breaking news
Student
-
ఒకప్పుడు నా కుటుంబానిది కూడా అదే పరిస్థితి: రాఘవ లారెన్స్ ఎమోషనల్
కోలీవుడ్ హీరోలు సమాజ సేవలో ఎప్పుడు ముందుంటారు. కొన్నేళ్లుగా సూర్య తన అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. తన వంతా సాయం చేస్తూ పేద విద్యార్థులను డాక్టర్స్, ఇంజినీర్స్ను చేస్తున్నారు. అదే బాటలో మరో స్టార్ హీరో లారెన్స్ కూడా దూసుకెళ్తున్నారు. ఎక్కడా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాను స్థాపించిన మాత్రం ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సాయమందిస్తున్నారు. తాజాగా ఓ పేద విద్యార్థిని కష్టాలు చూసిన ఆయన చలించిపోయారు.ఓ తండ్రి తన కూతురి చదువుకోసం తన భార్య(లేట్) మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టడం తనను ఎమోషనల్గా కదిలించిందని రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు. ఎందుకంటే నా కుటుంబం కూడా ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొందని గుర్తు చేసుకున్నారు. అందుకే ఆ మంగళసూత్రాన్ని అతనికి వెనక్కి ఇప్పించి.. ఆ కుటుంబానికి అండగా నిలిచానని ట్వీట్లో రాసుకొచ్చారు. అది కేవలం బంగారం మాత్రమే కాదని.. అతని భార్య విలువైన జ్ఞాపకం అని రాఘవ లారెన్స్ పోస్ట్ చేశారు. ఈ రోజు తన హృదయం చాలా సంతోషంతో నిండిపోయిందన్నారు. Hi everyone! I came across a story about a father who had pawned his late wife’s thali to pay for his daughter’s education. This touched me deeply, because my own family once went through a similar struggle. Through Maatram, i was able to retrieve the thali and return it to… pic.twitter.com/25VMi8fRHS— Raghava Lawrence (@offl_Lawrence) August 17, 2025 -
విద్యార్థులకు 'భవిష్యత్' పాఠం
అవి మా ముత్తాత పోయిన కొత్తలు. ఆయన ఒక సన్నకారు రైతు. ఆయన పోవడంతో మా ముత్తవ్వ యువ వితంతువుగా మారింది. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమారులు. ఆదాయ వనరు సున్నా. ఇద్దరు పిల్లలను చదివించి, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో దగ్గరలోని ఓ పట్టణానికి మకాం మార్చారు. ఓ ఇంట్లో పని మనిషిగా చేరారు. చాలీచాలని ఆదాయం ఇద్దరు పిల్లల్లో ఒకరిని చదివించేందుకే సరిపోతుంది. ఇద్దరు పిల్లల మధ్య వయసులో పెద్ద తేడా లేదు. ఆ ఇద్దరిలో ఒక పిల్లాడు బాధ్యతతో మెలిగేవాడుగా కనిపించాడు. రెండవవాడు కాస్త పేచీకోరు. పరిస్థితులకు అనుగుణంగా మసలుకునే పిల్లాడిని, ఆమె పనిలోకి దింపారు. అతను భవన నిర్మాణ పనుల్లో దినసరి కూలీగా మారాడు. కొత్త నైపుణ్యాలను గడించుకుని, ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని అందుకొనే అవకాశం ఎన్నడూ లభించలేదు. మరో పిల్లాడిని స్థానికంగా ఉన్న పాఠశాలకి పంపించగలిగారు. ఆ పిల్లాడే మా తాతయ్య. తక్కువ బాధ్యతతో వ్యవహరించే పిల్లాడిగా ముద్రపడినా, స్కూలు చదువును కొనసాగించగలిగాడు. పోలీసు అధికారి అయ్యాడు. అతని సోదరుడు నాలుగు రాళ్ళు సంపాదించడం ప్రారంభించిన పదేళ్ళ తర్వాత ఉద్యోగంలో చేరినా, ప్రారంభంలోనే ఎక్కువ జీతభత్యాలు తీసుకోగలిగాడు. మా తాత చదువుకోవడం, ఉద్యోగ జీవితం వల్ల, మా నాన్నకు చదువుకొనే అవకాశం లభించింది. ఫలితంగా, నేను నాకు ఇష్టమైన బాటలో అడుగులు వేసేందుకు అవకాశం చిక్కింది. మా తాతకు లభించిన అవకాశం వల్ల, ఆ తరువాత తరాలు కూడా బాగుపడే వీలు చిక్కింది. ప్రతిభావంతులు ప్రతిచోటా ఉన్నారు. కానీ, వారు వెలుగులోకి వచ్చే అవకాశమే ఉండటం లేదు అనే దానికి ఈ వ్యక్తిగత జీవిత వివరాలే ఉదాహరణ. టెక్నాలజీ ఉపకరణం మాత్రమే!ఈ రోజు కార్యక్రమం విద్య, టెక్నాలజీ గురించి! సూటిగా చెప్పాలంటే, రేపటి ప్రపంచాన్ని సృష్టించేవారిగా నేటి విద్యార్థులను తీర్చిదిద్దడానికి సంబంధించినది. సాంకేతికంగా అబ్బురపరచే ప్రగతిని సాధిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. మన జీవితాలలో ప్రతి పార్శ్వాన్ని, ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను డిజిటల్ టెక్నాలజీలు రూపుదిద్దుతున్నాయి. అయితే, టెక్నాలజీ అంతరాయా లను కూడా సృష్టిస్తోంది. టెక్నాలజీ ఏ కొద్ది మందికోకాక, అందరికీ అవకాశాలను అందివ్వగలదా? అన్నదే అసలైన ప్రశ్న. ఇతరులు సాధించే విజయంపైనే మన విజయం గణనకు వస్తుంది. చదువుకునే అవకాశాన్ని అందరికీ కల్పించడం మన ధ్యేయం కావాలి. నేటి సమాజం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్ళలో అది ఒకటి. ‘మైక్రోసాఫ్ట్’ మాజీ పరిశోధకుడు, ‘గీక్ హేర్సే’ పుస్తక రచయిత కెంటరో టొయోమ ఆ అంశాన్ని బాగా పట్టుకున్నారు. టెక్నాలజీలో కన్నా ముందుగా సమాజంలో మార్పు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. టెక్నోక్రాట్లు సాధారణంగా టెక్నాలజీ గుణగణాల గురించి గొప్పగా చెప్పేందుకు మొగ్గు చూపుతూంటారు. వ్యవస్థలోని అన్ని రుగ్మతలకూ దానినే విరుగుడుగా భావిస్తూంటారు. దానితో విభేదం ఉన్నవాడిగానే నేనిక్కడికి వచ్చాను. విద్యను రూపాంతరీకరించడానికి టెక్నాలజీ ఒక్కటే సమాధానమనే భ్రమల్లో మనం లేము. విద్యా రంగంలో మార్పు తీసుకొచ్చేందుకు అంకిత భావం కలిగిన పాలకులు, గొప్ప ఉపాధ్యాయులు, ప్రేరణ పొందిన విద్యార్థులు, పాలుపంచుకునే తల్లితండ్రులు, సమాజాలు అవసరం. టెక్నాలజీ వారి సృజనాత్మకతకు, చాతుర్యానికి సాధికారత కల్పించగల ఒక ఉపకరణం మాత్రమే. ప్రపంచం నలుమూలల ఉన్న విద్యార్థులను చూడగలగడం, వారి నుంచి నేర్చుకోగలగడం నా ఉద్యోగ బాధ్యతల్లో నేను ఇష్టపడే అంశాల్లో ఒకటి. గత రెండేళ్ళుగా, నేను 20కి పైగా దేశాలలో విద్యార్థులను కలుసుకునే అవకాశం లభించింది. సియాటిల్లో నా కూతుళ్ళు ఏ ఆఫీసు టూల్స్ని ఉపయోగిస్తున్నారో అవే టూల్స్ని జకార్తా, టెల్ అవీవ్లలోని విద్యార్థులు కూడా ఉపయోగిస్తున్నారు. ఆ యా తరగతి గదుల్లో కొంత సమయాన్ని వెచ్చించినప్పుడల్లా, ప్రతిసారీ నాలో కొన్ని అంశాలు ముసురుకుంటూ వచ్చాయి. పిల్లలను ఎలా తీర్చిదిద్దాలి?ఒకటి– తరగతి గదిలో టీచర్ పనికి టెక్నాలజీ సాయపడాలే గానీ, అవరోధం కాకూడదు. సమయాన్ని వెచ్చించడంలో టీచర్లపై చాలా డిమాండ్లు ఉంటాయి. వారు పాఠ్యాంశాలను ఎంపిక చేయాలి. పరీక్షలు పెట్టాలి. పేపర్లు దిద్దాలి. తరగతుల్లో విద్యార్థు లను అదుపాజ్ఞలలో ఉంచాలి. క్రమశిక్షణ నేర్పాలి. టెక్నాలజీ టీచర్ల జీవితాలను సులభతరం చేసి, విద్యార్థులలో సృజనాత్మకతను రేకెత్తించేదిగా ఉండాలిగానీ, వాటి నుంచి దృష్టి మళ్ళించేదిగా ఉండకూడదు. రెండు– పని స్వరూప స్వభావాలలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక సమస్యను పరిష్కరించేందుకు సమష్టిగా పనిచేస్తున్నారు. సమస్యను విభజించి చూడటంకన్నా ఏక మొత్తంగా చూస్తున్న ధోరణి కనిపిస్తోంది. ఈ రకమైన భవిష్యత్తుకి మనం విద్యార్థులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. తరగతి గదిలో కూడా టీమ్ల వారీగా పనిచేయడాన్ని ప్రోత్సహించాలి. సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా నేర్చుకో వడం తరగతి గదిలోనే మొదలవ్వాలి. టీమ్ వర్క్కి అవి కేంద్రాలు కావాలి. అప్పుడే దేన్నైనా కలసి సృష్టించగల సామర్థ్యం సొంత మవుతుంది. విద్యార్థులను కలసిమెలసి నేర్చుకునేటట్లుగా చేస్తే, వారి విద్యావకాశాలు కూడా మెరుగుపడతాయి. మూడు– రేపటికి తగినట్లుగా మన విద్యార్థులను తయారు చేసి తీరాలి. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ నివేదికను, అది రూపొందించిన ఉద్యోగాల నివేదికను పరిశీలించండి. నేడు పాఠశాలల్లో అడుగు పెడుతున్న విద్యార్థుల్లో 65 శాతం మందికి లభించబోయే ఉద్యో గాలు, ఇపుడు ఉనికిలో ఉన్నవి కావట! ‘కాంపుటేషనల్ థింకింగ్’, సమస్యను పరిష్కరించగల నైపుణ్యాలు భవిష్యత్తుకు కీలకమని టీచర్లకు తెలుసు. ‘స్టెమ్’ పాఠ్య ప్రణాళికను విస్తృతంగా వీక్షించవలసిన అవసరం ఉందని కూడా వారికి తెలుసు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితాన్ని కలిపి పొందికతో కూడిన అధ్యయన నమూనాగా చేయడాన్ని ‘స్టెమ్’గా పిలుస్తున్నారు. చదవడం, రాయడం, డిజైన్, కళలకు తోడు, ‘స్టెమ్’ పాఠ్య ప్రణాళికను కూడా తీసుకువస్తే, భవిష్యత్తులో ఈ విద్యార్థులు విజయం సాధించడానికి రంగం సిద్ధం చేసినవాళ్ళం అవుతాం. చివరగా– మా తాతకు లభించిన అవకాశం, మా కుటుంబ గతిని మార్చివేసింది. ఇపుడు నాకు స్ఫూర్తినిస్తున్న అంశం ఈ తరంలోనూ, రాబోయే తరాలలోనూ ప్రతి విద్యార్థికి విద్యావకాశాన్ని ప్రజాస్వామ్యీకరణ చేసేందుకు మనందరం కలసి మెలసి ఎలా ఒకటవాలన్నదే! అందరికీ కృతజ్ఞతలు. -
కరెంట్ షాక్తో విద్యార్థిపై హత్యాయత్నం
దాచేపల్లి: కరెంట్ షాక్తో ఒక విద్యార్థిపై సీనియర్లు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం శ్రీనగర్కి చెందిన ఒక విద్యార్థి నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దాచేపల్లికి చెందిన ఒక విద్యార్థి డిగ్రీ చదువుకుంటున్నాడు. ఈ నెల 7న జూనియర్ కళాశాలలో ఉన్న ఇంటర్ విద్యార్థిని డిగ్రీ విద్యార్థి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహానికి పిలిపించి, అతన్ని బంధించి, తన స్నేహితులతో కలిసి తీవ్రంగా కొట్టాడు. ఒక దశలో కరెంట్ షాక్ పెట్టి ఇంటర్ విద్యార్థిని హత్య చేసేందుకూ ఉపక్రమించాడు. దాడి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించాడు. వారి నుంచి తప్పించుకున్న బాధిత ఇంటర్ విద్యార్థి తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టాలని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి శ్రీనివాసరావును ఆదేశించారు. మరో దివ్యాంగ విద్యార్థినిని కూడా అదే డిగ్రీ విద్యార్థి, అతడి స్నేహితులు హాస్టల్లోనే కొట్టినట్లు సమాచారం. కాగా, బాధిత ఇంటర్ విద్యార్థి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వసతి గృహంలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటున్నాయని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన డిగ్రీ విద్యార్థి మత్తు పదార్థం సేవించి హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. బీసీ బాలుర వసతి గృహానికి ఒక మహిళా వార్డెన్ని ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. ప్రేమ వ్యవహారమే కారణం: డీఎస్పీ జగదీష్ ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నట్లు గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు. దాడికి గురైన, దాడికి పాల్పడిన విద్యార్థులంతా మైనర్లేనన్నారు. -
దాచేపల్లి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో దారుణం
సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి అఖిల్ను సీనియర్లు చితకబాదారు. కర్రతో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ.. విచక్షణారహితంగా దాడి చేశారు. కరెంట్ వైర్తో షాక్ ఇచ్చేందుకు సీనియర్లు యత్నించారు.దాడి దృశ్యాలను వీడియో చిత్రీకరించారు. తమ కుమారుడిని చిత్రహింసలకు గురి చేశారంటూ అఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిల్ దాడి ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన 7వ తేదీన జరిగింది. -
‘నా భర్తను నా తండ్రే కాల్చి చంపాడు’
పాట్నా: కులాంతర వివాహం డిగ్రీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని కోపోద్రికుడైన తండ్రి… అల్లుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.పోలీసుల వివరాల మేరకు.. బీహార్లోని అతిపెద్ద నగరమైన దర్భంగలో ఘోరం జరిగింది. దర్భంగ మెడికల్ కాలేజీలో బీఎస్సీ (నర్సింగ్)రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ కుమార్ను కాలేజీ ఆవరణంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.ఇటీవల రాహుల్ కుమార్కు అదే కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తన్ను ప్రియాతో కులాంతర వివాహం జరిగింది. అయితే, ఈ క్రమంలో కాలేజీ క్యాంపస్లో ఉండగా.. తన్ను ప్రియా చూస్తుండగానే ఆమె తండ్రి ప్రేమశంకర్.. అల్లుడు రాహుల్ను కాల్చి చంపాడు. అప్రమత్తమైన విద్యార్థులు, సిబ్బంది రాహుల్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ప్రేమ్శంకర్కు దేహశుద్ధి చేశారు. కళ్లెదుటే కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోవడంతో తన్ను ప్రియా గుండెలవిసేలా రోదించారు. నా తండ్రే తుపాకీతో నా భర్తను కాల్చాడు. అతను నా ఒడిలోనే కుప్పకూలిపోయాడు’ అని కన్నీటీ పర్యంతరమయ్యారు. రాహుల్, తన్ను నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఒకే హాస్టల్ భవనంలో వేర్వేరు అంతస్తులలో ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ‘మేం కాలేజీలో ఉండగా.. హూడీ ధరించిన ఓ వ్యక్తి రాహుల్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అతని దగ్గర తుపాకీ ఉంది. ఆ తుపాకీతో రాహుల్ గుండెల మీద కాల్చాడు. ఆ తర్వాతే నాకు తెలిసింది. ఆ కాల్పులు జరిపింది నా తండ్రి ప్రేమ్శంకర్ ఝానే. నా తండ్రి ప్రేమ్శంకర్ నా కళ్ళ ముందే నా భర్త గుండెలపై కాల్చాడు. నా భర్త నా ఒడిలో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. కులాంతర వివాహ చేసుకున్న అనంతరం రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాం. నాకు నా భర్తకు.. నా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని చెప్పాం. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటి పర్యంతరమయ్యారుకాల్పుల తర్వాత, రాహుల్ స్నేహితులు, ఇతర హాస్టల్ సిబ్బంది నిందితుడు శంకర్పై దాడికి దిగారు. రాహుల్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న దర్భాంగా జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ కుమార్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగన్నాథ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎస్పీ జగన్నాథ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఎస్సీ (నర్సింగ్) విద్యార్థిని కాల్చి చంపినట్లు మాకు మొదట సమాచారం అందింది. తరువాత, అతను, అతని తోటి విద్యార్థి ప్రేమ వివాహం చేసుకున్నారని మాకు తెలిసింది. ఆమె తండ్రి వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. ఝాకు చికిత్స చేయడానికి విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అనుమతించకపోవడంతో ఆసుపత్రిలో గొడవ జరిగింది. కేసు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాము’అని హామీ ఇచ్చారు. दरभंगा जिला के बेंता थाना क्षेत्र अंतर्गत DMCH में घटित घटना के संदर्भ में अद्यतन घटना का संक्षिप्त विवरण :-दिनांक - 05.08.25 को समय करीब 04:40 PM बजे सूचना मिली कि बेंता थाना क्षेत्र अंतर्गत एक छात्र की गोली मारकर हत्या कर दी गई है। sho and sdpo visited spot and enquired— Darbhanga Police (@DarbhangaPolice) August 5, 2025 -
రాత బాగోలేదని వాత.. టీచర్ అరెస్ట్
ముంబై: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు కర్కశంగా ప్రవర్తిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది ముంబైలో జరిగిన ఒక ఘటన తెలియజేస్తుంది. మలాడ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ట్యూషన్ టీచర్, ఎనిమిదేళ్ల బాలుని చేతిరాత సరిగా లేదంటూ, అతనిని కఠినంగా శిక్షించింది.ఈ నేపధ్యంలో ఆ ఉపాధ్యాయురాలు అరెస్టయ్యింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోరేగావ్లోని ఒక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న బాలుడు మలాడ్లోని ఒక టీచర్ ఇంటికి ట్యూషన్కు వెళుతుంటాడు. సంఘటన జరిగిన రోజు, ఆ బాలుని సోదరి అతనిని ట్యూషన్లో దింపి, వెళ్లిపోయింది. ట్యూషన్ ముగిశాక ఆ టీచర్ బాలుని ఇంటికి ఫోన్ చేసి, పిల్లాడిని తీసుకుని వెళ్లాలని చెప్పింది. దీంతో ఆ బాలుని సోదరి ఆ టీచర్ ఇంటికి వచ్చింది. ఆ బాలుడు కన్నీళ్లతో కనిపించేసరికి, ఏం జరిగిందని సోదరి ఆ టీచర్ను అడిగింది. పిల్లాడు జరిగిన విషయం చెప్పగా, టీచర్ వాటిని తోసిపుచ్చింది.అయితే ఇంటికి తిరిగి వచ్చిన ఆ బాలుడు తన చేతిరాత సరిగా లేకపోవడంతో టీచర్ మండుతున్న కొవ్వొత్తితో తన చేతిపై వాత పెట్టిందని ఏడుస్తూ చెప్పాడు. వెంటనే పిల్లాడి తండ్రి అతనిని చికిత్స కోసం కాండివాలిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తరువాత కురార్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాలునిపై శారీరక, మానసిక క్రూరత్వానికి పాల్పడిన టీచర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. -
కనిపెట్టి.. కాపాడుదాం
సాక్షి, స్పెషల్ డెస్క్: ఇటీవలి కాలంలో పరీక్షల ఒత్తిడి, ఫెయిలవుతామన్న భయం, మార్కులు తగ్గితే అందరూ తమను చిన్నచూపు చూస్తారన్న ఆందోళన వంటి కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని, ఒత్తిడికి లోనై బలవన్మరణాలకు పాల్పడకుండా నివారించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం వ్యాఖ్యానించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. అంతేకాకుండా వ్యవస్థల స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అసలు ఇంతకీ... విద్యార్థుల బలవన్మరణాలకు కారణాలేంటి? ఏయే స్థాయుల్లో, ఎలా వాటిని గుర్తించి నివారించవచ్చు? ఇందులో సమాజంలోని వివిధ వర్గాల పాత్ర ఏమిటి? నిపుణులు ఏమంటున్నారు? విశాఖపట్నంలో ఓ కోచింగ్ సంస్థలో ‘నీట్’శిక్షణ పొందుతున్న పశ్చిమ బెంగాల్కు చెందిన యువతి అనుమానాస్పద మృతిపై దర్యాప్తునకు ఆదేశించాలంటూ నమోదైన కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘జాతీయ నేర గణాంక విభాగం లెక్కల ప్రకారం దేశంలో 2022లో 1.7 లక్షలకుపైగా ఆత్మహత్యల కేసులు నమోదైతే అందులో 7 శాతం విద్యార్థుల మరణాలే’అని అత్యున్నత న్యాయస్థానం గణాంకాలనూ ఉటంకించింది. 100 మంది విద్యార్థులు ఉన్న విద్య, శిక్షణ సంస్థలు, హాస్టళ్లలో సైకాలజిస్ట్, అర్హతగల కౌన్సిలర్, సామాజిక కార్యకర్తను నియమించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. తేలిగ్గా తీసుకొనే మాటలు కావవి.. ఒత్తిడి, ఆందోళనలో ఉన్న విద్యార్థి తన కష్టాన్ని, బాధను ఏదో ఒక సందర్భంలో వ్యక్తపరుస్తారు. అది స్నేహితులు, బంధువులు, ఆఖరికి తల్లిదండ్రుల దగ్గర కూడా కావచ్చు. అలాంటప్పుడు వారి మాటలను తేలిగ్గా తీసుకోవడం మంచిది కాదు. ⇒ ‘పరిస్థితులు ఎప్పటికీ బాగుపడవు.. ఇక నేను ప్రయతి్నంచడంలో అర్థం లేదు’ ⇒ ‘నా సమస్యలకు ఎవరూ సహాయం చేయలేరు.. నాకు మార్గం కనిపించడం లేదు’ ⇒ ‘నేను పనికిరాను, నేను ఎవరికీ ముఖ్యం కాదు’ ⇒ ‘ఇతరులకు భారంగా ఉన్నాను, నా మీద నాకు సిగ్గుగా ఉంది’ ఇలాంటి మాటలు విద్యార్థుల నోటి నుంచి వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఆ ప్రవర్తనలే హెచ్చరికలు తల్లిదండ్రులు, బడులు లేదా విద్యాసంస్థల్లోని టీచర్లు పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికగా భావించాలి. ⇒ ఇటీవలి కాలంలో చదువులో మీ పిల్లలు వరుసగా వెనుకబడుతుంటే ⇒ ప్రతి చిన్న విషయానికీ కోపం, అసహనం ఎక్కువవుతుంటే ⇒నలుగురితో కలవకుండా, ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతుంటే ⇒ తన ఒళ్లు, ఆహారం, ఆరోగ్యం.. ఇలా దేనిమీదా శ్రద్ధ లేకుండా ఉంటే ⇒ తరగతిలో అజాగ్రత్తగా ఉండటం, మతిమరుపు ⇒ ఏదో తలచుకుని ఏడవడం ⇒ రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం ఇలా బయటపడొచ్చు ఒత్తిడిని జయించడానికి, నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి జనరేషన్–జడ్, జె¯న్–ఆల్ఫా ఏం చేస్తున్నారంటే.. గేమింగ్, ఈ–స్పోర్ట్స్: పోటీతత్వాన్ని నేర్పుతుంది. మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి.మ్యూజిక్, పాడ్కాస్ట్: భావోద్వేగాల నియంత్రణ, ఒత్తిడి నుండి ఉపశమనం ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ: సృజనాత్మకత, తన టాలెంట్ను నలుగురికీ తెలియజేయడం స్వచ్ఛంద సేవ, క్రియాశీలత: సంతృప్తి, సహానుభూతి, తన చుట్టుపక్కల వారితో అనుబంధం పెంచుకోవడానికి ఫిట్నెస్, యోగా: ఒత్తిడి నుంచి బయటపడేందుకు, సానుకూల దృక్పథం షాపింగ్ థెరపీ: ఒత్తిడి నుంచి ఉపశమనం సమయపాలన.. ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి ప్రధాన కారణం ఇదే. సమయాన్ని సది్వనియోగం చేసుకోలేక, ఏ పనికి ఎంత సమయం కేటాయంచాలో అంచనా వేయలేక విద్యార్థులు ఒత్తిడిని పెంచుకుంటున్నారు. ⇒ ప్రాధాన్యతను బట్టి ఏ పనికి ఎక్కువ సమయం, ఏ పనికి తక్కువ సమయం అన్న స్పష్టమైన విభజన చేసుకోవాలి. అది చదువు / సబ్జెక్ట్, ఆటపాటలు, షికార్లు /ఎంజాయ్మెంట్, వ్యాయామం.. అన్నింటికీ వర్తిస్తుంది. ⇒ ఏకబిగిన చదవకుండా మధ్యమధ్యలో విరామాలు తీసుకోవాలి ⇒ మరునాడు చేయబోయే పనులకు సంబంధించి ముందురోజు రాత్రే టైమ్ టేబుల్ వేసుకోవాలి. అందులో ఎంత శాతం పూర్తిచేస్తున్నారో డైరీలో రాసుకోవాలి. 60, 70, 80, 90 శాతం వరకు వచ్చారంటే.. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తరవాత అలా రాయాల్సిన అవసరమే ఉండదు. తల్లిదండ్రులూ.. పిల్లలు చెప్పేది వినండి పిల్లలు చెప్పేది వినడానికి చాలామంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉండరు. తాము కష్టపడి, డబ్బు పెట్టి చదివిస్తుంటే... ఏ కష్టం చదవడానికి అనుకుంటారు. ఈ ధోరణి మారాలి. వాళ్లు జీవితంలో ఏ అనుభవమూ లేకనే సమస్యలు మీకు చెబుతున్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే సగం సమస్య పరిష్కారమైనట్టే. పిల్లలూ.. స్క్రీన్ టైమ్ తగ్గించండి ఇటీవలి కాలంలో విద్యార్థులు చదువు కోసం కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. వీటి వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ⇒ కొందరు విద్యార్థులు చదువుకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ⇒ షార్ట్స్, రీల్స్, వీడియోలను ఒకటి తరవాత ఒకటి.. చూడటానికి మెదడు అలవాటు పడితే.. చదవాలన్న తలంపే రాకుండా పోతుంది. దానివల్ల పరీక్షల వంటి కీలక సమయాల్లో ఒత్తిడి పెరుగుతోంది. పిల్లలూ.. సిగ్గు, మొహమాటం వద్దు ⇒ స్నేహితులు, కుటుంబ సభ్యులు, టీచర్లు, బంధువులు.. వీరిలో మీ మనసుకు దగ్గరగా ఉండే వ్యక్తులు కచ్చితంగా ఉంటారు. మీకు ఏ సమస్య వచి్చనా నిర్మొహమాటంగా వారితో పంచుకోండి. ⇒ చాలా సందర్భాల్లో ఈ వ్యక్తులు మీ అమ్మ లేదా నాన్న కూడా కావచ్చు. కఠిన గ్రేడింగ్ వ్యవస్థలు, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తే ఓదార్చేవారు లేకపోవడం, నిరంతర పోటీతత్వం విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు. ముప్పును ముందే గుర్తించి పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చే స్థాయిలో పాఠశాల, కళాశాల కౌన్సెలర్లకు శిక్షణ ఇవ్వాలి. భావోద్వేగాలను నియంత్రించుకునేలా, ఒత్తిడిని జయించి, ఆత్మహత్యలను నివారించేలా విద్యాసంస్థలు మేమున్నామనే భరోసా ఇవ్వాలి – నెల్సన్ వినోద్ మోసెస్, సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -
పాలకొండ: శభాష్ చెల్లెమ్మా
పాలకొండ రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థిని తనను వేధించిన ఓ పోకిరీకి చెప్పుతో బుద్ధి చెప్పింది. శుక్రవారం సాయంత్రం కాలేజీ నుంచి తన స్వగ్రామం వెళ్లే క్రమంలో బస్సు ఎక్కుతుండగా ఓ యువకుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. వ్యవహారం శృతిమించడంతో ఆగ్రహించిన ఆమె ఉగ్రరూపం దాల్చింది. బస్సు దిగి తన కాలి చెప్పుతీసి ఆ పోకిరికి చూపిస్తూ గట్టిగా బుద్ధి చెప్పింది. నీ కుటుంబ సభ్యులతో ఇలానే ప్రవర్తిస్తావా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఊహించని ఈ పరిణామంతో ఆ పోకిరి అక్కడి నుంచి ఉడాయించాడు. ఇదంతా గమనించిన సహ విద్యార్థులతో పాటు అక్కడి వారు ‘శభాష్ చెల్లెమ్మా’ అంటూ కితాబిచ్చారు. ఏపీలో గత కొంతకాలంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తున్నదే. చిన్నపిల్లల దగ్గరి నుంచి పండు ముసలిదాకా అఘాయిత్యాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రోత్సహించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అక్కడి వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేస్తోంది. అన్నట్లు మొన్నీమధ్యే యూపీ ఉన్నావ్లోనూ ఇదే తరహాలో ఓ ఈవ్టీజర్ ఆటకట్టించింది ఓ స్టూడెంట్. ఆపై ఆ వ్యక్తిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అందుకు సంబంధించిన వీడియో మీరూ చూసేయండి. #उन्नाव#छात्रा ने छेड़छाड़ करने वाले #युवक की सरेराह #चप्पलों से की #धुनाई#गंगाघाट_कोतवाली क्षेत्र के पोनी रोड स्थित नीलम स्वीट हाउस के पास की #घटना#Unnao#UnnaoNews#EveTeasing#StudentSlapsMolester#UPPolice#viral#viralvideo#NewsFlash @unnaopolice @Uppolice pic.twitter.com/9HhbKTg1Pf— Goldy Srivastav (@GoldySrivastav) July 20, 2025 -
తీరు‘బడి’గా ఫీజుల ఖరారు
అమరావతి: బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను అనుసరించి రూ.8,500 నుంచి గరిష్టంగా రూ.14,500 వరకు ఫీజులను నిర్ణయించింది. గతేడాది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రకారం ఒకటి నుంచి ఐదు వరకు “స్టార్’ రేటింగ్ ఇచ్చింది. ఈ రేటింగ్ను అనుసరించే ఫీజులను ఖరారు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీఈ చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చట్టం ద్వారా పిల్లలను చేర్చుకున్న స్కూళ్లకు ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. వాస్తవానికి ఈ ఫీజులను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఖరారు చేసి ఆర్టీఈ ప్రవేశాలు కల్పించాలి. కానీ ప్రభుత్వం ఏప్రిల్లో కమిటీని నియమించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా, నాలుగు నెలల సమయం పట్టింది. ఇంతలో ఆర్టీఈ ప్రవేశాలు చేపట్టడం, ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులను తిరస్కరించడం వంటి కారణాలతో ఉచిత సీట్లు వచ్చినా చేసేది లేక చాలామంది తల్లిదండ్రులు వేరే స్కూళ్లలో పిల్లలను చేర్పించేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది ఆర్టీఈ చట్టం ద్వారా సీట్లు పొందిన వేలాది మంది నిరుపేద తల్లిదండ్రులకు ఆర్థికంగా నష్టపోయారు. 32 వేల మందిలో సగం మందికే అడ్మిషన్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం పిల్లల నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం–2009 ద్వారా ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో 2022–23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇలా గత మూడు విద్యా సంవత్సరాల్లో (2022–23, 2023–24, 2024–25) 50 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పించారు. 2025–26 విద్యా సంవత్సరంలో 31,701 మందికి సీట్లు కేటాయించారు.అయితే, ప్రభుత్వ ఫీజులను ఖరారు చేయనందున చాలా స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలను చేర్చుకోలేదు. దీంతో చేసేది లేక పిల్లల భవిష్యత్తు రీత్యా తల్లిదండ్రులు ఫీజులు చెల్లించి స్కూళ్లలో చేర్పించారు. మరికొందరు ఆర్థిక భారం భరించలేక ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. దీంతో సగం మందికే ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్ లభించినట్టయింది. ఆ విద్యార్థులకు తల్లికి వందనం నిలిపివేత ప్రస్తుత విద్యా సంవత్సరంతోపాటు గత మూడేళ్లల్లో ఆర్టీఈ చట్టం కింద ప్రవేశాలు పొందిన 81 వేల మంది విద్యార్థులకు ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని నిలిపివేసింది. ఫీజులు ఖరారైన తర్వాత వందనం కింద ఇచ్చే మొత్తాన్ని ఆయా స్కూళ్లకే జమ చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఆర్టీఈ చట్టం కింద సీట్లు దక్కినా చాలా స్కూళ్లు అడ్మిషన్లు నిరాకరించాయి. దీంతో తల్లిదండ్రులు పిల్లలను డబ్బులు కట్టి ప్రైవేటు స్కూళ్లలోనూ, ఆర్థిక భారం భరించలేని వారు ప్రభుత్వ పాఠశాలల్లోనూ చేర్పించారు. ఇలాంటి వారు 32 వేల మందిలో దాదాపు 15 వేల మంది వరకు ఉంటారని అంచనా. వీరు ఇంకా ఆర్టీఈ విద్యార్థులుగానే ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నారు. ఈ క్రమంలో వీరికి తల్లికి వందనం ఇస్తారా..; లేక పూర్తిగా ఎగవేస్తారా.. అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులపై కోర్టుకెళ్లిన యాజమాన్యాలుగతేడాది స్కూళ్లు నిర్ణయించిన ఫీజులే చెల్లించాలని, లేదంటే విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని కొన్ని, పై తరగతులకు పంపించేదిలేదని, టీసీలు సైతం ఇచ్చేది లేదని మరికొన్ని స్కూళ్లు తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచి ఫీజులు వసూలు చేశాయి. ఈ ఏడాది సగం మంది విద్యార్థులకు అడ్మిషన్లనే నిరాకరించాయి. తాజాగా నిర్ణయించిన ఫీజులు రూ.8500 నుంచి రూ.14500 కూడా స్టార్ రేటింగ్ను బట్టి అన్ని తరగతులకు ఇవే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమకు చెల్లించే ఫీజులు తక్కువగా ఉన్నాయని, వీటిని పెంచాలని ప్రవేటు స్కూళ్ల యాజమాన్యాలు గతంలోనే హైకోర్టును ఆశ్రయించగా, ఫీజులను సవరించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
Anantapur: ఉపాధ్యాయుడినే బెదిరించిన విద్యార్థిని
-
శ్రీలీల వైరల్ వయ్యారి సాంగ్.. స్టూడెంట్ డ్యాన్స్కు హీరో ఫిదా!
