, బీఈడీ విద్యార్థి లిఖిత పూర్వకంగా ఇవ్వాలి విద్యార్థుల సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు? ఎలా పరిష్కరిస్తారు? లిఖిత పూర్వకంగా ఏయూ అధికారులు తెలపాలి. ఇచి్చన గడువు లోపు సమస్యలు పరిష్కరించ లేకపోతే వారి పదవులకు రాజీనామా చేయాలి. ఆరు నెలలుగా అనేకసార్లు మా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రతిసారీ చేస్తాం అంటున్నారే తప్ప పరిష్కరించడం లేదు. ఈసారి పరిష్కరించే వరకు వదిలే ప్రసక్తి లేదు. – ప్రవీణ్ కుమార్, లా స్టూడెంట్ -
బాయ్ఫ్రెండ్తో వీడియో కాల్లో మాట్లాడుతూ..
అన్నానగర్(చెన్నై): కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని ఎరుమనూర్ గ్రామానికి చెందిన దర్శిని (18). ఈమె విరుదాచలం ప్రభుత్వ కొలంజియప్పర్ ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం బి.ఎ. చదువుతోంది. విరుదాచలం జంక్షన్ రోడ్ బస్టాండ్ సమీపం సెల్ఫోన్ సేల్స్ షాపులో పనిచేస్తోంది. విద్యార్థిని దర్శిని కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమించినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో సోమవారం ఉదయం సెల్ఫోన్ షాపులో పనిచేస్తుండగా, తన ప్రియుడితో సెల్ఫోన్ ద్వారా వీడియో కాల్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో వారిద్దరి మధ్య సమస్య కారణంగా, వీడియో కాల్లో మాట్లాడుతున్న దర్శిని దుకాణం వెనక్కి వెళ్లి అక్కడి గదిలో తలపాగాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నోటికి ప్లాస్టర్.. ముక్కుకు క్లిప్పు..!
గుంటూరు జిల్లా: గుంటూరులో ఘోరం జరిగింది. బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని నోటికి ప్లాస్టర్, ముక్కుకు క్లిప్పు పెట్టుకుని బలవన్మరణానికి పాల్పడింది.ఏలూరుకు చెందిన కావ్య.. గుంటూరు వీవీఐటీలో బీటెక్ చదువుతోంది. అశోక్ నగర్లోని ఓ లేడీస్ హాస్టల్లో ఉంటోంది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సోది చెబుతానమ్మా..
ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమ అమలు తీరును ఓ విద్యార్థిని వినూత్నంగా వివరిస్తూ ఆకట్టుకుంది. కార్యక్రమ అమలు తీరుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఆయా పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, స్టూడెంట్ చాంపియన్లు కార్యక్రమ ప్రయోజనాలను వివరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని సాయి సృజన.. ఆరు రోజుల పాటు అమలు చేస్తున్న కార్యక్రమాలను తనదైన శైలిలో వివరించింది. కలెక్టర్తో.. సోది చెబుతానమ్మా.. అంటూ వివరించి ఆకట్టుకుంది -
పట్టపగలే విద్యార్థిని కిడ్నాప్
చాగలమర్రి: కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థినిని గుర్తు తెలియని దుండగులు పట్టపగలే కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో చోటు చేసుకుంది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం కానగూడూరుకు చెందిన మంత్రాల గౌస్, మస్తాన్బీల కుమార్తె షాజిదా స్థానిక డిగ్రీ కాలేజీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. రోజూ కానగూడూరు నుంచి చాగలమర్రిలోని కాలేజీకి బస్సులో వచ్చి వెళ్తుంటుంది. షాజిదా తనకు అనారోగ్యంగా ఉందని.. ఇంటికి వెళ్లడానికి అనుమతివ్వాలని గురువారం ఉదయం 11.30 సమయంలో ప్రిన్సిపాల్ను కోరింది. ఆమె తండ్రితో ఫోన్లో మాట్లాడిన అనంతరం ప్రిన్సిపాల్ ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కాలేజీ గేటు దాటి బయటికి వచ్చిన షాజిదాను.. అక్కడే కాపు కాచి ఉన్న దుండగులు బలవంతంగా కారులోకి లాగేసి.. ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తండ్రికి షాజిదా ఫోన్ చేసి.. కిడ్నాప్ విషయాన్ని చెప్పింది. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ సురేశ్, ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళిధర్రెడ్డి చాగలమర్రికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే విద్యార్థినిని కిడ్నాప్ చేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. -
Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్
-
హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
సాక్షి, హైదరాబాద్: నారాయణ జూనియర్ కాలేజీలో దారుణం జరిగింది. ఫ్లోర్ ఇంఛార్జ్ దాడిలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థి సాయి పునీత్ దవడ ఎముక విరిగింది. గడ్డి అన్నారం నారాయణ కాలేజీ బ్రాంచ్లో ఘటన జరిగింది. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3:15 గంటలకు ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం జరిగింది. విద్యార్థుల మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో జోక్యంచేసుకున్న ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్.. విద్యార్థులను చితకబాదాడు.తిండి తినలేని స్థితిలో విద్యార్థి ఉన్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మలక్పేట పోలీస్ స్టేషన్లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్లోర్ ఇంఛార్జ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి రాగా, విద్యార్థుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరుగుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. తప్పు గురించి పక్కనబెడితే.. గొడవ జరుగుతున్న సమయంలో ఇన్ఛార్జ్ సతీష్.. విద్యార్థులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. -
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దారుణం
సాక్షి, హైదరాబాద్: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థిపై మరి కొంతమంది విద్యార్థులు దాడిచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బర్త్డే వేడుకలో విద్యార్థిపై పిడిగుద్దులు కురిపించారు. విద్యార్థికి రక్తం కారుతున్నా వదలని క్లాస్మేట్స్.. దాడికి పాల్పడ్డారు. ఆగస్టు 29న 9వ తరగతికి చెందిన విద్యార్థి పుట్టినరోజున పాఠశాల వచ్చాడు. తరగతి గదిలో మరో ముగ్గురు స్నేహితులు 'బర్త్ డే బంప్స్' అనే ఆట ఆడారు. దీనిలో భాగంగా ప్రైవేట్ భాగాలను మోకాలితో బలంగా కొట్టారు.కొంతమంది తనపై దాడి చేశారని సదరు విద్యార్థి వైస్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కుటుంబస భ్యులు పలు ఆస్పత్రులలో చిక్సిత నిమిత్తం డాక్టర్ను సంప్రదించారు. పరీక్షించిన వైద్యులు మరో 3 నెలల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలిక పుర్రె పగిలేలా కొట్టిన భాష్యం టీచర్
-
ప్రైవేట్ స్కూల్లో దారణం.. విద్యార్థిని తల చిట్లేలే కొట్టిన టీచర్
చిత్తూరు జిల్లా: పుంగునూరులో ఓ ప్రైవేటు స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. భాష్యం స్కూల్లో ఆరో తరగతి విద్యార్థిని సాత్విక నాగశ్రీ(11) తలపై ఉపాధ్యాయుడు తలపై కొట్టాడు. దాంతో ఆ బాలిక పుర్రె చిట్లినట్లుగా ఎక్స్రేలో గుర్తించారు వైద్యులు. ఇది ఐదు రోజుల క్రితం జరగ్గా, ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేసింది బాలిక తల్లి. అయితే బాలిక తల్లి ఫిర్యాదును ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు. ప్రస్తుతం మదనపల్లె ప్రైవేటు ఆస్పత్రిలో బాలిక వైద్యం చేయించుకుంటోంది. దీనిపై పోలీసులకు నిన్న(సోమవారం) రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక తల్లి విజేత. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మీ అక్క నా వద్ద ఉంది.. వచ్చి తీసుకెళ్లు
నెల్లూరు (క్రైమ్): ఓ యువతిని కత్తితో పొడిచి ప్రేమికుడే కడతేర్చిన ఘటన శనివారం తెల్లవారుజామున నెల్లూరు నగరంలోని పోస్టల్ కాలనీలో జరిగింది. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబలి్లకి చెందిన గిరిబాబు, శ్రీలక్ష్మి దంపతులకు మైథిలిప్రియ (23), సాహితి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గిరిబాబు 2020లో గుండెపోటుతో మృతి చెందాడు. ప్రస్తుతం ఆ కుటుంబం మూలాపేటలో ఉంటోంది. మైథిలిప్రియ వెంకటాచలంలోని ఓ కళాశాలలో ఈ ఏడాది మార్చిలో బీఫార్మసీ పూర్తి చేసింది. ఆమె బీఫార్మసీ చదివే సమయంలో అదే కళాశాలలో సహచర విద్యార్థి రాపూరు మండలానికి చెందిన నిఖిల్తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. మైథిలిప్రియ, ఆమె చెల్లెలు సాహితి పోస్టల్కాలనీ మొదటి వీధిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఎదురు బిల్డింగ్లో నిఖిల్ ఉంటున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ మరో యువతితో సన్నిహితంగా ఉంటూ మైథిలితో తరచూ గొడవ పడుతుండేవాడు. సుమారు నాలుగు నెలల కిందట మైథిలికి బెంగళూరులోని అమెజాన్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆమె అక్కడకు వెళ్లింది. పుట్టిన రోజు జరుపుకునేందుకు వచ్చి.. ఈ నెల 6న మైథిలి పుట్టిన రోజు కావడంతో 3న నెల్లూరుకు వచ్చింది. చెల్లెలు గదిలో ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు జరుపుకుంది. ఈ క్రమంలోనే నిఖిల్ పలుమార్లు ఆమెకు ఫోన్ చేసి గొడవ పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సాహితి అతనితో ఇక వద్దని అక్కకు సూచించింది. ఈ నెల 12న రాత్రి పొద్దుపోయే వరకు మైథిలి ఫోన్ చేసుకుంటూ ఉండగా సాహితి నిద్రపోయింది. 13వ తేదీ తెల్లవారుజామున సుమారు 1.45 గంటల ప్రాంతంలో సాహితి నిద్ర నుంచి లేచి చూడగా అక్క కనిపించకపోవడంతో ఆమెకు ఫోన్ చేసింది. ఫ్రెండ్స్తో ఉన్నానని, పది నిమిషాల్లో వస్తానని, నిఖిల్కు ఫోన్ చేయొద్దని చెప్పింది. దీంతో సాహితి తిరిగి నిద్రపోయింది. సుమారు 3.35 గంటల ప్రాంతంలో ‘‘మీ అక్క నా వద్ద ఉందని, వచ్చి తీసుకెళ్లు’’ అని నిఖిల్ సాహితికి ఫోన్ చేసి చెప్పాడు. సాహితి తన స్నేహితురాలు, రూమ్ కింద ఉంటున్న ఓ మహిళను తీసుకుని నిఖిల్ గది వద్దకు వెళ్లింది. అక్కడ మెట్లపై మైథిలి విగతజీవిగా ఉంది. ఆమె ఎడమ చంక కింద కత్తి పోటు ఉంది. రక్తస్రావమైంది. దీంతో తన అక్కకు ఏమైందని నిఖిల్ను నిలదీయగా తనతో గొడవపడడంతో కత్తితో పొడిచానని నిఖిల్ చెప్పాడు. సాహితి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సాహితి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నిఖిల్ దర్గామిట్ట పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. తన కుమార్తెను హత్య చేసిన నిఖిల్ను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి శ్రీలక్ష్మి పోలీసు అధికారులను కోరారు. -
లిటిల్ పొయెట్..!
కేరళ రాష్ట్రం కోళికోడ్కు చెందిన అజ్ఞా యామి దేశంలో అతి పిన్న వయస్కురాలైన కవయిత్రిగా రికార్డు సృష్టించింది. ఐదేళ్లకే కవిత్వం రాసి పుస్తకం వేసింది. రైమ్స్ చెప్పే వయసులో సొంతంగా కవిత్వం రాయడం చాలా గ్రేట్.అజ్ఞా యామి 2017లో జన్మించింది. యూకేజీ చదువుతున్న సమయంలోనే మలయాళ పదాలతో వాక్యాలు రాస్తూ తన భావాలను వ్యక్తం చేసేది. ఆమె ప్రతిభ, భాష పట్ల మక్కువ చూసిన తల్లిదండ్రులు, శ్రీశాంత్, శ్రుతి ప్రోత్సహించారు. కవిత్వం గురించి, కవితల గురించి వివరించారు. కొన్ని కవితలు విన్న అజ్ఞా యామి తనూ కవిత్వం రాయడం మొదలెట్టింది. చుట్టూ ఉన్న ప్రపంచంలోని రకరకాల అంశాలపై కవితలు అల్లింది. బాల్యంలోని అమాయకత్వం మొదలుకొని, ప్రకృతిలోని రంగుల వరకు అనేక రకాల సబ్జెక్ట్స్ పై పోయెమ్స్ రాసింది. 30 కవితల్ని కలిపి ‘వర్ణపట్టం’(రంగుల గాలిపటం) పేరుతో పుస్తకం వెలువరించింది. వాటికి బొమ్మలు కూడా తనే గీయడం విశేషం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అతి పిన్న వయస్కురాలైన కవయిత్రిగా రికార్డు అందించారు. (చదవండి: చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు) -
Students: ఛీ.. ఏం పాపం చేశామని.. నీలాంటి సీఎం దొరికాడు!
-
ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు..తల్లితో గొడవ ఆపై విద్యార్ధి ఆత్మహత్య
సాక్షి,జగిత్యాల జిల్లా: ఆన్లైన్గేమ్స్కు అలవాటు పడి తొమ్మిదవ తరగతి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని లింగంపేటకు చెందిన విష్ణువర్ధన్ (15) ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి తరచూ మొబైల్లో మునిగిపోతున్నాడు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్స్ను పక్కన పెట్టి చదువుపై దృష్టిసారించాలని విష్ణువర్ధన్ను అతని తల్లి మందలించింది. దీంతో తల్లిపై తిరగబడి,దాడి చేశాడు. అనంతరం ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
విశాఖలో విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్
మధురవాడ (విశాఖ జిల్లా): మాట వినలేదని ఓ విద్యార్థి చేయిని టీచర్ విరగ్గొట్టిన ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురవాడ ఆదిత్యనగర్లో ఉన్న శ్రీ తనుష్ ప్రైవేట్ స్కూల్లో మధురవాడకు చెందిన నరేష్ (13) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం క్లాసులో ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన సోషల్ టీచర్ మోహన్..కోపంతో నరేష్ను కొట్టి, షర్ట్ పట్టుకుని గట్టిగా తోశాడు. దీంతో బాధిత విద్యార్థి ఇనుప బెంచీపై పడడంతో చెయ్యి విరిగింది. అంతటితో ఆ టీచర్ ఆగకుండా.. అక్కడే మోకాళ్లపై నరేష్ను కూర్చోబెట్టి అమానుషంగా ప్రవర్తించాడు.ఇంటికి వెళ్లి విద్యార్థి తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పగా..వారు వైద్యం నిమిత్తం నరేష్ను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. టీచర్ మోహన్ పరారీలో ఉన్నాడు. బుధవారం వినాయక చవితి సందర్భంగా సెలవు కావడంతో, గురువారం పాఠశాలకు చేరుకున్న తండ్రి ఆదినారాయణ ఇతర కుటుంబ సభ్యులు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ బిడ్డకు న్యాయం చేయకపోతే ఊరుకునేది లేదంటూ నినదించారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల అసోసియేషన్ ప్రతినిధులు స్కూల్ యాజమాన్యానికి వంత పాడటం గమనార్హం. ఘటనాస్థలికి మండల విద్యాశాఖ అధికారి అనురాధ, పీఎంపాలెం పోలీసుస్టేషన్ ఎస్ఐ సునీత చేరుకుని విచారణ చేట్టారు. -
శ్రీ చైతన్య హాస్టల్లో ర్యాగింగ్ కలకలం.. ఐరన్ బాక్స్తో వాతలు పెట్టి..
కోనసీమ జిల్లా: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేపింది. రాజమండ్రి మోరంపూడి శ్రీ చైతన్య హాస్టల్లో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధి గుర్రం విన్సెంట్ ప్రసాద్ (16)పై సహచర విద్యార్థుల పైశాచికత్వం ప్రదర్శించారు బాధితుడి పొట్ట భాగం,చేతులపై విచక్షణ రహితంగా ఐరన్ బాక్స్తో వాతలు పెట్టారు. శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్న కుమారుణ్ని చూసేందుకు ప్రసాద్ తల్లిదండ్రలు రావడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. వాతలు పడిన గాయాలతో ఆపస్మాకర స్థితిలో ఉన్న విద్యార్థిని అత్యవసర చికిత్స నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి లక్ష్మీ కుమారి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.అయితే ఆమె ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, విద్యార్థిపై ఐరన్ బాక్స్తో దాడికి తెగబడ్డ సహచర విద్యార్థులు బాధితుడిపైకి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. తాము దాడికి పాల్పడిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు బాధిత విద్యార్ధి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
హైదరాబాద్ : విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని మాజీ వింగ్ కమాండర్ సందీప్ సింగ్ జగ్గి అన్నారు. శుక్రవారం మాదాపూర్లోని మెరీడియన్ స్కూల్లో మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వివిధ దేశాల ప్రతినిధులుగా వ్యవహరిస్తూ చర్చించేందుకు ఇలాంటి వేదిక ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ కరణం భవాని మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్ సెషన్స్లో నగరంలోని 40 పాఠశాలల నుంచి 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. వీరు వివిధ దేశాల రాయబారులుగా, ప్రతినిధులు ఆయా దేశాల్లోని నిధులు, నియామకాలు, సమస్యలు, పర్యావరణ సమస్యలు, సహజ వనరులపై చర్చిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తొలి రోజు తమ దేశాల ఎజెండాలను ప్రవేశ పెట్టి ఒక్కో అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
చిన్నారిని గదిలో ఉంచి తాళం!
భువనేశ్వర్: ఒడిశాలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నిర్వాకమిది. బెంచీపై నిద్రిస్తున్న రెండో తరగతి చదివే ఎనిమిదేళ్ల చిన్నారిని అలాగే క్లాస్ రూంలో వదిలి, తాళమేసి ఇంటికి వెళ్లిపోయాడు. మెలకువ వచ్చాక ఆ చిన్నారి కేకలు వేసినా ఎవరికీ వినిపించలేదు. రాత్రంతా చీకట్లో, ఒంటరిగా అలాగే భయంభయంగా ఉండిపోయింది. చివరికి కిటికీలోంచి దూరి బయటకు వచ్చేందుకు శతథా ప్రయత్నించింది. వీలుకాక కిటికీ గ్రిల్లో తల ఇరుక్కుపోయింది. ఉదయం గ్రామస్తులు వచ్చి చూసే వరకు కొన్ని గంటలపాటు అలాగే వేదన అనుభవించింది. కియోంఝర్ జిల్లాలో అన్జార్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఘటన చోటుచేసుకుంది. రెండో తరగతి చదువుతున్న జోత్య్స దెహురి(8) అనే చిన్నారి తరగతి గదిలో ఓ బెంచీపై పడుకుని అలాగే నిద్రపోయింది. ఆమెను పట్టించుకోకుండా ఉపాధ్యాయుడు తరగతి గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. చిన్నారి చీకటిపడిన రాకపోయేసరికి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఊరంతా వెదికారు. శుక్రవారం ఉదయం ఆ స్కూలు వైపుగా వెళ్లిన గ్రామస్తులకు కిటికీ గ్రిల్లో తల ఇరుక్కుపోయిన స్థితిలో జోత్స్న రోదిస్తూ కనిపించింది. వెంటనే గ్రిల్స్ను తొలగించి, చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో స్కూలు ఇన్ఛార్జి హెడ్మాస్టర్ గౌరహరి మహంతాను అధికారులు సస్పెండ్ చేశారు. తరగతి గది కిటికీ గ్రిల్లో చిన్నారి తల ఇరుక్కున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఉపాధ్యాయుల వైఖరిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సాయంత్రం 4 గంటల తర్వాత తరగతి గదికి తాళాలు వేయాలంటూ 8వ తరగతి విద్యార్థులకు హెడ్మాస్టర్ చెప్పినట్లు విచారణలో తేలిందని డీఈవో వెల్లడించారు. -
డిజైన్ డెమోక్రసీ..!
ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ ఉత్పత్తులకు సంబంధించిన పాపులర్ ప్రదర్శన డిజైన్ డెమోక్రసీ వచ్చేనెల 5న నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన నిర్వాహకులు ఎక్స్పో వివరాలను వెల్లడించారు. ఇందులో 120కి పైగా ప్రముఖ బ్రాండ్లు, 80పైగా పేరొందిన స్పీకర్లు పాల్గొంటారని, 15 వేలకుపైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 3 రోజుల ప్రదర్శనలో చర్చలు, ఆవిష్కరణలు.. వంటివి ఉంటాయన్నారు. ఫర్నిచర్, లైటింగ్, ఫ్లోరింగ్, గృహోపకరణాలు, వంటగది, బాత్, డెకర్ ఉపకరణాలు ఫైన్ఆర్ట్, క్రాఫ్ట్ వంటి వాటి ఎంపికలో నగర వినియోగదారుల అభిరుచులను కొత్తస్థాయికి ఇవి చేరుస్తాయన్నారు. సమావేశంలో సహ వ్యవస్థాపకులు శైలజా పట్వావరీ, మల్లికా శ్రీవాస్తవ్, క్యూరేటర్ అర్జున్ రతి పాల్గొని మాట్లాడారు.విద్యార్థి ప్రతిభ..ఎఫ్డీడీఐ–హైదరాబాద్ విద్యార్థులు చదువుతోపాటు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ వినూత్న ఆలోచనలతో వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఎఫ్డీడీఐలోని ఎల్ఎల్పీడీకి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి జీవా ప్రోటోటైప్ ఉత్పత్తిగా కుట్టులేని నాణెం పౌచ్కు రూపకల్పన చేశారు. రావి(పీపాల్) ఆకు రూపం, ఆకృతి నుంచి ప్రేరణ పొంది ఆకుపచ్చ రంగులో కృత్రిమ తోలు, గుండు సూది, షూలేస్ను ఉపయోగించి కుట్లు లేకుండా ఈ పౌచ్ను తయారు చేశాడు. జీవాను ఎఫ్డీడీఐ –హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తేజ్లోహిత్రెడ్డి, ఫ్యాకల్టీ ప్రతినిధులు వేణుగోపాల్, గోఫ్రాన్, రుచిసింగ్, హుస్సేన్, రాంబాబు అభినందించారు. – రాయదుర్గం (చదవండి: నయా ట్రెండ్.. గణేశుడికి గ్రాండ్ వెల్కమ్!) -
ఎయిత్ స్టూడెంట్ చేతిలో టెన్త్ విద్యార్థి హతం.. ప్రజాగ్రహంతో స్కూలు ధ్వంసం
గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఏదో వివాదంలో ఎనిమిదో తరగతి.. విద్యార్థి పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడవగా, బాధిత విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం బయటకు పొక్కినంతనే ప్రజాగ్రహం పెల్లుబికి పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆగ్రహంతో రగిలిపోతూ కొందరు ఆందోళనకారులు పాఠశాలను ధ్వంసం చేశారు.మణినగర్ ఈస్ట్లోని సెవెంత్ డే అడ్వాంటేజ్ చర్చి స్కూల్లో ఎనిమిదవ తరగతి విద్యార్థి 10వ తరగతి విద్యార్థిని కత్తితో పొడిచాడు. చికిత్స పొందుతున్న సమయంలో ఆ విద్యార్థి మరణించాడు. అనంతరం బాధిత కుటుంబంతో పాటు సింధీ వర్గానికి చెందినవారంతా ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించిన నిరసనకారులు పాఠశాల సిబ్బందిపై దాడి చేశారు. సమీపంలో పార్క్ చేసిన పాఠశాల బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడులతో పాఠశాల ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులు పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పాఠశాల వెలుపల రోడ్డును దిగ్బంధించారు.మణినగర్ ఎమ్మెల్యే, డీపీపీ బల్దేవ్ దేశాయ్, ఏసీపీ పరిస్థితిని చక్కదిద్దడాని ప్రయత్నించారు. బజరంగ్ దళ్, బీహెచ్పీ, అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యులు ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేస్తూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. చివరికి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. -
ఒకప్పుడు నా కుటుంబానిది కూడా అదే పరిస్థితి: రాఘవ లారెన్స్ ఎమోషనల్
కోలీవుడ్ హీరోలు సమాజ సేవలో ఎప్పుడు ముందుంటారు. కొన్నేళ్లుగా సూర్య తన అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. తన వంతా సాయం చేస్తూ పేద విద్యార్థులను డాక్టర్స్, ఇంజినీర్స్ను చేస్తున్నారు. అదే బాటలో మరో స్టార్ హీరో లారెన్స్ కూడా దూసుకెళ్తున్నారు. ఎక్కడా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాను స్థాపించిన మాత్రం ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సాయమందిస్తున్నారు. తాజాగా ఓ పేద విద్యార్థిని కష్టాలు చూసిన ఆయన చలించిపోయారు.ఓ తండ్రి తన కూతురి చదువుకోసం తన భార్య(లేట్) మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టడం తనను ఎమోషనల్గా కదిలించిందని రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు. ఎందుకంటే నా కుటుంబం కూడా ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొందని గుర్తు చేసుకున్నారు. అందుకే ఆ మంగళసూత్రాన్ని అతనికి వెనక్కి ఇప్పించి.. ఆ కుటుంబానికి అండగా నిలిచానని ట్వీట్లో రాసుకొచ్చారు. అది కేవలం బంగారం మాత్రమే కాదని.. అతని భార్య విలువైన జ్ఞాపకం అని రాఘవ లారెన్స్ పోస్ట్ చేశారు. ఈ రోజు తన హృదయం చాలా సంతోషంతో నిండిపోయిందన్నారు. Hi everyone! I came across a story about a father who had pawned his late wife’s thali to pay for his daughter’s education. This touched me deeply, because my own family once went through a similar struggle. Through Maatram, i was able to retrieve the thali and return it to… pic.twitter.com/25VMi8fRHS— Raghava Lawrence (@offl_Lawrence) August 17, 2025 -
విద్యార్థులకు 'భవిష్యత్' పాఠం
అవి మా ముత్తాత పోయిన కొత్తలు. ఆయన ఒక సన్నకారు రైతు. ఆయన పోవడంతో మా ముత్తవ్వ యువ వితంతువుగా మారింది. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమారులు. ఆదాయ వనరు సున్నా. ఇద్దరు పిల్లలను చదివించి, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో దగ్గరలోని ఓ పట్టణానికి మకాం మార్చారు. ఓ ఇంట్లో పని మనిషిగా చేరారు. చాలీచాలని ఆదాయం ఇద్దరు పిల్లల్లో ఒకరిని చదివించేందుకే సరిపోతుంది. ఇద్దరు పిల్లల మధ్య వయసులో పెద్ద తేడా లేదు. ఆ ఇద్దరిలో ఒక పిల్లాడు బాధ్యతతో మెలిగేవాడుగా కనిపించాడు. రెండవవాడు కాస్త పేచీకోరు. పరిస్థితులకు అనుగుణంగా మసలుకునే పిల్లాడిని, ఆమె పనిలోకి దింపారు. అతను భవన నిర్మాణ పనుల్లో దినసరి కూలీగా మారాడు. కొత్త నైపుణ్యాలను గడించుకుని, ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని అందుకొనే అవకాశం ఎన్నడూ లభించలేదు. మరో పిల్లాడిని స్థానికంగా ఉన్న పాఠశాలకి పంపించగలిగారు. ఆ పిల్లాడే మా తాతయ్య. తక్కువ బాధ్యతతో వ్యవహరించే పిల్లాడిగా ముద్రపడినా, స్కూలు చదువును కొనసాగించగలిగాడు. పోలీసు అధికారి అయ్యాడు. అతని సోదరుడు నాలుగు రాళ్ళు సంపాదించడం ప్రారంభించిన పదేళ్ళ తర్వాత ఉద్యోగంలో చేరినా, ప్రారంభంలోనే ఎక్కువ జీతభత్యాలు తీసుకోగలిగాడు. మా తాత చదువుకోవడం, ఉద్యోగ జీవితం వల్ల, మా నాన్నకు చదువుకొనే అవకాశం లభించింది. ఫలితంగా, నేను నాకు ఇష్టమైన బాటలో అడుగులు వేసేందుకు అవకాశం చిక్కింది. మా తాతకు లభించిన అవకాశం వల్ల, ఆ తరువాత తరాలు కూడా బాగుపడే వీలు చిక్కింది. ప్రతిభావంతులు ప్రతిచోటా ఉన్నారు. కానీ, వారు వెలుగులోకి వచ్చే అవకాశమే ఉండటం లేదు అనే దానికి ఈ వ్యక్తిగత జీవిత వివరాలే ఉదాహరణ. టెక్నాలజీ ఉపకరణం మాత్రమే!ఈ రోజు కార్యక్రమం విద్య, టెక్నాలజీ గురించి! సూటిగా చెప్పాలంటే, రేపటి ప్రపంచాన్ని సృష్టించేవారిగా నేటి విద్యార్థులను తీర్చిదిద్దడానికి సంబంధించినది. సాంకేతికంగా అబ్బురపరచే ప్రగతిని సాధిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. మన జీవితాలలో ప్రతి పార్శ్వాన్ని, ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను డిజిటల్ టెక్నాలజీలు రూపుదిద్దుతున్నాయి. అయితే, టెక్నాలజీ అంతరాయా లను కూడా సృష్టిస్తోంది. టెక్నాలజీ ఏ కొద్ది మందికోకాక, అందరికీ అవకాశాలను అందివ్వగలదా? అన్నదే అసలైన ప్రశ్న. ఇతరులు సాధించే విజయంపైనే మన విజయం గణనకు వస్తుంది. చదువుకునే అవకాశాన్ని అందరికీ కల్పించడం మన ధ్యేయం కావాలి. నేటి సమాజం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్ళలో అది ఒకటి. ‘మైక్రోసాఫ్ట్’ మాజీ పరిశోధకుడు, ‘గీక్ హేర్సే’ పుస్తక రచయిత కెంటరో టొయోమ ఆ అంశాన్ని బాగా పట్టుకున్నారు. టెక్నాలజీలో కన్నా ముందుగా సమాజంలో మార్పు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. టెక్నోక్రాట్లు సాధారణంగా టెక్నాలజీ గుణగణాల గురించి గొప్పగా చెప్పేందుకు మొగ్గు చూపుతూంటారు. వ్యవస్థలోని అన్ని రుగ్మతలకూ దానినే విరుగుడుగా భావిస్తూంటారు. దానితో విభేదం ఉన్నవాడిగానే నేనిక్కడికి వచ్చాను. విద్యను రూపాంతరీకరించడానికి టెక్నాలజీ ఒక్కటే సమాధానమనే భ్రమల్లో మనం లేము. విద్యా రంగంలో మార్పు తీసుకొచ్చేందుకు అంకిత భావం కలిగిన పాలకులు, గొప్ప ఉపాధ్యాయులు, ప్రేరణ పొందిన విద్యార్థులు, పాలుపంచుకునే తల్లితండ్రులు, సమాజాలు అవసరం. టెక్నాలజీ వారి సృజనాత్మకతకు, చాతుర్యానికి సాధికారత కల్పించగల ఒక ఉపకరణం మాత్రమే. ప్రపంచం నలుమూలల ఉన్న విద్యార్థులను చూడగలగడం, వారి నుంచి నేర్చుకోగలగడం నా ఉద్యోగ బాధ్యతల్లో నేను ఇష్టపడే అంశాల్లో ఒకటి. గత రెండేళ్ళుగా, నేను 20కి పైగా దేశాలలో విద్యార్థులను కలుసుకునే అవకాశం లభించింది. సియాటిల్లో నా కూతుళ్ళు ఏ ఆఫీసు టూల్స్ని ఉపయోగిస్తున్నారో అవే టూల్స్ని జకార్తా, టెల్ అవీవ్లలోని విద్యార్థులు కూడా ఉపయోగిస్తున్నారు. ఆ యా తరగతి గదుల్లో కొంత సమయాన్ని వెచ్చించినప్పుడల్లా, ప్రతిసారీ నాలో కొన్ని అంశాలు ముసురుకుంటూ వచ్చాయి. పిల్లలను ఎలా తీర్చిదిద్దాలి?ఒకటి– తరగతి గదిలో టీచర్ పనికి టెక్నాలజీ సాయపడాలే గానీ, అవరోధం కాకూడదు. సమయాన్ని వెచ్చించడంలో టీచర్లపై చాలా డిమాండ్లు ఉంటాయి. వారు పాఠ్యాంశాలను ఎంపిక చేయాలి. పరీక్షలు పెట్టాలి. పేపర్లు దిద్దాలి. తరగతుల్లో విద్యార్థు లను అదుపాజ్ఞలలో ఉంచాలి. క్రమశిక్షణ నేర్పాలి. టెక్నాలజీ టీచర్ల జీవితాలను సులభతరం చేసి, విద్యార్థులలో సృజనాత్మకతను రేకెత్తించేదిగా ఉండాలిగానీ, వాటి నుంచి దృష్టి మళ్ళించేదిగా ఉండకూడదు. రెండు– పని స్వరూప స్వభావాలలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక సమస్యను పరిష్కరించేందుకు సమష్టిగా పనిచేస్తున్నారు. సమస్యను విభజించి చూడటంకన్నా ఏక మొత్తంగా చూస్తున్న ధోరణి కనిపిస్తోంది. ఈ రకమైన భవిష్యత్తుకి మనం విద్యార్థులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. తరగతి గదిలో కూడా టీమ్ల వారీగా పనిచేయడాన్ని ప్రోత్సహించాలి. సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా నేర్చుకో వడం తరగతి గదిలోనే మొదలవ్వాలి. టీమ్ వర్క్కి అవి కేంద్రాలు కావాలి. అప్పుడే దేన్నైనా కలసి సృష్టించగల సామర్థ్యం సొంత మవుతుంది. విద్యార్థులను కలసిమెలసి నేర్చుకునేటట్లుగా చేస్తే, వారి విద్యావకాశాలు కూడా మెరుగుపడతాయి. మూడు– రేపటికి తగినట్లుగా మన విద్యార్థులను తయారు చేసి తీరాలి. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ నివేదికను, అది రూపొందించిన ఉద్యోగాల నివేదికను పరిశీలించండి. నేడు పాఠశాలల్లో అడుగు పెడుతున్న విద్యార్థుల్లో 65 శాతం మందికి లభించబోయే ఉద్యో గాలు, ఇపుడు ఉనికిలో ఉన్నవి కావట! ‘కాంపుటేషనల్ థింకింగ్’, సమస్యను పరిష్కరించగల నైపుణ్యాలు భవిష్యత్తుకు కీలకమని టీచర్లకు తెలుసు. ‘స్టెమ్’ పాఠ్య ప్రణాళికను విస్తృతంగా వీక్షించవలసిన అవసరం ఉందని కూడా వారికి తెలుసు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితాన్ని కలిపి పొందికతో కూడిన అధ్యయన నమూనాగా చేయడాన్ని ‘స్టెమ్’గా పిలుస్తున్నారు. చదవడం, రాయడం, డిజైన్, కళలకు తోడు, ‘స్టెమ్’ పాఠ్య ప్రణాళికను కూడా తీసుకువస్తే, భవిష్యత్తులో ఈ విద్యార్థులు విజయం సాధించడానికి రంగం సిద్ధం చేసినవాళ్ళం అవుతాం. చివరగా– మా తాతకు లభించిన అవకాశం, మా కుటుంబ గతిని మార్చివేసింది. ఇపుడు నాకు స్ఫూర్తినిస్తున్న అంశం ఈ తరంలోనూ, రాబోయే తరాలలోనూ ప్రతి విద్యార్థికి విద్యావకాశాన్ని ప్రజాస్వామ్యీకరణ చేసేందుకు మనందరం కలసి మెలసి ఎలా ఒకటవాలన్నదే! అందరికీ కృతజ్ఞతలు. -
కరెంట్ షాక్తో విద్యార్థిపై హత్యాయత్నం
దాచేపల్లి: కరెంట్ షాక్తో ఒక విద్యార్థిపై సీనియర్లు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం శ్రీనగర్కి చెందిన ఒక విద్యార్థి నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దాచేపల్లికి చెందిన ఒక విద్యార్థి డిగ్రీ చదువుకుంటున్నాడు. ఈ నెల 7న జూనియర్ కళాశాలలో ఉన్న ఇంటర్ విద్యార్థిని డిగ్రీ విద్యార్థి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహానికి పిలిపించి, అతన్ని బంధించి, తన స్నేహితులతో కలిసి తీవ్రంగా కొట్టాడు. ఒక దశలో కరెంట్ షాక్ పెట్టి ఇంటర్ విద్యార్థిని హత్య చేసేందుకూ ఉపక్రమించాడు. దాడి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించాడు. వారి నుంచి తప్పించుకున్న బాధిత ఇంటర్ విద్యార్థి తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టాలని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి శ్రీనివాసరావును ఆదేశించారు. మరో దివ్యాంగ విద్యార్థినిని కూడా అదే డిగ్రీ విద్యార్థి, అతడి స్నేహితులు హాస్టల్లోనే కొట్టినట్లు సమాచారం. కాగా, బాధిత ఇంటర్ విద్యార్థి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వసతి గృహంలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటున్నాయని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన డిగ్రీ విద్యార్థి మత్తు పదార్థం సేవించి హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. బీసీ బాలుర వసతి గృహానికి ఒక మహిళా వార్డెన్ని ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. ప్రేమ వ్యవహారమే కారణం: డీఎస్పీ జగదీష్ ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నట్లు గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు. దాడికి గురైన, దాడికి పాల్పడిన విద్యార్థులంతా మైనర్లేనన్నారు. -
దాచేపల్లి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో దారుణం
సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి అఖిల్ను సీనియర్లు చితకబాదారు. కర్రతో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ.. విచక్షణారహితంగా దాడి చేశారు. కరెంట్ వైర్తో షాక్ ఇచ్చేందుకు సీనియర్లు యత్నించారు.దాడి దృశ్యాలను వీడియో చిత్రీకరించారు. తమ కుమారుడిని చిత్రహింసలకు గురి చేశారంటూ అఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిల్ దాడి ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన 7వ తేదీన జరిగింది. -
‘నా భర్తను నా తండ్రే కాల్చి చంపాడు’
పాట్నా: కులాంతర వివాహం డిగ్రీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని కోపోద్రికుడైన తండ్రి… అల్లుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.పోలీసుల వివరాల మేరకు.. బీహార్లోని అతిపెద్ద నగరమైన దర్భంగలో ఘోరం జరిగింది. దర్భంగ మెడికల్ కాలేజీలో బీఎస్సీ (నర్సింగ్)రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ కుమార్ను కాలేజీ ఆవరణంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.ఇటీవల రాహుల్ కుమార్కు అదే కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తన్ను ప్రియాతో కులాంతర వివాహం జరిగింది. అయితే, ఈ క్రమంలో కాలేజీ క్యాంపస్లో ఉండగా.. తన్ను ప్రియా చూస్తుండగానే ఆమె తండ్రి ప్రేమశంకర్.. అల్లుడు రాహుల్ను కాల్చి చంపాడు. అప్రమత్తమైన విద్యార్థులు, సిబ్బంది రాహుల్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ప్రేమ్శంకర్కు దేహశుద్ధి చేశారు. కళ్లెదుటే కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోవడంతో తన్ను ప్రియా గుండెలవిసేలా రోదించారు. నా తండ్రే తుపాకీతో నా భర్తను కాల్చాడు. అతను నా ఒడిలోనే కుప్పకూలిపోయాడు’ అని కన్నీటీ పర్యంతరమయ్యారు. రాహుల్, తన్ను నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఒకే హాస్టల్ భవనంలో వేర్వేరు అంతస్తులలో ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ‘మేం కాలేజీలో ఉండగా.. హూడీ ధరించిన ఓ వ్యక్తి రాహుల్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అతని దగ్గర తుపాకీ ఉంది. ఆ తుపాకీతో రాహుల్ గుండెల మీద కాల్చాడు. ఆ తర్వాతే నాకు తెలిసింది. ఆ కాల్పులు జరిపింది నా తండ్రి ప్రేమ్శంకర్ ఝానే. నా తండ్రి ప్రేమ్శంకర్ నా కళ్ళ ముందే నా భర్త గుండెలపై కాల్చాడు. నా భర్త నా ఒడిలో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. కులాంతర వివాహ చేసుకున్న అనంతరం రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాం. నాకు నా భర్తకు.. నా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని చెప్పాం. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటి పర్యంతరమయ్యారుకాల్పుల తర్వాత, రాహుల్ స్నేహితులు, ఇతర హాస్టల్ సిబ్బంది నిందితుడు శంకర్పై దాడికి దిగారు. రాహుల్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న దర్భాంగా జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ కుమార్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగన్నాథ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎస్పీ జగన్నాథ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఎస్సీ (నర్సింగ్) విద్యార్థిని కాల్చి చంపినట్లు మాకు మొదట సమాచారం అందింది. తరువాత, అతను, అతని తోటి విద్యార్థి ప్రేమ వివాహం చేసుకున్నారని మాకు తెలిసింది. ఆమె తండ్రి వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. ఝాకు చికిత్స చేయడానికి విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అనుమతించకపోవడంతో ఆసుపత్రిలో గొడవ జరిగింది. కేసు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాము’అని హామీ ఇచ్చారు. दरभंगा जिला के बेंता थाना क्षेत्र अंतर्गत DMCH में घटित घटना के संदर्भ में अद्यतन घटना का संक्षिप्त विवरण :-दिनांक - 05.08.25 को समय करीब 04:40 PM बजे सूचना मिली कि बेंता थाना क्षेत्र अंतर्गत एक छात्र की गोली मारकर हत्या कर दी गई है। sho and sdpo visited spot and enquired— Darbhanga Police (@DarbhangaPolice) August 5, 2025 -
రాత బాగోలేదని వాత.. టీచర్ అరెస్ట్
ముంబై: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు కర్కశంగా ప్రవర్తిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది ముంబైలో జరిగిన ఒక ఘటన తెలియజేస్తుంది. మలాడ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ట్యూషన్ టీచర్, ఎనిమిదేళ్ల బాలుని చేతిరాత సరిగా లేదంటూ, అతనిని కఠినంగా శిక్షించింది.ఈ నేపధ్యంలో ఆ ఉపాధ్యాయురాలు అరెస్టయ్యింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోరేగావ్లోని ఒక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న బాలుడు మలాడ్లోని ఒక టీచర్ ఇంటికి ట్యూషన్కు వెళుతుంటాడు. సంఘటన జరిగిన రోజు, ఆ బాలుని సోదరి అతనిని ట్యూషన్లో దింపి, వెళ్లిపోయింది. ట్యూషన్ ముగిశాక ఆ టీచర్ బాలుని ఇంటికి ఫోన్ చేసి, పిల్లాడిని తీసుకుని వెళ్లాలని చెప్పింది. దీంతో ఆ బాలుని సోదరి ఆ టీచర్ ఇంటికి వచ్చింది. ఆ బాలుడు కన్నీళ్లతో కనిపించేసరికి, ఏం జరిగిందని సోదరి ఆ టీచర్ను అడిగింది. పిల్లాడు జరిగిన విషయం చెప్పగా, టీచర్ వాటిని తోసిపుచ్చింది.అయితే ఇంటికి తిరిగి వచ్చిన ఆ బాలుడు తన చేతిరాత సరిగా లేకపోవడంతో టీచర్ మండుతున్న కొవ్వొత్తితో తన చేతిపై వాత పెట్టిందని ఏడుస్తూ చెప్పాడు. వెంటనే పిల్లాడి తండ్రి అతనిని చికిత్స కోసం కాండివాలిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తరువాత కురార్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాలునిపై శారీరక, మానసిక క్రూరత్వానికి పాల్పడిన టీచర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. -
కనిపెట్టి.. కాపాడుదాం
సాక్షి, స్పెషల్ డెస్క్: ఇటీవలి కాలంలో పరీక్షల ఒత్తిడి, ఫెయిలవుతామన్న భయం, మార్కులు తగ్గితే అందరూ తమను చిన్నచూపు చూస్తారన్న ఆందోళన వంటి కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని, ఒత్తిడికి లోనై బలవన్మరణాలకు పాల్పడకుండా నివారించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం వ్యాఖ్యానించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. అంతేకాకుండా వ్యవస్థల స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అసలు ఇంతకీ... విద్యార్థుల బలవన్మరణాలకు కారణాలేంటి? ఏయే స్థాయుల్లో, ఎలా వాటిని గుర్తించి నివారించవచ్చు? ఇందులో సమాజంలోని వివిధ వర్గాల పాత్ర ఏమిటి? నిపుణులు ఏమంటున్నారు? విశాఖపట్నంలో ఓ కోచింగ్ సంస్థలో ‘నీట్’శిక్షణ పొందుతున్న పశ్చిమ బెంగాల్కు చెందిన యువతి అనుమానాస్పద మృతిపై దర్యాప్తునకు ఆదేశించాలంటూ నమోదైన కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘జాతీయ నేర గణాంక విభాగం లెక్కల ప్రకారం దేశంలో 2022లో 1.7 లక్షలకుపైగా ఆత్మహత్యల కేసులు నమోదైతే అందులో 7 శాతం విద్యార్థుల మరణాలే’అని అత్యున్నత న్యాయస్థానం గణాంకాలనూ ఉటంకించింది. 100 మంది విద్యార్థులు ఉన్న విద్య, శిక్షణ సంస్థలు, హాస్టళ్లలో సైకాలజిస్ట్, అర్హతగల కౌన్సిలర్, సామాజిక కార్యకర్తను నియమించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. తేలిగ్గా తీసుకొనే మాటలు కావవి.. ఒత్తిడి, ఆందోళనలో ఉన్న విద్యార్థి తన కష్టాన్ని, బాధను ఏదో ఒక సందర్భంలో వ్యక్తపరుస్తారు. అది స్నేహితులు, బంధువులు, ఆఖరికి తల్లిదండ్రుల దగ్గర కూడా కావచ్చు. అలాంటప్పుడు వారి మాటలను తేలిగ్గా తీసుకోవడం మంచిది కాదు. ⇒ ‘పరిస్థితులు ఎప్పటికీ బాగుపడవు.. ఇక నేను ప్రయతి్నంచడంలో అర్థం లేదు’ ⇒ ‘నా సమస్యలకు ఎవరూ సహాయం చేయలేరు.. నాకు మార్గం కనిపించడం లేదు’ ⇒ ‘నేను పనికిరాను, నేను ఎవరికీ ముఖ్యం కాదు’ ⇒ ‘ఇతరులకు భారంగా ఉన్నాను, నా మీద నాకు సిగ్గుగా ఉంది’ ఇలాంటి మాటలు విద్యార్థుల నోటి నుంచి వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఆ ప్రవర్తనలే హెచ్చరికలు తల్లిదండ్రులు, బడులు లేదా విద్యాసంస్థల్లోని టీచర్లు పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికగా భావించాలి. ⇒ ఇటీవలి కాలంలో చదువులో మీ పిల్లలు వరుసగా వెనుకబడుతుంటే ⇒ ప్రతి చిన్న విషయానికీ కోపం, అసహనం ఎక్కువవుతుంటే ⇒నలుగురితో కలవకుండా, ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతుంటే ⇒ తన ఒళ్లు, ఆహారం, ఆరోగ్యం.. ఇలా దేనిమీదా శ్రద్ధ లేకుండా ఉంటే ⇒ తరగతిలో అజాగ్రత్తగా ఉండటం, మతిమరుపు ⇒ ఏదో తలచుకుని ఏడవడం ⇒ రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం ఇలా బయటపడొచ్చు ఒత్తిడిని జయించడానికి, నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి జనరేషన్–జడ్, జె¯న్–ఆల్ఫా ఏం చేస్తున్నారంటే.. గేమింగ్, ఈ–స్పోర్ట్స్: పోటీతత్వాన్ని నేర్పుతుంది. మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి.మ్యూజిక్, పాడ్కాస్ట్: భావోద్వేగాల నియంత్రణ, ఒత్తిడి నుండి ఉపశమనం ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ: సృజనాత్మకత, తన టాలెంట్ను నలుగురికీ తెలియజేయడం స్వచ్ఛంద సేవ, క్రియాశీలత: సంతృప్తి, సహానుభూతి, తన చుట్టుపక్కల వారితో అనుబంధం పెంచుకోవడానికి ఫిట్నెస్, యోగా: ఒత్తిడి నుంచి బయటపడేందుకు, సానుకూల దృక్పథం షాపింగ్ థెరపీ: ఒత్తిడి నుంచి ఉపశమనం సమయపాలన.. ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి ప్రధాన కారణం ఇదే. సమయాన్ని సది్వనియోగం చేసుకోలేక, ఏ పనికి ఎంత సమయం కేటాయంచాలో అంచనా వేయలేక విద్యార్థులు ఒత్తిడిని పెంచుకుంటున్నారు. ⇒ ప్రాధాన్యతను బట్టి ఏ పనికి ఎక్కువ సమయం, ఏ పనికి తక్కువ సమయం అన్న స్పష్టమైన విభజన చేసుకోవాలి. అది చదువు / సబ్జెక్ట్, ఆటపాటలు, షికార్లు /ఎంజాయ్మెంట్, వ్యాయామం.. అన్నింటికీ వర్తిస్తుంది. ⇒ ఏకబిగిన చదవకుండా మధ్యమధ్యలో విరామాలు తీసుకోవాలి ⇒ మరునాడు చేయబోయే పనులకు సంబంధించి ముందురోజు రాత్రే టైమ్ టేబుల్ వేసుకోవాలి. అందులో ఎంత శాతం పూర్తిచేస్తున్నారో డైరీలో రాసుకోవాలి. 60, 70, 80, 90 శాతం వరకు వచ్చారంటే.. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తరవాత అలా రాయాల్సిన అవసరమే ఉండదు. తల్లిదండ్రులూ.. పిల్లలు చెప్పేది వినండి పిల్లలు చెప్పేది వినడానికి చాలామంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉండరు. తాము కష్టపడి, డబ్బు పెట్టి చదివిస్తుంటే... ఏ కష్టం చదవడానికి అనుకుంటారు. ఈ ధోరణి మారాలి. వాళ్లు జీవితంలో ఏ అనుభవమూ లేకనే సమస్యలు మీకు చెబుతున్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే సగం సమస్య పరిష్కారమైనట్టే. పిల్లలూ.. స్క్రీన్ టైమ్ తగ్గించండి ఇటీవలి కాలంలో విద్యార్థులు చదువు కోసం కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. వీటి వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ⇒ కొందరు విద్యార్థులు చదువుకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ⇒ షార్ట్స్, రీల్స్, వీడియోలను ఒకటి తరవాత ఒకటి.. చూడటానికి మెదడు అలవాటు పడితే.. చదవాలన్న తలంపే రాకుండా పోతుంది. దానివల్ల పరీక్షల వంటి కీలక సమయాల్లో ఒత్తిడి పెరుగుతోంది. పిల్లలూ.. సిగ్గు, మొహమాటం వద్దు ⇒ స్నేహితులు, కుటుంబ సభ్యులు, టీచర్లు, బంధువులు.. వీరిలో మీ మనసుకు దగ్గరగా ఉండే వ్యక్తులు కచ్చితంగా ఉంటారు. మీకు ఏ సమస్య వచి్చనా నిర్మొహమాటంగా వారితో పంచుకోండి. ⇒ చాలా సందర్భాల్లో ఈ వ్యక్తులు మీ అమ్మ లేదా నాన్న కూడా కావచ్చు. కఠిన గ్రేడింగ్ వ్యవస్థలు, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తే ఓదార్చేవారు లేకపోవడం, నిరంతర పోటీతత్వం విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు. ముప్పును ముందే గుర్తించి పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చే స్థాయిలో పాఠశాల, కళాశాల కౌన్సెలర్లకు శిక్షణ ఇవ్వాలి. భావోద్వేగాలను నియంత్రించుకునేలా, ఒత్తిడిని జయించి, ఆత్మహత్యలను నివారించేలా విద్యాసంస్థలు మేమున్నామనే భరోసా ఇవ్వాలి – నెల్సన్ వినోద్ మోసెస్, సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -
పాలకొండ: శభాష్ చెల్లెమ్మా
పాలకొండ రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థిని తనను వేధించిన ఓ పోకిరీకి చెప్పుతో బుద్ధి చెప్పింది. శుక్రవారం సాయంత్రం కాలేజీ నుంచి తన స్వగ్రామం వెళ్లే క్రమంలో బస్సు ఎక్కుతుండగా ఓ యువకుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. వ్యవహారం శృతిమించడంతో ఆగ్రహించిన ఆమె ఉగ్రరూపం దాల్చింది. బస్సు దిగి తన కాలి చెప్పుతీసి ఆ పోకిరికి చూపిస్తూ గట్టిగా బుద్ధి చెప్పింది. నీ కుటుంబ సభ్యులతో ఇలానే ప్రవర్తిస్తావా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఊహించని ఈ పరిణామంతో ఆ పోకిరి అక్కడి నుంచి ఉడాయించాడు. ఇదంతా గమనించిన సహ విద్యార్థులతో పాటు అక్కడి వారు ‘శభాష్ చెల్లెమ్మా’ అంటూ కితాబిచ్చారు. ఏపీలో గత కొంతకాలంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తున్నదే. చిన్నపిల్లల దగ్గరి నుంచి పండు ముసలిదాకా అఘాయిత్యాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రోత్సహించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అక్కడి వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేస్తోంది. అన్నట్లు మొన్నీమధ్యే యూపీ ఉన్నావ్లోనూ ఇదే తరహాలో ఓ ఈవ్టీజర్ ఆటకట్టించింది ఓ స్టూడెంట్. ఆపై ఆ వ్యక్తిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అందుకు సంబంధించిన వీడియో మీరూ చూసేయండి. #उन्नाव#छात्रा ने छेड़छाड़ करने वाले #युवक की सरेराह #चप्पलों से की #धुनाई#गंगाघाट_कोतवाली क्षेत्र के पोनी रोड स्थित नीलम स्वीट हाउस के पास की #घटना#Unnao#UnnaoNews#EveTeasing#StudentSlapsMolester#UPPolice#viral#viralvideo#NewsFlash @unnaopolice @Uppolice pic.twitter.com/9HhbKTg1Pf— Goldy Srivastav (@GoldySrivastav) July 20, 2025 -
తీరు‘బడి’గా ఫీజుల ఖరారు
అమరావతి: బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను అనుసరించి రూ.8,500 నుంచి గరిష్టంగా రూ.14,500 వరకు ఫీజులను నిర్ణయించింది. గతేడాది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రకారం ఒకటి నుంచి ఐదు వరకు “స్టార్’ రేటింగ్ ఇచ్చింది. ఈ రేటింగ్ను అనుసరించే ఫీజులను ఖరారు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీఈ చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చట్టం ద్వారా పిల్లలను చేర్చుకున్న స్కూళ్లకు ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. వాస్తవానికి ఈ ఫీజులను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఖరారు చేసి ఆర్టీఈ ప్రవేశాలు కల్పించాలి. కానీ ప్రభుత్వం ఏప్రిల్లో కమిటీని నియమించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా, నాలుగు నెలల సమయం పట్టింది. ఇంతలో ఆర్టీఈ ప్రవేశాలు చేపట్టడం, ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులను తిరస్కరించడం వంటి కారణాలతో ఉచిత సీట్లు వచ్చినా చేసేది లేక చాలామంది తల్లిదండ్రులు వేరే స్కూళ్లలో పిల్లలను చేర్పించేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది ఆర్టీఈ చట్టం ద్వారా సీట్లు పొందిన వేలాది మంది నిరుపేద తల్లిదండ్రులకు ఆర్థికంగా నష్టపోయారు. 32 వేల మందిలో సగం మందికే అడ్మిషన్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం పిల్లల నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం–2009 ద్వారా ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో 2022–23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇలా గత మూడు విద్యా సంవత్సరాల్లో (2022–23, 2023–24, 2024–25) 50 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పించారు. 2025–26 విద్యా సంవత్సరంలో 31,701 మందికి సీట్లు కేటాయించారు.అయితే, ప్రభుత్వ ఫీజులను ఖరారు చేయనందున చాలా స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలను చేర్చుకోలేదు. దీంతో చేసేది లేక పిల్లల భవిష్యత్తు రీత్యా తల్లిదండ్రులు ఫీజులు చెల్లించి స్కూళ్లలో చేర్పించారు. మరికొందరు ఆర్థిక భారం భరించలేక ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. దీంతో సగం మందికే ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్ లభించినట్టయింది. ఆ విద్యార్థులకు తల్లికి వందనం నిలిపివేత ప్రస్తుత విద్యా సంవత్సరంతోపాటు గత మూడేళ్లల్లో ఆర్టీఈ చట్టం కింద ప్రవేశాలు పొందిన 81 వేల మంది విద్యార్థులకు ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని నిలిపివేసింది. ఫీజులు ఖరారైన తర్వాత వందనం కింద ఇచ్చే మొత్తాన్ని ఆయా స్కూళ్లకే జమ చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఆర్టీఈ చట్టం కింద సీట్లు దక్కినా చాలా స్కూళ్లు అడ్మిషన్లు నిరాకరించాయి. దీంతో తల్లిదండ్రులు పిల్లలను డబ్బులు కట్టి ప్రైవేటు స్కూళ్లలోనూ, ఆర్థిక భారం భరించలేని వారు ప్రభుత్వ పాఠశాలల్లోనూ చేర్పించారు. ఇలాంటి వారు 32 వేల మందిలో దాదాపు 15 వేల మంది వరకు ఉంటారని అంచనా. వీరు ఇంకా ఆర్టీఈ విద్యార్థులుగానే ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నారు. ఈ క్రమంలో వీరికి తల్లికి వందనం ఇస్తారా..; లేక పూర్తిగా ఎగవేస్తారా.. అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులపై కోర్టుకెళ్లిన యాజమాన్యాలుగతేడాది స్కూళ్లు నిర్ణయించిన ఫీజులే చెల్లించాలని, లేదంటే విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని కొన్ని, పై తరగతులకు పంపించేదిలేదని, టీసీలు సైతం ఇచ్చేది లేదని మరికొన్ని స్కూళ్లు తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచి ఫీజులు వసూలు చేశాయి. ఈ ఏడాది సగం మంది విద్యార్థులకు అడ్మిషన్లనే నిరాకరించాయి. తాజాగా నిర్ణయించిన ఫీజులు రూ.8500 నుంచి రూ.14500 కూడా స్టార్ రేటింగ్ను బట్టి అన్ని తరగతులకు ఇవే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమకు చెల్లించే ఫీజులు తక్కువగా ఉన్నాయని, వీటిని పెంచాలని ప్రవేటు స్కూళ్ల యాజమాన్యాలు గతంలోనే హైకోర్టును ఆశ్రయించగా, ఫీజులను సవరించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
Anantapur: ఉపాధ్యాయుడినే బెదిరించిన విద్యార్థిని
-
శ్రీలీల వైరల్ వయ్యారి సాంగ్.. స్టూడెంట్ డ్యాన్స్కు హీరో ఫిదా!