ఇటీవల సినీ ప్రియులను ఓ రేంజ్లో ఊపేస్తోన్న హీరోయిన్ శ్రీలీల. గతేడాది పుష్ప-2 చిత్రంలో కిస్సిక్ సాంగ్తో అలరించిన ముద్దుగుమ్మ.. మరోసారి అలాంటి ఊపున్న సాంగ్తో మెప్పించింది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా వచ్చిన జూనియర్ మూవీలో వైరల్ వయ్యారి అంటూ అభిమానుల ముందుకొచ్చింది. ఈ మాస్ సాంగ్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. నెట్టింట ఎక్కడ చూసినా వైరల్ వయ్యారి అంటూ రీల్స్తో అదరగొట్టేసింది.అంతలా క్రేజ్ దక్కించుకున్న ఈ పాటకు కర్నాటకకు చెందిన ఓ విద్యార్థిని చేసిన డ్యాన్స్ నెట్టింట వైరలవుతోంది. హీరో కిరిటీ సమక్షంలోనే ఆ బాలిక అద్భుతంగా డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను హీరో కిరిటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన డ్యాన్స్తో అదరగొట్టిన విద్యార్థినికి హీరో కిరిటీ చిరుకానుక అందించారు. ఇది చూసిన నెటిజన్స్ విద్యార్థిని టాలెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతంగా చేశావంటూ కితాబిస్తున్నారు.కాగా.. కిరిటీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం జూనియర్. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ జూలై 18 తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తోంది. The super talented V. Pooja from Kurugodu, a beautiful village in my hometown Ballari, dancing her heart out to #ViralVayyari. Blessings to you, little star! #Junior pic.twitter.com/FITaWGU6ra— Kireeti (@KireetiOfficial) July 23, 2025 -
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై దాడి
-
స్మార్ట్ స్టడీ స్ట్రాటజీస్..!
ప్రతి విద్యార్థి రోజూ గంటలు, గంటలు చదువుతున్నారు. అయినా పరీక్షల్లో గందరగోళ పడుతున్నారు. చదివినది గుర్తురాక, పరీక్షలు సరిగా రాయలేక ఆందోళనకు లోనవుతున్నారు. దాంతో పేరెంట్స్, టీచర్స్ మరిన్ని గంటలు చదవమని ఒత్తిడి పెడుతున్నారు. విద్యార్థులతో రెండు దశాబ్దాలకు పైబడి పనిచేస్తున్న సైకాలజిస్ట్గా, జీనియస్ మ్యాట్రిక్స్ డెవలపర్గా ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా. ఎన్ని గంటలు చదివామనే దానికన్నా, ఎంత బాగా చదివామనేది ముఖ్యం. మెదడు ఎలా నేర్చుకుంటుందో తెలుసుకుని చదివితే మార్కులు పరుగెత్తుకుంటూ వస్తాయి. లేదంటే మీరు పెట్టే శ్రమ, టైమ్, ఫీజులు అన్నీ వృథా అవుతాయి. అందుకే స్మార్ట్గా ఎలా చదవాలో తెలుసుకుందాం. లైఫ్ లాంగ్ లెర్నర్గా ఎదుగుదాం. మార్కులు, ర్యాంకుల కన్నా ఇదే నిజమైన విజయం. లెర్నింగ్ సైన్స్మనం కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు నాడీకణాల మధ్య బంధాలు బలపడతాయి. ప్రతిసారి రివిజన్ చేసేటప్పుడు ఆ బంధాలు మైలినేషన్ అనే ప్రక్రియ ద్వారా వేగవంతం అవుతాయి. అప్పుడు గుర్తుంచుకోవడం సులువవుతుంది. స్పేస్డ్ రిపిటీషన్, రిట్రీవల్ ప్రాక్టీస్, ఇంటర్ లీవింగ్ వంటి టెక్నిక్స్ వల్ల చదివింది బాగా గుర్తుంటుందని కెంట్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల్లో వెల్లడైంది. యాక్టివ్ రీకాల్: ఒక సెక్షన్ చదివాక, పుస్తకం మూసేసి ‘ఇప్పుడు నేనేం నేర్చుకున్నాను, నా ప్రెజెంట్ నాలెడ్జ్తో అదెలా కలుస్తుంది, నేర్చుకున్నది ఏమిటి?’ అని మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇది జ్ఞాపకంలో నుంచి సమాచారాన్ని తిరిగి తెస్తుంది. దీని వల్ల జ్ఞాపకం బలపడుతుంది.స్పేస్డ్ రిపిటీషన్: ఎవరేం నేర్చుకున్నా 24 గంటల్లో దాదాపు 70 శాతం మర్చిపోతారు. దీర్ఘకాలం గుర్తుండాలంటే 24 గంటల్లోపు ఒకసారి రివిజన్ చేయాలి. ఆ తర్వాత వారం, నెల, మూడు నెలల వ్యవధిలో రివిజన్ చేయడం వల్ల నేర్చుకున్నది దీర్ఘకాలిక జ్ఞాపకాల్లోకి చేరి పూర్తిగా గుర్తుంటుంది. ఇంటర్ లీవింగ్: ఒకే సబ్జెక్ట్ గంటల తరబడి చదవకుండా, సంబంధిత సబ్జెక్ట్స్ను మార్చి మార్చి చదవడం మెదడులో ఫ్లెగ్జిబిలిటీని పెంచుతుంది.డ్యూయల్ కోడింగ్: పదాలతో పాటు విజువల్స్ కలిపి చదవడం. మైండ్ మ్యాప్స్, డయాగ్రమ్స్ వాడడం వల్ల మాటల జ్ఞాపకం, విజువల్ జ్ఞాపకం రెండూ కలసి జ్ఞాపకం పెరుగుతుంది. టీచ్ వాట్ యూ లెర్న్: మీరు నేర్చుకున్నది ఇతరులకు బోధించండి. లేదా మీకు మీరే చెప్పుకోండి. దీనివల్ల మెదడులో సమాచారం క్లియర్గా ఆర్గనైజ్ అవుతుంది. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినవి రోజూ గంటలకు గంటలు చదవమని పిల్లలను ఒత్తిడి చేయవద్దు. ప్రతిరోజూ కొద్దిపాటి విరామాలతో కొద్ది కొద్ది సేపు చదివేలా అలవాటు చేయండి.కేవలం మార్కులు, ర్యాంకులకే కాదు– ప్రయత్నం, స్ట్రాటజీ, క్రియేటివిటీని అభినందించండి. ఉదాహరణకు, ‘నువ్వు ఈ క్లిష్టమైన చాప్టర్ను సులువుగా విభజించడం నాకెంతో నచ్చింది’ అని చెప్పండి.చదవడానికి డిస్ట్రాక్షన్స్ లేని ప్రశాంత వాతావరణం సృష్టించండి. రోజుకు కనీసం7–9 గంటల నిద్ర అందేలా చూడండి.రోజూ వ్యాయామం చేయడం వల్ల మెదడులో కొత్త కనెక్షన్లను ఏర్పరచే బీఎన్డీఎఫ్ అనే ప్రొటీన్ విడుదలవుతుంది. మెదడుకు శక్తినిచ్చే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాల్నట్స్, ఫ్లాక్స్సీడ్స్, చేపలు, బెర్రీలు వంటివి అందించండి. విద్యార్థులు చేసే పొరపాట్లుపాసివ్ రీడింగ్: పాఠాలను హైలైట్ చేస్తూ పదేపదే చదివితే బాగా గుర్తుంటుందని అనుకుంటారు. కానీ దీనివల్ల బలమైన మెమరీ ట్రేసెస్ ఏర్పడవు. క్రామింగ్: చివరి రోజు వరకు వాయిదా వేసి ఒక్కరోజులో మొత్తం రివిజన్ చేయడం వర్కింగ్ మెమరీను ఒత్తిడికి గురి చేస్తుంది. ఈజీగా మరచిపోతారు.మల్టీ టాస్కింగ్: చదివేటప్పుడు టీవీ చూడటం, సోషల్ మీడియాలో కాలక్షేపం చేయడం, ఒకేసారి రెండు మూడు సబ్జెక్టులు చదవడంలాంటి పనులు చేస్తే అధ్యయన సామర్థ్యం 40 శాతం వరకు తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.మూడు స్మార్ట్ స్టడీ స్ట్రాటజీస్పొమోడోరో టెక్నిక్: 25 నిమిషాలు ఫోకస్తో చదివి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. అలా నాలుగుసార్లు చదివాక 20–30 నిమిషాలు పెద్ద విరామం తీసుకోండి. సెల్ఫ్–టెస్టింగ్: చాప్టర్ హెడింగ్స్ను ప్రశ్నలుగా మార్చుకుని ముందుగా వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. తరువాత చదివాక తిరిగి పరీక్షించుకోండి.కాంటెక్స్ట్ /వేరియేషన్: ఎప్పుడూ ఒకే చోట కూర్చుని చదవకండి. చదివే ప్రదేశాలు మార్చడం వల్ల జ్ఞాపకానికి వివిధ క్యూస్ ఏర్పడి గుర్తుకు తెచ్చుకోవడం సులువవుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: జైలు శిక్షనే శిక్షణగా మార్చుకున్న జీనియస్ ఖైదీ..!) -
ప్రిన్సిపల్ మందలించారని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
బాపట్ల టౌన్: పాఠశాలలో ప్రిన్సిపల్ మందలించారని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాపట్లలోని వెంగళ్విహార్కు చెందిన ఓ విద్యార్థిని సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని, తోటి స్నేహితుల ముందు విద్యారి్థనిపై ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనస్తాపానికి గురైన విద్యార్థిని 2 రోజులుగా పాఠశాలకు వెళ్లలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి.. ప్రిన్సిపాల్తో నాన్న మాట్లాడి వచ్చారని, శనివారం నుంచి స్కూల్కు వెళ్లాలని చెప్పింది. పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేని విద్యార్థిని శుక్రవారం సాయంత్రం బాపట్ల–గుంటూరు ప్లై ఓవర్ బ్రిడ్జి క్రింద రైలు పట్టాలపైకి చేరుకుంది. రైలు వెళ్తున్న సమయంలో రెండు కాళ్లు రైల్వేట్రాక్ పెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు తెగిపోయాయి. ఆమెను స్థానికులు స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు జీజీహెచ్కు తరలించగా..అక్కడ విద్యారి్థని కాళ్లకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. -
అసభ్యంగా దూషిస్తున్నారు.. ఆయన తరగతికి వెళ్లం!
వజ్రకరూరు: ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో దూషిస్తుండడంతో ఆయన క్లాసుకు వెళ్లేది లేదని విద్యార్థినులు తెగేసి చెప్పారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని చిన్నహోతురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, అందువల్ల ఆయన తరగతికి వెళ్లబోమని విద్యార్థినులు కన్నీరు పెట్టుకోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం ఉదయం పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఈ సందర్భంగా వాగ్వాదానికి దిగిన ఉపాధ్యాయునిపై తల్లిదండ్రులు ఒక దశలో చేయిచేసుకోబోయారు. తోటి ఉపాధ్యాయులు అతికష్టం మీద తల్లిదండ్రులను ఆపారు. కాగా, గణితం తరగతికి వెళ్లబోమని హెచ్ఎంకు విద్యార్థినులు ఈ సందర్బంగా లేఖ అందించారు.చర్యలకు ఉన్నతాధికారుల సిఫారసువజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి, ఎంఈఓ ఎర్రిస్వామి తదితరులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడి ప్రవర్తన బాగోలేదని విచారణలో తేలడంతో చర్యల కోసం డీఈఓ ప్రసాద్బాబుకు సిఫారసు చేసినట్లు ఎంఈఓ తెలిపారు. కాగా, సతీష్ కుమార్ గతంలో చాబాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసినప్పుడు, ఆయన వ్యవహారశైలి బాగోకపోవడంతో అక్కడి ప్రధానోపాధ్యాయుడు డీవైఈఓకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అప్పటి ఘటనలపైనా అధికారులు దృష్టి సారించారు. -
బడి కోసం రోజూ వంద కి.మీ. జర్నీ
మానకొండూర్: కిలోమీటర్ దూరంలో బడి ఉంటేనే.. అబ్బా అంత దూరమా! అని ఉసూరుమనే విద్యార్థులున్న ఈ కాలంలో ఓ విద్యార్థిని తాను పుట్టి పెరిగిన ఊరిలోని బడిపై మమకారాన్ని వదులుకోలేక, అక్కడి స్నేహితులను వదిలి ఉండలేక రోజూ ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణించి సర్కారు బడికి వచ్చి చదువుకుంటోంది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన పానేటి నర్సయ్య, దుర్గమ్మ దంపతుల చిన్న కూతురు పద్మ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.సంచారజాతికి చెందిన నర్సయ్య, దుర్గమ్మ ఏడాదిలో ఆరు నెలలు వలస వెళ్తారు. ప్రస్తుతం వీరు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి వలసవెళ్లారు. తల్లిదండ్రులతోపాటు పద్మ కూడా వెళ్లింది. అయితే, పద్మ మనసంతా పుట్టిన ఊరు.. పాఠశాలపైనే ఉంది. దీంతో మానకొండూర్ పాఠశాలలోనే చదువుకుంటా అని తల్లిదండ్రులతో చెప్పింది.ఇల్లంతకుంట నుంచి రవాణా సౌకర్యం లేకపోవడంతో వేములవాడలో ఉంటున్న అమ్మమ్మ వద్ద ఉంటూ, నిత్యం వేములవాడ నుంచి మానకొండూర్కు బస్సులో బడికి వచ్చి వెళ్తోంది. ఇంట్లో నుంచి ఉదయం ఆరు గంటలకు బయలుదేరి.. సాయంత్రం ఆరు గంటలకు మళ్లీ ఇల్లు చేరుకుంటోంది. రానుపోను నిత్యం 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తోంది. -
మియాపూర్: స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్లో స్కుల్ బిల్డింగ్పై నుంచి పడి విద్యార్థి మృతి చెందాడు. మధుర నగర్లోని సెయింట్ మార్టిన్ స్కూల్లో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి రిజ్వాన్(15) స్కూల్ బిల్డింగ్ నాలుగో అంతస్థుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు.దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. రిజ్వాన్ ప్రమాదవశాత్తూ పడిపోయాడా.. లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Odisha Bandh: విద్యార్థిని ఆత్మాహుతికి నిరసనల వెల్లువ
భువనేశ్వర్: ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్య తీసుకోలేదని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విద్యార్థినికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది ప్రతిపక్ష పార్టీల మద్దతుతో కాంగ్రెస్ ఒడిశాలో ఈరోజు(గురువారం) బంద్ నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో రాజధాని భువనేశ్వర్లోని దుకాణాలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు రాకపోకలు కూడా కనిపించలేదు.రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపునకు మద్దతుగా పలువురు ప్రతిపక్ష నేతలు.. ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ, పార్టీ జెండాలు, ప్లకార్డులను పట్టుకుని రోడ్లపై నిరసన తెలిపారు. బంద్ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బృందాలను మోహరించడంతో పాటు గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ బంద్ రాజకీయాల కోసం కాదని, ఇక్కడి కుమార్తెలకు అండగా నిలిచేందుకేనని అన్నారు. ఇటువంటి నిరసన లేకపోతే ప్రతీ పాఠశాల, కళాశాలలో ఇటువంటి దుస్థితి ఏర్పడుతుందన్నారు. విద్యార్థిని ఫిర్యాదుపై చర్య తీసుకోవడంలో విఫలమైనందుకు రాష్ట్ర విద్యా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై న్యాయ విచారణకు సీపీఐ(ఎం) నేత సురేష్ పాణిగ్రాహి పిలుపునిచ్చారు. 🚨 🚨 #BreakingNews Odisha Bandh Today, Roads Empty In Protest Over Student's Self-Immolation https://t.co/txmxD08kwBThe 20-year-old student of Fakir Mohan Autonomous College in Balasore attempted self-immolation last week after allegedly facing prolonged sexual harassment b…— Instant News ™ (@InstaBharat) July 17, 2025బాలసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని తాను కళాశాల విభాగాధిపతి నుంచి దీర్ఘకాలంగా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడింది. తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మృతురాలి తండ్రితో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ ఘటన సమాజానికి అయిన గాయంగా రాహుల్ అభివర్ణించారు. -
ఒడిశాను కుదిపేస్తున్న విద్యార్థిని ఆత్మాహుతి ఘటన
-
ఒడిశాను కుదిపేస్తున్న విద్యార్థిని ఆత్మాహుతి ఘటన
-
తరగతి గదిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య!
నడిగూడెం: పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గంధమళ్ల అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ నిమ్మ వెంకటేశ్వర్లు, వసుంధర దంపతులకు కుమార్తె తనూషా మహాలక్ష్మి (14), ఇద్దరు కుమారులు సంతానం. తనూషా మహాలక్ష్మి నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతోంది. ఈనెల 4వ తేదీన వ్యక్తిగత కారణాలతో బాలిక ఇంటికి వెళ్లింది. తిరిగి 6వ తేదీన పాఠశాలకు వచి్చంది. ఆదివారం తనూషాను చూసేందుకు ఆమె తల్లి పాఠశాల వద్దకు వచ్చి భోజనం పెట్టి వెళ్లింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తండ్రి వెంకటేశ్వర్లు కూడా కుమార్తెను చూసి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తనూషా పాఠశాలలోని తన తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఐదు గంటల సమయంలో తనూషా స్నేహితురాలు తమ తరగతి గదిలోకి వెళ్లగా.. అప్పటికే తనూషా ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. రాత్రి విధుల్లో ఉన్న హిందీ ఉపాధ్యాయురాలు సునీత పాఠశాల ప్రత్యేకాధికారి వెంకటరమణకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో విద్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, పాఠశాలను సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్, తహసీల్దార్ వి.సరిత, జీసీడీఓ తీగల పూలాన్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
Odisha: ప్రాణాలొదిలిన వేధింపుల బాధితురాలు.. స్పందించిన సీఎం
భువనేశ్వర్: లైంగిక వేధింపుల ఉదంతానికి మరో విద్యార్థిని అశువులుబాసింది. ఒడిశాలోని ఒక కళాశాలలో లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్పై ఫిర్యాదు చేసినప్పటికీ, చర్యలు తీసుకోకపోవడంతో కలత చెందిన ఒక విద్యార్థిని ఒంటికి నిప్పటించుకుంది. మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ సోమవారం రాత్రి మృతిచెందింది.ఐసీయూలోని బర్న్స్ వార్డులో చికిత్సనందిస్తూ, మూత్రపిండ మార్పిడి చికిత్సతో సహా అన్ని సాధ్యమైన వైద్య సహాయం అందించినప్పటికీ, బాధితురాలిని బతికించలేకపోయామని, ఆమె సోమవారం రాత్రి 11:46 గంటలకు మరణించిందని ఎయిమ్స్ భువనేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపింది. బాధితురాలు జూలై 1న కళాశాల ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమె కళాశాల అధికారులకు రాసిన లేఖలో ఆ ప్రొఫెసర్ నెలల తరబడి తనపై సాగించిన వేధింపులు, బెదిరింపులను వివరించింది. అయినా ప్రొఫెసర్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. ఈ నేపధ్యంలో తీవ్ర నిరాశలో ఉన్న బాధితురాలు జూలై 12న బాలసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల ప్రాంగణంలో నిప్పంటించుకుంది. 90 శాతం మేరకు కాలిపోయిన బాధితురాలిని వెంటనే ఎయిమ్స్ భువనేశ్వర్కు తరలించారు. సోమవారం రాత్రి ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. ଫକୀର ମୋହନ ସ୍ୱୟଂଶାସିତ ମହାବିଦ୍ୟାଳୟର ପୀଡ଼ିତା ଛାତ୍ରୀଙ୍କ ଦେହାନ୍ତ ଖବର ଶୁଣି ମୁଁ ଅତ୍ୟନ୍ତ ମର୍ମାହତ। ସରକାରଙ୍କ ସମସ୍ତ ଦାୟିତ୍ୱ ନିର୍ବାହ ତଥା ବିଶେଷଜ୍ଞ ଡାକ୍ତରୀ ଦଳଙ୍କ ଅକ୍ଲାନ୍ତ ପରିଶ୍ରମ ସତ୍ତ୍ୱେ ପୀଡ଼ିତାଙ୍କ ଜୀବନ ରକ୍ଷା ହୋଇପାରିଲା ନାହିଁ । ତାଙ୍କର ଅମର ଆତ୍ମାର ସଦଗତି କାମନା କରିବା ସହ ପରିବାରବର୍ଗଙ୍କୁ ଏହି ଅପୂରଣୀୟ…— Mohan Charan Majhi (@MohanMOdisha) July 14, 2025ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి విద్యార్థిని మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ, దోషులకు కఠినమైన శిక్ష పడుతుందని ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు.‘ఎఫ్ఎం అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని మృతి వార్త విని చాలా బాధపడ్డాను. నిపుణులైన వైద్య బృందం అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ, బాధితురాలి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ జగన్నాథుడిని వేడుకుంటున్నాను. ఈ కేసులో దోషులందరూ చట్ట ప్రకారం కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని బాధిత విద్యార్థిని కుటుంబానికి హామీ ఇస్తున్నాను. ఇందుకోసం వ్యక్తిగతంగా అధికారులకు తగిన సూచనలు జారీ చేశాను’ అని ఆయన తన ఆన్లైన్ పోస్ట్లో తెలిపారు. -
‘యమున’లో విగతజీవిగా త్రిపుర యువతి.. కుటుంబ కలహాలే..?
న్యూఢిల్లీ: ఆరు రోజుల క్రితం ఢిల్లీలో అదృశ్యమైన త్రిపురకు చెందిన యువతి స్నేహా దేబ్నాథ్(19) ఆత్మహత్య చేసుకున్నదని, ఆమె మృతదేహం యుమునా నదిలో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈమె ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకుంటోంది. స్నేహా దేబ్నాథ్ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు నిర్ధారించారని పోలీసులు పేర్కొన్నారు.స్నేహా దేబ్నాథ్ అదృశ్యమైన దరిమిలా త్రిపురలోని ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం తీవ్రంగా గాలించారు. జూలై 7న ఆమె ఉత్తర ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జికి క్యాబ్లో వెళ్లింది. స్నేహ తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు సూచించే నోట్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. చదువు విషయంలో ఆమె కలకతచెందడం లేదని, ఆమె ఆందోళనకు కారణం కుటుంబ కలహాలై ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. సిగ్నేచర్ బ్రిడ్జికి 10 కి.మీ దిగువన ఉన్న గీతా కాలనీలోని ఫ్లైఓవర్ సమీపంలోని యమునా నదిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.స్నేహా దేబ్నాథ్ను ఈ స్థలంలో దింపినట్లు క్యాబ్ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. కాగా ఈ వంతెనపై నిలబడి ఉన్న ఒక అమ్మాయిని చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), పోలీసు విభాగాల సహాయంతో ఆమె కోసం గాలింపు చర్యలు సాగాయి. వారు ఉత్తర ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ నుండి ఉత్తరప్రదేశ్లోని నోయిడా వరకుగల అన్ని ప్రాంతాలను అణువణువునా జల్లెడ పట్టారు. జూలై 7 తెల్లవారుజామున స్నేహా తన సన్నిహితులకు ఈమెయిల్స్ పంపిందని పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు స్నేహితులు పోలీసులకు తెలిపారు. -
హైకోర్టు చివాట్లు పెట్టినా.. ఆ ఐఏఎస్ తీరు మారలేదు..
భోపాల్: పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థినిపై కలెక్టర్ పలు మార్లు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజా ఘటనతో మరోసారి సదరు వివాదాస్పద ఐఏఎస్ అధికారి తీరు చర్చాంశనీయంగా మారింది.విద్యార్థిపై కలెక్టర్ చేయి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏప్రిల్ 1న మధ్యప్రదేశ్ రాష్ట్రం భింద్ జిల్లాలోని మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు హేమంత్ కటారే మామ నారాయణ్ దంగ్రౌలియాకు చెందిన దీన్ దయాళ్ దంగ్రౌలియా మహవిద్యాలయ కాలేజీలో మాథ్స్ పరీక్షా కేంద్రంలో జరిగింది. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్ష రాసే సమయంలో ఓ విద్యార్థి బాత్రూంకు వెళ్లి తిరిగి తన స్థానంలో కూర్చొనేందుకు ప్రయత్నించాడు. అప్పుడే పరీక్ష కేంద్రంలోకి జిల్లా కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ విద్యార్థులు పరీక్ష ఎలా రాస్తున్నారని పరిశీలించే ప్రయత్నం చేశారు.బాత్రూంకు వెళ్లి వచ్చిన విద్యార్థిపై పలు ప్రశ్నలు సంధించాడు. విద్యార్థి సైతం కలెక్టర్కు రిప్లయి ఇచ్చాడు. అప్పుడే విద్యార్థి సమాధానంతో కలెక్టర్ కోపోద్రికులయ్యారు. విద్యార్థిపై పలుమార్లు దాడి చేశారు. అనంతరం విద్యార్థి సిబ్బంది గదిలోకి పిలిపించుకున్నారు. మరో మారు విద్యార్ధిపై చేయి చేసుకున్నారు. ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.కలెక్టర్ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్ధిపేరు రోహిత్ రాథోడ్. బీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షా కేంద్రంలో రోహిత్ రాథోర్ తన ప్రశ్నాపత్రాన్ని బయటకు తీసుకెళ్లి వాటికి సమాధానాలు తెలుసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి.దీనిపై కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ స్పందించారు. విద్యార్ధిపై చేయిచేసుకోవడాన్ని తనని తాను సమర్ధించుకున్నారు. ‘ఈ పరీక్షా కేంద్రంలో ఆర్గనైజ్డ్ మాస్ చీటింగ్ జరుగుతుందనే సమాచారం అందింది. మాస్ చీటింగ్ గుట్టురట్టు చేసేందుకే ఎగ్జామ్ సెంటర్ను విజిట్ చేశాను. ఆ సమయంలో ఓ విద్యార్థి తన ప్రశ్నాపత్రాన్ని టాయిలెట్లోకి తీసుకెళ్లాడు. ప్రశ్నలకు జవాబులు తెలుసుకొని పరీక్ష జరుగుతున్న తన బెంచ్ మీద కూర్చొనే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో బెంచ్ మీద క్వశ్చన్ పేపర్ లేదు. ఇదే విషయాన్ని విద్యార్ధిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు. కాలేజీలో చీటింగ్లు జరుగుతున్నాయనే సమాచారం వచ్చింది. భవిష్యత్తులో కాలేజీల్లో ఇలా జరగకుండా యూనివర్సీటీకి లేఖ రాస్తానని అన్నారు.విద్యార్థి రోహిత్ రాథోర్ మాట్లాడుతూ.. నేను టాయిలెట్కు వెళ్లి వచ్చేసరికి నా ప్రశ్నపత్రం కనిపించలేదు. నేను మోసం చేయలేదని వాపోయాడు. కాగా, విద్యార్ధిపై దాడి విషయంలో ఐఏఎస్ అధికారి సంజీవ్ శ్రీవాస్తవపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు సైతం ఆయన ప్రవర్తనపై వ్యాఖ్యలు చేసింది. మరో అధికారిణి మాలా శర్మ ఆయనపై మానసిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇప్పుడు విద్యార్థిపై ఐఏఎస్ అధికారి సంజీవ్ శ్రీవాస్తవ చేయిచేసుకోవడం వివాదానికి దారి తీసింది. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. Sanjeev Srivastava, IAS, DM of Bhind, got a tip-off about cheating during the BSc 2nd year maths exam at a college.DM sahab barged in like Singham, picked a student, and started slapping him without any proof of cheating.If you are angry at this, remeber that DM sahab could… pic.twitter.com/n5J1yZv5gy— THE SKIN DOCTOR (@theskindoctor13) July 13, 2025 -
కలకత్తా ఐఐఎంలో అఘాయిత్యం
కోల్కతా: ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) కలకత్తా క్యాంపస్లో ఘోరం జరిగింది. ఓ మహిళపై విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు మందు కలిపిన పానీయం తాగించాడని, తాను అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. కోల్కతాలోని హరిదేవ్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడు మహావీర్ తొప్పాన్నవర్ అలియాస్ పరమానంద జైన్ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం నగరంలోని అలీపూర్ కోర్టులో ప్రవేశపెట్టగా, నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం ఏడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19వ తేదీన అతడిని మళ్లీ తమ ఎదుట ప్రవేశపెట్టాలని పోలీసులకు సూచించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు కోరగా మేజిస్ట్రేట్ తిరస్కరించారు. ఆన్లైన్ ద్వారా సంప్రదింపులు కోల్కతాకు చెందిన మహిళ క్లినికల్ సైకాలజిస్ట్గా పని చేస్తున్నారు. విద్యార్థులకు, యువతకు కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఐఐఎం క్యాంపస్లో చదువుకుంటున్న విద్యార్థి కౌన్సిలింగ్ తీసుకుంటానని ఆన్లైన్ ద్వారా ఆమెను సంప్రదించాడు. శుక్రవారం సదరు మహిళను తమ హాస్టల్కు రప్పించాడు. హాస్టల్ గదికి చేరుకున్న తర్వాత ఆమెకు డ్రగ్స్ కలిపిన పానీయం అందజేశాడు. అది సేవించి ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని గంటల తర్వాత తేరుకున్న బాధితురాలు తనపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. అతడిని గట్టిగా నిలదీయడంలో బెదిరింపులకు గురి చేశాడు. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘోరాన్ని వివరించారు. పోలీసులు రంగంలోకి దిగి, శుక్రవారం రాత్రి నిందితుడు పరమానంద జైన్ను అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై ఐఐఎం–కలకత్తా యాజమాన్యం స్పందించింది. తమ విద్యార్థిపై ఒక మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని వెల్లడించింది. ఆమె తమ సంస్థకు చెందిన మహిళ కాదని స్పష్టంచేసింది. కోల్కతాలో వరుస ఘటనలు పశి్చమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మహిళలపై అత్యాచార ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే 15 రోజుల క్రితం కోల్కతాలోని న్యాయ కళాశాలలో 24 ఏళ్ల విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ముగ్గురు వ్యక్తులు సెక్యూరిటీ గార్డుతో కలిసి ఆమెను రేప్ చేసినట్లు కేసు నమోదైంది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం జరగలేదు.. ఆటో నుంచి కింద పడిపోయింది ఐఐఎం–కలకత్తా క్యాంపస్ హాస్టల్లో అత్యాచారానికి గురైన మహిళ తండ్రి భిన్నంగా స్పందించారు. తన కుమార్తెపై అత్యాచారం జరగలేదని, ఆటోలో ప్రయాణిస్తూ కింద పడిపోవడంతో స్వల్పంగా గాయాల పాలైందని శనివారం చెప్పారు. శుక్రవారం రాత్రి 9.34 గంటల సమయంలో తనకు ఫోన్ వచ్చిందని, తన బిడ్డ ఆటో నుంచి పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరినట్లు తెలిసిందని అన్నారు. పోలీసులు అమెను ఆసుపత్రికి చేర్చారని తెలిపారు. రేప్ జరగలేదని తన కుమార్తె తనతో స్వయంగా చెప్పిందని వెల్లడించారు. -
Kolkata: బాలుర హాస్టల్లో విద్యార్థినిపై అకృత్యం.. ఒకరి అరెస్ట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోగల ఒక న్యాయ కళాశాలలో యువతిపై జరిగిన అత్యాచారాన్ని మరచిపోకముందే, ఇక్కడి ఐఐఎం కళాశాలలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్-కలకత్తాలో చదువుకుంటున్న ఒక విద్యార్ధినిపై బిజినెస్ స్కూల్ హాస్టల్లో ఒక విద్యార్థి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసిందని వారు పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు అందించిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ఆమెను కౌన్సెలింగ్ కోసం బాలుర హాస్టల్కు పిలిచారు. ఆ తర్వాత ఆమెచేత ఏదో పానీయం తాగించాక, ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగిందని ఆ యువతి గ్రహించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు తనను బెదిరించాడని కూడా ఆమె ఆరోపించిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసిన కొద్ది గంటలకే నిందితుడిని అరెస్ట్ చేశామని, కేసు దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు. -
ఆరో తరగతిలోనూ ఎక్కాలు రావు!
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థ ఎంత నాసిరకంగా ఉందో కేంద్ర విద్యాశాఖ సర్వేలో తేటతెల్లమయ్యింది. మూడో తరగతి చదువుకున్న విద్యార్థుల్లో 55 శాతం మంది మాత్రమే ఒకటి నుంచి 99 వరకు అంకెలను ఆరోహణ, అవరోహణ క్రమంలో అమర్చగలరు. ఆరో తరగతి చదువుతున్న వారిలో కేవలం 53 శాతం మందికే ఒకటి నుంచి పది దాకా ఎక్కాలు వచ్చు. గత ఏడాది డిసెంబర్ 4న ఈ సర్వే నిర్వహించారు. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన 781 జిల్లాల్లో 74,229 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 21.15 లక్షల మంది విద్యార్థులను ప్రశ్నించారు.వీరిలో మూడు, ఆరు, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులున్నారు. మూడో తరగతి విద్యార్థుల్లో 58 శాతం మంది కూడికలు, తీసివేతలు చేయగలరని తేలింది. మూడో తరగతి, ఆరో తరగతిలో గణితం సబ్జెక్టులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బాగా వెనుకబడి ఉన్నట్లు వెల్లడయ్యింది. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దాదాపు అన్ని సబ్జెక్టుల్లో రాణిస్తున్నట్లు సర్వేలో గుర్తించారు.అలాగే అన్ని తరగతుల విద్యార్థులు లాంగ్వేజ్(భాష)లో ఎక్కువ, గణితంలో అతి తక్కువ మార్కులు సాధిస్తున్నారు. విద్యార్జన విషయంలో రూరల్–అర్బన్ అనే వ్యత్యాసం కూడా కనిపిస్తోంది. గ్రామాల్లోని మూడో తరగతి విద్యార్థులు మ్యాథ్స్, లాంగ్వేజ్లో పట్టణాల్లోని విద్యార్థుల కంటే ఎక్కువగా రాణిస్తున్నారు. పట్టణాల్లోని ఆరు, తొమ్మిది తరగతి విద్యార్థులు దాదాపు అన్ని సబ్జెక్టుల్లో పల్లెల్లోని విద్యార్థుల కంటే మిన్నగా చదువుతున్నారు. -
ప్రాణం తీసుకున్న బీటెక్ విద్యార్థిని.. కారణం ఆమె స్నేహితులే!
సాక్షి,హైదరాబాద్: చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది. చదువు ఎలా బతకాలో నేర్పిస్తుంది. చక్కటి చదువు మంచి నడవడికను నేర్పిస్తుంది. కానీ ఆ యువతి విషయంలో చదివే మరణ శాసనం రాసింది. అవును స్నేహితుల వేధింపులే ఆమెకు శాపంగా మారాయి. బాగా చదవడం లేదంటూ చేసిన ఏగతాళి మాటలు ఆమెను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. తోటి స్నేహితురాలని చూడకుండా మాటలతో వేధించారు. ప్రాణం తీశారు.పైన ఫొటోలో కనిపిస్తున్న ఆ యువతి పేరు నిత్య. ఉండేది జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్లో. తన తోటి స్నేహితులు తనని ఎగతాళి చేశారని ఆత్మహత్య చేసుకుంది.. నిత్య హైదరాబాద్లోని ఓ ఉమెన్స్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్లోని ఓ హాస్టల్లో ఉంటున్న నిత్యాను తోటి స్నేహితురాళ్లే సూటిపోటి మాటలతో వేధించారు. స్నేహితుల ఎగతాళితో మనస్థాపం చెందిన నిత్య హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన జాబితాపూర్కు వచ్చింది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన స్థానికులు జగిత్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో కరీంనగర్కు తరలించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చదువుల కోసం హైదరాబాద్కు పంపిస్తే స్నేహితులే వేధించి చంపేశారంటూ నిత్య కుటుంబసభ్యులు కన్నీరు మన్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరో ఏదో అన్నారని క్షణికావేశంలో పెద్ద నిర్ణయం తీసుకున్న నిత్య తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిచ్చింది. -
మాల్లో మంటలు.. లిఫ్ట్లో విద్యార్థి చిక్కుకుని..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్బాగ్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో లిఫ్ట్లో చిక్కుకున్న ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు. నాలుగు అంతస్తుల వాణిజ్య సముదాయ భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలోని రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. తొలుత ఫ్యాబ్రిక్, కిరాణ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. ఫలితంగా విద్యుత్ నిలిచిపోయి లిఫ్ట్ ఆగిపోయింది. ఆ లిఫ్ట్లో చిక్కకున్నవిద్యార్థి కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్(25) ప్రాణాలు కోల్పోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను చల్లార్చేందుకు పలు ఇబ్బందులు పడ్డారు. ఈ భవనంలో ఒకే ప్రవేశ మార్గం, ఒకే నిష్క్రమణ మార్గం ఉంది. వివిధ వస్తువుల స్టాక్తో మెట్ల మార్గం అంతా మూసుకుపోయింది.దీంతో పైఅంతస్తులకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దట్టమైన పొగ వెంటిలేషన్ను అడ్డుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు గోడను బద్దలు కొట్టవలసి వచ్చింది. మొత్తం పదమూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే పనిలో పాల్గొన్నాయి. ఈ అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్ అనే అనుమాలున్నప్పటికీ, దర్యాప్తు తర్వాత అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన మరోసారి వాణిజ్య ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా అవసరాలను గుర్తుచేస్తోంది. ఇది కూడా చదవండి: Jharkhand: కూలిన బొగ్గు గని.. ఒకరు మృతి.. పలువురు విలవిల -
స్నేహితురాళ్లు అవమానించారని ఇంజినీరింగ్ విద్యార్థిని..
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన కాటిపల్లి నిత్య(21) తన స్నేహితులు కళాశాలలో, హాస్టల్లో మానసికంగా వేధించారని, క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిత్య హైదరాబాద్లోని రిషి ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదివే వైష్ణవి, సంజన కొద్ది రోజులుగా చదువులో వెనుకబడ్డావని, హేళన చేస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశారు. మనస్తాపానికి గురై ఈనెల 1న ఇంటికి వచ్చింది. 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యుల సూచనతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తండ్రి కాటిపల్లి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. -
గదిలో బంధించాడు వివస్త్రను చేశాడు!
కోల్కతా: లా కాలేజీ గ్యాంగ్రేప్ కేసులో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి నాయకుడు మోనోజిత్ మిశ్రాపై మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతను తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మరో విద్యార్థిని వెల్లడించింది. ఓ వేడుక సందర్భంగా గదిలో బంధించి, వివస్త్రను చేసి లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ‘‘2023 అక్టోబర్లో కాలేజీ వేడుకలో ఓ పక్క విద్యార్థులు డ్యాన్స్ చేస్తుండగా మా నాన్న ఫోన్ చేశారు. గోలగోలగా ఉండటంతో మాట్లాడటానికి పక్కనున్న ఖాళీ గదిలోకి వెళ్లాను. మాట్లాడి బయటికి రాబోతుండగా మోనోజిత్ లోపలికొచ్చి తలుపు లాక్ చేశాడు. మద్యం, గంజాయి తాగి ఉన్నాడు. నా మీదికొస్తుంటే నెట్టేశా. దాంతో తన జేబులోని రిమోట్తో వేదిక వద్ద మ్యూజిక్ సౌండు పెంచాడు. తర్వాత నా జుట్టు పట్టుకుని గదిలోని బాల్కనీలోకి ఈడ్చుకెళ్లాడు. నా బట్టలు విప్పడం ప్రారంభించాడు. వదిలెయ్యమని వేడుకున్నా. బిగ్గరగా అరిచా. అదృష్టవశాత్తూ ఒక సీనియర్ విద్యార్థి తలుపు తట్టడంతో మోనోజిత్ పారిపోయాడు’’ అని వెల్లడించింది. ఇష్టపూర్వక లైంగిక కలయికే: లాయర్ గ్యాంగ్ రేప్ కేసులో మోనోజిత్తో పాటు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ కస్టడీని కోర్టు మరో ఎనిమిది రోజులు పొడిగించింది. వారి తర్వాత అరెస్టయిన నాలుగో నిందితుడు, కాలేజీ సెక్యూరిటీ గార్డు పినాకీ బెనర్జీ కస్టడీనీ జూలై 4 వరకు పొడిగించారు. మోనోజిత్ ఆరోగ్య పరీక్షల సమయంలో సమయంలో అతని శరీరంపై రక్కిన గీతలను పోలీసులు గుర్తించారు. లైంగిక దాడిని బాధితురాలు ప్రతిఘటించిందనేందుకు అవి నిదర్శమని పోలీసు వర్గాలు తెలిపాయి. మోనోజిత్ కాల్ రికార్డులను సిట్ బృందం పరిశీలించింది. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నయనా చటర్జీతో అతనికి జరిగిన ఫోన్ సంభాషణల ఆధారాలను గుర్తించింది. కానీ మోనోజిత్ తరఫు లాయర్ రాజూ గంగూలీ మాత్రం బాధితురాలి ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ఆరోపించారు. ‘‘ఆమె ఇష్టపూర్వకంగానే అతనితో లైంగికంగా కలిసింది. మోనోజిత్ మెడపై ఆమె గోటి గుర్తులే దానికి నిదర్శనం. ఈ విషయాన్ని ప్రాసిక్యూషన్ కావాలనే దాస్తోంది’’ అని ఆక్షేపించారు. -
యువ వైద్యులపై కూటమి సర్కార్ అరాచకం
సాక్షి, తాడేపల్లి: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, దేశంలో వైద్య వృత్తిని కొనసాగించేందుకు అన్ని అర్హతలను సాధించిన యువ వైద్యుల పట్ల కూటమి సర్కార్ అరాచకంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్రలు మండిపడ్డారు.తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి చెందిన దాదాపు 1500 మంది యువ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం గత 13 నెలలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా, వారిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగితే, పోలీసులతో వారిని అరెస్ట్ చేయించి, టెంపో వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలించడం ద్వారా ప్రభుత్వం తన కర్కశత్వాన్ని చాటుకుందని ధ్వజమెత్తారు. ఇంకా వారేమన్నారంటే..విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని ఎన్ఎంసీ పరీక్ష క్వాలిఫై అయిన వారికి నిబంధనల ప్రకారం ఏడాది పాటు ఇంటర్న్షిప్ నిర్వహిస్తారు. అనంతరం వారికి రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 13 నెలల నుంచి విద్యార్ధులు పీఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా, వారి గోడు వినేవారే లేరు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రిని కలిసిన యువ వైద్యులపై ఆయన కనీసం సానుభూతి కూడా చూపకుండా, బెదిరింపు ధోరణితో మాట్లాడారు.ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ను కలిసి మొరపెట్టుకుంటే, వీరికి సంబంధించిన ఫైల్పై ఆయన సంతకం పెట్టారు. కానీ విజయవాడ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాత్రం ఈ ఫైల్పై కొర్రీలు వేస్తున్నారు. ఎన్ఎంసీ నుంచి క్లారిటీ ఉంటేనే పీఆర్ ఇస్తానంటూ, రెండేళ్ళ పాటు ఇంటర్న్షిప్ చేస్తేనే పీఆర్ ఇస్తామంటూ రకరకాలుగా సాకులు చూపుతూ అభ్యర్ధులను వేధిస్తున్నారు. వీరితో పాటు క్వాలిఫై అయిన వారందరూ వివిధ రాష్ట్రాల ఆయా ప్రభుత్వాల నుంచి పీఆర్ సర్టిఫికేట్లు పొందారు.కానీ ఏపీలో మాత్రమే యువ వైద్యుల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. దీనిపై హెల్ట్ యూనివర్సిటీ ఎదుట యువ వైద్యులు ఆందోళన చేస్తే, రాత్రి సమయంలో టెంపో వ్యాన్లలో వారిని బలవంతంగా ఎక్కించి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. డాక్టర్స్ డే రోజునే వైద్య విద్యార్ధుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది.రాష్ట్రంలో రూ.8500 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు సీట్లు కేటాయిస్తామని కేంద్రం ముందుకు వస్తే, సీఎం చంద్రబాబు దానికి మోకాలడ్డారు. తమకు సీట్లు అక్కరలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరో వైపు ఇప్పటికే పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.విదేశాల్లో చదువుకుని, ప్రాక్టీస్కు అన్ని అర్హతలు సాధించుకున్న యువ వైద్యుల పట్ల కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఏం అనాలో కూడా అర్థం కావడం లేదు. తక్షణం యువ వైద్యులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం తరుఫున ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. -
శ్రీవాణి ఆత్మహత్యకు ఫొటోనే కారణమా..
పరకాల: ఓ పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్పేట శివారులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సోమవారం జరిగింది. పరకాలకు చెందిన ఏకు ఈశ్వర్–నీల కుమార్తె శ్రీవాణి ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం బాత్రూమ్కు వెళ్లింది. చాలాసేపటి వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు ప్రిన్సిపాల్ కృష్ణకుమారికి తెలిపారు. ఆమె వచ్చి బాత్రూం డోర్ను బలవంతంగా తీయడంతో శ్రీవాణి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. శ్రీవాణి బాత్రూంలో జారిపడిందని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు భోరుమని విలపించారు. తమ కుమార్తె చావుకు కారణం తెలపాలంటూ రెసిడెన్షియల్ ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ కృష్ణకుమారి, హౌజ్మాస్టర్ మీరాబాయి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు ఫొటోనే కారణమా.. వారం క్రితమే రెసిడెన్షియల్లో చేరిన శ్రీవాణి వద్ద ఓ ఫొటోను చూసిన హౌస్ టీచర్ బలవంతంగా లాక్కున్నట్లు తెలిసింది. తర్వాత విద్యార్థిని సదరు టీచర్ తాళం చెవి కనుక్కొని లాకర్ ఓపెన్ చేసి ఫొటో తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా.. విద్యార్థినుల సమక్షంలోనే శ్రీవాణిని నోటికి వచి్చనట్లు తిట్టి.. చావచ్చు కదా అన్నట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్రిన్సిపాల్ ఆటోలో విద్యారి్థని మృతదేహాన్ని తరలించడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని పరకాల పోలీస్స్టేషన్కు తరలించినట్లు సమాచారం. -
గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో విచిత్ర ఘటన
-
అమ్మ చనిపోదాం అంటోంది.. ఆదుకోండి మేడమ్
ప్రాంతం: గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని శంకరన్ భవన్సందర్భం: ప్రజా ఫిర్యాదుల వేదిక (గ్రీవెన్స్సెల్)లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) :కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించిన వేదిక కావడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టేందుకు బారులు తీరారు. ఇంతలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు స్కూల్ బ్యాగ్తో అక్కడికి వచ్చాడు. ఆ బుడతడి మోములో ఏదో తెలియని అమాయకత్వం. తన చిట్టి చేతుల్లో ఏదో రాసుకున్న వినతిపత్రం కనిపించింది. దీన్ని గమనించిన పాత్రికేయులు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వద్దకు తీసుకువెళ్లారు. అలా కలెక్టర్ను కలిసిన ఆ బాలుడు ఓ వినతి పత్రం అందించి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే...హృద్రోగంతో బాలుడు.. ఉపాధికి దూరమైన కుటుంబంగుంటూరు నగరంలోని వెంకటరావుపేటకు చెందిన అలవాల రాధిక, భర్త రామ సుబ్బారెడ్డి దంపతుల కుమారుడు యశ్వంత్. నగరంలో ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. యశ్వంత్ పుట్టుకతో హృద్రోగ బాధితుడు. వైద్యులను సంప్రదించగా 16 ఏళ్లు నిండాకనే ఆపరేషన్ చేస్తామని, అప్పటి వరకు మందులు వాడాల్సిందిగా సూచించారు. దీనికితోడు కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కుటుంబం గడవడం కష్టతరంగా మారింది. దీంతో గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి అత్యవసర విభాగం గేటు బయట భాగంలో టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.రోడ్డు విస్తరణలో భాగంగా ఆ బండిని తీసెయ్యాల్సి వచ్చింది. దీంతో ఆ కుటుంబానికి ఉపాధి దూరమైంది. ఈ పరిణామం తల్లి రాధికను తీవ్రంగా బాధించింది. ఓ వైపు కన్నకొడుకు అనారోగ్యం, మరోవైపు ఉపాధి కోల్పోవడంతో మానసికంగా కలత చెందింది. మనం చనిపోదాం..ఇన్ని కష్టాలతో బతకలేమంటూ యశ్వంత్ ఎదుట పదేపదే అనడంతో ఆ బాలుడికి ఏం చేయాలో తోచలేదు. చివరికి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వద్దకు వెళ్ళి వినతి పత్రం అందజేసి తన గోడును విన్నవించుకున్నాడు. కలెక్టర్ చొరవ..కుటుంబానికి తోవ కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ స్పందించారు. గుంటూరు జీజీహెచ్ ఎదుట టిఫిన్ బండి నడిపేందుకు స్థలం చూపించారు. -
Kolkata: లా విద్యార్థిని అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్
కోల్కతా: సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ లా ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ దారుణంలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. విద్యార్థినిపై దారుణం జరిగిన తర్వాత కూడా ఆమెను వేధించిన కాలేజీ క్యాంపస్ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. కోల్కతాలోని కస్బా ప్రాంత న్యాయ కళాశాలలో జూన్ 25న రాత్రి మొదటి సంవత్సరం లా చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్లోనే అత్యాచారం జరిగింది. జూలై 16న జరగనున్న సెమిస్టర్ పరీక్షల కోసం పరీక్షా ఫారాలను పూర్తి చేసేందుకు బుధవారం కాలేజీ క్యాంపస్కు వచ్చింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు.నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. -
గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి
గుండెపోటుతో 3వ తరగతి బాలుడు మృత్యువాత, తరగతిలో ఆరో తరగతి బాలిక హఠాన్మరణం.. ఇలాంటి బాధాకర ఘటనలు కొన్నేళ్లుగా అధికమయ్యాయి. నూరేళ్ల జీవితం కళ్లముందే ఆవిరైతే కన్నవారి ఆవేదన మిన్నంటుంతోంది. ఈ కడుపు కోతకు పరిష్కారమే లేదా అని ఘోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులు కొన్ని పరిశోధనలు చేసి మొబైల్ఫోన్తో పాటు మరికొన్ని లింకులు ఉన్నట్లు తేల్చారు. కర్ణాటక: హాసన్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థిని గుండెపోటుతో అర్ధాంతరంగా కన్నుమూసింది. బెంగళూరులో నివాసం ఉంటున్న సుప్రియా (22) గుండెపోటు రావడంతో క్షణాల్లో ప్రాణాలు విడిచింది. దీంతో గత నెలరోజుల్లో గుండెపోటుతో చనిపోయిన హాసన్వాసుల సంఖ్య 14కు పెరిగింది. సుప్రియా హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా కట్టళ్లి వాసి, బెంగళూరు బ్యాటరాయనపురలో నివాసం ఉంటూ కర్ణాటక ఓపెన్ వర్శిటీలో డిగ్రీ చదువుతోంది. బుధవారం ఇంటిలో ఉండగా హఠాత్తుగా కుప్పకూలింది. కుటుంబీకులు ఆస్పత్రి తరలిస్తుండగా దారిలో మరణించింది. -
అర్థించినా ఆలకించని పవన్
సాక్షి, రాజమహేంద్రవరం : ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ పలు సందర్భాల్లో ఉపన్యాసాలు ఇచి్చన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ‘తమ ఆడబిడ్డకు ఇంకా న్యాయం జరగలేదన్నా.. న్యాయం చేయండి’ అని అభ్యర్థించినా పట్టించుకోకుండా వెళ్లిపోయిన ఘటన రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద గురువారం చోటుచేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికికి చెందిన ఓ టెన్త్ విద్యార్థిని ఆర్నెల్ల క్రితం ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలేమిటో నిగ్గుతేల్చాలని కుటుంబ సభ్యులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో మూడునెలల క్రితం రాజమహేంద్రవరం వచ్చిన పవన్కళ్యాణ్కు బాధితులు ఎయిర్పోర్టు వద్ద కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిoచారు. అయినా ఇప్పటివరకూ న్యాయం జరగకపోవడంతో గురువారం అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు వచ్చారు. ‘ఇంకా న్యాయం జరగలేదన్నా..’ అంటూ ఫ్లెక్సీ చూపిస్తూ నిరసన తెలిపారు. కొద్దిసేపు అక్కడే ఉన్నా వారిని పవన్ గమనించలేదు. దీంతో పోలీసులు పవన్ను కలిసే ఏర్పాటుచేస్తామని వారిని వేదిక వద్దకు తీసుకెళ్లారు. పవన్ ప్రసంగం అయిన వెంటనే మాట్లాడిస్తామని చెప్పడంతో వారు ఫ్లెక్సీ కిందకు దింపేశారు. కానీ, సభ పూర్తయిన వెంటనే పవన్ వారితో మాట్లాడకుండానే వెళ్లిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక బాధితులు వెనుదిరిగారు. జనసేన కార్యకర్తల వీరంగం.. సభలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పవన్కళ్యాణ్ ప్రసంగిస్తుండగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారి చిందులకు సభలోని కుర్చీలు విరిగిపోయాయి. ‘ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్’..!సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రసంగంలో ‘రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్’ అని పలికారు. దీంతో జనసేన కార్యకర్తలు అరవడం ప్రారంభించారు. పక్కనున్న వ్యక్తి డిప్యూటీ సీఎం అని చెప్పడంతో.. తిరిగి డిప్యూటీ సీఎం అని పురందేశ్వరి అన్నారు. -
దళిత విద్యార్థులకు కూటమి సర్కార్ అన్యాయం
-
విద్యార్థులతో గుంజిళ్లు.. టీచర్కు సర్కార్ నోటీసు
తిరువనంతపురం: విద్యార్థినుల చేత గుంజిళ్లు తీయించినందుకు ప్రభుత్వం ఉపాధ్యాయురాలికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన కేరళలోని కాటన్హిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. పాఠశాల ముగిసిన అనంతరం జాతీయ గీతం ఆలపిస్తారు. కార్యక్రమం జరుగుతుండగానే కొందరు విద్యార్థినులు తరగతి గదినుంచి బయటికి వెళ్లిపోయారు. అది చూసిన టీచర్ వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. జాతీయగీతం పాడుతుండగా వెళ్లిపోయిన విద్యార్థినులను గుంజిళ్లు తీయించారు. దీంతో ఆయా విద్యార్థినులు స్కూల్ బస్సును మిస్సయ్యారు. తమ పిల్లలు రోజూకంటే ఆలస్యంగా ఇంటికి రావడంతో వారిని ప్రశ్నించిన తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఇది విద్యాశాఖ దృష్టికి వెళ్లడంతో ఎలాంటి వివరణ లేకుండానే విద్యాశాఖ మంత్రి శివన్కుట్టి ఆదివారం ఉపాద్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే.. జిల్లా విద్యాశాఖాధికారి నివేదిక మేరకు.. నోటీసులు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. -
రేపటి వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం వాయిదా
సాక్షి, అమరావతి: అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంలో దాదాపు 241 మంది మరణించిన నేపథ్యంలో.. ఆ ఘటనకు, మృతులకు సంతాప సూచకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం (జూన్ 13వ తేదీ) తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశారు.టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు.. ఉద్యోగాల కల్పన లేదా నిరుద్యోగ భృతి చెల్లింపు వెంటనే అమలు చేయాలని, అలాగే విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాయి.కాగా, అహ్మదాబాద్లో దారుణ విమాన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. -
నిరుద్యోగులకు బాబు వెన్నుపోటు.. ఎల్లుండి వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: ఎల్లుండి(జూన్ 13) వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు వైఎస్సార్సీపీ నిరసన చేపట్టనుంది. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్ణయించాయి.ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్.. అంటూ ఊదర గొట్టి తీరా అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించని పక్షంలో ప్రతినెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీపై పాలకులు మాట్లాడకపోవడంపై నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు.మరో వైపు, చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. -
పల్లె నుంచి.. యునైటెడ్ కింగ్డమ్కు పూర్ణిమ
కడప సెవెన్రోడ్స్ : నగరానికి చెందిన విద్యార్థిని యూకూలో సీటు సాధించి భళా అనిపించింది. కడప నగరానికి చెందిన పూర్ణిమ నిమ్మకాయల యునైటెడ్ కింగ్ డమ్లోని ప్రపంచ ప్రఖ్యాత ఎడెన్బర్గ్ యూనివర్సిటీలో సీటు సాధించి అందరినీ అబ్బుర పరిచారు. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె గ్రామానికి చెందిన రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రవిశంకర్ రెడ్డి, కె.అనితల కుమార్తె పూర్ణిమ ఒకటో తరగతి నుంచి 3వ తరగతి వరకు కడప వికాస్ హైసూ్కల్, 4 నుంచి 10వ తరగతి వరకు కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇంటర్మీడియేట్ హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాదు పబ్లిక్ స్కూల్లోనూ చదివారు. ఆ తర్వాత పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో బీఎస్సీ(ఆనర్స్) చేశారు. అనంతరం యునైటెడ్ కింగ్డమ్లోని ఎడెన్బర్గ్ యూనివర్శిటీలో ఎంఎస్ మేథమ్యాటికల్ ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్కు దరఖాస్తు చేశారు. ఎడెన్బర్గ్ యూనివర్శిటీ యాజమాన్యం ఈ మేరకు ఆమెకు ఐడీ నెంబరు 2858866కు జారీ చేసి జులై 28న అడ్మిషన్ పొందాలని సమాచారం పంపింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025లో ఎడెన్బర్గ్ వర్శిటీ 27వ స్థానంలో ఉంది.చార్లెస్ డార్విన్, అలెగ్జాండర్ గ్రహంబెల్, ప్రఫుల్ల చంద్రరే, ప్రకాశ్ కారత్, ఓలివర్ గోల్డ్స్మిత్, డేవిడ్ హ్యూమ్, వాల్టర్ స్కాట్ తదితర వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు ఈ యూనివర్శిటీలో చదివారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఐఈఎల్టీఎస్లో 8 పాయింట్లు సాధించి ప్రతిష్ఠాత్మక ఎడెన్బర్గ్ వర్శిటీలో పూర్ణిమ సీటు సాధించారు. అంతేగాక యూకేలోని బ్రిష్టల్ యూనివర్శిటీలోనూ ఎంఎస్లో ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ మేథమ్యాటిక్స్లోనూ, లండన్లోని కింగ్స్ కాలేజీలో ఫైనాన్షియల్ మేథమ్యాటిక్స్ అండ్ మేథమ్యాటిక్స్ ప్రవేశానికి కూడా పూరి్ణమ అర్హత సాధించారు. ఈ ఘనత సాధించిన ఆమెను పలువురు అభినందించారు. -
స్కూల్లో ఘోరం.. తోటి విద్యార్థులపై కాల్పులు, 11 మంది మృతి
గ్రాజ్: ఆస్ట్రియా దేశం గ్రాజ్ నగరంలో ఘోరం జరిగింది. బోర్గ్ డ్రైయర్షుట్సెన్గాసే హై స్కూల్లో ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దారుణంలో 11 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రాజ్ నగరం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నిందితుడు గన్నుతో కాల్పులు జరిపినట్లు తమకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. అయితే, కాల్పుల అనంతరం విద్యార్థి తనని తాను గన్నుతో కాల్చుకొని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాడి తర్వాత, గ్రాజ్ పాఠశాలను ఖాళీ చేయించారు. విద్యార్థులను సమీపంలోని హెల్మట్ లిస్ట్ హాల్కు తరలించారు.అక్కడ వారికి రెడ్క్రాస్ చికిత్స అందించింది. ఘటనపై అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పుల శబ్ధం విన్న వెంటనే పోలీసులు స్థానికుల్ని అప్రమత్తం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంత ప్రజలు బహిరంగంగా తిరగకూడదని, ఇళ్లలోనే ఉండాలని సూచించారు. 🚨🇦🇹 MULTIPLE DEAD IN AUSTRIAN SCHOOL SHOOTINGA shooting at BORG Dreierschützengasse school in Graz, Austria, has left at several dead, including students and teachers, with many injured.Local media reported at least 8 dead, but authorities have not released the official… pic.twitter.com/7Lqy7GjcAu— Mario Nawfal (@MarioNawfal) June 10, 2025 -
న్యూజెర్సీ నెవార్క్ ఎయిర్ పోర్ట్ లో ఘటన
-
ఉమెన్ సేఫ్టీ: ఆపదలో అండగా..!
బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మైసూర్కు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కరణ్ సరికొత్త పరికరాన్ని తయారుచేశాడు. ఐజీడబ్ల్యూఎస్(ఇన్నోవేటివ్ ఇంటెలిజెంట్ జీయోఫెన్స్–ఎనేబుల్డ్ వేరుబుల్స్ సిస్టమ్స్) అనే పరికరం మహిళలు ఆపదలో ఉంటే వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ను ఎలార్ట్ చేస్తుంది.‘డివైజ్లోని ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి...జియోఫెన్స్–బేస్డ్ డిటెక్టర్. ఒక మహిళని ఎవరైనా మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాలో అవుతున్నప్పుడు ఈ డివైజ్ సందేహాస్పద వ్యక్తి మొబైల్ ఫోన్ను గాని, బ్లూటూత్ డివైజ్ అడ్రస్ గుర్తించడానికి ఉపయోగపడుతుంది’ అంటున్నాడు కరణ్.ఈ డివైజ్లో జియోఫెన్స్–బేస్డ్ సేఫ్టీ టైమర్ కూడా ఉంటుంది. యూజర్ ఒక డెస్టినేషన్ చేరుకోవడానికి టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి షాపింగ్కు వెళ్తూ 30 నిమిషాలలో ఇంటికి వస్తానని చెబితే సిస్టమ్ ఆమె జియోలోకేషన్ని మానిటర్ చేస్తుంది. సెట్ చేసిన టైమ్ లోపు ఇంటి జియోఫెన్స్లోకి రాకపోతే డివైజ్ ఆటోమెటిక్గా ఆమె లోకేషన్ని ఎమర్జెనీ కాంటాక్ట్కి పంపిస్తుంది. డివైజ్లో ‘రిటర్న్ హోమ్ సేఫ్టీ రిమైండర్’ కూడా ఉంటుంది. డివైజ్లో మరో సేఫ్టీ ఫీచర్...డేంజర్–జోన్ నోటీఫైయర్. ఇది హై–రిస్క్ జీపీఎస్ లొకేషన్స్ ప్రీలోడెడ్ జాబితాను ఉపయోగిస్తుంది. యూజర్ ఈ ప్రాంతాలలోకి వెళ్లినప్పుడు వేరబుల్ బజర్ యాక్టివేట్ అవుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్కి తెలియజేస్తుంది. (చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..) -
చిన్న వయసు, విష్ణుప్రియ డాక్టర్ ఆశలకు 'ఉరి'
శివమొగ్గ(కర్ణాటక): శివమొగ్గలో ఉన్న సుబ్బయ్య మెడికల్ కళాశాలలో హాస్టల్లో ఓ మెడికో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు విష్ణుప్రియ (22). వివరాలు.. ఈమె కుటుంబం బెంగళూరుకు చెందినది కాగా, జర్మనీలోని బెర్లిన్లో నివసిస్తోంది. విష్ణుప్రియ ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇంటర్న్షిప్ చేస్తోంది. మరికొన్ని రోజుల్లో పూర్తయి డాక్టర్ కానుంది. అయితే ఏమి జరిగిందో మరి.. హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. కారణాలు తెలిసి రాలేదు. డెత్నోట్ ఏదీ దొరకలేదు. శివమొగ్గ గ్రామీణ పోలీసులు ఆమె శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చెల్లెళ్లు ఆటపట్టించడంతో అక్క ఆత్మహత్య
మర్రిపాలెం(విశాఖపట్నం): జ్ఞానాపురం గెడ్డ వీధికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలివి.. కిరణ్మయి (15) తల్లిదండ్రులు, చెల్లెళ్లతో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. అయితే బాలికను చెల్లెళ్లు నిత్యం ఏదో ఒక విషయంపై ఆటపట్టిస్తుండటంతో.. శుక్రవారం ఇంట్లో ఉన్న బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరు. కొంతసేపటికి ఆమె తాత ఇంటికి రావడంతో, అక్క ఎక్కడికో వెళ్లిపోయిందని వారు అతనికి చెప్పారు. అంతా వెతికి, చివరికి బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా, కిరణ్మయి విగతజీవిగా కనిపించింది. వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కాగా బాలిక తండ్రి ఎండాడలో వెల్డింగ్ పనులు చేస్తుండగా, తల్లి గౌరి నగరంలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కొబ్బరి చిప్పలతో వాటర్ బాటిల్స్..!
వ్యర్థానికి కూడా అర్థాలు చెప్పవచ్చంటూ ఓ విద్యార్థి తనదైన శైలిలో కొబ్బరి చిప్పలతో ‘కోకోనట్ షెల్ వాటర్ బాటిల్’ తయారు చేసి తన సత్తాను చాటారు. ఏదైనా వినూత్నంగా వెదురుబొంగు, కొబ్బరి, బనానా ఫైబర్, తాటాకుల సహాయంతో నూతనంగా ప్రజావసరానికి అనుగుణంగా వినియోగించే వాటిని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా కోకోనట్ షెల్తో ఈ వాటర్ బాటిల్ రూపొందించినట్లు విద్యార్థి స్పష్టం చేశారు. రాయదుర్గంలోని ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్–హైదరాబాద్ (ఎఫ్డీడీఐ–హైదరాబాద్) బి.డెస్ (లైఫ్ స్టైల్ అండ్ యాక్సెసరీస్ డిజైన్)ఎల్ఎల్పీడీ విభాగం కోర్సులో మూడో ఏడాది చదివే మత్తగుంజ అనిరుద్ ప్యాకేజ్ డిజైన్ రూపకల్పనలో భాగంగా ఈ వాటర్ బాటిల్ను తయారు చేయడం విశేషం. (చదవండి: ఫ్యాషన్కి సరికొత్త అర్థం..! 'సంస్కృత శ్లోకాల సంస్కృతి'..) -
ఎస్ఎస్సీ బోర్డు ‘ఫెయిల్’
జమ్మలమడుగు : ఫలితాల వెల్లడిలో ఎస్ఎస్సీ బోర్డు ఫెయిలైంది. బోర్డు అధికారుల తప్పిదం వల్ల ఓ విద్యార్థిని నష్టపోయింది. ఆమె భవిత అగమ్యగోచరంగా మారింది. ఏప్రిల్లో వెలువడిన పదో తరగతి ఫలితాల్లో వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన గంగిరెడ్డి మోక్షిత సోషల్లో ఫెయిల్ అయినట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. ఆమె తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లిషులో 84, గణితంలో 93, సైన్స్లో 98 మార్కులు సాధించింది. సోషల్లో మాత్రం 21 మార్కులే వచ్చినట్టు ఎస్ఎస్సీ బోర్డు మార్కుల లిస్టు జారీ చేసింది. దీంతో అనుమానం వచ్చిన మోక్షిత తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వరరెడ్డి వెయ్యి రూపాయలు కట్టి రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేశారు. అధికారులు జవాబుపత్రం రీవాల్యూయేషన్ చేసి 84 మార్కులు సాధించినట్టు ఫలితంతోపాటు జవాబుపత్రం పంపారు. అంటే ఆమెకు ఏకంగా 63 మార్కులు పెరిగాయి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్రిపుల్ ఐటీ, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు గడువు ముగిసిపోయింది. మొత్తం ఆరు సబ్జెక్టుల్లో దీక్షితకు 537 మార్కులు వచ్చాయి. అంటే ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. వాల్యూయేషన్ అధికారుల తప్పిదం వల్ల ఆ అవకాశం తప్పిపోయింది. దీంతో విద్యార్థిని మోక్షిత తీవ్రంగా కలత చెందుతోంది. ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం తండ్రితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ తనకు న్యాయం చేయాలని కోరింది. వాల్యూయేషన్ చేసిన అధికారులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు ఏపీ రెసిడెన్షియల్, గురుకుల, ట్రిపుల్ ఐటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. -
స్నేహ బంధం గెలిచినా.. విషాదం తప్పలేదు
బంధాలన్నీ వేటికవే ప్రత్యేకం. బాల్యం నుంచి మొదలు కడదాకా స్నేహ బంధంలో కలిసి నడిచేవాళ్లు ఎంతో మంది ఉంటారు. కాబట్టి ఆ బంధపు మాధుర్యం గురించి చెప్పుకుంటే పోతే బోలెడన్ని కబుర్లు. అయితే ఇక్కడ తమ మిత్రుడి కోసం ఇప్పటిదాకా ఎవరూ చేయని ప్రయత్నం చేశారు కొందరు విద్యార్థులు. ఈ ప్రయత్నంలో స్నేహ బంధం గెలిచినా.. విషాదం మాత్రం తప్పలేదు.చైనా సిచువాన్ ప్రావిన్స్(Sichuan Province)లోని యిలాంగ్ మిడిల్ స్కూల్ విద్యార్థి రెన్(15). ప్రాణాంతక క్యాన్సర్తో ఏడాది నుంచి చికిత్స తీసుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోయేసరికి.. చివరకు సొంతూరిలోనే ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స కారణంగా అతని ఏడాది చదువు పోయింది. మరో నెలలో ఆ అకడమిక్ ఇయర్ ముగియనుంది. ఈలోపు.. రెన్కు చదువు చెప్పిన టీచర్కు ఓ ఆలోచన వచ్చింది. దానికి అతని క్లాస్మేట్స్, రెన్ తల్లిదండ్రులు అంగీకరించారు.మే 17వ తేదీన.. బడి నుంచి కాలినడకన రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించి రెన్ (Ren) ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆస్పత్రికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి అతనికి యూనిఫాం తొడిగి బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రాంగణంలోనే అంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఆపై అతను త్వరగా కోలుకోవాలంటూ పుష్ఫ గుచ్చాలతో పాటు కానుకలపై సంతకాలు చేసి మరీ అతనికి అందించారు. ఈ చర్యతో నెట్టింట జనం మురిసిపోయారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కానీ, జరిగింది మరొకటి. గ్రూప్ ఫొటో దిగిన కొన్ని గంటలకే(ఆ మరుసటి ఉదయం) రెన్ కన్నుమూసినట్లు అతని తల్లిదండ్రులు ప్రకటించారు. ఈ విషాదాంతం అందరినీ షాక్కు గురి చేసింది. మరో నెలలో అతని 16వ ఏడులోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఈలోపు తుదిశ్వాస విడవడంతో ఆ తల్లిదండ్రులు, అతని స్నేహితులు గుండెలు అవిసేలా రోదించారు. ఈ గ్రాడ్యుయేషన్ ఫొటో(China Graduation Photo).. ప్రపంచంలోని అత్యుత్తమ ఫొటోగా నెట్టింట అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ మధుర క్షణం కోసమే అప్పటిదాకా అతని ఊపిరి ఆగిపోలేదేమోనని కొందరు కామెంట్ చేయగా.. వచ్చే జన్మలోనైనా ఆ చిన్నారి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని మరికొందరు కోరుకుంటూ నివాళులర్పిస్తున్నారు.ఇదీ చదవండి: పాక్.. చివరకు ఇలా కూడా పరువు తీసుకుందా? -
మార్కులు తక్కువొచ్చాయని..
ముస్తాబాద్(సిరిసిల్ల): పాలిసెట్లో ర్యాంక్ రాలేదని మనస్తాపం చెందిన ఒక విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ గణేశ్ తెలిపిన వివరాలివి. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన గూడ స్నేహిత (16) పదో తరగతి ఉత్తీర్ణురాలైంది. శనివారం విడుదలైన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ (పాలిసెట్) ఫలితాల్లో ర్యాంక్ రాలేదని మనోవేదనకు గురైంది. శనివారం ఉదయం స్నేహిత తల్లిదండ్రులు.. బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్లారు. తమ్ముడు, తాతతో కలిసి ఇంట్లోనే ఉన్న స్నేహిత.. సాయంత్రం గదిలోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుంది. గమనించిన తాత, తమ్ముడు గది తలుపులు బద్దలుకొట్టి చూడగా.. అప్పటికే మృతి చెందింది. మృతురాలి తల్లి స్రవంతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
విద్యార్థి ప్యాంట్ జేబులో పేలిన మొబైల్ ఫోన్
సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాలో విద్యార్థి ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ పేలిన ఘటన కలకలం రేపింది. రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ (22) కురబలకోట మండలం అంగళ్లులోని మిట్స్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే తనూజ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయగా.. జేబులో ఉన్న సెల్ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా, విద్యార్థి ప్యాంట్ జేబులో సెల్ ఫోన్ పేలిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ఓవర్ హీట్ కారణంగానే పేలినట్లు భావిస్తున్నారు. బ్యాటరీ డ్యామేజీ కావడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ఓవర్ హీట్ కాకుండా చూసుకోవాలని.. చల్లటి ప్రదేశాల్లో ఉంచాలని సూచిస్తున్నారు. -
బయో మెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి
హైదరాబాద్: హైదరాబాద్లో ఇంటర్న్షిప్ చేసేందుకు జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడి కి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. జార్ఖండ్ కు చెందిన యువతి (20) తమిళనాడులోని కలస లోకేషన్లింగం కాలేజీలో బయో మెడికల్ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో బాచుపల్లి హరితవనం కాలనీకి చెందిన అజయ్ (24) బీటెక్ చదువుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్ప డింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో ఇంటర్న్íÙప్ చేయాలని యువతి నిర్ణయించుకుంది. దీంతో ఈ నెల 3న ఆమె హైదరాబాద్కు రాగా కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఆమెను అజయ్ ఉంచాడు. అదేరోజు సాయంత్రం పార్టీ చేసుకుందామని ఆమెను బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఉన్న తన స్నేహితుడు హరి ఇంటికి తీసుకెళ్లాడు. ముగ్గురు కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించిన అనంతరం అజయ్ యువతిపై లైంగిక దాడి చేశాడు. తర్వాత హరి కూడా యువతిపై లైంగిక దాడి చేయటానికి ప్రయతి్నంచగా యువతి కేకలు వేసింది. దీంతో చుట్టు పక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణæ అనంతరం 4వ తేదీన అజయ్, హరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి సురక్షితంగా స్వస్థలానికి వెళ్లేందుకు సహాయం చేశారు. ఓ బైక్, మద్యం బాటిల్, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. -
నీట్ పరీక్ష రాసింది.. ఇంటికొచ్చి ప్రాణం తీసుకుంది!
జగిత్యాల జిల్లా : జిల్లాలోని చల్ గల్ గ్రామానికి చెందిన జంగా పూజ(18) అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నీట్ పరీక్ష రాసిన ఆమె.. పేపర్ ను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల క్రితం రాసిన నీట్ పరీక్షలో ర్యాంకు రాకపోవడంతో రెండోసారి తాజాగా నీట్ పరీక్ష రాసింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత పేపర్ ను క్రాస్ చెక్ చేసుకుని ర్యాంకు రాదనే ఆందోళనలో పడింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుంది.కాగా, జగిత్యాల జిల్లాలోని రెండు కేంద్రాల్లో నిర్వహించిన నీట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నాచుపల్లి జేఎన్టీయూ కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. అక్కడి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఒక సెంటర్లో 480, రెండో సెంటర్లో 278 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. ఒక కేంద్రంలో 13 మంది, మరో కేంద్రంలో ఐదుగురు గైర్హాజరైనట్లు వివరించారుమూడు నిమిషాల ఆలస్యం.. పరీక్షకు దూరంమల్యాల: జేఎన్టీయూ పరీక్ష కేంద్రం తెలియక మూడు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న ఓ విద్యార్థిని పరీక్ష దూరమైంది. మల్లాపూర్ మండలం వీవీ.రావుపేటకు చెందిన సీహెచ్.నవ్యకు జేఎన్టీయూ కేంద్రం పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరింది. ఇంజినీరింగ్ కళాశాల అడ్రస్పై అవగాహన లేక దిగువ కొండగట్టు వరకు వెళ్లారు. పూర్తి అడ్రస్ తెలుసుకుని వెళ్లే సరికి మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో అక్కడున్న సిబ్బంది లోపలికి అనుమతించలేదు. గతంలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా.. ఆశించిన ఫలితం రాలేదని, మరోసారి పరీక్షకు సన్నద్ధమైన రాయలేకపోయాయని ఆవేదనతో తిరిగి వెళ్లిపోయింది.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
విద్యా రుణం.. నిబంధనలు శరాఘాతం
విద్యా రుణం (ఎడ్యుకేషన్ లోన్).. ఉన్నత విద్య చదవాలన్న ఆసక్తి ఉన్నా, స్తోమత లేని వారి పాలిట వరం. విదేశీ విద్యకు, ఆయా కోర్సులకు ఉండే రూ. లక్షల్లో ఫీజులు సొంతంగా చెల్లించలేని పరిస్థితుల్లో విద్యా రుణానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ రుణం మంజూరు అయితే తమ కలల చదువు పూర్తి చేసుకుని.. లక్షల్లో జీతాలొచ్చే ఉద్యోగాల్లో స్థిరపడవచ్చని, లేదంటే సొంతంగా స్టార్టప్స్ వంటివి ప్రారంభించవచ్చనే ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. కానీ.. ఈ ఆలోచనలకు, ఆశలకు భిన్నంగా బ్యాంకుల నిబంధనలు విద్యార్థులకు శరాఘాతంగా మారుతున్నాయి. విద్యారుణాల (Education Loan) మంజూరులో బ్యాంకులు పాటిస్తున్న నిబంధనలు విద్యార్థులను డిఫాల్టర్స్ (ఎగవేతదారుల) జాబితాలో చేరే పరిస్థితికి కారణమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. రుణ దరఖాస్తుకు కో– అప్లికెంట్ (సహ దరఖాస్తుదారు)గా తమ తల్లిదండ్రులను లేదా సంరక్షకులను పేర్కొనడమే. – సాక్షి, స్పెషల్ డెస్క్‘డిఫాల్టర్స్’ సమస్య సాధారణంగా విద్యార్థులకు సొంత ఆదాయ వనరులు ఉండవు. ఈ క్రమంలో విద్యా రుణ దరఖాస్తు సమయంలో తల్లిదండ్రులను కో అప్లికెంట్స్గా పేర్కొంటున్నారు. కానీ తల్లిదండ్రులు అప్పటికే ఏదైనా వ్యక్తిగత రుణం, ఇతర రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారితోపాటు, విద్యార్థులను కూడా డిఫాల్టర్స్ జాబితాలో చూపించేలా బ్యాంకులు వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో విడతల వారీగా మంజూరు చేసే రుణ మొత్తాన్ని కూడా నిలిపివేస్తున్నాయి బ్యాంకులు. ఈ సమస్యను పలు బ్యాంకులు కొద్ది రోజుల కిందట రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. సహ రుణగ్రహీతగా పేరెంట్ లేదా గార్డియన్ ప్రస్తుతం అమల్లో ఉన్న మోడల్ ఎడ్యుకేషన్ లోన్ పథకం ప్రకారం.. రూ.7.5 లక్షల రుణం వరకు ఎలాంటి హామీ లేదా థర్డ్ పార్టీ గ్యారెంటీ అక్కర్లేదు. ఈ సందర్భంలో పేరెంట్ లేదా గార్డియన్ను సహ రుణ గ్రహీతగా పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో రుణాలు మంజూరు చేసే ముందు.. బ్యాంకులు సహ రుణ గ్రహీతలు ఇతర లోన్స్ చెల్లింపులో విఫలమైతే.. ఆ కారణంగా విద్యార్థుల రుణ దరఖాస్తులను పక్కన పెట్టేస్తున్నాయి. ఒకవేళ విద్యా రుణం మంజూరు అయ్యాక పేరెంట్స్ వాటిని తిరిగి చెల్లించలేకపోతే విద్యార్థులనూ రుణ ఎగవేతదారులుగా పేర్కొంటున్న పరిస్థితి. ఇది భవిష్యత్తు రుణ దరఖాస్తుల ఆమోదంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్బీఐ నిబంధనలు కూడా.. ఆర్బీఐ ప్రస్తుత నిబంధనల ప్రకారం రుణాలను లోన్ అకౌంట్ ప్రాతిపదికగా కాకుండా వ్యక్తుల ప్రాతిపదికగా మంజూరు చేస్తున్నారు. దీంతో ఒక వ్యక్తి ఏదైనా ఒక లోన్ చెల్లింపులో విఫలమైతే ఇతర లోన్ అకౌంట్లను కూడా నిరర్థక ఆస్తుల జాబితాలో చేర్చుతున్నారు. అయితే ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, ఆర్బీఐ ఈ విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వాలని బ్యాంకింగ్ వర్గాలు కోరుతున్నాయి. కానీ, ఆర్బీఐ నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. ఎన్బీఎఫ్సీల్లో విద్యా రుణాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు విద్యా రుణాల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయడంతో దరఖాస్తుల మంజూరు సంఖ్య తక్కువగా ఉంది. కానీ ఉన్న నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో (ఎన్బీఎఫ్సీ) మాత్రం విదేశీ విద్యా రుణాల్లో రుణాల మంజూరు గత అయిదేళ్లలో దాదాపు నూరు శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. అంతేకాదు, రూ.15 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఈ రుణాలు మంజూరయ్యాయి. ‘పీఎం విద్యాలక్ష్మి’ఆశలు నిరాశేనా? దేశంలో ప్రతిభావంతులైన యువత ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్రం గత ఏడాది పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ పేరిట విద్యారుణ పథకం ప్రవేశ పెట్టింది. 2024–25 నుంచి 2030–31 వరకు అమలు చేసే ఈ పథకం ద్వారా ఏటా 22 లక్షల మందికి ప్రయోజనం కల్పించాలన్నది లక్ష్యం. ఇందుకోసం రూ. 3,600 కోట్లు కేటాయించారు. రూ. 7.5 లక్షల వరకు రుణ మొత్తంలో 75 శాతం మొత్తానికి కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుందని గత ఏడాది బడ్జెట్లో పేర్కొన్నారు.కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండి, ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్స్, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలు పొందని విద్యార్థుల విషయంలో లోన్రీ పేమెంట్ మారటోరియం సమయంలో మూడు శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. గరిష్టంగా రూ. 10 లక్షల రుణం వరకు ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 2024 నాటికి 11.26 లక్షల క్రెడిట్ గ్యారెంటీలను అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు 50,800 అకౌంట్లను నిర్థరక ఆస్తులుగా గుర్తించారు. బ్యాంకుల నిబంధనలతో ‘పీఎం విద్యా లక్ష్మి’ద్వారా రుణం కూడా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగానేవిద్యా రుణాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రా ష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వస్తున్నాయని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు రిటైల్ అసెట్ విభాగం జనరల్ మేనేజర్ సాక్షికి తెలిపారు. మొత్తం రుణ దరఖాస్తుల్లో దాదాపు 40 శాతం వరకు మనవాళ్లవే ఉంటున్నాయని.. దరఖాస్తుదారుల్లో 50 శాతం మేర రుణాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. పోర్టల్లోనూ సమస్యలు ⇒ విద్యాలక్ష్మి పోర్టల్ పనితీరుపైనా విద్యార్థులు, తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. ఈ వెబ్సైట్లో లాగిన్ సమస్యలు, బ్యాంకులతో అనుసంధానమయ్యే సాంకేతిక ప్రక్రియలో ఇబ్బందులు, ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేస్తున్న సమయంలో సర్వర్ డౌన్ అవడం వంటి కారణాలతో దరఖాస్తుల సంఖ్య, మంజూరు సంఖ్య మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటోంది. ⇒ 2025 ఏప్రిల్ నెల గణాంకాలను పరిశీలిస్తే.. ఎస్బీఐకి 1,125 దరఖాస్తులకు గాను 20 దరఖాస్తులకు; కెనరా బ్యాంకులో 483కు గాను 24కి; బ్యాంక్ ఆఫ్ బరోడాలో 342కు గాను 19 దరఖాస్తులకు; పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 304కుగాను 28కి; యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 212 దరఖాస్తులకుగాను 16 దరఖాస్తులకే రుణాలు మంజూరు అయ్యాయి. ⇒ మొత్తమ్మీద.. విద్యా రుణాల మంజూరు విషయంలో తల్లిదండ్రుల వ్యక్తిగత ఆర్థిక స్థోమత నుంచి ఇతర సాంకేతిక అంశాల వరకు పలు అంశాల్లో నిబంధనలను సరళీకృతం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
లండన్ లో తప్పిపోయిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి
లండన్ లో తప్పిపోయిన తన కుమారుడు నల్ల అనురాగ్ రెడ్డి జాడ వెతికి తెలుసుకుని ఇండియాకు వాపస్ తెప్పించాలని విద్యార్థి తల్లి హరిత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి సోమవారం వినతిపత్రం పంపారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన అనురాగ్ విద్యార్థి వీసాపై జనవరిలో లండన్ కు వెళ్ళాడు. యూకే లోని కార్డిఫ్ ప్రాంతంలో ఈనెల 25న సాయంత్రం నుంచి తన కుమారుడు జాడ తెలియకుండా పోయాడని హరిత తన వినతిపత్రం లో తెలిపారు. వెంటనే స్పందించిన ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ), జిఎడి ఎన్నారై అధికారులతో మాట్లాడారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్ లోని ఇండియన్ హై కమీషన్ కు లేఖలు రాశారు. -
నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని..
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలోని నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తన ఆత్మహత్యకు ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని సూసైడ్ లెటర్లో రాసుకొచ్చాడు. ఈ విషాదకర ఘటన ఘట్కేసర్లోని నారాయణ క్యాంపస్లో చోటుచేసుకుంది. విద్యార్థి ఆత్మహత్యపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
నువ్వన్నదే కరెక్ట్ నాన్నా.. మార్కులకన్నా లక్ష్యం మిన్న
స్వీటీ ఎక్కడుంది.. మంచి మార్కులతో టెన్త్ పాస్ అయింది కదా.. ఇదిగో తనకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాను.. వెళ్ళి ఇవ్వు.. అసలు ఇంతకూ తను ఎక్కడుంది.. ఆఫీసునుంచి వస్తూనే భార్య పావనిని అడిగాడు అడిగాడు శేఖర్ .. ఆ..అయింది..కానీ దానికి మార్కులు సరిపోవట.. దాని అంచనాకు సరిపడా రాలేదని ఏడుస్తూ బెడ్ రూములో కూర్చుంది.. ఎంత చెప్పినా వినదాయే మీరే వెళ్ళి దాన్ని బుజ్జగించండి అంటూ వంటింట్లోంచి చెప్పింది పావని..ఓహ్.. అలాగా అనుకుంటూ చిన్నారి స్వీటీ.. ఏం చేస్తున్నావ్.. మంచి మార్క్స్ వచ్చాయి కదా మరి నీ సేవింగ్స్తో నాకు పార్టీ ఇస్తాను అన్నావు మరి రెడీనా అన్నాడు శేఖర్..ఆ మీరు నన్ను వెక్కిరిస్తున్నారు.. నేను అనుకున్నట్లు స్కోర్ రాలేదు..నేను పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాను.. ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ ఎర్రని బుగ్గలు కందిపోయేలా తుడుచుకుంటూ కన్నీళ్ళు కారుస్తోంది స్వీటీ.. అదేంటి తల్లీ నైన్టీ పర్సెంటేజీ వచ్చింది..అంటే డిస్టింక్షన్ వచ్చినట్లే..ఇంకెందుకు బాధ..అంతకన్నా పైన క్లాస్ లేదుగా నువ్వు మంచిగా పెర్ఫార్మ్ చేశావు తల్లి.. ఆమాత్రం చాలు.. డోంట్ వర్రీ అంటూ తలనిమిరాడు.. లేదు నాన్నా నాకు అవమానంగా ఉంది..నా క్లాస్మేట్స్ అందరికీ నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి.. ఇది నాకు చాలా ఇన్స్టాలింగ్ ..రేపు నేను వాళ్లకు ఎలా మొహం చూపాలి..ఇక బతకడమే వేస్ట్ అనేసింది స్వీటీ..బతకడమే వేస్ట్ అన్న మాట విన్నాక శేఖర్ తుళ్ళిపడ్డాడు..అదేంటి అమాయకంగా ఉండే స్వీటీ ఇంత ఫోర్స్ గా మాట్లాడింది అనుకుంటూ..అదేం లేదు నాన్నా..నేను చెబుతాగా అంటూ దగ్గరకు తీసుకున్నాడు. ఆ చెప్పు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ .. పావనీ ఆ సూట్కేసులోంచి నా బ్లూ ఫైల్ పట్రా అని కేకేశాడు.. తెస్తున్నా అంటూ ఈ తండ్రికూతుల్లకు సేవలోనే నా బతుకు తెల్లారిపోతోంది అనుకుంటూనే ఫైల్ తెచ్చి ఇచ్చింది.కూతురికి ఇచ్చి దాన్ని ఓపెన్ చెయ్యి అన్నాడు శేఖర్. ఓపెన్ చేశాక ఇదేంటి నాన్నా బాగా నలిగిపోయి ఉంది అంది స్వీటీ.. అది నా టెన్త్ మార్కుల లిస్ట్..చూడు అన్నాడు .. చూసింది.. బొటాబొటి 38 మార్కులతో అన్నీ పాసైనట్లు ఉంది. చివర్న పాస్డ్ ఇన్ ఆర్డినరీ క్లాస్ అని ఉంది. అది చూసి నాన్నా మీరు జస్ట్ పాస్..థర్డ్ క్లాసులో పాసయ్యారా అని అబ్బురంగా.. అవునమ్మా అన్నాడు శేఖర్.. నెక్స్ట్ చూడు అన్నాడు.. అందులో ఇంటర్ మార్క్స్ ఉన్నాయి.. అందులో 52 శాతం మార్క్స్.. అంటే సెకండ్ క్లాస్ వచ్చింది.. నాన్నా ఈసారి ఈ ప్రోగ్రెస్ పెరిగింది సుమీ అంది కూతురు మెచ్చుకోలుగా .. తరువాత చూడు అన్నాడు.. అందులో బీకాం..ఫస్ట్ క్లాస్ అని ఉంది.. నాన్నా ఈసారి మరింత మెరిట్ వచ్చింది అంది స్వీటీ.. అవునమ్మా అన్నాడు శేఖర్..చూసావా బుజ్జి నేను థర్డ్ క్లాసులో పాసైనా నేను నీలాగా అవమానం అనుకోలేదు.. బతకడం వేస్ట్ అనుకోలేదు.. ఇంకా బాగా కష్టపడ్డాను..ఇంటర్లో సెకండ్ క్లాసు..డిగ్రీలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాను. బ్యాంక్ పరీక్షలు రాసి ఆఫీసర్ అయ్యాను... నాకన్నా అప్పట్లో టెన్త్ ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మురళి అంకుల్ మా బ్రాంచిలోనే క్లర్క్ గా చేస్తున్నారు ..దీన్ని బట్టి నీకేం అర్థమైంది చెప్పు తల్లీ అన్నాడు.. ఆలోచించింది స్వీటీ.. మార్కులు ముఖ్యం కాదు.. కష్టపడి చదవాలి.. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు వెళ్తే నీలాగే మంచి పొజిషన్ కు చేరుకోవచ్చు.. అంది కాస్త స్థిమిత పడుతూ.. మరి ఇప్పుడేం చేద్దాం అంటావ్..అన్నాడు శేఖర్.. నువ్వు అన్నట్లుగానే నా పాకెట్ మనీతో నీకు, అమ్మకు మంచి పార్టీ ఇస్తాను..ఇంటర్లో ఇంకా బాగా చదివి మంచి సీట్ కొడతాను..సరేనా అంది స్వీటీ కాన్ఫిడెంట్ గా.. ఎస్..అదీ లెక్క.. ఆ స్పిరిట్ ఉండాలి.. పదా మరి పార్టీ చేసుకుందాం అంటూ కూతుర్ని..భార్యను తీసుకుని బయటకు బయల్దేరాడు..::సిమ్మాదిరప్పన్న -
ఫోన్ కోసం టీచర్ ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్!
-
తిరగబడ్డ విద్యార్థి లోకం
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: కూటమి ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు సోమవారం కదంతొక్కారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ర్యాలీ నిర్వహించారు. పోలీసులు రోడ్లపై ఎక్కడికక్కడ నిర్బంధించే ప్రయత్నం చేయగా.. విద్యార్థులు వాటిని దాటుకొని ముందుకు కదిలారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని చెప్పినప్పటికీ.. విద్యార్థులు, నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వారిని పోలీసులు ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థులు అక్కడ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వినతిపత్రం ఇచ్చేందుకు సైతం విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఓ విద్యార్థి చేతిని గేటు మధ్యలో పెట్టి లోపల ఉన్న పోలీసులు నొక్కడంతో.. ఆ విద్యార్థి బాధతో విలవిలలాడాడు. చివరకు తాడేపల్లి సీఐ కల్యాణ్రాజు ఐదుగురు నాయకులను లోపలకు అనుమతించారు.వారు సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్కు వినతిపత్రం సమర్పించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ధర్నాలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.రవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పులగం సందీప్ రెడ్డి, కె.శివారెడ్డి, గోలి నరసింహ, గోపి కృష్ణ, వినోద్, కోమల్ సాయి, ఐ.శ్రీనివాస్, కొండల్ రావు, సందీప్, గోపీచంద్, నారాయణ, పూజిత్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారి కథ విని హరీష్రావు కంటతడి..