ఇటీవల సినీ ప్రియులను ఓ రేంజ్లో ఊపేస్తోన్న హీరోయిన్ శ్రీలీల. గతేడాది పుష్ప-2 చిత్రంలో కిస్సిక్ సాంగ్తో అలరించిన ముద్దుగుమ్మ.. మరోసారి అలాంటి ఊపున్న సాంగ్తో మెప్పించింది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా వచ్చిన జూనియర్ మూవీలో వైరల్ వయ్యారి అంటూ అభిమానుల ముందుకొచ్చింది. ఈ మాస్ సాంగ్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. నెట్టింట ఎక్కడ చూసినా వైరల్ వయ్యారి అంటూ రీల్స్తో అదరగొట్టేసింది.అంతలా క్రేజ్ దక్కించుకున్న ఈ పాటకు కర్నాటకకు చెందిన ఓ విద్యార్థిని చేసిన డ్యాన్స్ నెట్టింట వైరలవుతోంది. హీరో కిరిటీ సమక్షంలోనే ఆ బాలిక అద్భుతంగా డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను హీరో కిరిటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన డ్యాన్స్తో అదరగొట్టిన విద్యార్థినికి హీరో కిరిటీ చిరుకానుక అందించారు. ఇది చూసిన నెటిజన్స్ విద్యార్థిని టాలెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతంగా చేశావంటూ కితాబిస్తున్నారు.కాగా.. కిరిటీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం జూనియర్. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ జూలై 18 తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తోంది. The super talented V. Pooja from Kurugodu, a beautiful village in my hometown Ballari, dancing her heart out to #ViralVayyari. Blessings to you, little star! #Junior pic.twitter.com/FITaWGU6ra— Kireeti (@KireetiOfficial) July 23, 2025 -
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై దాడి
-
స్మార్ట్ స్టడీ స్ట్రాటజీస్..!
ప్రతి విద్యార్థి రోజూ గంటలు, గంటలు చదువుతున్నారు. అయినా పరీక్షల్లో గందరగోళ పడుతున్నారు. చదివినది గుర్తురాక, పరీక్షలు సరిగా రాయలేక ఆందోళనకు లోనవుతున్నారు. దాంతో పేరెంట్స్, టీచర్స్ మరిన్ని గంటలు చదవమని ఒత్తిడి పెడుతున్నారు. విద్యార్థులతో రెండు దశాబ్దాలకు పైబడి పనిచేస్తున్న సైకాలజిస్ట్గా, జీనియస్ మ్యాట్రిక్స్ డెవలపర్గా ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా. ఎన్ని గంటలు చదివామనే దానికన్నా, ఎంత బాగా చదివామనేది ముఖ్యం. మెదడు ఎలా నేర్చుకుంటుందో తెలుసుకుని చదివితే మార్కులు పరుగెత్తుకుంటూ వస్తాయి. లేదంటే మీరు పెట్టే శ్రమ, టైమ్, ఫీజులు అన్నీ వృథా అవుతాయి. అందుకే స్మార్ట్గా ఎలా చదవాలో తెలుసుకుందాం. లైఫ్ లాంగ్ లెర్నర్గా ఎదుగుదాం. మార్కులు, ర్యాంకుల కన్నా ఇదే నిజమైన విజయం. లెర్నింగ్ సైన్స్మనం కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు నాడీకణాల మధ్య బంధాలు బలపడతాయి. ప్రతిసారి రివిజన్ చేసేటప్పుడు ఆ బంధాలు మైలినేషన్ అనే ప్రక్రియ ద్వారా వేగవంతం అవుతాయి. అప్పుడు గుర్తుంచుకోవడం సులువవుతుంది. స్పేస్డ్ రిపిటీషన్, రిట్రీవల్ ప్రాక్టీస్, ఇంటర్ లీవింగ్ వంటి టెక్నిక్స్ వల్ల చదివింది బాగా గుర్తుంటుందని కెంట్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల్లో వెల్లడైంది. యాక్టివ్ రీకాల్: ఒక సెక్షన్ చదివాక, పుస్తకం మూసేసి ‘ఇప్పుడు నేనేం నేర్చుకున్నాను, నా ప్రెజెంట్ నాలెడ్జ్తో అదెలా కలుస్తుంది, నేర్చుకున్నది ఏమిటి?’ అని మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇది జ్ఞాపకంలో నుంచి సమాచారాన్ని తిరిగి తెస్తుంది. దీని వల్ల జ్ఞాపకం బలపడుతుంది.స్పేస్డ్ రిపిటీషన్: ఎవరేం నేర్చుకున్నా 24 గంటల్లో దాదాపు 70 శాతం మర్చిపోతారు. దీర్ఘకాలం గుర్తుండాలంటే 24 గంటల్లోపు ఒకసారి రివిజన్ చేయాలి. ఆ తర్వాత వారం, నెల, మూడు నెలల వ్యవధిలో రివిజన్ చేయడం వల్ల నేర్చుకున్నది దీర్ఘకాలిక జ్ఞాపకాల్లోకి చేరి పూర్తిగా గుర్తుంటుంది. ఇంటర్ లీవింగ్: ఒకే సబ్జెక్ట్ గంటల తరబడి చదవకుండా, సంబంధిత సబ్జెక్ట్స్ను మార్చి మార్చి చదవడం మెదడులో ఫ్లెగ్జిబిలిటీని పెంచుతుంది.డ్యూయల్ కోడింగ్: పదాలతో పాటు విజువల్స్ కలిపి చదవడం. మైండ్ మ్యాప్స్, డయాగ్రమ్స్ వాడడం వల్ల మాటల జ్ఞాపకం, విజువల్ జ్ఞాపకం రెండూ కలసి జ్ఞాపకం పెరుగుతుంది. టీచ్ వాట్ యూ లెర్న్: మీరు నేర్చుకున్నది ఇతరులకు బోధించండి. లేదా మీకు మీరే చెప్పుకోండి. దీనివల్ల మెదడులో సమాచారం క్లియర్గా ఆర్గనైజ్ అవుతుంది. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినవి రోజూ గంటలకు గంటలు చదవమని పిల్లలను ఒత్తిడి చేయవద్దు. ప్రతిరోజూ కొద్దిపాటి విరామాలతో కొద్ది కొద్ది సేపు చదివేలా అలవాటు చేయండి.కేవలం మార్కులు, ర్యాంకులకే కాదు– ప్రయత్నం, స్ట్రాటజీ, క్రియేటివిటీని అభినందించండి. ఉదాహరణకు, ‘నువ్వు ఈ క్లిష్టమైన చాప్టర్ను సులువుగా విభజించడం నాకెంతో నచ్చింది’ అని చెప్పండి.చదవడానికి డిస్ట్రాక్షన్స్ లేని ప్రశాంత వాతావరణం సృష్టించండి. రోజుకు కనీసం7–9 గంటల నిద్ర అందేలా చూడండి.రోజూ వ్యాయామం చేయడం వల్ల మెదడులో కొత్త కనెక్షన్లను ఏర్పరచే బీఎన్డీఎఫ్ అనే ప్రొటీన్ విడుదలవుతుంది. మెదడుకు శక్తినిచ్చే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాల్నట్స్, ఫ్లాక్స్సీడ్స్, చేపలు, బెర్రీలు వంటివి అందించండి. విద్యార్థులు చేసే పొరపాట్లుపాసివ్ రీడింగ్: పాఠాలను హైలైట్ చేస్తూ పదేపదే చదివితే బాగా గుర్తుంటుందని అనుకుంటారు. కానీ దీనివల్ల బలమైన మెమరీ ట్రేసెస్ ఏర్పడవు. క్రామింగ్: చివరి రోజు వరకు వాయిదా వేసి ఒక్కరోజులో మొత్తం రివిజన్ చేయడం వర్కింగ్ మెమరీను ఒత్తిడికి గురి చేస్తుంది. ఈజీగా మరచిపోతారు.మల్టీ టాస్కింగ్: చదివేటప్పుడు టీవీ చూడటం, సోషల్ మీడియాలో కాలక్షేపం చేయడం, ఒకేసారి రెండు మూడు సబ్జెక్టులు చదవడంలాంటి పనులు చేస్తే అధ్యయన సామర్థ్యం 40 శాతం వరకు తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.మూడు స్మార్ట్ స్టడీ స్ట్రాటజీస్పొమోడోరో టెక్నిక్: 25 నిమిషాలు ఫోకస్తో చదివి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. అలా నాలుగుసార్లు చదివాక 20–30 నిమిషాలు పెద్ద విరామం తీసుకోండి. సెల్ఫ్–టెస్టింగ్: చాప్టర్ హెడింగ్స్ను ప్రశ్నలుగా మార్చుకుని ముందుగా వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. తరువాత చదివాక తిరిగి పరీక్షించుకోండి.కాంటెక్స్ట్ /వేరియేషన్: ఎప్పుడూ ఒకే చోట కూర్చుని చదవకండి. చదివే ప్రదేశాలు మార్చడం వల్ల జ్ఞాపకానికి వివిధ క్యూస్ ఏర్పడి గుర్తుకు తెచ్చుకోవడం సులువవుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: జైలు శిక్షనే శిక్షణగా మార్చుకున్న జీనియస్ ఖైదీ..!) -
ప్రిన్సిపల్ మందలించారని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
బాపట్ల టౌన్: పాఠశాలలో ప్రిన్సిపల్ మందలించారని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాపట్లలోని వెంగళ్విహార్కు చెందిన ఓ విద్యార్థిని సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని, తోటి స్నేహితుల ముందు విద్యారి్థనిపై ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనస్తాపానికి గురైన విద్యార్థిని 2 రోజులుగా పాఠశాలకు వెళ్లలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి.. ప్రిన్సిపాల్తో నాన్న మాట్లాడి వచ్చారని, శనివారం నుంచి స్కూల్కు వెళ్లాలని చెప్పింది. పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేని విద్యార్థిని శుక్రవారం సాయంత్రం బాపట్ల–గుంటూరు ప్లై ఓవర్ బ్రిడ్జి క్రింద రైలు పట్టాలపైకి చేరుకుంది. రైలు వెళ్తున్న సమయంలో రెండు కాళ్లు రైల్వేట్రాక్ పెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు తెగిపోయాయి. ఆమెను స్థానికులు స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు జీజీహెచ్కు తరలించగా..అక్కడ విద్యారి్థని కాళ్లకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. -
అసభ్యంగా దూషిస్తున్నారు.. ఆయన తరగతికి వెళ్లం!
వజ్రకరూరు: ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో దూషిస్తుండడంతో ఆయన క్లాసుకు వెళ్లేది లేదని విద్యార్థినులు తెగేసి చెప్పారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని చిన్నహోతురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, అందువల్ల ఆయన తరగతికి వెళ్లబోమని విద్యార్థినులు కన్నీరు పెట్టుకోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం ఉదయం పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఈ సందర్భంగా వాగ్వాదానికి దిగిన ఉపాధ్యాయునిపై తల్లిదండ్రులు ఒక దశలో చేయిచేసుకోబోయారు. తోటి ఉపాధ్యాయులు అతికష్టం మీద తల్లిదండ్రులను ఆపారు. కాగా, గణితం తరగతికి వెళ్లబోమని హెచ్ఎంకు విద్యార్థినులు ఈ సందర్బంగా లేఖ అందించారు.చర్యలకు ఉన్నతాధికారుల సిఫారసువజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి, ఎంఈఓ ఎర్రిస్వామి తదితరులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడి ప్రవర్తన బాగోలేదని విచారణలో తేలడంతో చర్యల కోసం డీఈఓ ప్రసాద్బాబుకు సిఫారసు చేసినట్లు ఎంఈఓ తెలిపారు. కాగా, సతీష్ కుమార్ గతంలో చాబాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసినప్పుడు, ఆయన వ్యవహారశైలి బాగోకపోవడంతో అక్కడి ప్రధానోపాధ్యాయుడు డీవైఈఓకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అప్పటి ఘటనలపైనా అధికారులు దృష్టి సారించారు. -
బడి కోసం రోజూ వంద కి.మీ. జర్నీ
మానకొండూర్: కిలోమీటర్ దూరంలో బడి ఉంటేనే.. అబ్బా అంత దూరమా! అని ఉసూరుమనే విద్యార్థులున్న ఈ కాలంలో ఓ విద్యార్థిని తాను పుట్టి పెరిగిన ఊరిలోని బడిపై మమకారాన్ని వదులుకోలేక, అక్కడి స్నేహితులను వదిలి ఉండలేక రోజూ ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణించి సర్కారు బడికి వచ్చి చదువుకుంటోంది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన పానేటి నర్సయ్య, దుర్గమ్మ దంపతుల చిన్న కూతురు పద్మ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.సంచారజాతికి చెందిన నర్సయ్య, దుర్గమ్మ ఏడాదిలో ఆరు నెలలు వలస వెళ్తారు. ప్రస్తుతం వీరు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి వలసవెళ్లారు. తల్లిదండ్రులతోపాటు పద్మ కూడా వెళ్లింది. అయితే, పద్మ మనసంతా పుట్టిన ఊరు.. పాఠశాలపైనే ఉంది. దీంతో మానకొండూర్ పాఠశాలలోనే చదువుకుంటా అని తల్లిదండ్రులతో చెప్పింది.ఇల్లంతకుంట నుంచి రవాణా సౌకర్యం లేకపోవడంతో వేములవాడలో ఉంటున్న అమ్మమ్మ వద్ద ఉంటూ, నిత్యం వేములవాడ నుంచి మానకొండూర్కు బస్సులో బడికి వచ్చి వెళ్తోంది. ఇంట్లో నుంచి ఉదయం ఆరు గంటలకు బయలుదేరి.. సాయంత్రం ఆరు గంటలకు మళ్లీ ఇల్లు చేరుకుంటోంది. రానుపోను నిత్యం 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తోంది. -
మియాపూర్: స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్లో స్కుల్ బిల్డింగ్పై నుంచి పడి విద్యార్థి మృతి చెందాడు. మధుర నగర్లోని సెయింట్ మార్టిన్ స్కూల్లో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి రిజ్వాన్(15) స్కూల్ బిల్డింగ్ నాలుగో అంతస్థుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు.దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. రిజ్వాన్ ప్రమాదవశాత్తూ పడిపోయాడా.. లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Odisha Bandh: విద్యార్థిని ఆత్మాహుతికి నిరసనల వెల్లువ
భువనేశ్వర్: ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్య తీసుకోలేదని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విద్యార్థినికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది ప్రతిపక్ష పార్టీల మద్దతుతో కాంగ్రెస్ ఒడిశాలో ఈరోజు(గురువారం) బంద్ నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో రాజధాని భువనేశ్వర్లోని దుకాణాలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు రాకపోకలు కూడా కనిపించలేదు.రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపునకు మద్దతుగా పలువురు ప్రతిపక్ష నేతలు.. ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ, పార్టీ జెండాలు, ప్లకార్డులను పట్టుకుని రోడ్లపై నిరసన తెలిపారు. బంద్ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బృందాలను మోహరించడంతో పాటు గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ బంద్ రాజకీయాల కోసం కాదని, ఇక్కడి కుమార్తెలకు అండగా నిలిచేందుకేనని అన్నారు. ఇటువంటి నిరసన లేకపోతే ప్రతీ పాఠశాల, కళాశాలలో ఇటువంటి దుస్థితి ఏర్పడుతుందన్నారు. విద్యార్థిని ఫిర్యాదుపై చర్య తీసుకోవడంలో విఫలమైనందుకు రాష్ట్ర విద్యా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై న్యాయ విచారణకు సీపీఐ(ఎం) నేత సురేష్ పాణిగ్రాహి పిలుపునిచ్చారు. 🚨 🚨 #BreakingNews Odisha Bandh Today, Roads Empty In Protest Over Student's Self-Immolation https://t.co/txmxD08kwBThe 20-year-old student of Fakir Mohan Autonomous College in Balasore attempted self-immolation last week after allegedly facing prolonged sexual harassment b…— Instant News ™ (@InstaBharat) July 17, 2025బాలసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని తాను కళాశాల విభాగాధిపతి నుంచి దీర్ఘకాలంగా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడింది. తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మృతురాలి తండ్రితో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ ఘటన సమాజానికి అయిన గాయంగా రాహుల్ అభివర్ణించారు. -
ఒడిశాను కుదిపేస్తున్న విద్యార్థిని ఆత్మాహుతి ఘటన
-
ఒడిశాను కుదిపేస్తున్న విద్యార్థిని ఆత్మాహుతి ఘటన
-
తరగతి గదిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య!