సాక్షి, సిద్ధిపేట: ఓ చిన్నారి కథ విని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధిపేటలో విద్యార్థుల కోసం లీడ్ ఇండియా ఆధ్వర్యంలో 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్లో ఎదగాలి' అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీష్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మాటలకు ఆయన చలించిపోయారు.. కంటతడి పెట్టారు.ఆ విద్యార్థిని మాట్లాడుతూ తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని.. తల్లే తనను కష్టపడి చదివిస్తోందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ చిన్నారి మాటలు విన్న హరీష్రావుతో పాటు ఆ వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాలికను ఆత్మీయంగా దగ్గరికి తీసుకునన్న హరీష్రావు.. వేదికపై తన పక్కన కూర్చోబెట్టుకుని ఓదార్చారు. -
విశాఖలో మెడికో శ్రీరామ్ ఆత్మహత్య
-
విశాఖలో మెడికో ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మెడికో శ్రీరామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్రెడ్డి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మెడికల్ కళాశాల వద్ద మెడికోలు ఆందోళన చేపట్టారు. కళాశాల డీన్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేకే శ్రీరామ్ ఆత్మహత్య చేసుకున్నాడని నిరసనకు దిగారు. చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్న శ్రీరామ్ బంధువులు ఆరోపిస్తున్నారు.బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యమరో ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఇవాళ తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని కృష్ణవేణిగా గుర్తించారు. ఉగాది పండగకు ఇంటికి వెళ్లి నిన్న(శుక్రవారం) సాయంత్రం తల్లితో కలిసి కళాశాలకు విద్యార్థిని వచ్చింది.తల్లితో కలిసి రాత్రి హాస్టల్లో ఉన్న మృతురాలు కృష్ణవేణి.. తెల్లవారుజామున కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బెట్టింగ్ యాప్కు మరో యువకుడు బలి
రంగారెడ్డి: బెట్టింగ్ యాప్ మరో విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ పాల్పడిన పవన్ అనే యువకుడు.. ఒకేసారి రూ. లక్ష పోగొట్టుకున్నాడు. దాంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తాపూర్ రెడ్డిబస్తీలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తన వద్ద ఉన్న ఐఫోన్.. రాయల్ఎన్ ఫీల్డ్ బైక్ ను సైతం అమ్ముకుని బెట్టింగ్ కు పాల్పడ్డాడు. తల్లి దండ్రులు పంపిన డబ్బులను సైతం బెట్టింగ్ లో పెట్టాడు. ఇందులో మొత్తం పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పవన్ స్వస్థలం గద్వాల్ జిల్లా. పవన్ మరణవార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
విశాఖపట్నం : చీర,పంచెకట్టులో మెరిసిన ఏయూ విద్యార్థులు (ఫొటోలు)
-
పవన్ కళ్యాణ్ వల్ల అన్యాయమైపోయిన కుటుంబం
-
Sri Rama Pattabhishekam గురు భక్తి
శ్రీరాముని యువ రాజ్యాభిషేకం (Sri Rama Pattabhishekam) నిర్ణయమైన తర్వాత, రఘు వంశీకుల ఆచార్యులు వశిష్టుడు (Vasishta) ఈ విషయం తెలియజేయటానికి రాముని మందిరానికి వెళతాడు. శ్రీరాముడు తన గురువు స్వయంగా వచ్చారని తెలిసి, ఎదురు వెళ్లి చేతులు జోడించి, ఆహ్వానించి, భక్తితో ప్రణామం చేశాడు. జానకి బంగారు పాత్రలో స్వచ్ఛ జలం తీసుకురాగా... రాముడు వశిష్టుని రత్న సింహాసనంపై ఆసీనుని చేసి, గురు పాదాలను శ్రద్ధా భక్తులతో కడిగాడు. సీతతో సహా ఆ పవిత్ర జలాన్ని శిరసున ధరించి, ‘మీ పాద తీర్థం శిరసున ధరించటం వలన ధన్యులమయ్యాము’ అంటాడు.అప్పుడు వశిష్టుడు, ‘రామా! నీ పాద తీర్థం శిరసున దాల్చి పార్వతీ పతి శంకరుడు ధన్యుడయ్యాడు. బ్రహ్మ నీ పాద తీర్థం సేవించే పాపాలను తొలగించుకున్నాడు. ఈ రోజు కేవలం గురువుతో ఒక శిష్యుడు ఎలా వ్యవహరించాలో తెలపటా నికే నువ్వు ఈ విధంగా చేశావు. నువ్వు, సాక్షాత్తూ లక్ష్మీ దేవితో కలిసి భూమిపై అవతరించిన విష్ణువు వని, రావణ సంహారానికే రాముడుగా వచ్చావని నాకు తెలుసు. నీవు మాయా మానుష రూపంతో అన్ని కార్యాలూ చేస్తున్నావు. అందుకు నీవు శిష్యుడవు, నేను గురువుననే సంబంధానికి అనుకూలంగా నేనూ వ్యవ హరిస్తాను’ అంటాడు.శ్రీరాముడు స్వయంగా అంతర్యామి. గురువులకు గురువు. ఆయనకు గురు సేవ ఎందుకు? అంటే, లోకో పకారానికే! లోక కల్యాణానికే! గురువు పట్ల ఎలాంటి వినయ విధేయతలుకలిగి ఉండాలో, ఎంత శ్రద్దా భక్తులతో సేవించాలో తెలపటానికే శ్రీరాముడు ఆ విధంగా వ్యవహరించాడు. త్రేతా యుగంలోనే కాదు, ద్వాపర యుగంలోనే కాదు, ఏ కాలంలోనైనా గురువుల పట్ల శ్రద్ధా భక్తులు, వినయ విధేయతలు కలిగి ఉంటే అటువంటి శిష్యులకు అసాధ్యమైనది ఏదీ ఉండదని గురు చరిత్రలు, గురు శిష్య సంబంధ పురాణ కథలు వ్యక్తం చేస్తున్నాయి. – డా.చెంగల్వ రామలక్ష్మి -
పోక్సో చట్టం కింద యువకుడి అరెస్టు
తిరువొత్తియూరు: ప్లస్–2 విద్యార్థిని, ప్రేమించి వివాహం చేసుకుంటానని గర్భవతిని చేసిన యువకుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. తిరువణ్ణామలై జిల్లా, వెంబక్కం ప్రాంతానికి చెందిన మణికంఠన్(26) చెన్నైలోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ పనికి వెళ్లి ఊరి నుంచి తిరిగి వస్తున్నాడు. సెయ్యూరు తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల ప్లస్–2 విద్యార్థినితో ప్రేమ వ్యవహారం జరిగింది. ఇద్దరూ ఉల్లాసంగా ఉంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో విద్యార్థిని అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించగా విద్యారి్థని 3 నెలల గర్భవతి అని తేలింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు విద్యారి్థనికి జరిగిన విషయాన్ని తెలియజేశారు. దీనిపై సెయ్యూర్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణికంఠన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతన్ని అరెస్టు చేశారు -
వీడియో వైరల్: అందరిని నవ్వించి.. చివరికి కన్నీళ్లను మిగిల్చిన విద్యార్థిని
ముంబై: సంతోషంగా, ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో స్మృతులతో సంతోషంగా జరుగుతున్న ఫెర్వెల్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. వేదికపై ప్రసంగిస్తున్న ఓ విద్యార్థిని గుండెపోటుతో మరణించారు. ఈ విషాద ఘటనలో బాధిత విద్యార్థినికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ ప్రాణాలు కోల్పోవడంపై తోటి విద్యార్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు.మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాలో పరండా పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పరండా ఆరాజి షిండే కాలేజీలో ఫేర్వెల్ పార్టీ విషాదంగా ముగిసింది. వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని వర్ష ఖరత్ (20) వేదికపై ప్రసంగిస్తున్నారు. అప్పటివరకు విద్యార్థులు, లెక్చరర్ల గురించి మాట్లాడారు. మధ్య మధ్యలో తన ప్రసంగంతో అటు విద్యార్థుల్ని, ఇటు లెక్చరర్లను నవ్వించారు.At RG Shinde College in Dharashiv, Maharashtra, a student, Varsha Kharat, collapsed and died during her farewell speech 😢😢https://t.co/O4Rx9pmtnp#suddendeath https://t.co/gPlhM9qaGh pic.twitter.com/fcCdm6PWFX— Dee (@DeeEternalOpt) April 5, 2025 అయితే అప్పటి వరకు అందరిని నవ్వించి వర్ష మాట్లాడుతూ కుప్పకూలారు. ఫెర్వెల్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విద్యార్థిని కుప్పకూలిపోవడంతో అప్రమత్తమైన తోటి విద్యార్థులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం పరండా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే విద్యార్థిని వర్ష మరణించినట్లు ప్రకటించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, వర్ష ఎనిమిదేళ్ల వయసులో గుండె శస్త్రచికిత్స (హార్ట్ సర్జరీ) చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత 12 ఏళ్లుగా ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, మందులు కూడా వాడటం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనకు గల కారణంగా ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు (సడెన్ కార్డియాక్ అరెస్ట్) రావడం వల్ల బ్రెయిన్ డెత్ వచ్చి మృతి చెందిందని నిపుణులు అనుమానిస్తున్నారు. వర్ష మరణంపై కాలేజీ యాజమాన్యం తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె స్మృతిగా ఒక్కరోజు సెలవు ప్రకటించారు. -
ఉత్సాహంగా కళాశాల వార్షికోత్సవం..డ్యాన్స్ లతో అదరగొట్టిన యవత (ఫొటోలు)
-
అంత కష్టం ఏమొచ్చిందో..
నెల్లూరు: ఆడుతూ.. పాడుతూ తిరిగే బాలికకు ఏ కష్టమొచ్చిందో తెలియదు గానీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఆత్మకూరులో గురువారం జరిగింది. ఎస్సై జిలానీ, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని వందూరుగుంట ప్రాంతానికి చెందిన ప్రకాష్, రత్నమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. ప్రకాష్ పెయింట్ పనిచేస్తుంటాడు. రత్నమ్మ ప్రభుత్వాస్పత్రిలో తాత్కాలిక నర్సుగా వ్యవహరిస్తోంది. పెద్ద కుమార్తె నిహారిక (11) జెడ్పీ బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. నిహారిక గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. నానమ్మ భోజనం తినాలని చెప్పగా స్కూల్లోనే చేశానంది. ఆ సమయంలో రత్నమ్మ సమీపంలోని తెలిసిన వారింటికి వెళ్లింది. కొద్దిసేపటి అనంతరం ఆమె ఇంటికొచ్చి కుమార్తెను పిలవగా స్పందన లేదు. దీంతో నానమ్మ మిద్దైపెన బాత్రూమ్కు వెళ్లిందని చెప్పడంతో తల్లి అక్కడికి వెళ్లి పిలిచింది. అయితే నిహారిక పలక్కపోవడంతో కేకలు వేసింది. కిందనే ఉన్న భర్త ప్రకాష్కు తెలిపింది. అతను పైకి వచ్చి కొంత ప్రయత్నం చేసి తలుపు తీశాడు. ఇనుప పైపునకు చున్నీతో ఉరేసుకుని కనిపించిన నిహారికను చూసి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. బాలికను కిందకు దించి పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు తల్లి గుర్తించింది. హుషారుగా తిరిగే నిహారిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై జిలానీ కానిస్టేబుల్ విజయకుమార్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసున్నారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మేడ్చల్ సీఎంఆర్ కళాశాలలో విషాదం
-
డిగ్రీలో ‘బకెట్’ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో గుణాత్మక మార్పుల దిశగా అడుగులేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల (వీసీ)తో సమావేశం జరిగింది. కొత్త విద్యా సంవత్సరం క్యాలెండర్, దోస్త్ నిర్వహణ, అనుబంధ గుర్తింపు, కొత్త సిలబస్ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు డిగ్రీలో ఉన్న బకెట్ విధానాన్ని ఎత్తివేయాలని నిర్ణయించారు. ఒక విద్యార్థి ఒక కాలేజీలో చేరినప్పటికీ, ఆ కాలేజీలో లేని, వేరే కాలేజీలో ఉన్న సబ్జెక్టును చదివేందుకు వీలుగా 2023లో బకెట్ విధానం తీసుకొచ్చారు. ఇప్పటికే బకెట్ సిస్టమ్లో చేరిన విద్యార్థులు ఆ కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగుతారు. డిగ్రీ ఆన్లైన్ సర్విస్, తెలంగాణ (దోస్త్)ను ఎత్తివేయాలనే ప్రతిపాదనను మండలి వెనక్కు తీసుకుంది. అయితే, రెండు కౌన్సెలింగుల్లోనే డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. డిగ్రీలో 4.6 లక్షల సీట్లుండగా, 2.25 లక్షల మందే చేరుతున్నారు. దీంతో జీరో అడ్మిషన్లు నమోదయ్యే కాలేజీలు, కోర్సులకు అనుమతి ఇవ్వొద్దని వర్సిటీలకు మండలి సూచించింది. సిలబస్లో మార్పులు రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లో కొత్త సిలబస్ను 2025–26 విద్యా సంవత్సరం నుంచి అమలుచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈసారి 20 శాతం సిలబస్ను మార్చబోతున్నట్టు మండలి చైర్మన్ వీసీలకు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ వంటి కోర్సులను డిగ్రీ సిలబస్లో చేరుస్తున్నట్టు చెప్పారు.డిజిటల్ ప్లాట్ ఫాంలో బోధన అందించేందుకు టీ–శాట్తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. మూల్యాంకన విధానంలో మార్పులు అవసరమని సమావేశం అభిప్రాయపడింది. అసైన్ చేసిన ప్రాజెక్టు వర్క్కు 25, మిడ్టర్మ్కు 25, ఆఖరు సెమిస్టర్కు 50 మార్కుల చొప్పున మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించారు. ఏప్రిల్ 30 నాటికి విద్యా సంవత్సరం ముగించాలని నిర్ణయించారు. యాజమాన్య కోటాకు ఆన్లైన్ లేనట్టే ఇంజనీరింగ్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఈసారి ఆన్లైన్లో చేపడతామని చెప్పిన ఉన్నత విద్యా మండలి యూటర్న్ తీసుకుంది. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో, ఈసారికి బీ కేటగిరీ సీట్లను ఆయా కాలేజీల యాజమాన్యాలే భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించాలని వీసీల సమావేశం నిర్ణయించింది. ఈ ఏడాది సీపీగెట్ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించాలని మండలి తీర్మానించింది.అన్ని వర్సిటీలకు చెందిన 2025–26 సంవత్సరం అకడమిక్ క్యాలెండర్కు సమావేశం ఆమోదం తెలిపింది. అన్ని వర్సిటీల పరిధిలో జూన్ 16 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ క్లాసులు మొదలవుతాయని అకడమిక్ క్యాలెండర్లో పేర్కొన్నారు. అక్టోబర్ 20తో సెమిస్టర్ ముగుస్తుంది. నవంబర్ 20 నుంచి రెండో సెమిస్టర్కు వెళ్తారు. మూడు, నాలుగు, ఐదు సెమిస్టర్లకు జూన్ 2 నుంచి క్లాసులు మొదలవుతాయి. -
గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా రాయలేదని.. యువతి ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఆకుల శృతి (27) సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శృతి ఎంకాం పూర్తి చేసింది. పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతూ.. ఇటీవలే గ్రూప్–1, 2 పరీక్ష రాసినా మంచి ర్యాంక్ రాలేదు. వీటికితోడు శృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. మరోవైపు శృతి ఏడాదికాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స చేయించుకుందామంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనస్తాపానికి గురైన శృతి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శృతి తల్లి రోజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్కుమార్ పేర్కొన్నారు. పండుగ కోసం వచ్చి.. ప్రాణాలు వదిలి.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి సుల్తానాబాద్రూరల్ (పెద్దపల్లి): ఐతరాజుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన పంగ నిఖిల్(26) మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. పంగ భాస్కర్–పద్మ దంపతుల కుమారుడు నిఖిల్ హైదారాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది పండుగ కోసమని ఈనెల 29న స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఐతరాజుపల్లిలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి రాత్రి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలు దేరాడు. ఈక్రమంలో ప్రమాదవాశాస్తు ద్విచక్ర వాహనంపై నుంచిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
నాకేపాపం తెలియదు.. ప్రశ్నాపత్రం లీకేజీలో నా పాత్రలేదు..
శాలిగౌరారం: నాకేపాపం తెలియదు.. ప్రశ్నాపత్రం లీకేజీలో నా పాత్రలేదు.. పరీక్షా కేంద్రంలో కిటికీ పక్కన ఉన్న నన్ను కిటికీలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి బెదిరించి నా ముందున్న ప్రశ్నాపత్రాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసుకున్నాడు. నన్ను అన్యాయంగా డిబార్ చేశారు. నా డిబార్ను రద్దు చేసి పరీక్షలకు అనుమతించాలి అని నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని బల్లెం ఝాన్సీలక్ష్మి బుధవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు బుధవారం రాత్రి ‘సాక్షి’కి వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నల్లగొండ జిల్లా విద్యాధికారి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ సెక్రటరీ, నకిరేకల్లోని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిండెంట్లను ప్రతివాదులుగా పేర్కొంటూ న్యాయవాది కర్ణాకర్రెడ్డి ద్వారా లంచ్మోషన్ పిటిషన్ను దాఖలు చేశామని ఝాన్సీలక్ష్మి తల్లిదండ్రులు చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తమ పిటిషన్ను విచారించి ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ఈ నెల 21న ఎస్సెస్సీ పరీక్ష ప్రారంభం కాగా పరీక్షలు ప్రారంభమైన పావుగంటకే నకిరేకల్లోని సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రంలో తెలుగు ప్రశ్నాపత్రం లీకై నకిరేకల్, శాలిగౌరారం మండలాలలోని యువకుల వాట్సాప్లలో చక్కర్లు కొట్టిన విషయం విదితమే. ప్రశ్నాపత్రం లీకై న సంఘటనను సీరియస్గా తీసుకున్న విద్యాశాఖ అధికారులు బాధ్యులను గుర్తించి నకిరేకల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రశ్నాపత్రం క్రమసంఖ్య నెంబర్ ఆధారంగా విద్యార్థిని ఝాన్సీలక్ష్మిని గుర్తించిన అధికారులు.. ఆమెను పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీలో పాల్గొన్న యువకులపై పోలీసులు కేసు నమోదు చేయడంతోపాటు కొందరిని రిమాండ్కు తరలించిన విషయం విదితమే. -
బడిని బతికించిన బాపు!
వైరా రూరల్: కారణాలు ఏమైనా ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపేందుకే మొగ్గు చూపుతుండడంతో ప్రభుత్వ పాఠశాలలు వైభవం కోల్పోతున్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని నారపునేనిపల్లి యూపీఎస్కు కూడా అదే గతి పట్టింది. ఈ ఏడాది స్కూల్ మొత్తంలో నాలుగో తరగతి చదివే ఒకే విద్యార్థి మిగిలింది. దీంతో అధికారులు స్కూల్ను మూసివేసేందుకు యత్నించారు. కానీ ఆ విద్యార్థి ని తండ్రి పట్టుదల కారణంగా స్కూల్ ఇంకా మూతపడకుండా నడుస్తోంది. 24 మంది నుంచి ఒకరికి.. నారపునేనిపల్లిలో పాఠశాల స్థాయి విద్యార్థులు 35 మంది ఉంటారు. గ్రామ యూపీఎస్లో 2018లో 24 మంది విద్యార్థులతో పాటు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. 2022–23లో ఎనిమిదికి, 2023–24లో నలుగురికి ఆ సంఖ్య పడిపోయింది. దీంతో ఉమాపార్వతి అనే టీచర్ మినహా ఉపాధ్యాయులందరినీ డిప్యూటేషన్పై వేరే స్కూళ్లకు పంపారు. ఈ విద్యాసంవత్సరం నాలుగో తరగతి చదివే కీర్తన మాత్రమే మిగిలింది. ఈ స్కూల్ నుంచి విద్యార్థులు వెళ్లిపోవటానికి కోతుల బెడద కూడా కారణమైంది.విద్యార్థులు లేని కారణంగా స్కూల్ మూసివేతకు అధికారులు సిద్ధపడడంతో ఆమె తండ్రి అనిల్శర్మ అడ్డుకున్నాడు. పాఠశాల మూస్తే తన కుమార్తె చదువు మాన్పిస్తానని.. అదే జరిగితే అధికారులే బాధ్యత వహించాలని స్పష్టంచేయటంతో వెనక్కి తగ్గారు. స్కూల్లో ప్రవేశాల పెంపునకు అధికారులు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయటంతో ఇంకో టీచర్ను కేటాయిస్తే పిల్లల్ని పంపిస్తామని గ్రామస్తులు చెప్పారు. దీంతో డిప్యూటేషన్పై ఖానాపురం హిందీ పండిట్ మాచర్ల రాంబాబును కేటాయించారు. స్కూల్ మూత పడొద్దనే... ఒకసారి స్కూ ల్ మూసేస్తే మళ్లీ తెరవడం సాధ్యం కాదు. ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్థోమత ఉన్నా పాఠశాల మూసివేయొద్దనే ఉద్దేశంతో మా పాపను ఇక్కడ చదివిస్తున్నా. ప్రభుత్వ బడుల్లో ఉన్న సదుపాయాలపై ప్రచారం చేసి ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. – నందిగామ అనిల్శర్మ, కీర్తన తండ్రిఅన్ని వసతులు కల్పిస్తాం.. యూపీఎస్లో వి ద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తాం. కోతుల ని వారణకు పాఠశాల ప్రహరీపై సో లార్ ఫెన్సింగ్ ఏర్పాటుచేయడమే కాక డిజిటల్ బోధ న చేయనున్నాం. తల్లిదండ్రులు రూ. లక్షలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా పిల్లలను సర్కారు బడులకు పంపించి ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి సహకరించాలి. – కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఎంఈఓ, వైరా. -
విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. నిట్ ప్రొఫెసర్ అరెస్ట్
గౌహతి: విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన కొందరు అధ్యాపకులు తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్కు చెందిన ఒక ప్రొఫెసర్ బాగోతం మరువకముందే, అస్సాంలోని సిల్చార్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇదే తరహా వేధింపుల వార్తల్లో నిలిచారు. సిల్చార్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(National Institute of Technology) (నిట్)లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కోటేశ్వర్ రాజు ధేనుకొండ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు డాక్టర్ కోటేశ్వర్ రాజును అరెస్ట్ చేశారు. అతనిని నిట్ నుంచి కూడా సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుమల్ మహత్తా తెలిపారు. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా అతనిని ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో అరెస్టు చేశారు. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(Bachelor of Technology) విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్పై చర్య తీసుకోవాలని విద్యార్థులు రాత్రంతా నిరసన తెలిపారు. బాధితురాలి ఫిర్యాదులోని వివరాల ప్రకారం ప్రొఫెసర్ ఆమెను తన చాంబర్కు పిలిచి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేపధ్యంలో బాధితురాలు ఇన్స్టిట్యూట్ అధికారులకు రాసిన లిఖితపూర్వక ఫిర్యాదులో.. ప్రొఫెసర్ తనకు వచ్చిన తక్కువ గ్రేడ్ల గురించి చర్చించేందుకు, చాంబర్కు పిలిచారని, ఆ తరువాత తనను అనుచితంగా తాకాడని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు గురించి తెలియగానే నిందితుడు దాక్కునేందుకు ప్రయత్నించాడని పోలీసు అధికారి తెలిపారు. అతని మొబైల్ ఫోన్ లొకేషన్ను ట్రాక్ చేసి, అతనిని, అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ తర్వాత అతనిని భారత శిక్షాస్మృతి (బీఎస్ఎన్) లోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: చైనా దురాక్రమణను భారత్ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టం -
లక్షల ప్యాకేజీ కంటే..వ్యాపారమే ముద్దు..!
ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఏ విద్యార్థి అయినా లక్షల ప్యాకేజీ జీతంపైనే దృష్టిపెడతారు. అందుకోసం అలాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం అహోరాత్రులు కష్టపడతారు. అయితే ఈ మహిళ కూడా ఆ ఆశతోనే అంతలా కష్టపడి ఐఐటీ, ఐఐఎం వంటి వాటిలలో విజయవంతంగా డిగ్రీ పూర్తి చేసింది. అనుకున్నట్లుగానే ఓ పెద్ద కార్పోరేట్ కంపెనీలలో లక్షల ప్యాకేజీ ఉద్యోగ పొందింది. అయితే లైఫ్ ఏదో సాదాసీదాగా ఉందన్నే ఫీల్. ఏదో మిస్ అవుతున్నా..అన్న బాధ వెంటాడటంతో తక్షణమే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఓబ్రాండెడ్ బిజినెస్ పెట్టాలనుకుంది. అందులో పూర్తి విజయం అందుకుంటానా..? అన్నా ఆలోచన కూడా లేకుండా దిగిపోయింది. మరీ ఆ ఆమె తీసుకున్న నిర్ణయం లైఫ్ని ఎలా టర్న్ చేసింది ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఆ మహిళే రాధిక మున్షి. ఆమె రెండు ప్రతిష్టాత్మక సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థిని. తాను లక్షల జీతం అందుకునే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని చీరబ్రాండ్ అనోరాను స్థాపించాలనే నిర్ణయంతో మలుపు తిరిగిన తన కెరియర్, ఆ తాలుకా అనుభవం తనకు ఏ మిగిల్చాయో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. మరీ ఇంతకీ రాధికా తన నిర్ణయం కరెక్టే అంటోందా..?ఇన్స్టా పోస్ట్లో "తాను ఐఐటీ, ఐఐఎంలలో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేశాను. ఆ సమయంలో అత్యధిక జీతం అందుకోవడమే నా ప్రథమ లక్ష్యం. అయితే నేను ఎన్నడు అనుకోలేదు సొంతంగా బిజినెస్ పెడదామని. అందువల్లే నేను అనుకున్నట్లుగానే పెద్ద కార్పొరేట్లో అత్యథిక పారితోషకంతో ఉద్యోగం సాధించాను. అయితే ఏదో రోటీన్గా తన ఉద్యోగం లైఫ్ సాగిపోతుందంతే. ఆ తర్వాత ఎందుకనో ఇది కెరీర్ కాదనిపించి వెంటనే చీర బ్రాండ్ అనోరాను ప్రారంభించాను. మొదట్లో చీరల డిజైన్ చూసి కాస్త భయం వేసింది. అసలు జనాలు నా చీరలను ఇష్టపడతారా అని?..కానీ జనాలకు నచ్చేలా ఏం చేయాలో కిటుకు తెలుసుకున్నాక.. సేల్స్ చేయడం ఈజీ అయిపోయింది. ఇలా వ్యవస్థాపకురాలిగా మారిన క్రమంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా..అయితే వాటిని అధిగమిస్తున్నప్పుడు చెప్పలేనంత ఆనందం, కిక్కు దొరికేది. తాను లక్షల కొద్ది జీతం పొందినప్పుడు కూడా ఇలాంటి సంతృప్తిని అందుకోలేకపోయానంటూ సగర్వంగా చెప్పింది. అయితే సమాజం, చుట్టూ ఉండే బంధువులు ఇలాంటి నిర్ణయాన్ని అనాలోచిత, తప్పుడు నిర్ణయంగా చూస్తారు. కానీ మనమే ధైర్యంగా ముందడుగు వేయాలి, ఏం జరిగినా సహృద్భావంతో ముందుకెళ్లాలి. పడినా గెలిచినా అది మన ఆలోచన నిర్ణయంతోనే జరగాలి. అప్పుడే ఏ రంగంలోనైనా విజయం సాధించగలం అంటూ తన స్టోరీ పంచుకుంది". వ్యవస్థాపకురాలు మున్షీ. కాగా, ఆమె 2023లో తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పటి నుంచి విజయవంతంగా దూసుకుపోతోంది. ఆమె బ్రాండ్కి చాలామంది కస్టమర్లు ఉన్నారు. వారిచ్చే రివ్యూలను బట్టే చెప్పొచ్చు ఆమె బ్రాండ్ ప్రజల మనసుల్లో ఎలాంటి సుస్థిరమైన స్థానం పొందిదనేది. View this post on Instagram A post shared by Anorah ✨ Contemporary sarees (@anorah.in) (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!) -
కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక..
బయ్యారం: కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక ఒక విద్యార్థి బల వన్మరణానికి పాల్ప డ్డాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని కాకతీయనగర్లో సోమవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. కాకతీయనగర్లో నివసించే అజ్మీరా అనంతరాములు కుమారుడు సాయిమహేశ్(19) సిద్దిపేటలోని ఒక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజియోథెరపీ చదువుతున్నాడు.హోలీ సందర్భంగా ఇంటికి వచ్చిన సాయిమహేశ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టం లేక.. ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..
ఒక విద్యార్థి తన ఉద్వేగభరిత గళంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అందరూ మరిచిపోతున్న వాటిని గుర్తుచేశాడు ఈ స్టూడెంట్ అంటూ అందరూ అభినందించారు. అతడు చెబుతున్నంత సేపు అంతా ఉత్కంఠగా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మరీ ఇంతకీ ఈ ఆ విద్యార్థి దేనిపై ప్రసంగించాడంటే..పాఠశాల వార్షిక కార్యక్రమంలో ఓ నేపాలీ విద్యార్థి ఇచ్చిన ప్రసంగం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. అభిస్కర్ రౌత్ అనే విద్యార్థి పాఠశాల 24వ వార్షిక కార్యక్రమంలో ప్రసంగిస్తూ..హిమాలయ దేశం నేపాలలోని రాజకీయ, ఆర్థిక సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ చక్కటి ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ప్రసంగంలో అతడు.."ఈ రోజు, నేను కొత్త నేపాల్ను నిర్మించాలనే ఆశయంతో ఉన్నాను. ఆశ, ఆకాంక్షల జ్వాల నాలో భగభగమంటోంది. కానీ ఈ కల జారిపోతున్నందున నా హృదయంతో బాధతో బరువెక్కింది. మనలో అలుముకుంటున్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి వెలుగుని నింపేందుకే ఇక్కడ నించున్నా. స్మారక మార్పుతో చరిత్ర గమనాన్ని అమరత్వం చేసేందుకే తానిలా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా.. మన గడ్డ అయినా నేపాల్ మాత(దేశానికి)కి పౌరులుగా న్యాయంగా ఇవ్వాల్సినది తిరిగి ఇస్తున్నారా. మనకు జన్మనిచ్చిన ఈనేపాల్ దేశం మన తల్లి. మనల్ని పోషిస్తున్న ఈ దేశం రుణం తీర్చుకుంటున్నామా..? అనే ప్రశ్నను లెవనెత్తాడు. మనం ఆ మాతకు ఇవ్వాల్సింది కేవలం కృషి, సహకారం, నిజాయితీలే. కానీ మనం ఏం చేస్తున్నాం. నిరుద్యోగంతో అలమటిస్తున్నాం.. రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆటలో చిక్కుకుంటున్నాం. అవినీతి మన భవిష్యత్తు వెలుగులను ఆర్పేసేలా వల అల్లింది అంటూ భావోద్వేగంగా మాట్లాడాడు అభిస్కర్ రౌత్. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆస్టూడెంట్ ధైర్యాన్ని అత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా. మరికొందరూ..ఇది వార్షికోత్సవం ఇవేందకంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఏదీ ఏమైన ఓ స్టూడెంట్ దేశ పౌరుడుగా తన చుట్టు ఉన్న పరిస్థితులు మనపై ఎలా ప్రభావితం చేస్తాయనేది గమనించాల్సిన బాధ్యత ఉందనే విషయం తన ప్రసంగంతో గుర్తుచేశాడు. కాగా,హిందూ రాచరికం తిరిగి రావాలని సాధారణ నేపాల్ పౌరులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విద్యార్థి ప్రసంగం అందరనీ ఆలోచింప చేసేలా ఉండటం విశేషం. ప్రస్తుతం అక్కడ రాజకీయ అస్థిరత, అవినీతి, జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి. Speech by this Nepali student is killing internet today pic.twitter.com/huGGFqmjdy— Ra_Bies 3.0 (@Ra_Bies) March 14, 2025 (చదవండి: ఆన్లైన్ ఫుడ్ క్రేజ్..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే..) -
హోలీ పేరుతో విద్యార్థినులతో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన
-
NTA Exam : అవకాశాన్ని వదులుకోవద్దు!
దేశవ్యాప్తంగా 46 సెంట్రల్ యూనివర్సిటీలకు 2025–26 విద్యాసంవత్సరానికి గాను నాలుగు సంవత్సరాల డిగ్రీ కోసం నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ (National Testing Agency) ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్’ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 1వ తేదీన రిజి స్ట్రేషన్ మొదలయ్యింది. ఈ ప్రక్రియ 23వ తేదీ వరకూ కొనసాగుతుంది. 37 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు డొమెయిన్ సబ్జెక్టు (ప్రధాన సబ్జెక్టు) నూ, నిర్దేశించిన 13 భాషలలో ఒక భాషనూ ఎంచుకోవాలి. జనరల్ స్టడీస్ను అభ్యర్థులందరూ రాయాలి. కనీస భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా భాషకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్మీడియట్, ప్లస్ 2, 12వ తరగతి పూర్తి చేసు కున్నటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ప్రతి విద్యార్థి ఐదు సబ్జెక్టుల వరకు పరీక్ష రాయడానికి ఎన్టీఏ అవకాశం కల్పించింది. ఈ ఒక్క పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీల్లో, అనుబంధ కళాశాలల్లో విద్యార్థులు తమ ర్యాంకు ద్వారా, రిజర్వేషన్ల ఆధారంగా సీటు పొందడానికి అవకాశం ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం (2020)లో భాగంగా అన్ని కేంద్ర విద్యా సంస్థలలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును గత రెండు సంవత్సరాల క్రితం నుండి ప్రారంభించారు. ఒక విద్యార్థి 8 సెమిస్టర్లను పూర్తి చేసుకుంటే ఆ విద్యార్థికి డిగ్రీతోపాటు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా విద్యార్థి టీచర్ నియామకానికి సంబంధించి పరీక్షను నేరుగా రాయడానికి అర్హత సాధిస్తాడు. దీంతో పాటు పీజీ సర్టిఫికెట్ కూడా పొందుతాడు. ఈ కోర్సులో విద్యార్థి 75% శాతం మార్కులు సాధిస్తే నేరుగా పీహెచ్డీలో చేరడానికి అర్హత లభిస్తుంది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరడానికి అవసరమైన నెట్, సెట్ పరీక్షలు రాయడానికి విద్యార్థి అర్హత సాధిస్తాడు.సైన్సు చదివే విద్యార్థి ఆర్ట్స్ సబ్జెక్టు చదవడం, ఆర్ట్స్ చదివే విద్యార్థి సైన్సు సబ్జెక్టు చదవడానికి వీలు ఉండేలా ఈ కోర్సులు డిజైన్ చేశారు. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడానికి కంప్యూటర్ శిక్షణతో పాటు, మాతృభాష, ఇతర భాషలను నేర్పే విధంగా బోధన ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇఫ్లూ, మాను, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలు తెలంగాణలో; తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ట్రాన్సిట్ క్యాంపస్)లు ఏపీలో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వివరాలకు ఎన్టీఏ వెబ్సైట్ (https://cuet.nta.nic)ను చూడవచ్చు– డా.చింత ఎల్లస్వామి, ములుగు -
కౌన్సెలింగ్.. గైడెన్సే కీలకం
సాక్షి, ఎడ్యుకేషన్: ప్రస్తుత విద్యా వ్యవస్థ కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి సమస్యను పరిష్కరించాలంటే... వారికి పాఠశాల స్థాయిలోనే కెరీర్ గైడెన్స్, వారి నైపుణ్యాలపై కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని ఐసీ3 (ఇంటర్నేషనల్ కాలేజ్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్) మూవ్మెంట్ వ్యవస్థాపకులు, ప్రముఖ కెరీర్ కౌన్సిలర్, టెడెక్స్ స్పీకర్ గణేశ్ కోహ్లి చెప్పారు. పోటీ వాతావరణం, పరీక్షల్లో మార్కులనే ప్రతిభకు కొలమానంగా భావించడం, ఇతరులతో పోల్చుకోవడం వంటి పలు కారణాలతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు.దీంతో వారి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని, ఈ కారణంగానే ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలకు పాఠశాల స్థాయి నుంచే పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ‘కౌన్సెలింగ్ ఇన్ ఎవ్రీ స్కూల్’అనే ఉద్దేశంతో ఐసీ3 మూవ్మెంట్కు రూపకల్పన చేసి, దాదాపు 90 దేశాల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్, కెరీర్ గైడెన్స్ నిర్వహిస్తున్న గణేశ్ కోహ్లి.. విద్యార్థుల మానసిక ఒత్తిడి అందుకు కారణాలు, పరిష్కార మార్గాలపై పలు సూచనలు ఇచ్చారు.మానసిక ఒత్తిడికి ఎన్నో కారణాలువిద్యార్థుల్లో నెలకొంటున్న మానసిక ఒత్తిడి సమస్యలు చివరికి వారు ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి చేరుకుంటున్నాయి. 2012లో 6,654గా ఉన్న విద్యార్థుల ఆత్మహత్యలు, 2022 నాటికి 13,044కు చేరాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కావడానికి అకడమిక్స్తో పాటు మరెన్నో అంశాలు కారకాలుగా నిలుస్తున్నాయి. ఆర్థిక అస్థిరత, వ్యక్తిగత ఆహార్యం, సహచరులు– బంధువుల ఒత్తిడి, వైఫల్యం అంటే విపరీతమైన భయం వంటివి వీటిలో ముఖ్యమైనవిగా చెప్పొచ్చు.సంపూర్ణ వికాసం కల్పించడం కంటే అత్యున్నత గ్రేడ్లకే విలువనిచ్చే విద్యావ్యవస్థ ఇందుకు మరో ముఖ్యమైన కారణం. మరోవైపు చిన్నతనం నుంచే పిల్లలను వారి సహచరులతో పోల్చడం వల్ల తమ సామర్థ్యంపై అపనమ్మకం ఏర్పడి దీర్ఘకాలిక ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని గుర్తించకపోవడం వల్ల ఎన్నో ప్రతికూల పరిణామాలు చూడాల్సి వస్తోంది.విదేశాల్లో ఇప్పటికే నివారణ చర్యలుఇతర దేశాల్లోనూ విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పలు దేశాలు ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఫిన్లాండ్, కెనడా, నెదర్లాండ్స్ తదితర పాశ్చాత్య దేశాల్లో పరీక్షల్లో మార్కుల కంటే సామర్థ్య ఆధారిత అభ్యసనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కౌన్సెలింగ్, మెంటార్íÙప్, ప్రయోగాలతో కూడిన అభ్యసనం వంటి మార్గాల ద్వారా కెరీర్పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.కానీ మన దేశంలో అకడమిక్గా పొందిన ఘనతనే విజయంగా గుర్తిస్తున్నారు. సక్సెస్ అంటే మార్కులే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిక సమస్యల విషయంలో కౌన్సెలింగ్ కార్యక్రమాలు ఎంతో సత్ఫలితాలనిస్తాయి. పలు దేశాల్లో ఇది నిరూపితమైంది. మన దేశంలోనూ కౌన్సెలింగ్ సమ్మిళిత సాధనాలను అందుబాటులోకి తెస్తే మానసిక దృఢత్వాన్ని సొంతం చేసుకుని సవాళ్లను స్వీకరించే స్థాయికి విద్యార్థులు ఎదుగుతారు. సవాళ్లను ఎదుర్కొనేలా సంసిద్ధుల్ని చేయాలి నేటి విద్యా వ్యవస్థను పరిశీలిస్తే పాఠశాలలు విద్యార్థులకు కేవలం అకడమిక్ అభ్యసన కేంద్రాలుగానే ఉంటున్నాయి. వాటిని విద్యార్థుల భావోద్వేగాలను, సామాజిక, మానసిక సమస్యలను తీర్చే ప్రాంగణాలుగా రూపొందించాల్సిన ఆవశ్యకత నెలకొంది. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తరగతి గదిలో, బాహ్య ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా సంసిద్ధులను చేసేందుకు చర్యలు తీసుకోవాలి.పిల్లల మాట తల్లిదండ్రులు వినాలి విద్యార్థుల మానసిక ఒత్తిడి విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు తమ సమస్యలను, ఆలోచనలను తమతో పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. దీనికి భిన్నంగా పిల్లల మాటలను తీసిపారేసేలా ప్రవర్తిస్తే వారు మరింత న్యూనతకు గురవుతారు. సక్సెస్ అంటే ఒక ప్రతిష్టాత్మక కాలేజీలో చేరడం మాత్రమే కాదని పిల్లల బలాలు, ఆకాంక్షలను నెరవేర్చుకునేలా వ్యవహరించడం అని గుర్తించాలి.పరీక్ష విధానంపై పునరాలోచన చేయాలి దేశంలోని పరీక్షల విధానంపైనా పునరాలోచన చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్నే పరీక్షించే విధంగా ఉండడంతో విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. దీంతో విద్యార్థులు కూడా ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను, నిజ జీవిత పరిస్థితుల్లో వాటిని అన్వయించే నైపుణ్యాలను పొందడంపై దృష్టి పెట్టకుండా..మార్కుల కోసం బట్టీ పట్టి చదువుతున్నారు. పర్యవసానంగా వాస్తవ పరిస్థితుల్లో ఆయా పాఠ్యాంశాల ప్రాధాన్యత ఏంటో తెలియట్లేదు. సామర్థ్య ఆధారిత మూల్యాంకనం దిశగా అడుగులు వేయాలని జాతీయ విద్యా విధానం సూచించిన సంగతి తెలిసిందే.పాఠశాలల పాత్ర కీలకంప్రస్తుత పరిస్థితుల్లో మార్పు తేవాలంటే పాఠశాలలు ముందు నిలవాలి. మానసిక పరిపక్వత, భావోద్వేగ స్థిరత్వం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. అదే విధంగా విద్యార్థులు ఆత్మవిశాసం పెపొందించుకోవడానికి కెరీర్ కౌన్సెలింగ్ తోడ్పడుతుంది. నిర్దిష్టమైన కెరీర్ గైడెన్స్ పొందిన విద్యార్థులు వారి భవిష్యత్తు గురించి ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉంటారని.. ఆనిశి్చతి, ఆందోళనలను తగ్గించుకుంటారని పలు పరిశోధనల్లో తేలింది.ఏం చేయాలి..⇒ పిల్లల్లోని ఒత్తిడి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించేలా టీచర్లకు శిక్షణనివ్వాలి. ⇒ విద్యార్థులు భావోద్వేగాలను నియత్రించుకోవడం, స్వీయ అవగాహన పెంపొందించుకోవడంపై బోధించాలి. ⇒ మాధ్యమిక పాఠశాల స్థాయి నుంచే కెరీర్ కౌన్సెలింగ్ను కరిక్యులంలో భాగం చేయాలి. ⇒ విద్యార్థులు సహచరులతో మానసిక సమస్యల గురించి చర్చించుకునే పరిస్థితిని, ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొనే వాతావరణాన్ని కల్పించాలి. -
అమెరికాలో కాల్పుల కలకలం.. తెలుగు విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ నగరంలో దుండగులు తెలంగాణలోకి రంగారెడ్డి జిల్లా కేశం పేటకు చెందిన ప్రవీణ్పై (27) కాల్పులు జరిపారు.దుండగుల జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మృతి చెందాడు. ఎంఎస్ సెకండియర్ చదువుతున్న ప్రవీణ్ మృతిపై సమాచారం అందుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వరంగల్లో నల్లగొండ విద్యార్థిని ఆత్మహత్య
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని వరంగల్ జిల్లా అరేపల్లి సమీపంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్(BSc agriculture student) యూనివర్సిటీ ఆవరణలోని వరంగల్ వ్యవసాయ కళాశాలలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ పట్టణానికి చెందిన గుంటోజు సత్యనారాయణ, రమ్య దంపతులు రాక్హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ పెద్దకాపర్తిలో బ్రాంచి పోస్ట్మాస్టర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. మూడవ సంతానం రేష్మిత(19)కు(Reshmitha)ఇటీవల వరంగల్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీలో సీటు వచ్చింది. నెల రోజుల క్రితం అడ్మిషన్ తీసుకుని హాస్టల్ ఉంటోంది. హాస్టల్లో చేరినప్పటి నుంచి చదువుతో ఒత్తిడికి గురవుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెబుతోంది. దీంతో ఇటీవల ఇంటికి తీసుకొచ్చి నచ్చజెప్పి మళ్లీ వరంగల్ కాలేజీకి పంపించారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో రేష్మిత ఫోన్లో మాట్లాడింది. మంగళవారం హాస్టల్ గదిలో రేష్మిత్ మాత్రమే ఉంది. బుధవారం ఉదయం రేష్మిత ఉన్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా.. రేష్మిత గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇంటి నుంచి వెళ్లిన వారంలోనే కుమార్తె హఠాన్మరణం చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నల్లగొండకు తరలించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హాస్టల్ సిబ్బంది, మేనేజ్మెంట్ పర్యవేక్షణ లోపం వల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి సత్యనారాయణ ఏనుమాముల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
తల్లి ఫోను లాక్కుందని.. 13 కి.మీ నడచివెళ్లి..
ఈ రోజుల్లో అందరూ ఫోనుకు బానిసలైపోతున్నారు. ముఖ్యంగా యువత ఫోను(Mobile Phone)తో టైమ్పాస్ చేస్తూ చదువులను కూడా పక్కనపెడుతున్నారు. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు కూడా తరచూ వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం రీవాకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ప్రస్తుతం జరుగుతున్న సీబీఎస్సీ పదవ తరగతి పరీక్షలకు హాజరవుతోంది. అయితే పుస్తకం చదువుతున్నానని(studying) తల్లికి చెప్పి, ఫోనులో సోషల్ మీడియా పోస్టులను చూస్తోంది. దీనిని గమనించిన తల్లి.. కుమార్తె దగ్గనున్న ఫోనును లాక్కుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ పదవ తరగతి విద్యార్థిని ఇంటి నుంచి బయటకు వచ్చి, ఏకంగా 13 కిలోమీటర్ల దూరం నడచి వెళ్లి,అక్కడి నుంచి తన స్నేహితురాలికి ఫోన్ చేసింది.ఆ స్నేహితురాలితో పాటు కలసి రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న ఒక రైలులో కూర్చుంది. అయితే రైలు టీటీఈ ఆ విద్యార్థినులను ఖాండ్వా రైల్వే స్టేషన్(Railway station)లో ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించారు. వారు తడబడుతూ మాట్లాడుతుండటంతో టీటీఈ వారిని ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వారు మైనర్లని తేలింది. దీంతోవారిని ఆర్పీఎఫ్ పోలీసులు బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. అక్కడి సిబ్బందికి ఆ విద్యార్థినులు తమ తల్లిదండ్రుల పేర్లు, చిరునామా చెప్పడంతో వారు ఆ విద్యార్థినులను తీసుకుని స్వయంగా వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలల సంక్షేమ సమితి అధ్యక్షుడు ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ వారిలో ఒక విద్యార్థిని వయసు 15 అని, మరొకరి వయసు 17 అని తెలిపారు. వారిద్దరూ ఒకే స్కూలులో చదువుతున్నారని, వారిద్దరికీ నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాక వారిని తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’ -
పీఈటీ కొట్టారని విద్యార్థి ఆత్మహత్య
ఉప్పల్ (హైదరాబాద్): నగరంలోని ఓ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ పీఈటీ కొట్టడమే కాకుండా తోటి విద్యార్థుల ముందు అవమానించాడంటూ ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ భవనం నాల్గో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణం పొందిన ఘటన శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని సిద్ద హంగిర్గా గ్రామానికి చెందిన ముంగ ధర్మారెడ్డి, సంగీత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లింగారెడ్డి, చిన్న కుమారుడు సంగారెడ్డి(14). వీరి కుటుంబం 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి బోడుప్పల్ పరిధిలోని ద్వారకా నగర్లో నివాసముంటోంది. తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. సంగారెడ్డి.. ఉప్పల్లోని న్యూ భరత్నగర్లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్టడీ అవర్ సమయంలో సంగారెడ్డి స్కూల్లో సీసీ కెమెరాలను కదిలించాడంటూ క్లాస్ టీచర్.. పీఈటీ ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆంజనేయులు కొట్టడంతోపాటు మందలించారు. శనివారం ఉదయాన్నే స్కూల్కు వచి్చన సంగారెడ్డిని పీఈటీ పనిష్మెంట్ పేరిట మరోసారి తరగతి గదిలో కొట్టడంతోపాటు అరగంటపాటు నిలబెట్టారు. తల్లిదండ్రులను పిలిపిస్తానని, టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరించారు. తోటి విద్యార్థుల ముందు దీన్ని అవమానంగా భావించిన సంగారెడ్డి.. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ముందుగా తన నోట్ బుక్లో ‘సారీ మదర్– ఐ విల్ డై టుడే’అని రాసి వాష్రూంకు వెళ్తున్నానని చెప్పి తరగతి బయటకు వచ్చాడు. వస్తూ వస్తూ స్నేహితులకు బైబై అని చెప్పాడు. మూడవ అంతస్తులో ఉన్న తరగతి గది నుంచి నాల్గో అంతస్తుకు చేరుకుని అక్కడినుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి, మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించి సంగారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం, పీఈటీ ఆంజనేయులు, క్లాస్ టీచర్పై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ డీఈవో పాఠశాలను సీజ్ చేశారు. కన్నీరు మున్నీరైన తల్లి ‘ప్రయోజకుడు కావాలని రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రైవేట్ బడిలో చదివిస్తున్నా. ఎంతకష్టమొచి్చనా ఫీజును ఆపే వాళ్లం కాదు. నా కొడుకు ఏ పాపం చేశాడని చంపేశారు? అంటూ సంగారెడ్డి తల్లి కన్నీరు మున్నీరైంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ ఆవరణలో కూర్చుని రోదించడం స్థానికులను కలచివేసింది. -
8వ తరగతి చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్య
-
నీట్లో 720/720.. ధోనీతో లింక్.. ‘మానవ్’ సక్సెస్ స్టోరీ
నీట్ సక్సెస్ స్టోరీస్ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. మానవ్ ప్రియదర్శి నీట్లో సాధించిన విజయం అందరికీ స్ఫూర్తినిస్తుంది. జార్ఖండ్కు చెందిన మానవ్ ప్రియదర్శి(Manav Priyadarshi) కుటుంబాన్ని డాక్టర్ల ఫ్యామిలీ అని అంటారు. ఇప్పటికే ముగ్గురు డాక్టర్లున్న ఈ ఫ్యామిలీలో ఇప్పుడు మానవ్ ప్రియదర్శి తన ఎంబీబీఎస్ పూర్తిచేశాక నాల్గవ డాక్టర్ కానున్నాడు.చిన్నప్పటి చదువులో ఎంతో చురుకైన మానవ్ ప్రియదర్శి నీట్(NEET) యూజీలో మొదటి ప్రయత్నంలోనే 720 మార్కులకు 720 మార్కులు తెచ్చుకోవడం విశేషం. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉంటున్న మానవ్ 2024లో జరిగిన నీట్ యూజీ పరీక్షలో జార్ఖండ్లో టాపర్గా నిలిచాడు. ఆల్ ఇండియా ర్యాంక్ 57 తెచ్చుకుని, టాప్ 100 నీట్ టాపర్స్లో ఒకనిగా నిలిచాడు. నాడు మీడియాతో మానవ్ ప్రియదర్శి మాట్లాడుతూ తనకు టాపర్గా నిలుస్తాననే నమ్మకం ఉందని, కానీ స్టేట్ నంబర్ వన్గా నిలుస్తానని అనుకోలేదన్నారు.మానవ్ ప్రియదర్శికి ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి(Dhoni) మధ్య ఒక సంబంధం ఉంది. రాంచీలో జేవీఎం శ్యామలీ స్కూలుకు మంచి పేరు ఉంది. ఇదే స్కూలులో ఎంఎస్ ధోనీ చదువుకున్నాడు. ఇప్పుడు ఇదే స్కూలు నుంచి మానవ్ 12వ తరగతి పూర్తి చేశాడు. తాను సాధించిన విజయానికి తన పాఠశాల ఉపాధ్యాయులే కారణమని మానవ్ చెప్పుకొచ్చాడు. మానవ్ ప్రియదర్శి నీట్ యూజీ పరీక్షలో 99.9946856 పర్సంటేజీ తెచ్చుకున్నాడు.మానవ్ ప్రియదర్శి తండ్రి సుధీర్ కుమార్ రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్(Physics professor). మానవ్ పెద్దక్క డాక్టర్ నిమిషా ప్రియ భాగల్పూర్ మెడికల్ కాలేజీలో డాక్టర్. మానవ్ చిన్నాన్న డాక్టర్ ప్రిన్స్ చంద్రశేఖర్ సహరసాలో మెడికల్ ఆఫీసర్. మానస్ మామ డాక్టర్ రాజీవ్ రంజన్ రాంచీ ప్రభుత ఆస్పత్రి వైద్యులు. మానవ్ మీడియాతో మాట్లాడుతూ విజయానికి దగ్గరి దారులుండవని, లక్ష్యాన్ని నిర్థారించుకుని, పట్టుదలతో చదివితే ఓటమి ఎదురు కాదన్నాడు. ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ.. -
ప్రేమించకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తా..!
కామవరపుకోట: ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం కామవరపుకోట పంచాయతీ వడ్లపల్లిలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వడ్లపల్లి గ్రామానికి చెందిన గంజి నాగ దీప్తి (19) ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. గత కొంతకాలంగా నాగ దీప్తి కాలేజీకి వచ్చి, వెళ్లే సమయాల్లో కామవరపుకోటకు చెందిన ఆకతాయిలు ఆమెను ప్రేమించాలని, లేకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించేవారు. ఈ విషయంపై ఆమె అన్నయ్య అరవింద్ ఆ యువకులను నిలదీశాడు. దీంతో ఇటీవల కామవరపుకోటలో జరిగిన వీరభద్రస్వామి తిరునాళ్లలో అరవింద్ను తీవ్రంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం మళ్లీ ఆ యువకులు నాగ దీప్తికి ఫోన్ చేసి తమను ప్రేమించకపోతే మీ అన్నయ్యతో సహా మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురైన నాగదీప్తి గురువారం ఇంట్లో ఫ్యాన్కు ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసమయంలో తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రాణి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వెళ్లగా అన్నయ్య అరవింద్ గదిలో నిద్రపోతున్నాడు. నాగ దీప్తి ఫ్యానుకు వేలాడుతూ ఉండడాన్ని గమనించిన అరవింద్ చుట్టుపక్కల బంధువుల సహాయంతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నా కుమార్తె మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై తడికలపూడి ఎస్సై చెన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య.. ఖమ్మంలో ఉద్రిక్తత!
సాక్షి, ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శ్రీచైతన్య కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సదరు విద్యార్థిని తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని నందిని(16) ఆత్మహత్య చేసుకుంది. క్లాస్రూమ్లోనే నందిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో, కాలేజీ యాజమాన్యం ఆమె పేరెంట్స్కు సమాచారం అందించారు. వెంటనే నందిని మృతదేహాన్ని ఆసుపత్రి యాజమాన్యం మార్చురీకి తరలించింది. అయితే, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నందిని మృతితో ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.కాగా, విద్యార్థిని మృతి నేపథ్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. కాలేజీ యాజమాన్యంపై తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. కాలేజీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
నేపాలి విద్యార్థిని ఆత్మహత్య.. ఐదుగురు కీలక వ్యక్తులు అరెస్ట్
భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్ పట్టణంలోని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అయిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ్రస్టియల్ టెక్నాలజీ(కేఐఐటీ)లో 20 ఏళ్ల నేపాలీ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్చేశారు. అరెస్ట్ అయిన వారిలో కాలేజీ హెచ్ఆర్ విభాగ డైరెక్టర్ జనరల్, పరిపాలనా విభాగ డైరెక్టర్, హాస్టల్స్ డైరెక్టర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.వివరాల ప్రకారం.. విద్యార్థి వేధింపుల కారణంగా కేఐఐటీ హాస్టల్లో ప్రకృతి లాంసాల్ అనే బీటెక్ మూడో ఏడాది విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న 900 మంది నేపాలీ విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు అణచివేసేందుకు వర్సిటీలోని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా కొట్టడం, తర్వాత 800 మంది విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించి పంపేయడం చర్చనీయాంశమైంది. ఘటనలో వాస్తవాలను వెలికితీసేందుకు రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ముగ్గురితో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యాశాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో ఉన్నారు. తోటి నేపాలీ అమ్మాయి చనిపోతే నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సస్పెన్షన్ లేఖలు జారీచేయాల్సినంతగా కాలేజీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో ఈ కమిటీ ఆరాతీసి ప్రభుత్వానికి నివేదించనుంది.ఇక, ఘటనపై నేపాల్ ప్రభుత్వం స్పందించింది. తమ దేశ విద్యార్థులను కలిసి విషయం తెల్సుకుని తదుపరి కార్యచరణ కోసం ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులను ఒడిశాకు పంపింది. విద్యార్థుల నిర్ణయం మేరకు కుదిరితే మళ్లీ హాస్టల్లో చేర్పించడం లేదంటే స్వదేశానికి తీసుకెళ్లడంపై విద్యార్థులకు ఆ అధికారులు సలహాలు, సూచనలు చేస్తారు. విద్యార్థి మరణం వార్త తెల్సి నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి సైతం విచారం వ్యక్తంచేశారు. The tragic death of Nepali student Prakriti Lamsal at KIIT has sparked protests,Alleged harassment led to her suicide, with the college’s mishandling and irresponsible comments from officials raising serious concerns. investigations are ongoing #JusticeForPrakriti#KIITUniversity pic.twitter.com/Bl2GS71Oic— R0ni (@R0ni9801025590) February 18, 2025 -
తెలంగాణలో గురితప్పిన గురుకులాలు
-
వరంగల్ ఏకశిలా కాలేజీలో కీచక లెక్చరర్!
సాక్షి, వరంగల్: నగరంలో మరో కీచక లెక్చరర్ నిర్వాకం బయటపడింది. కొత్తవాడలోని ఏకశిలా జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని పట్ల లెక్చరర్ రమేష్ అసభ్యంగా ప్రవర్తించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.యాజమాన్యానికి సమాచారం అందించిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం.. రమేష్ను కావాలనే తప్పిస్తున్నారని బంధువులు మండిపడుతున్నారు. కీచక టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
వీడు ఏడడుగుల బుల్లెట్టూ..
-
ఒకే ఒక్క స్టూడెంట్!
-
Student Tribe: స్టూడెంట్ ట్రైబ్..
మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతికత, వినూత్న నైపుణ్యాలను అందిపుచ్చుకుంటోంది ఈతరం యువత. ఇటు చదువుకుంటూనే అటు భవిష్యత్ ప్రణాళికల గురించి మార్గ నిర్దేశం చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు అత్యున్నత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది ‘స్టూడెంట్ ట్రైబ్‘. ఒక స్టార్టప్ లాంటి ఈ వేదిక ఏదైనా డిగ్రీ, ఆ పైన చదువులు చదువుతున్న విద్యార్థులకు ఈ తరం సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను అందజేస్తూ.. మరోవైపు పరిశ్రమలో వారికి అవకాశాలను చేరువ చేస్తోంది. 6 లక్షలకుపైగా స్టూడెంట్ నెట్వర్క్తో విభిన్న వేదికల్లో విద్యార్థులకు అవగాహన అవకాశాలను కల్పిస్తోంది. స్టూడెంట్ ట్రైబ్ అనేది స్టూడెంట్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్. ఈ వేదిక దాదాపుగా 6 లక్షలకు పైగా విద్యార్థులతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైగా కాలేజీలతో అనుసంధానమై ఉంది. సోషల్ మీడియా వేదిక ఇన్స్ట్రాగామ్లో 4.5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. విద్యార్థులను నైపుణ్యాలకు అనువైన బ్రాండ్స్కు అనుసంధానం చేస్తోంది. గిగ్ వర్క్ ఇంటరీ్నíÙప్, వలంటీర్, ఫుల్టైమ్గా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. విద్యార్థులు చదువుకుంటూనే సంపాదన, స్కిల్స్ మెరుగు పర్చుకోవడంతో పాటు సరి్టఫికెట్లు పొందవచ్చు. స్థిరమైన భవిష్యత్ వృద్ధికి అంతులేని అవకాశాలను సృష్టిస్తోంది. టెక్నాలజీ నుంచి మార్కెటింగ్, డిజైన్ వరకు ప్రతి అవకాశాన్ని దగ్గర చేరుస్తోంది. టైర్–2, టైర్–3 నగరాల్లో సేవలు అందించడంతో పాటు వారికి అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. విద్యార్థులు సంపాదించిన డబ్బు అటు చదువు, ఇటు ప్యాకెట్ మనీకి ఉపయోగపడుతుంది. బ్రాండింగ్, ఉపాధి అవకాశాలు, నైపుణ్యం అభివృద్ధి అనే మూడు అంశాలపై సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక యాప్ ఆవిష్కరించి అవకాశాలు, వర్క్షాప్లు, వెబినార్స్ తదితర కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. బీబీఏ, బీకాం, బీఎస్సీ, ఇంజినీరింగ్ వంటి ఏదైనా డిగ్రీ చేసిన విద్యార్థులు ఈ సేవలను ఉచితంగానే పొందవచ్చు.అవకాశాలకు పుష్పకవిమానం.. నేను 2024లో డిగ్రీ బీకాం పూర్తి చేశాను. డిగ్రీ చేస్తున్న సమయంలోనే స్టూడెంట్ ట్రైబ్ను ఫాలో అవుతున్నాను. దీనికి సంబంధించిన యాప్లో ఎప్పటికప్పుడు అవసరమైన అవకాశాలు, వర్క్షాప్స్ గురించి తెలుసుకున్నాను. ఇందులో భాగంగానే స్టూడెంట్ ట్రైబ్లో అకౌంట్ మేనేజర్గా ఫుల్టైమ్ జాబ్ పొందాను. నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు ఈ వేదిక పుష్పక విమానంగా సేవలందిస్తోంది. – కీర్తనకార్పొరేట్ స్థాయి నైపుణ్యం విద్యార్థులు చదువుకుంటూనే అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ వేదికను ప్రారంభించాం. వారి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ యాకథాన్ నిర్వహించాం. ఇందులో ప్రముఖ సినీ తార సమంత వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ మధ్యనే అప్ స్కిల్లింగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. జావా మెకానికల్ ఇంజినీరింగ్ వంటి విభిన్న నైపుణ్యలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయి నైపుణ్యాలను అందిస్తున్నాం. దీనికోసం వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన నిపుణులు, ప్రతినిధులు, సీఈవోలను ఆహ్వానించి విద్యార్థులకు అనుసంధానం చేస్తున్నాం. ఇప్పటి వరకు రెండు బ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. ఏఐ, బ్లాక్చెయిన్ వెబినార్, మెకానికల్ ఇంజినీరింగ్ వర్క్షాప్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ వర్క్షాప్ వంటివి నిర్వహించాం. – చరణ్ లక్కరాజు, స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకులు. -
విశాఖ: ‘సీజ్ ద నారాయణ కాలేజ్’
విశాఖపట్నం, సాక్షి: సీజ్ ద నారాయణ కాలేజ్ నినాదంతో మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజ్ క్యాంపస్ మారుమోగుతోంది. యాజమాన్యం ఒత్తిడితో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడగా.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థి సంఘాలు ఈ ఉదయం ఆందోళనకు దిగాయి.ఒడిశా రాయ్పూర్కు చెందిన చంద్రవంశీ(17) అనే విద్యార్థి.. మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజీలో సెకండ్ఇయర్ చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ.. కాలేజీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. కాలేజీ యాజమాన్యం నుంచి ఒత్తిడి భరించలేకనే అతను చనిపోయినట్లు విద్యార్థి సంఘాలు ఇప్పుడు ధర్నాకు దిగాయి.చంద్ర వంశీ ఆత్మహత్యపై కళాశాలలో నిన్న రాత్రి(బుధవారం) స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. గేట్లు వేసి, హాస్టల్ రూమ్లకు తాళాలు వేసి విద్యార్థులను లోపలే బంధించింది. ఆపై రంగ ప్రవేశం చేసిన పోలీసులు సైతం విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం.విషయం తెలిసిన ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు కాలేజ్ దగ్గరకు చేరుకుని ధర్నాచేపట్టాయి. చంద్ర వంశీ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, కాలేజీని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ అండదండలతో నారాయణ కళాశాల యాజమాన్యం రెచ్చిపోతుందని ఆరోపించాయవి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
స్కూల్ ఫీజు చెల్లించలేదని ప్రిన్సిపాల్ మందలింపు..