నడిగూడెం: పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గంధమళ్ల అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ నిమ్మ వెంకటేశ్వర్లు, వసుంధర దంపతులకు కుమార్తె తనూషా మహాలక్ష్మి (14), ఇద్దరు కుమారులు సంతానం. తనూషా మహాలక్ష్మి నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతోంది. ఈనెల 4వ తేదీన వ్యక్తిగత కారణాలతో బాలిక ఇంటికి వెళ్లింది. తిరిగి 6వ తేదీన పాఠశాలకు వచి్చంది. ఆదివారం తనూషాను చూసేందుకు ఆమె తల్లి పాఠశాల వద్దకు వచ్చి భోజనం పెట్టి వెళ్లింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తండ్రి వెంకటేశ్వర్లు కూడా కుమార్తెను చూసి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తనూషా పాఠశాలలోని తన తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఐదు గంటల సమయంలో తనూషా స్నేహితురాలు తమ తరగతి గదిలోకి వెళ్లగా.. అప్పటికే తనూషా ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. రాత్రి విధుల్లో ఉన్న హిందీ ఉపాధ్యాయురాలు సునీత పాఠశాల ప్రత్యేకాధికారి వెంకటరమణకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో విద్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, పాఠశాలను సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్, తహసీల్దార్ వి.సరిత, జీసీడీఓ తీగల పూలాన్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
Odisha: ప్రాణాలొదిలిన వేధింపుల బాధితురాలు.. స్పందించిన సీఎం
భువనేశ్వర్: లైంగిక వేధింపుల ఉదంతానికి మరో విద్యార్థిని అశువులుబాసింది. ఒడిశాలోని ఒక కళాశాలలో లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్పై ఫిర్యాదు చేసినప్పటికీ, చర్యలు తీసుకోకపోవడంతో కలత చెందిన ఒక విద్యార్థిని ఒంటికి నిప్పటించుకుంది. మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ సోమవారం రాత్రి మృతిచెందింది.ఐసీయూలోని బర్న్స్ వార్డులో చికిత్సనందిస్తూ, మూత్రపిండ మార్పిడి చికిత్సతో సహా అన్ని సాధ్యమైన వైద్య సహాయం అందించినప్పటికీ, బాధితురాలిని బతికించలేకపోయామని, ఆమె సోమవారం రాత్రి 11:46 గంటలకు మరణించిందని ఎయిమ్స్ భువనేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపింది. బాధితురాలు జూలై 1న కళాశాల ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమె కళాశాల అధికారులకు రాసిన లేఖలో ఆ ప్రొఫెసర్ నెలల తరబడి తనపై సాగించిన వేధింపులు, బెదిరింపులను వివరించింది. అయినా ప్రొఫెసర్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. ఈ నేపధ్యంలో తీవ్ర నిరాశలో ఉన్న బాధితురాలు జూలై 12న బాలసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల ప్రాంగణంలో నిప్పంటించుకుంది. 90 శాతం మేరకు కాలిపోయిన బాధితురాలిని వెంటనే ఎయిమ్స్ భువనేశ్వర్కు తరలించారు. సోమవారం రాత్రి ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. ଫକୀର ମୋହନ ସ୍ୱୟଂଶାସିତ ମହାବିଦ୍ୟାଳୟର ପୀଡ଼ିତା ଛାତ୍ରୀଙ୍କ ଦେହାନ୍ତ ଖବର ଶୁଣି ମୁଁ ଅତ୍ୟନ୍ତ ମର୍ମାହତ। ସରକାରଙ୍କ ସମସ୍ତ ଦାୟିତ୍ୱ ନିର୍ବାହ ତଥା ବିଶେଷଜ୍ଞ ଡାକ୍ତରୀ ଦଳଙ୍କ ଅକ୍ଲାନ୍ତ ପରିଶ୍ରମ ସତ୍ତ୍ୱେ ପୀଡ଼ିତାଙ୍କ ଜୀବନ ରକ୍ଷା ହୋଇପାରିଲା ନାହିଁ । ତାଙ୍କର ଅମର ଆତ୍ମାର ସଦଗତି କାମନା କରିବା ସହ ପରିବାରବର୍ଗଙ୍କୁ ଏହି ଅପୂରଣୀୟ…— Mohan Charan Majhi (@MohanMOdisha) July 14, 2025ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి విద్యార్థిని మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ, దోషులకు కఠినమైన శిక్ష పడుతుందని ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు.‘ఎఫ్ఎం అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని మృతి వార్త విని చాలా బాధపడ్డాను. నిపుణులైన వైద్య బృందం అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ, బాధితురాలి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ జగన్నాథుడిని వేడుకుంటున్నాను. ఈ కేసులో దోషులందరూ చట్ట ప్రకారం కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని బాధిత విద్యార్థిని కుటుంబానికి హామీ ఇస్తున్నాను. ఇందుకోసం వ్యక్తిగతంగా అధికారులకు తగిన సూచనలు జారీ చేశాను’ అని ఆయన తన ఆన్లైన్ పోస్ట్లో తెలిపారు. -
‘యమున’లో విగతజీవిగా త్రిపుర యువతి.. కుటుంబ కలహాలే..?
న్యూఢిల్లీ: ఆరు రోజుల క్రితం ఢిల్లీలో అదృశ్యమైన త్రిపురకు చెందిన యువతి స్నేహా దేబ్నాథ్(19) ఆత్మహత్య చేసుకున్నదని, ఆమె మృతదేహం యుమునా నదిలో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈమె ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకుంటోంది. స్నేహా దేబ్నాథ్ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు నిర్ధారించారని పోలీసులు పేర్కొన్నారు.స్నేహా దేబ్నాథ్ అదృశ్యమైన దరిమిలా త్రిపురలోని ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం తీవ్రంగా గాలించారు. జూలై 7న ఆమె ఉత్తర ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జికి క్యాబ్లో వెళ్లింది. స్నేహ తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు సూచించే నోట్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. చదువు విషయంలో ఆమె కలకతచెందడం లేదని, ఆమె ఆందోళనకు కారణం కుటుంబ కలహాలై ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. సిగ్నేచర్ బ్రిడ్జికి 10 కి.మీ దిగువన ఉన్న గీతా కాలనీలోని ఫ్లైఓవర్ సమీపంలోని యమునా నదిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.స్నేహా దేబ్నాథ్ను ఈ స్థలంలో దింపినట్లు క్యాబ్ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. కాగా ఈ వంతెనపై నిలబడి ఉన్న ఒక అమ్మాయిని చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), పోలీసు విభాగాల సహాయంతో ఆమె కోసం గాలింపు చర్యలు సాగాయి. వారు ఉత్తర ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ నుండి ఉత్తరప్రదేశ్లోని నోయిడా వరకుగల అన్ని ప్రాంతాలను అణువణువునా జల్లెడ పట్టారు. జూలై 7 తెల్లవారుజామున స్నేహా తన సన్నిహితులకు ఈమెయిల్స్ పంపిందని పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు స్నేహితులు పోలీసులకు తెలిపారు. -
హైకోర్టు చివాట్లు పెట్టినా.. ఆ ఐఏఎస్ తీరు మారలేదు..
భోపాల్: పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థినిపై కలెక్టర్ పలు మార్లు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజా ఘటనతో మరోసారి సదరు వివాదాస్పద ఐఏఎస్ అధికారి తీరు చర్చాంశనీయంగా మారింది.విద్యార్థిపై కలెక్టర్ చేయి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏప్రిల్ 1న మధ్యప్రదేశ్ రాష్ట్రం భింద్ జిల్లాలోని మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు హేమంత్ కటారే మామ నారాయణ్ దంగ్రౌలియాకు చెందిన దీన్ దయాళ్ దంగ్రౌలియా మహవిద్యాలయ కాలేజీలో మాథ్స్ పరీక్షా కేంద్రంలో జరిగింది. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్ష రాసే సమయంలో ఓ విద్యార్థి బాత్రూంకు వెళ్లి తిరిగి తన స్థానంలో కూర్చొనేందుకు ప్రయత్నించాడు. అప్పుడే పరీక్ష కేంద్రంలోకి జిల్లా కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ విద్యార్థులు పరీక్ష ఎలా రాస్తున్నారని పరిశీలించే ప్రయత్నం చేశారు.బాత్రూంకు వెళ్లి వచ్చిన విద్యార్థిపై పలు ప్రశ్నలు సంధించాడు. విద్యార్థి సైతం కలెక్టర్కు రిప్లయి ఇచ్చాడు. అప్పుడే విద్యార్థి సమాధానంతో కలెక్టర్ కోపోద్రికులయ్యారు. విద్యార్థిపై పలుమార్లు దాడి చేశారు. అనంతరం విద్యార్థి సిబ్బంది గదిలోకి పిలిపించుకున్నారు. మరో మారు విద్యార్ధిపై చేయి చేసుకున్నారు. ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.కలెక్టర్ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్ధిపేరు రోహిత్ రాథోడ్. బీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షా కేంద్రంలో రోహిత్ రాథోర్ తన ప్రశ్నాపత్రాన్ని బయటకు తీసుకెళ్లి వాటికి సమాధానాలు తెలుసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి.దీనిపై కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ స్పందించారు. విద్యార్ధిపై చేయిచేసుకోవడాన్ని తనని తాను సమర్ధించుకున్నారు. ‘ఈ పరీక్షా కేంద్రంలో ఆర్గనైజ్డ్ మాస్ చీటింగ్ జరుగుతుందనే సమాచారం అందింది. మాస్ చీటింగ్ గుట్టురట్టు చేసేందుకే ఎగ్జామ్ సెంటర్ను విజిట్ చేశాను. ఆ సమయంలో ఓ విద్యార్థి తన ప్రశ్నాపత్రాన్ని టాయిలెట్లోకి తీసుకెళ్లాడు. ప్రశ్నలకు జవాబులు తెలుసుకొని పరీక్ష జరుగుతున్న తన బెంచ్ మీద కూర్చొనే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో బెంచ్ మీద క్వశ్చన్ పేపర్ లేదు. ఇదే విషయాన్ని విద్యార్ధిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు. కాలేజీలో చీటింగ్లు జరుగుతున్నాయనే సమాచారం వచ్చింది. భవిష్యత్తులో కాలేజీల్లో ఇలా జరగకుండా యూనివర్సీటీకి లేఖ రాస్తానని అన్నారు.విద్యార్థి రోహిత్ రాథోర్ మాట్లాడుతూ.. నేను టాయిలెట్కు వెళ్లి వచ్చేసరికి నా ప్రశ్నపత్రం కనిపించలేదు. నేను మోసం చేయలేదని వాపోయాడు. కాగా, విద్యార్ధిపై దాడి విషయంలో ఐఏఎస్ అధికారి సంజీవ్ శ్రీవాస్తవపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు సైతం ఆయన ప్రవర్తనపై వ్యాఖ్యలు చేసింది. మరో అధికారిణి మాలా శర్మ ఆయనపై మానసిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇప్పుడు విద్యార్థిపై ఐఏఎస్ అధికారి సంజీవ్ శ్రీవాస్తవ చేయిచేసుకోవడం వివాదానికి దారి తీసింది. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. Sanjeev Srivastava, IAS, DM of Bhind, got a tip-off about cheating during the BSc 2nd year maths exam at a college.DM sahab barged in like Singham, picked a student, and started slapping him without any proof of cheating.If you are angry at this, remeber that DM sahab could… pic.twitter.com/n5J1yZv5gy— THE SKIN DOCTOR (@theskindoctor13) July 13, 2025 -
కలకత్తా ఐఐఎంలో అఘాయిత్యం
కోల్కతా: ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) కలకత్తా క్యాంపస్లో ఘోరం జరిగింది. ఓ మహిళపై విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు మందు కలిపిన పానీయం తాగించాడని, తాను అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. కోల్కతాలోని హరిదేవ్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడు మహావీర్ తొప్పాన్నవర్ అలియాస్ పరమానంద జైన్ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం నగరంలోని అలీపూర్ కోర్టులో ప్రవేశపెట్టగా, నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం ఏడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19వ తేదీన అతడిని మళ్లీ తమ ఎదుట ప్రవేశపెట్టాలని పోలీసులకు సూచించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు కోరగా మేజిస్ట్రేట్ తిరస్కరించారు. ఆన్లైన్ ద్వారా సంప్రదింపులు కోల్కతాకు చెందిన మహిళ క్లినికల్ సైకాలజిస్ట్గా పని చేస్తున్నారు. విద్యార్థులకు, యువతకు కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఐఐఎం క్యాంపస్లో చదువుకుంటున్న విద్యార్థి కౌన్సిలింగ్ తీసుకుంటానని ఆన్లైన్ ద్వారా ఆమెను సంప్రదించాడు. శుక్రవారం సదరు మహిళను తమ హాస్టల్కు రప్పించాడు. హాస్టల్ గదికి చేరుకున్న తర్వాత ఆమెకు డ్రగ్స్ కలిపిన పానీయం అందజేశాడు. అది సేవించి ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని గంటల తర్వాత తేరుకున్న బాధితురాలు తనపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. అతడిని గట్టిగా నిలదీయడంలో బెదిరింపులకు గురి చేశాడు. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘోరాన్ని వివరించారు. పోలీసులు రంగంలోకి దిగి, శుక్రవారం రాత్రి నిందితుడు పరమానంద జైన్ను అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై ఐఐఎం–కలకత్తా యాజమాన్యం స్పందించింది. తమ విద్యార్థిపై ఒక మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని వెల్లడించింది. ఆమె తమ సంస్థకు చెందిన మహిళ కాదని స్పష్టంచేసింది. కోల్కతాలో వరుస ఘటనలు పశి్చమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మహిళలపై అత్యాచార ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే 15 రోజుల క్రితం కోల్కతాలోని న్యాయ కళాశాలలో 24 ఏళ్ల విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ముగ్గురు వ్యక్తులు సెక్యూరిటీ గార్డుతో కలిసి ఆమెను రేప్ చేసినట్లు కేసు నమోదైంది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం జరగలేదు.. ఆటో నుంచి కింద పడిపోయింది ఐఐఎం–కలకత్తా క్యాంపస్ హాస్టల్లో అత్యాచారానికి గురైన మహిళ తండ్రి భిన్నంగా స్పందించారు. తన కుమార్తెపై అత్యాచారం జరగలేదని, ఆటోలో ప్రయాణిస్తూ కింద పడిపోవడంతో స్వల్పంగా గాయాల పాలైందని శనివారం చెప్పారు. శుక్రవారం రాత్రి 9.34 గంటల సమయంలో తనకు ఫోన్ వచ్చిందని, తన బిడ్డ ఆటో నుంచి పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరినట్లు తెలిసిందని అన్నారు. పోలీసులు అమెను ఆసుపత్రికి చేర్చారని తెలిపారు. రేప్ జరగలేదని తన కుమార్తె తనతో స్వయంగా చెప్పిందని వెల్లడించారు. -
Kolkata: బాలుర హాస్టల్లో విద్యార్థినిపై అకృత్యం.. ఒకరి అరెస్ట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోగల ఒక న్యాయ కళాశాలలో యువతిపై జరిగిన అత్యాచారాన్ని మరచిపోకముందే, ఇక్కడి ఐఐఎం కళాశాలలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్-కలకత్తాలో చదువుకుంటున్న ఒక విద్యార్ధినిపై బిజినెస్ స్కూల్ హాస్టల్లో ఒక విద్యార్థి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసిందని వారు పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు అందించిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ఆమెను కౌన్సెలింగ్ కోసం బాలుర హాస్టల్కు పిలిచారు. ఆ తర్వాత ఆమెచేత ఏదో పానీయం తాగించాక, ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగిందని ఆ యువతి గ్రహించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు తనను బెదిరించాడని కూడా ఆమె ఆరోపించిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసిన కొద్ది గంటలకే నిందితుడిని అరెస్ట్ చేశామని, కేసు దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు. -
ఆరో తరగతిలోనూ ఎక్కాలు రావు!
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థ ఎంత నాసిరకంగా ఉందో కేంద్ర విద్యాశాఖ సర్వేలో తేటతెల్లమయ్యింది. మూడో తరగతి చదువుకున్న విద్యార్థుల్లో 55 శాతం మంది మాత్రమే ఒకటి నుంచి 99 వరకు అంకెలను ఆరోహణ, అవరోహణ క్రమంలో అమర్చగలరు. ఆరో తరగతి చదువుతున్న వారిలో కేవలం 53 శాతం మందికే ఒకటి నుంచి పది దాకా ఎక్కాలు వచ్చు. గత ఏడాది డిసెంబర్ 4న ఈ సర్వే నిర్వహించారు. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన 781 జిల్లాల్లో 74,229 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 21.15 లక్షల మంది విద్యార్థులను ప్రశ్నించారు.వీరిలో మూడు, ఆరు, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులున్నారు. మూడో తరగతి విద్యార్థుల్లో 58 శాతం మంది కూడికలు, తీసివేతలు చేయగలరని తేలింది. మూడో తరగతి, ఆరో తరగతిలో గణితం సబ్జెక్టులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బాగా వెనుకబడి ఉన్నట్లు వెల్లడయ్యింది. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దాదాపు అన్ని సబ్జెక్టుల్లో రాణిస్తున్నట్లు సర్వేలో గుర్తించారు.అలాగే అన్ని తరగతుల విద్యార్థులు లాంగ్వేజ్(భాష)లో ఎక్కువ, గణితంలో అతి తక్కువ మార్కులు సాధిస్తున్నారు. విద్యార్జన విషయంలో రూరల్–అర్బన్ అనే వ్యత్యాసం కూడా కనిపిస్తోంది. గ్రామాల్లోని మూడో తరగతి విద్యార్థులు మ్యాథ్స్, లాంగ్వేజ్లో పట్టణాల్లోని విద్యార్థుల కంటే ఎక్కువగా రాణిస్తున్నారు. పట్టణాల్లోని ఆరు, తొమ్మిది తరగతి విద్యార్థులు దాదాపు అన్ని సబ్జెక్టుల్లో పల్లెల్లోని విద్యార్థుల కంటే మిన్నగా చదువుతున్నారు. -
ప్రాణం తీసుకున్న బీటెక్ విద్యార్థిని.. కారణం ఆమె స్నేహితులే!
సాక్షి,హైదరాబాద్: చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది. చదువు ఎలా బతకాలో నేర్పిస్తుంది. చక్కటి చదువు మంచి నడవడికను నేర్పిస్తుంది. కానీ ఆ యువతి విషయంలో చదివే మరణ శాసనం రాసింది. అవును స్నేహితుల వేధింపులే ఆమెకు శాపంగా మారాయి. బాగా చదవడం లేదంటూ చేసిన ఏగతాళి మాటలు ఆమెను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. తోటి స్నేహితురాలని చూడకుండా మాటలతో వేధించారు. ప్రాణం తీశారు.పైన ఫొటోలో కనిపిస్తున్న ఆ యువతి పేరు నిత్య. ఉండేది జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్లో. తన తోటి స్నేహితులు తనని ఎగతాళి చేశారని ఆత్మహత్య చేసుకుంది.. నిత్య హైదరాబాద్లోని ఓ ఉమెన్స్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్లోని ఓ హాస్టల్లో ఉంటున్న నిత్యాను తోటి స్నేహితురాళ్లే సూటిపోటి మాటలతో వేధించారు. స్నేహితుల ఎగతాళితో మనస్థాపం చెందిన నిత్య హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన జాబితాపూర్కు వచ్చింది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన స్థానికులు జగిత్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో కరీంనగర్కు తరలించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చదువుల కోసం హైదరాబాద్కు పంపిస్తే స్నేహితులే వేధించి చంపేశారంటూ నిత్య కుటుంబసభ్యులు కన్నీరు మన్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరో ఏదో అన్నారని క్షణికావేశంలో పెద్ద నిర్ణయం తీసుకున్న నిత్య తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిచ్చింది. -
మాల్లో మంటలు.. లిఫ్ట్లో విద్యార్థి చిక్కుకుని..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్బాగ్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో లిఫ్ట్లో చిక్కుకున్న ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు. నాలుగు అంతస్తుల వాణిజ్య సముదాయ భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలోని రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. తొలుత ఫ్యాబ్రిక్, కిరాణ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. ఫలితంగా విద్యుత్ నిలిచిపోయి లిఫ్ట్ ఆగిపోయింది. ఆ లిఫ్ట్లో చిక్కకున్నవిద్యార్థి కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్(25) ప్రాణాలు కోల్పోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను చల్లార్చేందుకు పలు ఇబ్బందులు పడ్డారు. ఈ భవనంలో ఒకే ప్రవేశ మార్గం, ఒకే నిష్క్రమణ మార్గం ఉంది. వివిధ వస్తువుల స్టాక్తో మెట్ల మార్గం అంతా మూసుకుపోయింది.దీంతో పైఅంతస్తులకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దట్టమైన పొగ వెంటిలేషన్ను అడ్డుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు గోడను బద్దలు కొట్టవలసి వచ్చింది. మొత్తం పదమూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే పనిలో పాల్గొన్నాయి. ఈ అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్ అనే అనుమాలున్నప్పటికీ, దర్యాప్తు తర్వాత అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన మరోసారి వాణిజ్య ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా అవసరాలను గుర్తుచేస్తోంది. ఇది కూడా చదవండి: Jharkhand: కూలిన బొగ్గు గని.. ఒకరు మృతి.. పలువురు విలవిల -
స్నేహితురాళ్లు అవమానించారని ఇంజినీరింగ్ విద్యార్థిని..