కార్పొరేట్ విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా పని చేస్తూ ఫీజుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి, విద్యార్థుల మానసిక స్థితి గురించి ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నాయి. కొంచెం కూడా మానవత్వాన్ని చూపడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురై చావు నోట్లో తలపెడుతున్నారు. స్కూల్ ఫీజు చెల్లించలేదని పాఠశాల ప్రిన్సిపాల్ తోటి విద్యార్థుల ముందే మందలించడంతో మనస్తాపానికి గురైన టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. కాగా.. ఇంటర్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ రూరల్: మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో కమల, వెంకటేశ్వర్లు దంపతుల కవల పిల్లలు అఖిల, విక్రమ్లు 10వ తరగతి చదువుతున్నారు. వీరిరువురి ఫీజు రూ.30 వేలు చెల్లించాల్సి ఉంది. అందులో రూ.10 వేలు చెల్లించారు. మిగతా మొత్తం చెల్లించడంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 8న అఖిల పాఠశాలకు వెళ్లగా ప్రిన్సి పాల్ రమాదేవి తోటి విద్యార్థినుల ముందే అవమానకరంగా మాట్లాడింది. తెలిసిన వారితో ఫీజు కోసం తనను ప్రిన్సిపాల్ టార్చర్ చేస్తున్నారని చెప్పుకొని ఏడ్చింది. సోమవారం పాఠశాలకు వెళ్లలేదు. మంగళవారం తల్లి ఇంట్లో ఉండగానే అఖిల వేరే గదిలోకి వెళ్లి గడియ వేసుకుని ఫ్యాన్కు ఉరి వేసుకుంది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆందోళన పాఠశాల యాజమాన్యం తీరుతో విద్యార్థిని అఖిల ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన దిగారు. పాఠశాల ముందు బైఠాయించి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేధింపులు నిజం కాదు.. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, నిర్వాహకులు వివరణ ఇస్తూ తాము అఖిలను వేధించలేదని తెలిపారు. అందరితో పాటు తనకు ఫీజు చెల్లించాలని గుర్తు చేశామన్నారు. కాగా ఘటనకు కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్పై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు.హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్మ నిజాంపేట్ : ఇంటర్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా కృష్ణాపురంనకు చెందిన బైసు శ్రీనివాస్, దేవి దంపతులు నగరంలోని బోరబండ ఫేజ్– 3లో నివాసం ఉంటున్నారు. వీరి కూతురు పూజిత (17) బాచుపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. బుధవారం ఉదయం హాస్టల్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కాలేజీ సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. పూజిత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా.. మొదట కాలేజీ సిబ్బంది పూజిత బాత్రూంలో జారిపడిందని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. వారిని హాస్పిటల్కు రావాలని సూచించారు. కొద్ది సేపటి తర్వాత చనిపోయింది గాంధీ ఆసుపత్రికి రావాలని చెప్పడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమ కూతురు మృతి అనుమానాస్పదంగా ఉందని పూజిత తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడితోనే విద్యార్థిని మృతి చెందిందని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. -
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం.. డంబెల్స్ వేలాడదీసి
తిరువనంతపురం : ‘అరె తమ్ముళ్లు మందేయాలి. డబ్బులు ఇవ్వండ్రా అని సీనియర్ విద్యార్థులు.. తమ జూనియర్ విద్యార్థులకు హుకుం జారీ చేశారు. దీంతో జూనియర్లు చేసేది లేక కొన్ని వారాల పాటు ప్రతి ఆదివారం సీనియర్లకు డబ్బులు ఇచ్చే వారు. ఈ తరుణంలో ఓ ఆదివారం ఎప్పటిలాగే జూనియర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సీనియర్లు ప్రయత్నించారు. దీంతో జూనియర్లు మీకు ఇచ్చేందుకు మా దగ్గర డబ్బులు లేవు అన్నా’అని సమాధానం ఇచ్చారు. అంతే కోపోద్రికులైన సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను అత్యంత కిరాతంగా ర్యాగింగ్ (Ragging) చేశారు. చివరికి..కేరళ పోలీసులు వివరాల మేరకు.. కేరళ (kerala) రాజధాని తిరువనంతపురంకు చెందిన ముగ్గురు విద్యార్థులు కొట్టాయంలో ప్రభుత్వ కాలేజీలో (kottayam government narsing college) నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే, గతేడాది నవంబర్లో మూడో సంవత్సరం నర్సింగ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఈ ముగ్గురు విద్యార్థుల్ని ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేశారు.ఆ ర్యాగింగ్ ఎలా ఉందంటే? బాధితుల్ని నగ్నంగా నిలబెట్టి గాయపరచడం. వాటిపై కారం పూయడం. మంటకు విలవిల్లాడుతుంటే వీడియోలు తీసి పైశాచికానందం పొందడం. గాయాల్ని కంపాస్తో కొలవడం. అంతర్గత అవయవాలకు డంబెల్స్ను వేలాడదీయడం వంటి వికృత చేష్టలకు దిగారు. తాము ర్యాగింగ్ చేస్తున్నామని ఫిర్యాదు చేస్తే మీకు చదువును దూరం చేస్తామని బాధిత విద్యార్థుల్ని బెదిరింపులకు దిగారు. అలా నాలుగు నెలల పాటు సీనియర్ల వేధింపులను మౌనంగా భరించారు.ఈ నేపథ్యంలో ఓ బాధిత విద్యార్థి ధైర్యం చేసి కాలేజీలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీనియర్ విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో విద్యార్థుల్ని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.👉చదవండి : నేను లీవ్ అడిగితే ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడో చూడండి! -
జేఈఈ మెయిన్ తొలి సెషన్ ఫలితాలు విడుదల.. 14 మంది విద్యార్థులకు 100 పర్సంటేజ్
-
JEE Main 2025 Results : 14 మంది విద్యార్థులకు 100 పర్సంటేజ్
ఢిల్లీ : ఐఐటీ, జేఈఈ లాంటి కఠినతరమైన పరీక్షలో విద్యార్థులు సరికొత్త రికార్డ్లు సృష్టించారు. కొద్ది సేపటి క్రితం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన జేఈఈ మెయిన్ 2025 సెషన్ వన్ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100 పర్సంటేజ్ సాధించారు. వారిలో ఐదుగురు రాజస్థాన్ విద్యార్ధులు కాగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన సాయి మనోఘ్న గుత్తికొండ విద్యార్థిని 100శాతం ఉత్తీర్ణతతో టాపర్గా నిలిచారు. ప్రతిష్టాత్మక ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో బీటెక్ చేసేందుకు, అదే విధంగా ఐఐటీల్లో బీటెక్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్డ్కు అర్హత పరీక్షగా ఎన్టీఏ ఏటా రెండుసార్లు జేఈఈ–మెయిన్ పరీక్షలు నిర్వహిస్తోంది. మొదటి దఫా పరీక్షకు జాతీయ స్థాయిలో 13.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో దాదాపు 2 లక్షల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారని అంచనా.300 మార్కులకు పరీక్ష మూడు సబ్జెక్ట్లలో 300 మార్కులకు పరీక్ష నిర్వహించారు. మ్యాథమెటిక్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు చొప్పున మొత్తం 75 ప్రశ్నలతో ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహించారు. కాగా ప్రశ్నల క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉందని, ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, గత ప్రశ్న పత్రాలు సాధన చేసిన వారికి కొంత మేలు కలిగించేదిగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు.రెండు సెషన్లలోనూ మ్యాథమెటిక్స్ విభాగం ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నప్పటికీ.. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో కొందరు విద్యార్థులకు జవాబులిచ్చేందుకు సమయం సరిపోలేదు. ఫిజిక్స్ విభాగం ప్రశ్నలు సులభంగా, కెమిస్ట్రీలో కొన్ని సులభంగా, కొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 50 శాతం ప్రశ్నలు చాలా సులభంగా ఉండడం విద్యార్థులకు ఉపశమనం కలిగించింది.ఈ రెండు విభాగాల ప్రశ్నలకు అభ్యర్థులు 45 నిమిషాల చొప్పున సమయంలో జవాబులు ఇవ్వగలిగారు. అయితే మిగతా గంటన్నర సమయంలో మ్యాథమెటిక్స్లో 15 నుంచి 20 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణంగా సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే కెమిస్ట్రీ ప్రశ్నలు.తొలిరోజు రెండు సెషన్లలోనూ ప్రశ్నలు జేఈఈ–మెయిన్ గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా అడిగారు. ముఖ్యంగా 2021, 2022 ప్రశ్నలకు సరిపోలే విధంగా చాలా ప్రశ్నలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఇక కెమిస్ట్రీలో అధిక శాతం ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే.. డైరెక్ట్ కొశ్చన్స్గా అడగడంతో ప్రాక్టీస్ చేసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది.ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఇన్–ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 30 శాతం ప్రశ్నలున్నాయి. కెమికల్ బాండింగ్, బయో మాలిక్యూల్స్, మోల్ కాన్సెప్ట్, కాటలిస్ట్సŠ, వేవ్ లెంగ్త్, ఎస్ఎంఆర్, పొటెన్షియల్ మీటర్, కెమికల్ ఈక్వేషన్ ఎనర్జీ, రేడియో యాక్టివ్ డికే, ఆర్గానిక్ కెమిస్ట్రీ (3 ప్రశ్నలు), కో ఆర్డినేట్ కాంపౌండ్, ఆక్సిడేషన్ స్టేట్ల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఫిజిక్స్, మ్యాథ్స్లో ఇలా.. ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్, ప్రొజెక్టైల్ మోషన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్, డయోడ్స్, ఈఎం వేవ్స్, మోడ్రన్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఏసీ సర్క్యూట్, డైమెన్షనల్ ఫార్ములా, ఫోర్స్, మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా ఆఫ్ స్పియర్ నుంచి ప్రశ్నలు అడిగారు.మ్యాథ్స్లో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, సింపుల్ ప్రాబ్లమ్, వెక్టార్, 3డి జామెట్రీ, షార్టెస్ట్ డిస్టెన్స్ ప్రాబ్లమ్, మాట్రిసెస్, డిటర్మినెంట్స్, బయనామియల్ థీమర్, ట్రిగ్నోమెట్రీ, క్వాడ్రాట్రిక్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్, సిరీస్, పారాబోలా, ఏరియా ఆఫ్ సర్కిల్, పెర్ముటేషన్, హైపర్ బోలా, డిఫరెన్షియల్ ఈక్వేషన్, సర్కిల్ ఇంటర్సెక్టింగ్ ప్రాబ్లమ్స్ అడిగారు.అడ్వాన్స్డ్కు కటాఫ్ అంచనా ఇలా.. జేఈఈ అడ్వాన్స్డ్కు కటాఫ్ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే.. జనరల్ కేటగిరీలో 91–92 మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 79–80, ఓబీసీ కేటగిరీలో 77–78, ఎస్సీ కేటగిరీలో 56–58, ఎస్టీ కేటగిరీలో 42–44 మార్కులు కటాఫ్గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
చిన్న కారణానికే ఎంత దారుణం
చౌటుప్పల్, చౌటుప్పల్ రూరల్: పాఠశాల నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడని కొడుకును మద్యం మత్తులో ఉన్న తండ్రి కొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో చోటుచేసుకోగా.. ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో వ్యవసాయం కూడా చూసుకుంటున్నాడు. కొంతకాలంగా కుటుంబంతో కలిసి చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సైదులుకు ముగ్గురు కూమారులు ఉన్నారు. పెద్ద కూమారుడు చదువు ఆపి వేసి హయత్నగర్లో కారు మెకానిక్ నేర్చుకుంటున్నాడు. రెండో కుమారుడు చౌటుప్పల్లోనే ఇంటర్ చదువుతున్నాడు. మూడో కుమారుడు భానుప్రసాద్ చౌటుప్పల్లోని అన్నా మెమోరియల్ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలలో జరిగిన ఫేర్వెల్ పార్టీలో పాల్గొన్న భానుప్రసాద్ రాత్రి ఇంటికి కాస్త ఆలస్యంగా వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సైదులు కుమారుడు ఇంటికి ఆలస్యంగా రావడంతో కోపంతో అతడిని చితకబాదాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు తాళలేక భానుప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అరగంట తర్వాత తండ్రి కోపం తగ్గిందని భావించి భానుప్రసాద్ ఇంటికి రాగా.. మరోసారి విచక్షణారహితంగా కొట్టాడు. ఛాతీపై తన్నడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి బాలుడు చనిపోయాడని నిర్ధారించారు. దీంతో శనివారం రాత్రి హుటాహుటిన స్వగ్రామం ఆరెగూడేనికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఆదివారం ఉదయం దహనసంస్కారాలు చేస్తుండగా.. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఆరెగూడెం గ్రామానికి చేరుకున్నారు. చితిపై ఉంచిన మృతదేహాన్ని కిందకు దింపారు. పోస్టుమార్టం చేసిన తర్వాతే దహన సంస్కారాలు చేయాలని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్ మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గ్రామ పెద్దలు వారికి నచ్చజెప్పడంతో మృతదేహానికి పోస్టుమార్టం చేసేలా ఒప్పించారు. పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అశ్రునయనాలతో అంత్యక్రియలుపోస్టుమార్టం అనంతరం స్వగ్రామం ఆరెగూడెం గ్రామంలో భానుప్రసాద్ మృతదేహానికి అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. చేతికి అందివచి్చన కొడుకును క్షణికావేశంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి కొట్టడంతో చనిపోయాడని తెలుసుకున్న గ్రామ ప్రజలు మృతుడి ఇంటికి బారులుదీరారు. మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. మృతుడి తల్లి రోదనలు మిన్నంటాయి. కేసు నమోదుఈ ఘటనపై మృతుడి తల్లి కట్ట నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలో సైదులు నివాసం ఉండే ప్రాంతంలో పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడి వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకుని నమోదు చేశారు. -
భలే కుర్రాడు.. ఆన్సర్ షీట్లో ఆ ఒక్క ముక్క రాసి..
సోషల్ మీడియా ప్లాట్ఫారం ప్రతీరోజూ మనకు వింతలు, విచిత్రాలను చూపిస్తుంటుంది. వీటిలో కొన్ని వారేవా అనిపిస్తుంగా, మరికొన్ని నమ్మలేనివిగా ఉంటాయి. ఇదేవిధంగా సోషల్ మీడియాలో కొందరు తమ ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. మరికొందరు ఫన్నీ వీడియోలు షేర్ చేస్తూ తెగ నవ్విస్తుంటారు.సోషల్ మీడియాలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇవి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. హాల్ టిక్కెట్లలో ఒక విద్యార్థి పేరుకు బదులు మరొకరి పేరు రావడం, ఎగ్జామ్ సెంటర్లో తప్పులు రావడం లాంటివి మనం ఇంతవరకూ చూసివుంటాం. అలాగే సమాధాన పత్రంలో కొందరు విద్యార్థులు వింత సమాధానాలు రాయడం, ఏవో విజ్ఞప్తులు, అభ్యర్థనలు చేయడం లాంటివాటి గురించి మనం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. అయితే దీనికి భిన్నంగా ఒక తెలివైన విద్యార్థి ఆన్సర్ షీట్లో ఏమి రాశాడో తెలిస్తేఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు.వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నదాని ప్రకారం ఒక టీచర్ ఎవరో విద్యార్థి ఆన్సర్ షీట్ చెక్ చేస్తూ కనిపిస్తారు. ఆయన వీడియోను దగ్గరకు తీసుకురమ్మని సైగలు చేయడం కూడా కనిపిస్తుంది. తరువాత కెమెరాను ఆన్సర్ షీట్పై ఫోకస్ చేయమని ఆ టీచర్ చెప్పడాన్ని గమనించవచ్చు. తరువాత ఆయన మాట్లాడుతూ ‘ఈ కుర్రాడు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం రాశాడు. Define Aura 🗿 pic.twitter.com/MHzKmXZKlX— Prof cheems ॐ (@Prof_Cheems) February 7, 2025పేపర్ చివరిలో రాసినది కూడా సరైన సమాధానమే’ అంటూ ఆ కుర్రాడు సమాధాన పత్రంలో చివర రాసిన వాక్యాన్ని చూపిస్తారు. ఆ కుర్రాడు ‘అందరూ నువ్వు ఫెయిల్ కావాలని ఎదురుచూస్తున్నప్పడు.. విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరు’ అని రాశాడు. దీనిని చూపించిన తరువాత టీచర్ ఆ ఆన్సర్ షీట్పై 80కి 80 మార్కులు వేయడం కనిపిస్తుంది. ఈ వీడియోను @Prof_Cheems పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫారంలో పోస్టు చేశారు. ఈ వీడియోను ఇప్పటిరకూ 2 లక్షల 92 వేల మంది వీక్షించారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ ఫలితాలు: ఇవేం మీమ్స్రా బాబూ.. నవ్వలేక చస్తున్నాం! -
Telangana: బస్ పాస్.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏడాది జనవరి–ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చే ‘ఒక నెల స్టూడెంట్ పాస్’ విధానం విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (టీజీఎస్ఆర్టీసీ) చెందిన సాంకేతిక విభాగం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు బస్ పాస్ కౌంటర్లు–స్కూళ్లకు మధ్య చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. దీనిపై యాజమాన్యం దృష్టి పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి ఎలాంటి బస్పాస్ కావాలన్నా ఆ సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల విషయానికి వస్తే ఐదో తరగతి వరకు బస్ పాస్ ఉచితమే. ఆపై వయసు వాళ్లు మాత్రం సాధారణ లేదా రూట్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇలా దరఖాస్తు చేసే సమయంలో కనిష్టంగా నెల రోజుల నుంచి గరిష్టంగా మూడు నెలల కాలం వరకు బస్పాస్ జారీ చేస్తుంటారు. విద్యా సంవత్సరం ముసిగిన తర్వాత పాస్ దుర్వినియోగం కాకుండా ఉండటానికి జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ఈ విధానాన్ని టీజీఎస్ఆర్టీసీ మారుస్తుంటుంది. అప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి కేవలం నెల రోజుల కాల పరిమితితోనే పాస్ జారీ అవుతుంది. సాంకేతిక విభాగం నిర్లక్ష్యం కారణంగా ఇక్కడే సమస్య వస్తోంది. సాఫ్ట్వేర్లో మార్పుల కారణంగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి సాఫ్ట్వేర్లో మార్పులు అమలులోకి వచ్చాయి. వీటి ప్రకారం ఆ తేదీ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి కాలపమితి ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు. కేవలం నెల రోజులకు మాత్రమే పాస్ తీసుకునేలా దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి బస్ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాక ఆ పాస్ తీసుకోవడానికి పది రోజుల సమయం ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ కాలపరిమితి ముగిసినట్లు అవుతుంది. అంటే.. జనవరి 31 లేదా ఆ ముందు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మూడు నెలల పాస్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసిన తర్వా త స్టూడెంట్స్ ఆ దరఖాస్తు ప్రింట్ఔట్ తీసుకోవాలి. దానిపై పాఠశాల, కాలేజీకి చెందిన అ«దీకృత వ్యక్తులతో సంతకం చేయించుకుని, స్టాంప్ వేయించుకోవడం తప్పనిసరి. దరఖాస్తు సైతం ఆన్లైన్లో నే ఆయా విద్యా సంస్థలకు చేరతాయి. వీటిని వారి తో ఫార్వర్డ్ చేయించుకుని వెళ్లి బస్పాస్ కౌంటర్లో అ«దీకృత అధికారి సంతకం చేసిన ప్రతి ఇస్తేనే పాస్ జారీ చేస్తాయి. ఇక్కడే అసలు సమస్య వస్తోంది.సాంకేతికంగా మార్పులు చేస్తే సరి.. ఫిబ్రవరి 1కి ముందు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో ఎవరైనా మూడు నెలల కాలపరిమితితో పాస్ కావాలంటూ కౌంటర్లకు వెళ్లితే వాళ్లు తిప్పి పంపుతున్నారు. నెల రోజుల కాల పరిమితితో మరోసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, సంతకం–ఫార్వర్డ్ చేయించుకుని రావాలని సూచిస్తున్నారు. అదేమని ప్రశ్నస్తే.. మూడు నెలల కాల పరిమితితో ఇచ్చే పాస్ల జారీ ఫిబ్రవరి 1 నుంచి ఆగిపోయిన నేపథ్యంలో అప్లికేషన్ ఆన్లైన్లో కనిపించట్లేదని చెబుతున్నారు. దరఖాస్తు మూడు నెలల పాస్ కోసమైనప్పటికీ అన్నీ సవ్యంగా ఉంటే నెల రోజులకు జారీ అయ్యేలా టీజీఎస్ఆరీ్టసీ వి«భాగం సాంకేతికంగా మార్పు చేస్తే సరిపోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలా చేయడానికి బదులు అసలు దరఖాస్తే చెల్లదంటూ మళ్లీ నెల రోజుల పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తిప్పి పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశి్నస్తున్నారు. -
పాఠశాల భవనం పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
షాద్నగర్రూరల్: ప్రిన్సిపాల్ మందలించాడని ఓ విద్యార్థి పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. పట్టణంలోని సీఎస్కే వెంచర్లో నివాసం ఉంటున్న హరిభూషణ్ పటేల్, భాగ్య దంపతుల కుమారుడు నీరజ్(15) స్థానిక శాస్త్ర పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూల్కు వెళ్లిన నీరజ్ స్నేహితుడితో కలిసి క్లాస్రూం నుంచి కారిడార్కు వచ్చాడు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ నరేందర్రాయ్ వారిని మందలించాడు. దీంతో సాయంత్రం 4గంటలకు సుమారు 20 ఫీట్ల ఎత్తులో ఉన్న స్కూల్ అంతస్తు పైనుంచి నీరజ్ కిందికి దూకాడు. రక్తపు మడుగులో.. పాఠశాల భవనం పైనుంచి దూకిన నీరజ్ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా.. పాఠశాల సిబ్బంది వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు వెంటనే చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. విద్యార్థి నేతల ఆందోళన..విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ యువసత్తా యూత్ నాయకులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పాఠశాల ఫర్నిచర్, అద్దాలు, బోర్డులు ధ్వంసం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించారు. వార్షికోత్సవం మరుసటి రోజే విషాదం.. హరిభూషణ్ పటేల్, భాగ్య దంపతులకు నీరజ్తో పాటు ఓ కూతురు ఉన్నారు. మంగళవారం హరిభూషణ్ దంపతుల పెళ్లి రోజు కావడంతో వారు కుటుంబ సభ్యులతో ఘనంగా వేడుక జరుపుకొన్నారు. మరుసటి రోజే కొడుకు మృతిచెందడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆర్మీ జవాన్గా పని చేసిన హరిభూషణ్ రిటైర్మెంట్ తీసుకుని, ప్రస్తుతం ప్రస్తుతం బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
రక్తం మారింది... ప్రాణం పోయింది
జగ్గంపేట: ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది మిడిమిడి జ్ఞానం ఓ విద్యార్థిని ఉసురు పోసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 16 ఏళ్ల బాలికకు.. వేరే గ్రూపు రక్తం ఎక్కించి ఆమె ప్రాణాలు పోవడానికి కారకులయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. ప్రకాశం జిల్లాకు చెందిన ఆ బాలిక కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పోలీస్స్టేషన్ వెనుక ప్రాంతంలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అనారోగ్యంతో ఆమెను రెండు రోజుల క్రితం జగ్గంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అయితే, ఆ సమయానికి ఆస్పత్రి వైద్యుడు రాజమహేంద్రవరంలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన ఇచ్చిన సలహాలతో జగ్గంపేట ఆస్పత్రి సిబ్బంది రక్తం ఎక్కించారు. అయితే బాధిత బాలిక బ్లడ్ గ్రూపు ఒకటి అయితే, సిబ్బంది మరో గ్రూపు రక్తం ఎక్కించడంతో ఆరోగ్యం వికటించింది. ఈ క్రమంలో మూత్రంలో నుంచి, నోటి నుంచి రక్తం రావడంతో సిబ్బంది కంగారు పడి, రాజమహేంద్రవరంలో ఉన్న డాక్టర్కు సమాచారమిచ్చారు. ఆ డాక్టర్ సూచన మేరకు ఆ బాలికను తక్షణం రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మంగళవారం రాత్రి బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఆమె బంధువులు ఆందోళన చేయడంతో రాజమహేంద్రవరానికి చెందిన ఒక టీడీపీ నేత ఎటువంటి కేసులు లేకుండా సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
స్కూల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్లోని ఓ పాఠశాల భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. శాస్త్ర గ్లోబల్ స్కూల్లో ఘటన జరిగింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి నీరజ్.. స్కూల్ భవనం రెండో అంతస్తు నుంచి పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యమరో ఘటనలో ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలోని అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో సీఈసీ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అఖిల ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేట్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నేను తప్పు చేశా.. ‘స్టూడెంట్తో పెళ్లి’పై మహిళా ప్రొఫెసర్!
కోల్కతా: స్టూడెంట్ను పెళ్లాడిన మహిళా ప్రొఫెసర్ ఘటనలో ట్విస్ట్. క్లాస్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న మహిళా ప్రొఫెసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ యాజమానికి మెయిల్ పంపారు. యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై ప్రొఫెసర్ భవిష్యత్ ఆధారపడడం చర్చాంశనీయంగా మారిందిపశ్చిమ బెంగాల్ నదియాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి చెందిన హరిన్ఘటా టెక్నాలజీలో పాయల్ బెనర్జీ సైకాలజీ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రొఫెసర్ పాయల్ బెనర్జీ క్లాస్ రూంలోనే తన క్లాస్ విద్యారిని వివాహం చేసుకున్నారు. వివాహ తంతు ఎలా జరిగిందో అచ్చం విద్యార్థి, ప్రొఫెసర్ల ఉత్తుత్తి పెళ్లి అలాగే జరిగింది. అయితే ఆ పెళ్లి తంతులో ప్రొఫెసర్ పెళ్లి ఘట్టాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ నోటా ఈ నోటా చేరింది. చివరికి సైకాలజీ ప్రొఫెసర్ పాయల్ బెనర్జీపై చర్యలు తీసుకునే దాకా వెళ్లింది. పెళ్లితంతుపై యూనివర్సిటీ యాజమాన్యం విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా సైకోడ్రామా ప్రాజెక్ట్లో భాగంగా తాము ఓ నాటకం ఆడామని, నాటకంలో భాగంగా ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నామని, అది నిజమైన పెళ్లి కాదని వివరణ ఇచ్చారు. దీనిని విద్యార్థులు,యూనివర్సిటీ సమ్మతితో ప్రదర్శించినట్లు చెప్పారు. A lady Professor in MAKAUT is 'getting married' to her young student in the office. pic.twitter.com/coXaVGH7s7— Abir Ghoshal (@abirghoshal) January 29, 2025 తన కెరీర్ను దెబ్బతీయడానికి, కించపరచడానికి ఉద్దేశపూర్వకంగా ఓ సహోద్యోగి నాటకంలోని ఒక భాగాన్ని లీక్ చేశారని ఆరోపించారు. అనంతరం బెనర్జీని సెలవుపై సాగనంపింది.ఉత్తుత్తి పెళ్లి ఘటన జరిగిన నాటి నుంచి సెలవులో ఉన్న ప్రొఫెసర్ బెనర్జీ తాజాగా యాజమాన్యానికి తన రాజీనామా లేఖ పంపారు. అందులో, ‘నేను చేసుకుంది ఉత్తుత్తి పెళ్లే. కానీ దీనిపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. సైకలాజికల్ డ్రామాలో భాగంగా క్లాస్ విద్యార్ధిని వివాహం చేసుకున్నాం. ఈ ఉత్తుత్తి పెళ్లి గురించి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకున్నా. అయినా సరే నేనంటే గిట్టని వాళ్లే ఆ పెళ్లి వీడియోల్ని అడ్డం పెట్టుకుని నా పరువు, ప్రతిష్టను మంటగలుపుతున్నారు. వారి వల్ల నేను మానసిక ప్రశాంతను కోల్పోయా. విద్యార్థి పెళ్లి చేసుకుని తప్పు చేశా. ఇక నేను ప్రొఫెసర్గా కొనసాగలేను. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పార్థ ప్రతిమ్ లాహిరి తెలిపారు. ఆమె లేఖపై తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ప్రొఫెసర్ సెలవులో కొనసాగుతారని చెప్పారు.ఇక విద్యార్థిని ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న ఘటనపై యూనివర్సిటీ ఐదుగురు సభ్యుల విచారణ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. మహిళా ప్యాకల్టీ ప్యానెల్ తన విచారణలో ప్రొఫెసర్ పాయల్ బెనర్జీ వాదనల్ని ఖండించినట్లు యూనివర్సిటీ అధికారి ఒకరు తెలిపారు. అదే సమయంలో ఫ్రెషర్స్కు స్వాగతం చెప్పేందుకు చేసిన స్కిట్ తప్ప మరొకటి కాదు. అందులో తప్పులు వెతకడం సరైంది కాదని వైస్ ఛాన్సలర్ తపష్ చక్రవర్తి అన్నారు. -
సముద్రంలో ఈతకు వెళ్లి ఎంబీబీఎస్ విద్యార్థి గల్లంతు
ముత్తుకూరు(నెల్లూరు జిల్లా)/కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : స్నేహితులతో కలిసి సముద్రంలో ఈతకెళ్లి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి గల్లంతయ్యాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పట్టపుపాళెం ఏపీజెన్కో బ్రేక్ వాటర్స్ వద్ద ఈ ఘటన జరిగింది. కృష్ణపట్నం సీఐ రవినాయక్, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలు.. నెల్లూరులో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 9 మంది విద్యార్థులు ఆదివారం నేలటూరు పట్టపుపాళెం సముద్ర తీరానికి విహారానికి వెళ్లారు. ఆటపాటలతో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా ఈత కొట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. వీరిలో విశాఖపటా్ననికి చెందిన షణ్ముగనాయుడు(19) ఈతకొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు లోతు ఉన్న చోట సముద్రపు నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. స్థానికులతో కలిసి రక్షించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విశాఖలో ఉన్న విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 30 మందికి పైగా మత్స్యకారులు పడవల ద్వారా షణ్ముగనాయుడి కోసం గాలించారు. మరో ఐదుగురు గజ ఈతగాళ్లను కూడా రప్పించారు. సాయంత్రం చీకటిపడే వరకూ అన్వేషించినా ఫలితం లేకపోయింది. మత్స్యకారుడు గల్లంతు కృష్ణా జిల్లా మచిలీపట్నం బండలం మంగినపూడి బీచ్లో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. బందరు మండలం సత్రవపాలేనికి చెందిన చింతా ఏడుకొండలు శనివారం సాయంత్రం తోటి మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లాడు. సముద్రంలో చేపలు పడుతుండగా రాత్రి 12 గంటల సమయంలో వలలాగే క్రమంలో సముద్రంలో పడిపోయాడు.బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారులు ఏడుకొండలును కాపాడేందుకు సముద్రంలోకి దూకి గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వేట ఆపి ఆదివారం ఉదయాన్నే ఒడ్డుకు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలపడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
నిజాలు బయటకు రావాలి.. వారిని కఠినంగా శిక్షించాలి: సమంత
ర్యాగింగ్ భూతానికి ఓ కేరళ బాలుడు బలైన సంగతి తెలిసిందే. కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన మిహిర్(15)(Mihir) అనే బాలుడు..తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 15న ఈ ఘటన చోటు చేసుకోకగా.. తమ కుమారుడు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ విద్యార్థి తల్లి ఇటీవల సోషల్మీడియా వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఈ అమానవీయ ఘటనపై అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత(Samantha) కూడా ఈ ఘటనపై స్పందిచింది. మిహిర్ ఆత్మహత్య గురించి తెలిసి షాకయ్యానని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈమేరకు ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది.‘మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ కొంతమంది స్వార్థం, ద్వేషం కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు. వేధింపులు, ర్యాగింగ్ వంటికి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. వీటి వల్ల మనిషి శారీరకంగా, మానసికంగా కుంగిపోతాడు. మన దగ్గర ఎన్నో కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందోనని చాలామంది విద్యార్థులు భయపడుతున్నారు. లోలోనే కుమిలి పోతున్నారు. మనం ఎక్కడో విఫలం అవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం తెలియజేయడమే కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నా.నిజానిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నా. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే, ఎదుటి వారినుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకు మాట్లాడాలి. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్గా నిలవండి’అని సమంత కోరింది. వాష్రూమ్కు తీసుకెళ్లి.. తన కుమారుడితో తోటి విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారని మిహిర్ తల్లి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. మిహిర్ను తోటి విద్యార్థులు కొట్టారని, దుర్భాషలాడారని, అతడి చివరి రోజున ఊహించలేని అవమానాన్ని ఎదుర్కొన్నాడని తెలిపారు. వాష్రూమ్కు తీసుకెళ్లి టాయిలెట్ సీటును నాకించారని, టాయిలెట్ను ఫ్లష్ చేసి తలని అందులో పెట్టారని, అవన్నీ భరించలేకనే తన క కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.మిహిర్ మరణం తర్వాత కూడా వేధింపులు ఆగలేదని చెబుతూ కొన్ని స్క్రీన్ షాట్లను పంచుకున్నారు.మ కుమారుడి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి, డీజీపీకి బాధిత తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో త్రిప్పునితుర హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మిహిర్ తల్లి ఆరోపణలను సదరు స్కూల్ యాజమాన్యం ఖండించింది. -
‘స్టూడెంట్తో పెళ్లి’.. వివాదంలో మహిళా ప్రొఫెసర్
పవిత్రమైన బంధాల్లో గురుశిష్యుల బంధం ఒకటి. అయితే అతిజుగుప్సాకరమైన పనులతో దాని పవిత్రతను దెబ్బ తీస్తున్నవాళ్లను తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ మహిళా ప్రొఫెసర్కు సంబంధించిన ఓ వీడియో ఇన్స్టాగ్రామ్ను కుదిపేస్తోంది. తన స్టూడెంట్నే ఆమె వివాహం చేసుకున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది..పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు 150 కిలోమీటర్ల దూరంలో నదియాలో ఉంది హరిన్ఘటా టెక్నాలజీ కాలేజీ. ఈ కాలేజీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పరిధికి వస్తుంది. ఈ కాలేజీలో ప్రొఫెసర్గా పని చేసే పాయల్ బెనర్జీ.. తన స్టూడెంట్ను వివాహమాడింది. ఆమె నుదుట ఆ విద్యార్థి కుంకుమ దిద్దడం దగ్గరి నుంచి.. దండలు మార్చుకోవడం, ఏడగుడులు వేయడం ఇలా అన్నీ సంప్రదాయ పద్ధతిలో క్లాస్రూంలోనే జరిగిపోయాయి. పైగా హల్దీ వేడుకలను కూడా విద్యార్థుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. మొత్తానికి ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు కాస్త వైరల్ కావడంతో.. ఆమె పాపులర్ అయిపోయారు. సరదా కామెంట్లతో పాటు సీరియస్గా విమర్శలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టారు. అయితే.. ఇక్కడే ప్రొఫెసర్ పాయల్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.VIDEO Credits: HornbillTV అది నిజం వివాహం కాదని, సరదా కోసం చేసిన ప్రయత్నమని చెబుతున్నారు. పాయల్ ఓ సైకాలజీ ప్రొఫెసర్. సైకలాజికల్ డ్రామాలో భాగంగా అలాంటి క్లాస్ను నిర్వహించాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. తానంటే గిట్టని వాళ్లు ఆ వీడియోను బయటపెట్టారని ఆమె మండిపడ్డారు. అయినప్పటికీ అధికారులు మాత్రం ఆమె వివరణతో సంతృప్తి చెందలేదు.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి నివేదిక వచ్చేదాకా ఆమెను సెలవుల్లో పంపారు. మరోపక్క.. ఈ ఘటనపై స్పందించేందుకు విద్యార్థులెవరూ సుముఖత చూపించకపోవడం గమనార్హం. -
మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: మల్లారెడ్డి వర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఉమెన్స్ క్యాంపస్లో ఆత్మహత్యకు యత్నించింది. కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేందుకు కిటికీ నుంచి దూకేందుకు యత్నించింది.గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. పరీక్ష ఫెయిల్ అవుతాననే భయంతో ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా సమాచారం. -
ప్రియుడి బ్లాక్మెయిలింగ్ భరించలేక..