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన కాటిపల్లి నిత్య(21) తన స్నేహితులు కళాశాలలో, హాస్టల్లో మానసికంగా వేధించారని, క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిత్య హైదరాబాద్లోని రిషి ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదివే వైష్ణవి, సంజన కొద్ది రోజులుగా చదువులో వెనుకబడ్డావని, హేళన చేస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశారు. మనస్తాపానికి గురై ఈనెల 1న ఇంటికి వచ్చింది. 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యుల సూచనతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తండ్రి కాటిపల్లి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. -
గదిలో బంధించాడు వివస్త్రను చేశాడు!
కోల్కతా: లా కాలేజీ గ్యాంగ్రేప్ కేసులో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి నాయకుడు మోనోజిత్ మిశ్రాపై మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతను తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మరో విద్యార్థిని వెల్లడించింది. ఓ వేడుక సందర్భంగా గదిలో బంధించి, వివస్త్రను చేసి లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ‘‘2023 అక్టోబర్లో కాలేజీ వేడుకలో ఓ పక్క విద్యార్థులు డ్యాన్స్ చేస్తుండగా మా నాన్న ఫోన్ చేశారు. గోలగోలగా ఉండటంతో మాట్లాడటానికి పక్కనున్న ఖాళీ గదిలోకి వెళ్లాను. మాట్లాడి బయటికి రాబోతుండగా మోనోజిత్ లోపలికొచ్చి తలుపు లాక్ చేశాడు. మద్యం, గంజాయి తాగి ఉన్నాడు. నా మీదికొస్తుంటే నెట్టేశా. దాంతో తన జేబులోని రిమోట్తో వేదిక వద్ద మ్యూజిక్ సౌండు పెంచాడు. తర్వాత నా జుట్టు పట్టుకుని గదిలోని బాల్కనీలోకి ఈడ్చుకెళ్లాడు. నా బట్టలు విప్పడం ప్రారంభించాడు. వదిలెయ్యమని వేడుకున్నా. బిగ్గరగా అరిచా. అదృష్టవశాత్తూ ఒక సీనియర్ విద్యార్థి తలుపు తట్టడంతో మోనోజిత్ పారిపోయాడు’’ అని వెల్లడించింది. ఇష్టపూర్వక లైంగిక కలయికే: లాయర్ గ్యాంగ్ రేప్ కేసులో మోనోజిత్తో పాటు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ కస్టడీని కోర్టు మరో ఎనిమిది రోజులు పొడిగించింది. వారి తర్వాత అరెస్టయిన నాలుగో నిందితుడు, కాలేజీ సెక్యూరిటీ గార్డు పినాకీ బెనర్జీ కస్టడీనీ జూలై 4 వరకు పొడిగించారు. మోనోజిత్ ఆరోగ్య పరీక్షల సమయంలో సమయంలో అతని శరీరంపై రక్కిన గీతలను పోలీసులు గుర్తించారు. లైంగిక దాడిని బాధితురాలు ప్రతిఘటించిందనేందుకు అవి నిదర్శమని పోలీసు వర్గాలు తెలిపాయి. మోనోజిత్ కాల్ రికార్డులను సిట్ బృందం పరిశీలించింది. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నయనా చటర్జీతో అతనికి జరిగిన ఫోన్ సంభాషణల ఆధారాలను గుర్తించింది. కానీ మోనోజిత్ తరఫు లాయర్ రాజూ గంగూలీ మాత్రం బాధితురాలి ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ఆరోపించారు. ‘‘ఆమె ఇష్టపూర్వకంగానే అతనితో లైంగికంగా కలిసింది. మోనోజిత్ మెడపై ఆమె గోటి గుర్తులే దానికి నిదర్శనం. ఈ విషయాన్ని ప్రాసిక్యూషన్ కావాలనే దాస్తోంది’’ అని ఆక్షేపించారు. -
యువ వైద్యులపై కూటమి సర్కార్ అరాచకం
సాక్షి, తాడేపల్లి: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, దేశంలో వైద్య వృత్తిని కొనసాగించేందుకు అన్ని అర్హతలను సాధించిన యువ వైద్యుల పట్ల కూటమి సర్కార్ అరాచకంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్రలు మండిపడ్డారు.తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి చెందిన దాదాపు 1500 మంది యువ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం గత 13 నెలలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా, వారిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగితే, పోలీసులతో వారిని అరెస్ట్ చేయించి, టెంపో వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలించడం ద్వారా ప్రభుత్వం తన కర్కశత్వాన్ని చాటుకుందని ధ్వజమెత్తారు. ఇంకా వారేమన్నారంటే..విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని ఎన్ఎంసీ పరీక్ష క్వాలిఫై అయిన వారికి నిబంధనల ప్రకారం ఏడాది పాటు ఇంటర్న్షిప్ నిర్వహిస్తారు. అనంతరం వారికి రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 13 నెలల నుంచి విద్యార్ధులు పీఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా, వారి గోడు వినేవారే లేరు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రిని కలిసిన యువ వైద్యులపై ఆయన కనీసం సానుభూతి కూడా చూపకుండా, బెదిరింపు ధోరణితో మాట్లాడారు.ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ను కలిసి మొరపెట్టుకుంటే, వీరికి సంబంధించిన ఫైల్పై ఆయన సంతకం పెట్టారు. కానీ విజయవాడ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాత్రం ఈ ఫైల్పై కొర్రీలు వేస్తున్నారు. ఎన్ఎంసీ నుంచి క్లారిటీ ఉంటేనే పీఆర్ ఇస్తానంటూ, రెండేళ్ళ పాటు ఇంటర్న్షిప్ చేస్తేనే పీఆర్ ఇస్తామంటూ రకరకాలుగా సాకులు చూపుతూ అభ్యర్ధులను వేధిస్తున్నారు. వీరితో పాటు క్వాలిఫై అయిన వారందరూ వివిధ రాష్ట్రాల ఆయా ప్రభుత్వాల నుంచి పీఆర్ సర్టిఫికేట్లు పొందారు.కానీ ఏపీలో మాత్రమే యువ వైద్యుల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. దీనిపై హెల్ట్ యూనివర్సిటీ ఎదుట యువ వైద్యులు ఆందోళన చేస్తే, రాత్రి సమయంలో టెంపో వ్యాన్లలో వారిని బలవంతంగా ఎక్కించి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. డాక్టర్స్ డే రోజునే వైద్య విద్యార్ధుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది.రాష్ట్రంలో రూ.8500 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు సీట్లు కేటాయిస్తామని కేంద్రం ముందుకు వస్తే, సీఎం చంద్రబాబు దానికి మోకాలడ్డారు. తమకు సీట్లు అక్కరలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరో వైపు ఇప్పటికే పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.విదేశాల్లో చదువుకుని, ప్రాక్టీస్కు అన్ని అర్హతలు సాధించుకున్న యువ వైద్యుల పట్ల కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఏం అనాలో కూడా అర్థం కావడం లేదు. తక్షణం యువ వైద్యులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం తరుఫున ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. -
శ్రీవాణి ఆత్మహత్యకు ఫొటోనే కారణమా..
పరకాల: ఓ పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్పేట శివారులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సోమవారం జరిగింది. పరకాలకు చెందిన ఏకు ఈశ్వర్–నీల కుమార్తె శ్రీవాణి ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం బాత్రూమ్కు వెళ్లింది. చాలాసేపటి వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు ప్రిన్సిపాల్ కృష్ణకుమారికి తెలిపారు. ఆమె వచ్చి బాత్రూం డోర్ను బలవంతంగా తీయడంతో శ్రీవాణి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. శ్రీవాణి బాత్రూంలో జారిపడిందని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు భోరుమని విలపించారు. తమ కుమార్తె చావుకు కారణం తెలపాలంటూ రెసిడెన్షియల్ ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ కృష్ణకుమారి, హౌజ్మాస్టర్ మీరాబాయి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు ఫొటోనే కారణమా.. వారం క్రితమే రెసిడెన్షియల్లో చేరిన శ్రీవాణి వద్ద ఓ ఫొటోను చూసిన హౌస్ టీచర్ బలవంతంగా లాక్కున్నట్లు తెలిసింది. తర్వాత విద్యార్థిని సదరు టీచర్ తాళం చెవి కనుక్కొని లాకర్ ఓపెన్ చేసి ఫొటో తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా.. విద్యార్థినుల సమక్షంలోనే శ్రీవాణిని నోటికి వచి్చనట్లు తిట్టి.. చావచ్చు కదా అన్నట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్రిన్సిపాల్ ఆటోలో విద్యారి్థని మృతదేహాన్ని తరలించడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని పరకాల పోలీస్స్టేషన్కు తరలించినట్లు సమాచారం. -
గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో విచిత్ర ఘటన
-
అమ్మ చనిపోదాం అంటోంది.. ఆదుకోండి మేడమ్
ప్రాంతం: గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని శంకరన్ భవన్సందర్భం: ప్రజా ఫిర్యాదుల వేదిక (గ్రీవెన్స్సెల్)లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) :కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించిన వేదిక కావడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టేందుకు బారులు తీరారు. ఇంతలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు స్కూల్ బ్యాగ్తో అక్కడికి వచ్చాడు. ఆ బుడతడి మోములో ఏదో తెలియని అమాయకత్వం. తన చిట్టి చేతుల్లో ఏదో రాసుకున్న వినతిపత్రం కనిపించింది. దీన్ని గమనించిన పాత్రికేయులు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వద్దకు తీసుకువెళ్లారు. అలా కలెక్టర్ను కలిసిన ఆ బాలుడు ఓ వినతి పత్రం అందించి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే...హృద్రోగంతో బాలుడు.. ఉపాధికి దూరమైన కుటుంబంగుంటూరు నగరంలోని వెంకటరావుపేటకు చెందిన అలవాల రాధిక, భర్త రామ సుబ్బారెడ్డి దంపతుల కుమారుడు యశ్వంత్. నగరంలో ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. యశ్వంత్ పుట్టుకతో హృద్రోగ బాధితుడు. వైద్యులను సంప్రదించగా 16 ఏళ్లు నిండాకనే ఆపరేషన్ చేస్తామని, అప్పటి వరకు మందులు వాడాల్సిందిగా సూచించారు. దీనికితోడు కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కుటుంబం గడవడం కష్టతరంగా మారింది. దీంతో గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి అత్యవసర విభాగం గేటు బయట భాగంలో టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.రోడ్డు విస్తరణలో భాగంగా ఆ బండిని తీసెయ్యాల్సి వచ్చింది. దీంతో ఆ కుటుంబానికి ఉపాధి దూరమైంది. ఈ పరిణామం తల్లి రాధికను తీవ్రంగా బాధించింది. ఓ వైపు కన్నకొడుకు అనారోగ్యం, మరోవైపు ఉపాధి కోల్పోవడంతో మానసికంగా కలత చెందింది. మనం చనిపోదాం..ఇన్ని కష్టాలతో బతకలేమంటూ యశ్వంత్ ఎదుట పదేపదే అనడంతో ఆ బాలుడికి ఏం చేయాలో తోచలేదు. చివరికి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వద్దకు వెళ్ళి వినతి పత్రం అందజేసి తన గోడును విన్నవించుకున్నాడు. కలెక్టర్ చొరవ..కుటుంబానికి తోవ కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ స్పందించారు. గుంటూరు జీజీహెచ్ ఎదుట టిఫిన్ బండి నడిపేందుకు స్థలం చూపించారు. -
Kolkata: లా విద్యార్థిని అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్
కోల్కతా: సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ లా ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ దారుణంలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. విద్యార్థినిపై దారుణం జరిగిన తర్వాత కూడా ఆమెను వేధించిన కాలేజీ క్యాంపస్ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. కోల్కతాలోని కస్బా ప్రాంత న్యాయ కళాశాలలో జూన్ 25న రాత్రి మొదటి సంవత్సరం లా చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్లోనే అత్యాచారం జరిగింది. జూలై 16న జరగనున్న సెమిస్టర్ పరీక్షల కోసం పరీక్షా ఫారాలను పూర్తి చేసేందుకు బుధవారం కాలేజీ క్యాంపస్కు వచ్చింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు.నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. -
గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి
గుండెపోటుతో 3వ తరగతి బాలుడు మృత్యువాత, తరగతిలో ఆరో తరగతి బాలిక హఠాన్మరణం.. ఇలాంటి బాధాకర ఘటనలు కొన్నేళ్లుగా అధికమయ్యాయి. నూరేళ్ల జీవితం కళ్లముందే ఆవిరైతే కన్నవారి ఆవేదన మిన్నంటుంతోంది. ఈ కడుపు కోతకు పరిష్కారమే లేదా అని ఘోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులు కొన్ని పరిశోధనలు చేసి మొబైల్ఫోన్తో పాటు మరికొన్ని లింకులు ఉన్నట్లు తేల్చారు. కర్ణాటక: హాసన్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థిని గుండెపోటుతో అర్ధాంతరంగా కన్నుమూసింది. బెంగళూరులో నివాసం ఉంటున్న సుప్రియా (22) గుండెపోటు రావడంతో క్షణాల్లో ప్రాణాలు విడిచింది. దీంతో గత నెలరోజుల్లో గుండెపోటుతో చనిపోయిన హాసన్వాసుల సంఖ్య 14కు పెరిగింది. సుప్రియా హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా కట్టళ్లి వాసి, బెంగళూరు బ్యాటరాయనపురలో నివాసం ఉంటూ కర్ణాటక ఓపెన్ వర్శిటీలో డిగ్రీ చదువుతోంది. బుధవారం ఇంటిలో ఉండగా హఠాత్తుగా కుప్పకూలింది. కుటుంబీకులు ఆస్పత్రి తరలిస్తుండగా దారిలో మరణించింది. -
అర్థించినా ఆలకించని పవన్
సాక్షి, రాజమహేంద్రవరం : ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ పలు సందర్భాల్లో ఉపన్యాసాలు ఇచి్చన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ‘తమ ఆడబిడ్డకు ఇంకా న్యాయం జరగలేదన్నా.. న్యాయం చేయండి’ అని అభ్యర్థించినా పట్టించుకోకుండా వెళ్లిపోయిన ఘటన రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద గురువారం చోటుచేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికికి చెందిన ఓ టెన్త్ విద్యార్థిని ఆర్నెల్ల క్రితం ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలేమిటో నిగ్గుతేల్చాలని కుటుంబ సభ్యులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో మూడునెలల క్రితం రాజమహేంద్రవరం వచ్చిన పవన్కళ్యాణ్కు బాధితులు ఎయిర్పోర్టు వద్ద కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిoచారు. అయినా ఇప్పటివరకూ న్యాయం జరగకపోవడంతో గురువారం అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు వచ్చారు. ‘ఇంకా న్యాయం జరగలేదన్నా..’ అంటూ ఫ్లెక్సీ చూపిస్తూ నిరసన తెలిపారు. కొద్దిసేపు అక్కడే ఉన్నా వారిని పవన్ గమనించలేదు. దీంతో పోలీసులు పవన్ను కలిసే ఏర్పాటుచేస్తామని వారిని వేదిక వద్దకు తీసుకెళ్లారు. పవన్ ప్రసంగం అయిన వెంటనే మాట్లాడిస్తామని చెప్పడంతో వారు ఫ్లెక్సీ కిందకు దింపేశారు. కానీ, సభ పూర్తయిన వెంటనే పవన్ వారితో మాట్లాడకుండానే వెళ్లిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక బాధితులు వెనుదిరిగారు. జనసేన కార్యకర్తల వీరంగం.. సభలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పవన్కళ్యాణ్ ప్రసంగిస్తుండగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారి చిందులకు సభలోని కుర్చీలు విరిగిపోయాయి. ‘ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్’..!సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రసంగంలో ‘రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్’ అని పలికారు. దీంతో జనసేన కార్యకర్తలు అరవడం ప్రారంభించారు. పక్కనున్న వ్యక్తి డిప్యూటీ సీఎం అని చెప్పడంతో.. తిరిగి డిప్యూటీ సీఎం అని పురందేశ్వరి అన్నారు. -
దళిత విద్యార్థులకు కూటమి సర్కార్ అన్యాయం
-
విద్యార్థులతో గుంజిళ్లు.. టీచర్కు సర్కార్ నోటీసు
తిరువనంతపురం: విద్యార్థినుల చేత గుంజిళ్లు తీయించినందుకు ప్రభుత్వం ఉపాధ్యాయురాలికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన కేరళలోని కాటన్హిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. పాఠశాల ముగిసిన అనంతరం జాతీయ గీతం ఆలపిస్తారు. కార్యక్రమం జరుగుతుండగానే కొందరు విద్యార్థినులు తరగతి గదినుంచి బయటికి వెళ్లిపోయారు. అది చూసిన టీచర్ వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. జాతీయగీతం పాడుతుండగా వెళ్లిపోయిన విద్యార్థినులను గుంజిళ్లు తీయించారు. దీంతో ఆయా విద్యార్థినులు స్కూల్ బస్సును మిస్సయ్యారు. తమ పిల్లలు రోజూకంటే ఆలస్యంగా ఇంటికి రావడంతో వారిని ప్రశ్నించిన తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఇది విద్యాశాఖ దృష్టికి వెళ్లడంతో ఎలాంటి వివరణ లేకుండానే విద్యాశాఖ మంత్రి శివన్కుట్టి ఆదివారం ఉపాద్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే.. జిల్లా విద్యాశాఖాధికారి నివేదిక మేరకు.. నోటీసులు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. -
రేపటి వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం వాయిదా
సాక్షి, అమరావతి: అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంలో దాదాపు 241 మంది మరణించిన నేపథ్యంలో.. ఆ ఘటనకు, మృతులకు సంతాప సూచకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం (జూన్ 13వ తేదీ) తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశారు.టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు.. ఉద్యోగాల కల్పన లేదా నిరుద్యోగ భృతి చెల్లింపు వెంటనే అమలు చేయాలని, అలాగే విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాయి.కాగా, అహ్మదాబాద్లో దారుణ విమాన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. -
నిరుద్యోగులకు బాబు వెన్నుపోటు.. ఎల్లుండి వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: ఎల్లుండి(జూన్ 13) వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు వైఎస్సార్సీపీ నిరసన చేపట్టనుంది. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్ణయించాయి.ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్.. అంటూ ఊదర గొట్టి తీరా అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించని పక్షంలో ప్రతినెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీపై పాలకులు మాట్లాడకపోవడంపై నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు.మరో వైపు, చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. -
పల్లె నుంచి.. యునైటెడ్ కింగ్డమ్కు పూర్ణిమ
కడప సెవెన్రోడ్స్ : నగరానికి చెందిన విద్యార్థిని యూకూలో సీటు సాధించి భళా అనిపించింది. కడప నగరానికి చెందిన పూర్ణిమ నిమ్మకాయల యునైటెడ్ కింగ్ డమ్లోని ప్రపంచ ప్రఖ్యాత ఎడెన్బర్గ్ యూనివర్సిటీలో సీటు సాధించి అందరినీ అబ్బుర పరిచారు. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె గ్రామానికి చెందిన రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రవిశంకర్ రెడ్డి, కె.అనితల కుమార్తె పూర్ణిమ ఒకటో తరగతి నుంచి 3వ తరగతి వరకు కడప వికాస్ హైసూ్కల్, 4 నుంచి 10వ తరగతి వరకు కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇంటర్మీడియేట్ హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాదు పబ్లిక్ స్కూల్లోనూ చదివారు. ఆ తర్వాత పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో బీఎస్సీ(ఆనర్స్) చేశారు. అనంతరం యునైటెడ్ కింగ్డమ్లోని ఎడెన్బర్గ్ యూనివర్శిటీలో ఎంఎస్ మేథమ్యాటికల్ ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్కు దరఖాస్తు చేశారు. ఎడెన్బర్గ్ యూనివర్శిటీ యాజమాన్యం ఈ మేరకు ఆమెకు ఐడీ నెంబరు 2858866కు జారీ చేసి జులై 28న అడ్మిషన్ పొందాలని సమాచారం పంపింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025లో ఎడెన్బర్గ్ వర్శిటీ 27వ స్థానంలో ఉంది.చార్లెస్ డార్విన్, అలెగ్జాండర్ గ్రహంబెల్, ప్రఫుల్ల చంద్రరే, ప్రకాశ్ కారత్, ఓలివర్ గోల్డ్స్మిత్, డేవిడ్ హ్యూమ్, వాల్టర్ స్కాట్ తదితర వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు ఈ యూనివర్శిటీలో చదివారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఐఈఎల్టీఎస్లో 8 పాయింట్లు సాధించి ప్రతిష్ఠాత్మక ఎడెన్బర్గ్ వర్శిటీలో పూర్ణిమ సీటు సాధించారు. అంతేగాక యూకేలోని బ్రిష్టల్ యూనివర్శిటీలోనూ ఎంఎస్లో ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ మేథమ్యాటిక్స్లోనూ, లండన్లోని కింగ్స్ కాలేజీలో ఫైనాన్షియల్ మేథమ్యాటిక్స్ అండ్ మేథమ్యాటిక్స్ ప్రవేశానికి కూడా పూరి్ణమ అర్హత సాధించారు. ఈ ఘనత సాధించిన ఆమెను పలువురు అభినందించారు. -
స్కూల్లో ఘోరం.. తోటి విద్యార్థులపై కాల్పులు, 11 మంది మృతి
గ్రాజ్: ఆస్ట్రియా దేశం గ్రాజ్ నగరంలో ఘోరం జరిగింది. బోర్గ్ డ్రైయర్షుట్సెన్గాసే హై స్కూల్లో ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దారుణంలో 11 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రాజ్ నగరం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నిందితుడు గన్నుతో కాల్పులు జరిపినట్లు తమకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. అయితే, కాల్పుల అనంతరం విద్యార్థి తనని తాను గన్నుతో కాల్చుకొని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాడి తర్వాత, గ్రాజ్ పాఠశాలను ఖాళీ చేయించారు. విద్యార్థులను సమీపంలోని హెల్మట్ లిస్ట్ హాల్కు తరలించారు.అక్కడ వారికి రెడ్క్రాస్ చికిత్స అందించింది. ఘటనపై అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పుల శబ్ధం విన్న వెంటనే పోలీసులు స్థానికుల్ని అప్రమత్తం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంత ప్రజలు బహిరంగంగా తిరగకూడదని, ఇళ్లలోనే ఉండాలని సూచించారు. 🚨🇦🇹 MULTIPLE DEAD IN AUSTRIAN SCHOOL SHOOTINGA shooting at BORG Dreierschützengasse school in Graz, Austria, has left at several dead, including students and teachers, with many injured.Local media reported at least 8 dead, but authorities have not released the official… pic.twitter.com/7Lqy7GjcAu— Mario Nawfal (@MarioNawfal) June 10, 2025 -
న్యూజెర్సీ నెవార్క్ ఎయిర్ పోర్ట్ లో ఘటన
-
ఉమెన్ సేఫ్టీ: ఆపదలో అండగా..!
బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మైసూర్కు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కరణ్ సరికొత్త పరికరాన్ని తయారుచేశాడు. ఐజీడబ్ల్యూఎస్(ఇన్నోవేటివ్ ఇంటెలిజెంట్ జీయోఫెన్స్–ఎనేబుల్డ్ వేరుబుల్స్ సిస్టమ్స్) అనే పరికరం మహిళలు ఆపదలో ఉంటే వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ను ఎలార్ట్ చేస్తుంది.‘డివైజ్లోని ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి...జియోఫెన్స్–బేస్డ్ డిటెక్టర్. ఒక మహిళని ఎవరైనా మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాలో అవుతున్నప్పుడు ఈ డివైజ్ సందేహాస్పద వ్యక్తి మొబైల్ ఫోన్ను గాని, బ్లూటూత్ డివైజ్ అడ్రస్ గుర్తించడానికి ఉపయోగపడుతుంది’ అంటున్నాడు కరణ్.ఈ డివైజ్లో జియోఫెన్స్–బేస్డ్ సేఫ్టీ టైమర్ కూడా ఉంటుంది. యూజర్ ఒక డెస్టినేషన్ చేరుకోవడానికి టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి షాపింగ్కు వెళ్తూ 30 నిమిషాలలో ఇంటికి వస్తానని చెబితే సిస్టమ్ ఆమె జియోలోకేషన్ని మానిటర్ చేస్తుంది. సెట్ చేసిన టైమ్ లోపు ఇంటి జియోఫెన్స్లోకి రాకపోతే డివైజ్ ఆటోమెటిక్గా ఆమె లోకేషన్ని ఎమర్జెనీ కాంటాక్ట్కి పంపిస్తుంది. డివైజ్లో ‘రిటర్న్ హోమ్ సేఫ్టీ రిమైండర్’ కూడా ఉంటుంది. డివైజ్లో మరో సేఫ్టీ ఫీచర్...డేంజర్–జోన్ నోటీఫైయర్. ఇది హై–రిస్క్ జీపీఎస్ లొకేషన్స్ ప్రీలోడెడ్ జాబితాను ఉపయోగిస్తుంది. యూజర్ ఈ ప్రాంతాలలోకి వెళ్లినప్పుడు వేరబుల్ బజర్ యాక్టివేట్ అవుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్కి తెలియజేస్తుంది. (చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..) -
చిన్న వయసు, విష్ణుప్రియ డాక్టర్ ఆశలకు 'ఉరి'
శివమొగ్గ(కర్ణాటక): శివమొగ్గలో ఉన్న సుబ్బయ్య మెడికల్ కళాశాలలో హాస్టల్లో ఓ మెడికో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు విష్ణుప్రియ (22). వివరాలు.. ఈమె కుటుంబం బెంగళూరుకు చెందినది కాగా, జర్మనీలోని బెర్లిన్లో నివసిస్తోంది. విష్ణుప్రియ ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇంటర్న్షిప్ చేస్తోంది. మరికొన్ని రోజుల్లో పూర్తయి డాక్టర్ కానుంది. అయితే ఏమి జరిగిందో మరి.. హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. కారణాలు తెలిసి రాలేదు. డెత్నోట్ ఏదీ దొరకలేదు. శివమొగ్గ గ్రామీణ పోలీసులు ఆమె శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చెల్లెళ్లు ఆటపట్టించడంతో అక్క ఆత్మహత్య
మర్రిపాలెం(విశాఖపట్నం): జ్ఞానాపురం గెడ్డ వీధికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలివి.. కిరణ్మయి (15) తల్లిదండ్రులు, చెల్లెళ్లతో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. అయితే బాలికను చెల్లెళ్లు నిత్యం ఏదో ఒక విషయంపై ఆటపట్టిస్తుండటంతో.. శుక్రవారం ఇంట్లో ఉన్న బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరు. కొంతసేపటికి ఆమె తాత ఇంటికి రావడంతో, అక్క ఎక్కడికో వెళ్లిపోయిందని వారు అతనికి చెప్పారు. అంతా వెతికి, చివరికి బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా, కిరణ్మయి విగతజీవిగా కనిపించింది. వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కాగా బాలిక తండ్రి ఎండాడలో వెల్డింగ్ పనులు చేస్తుండగా, తల్లి గౌరి నగరంలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కొబ్బరి చిప్పలతో వాటర్ బాటిల్స్..!
వ్యర్థానికి కూడా అర్థాలు చెప్పవచ్చంటూ ఓ విద్యార్థి తనదైన శైలిలో కొబ్బరి చిప్పలతో ‘కోకోనట్ షెల్ వాటర్ బాటిల్’ తయారు చేసి తన సత్తాను చాటారు. ఏదైనా వినూత్నంగా వెదురుబొంగు, కొబ్బరి, బనానా ఫైబర్, తాటాకుల సహాయంతో నూతనంగా ప్రజావసరానికి అనుగుణంగా వినియోగించే వాటిని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా కోకోనట్ షెల్తో ఈ వాటర్ బాటిల్ రూపొందించినట్లు విద్యార్థి స్పష్టం చేశారు. రాయదుర్గంలోని ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్–హైదరాబాద్ (ఎఫ్డీడీఐ–హైదరాబాద్) బి.డెస్ (లైఫ్ స్టైల్ అండ్ యాక్సెసరీస్ డిజైన్)ఎల్ఎల్పీడీ విభాగం కోర్సులో మూడో ఏడాది చదివే మత్తగుంజ అనిరుద్ ప్యాకేజ్ డిజైన్ రూపకల్పనలో భాగంగా ఈ వాటర్ బాటిల్ను తయారు చేయడం విశేషం. (చదవండి: ఫ్యాషన్కి సరికొత్త అర్థం..! 'సంస్కృత శ్లోకాల సంస్కృతి'..) -
ఎస్ఎస్సీ బోర్డు ‘ఫెయిల్’
జమ్మలమడుగు : ఫలితాల వెల్లడిలో ఎస్ఎస్సీ బోర్డు ఫెయిలైంది. బోర్డు అధికారుల తప్పిదం వల్ల ఓ విద్యార్థిని నష్టపోయింది. ఆమె భవిత అగమ్యగోచరంగా మారింది. ఏప్రిల్లో వెలువడిన పదో తరగతి ఫలితాల్లో వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన గంగిరెడ్డి మోక్షిత సోషల్లో ఫెయిల్ అయినట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. ఆమె తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లిషులో 84, గణితంలో 93, సైన్స్లో 98 మార్కులు సాధించింది. సోషల్లో మాత్రం 21 మార్కులే వచ్చినట్టు ఎస్ఎస్సీ బోర్డు మార్కుల లిస్టు జారీ చేసింది. దీంతో అనుమానం వచ్చిన మోక్షిత తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వరరెడ్డి వెయ్యి రూపాయలు కట్టి రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేశారు. అధికారులు జవాబుపత్రం రీవాల్యూయేషన్ చేసి 84 మార్కులు సాధించినట్టు ఫలితంతోపాటు జవాబుపత్రం పంపారు. అంటే ఆమెకు ఏకంగా 63 మార్కులు పెరిగాయి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్రిపుల్ ఐటీ, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు గడువు ముగిసిపోయింది. మొత్తం ఆరు సబ్జెక్టుల్లో దీక్షితకు 537 మార్కులు వచ్చాయి. అంటే ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. వాల్యూయేషన్ అధికారుల తప్పిదం వల్ల ఆ అవకాశం తప్పిపోయింది. దీంతో విద్యార్థిని మోక్షిత తీవ్రంగా కలత చెందుతోంది. ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం తండ్రితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ తనకు న్యాయం చేయాలని కోరింది. వాల్యూయేషన్ చేసిన అధికారులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు ఏపీ రెసిడెన్షియల్, గురుకుల, ట్రిపుల్ ఐటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. -
స్నేహ బంధం గెలిచినా.. విషాదం తప్పలేదు
బంధాలన్నీ వేటికవే ప్రత్యేకం. బాల్యం నుంచి మొదలు కడదాకా స్నేహ బంధంలో కలిసి నడిచేవాళ్లు ఎంతో మంది ఉంటారు. కాబట్టి ఆ బంధపు మాధుర్యం గురించి చెప్పుకుంటే పోతే బోలెడన్ని కబుర్లు. అయితే ఇక్కడ తమ మిత్రుడి కోసం ఇప్పటిదాకా ఎవరూ చేయని ప్రయత్నం చేశారు కొందరు విద్యార్థులు. ఈ ప్రయత్నంలో స్నేహ బంధం గెలిచినా.. విషాదం మాత్రం తప్పలేదు.చైనా సిచువాన్ ప్రావిన్స్(Sichuan Province)లోని యిలాంగ్ మిడిల్ స్కూల్ విద్యార్థి రెన్(15). ప్రాణాంతక క్యాన్సర్తో ఏడాది నుంచి చికిత్స తీసుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోయేసరికి.. చివరకు సొంతూరిలోనే ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స కారణంగా అతని ఏడాది చదువు పోయింది. మరో నెలలో ఆ అకడమిక్ ఇయర్ ముగియనుంది. ఈలోపు.. రెన్కు చదువు చెప్పిన టీచర్కు ఓ ఆలోచన వచ్చింది. దానికి అతని క్లాస్మేట్స్, రెన్ తల్లిదండ్రులు అంగీకరించారు.మే 17వ తేదీన.. బడి నుంచి కాలినడకన రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించి రెన్ (Ren) ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆస్పత్రికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి అతనికి యూనిఫాం తొడిగి బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రాంగణంలోనే అంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఆపై అతను త్వరగా కోలుకోవాలంటూ పుష్ఫ గుచ్చాలతో పాటు కానుకలపై సంతకాలు చేసి మరీ అతనికి అందించారు. ఈ చర్యతో నెట్టింట జనం మురిసిపోయారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కానీ, జరిగింది మరొకటి. గ్రూప్ ఫొటో దిగిన కొన్ని గంటలకే(ఆ మరుసటి ఉదయం) రెన్ కన్నుమూసినట్లు అతని తల్లిదండ్రులు ప్రకటించారు. ఈ విషాదాంతం అందరినీ షాక్కు గురి చేసింది. మరో నెలలో అతని 16వ ఏడులోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఈలోపు తుదిశ్వాస విడవడంతో ఆ తల్లిదండ్రులు, అతని స్నేహితులు గుండెలు అవిసేలా రోదించారు. ఈ గ్రాడ్యుయేషన్ ఫొటో(China Graduation Photo).. ప్రపంచంలోని అత్యుత్తమ ఫొటోగా నెట్టింట అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ మధుర క్షణం కోసమే అప్పటిదాకా అతని ఊపిరి ఆగిపోలేదేమోనని కొందరు కామెంట్ చేయగా.. వచ్చే జన్మలోనైనా ఆ చిన్నారి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని మరికొందరు కోరుకుంటూ నివాళులర్పిస్తున్నారు.ఇదీ చదవండి: పాక్.. చివరకు ఇలా కూడా పరువు తీసుకుందా? -
మార్కులు తక్కువొచ్చాయని..
ముస్తాబాద్(సిరిసిల్ల): పాలిసెట్లో ర్యాంక్ రాలేదని మనస్తాపం చెందిన ఒక విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ గణేశ్ తెలిపిన వివరాలివి. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన గూడ స్నేహిత (16) పదో తరగతి ఉత్తీర్ణురాలైంది. శనివారం విడుదలైన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ (పాలిసెట్) ఫలితాల్లో ర్యాంక్ రాలేదని మనోవేదనకు గురైంది. శనివారం ఉదయం స్నేహిత తల్లిదండ్రులు.. బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్లారు. తమ్ముడు, తాతతో కలిసి ఇంట్లోనే ఉన్న స్నేహిత.. సాయంత్రం గదిలోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుంది. గమనించిన తాత, తమ్ముడు గది తలుపులు బద్దలుకొట్టి చూడగా.. అప్పటికే మృతి చెందింది. మృతురాలి తల్లి స్రవంతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
విద్యార్థి ప్యాంట్ జేబులో పేలిన మొబైల్ ఫోన్
సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాలో విద్యార్థి ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ పేలిన ఘటన కలకలం రేపింది. రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ (22) కురబలకోట మండలం అంగళ్లులోని మిట్స్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే తనూజ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయగా.. జేబులో ఉన్న సెల్ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా, విద్యార్థి ప్యాంట్ జేబులో సెల్ ఫోన్ పేలిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ఓవర్ హీట్ కారణంగానే పేలినట్లు భావిస్తున్నారు. బ్యాటరీ డ్యామేజీ కావడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ఓవర్ హీట్ కాకుండా చూసుకోవాలని.. చల్లటి ప్రదేశాల్లో ఉంచాలని సూచిస్తున్నారు. -
బయో మెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి
హైదరాబాద్: హైదరాబాద్లో ఇంటర్న్షిప్ చేసేందుకు జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడి కి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. జార్ఖండ్ కు చెందిన యువతి (20) తమిళనాడులోని కలస లోకేషన్లింగం కాలేజీలో బయో మెడికల్ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో బాచుపల్లి హరితవనం కాలనీకి చెందిన అజయ్ (24) బీటెక్ చదువుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్ప డింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో ఇంటర్న్íÙప్ చేయాలని యువతి నిర్ణయించుకుంది. దీంతో ఈ నెల 3న ఆమె హైదరాబాద్కు రాగా కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఆమెను అజయ్ ఉంచాడు. అదేరోజు సాయంత్రం పార్టీ చేసుకుందామని ఆమెను బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఉన్న తన స్నేహితుడు హరి ఇంటికి తీసుకెళ్లాడు. ముగ్గురు కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించిన అనంతరం అజయ్ యువతిపై లైంగిక దాడి చేశాడు. తర్వాత హరి కూడా యువతిపై లైంగిక దాడి చేయటానికి ప్రయతి్నంచగా యువతి కేకలు వేసింది. దీంతో చుట్టు పక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణæ అనంతరం 4వ తేదీన అజయ్, హరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి సురక్షితంగా స్వస్థలానికి వెళ్లేందుకు సహాయం చేశారు. ఓ బైక్, మద్యం బాటిల్, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. -
నీట్ పరీక్ష రాసింది.. ఇంటికొచ్చి ప్రాణం తీసుకుంది!
జగిత్యాల జిల్లా : జిల్లాలోని చల్ గల్ గ్రామానికి చెందిన జంగా పూజ(18) అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నీట్ పరీక్ష రాసిన ఆమె.. పేపర్ ను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల క్రితం రాసిన నీట్ పరీక్షలో ర్యాంకు రాకపోవడంతో రెండోసారి తాజాగా నీట్ పరీక్ష రాసింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత పేపర్ ను క్రాస్ చెక్ చేసుకుని ర్యాంకు రాదనే ఆందోళనలో పడింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుంది.కాగా, జగిత్యాల జిల్లాలోని రెండు కేంద్రాల్లో నిర్వహించిన నీట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నాచుపల్లి జేఎన్టీయూ కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. అక్కడి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఒక సెంటర్లో 480, రెండో సెంటర్లో 278 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. ఒక కేంద్రంలో 13 మంది, మరో కేంద్రంలో ఐదుగురు గైర్హాజరైనట్లు వివరించారుమూడు నిమిషాల ఆలస్యం.. పరీక్షకు దూరంమల్యాల: జేఎన్టీయూ పరీక్ష కేంద్రం తెలియక మూడు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న ఓ విద్యార్థిని పరీక్ష దూరమైంది. మల్లాపూర్ మండలం వీవీ.రావుపేటకు చెందిన సీహెచ్.నవ్యకు జేఎన్టీయూ కేంద్రం పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరింది. ఇంజినీరింగ్ కళాశాల అడ్రస్పై అవగాహన లేక దిగువ కొండగట్టు వరకు వెళ్లారు. పూర్తి అడ్రస్ తెలుసుకుని వెళ్లే సరికి మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో అక్కడున్న సిబ్బంది లోపలికి అనుమతించలేదు. గతంలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా.. ఆశించిన ఫలితం రాలేదని, మరోసారి పరీక్షకు సన్నద్ధమైన రాయలేకపోయాయని ఆవేదనతో తిరిగి వెళ్లిపోయింది.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
విద్యా రుణం.. నిబంధనలు శరాఘాతం
విద్యా రుణం (ఎడ్యుకేషన్ లోన్).. ఉన్నత విద్య చదవాలన్న ఆసక్తి ఉన్నా, స్తోమత లేని వారి పాలిట వరం. విదేశీ విద్యకు, ఆయా కోర్సులకు ఉండే రూ. లక్షల్లో ఫీజులు సొంతంగా చెల్లించలేని పరిస్థితుల్లో విద్యా రుణానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ రుణం మంజూరు అయితే తమ కలల చదువు పూర్తి చేసుకుని.. లక్షల్లో జీతాలొచ్చే ఉద్యోగాల్లో స్థిరపడవచ్చని, లేదంటే సొంతంగా స్టార్టప్స్ వంటివి ప్రారంభించవచ్చనే ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. కానీ.. ఈ ఆలోచనలకు, ఆశలకు భిన్నంగా బ్యాంకుల నిబంధనలు విద్యార్థులకు శరాఘాతంగా మారుతున్నాయి. విద్యారుణాల (Education Loan) మంజూరులో బ్యాంకులు పాటిస్తున్న నిబంధనలు విద్యార్థులను డిఫాల్టర్స్ (ఎగవేతదారుల) జాబితాలో చేరే పరిస్థితికి కారణమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. రుణ దరఖాస్తుకు కో– అప్లికెంట్ (సహ దరఖాస్తుదారు)గా తమ తల్లిదండ్రులను లేదా సంరక్షకులను పేర్కొనడమే. – సాక్షి, స్పెషల్ డెస్క్‘డిఫాల్టర్స్’ సమస్య సాధారణంగా విద్యార్థులకు సొంత ఆదాయ వనరులు ఉండవు. ఈ క్రమంలో విద్యా రుణ దరఖాస్తు సమయంలో తల్లిదండ్రులను కో అప్లికెంట్స్గా పేర్కొంటున్నారు. కానీ తల్లిదండ్రులు అప్పటికే ఏదైనా వ్యక్తిగత రుణం, ఇతర రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారితోపాటు, విద్యార్థులను కూడా డిఫాల్టర్స్ జాబితాలో చూపించేలా బ్యాంకులు వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో విడతల వారీగా మంజూరు చేసే రుణ మొత్తాన్ని కూడా నిలిపివేస్తున్నాయి బ్యాంకులు. ఈ సమస్యను పలు బ్యాంకులు కొద్ది రోజుల కిందట రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. సహ రుణగ్రహీతగా పేరెంట్ లేదా గార్డియన్ ప్రస్తుతం అమల్లో ఉన్న మోడల్ ఎడ్యుకేషన్ లోన్ పథకం ప్రకారం.. రూ.7.5 లక్షల రుణం వరకు ఎలాంటి హామీ లేదా థర్డ్ పార్టీ గ్యారెంటీ అక్కర్లేదు. ఈ సందర్భంలో పేరెంట్ లేదా గార్డియన్ను సహ రుణ గ్రహీతగా పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో రుణాలు మంజూరు చేసే ముందు.. బ్యాంకులు సహ రుణ గ్రహీతలు ఇతర లోన్స్ చెల్లింపులో విఫలమైతే.. ఆ కారణంగా విద్యార్థుల రుణ దరఖాస్తులను పక్కన పెట్టేస్తున్నాయి. ఒకవేళ విద్యా రుణం మంజూరు అయ్యాక పేరెంట్స్ వాటిని తిరిగి చెల్లించలేకపోతే విద్యార్థులనూ రుణ ఎగవేతదారులుగా పేర్కొంటున్న పరిస్థితి. ఇది భవిష్యత్తు రుణ దరఖాస్తుల ఆమోదంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్బీఐ నిబంధనలు కూడా.. ఆర్బీఐ ప్రస్తుత నిబంధనల ప్రకారం రుణాలను లోన్ అకౌంట్ ప్రాతిపదికగా కాకుండా వ్యక్తుల ప్రాతిపదికగా మంజూరు చేస్తున్నారు. దీంతో ఒక వ్యక్తి ఏదైనా ఒక లోన్ చెల్లింపులో విఫలమైతే ఇతర లోన్ అకౌంట్లను కూడా నిరర్థక ఆస్తుల జాబితాలో చేర్చుతున్నారు. అయితే ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, ఆర్బీఐ ఈ విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వాలని బ్యాంకింగ్ వర్గాలు కోరుతున్నాయి. కానీ, ఆర్బీఐ నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. ఎన్బీఎఫ్సీల్లో విద్యా రుణాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు విద్యా రుణాల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయడంతో దరఖాస్తుల మంజూరు సంఖ్య తక్కువగా ఉంది. కానీ ఉన్న నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో (ఎన్బీఎఫ్సీ) మాత్రం విదేశీ విద్యా రుణాల్లో రుణాల మంజూరు గత అయిదేళ్లలో దాదాపు నూరు శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. అంతేకాదు, రూ.15 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఈ రుణాలు మంజూరయ్యాయి. ‘పీఎం విద్యాలక్ష్మి’ఆశలు నిరాశేనా? దేశంలో ప్రతిభావంతులైన యువత ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్రం గత ఏడాది పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ పేరిట విద్యారుణ పథకం ప్రవేశ పెట్టింది. 2024–25 నుంచి 2030–31 వరకు అమలు చేసే ఈ పథకం ద్వారా ఏటా 22 లక్షల మందికి ప్రయోజనం కల్పించాలన్నది లక్ష్యం. ఇందుకోసం రూ. 3,600 కోట్లు కేటాయించారు. రూ. 7.5 లక్షల వరకు రుణ మొత్తంలో 75 శాతం మొత్తానికి కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుందని గత ఏడాది బడ్జెట్లో పేర్కొన్నారు.కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండి, ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్స్, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలు పొందని విద్యార్థుల విషయంలో లోన్రీ పేమెంట్ మారటోరియం సమయంలో మూడు శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. గరిష్టంగా రూ. 10 లక్షల రుణం వరకు ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 2024 నాటికి 11.26 లక్షల క్రెడిట్ గ్యారెంటీలను అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు 50,800 అకౌంట్లను నిర్థరక ఆస్తులుగా గుర్తించారు. బ్యాంకుల నిబంధనలతో ‘పీఎం విద్యా లక్ష్మి’ద్వారా రుణం కూడా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగానేవిద్యా రుణాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రా ష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వస్తున్నాయని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు రిటైల్ అసెట్ విభాగం జనరల్ మేనేజర్ సాక్షికి తెలిపారు. మొత్తం రుణ దరఖాస్తుల్లో దాదాపు 40 శాతం వరకు మనవాళ్లవే ఉంటున్నాయని.. దరఖాస్తుదారుల్లో 50 శాతం మేర రుణాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. పోర్టల్లోనూ సమస్యలు ⇒ విద్యాలక్ష్మి పోర్టల్ పనితీరుపైనా విద్యార్థులు, తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. ఈ వెబ్సైట్లో లాగిన్ సమస్యలు, బ్యాంకులతో అనుసంధానమయ్యే సాంకేతిక ప్రక్రియలో ఇబ్బందులు, ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేస్తున్న సమయంలో సర్వర్ డౌన్ అవడం వంటి కారణాలతో దరఖాస్తుల సంఖ్య, మంజూరు సంఖ్య మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటోంది. ⇒ 2025 ఏప్రిల్ నెల గణాంకాలను పరిశీలిస్తే.. ఎస్బీఐకి 1,125 దరఖాస్తులకు గాను 20 దరఖాస్తులకు; కెనరా బ్యాంకులో 483కు గాను 24కి; బ్యాంక్ ఆఫ్ బరోడాలో 342కు గాను 19 దరఖాస్తులకు; పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 304కుగాను 28కి; యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 212 దరఖాస్తులకుగాను 16 దరఖాస్తులకే రుణాలు మంజూరు అయ్యాయి. ⇒ మొత్తమ్మీద.. విద్యా రుణాల మంజూరు విషయంలో తల్లిదండ్రుల వ్యక్తిగత ఆర్థిక స్థోమత నుంచి ఇతర సాంకేతిక అంశాల వరకు పలు అంశాల్లో నిబంధనలను సరళీకృతం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
లండన్ లో తప్పిపోయిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి
లండన్ లో తప్పిపోయిన తన కుమారుడు నల్ల అనురాగ్ రెడ్డి జాడ వెతికి తెలుసుకుని ఇండియాకు వాపస్ తెప్పించాలని విద్యార్థి తల్లి హరిత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి సోమవారం వినతిపత్రం పంపారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన అనురాగ్ విద్యార్థి వీసాపై జనవరిలో లండన్ కు వెళ్ళాడు. యూకే లోని కార్డిఫ్ ప్రాంతంలో ఈనెల 25న సాయంత్రం నుంచి తన కుమారుడు జాడ తెలియకుండా పోయాడని హరిత తన వినతిపత్రం లో తెలిపారు. వెంటనే స్పందించిన ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ), జిఎడి ఎన్నారై అధికారులతో మాట్లాడారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్ లోని ఇండియన్ హై కమీషన్ కు లేఖలు రాశారు. -
నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని..
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలోని నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తన ఆత్మహత్యకు ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని సూసైడ్ లెటర్లో రాసుకొచ్చాడు. ఈ విషాదకర ఘటన ఘట్కేసర్లోని నారాయణ క్యాంపస్లో చోటుచేసుకుంది. విద్యార్థి ఆత్మహత్యపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
నువ్వన్నదే కరెక్ట్ నాన్నా.. మార్కులకన్నా లక్ష్యం మిన్న
స్వీటీ ఎక్కడుంది.. మంచి మార్కులతో టెన్త్ పాస్ అయింది కదా.. ఇదిగో తనకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాను.. వెళ్ళి ఇవ్వు.. అసలు ఇంతకూ తను ఎక్కడుంది.. ఆఫీసునుంచి వస్తూనే భార్య పావనిని అడిగాడు అడిగాడు శేఖర్ .. ఆ..అయింది..కానీ దానికి మార్కులు సరిపోవట.. దాని అంచనాకు సరిపడా రాలేదని ఏడుస్తూ బెడ్ రూములో కూర్చుంది.. ఎంత చెప్పినా వినదాయే మీరే వెళ్ళి దాన్ని బుజ్జగించండి అంటూ వంటింట్లోంచి చెప్పింది పావని..ఓహ్.. అలాగా అనుకుంటూ చిన్నారి స్వీటీ.. ఏం చేస్తున్నావ్.. మంచి మార్క్స్ వచ్చాయి కదా మరి నీ సేవింగ్స్తో నాకు పార్టీ ఇస్తాను అన్నావు మరి రెడీనా అన్నాడు శేఖర్..ఆ మీరు నన్ను వెక్కిరిస్తున్నారు.. నేను అనుకున్నట్లు స్కోర్ రాలేదు..నేను పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాను.. ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ ఎర్రని బుగ్గలు కందిపోయేలా తుడుచుకుంటూ కన్నీళ్ళు కారుస్తోంది స్వీటీ.. అదేంటి తల్లీ నైన్టీ పర్సెంటేజీ వచ్చింది..అంటే డిస్టింక్షన్ వచ్చినట్లే..ఇంకెందుకు బాధ..అంతకన్నా పైన క్లాస్ లేదుగా నువ్వు మంచిగా పెర్ఫార్మ్ చేశావు తల్లి.. ఆమాత్రం చాలు.. డోంట్ వర్రీ అంటూ తలనిమిరాడు.. లేదు నాన్నా నాకు అవమానంగా ఉంది..నా క్లాస్మేట్స్ అందరికీ నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి.. ఇది నాకు చాలా ఇన్స్టాలింగ్ ..రేపు నేను వాళ్లకు ఎలా మొహం చూపాలి..ఇక బతకడమే వేస్ట్ అనేసింది స్వీటీ..బతకడమే వేస్ట్ అన్న మాట విన్నాక శేఖర్ తుళ్ళిపడ్డాడు..అదేంటి అమాయకంగా ఉండే స్వీటీ ఇంత ఫోర్స్ గా మాట్లాడింది అనుకుంటూ..అదేం లేదు నాన్నా..నేను చెబుతాగా అంటూ దగ్గరకు తీసుకున్నాడు. ఆ చెప్పు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ .. పావనీ ఆ సూట్కేసులోంచి నా బ్లూ ఫైల్ పట్రా అని కేకేశాడు.. తెస్తున్నా అంటూ ఈ తండ్రికూతుల్లకు సేవలోనే నా బతుకు తెల్లారిపోతోంది అనుకుంటూనే ఫైల్ తెచ్చి ఇచ్చింది.కూతురికి ఇచ్చి దాన్ని ఓపెన్ చెయ్యి అన్నాడు శేఖర్. ఓపెన్ చేశాక ఇదేంటి నాన్నా బాగా నలిగిపోయి ఉంది అంది స్వీటీ.. అది నా టెన్త్ మార్కుల లిస్ట్..చూడు అన్నాడు .. చూసింది.. బొటాబొటి 38 మార్కులతో అన్నీ పాసైనట్లు ఉంది. చివర్న పాస్డ్ ఇన్ ఆర్డినరీ క్లాస్ అని ఉంది. అది చూసి నాన్నా మీరు జస్ట్ పాస్..థర్డ్ క్లాసులో పాసయ్యారా అని అబ్బురంగా.. అవునమ్మా అన్నాడు శేఖర్.. నెక్స్ట్ చూడు అన్నాడు.. అందులో ఇంటర్ మార్క్స్ ఉన్నాయి.. అందులో 52 శాతం మార్క్స్.. అంటే సెకండ్ క్లాస్ వచ్చింది.. నాన్నా ఈసారి ఈ ప్రోగ్రెస్ పెరిగింది సుమీ అంది కూతురు మెచ్చుకోలుగా .. తరువాత చూడు అన్నాడు.. అందులో బీకాం..ఫస్ట్ క్లాస్ అని ఉంది.. నాన్నా ఈసారి మరింత మెరిట్ వచ్చింది అంది స్వీటీ.. అవునమ్మా అన్నాడు శేఖర్..చూసావా బుజ్జి నేను థర్డ్ క్లాసులో పాసైనా నేను నీలాగా అవమానం అనుకోలేదు.. బతకడం వేస్ట్ అనుకోలేదు.. ఇంకా బాగా కష్టపడ్డాను..ఇంటర్లో సెకండ్ క్లాసు..డిగ్రీలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాను. బ్యాంక్ పరీక్షలు రాసి ఆఫీసర్ అయ్యాను... నాకన్నా అప్పట్లో టెన్త్ ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మురళి అంకుల్ మా బ్రాంచిలోనే క్లర్క్ గా చేస్తున్నారు ..దీన్ని బట్టి నీకేం అర్థమైంది చెప్పు తల్లీ అన్నాడు.. ఆలోచించింది స్వీటీ.. మార్కులు ముఖ్యం కాదు.. కష్టపడి చదవాలి.. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు వెళ్తే నీలాగే మంచి పొజిషన్ కు చేరుకోవచ్చు.. అంది కాస్త స్థిమిత పడుతూ.. మరి ఇప్పుడేం చేద్దాం అంటావ్..అన్నాడు శేఖర్.. నువ్వు అన్నట్లుగానే నా పాకెట్ మనీతో నీకు, అమ్మకు మంచి పార్టీ ఇస్తాను..ఇంటర్లో ఇంకా బాగా చదివి మంచి సీట్ కొడతాను..సరేనా అంది స్వీటీ కాన్ఫిడెంట్ గా.. ఎస్..అదీ లెక్క.. ఆ స్పిరిట్ ఉండాలి.. పదా మరి పార్టీ చేసుకుందాం అంటూ కూతుర్ని..భార్యను తీసుకుని బయటకు బయల్దేరాడు..::సిమ్మాదిరప్పన్న -
ఫోన్ కోసం టీచర్ ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్!
-
తిరగబడ్డ విద్యార్థి లోకం
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: కూటమి ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు సోమవారం కదంతొక్కారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ర్యాలీ నిర్వహించారు. పోలీసులు రోడ్లపై ఎక్కడికక్కడ నిర్బంధించే ప్రయత్నం చేయగా.. విద్యార్థులు వాటిని దాటుకొని ముందుకు కదిలారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని చెప్పినప్పటికీ.. విద్యార్థులు, నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వారిని పోలీసులు ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థులు అక్కడ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వినతిపత్రం ఇచ్చేందుకు సైతం విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఓ విద్యార్థి చేతిని గేటు మధ్యలో పెట్టి లోపల ఉన్న పోలీసులు నొక్కడంతో.. ఆ విద్యార్థి బాధతో విలవిలలాడాడు. చివరకు తాడేపల్లి సీఐ కల్యాణ్రాజు ఐదుగురు నాయకులను లోపలకు అనుమతించారు.వారు సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్కు వినతిపత్రం సమర్పించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ధర్నాలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.రవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పులగం సందీప్ రెడ్డి, కె.శివారెడ్డి, గోలి నరసింహ, గోపి కృష్ణ, వినోద్, కోమల్ సాయి, ఐ.శ్రీనివాస్, కొండల్ రావు, సందీప్, గోపీచంద్, నారాయణ, పూజిత్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారి కథ విని హరీష్రావు కంటతడి..
సాక్షి, సిద్ధిపేట: ఓ చిన్నారి కథ విని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధిపేటలో విద్యార్థుల కోసం లీడ్ ఇండియా ఆధ్వర్యంలో 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్లో ఎదగాలి' అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీష్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మాటలకు ఆయన చలించిపోయారు.. కంటతడి పెట్టారు.ఆ విద్యార్థిని మాట్లాడుతూ తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని.. తల్లే తనను కష్టపడి చదివిస్తోందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ చిన్నారి మాటలు విన్న హరీష్రావుతో పాటు ఆ వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాలికను ఆత్మీయంగా దగ్గరికి తీసుకునన్న హరీష్రావు.. వేదికపై తన పక్కన కూర్చోబెట్టుకుని ఓదార్చారు. -
విశాఖలో మెడికో శ్రీరామ్ ఆత్మహత్య
-
విశాఖలో మెడికో ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మెడికో శ్రీరామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్రెడ్డి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మెడికల్ కళాశాల వద్ద మెడికోలు ఆందోళన చేపట్టారు. కళాశాల డీన్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేకే శ్రీరామ్ ఆత్మహత్య చేసుకున్నాడని నిరసనకు దిగారు. చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్న శ్రీరామ్ బంధువులు ఆరోపిస్తున్నారు.బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యమరో ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఇవాళ తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని కృష్ణవేణిగా గుర్తించారు. ఉగాది పండగకు ఇంటికి వెళ్లి నిన్న(శుక్రవారం) సాయంత్రం తల్లితో కలిసి కళాశాలకు విద్యార్థిని వచ్చింది.తల్లితో కలిసి రాత్రి హాస్టల్లో ఉన్న మృతురాలు కృష్ణవేణి.. తెల్లవారుజామున కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