మల్లాపూర్ (హైదరాబాద్): ప్రియుని వేధింపులు భరించలేక ఓ ఎంబీఏ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం..మల్లాపూర్ ఎస్వీనగర్కు చెందిన గుండె సత్యనారాయణ కూతురు పూజిత (21) ఘట్కేసర్లోని వీబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. నాచారం రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్రెడ్డి కుమారుడు ఇంద్ర చరణ్రెడ్డి (22) వీబీఐటీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నెలరోజుల క్రితం వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. కాగా ఇంద్రచరణ్రెడ్డి గతంలో ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం, వేధించడంతో మనస్తాపానికి గురైన పూజిత సోమవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్మకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం ఇంద్రచరణ్ను రిమాండ్కు తరలించారు. -
కిడ్నాప్ చేశారని విద్యార్థుల డ్రామా
కర్నూలు జిల్లా: పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థులు ఒక డ్రామా ఆడారు. తమను కిడ్నాప్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు క్షేమంగా పాఠశాలకు చేరారు. కోడుమూరు సీఐ తబ్రేజ్ తెలిపిన వివరాలు ఇవీ.. సి.బెళగల్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన నవీన్.. 7వ తరగతి బీ సెక్షన్లో చదువుతున్నాడు. అలాగే కర్నూలులోని బుధవారపేటకు చెందిన సూర్యతేజ 6వ తరగతి ఏ సెక్షన్లో చదువుతున్నాడు. వీరిద్దరూ అక్కాచెల్లి అయిన లక్ష్మి, సరస్వతిల పిల్లలు. పాఠశాలలో ఉండటం ఇష్టం లేక జంపాపురానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయం ఉపాధ్యాయులకు తెలిస్తే ఇబ్బంది పడతామని.. తమను ముఖానికి ముసుగులు వేసుకున్న కొంతమంది వ్యక్తులు క్యాబ్లో వచ్చి కిడ్నాప్ చేశారనే విషయం మిత్రుడు నితిన్కు తెలిపి పాఠశాల బయటి నుంచి పొలాల్లో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని నితిన్.. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు సూర్యపతాప్సింగ్, అయ్యన్న కు తెలిపారు. దీంతో వారు వెంటనే పోలీస్లకు సమాచారం అందజేశారు. సోషల్ మీడియాలో ఎస్ఐ సెల్ నంబర్తో గురుకుల పాఠశాల ఇద్దరు విద్యార్థులు కిడ్నాప్ అంటూ కథనం హల్చల్ చేసింది. దీంతో కోడుమూరు సీఐ తబ్రేజ్ పాఠశాలకు చేరుకుని సంఘటన వివరాలను తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎంపీడీఓ రాణెమ్మ, ఇన్చార్జ్ తహసీల్దార్ పురుషోత్తం, సి.బెళగల్ సర్పంచ్ పాండురంగన్న, ఎంఈఓ – 2 ఆదామ్బాషా.. పాఠశాలకు చేరుకుని పాఠశాల సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటపడిన విద్యార్థులు.. సి.బెళగల్ గురుకుల పాఠశాల విద్యార్థులు కిడ్నాప్ అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అయ్యింది. మిన్నెల అనే వ్యక్తికి ఎమ్మిగనూరులో విద్యార్థులు కంటపడ్డారు. ఈ విషయాన్ని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్కు ఫోన్లో వీడియో కాల్ ద్వారా తెలియజేశారు. ఎమ్మిగనూరులో వ్యక్తిగత పనిపై వెళ్లిన సి.బెళగల్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాసులు గౌడ్కు విషయం తెలియడంతో ఆయన ఎమ్మిగనూరు పట్టణ పోలీస్లకు విద్యార్థులను అప్పగించారు. అనంతరం పాఠశాల నుంచి వెళ్లిన విద్యార్థులను పోలీస్లు విచారించారు. పాఠశాలలో ఉండటం ఇష్టం లేక తాము పారిపోయ్యామని తెలిపారు. దీనితో సీఐ, ఎస్ఐ, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పాఠశాలలో ఇవీ లోపాలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మనబడి నాడు– నేడులో భాగంగా సి.బెళగల్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 20 నూతన మరుగుదొడ్లు నిర్మించారు. అలాగే 20 పాత మరుగుదొడ్లను మరమ్మతు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా పాఠశాల ఆవరణలో విద్యార్థుల కోసం మరో 32 కొత్త మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు.. పాఠశాల ప్రాంగణం దాటి బహిర్భూమికోసం సూదూరంగా వెళ్తున్నారు. మలవిసర్జనకు పాఠశాల బయటకు వచ్చి ఇలాంటి కథలకు చోటు చేసుకుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. -
విద్యార్థినిపై క్షుద్ర పూజ ప్రయోగం
కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగర శివారులోని బి.తాండ్రపాడు ఎస్ఆర్ కాలేజీలో క్షుద్ర పూజ ప్రయోగం కలకలం సంచలనం సృష్టించింది. ఈ నెల 26వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో హాస్టల్లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని చంపే ప్రయత్నం చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె గాఢనిద్రలో ఉండగా జుట్టుకు కత్తిరించాడు. తరువాత చంపబోయే సమయంలో ఆ విద్యార్థిని నిద్రలేచి కేకలు వేయడంతో దుండగుడు పారిపోయినట్లు తెలుస్తోంది.అయితే ఆ అమ్మాయి బెడ్పై కిల్యూ అనే లెటర్, పదునైన కత్తి, రెండు భాగాలు చేసిన నిమ్మకాయ ఉండడంతో క్షుద్ర పూజ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆ గదిలో మొత్తం ఏడుగురు విద్యార్థినులు నిద్రిస్తుండగా ఉండగా..అందులో బాగా చదివే విద్యార్థినినే టార్గెట్ చేయడం గమనార్హం. కాగా, గతంలో కూడా ఒక అమ్మాయిపై క్షుద్ర పూజలు జరిగాయని, అప్పట్లో ఆమె కళ్లు తిరిగి కింద పడిపోయిందని యాజమాన్యం వారి తల్లిదండ్రులకు చెప్పి సముదాయించినట్లు సమాచారం. ఇప్పుడు మళ్లీ కాలేజీలో క్షుద్ర పూజల ప్రయోగం జరగడంతో మిగతా విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని కళాశాల యాజమాన్యం... కాగా.. క్షుద్ర పూజల సంఘటనపై బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. అయితే తోటి విద్యార్థులు కొందరు విషయాన్నివారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు సోమవారం కాలేజీకి చేరుకొని ఆందోళన చెందారు. యాజమాన్యాన్ని సమాచారం అడిగిన సరైన సమాధానం ఇవ్వలేదు. ఈవిషయాన్నివిద్యార్థి, మహిళా సంఘాలు తెలుసుకొని కాలేజీ ఎదుట ఆందోనకు దిగాయి. అస్తవ్యస్తంగా హాస్టల్ నిర్వహణ... ఎస్ఆర్ కాలేజీకి అనుబంధంగా ఉండే హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాలేజీలో మహిళా సెక్యూరిటీ గార్డులు ఉండాల్సి ఉన్నా ఉండడంలేదు. కాలేజీలో ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. అంతేకాక మహిళా వార్డెన్లు కూడా లేరని చెబుతున్నారు. అయినా యాజమాన్యం మాత్రం విద్యారి్థనుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్ఐఓ విచారణ.. ఎస్ఆర్ కాలేజీలో అమ్మాయిపై క్షుద్రపూజల కలకలం నేపథ్యంలో ఆర్ఐఓ గురవయ్యశెట్టి విచారణచేపట్టారు. ఆయన కాలేజీకి చేరుకొని బాధిత విద్యారి్థని, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇంతవరకు కేసు నమోదుకాలేదు. -
మోడల్ స్కూల్ విద్యార్థినులకు అరుదైన అవకాశం
కంచిలి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని మఠం సరియాపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రాజెక్టు రూపకల్పన చేసే అరుదైన అవకాశాన్ని పొందారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాదికారి టి.తిరుమల చైతన్య నుంచి పాఠశాలకు శనివారం ఉత్తర్వులు అందాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రాజెక్టు రూపకల్పన చేసి ప్రదర్శించేందుకు ఇక్కడి విద్యార్థినులకు అవకాశం లభించింది. పాఠశాల విద్యా శాఖ తరఫున జిల్లాలో మఠం సరియాపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు ఐదుగురు, పొన్నాడ కేజీబీవీ విద్యార్థినులు ఐదుగురు ఎంపికైనట్టు ఉత్తర్వులు వెలువడ్డాయని ప్రిన్సిపాల్ శివప్రసాద్ వెల్లడించారు.వీరు ఈ నెల 26నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు బెంగళూరులో జరిగే ఇంటర్స్టేట్ హాకథాన్ ప్రోగ్రామ్లో పాల్గొనబోతున్నట్టు తెలిపారు. పాఠశాలకు చెందిన ఆరాధ్య పాణిగ్రాహి (9వ తరగతి), శ్రద్ధాంజలి మహంతి (9వ తరగతి), యాస్మిన్ చౌదరి (7వ తరగతి), రితిక బడిత్య (9వ తరగతి), మహంతి శ్రద్ధాంజలి (9వ తరగతి), గైడ్ టీచర్ బడియా సత్యనారాయణ ఈ ప్రాజెక్టు ప్రదర్శనకు ఎంపికయ్యారు. ఐదుగురు విద్యార్థినులు, గైడ్ టీచర్ బెంగళూరు వెళ్లి రావడానికి ఉచిత విమాన ప్రయాణం, ఫైవ్ స్టార్ వసతి కల్పించనున్నారు. -
శ్రీవల్లి అదృశ్యం
నాగోలు: ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాగోలు ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లికి చెందిన గౌరు రోజు జయప్రద కుమార్తె శ్రీవల్లి (18) ఇంటర్లో ఫెయిలైన సబ్జెక్టుల కోసం కొన్ని రోజుల క్రితం నాగోలు డివిజన్ పరిధిలోని బండ్లగూడలోని లక్ష్మి బాలికల హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నది. సంక్రాంతి సెలవులకు ఈనెల 11న ఇంటికి వెళ్లి ఈనెల 17న హాస్టల్కు వచ్చింది. 23న కూతురు కోసం హాస్టల్ వారికి ఫోన్ చేసి శ్రీవల్లి 20న ఇంటికి పంపినట్లు సమాచారం తెలిపారు. అయితే తమ కుమార్తె ఇంటికి రాలేదని వారు బదులిచ్చారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బండ్లగూడ హాస్టల్కు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించగా తమ గ్రామానికి చెందిన వ్యక్తి ద్వారా పంపినట్లు తెలిపారు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రిన్సిపాల్ కే స్టూడెంట్ వార్నింగ్
-
విద్యార్థిని ఆత్మహత్య
చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి (19) హైదరాబాద్లో మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన దర్శనం చంద్రయ్య, బాలవ్వ దంపతుల రెండో కూతురు భార్గవి హైదరాబాద్లో గల ఆంధ్ర మహిళా సభలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. జామై ఉస్మానియా రైల్వే ట్రాక్పై మంగళవారం ఉదయం మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు అక్కడకు చేరుకొని పరిశీలించారు. పెద్దకోడూరుకు చెందిన భార్గవిగా గుర్తించారు. భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు హుటాహుటినా హైదరాబాద్కు తరలివెళ్లారు. -
కూటమి ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ కాలేజీల ఆగడాలు పెరిగాయి
-
ఫీజు కట్టలేదని విద్యార్థిని గెంటేశారు
కంకిపాడు: ఫీజు కట్టలేదని విజయవాడ సమీపంలోని గోసాల శ్రీచైతన్య కళాశాల నుంచి యాజమాన్యం ఓ విద్యార్థిని అర్థరాత్రి వేళ బయటకు పంపించేసింది. దీంతో ఆ విద్యార్థి, అతని తండ్రి కళాశాల గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. మీడియాకు సమాచారం వెళ్లటంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. బాధితుడి కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆబోతు టార్జాన్ కుమారుడు గౌతమ్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.సంక్రాంతికి ఇంటికి వెళ్లిన గౌతమ్ ఆదివారం రాత్రి తన తండ్రితో కలసి కళాశాలకు వచ్చాడు. ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అనుమతిస్తామని కళాశాల సిబ్బంది చెప్పారు. టార్జాన్ తన వద్ద ఉన్న రూ 20 వేలు నగదును చెల్లించాడు. మిగిలిన రూ. 50 వేలు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని బతిమలాడారు. అందుకు యాజమాన్యం ససేమిరా అని విద్యార్థిని కళాశాల నుంచి పంపించేసింది. దీంతో విద్యార్థి గౌతమ్, అతని తండ్రి టార్జాన్ అర్ధరాత్రి కళాశాల గేటు వద్దే నిరసన వ్యక్తం చేశారు.పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఏప్రిల్లో పరీక్షలు ఉన్నాయని, ఆ లోపు ఫీజు చెల్లిస్తానని చెప్పినా యాజమాన్యం అంగీకరించలేదని వాపోయారు. నిర్దాక్షిణ్యంగా తమను బయటకు పంపించేశారని తెలిపారు. పోలీసులు కూడా కళాశాలకు చేరుకుని ఆరా తీశారు. దీంతో యాజమాన్యం విద్యార్థి, అతని తండ్రితో మాట్లాడి విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. -
బతకాలంటే భయమేస్తోందమ్మా.. నన్ను క్షమించు తమ్ముడు ...
నెల్లిమర్ల: తమ కుమారుడు వైద్య వృత్తిలో స్థిరపడతాడని ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు. మరికొన్ని రోజుల్లో ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకుని, రోగులతో పాటు తమకు కూడా వైద్యసేవలు అందిస్తాడని ఆశ పడ్డారు. అయితే వారి ఆశలు ఆడియాసలయ్యాయి. చేతికి అందివచ్చిన కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం నుంచి బ్యాక్లాగ్స్ ఉండిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు, సహ విద్యార్థులు అందించిన వివరాల ప్రకారం.. నెల్లిమర్ల పట్టణంలో ఉన్న మిమ్స్ వైద్య కళాశాలలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన అతుకూరి సాయి మణిదీప్(24) ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం కళాశాల ప్రాంగణంలో ఉన్న హాస్టల్ గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్లో పురుగుల మందు తెప్పించుకుని, కూల్ డ్రింకులో కలుపుకుని తాగా డు. విషయం తెలుసుకున్న సహ విద్యార్థులు విషయాన్ని మిమ్స్ యాజమాన్యానికి తెలియజేశారు. యాజమాన్య ప్రతినిధులు నెల్లిమర్ల పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గణేష్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయి మణిదీప్ బెడ్ కింద పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. చదువు విషయంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సదరు నోట్లో మృతుడు ప్రస్తావించాడు. బ్యాక్ లాగ్స్ ఎక్కువగా ఉండటం, చదువుపై ఏకాగ్రత లేకపోవడంతో చనిపో తున్నట్లు రాసాడు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గణేష్ తెలిపారు. -
HYD: ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం
ఖరతాబాద్: ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కనిపించకుండా పోయిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం.... ఖైరతాబాద్ డివిజన్ మహాభారత్నగర్లో నివాసముండే తలారి ఎల్లయ్య, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం కాగా వీరి కుమార్తె తలారి రేణుకాదేవి (22) ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఉదయం షాపునకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన తిరిగి రాలేదు. దీంతో రేణుకాదేవి తల్లి విజయలక్ష్మి ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తితో వెళ్లి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: తాడిగడప శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని మృతి చెందింది. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామానికి చెందిన రామిశెట్టి గంగా భువనేశ్వరి.. నీట్లో కోచింగ్ తీసుకుంటోంది. కామినేని ఆసుపత్రికి విద్యార్థిని మృతదేహన్ని తరలించారు. కాగా, తమ కుమార్తె మృతిపై విద్యార్థిని తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు, కుమార్తె మృతి విషయం తెలుసుకున్న తండ్రికి గుండెపోటుకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.విద్యార్ధి తల్లి గోవింద లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు ఎటువంటి ఆనారోగ్య సమస్యలు లేవని.. నిన్న రాత్రి కూడా తనతో ఫోన్లో మాట్లాడిందన్నారు. గత రాత్రి తన కుమార్తెకు తలనొప్పి వస్తే అర్ధరాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పుడు చనిపోయింది అంటున్నారు.తలనొప్పి వస్తే ప్రాణం పోతుందా?. ఇప్పుడు నిర్లక్ష్యంగా శవాన్ని తీసుకువెళ్లమంటున్నారు’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన విషయం ఎందుకు దాచారు?. చనిపోయిందని ఆలస్యంగా ఎందుకు తెలిపారు?’’ అంటూ ఆమె ప్రశ్నించారు.ఇదీ చదవండి: తప్పు స్పెల్లింగ్తో నకిలీ కిడ్నాప్ గుట్టు రట్టు -
సైబర్ మోసానికి యువకుడు బలి!
-
ఏంటో నా జీవితం... పిచ్చిలేస్తోంది
శామీర్పేట్: ‘నాకు ఏమీ రావు.. ఏంటో నా జీవితం.. పిచ్చిలేస్తుంది.. అసలు లైఫ్ మొత్తం ఇలానే ఉంటుందా.. నాకు చనిపోవాలనిపిస్తుంది’ అంటూ స్కూల్ నోట్ బుక్లో సూసైడ్ నోట్ రాసి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్స్టేషన్ పరిధి తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగ వెంకటరమణ–లక్ష్మి దంపతులు 15 ఏళ్ల క్రితం తుర్కపల్లికి వలస వచ్చి ఉమాశంకర్ రైస్మిల్లో కారి్మకులుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వీరి కూతురు తేజస్విని సాయిదుర్గాలక్ష్మి (16) గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఈ నెల 3న తలనొప్పిగా ఉందని తేజస్విని స్కూల్కు వెళ్లలేదు. రాత్రి కుటుంబమంతా కలిసి భోజనం చేసి నిద్రించారు. శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో తల్లి లక్ష్మి బాత్ రూంకు వెళ్లగా తేజస్విని బాత్రూంలో చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న జీనోమ్ వ్యాలీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దర్యాప్తులో స్కూల్ నోట్ బుక్లో సూసైడ్ నోట్ గుర్తించారు. కాగా తేజస్విని అతిగా నిద్రించేదని, తల్లిదండ్రులు మందలించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
విద్యార్థినితో లెక్చరర్ ప్రేమపెళ్లి
మైసూరు: పాఠాలు నేర్పించిన గురువు ఓ విద్యార్థినితో పరారై పెళ్లి చేసుకున్న ఘటన జిల్లాలోని హుణసూరులో జరిగింది. తనకంటే వయస్సులో 15 ఏళ్లు పెద్దవాడైన అధ్యాపకుడిని పెళ్లి చేసుకోవడమే గాకుండా భద్రత కోరుతూ ఆమె ఠాణాలో ఫిర్యాదు చేసింది. వివరాలు.. హుణసూరు నివాసి పూర్ణిమ (24) ఎంఏ పూర్తి చేసి బీఈడీ చదివేందుకు హుణసూరులోని మహావీర్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్లో చేరింది. అధ్యాపకుడు యశోదకుమార్ (39)ను ఆమెకు ప్రేమ పాఠాలు బోధించాడు. విషయం పెళ్లి వరకూ వచ్చింది. పూరి్ణమ ఇంటిలో ఇందుకు అభ్యంతరం చెప్పి ఆమెను కాలేజీకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కానీ మొబైల్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని నమ్మించి ఇంటి నుంచి బయటకు వచ్చిన పూరి్ణమ తిరిగి రాలేదు. అనంతరం మొబైల్లో తాను ప్రేమించిన యశోదకుమార్ను పెళ్లి చేసుకున్నట్లు మెసేజ్ పెట్టింది. వీధుల్లో ఆకు కూరలు అమ్మి రూ.2 లక్షలు అప్పు చేసి మరీ కూతురిని కాలేజీలో చేరి్పస్తే, అధ్యాపకుడు లోబర్చుకున్నాడని తల్లిదండ్రులు చింతాక్రాంతులయ్యారు. -
ట్యూషన్ టీచర్కు 111 ఏళ్ల జైలు.. ఏం నేరం చేశాడంటే..?
తిరువనంతపురం: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ టీచర్కు కేరళలోని స్పెషల్ ఫాస్ట్–ట్రాక్ కోర్టు ఏకంగా 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి, ఇటువంటి నేరానికి పాల్పడినందున జాలి చూపాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన మనోజ్(44) తను ఉండే ఇంట్లోనే ట్యూషన్లు చెబుతుండేవాడు. అతడి వద్దకు వచ్చే 11వ తరగతి బాలికను 2019లో ఓ రోజు ప్రత్యేక క్లాసుకని పిలిపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదంతా సెల్ఫోన్లో షూట్ చేశాడు.ఈ ఘటనతో భయపడిపోయిన బాలిక ట్యూషన్కు వెళ్లడం మానేసింది. మనోజ్ తన ఘనకార్యాన్ని చెప్పుకునేందుకు ఆ ఫొటోలను మరికొందరికి పంపాడు. విషయం తెలిసి బాధితురాలి కుటుంబీకులు ఫోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనస్తాపానికి గురైన మనోజ్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మనోజ్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి సెల్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. బాలికపై అత్యాచారం జరిపిన ఫొటోలు అందులో ఉన్నట్లు గుర్తించారు.అయితే, అదే సమయంలో ఆఫీసులో ఉన్నట్లు అక్కడి రిజిస్టర్లోని సంతకం చూపి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ, మనోజ్ ఫోన్లోని కాల్ రికార్డుల ఆధారంగా అవన్నీ తప్పని తేలింది. దీంతో, ప్రత్యేక కోర్టు నిందితుడికి 111 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.1.05 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది అదనంగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని జడ్జి ఆర్.రేఖ తీర్పు వెలువరించారు. -
సైబర్ మోసం తాళలేక విద్యార్థి ఆత్మహత్య
వీణవంక (హుజూరాబాద్): సైబర్ మోసానికి ఓ విద్యార్థి బలైపోయాడు. రూ. 5 వేలు పెట్టుబడి పెడి తే రెండింతలు ఇస్తాం’ అంటూ ఫోన్కు వచ్చిన మె సేజ్కు ఆకర్షితుడై పలు దఫాలుగా కేటుగాళ్లకు రూ.90 వేల మేర ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి మోసపోయాడు. చివరకు మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగ ల్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మహిళా సంఘం నుంచి తల్లి తీసుకున్న చిట్టీ డబ్బులతో.. బేతిగల్ గ్రామంలో నివసిస్తున్న గుమ్మడి సృజన్–ఉమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రిషివర్థన్ (18) ఇటీవల డిప్లొమా పూర్తి చేసి బీటెక్ ప్రయత్నాల్లో ఉన్నాడు. వారం క్రితం అతని మొబైల్కు కేటుగాళ్లు ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట పంపిన సందేశం చూసి ఆకర్షితుడయ్యాడు. తన తల్లి ఇటీవల మహిళా సంఘం నుంచి రూ. 90 వేల చిట్టీ పాడుకోవడంతో వచ్చిన డబ్బును ఇందుకోసం వాడుకోవాలనుకున్నాడు. వెంటనే ఆమె ఖాతాలోంచి ఆ సొమ్మును తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. తొలుత రూ. 5 వేలను సైబర్ నేరగాళ్ల ఖాతాకు పంపాడు. అయితే రెట్టింపు సొమ్ము పొందాలంటే రెండో టాస్్కగా రూ. 23,500 పెట్టుబడి పెట్టాలంటూ వారు మెలిక పెట్టడంతో ఆ సొమ్మునూ చెల్లించాడు. మూడో టాస్్కలో రూ. 68 వేలు పెట్టుబడి పెడితే రీఫండ్ వస్తుందని కేటుగాళ్లు నమ్మించడంతో ఆ మొత్తం కూడా బదిలీ చేశాడు. అయితే ఆ సొమ్ముకు రెట్టింపు పొందాలంటే రూ. 2 లక్షల 6 వేలను బదిలీ చేయాలని వారు పేర్కొనడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు కుటుంబ సభ్యులకు లేఖ రాశాడు. ‘సారీ మమ్మీ.. నేను చనిపోతున్నా, రిన్నూ (తమ్ముడు) జాగ్రత్త.. డాడీ, మమ్మీ ఇన్నీ రోజులు నన్ను భరించినందుకు థ్యాంక్స్. నేను ట్రేడింగ్ (స్టాక్ మార్కెట్)లో డబ్బులు పెట్టి మోసపోయా. కంపెనీ వివరాలు నా మొబైల్లో ఉన్నాయి’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. -
ఉద్యమంలా డ్రగ్స్ ను నిర్మూలిద్దాం
-
హైదరాబాద్ నాచారంలో యువతి ఆత్మహత్య
-
అశోక్నగర్లో గ్రూప్–2 అభ్యర్థి బలవన్మరణం
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని అవుసులకుంట తండాకు చెందిన గిరిజన యువతి గుగులోత్ సురేఖ(22) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తండావాసులు తెలిపారు. యువతి ఉన్నత చదువులు చదివి హైదరాబాద్లో ఉంటూ వివిధ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. వారం క్రితం నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలకు సైతం హాజరైనట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఎంతో భవిష్యత్ ఉన్న యువతి ఆత్మహత్య చేసుకోవడంతో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. Hanumakonda: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హసన్పర్తి: హనుమకొండ పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం ఆ కాలేజీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాంధన్ తండాకు చెందిన గుగులోతు శ్రీదేవి(16) నగరంలోని డబ్బాల్ జంక్షన్ వద్ద గల ఏకశిలా గర్ల్స్ క్యాంపస్లో ఇంటర్ (ఎంపీసీ) ఫస్టియర్ చదువుతోంది. మంగళవారం రాత్రి 9 గంటలకు కాలేజీ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ నిర్వాహకులకు చెప్పగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సదరు విద్యార్థి శ్రీదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే హాస్టల్ గదిలో ఉరివేసుకుందని చెప్పారు.విద్యార్థి సంఘాల ఆందోళన..శ్రీదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, బంధువులు రాత్రి కాలేజీ వద్దకు భారీగా చేరుకున్నారు. మృతదేహంతో కాలేజీ ఎదుట బైఠాయించారు. శ్రీదేవి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది.గుండెపోటుతో ఎంబీబీఎస్ స్టూడెంట్ మృతిఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000 / 040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నీట్ పీజీ అడ్మిషన్లలో జాప్యం..ఆందోళనలో విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఆలస్యమైన నీట్–పీజీ ప్రవేశాల అంశం సుప్రీంకోర్టు ముందుకెళ్లడంతో తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ స్థానికత అంశంపై జీవోలు 148, 149ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లడంతో నవంబర్లో మొదలు కావాల్సిన పీజీ కౌన్సెలింగ్ ఆల స్యమైంది. ఇటీవల హైకోర్టు ఆ జీవోలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో సర్కా ర్ సుప్రీంకోర్టు తలుపుతట్టింది.తెలంగాణలోని పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాలని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరింది. ఇది సుప్రీంకోర్టులో జనవరి 7న విచారణకు రానుంది. సుప్రీం విచారణ ముగిస్తే గానీ తెలంగాణ విద్యార్థుల కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యేలా లేదు. ఇప్పటికే అఖిల భారత కోటా (ఏఐక్యూ) కింద మొదటి రౌండ్ ప్రవేశాల ప్రక్రియ పూర్తికాగా, రెండో రౌండ్ రిజిగ్నేషన్ పీరియడ్ ఈనెల 26తో ముగియనుంది. ఆ తరువాత మూడో రౌండ్ ఓపెన్ అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి పీజీ ప్రవేశ పరీక్ష రాసిన సుమారు 8 వేల మంది విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. ఫిబ్రవరి 5లోగా పూర్తికావాల్సిన ప్రక్రియ నీట్–పీజీ ప్రవేశాలకు సంబంధించి అన్ని రకాల ప్రవేశాలను ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయాలనేది నిబంధన. సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన మార్గదర్శకాల మేరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఒకవేళ జనవరి 7న సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే... అప్పటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించినా ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయడం సాధ్యంకాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవేశాలకు సంబంధించి మొత్తం నాలుగు రౌండ్స్ ఉంటాయి. కన్వినర్ కోటా, యాజమాన్య కోటా, ఎన్ఆర్ఐ (సీ కేటగిరి) కోటాతోపాటు స్ట్రే వెకెన్సీ ఉంటుంది. ఒక్కో విడతకు కనీసం వారం రోజుల సమయమివ్వాలి.ఎందుకంటే విద్యారి్థకి సీటు కేటాయించిన తర్వాత వారు జాయిన్ అయ్యేవరకు ఆగాలి. అనంతరం మరోవిడత కౌన్సెలింగ్ చేపట్టాలి. ఇలా తక్కువ సమయంలోనే అన్ని రకాల కౌన్సెలింగ్లను ఎలా చేపడతారని మెడికోలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకు వరంగల్లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థులకు సంబంధించిన ర్యాంకు కార్డులను గానీ, జాతీయస్థాయి మెరిట్ కార్డులను గానీ విడుదల చేయలేదు. దీంతో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ సీటు కోసం ఎదురు చూస్తున్న మెడికల్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అఖిల భారత కోటాలో సగం సీట్లు భర్తీ రాష్ట్రంలో 2,886 మెడికల్ పీజీ సీట్లున్నాయి. వీటిలో 1,300 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నాయి. వీటిల్లోని 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు వెళ్తాయి. మన రాష్ట్ర విద్యార్థులకు మిగిలేవి 650 సీట్లే. వీటిలో రెండు రౌండ్ల కౌన్సెలింగ్లో దాదాపుగా అన్ని సీట్లు నిండిపోయాయని విద్యార్థులు చెబుతున్నారు. మిగతా 650 సీట్ల విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడేదాకా వేచి చూడాలని అంటున్నారు. కాగా, ప్రైవేటులో 1,500కు పైగా సీట్లలో 50 శాతం కన్వినర్ కోటా కిందకు వస్తాయి. 35 శాతం మేనేజ్మెంట్ కోటా, 15 శాతం ఎన్నారై కోటాకు వెళ్తాయి. స్టేట్ రౌండ్ 1ను ప్రకటించాలి: టీ–జుడా అఖిలభారత కోటా మూడో రౌండ్ నిర్వహణ ప్రారంభమయ్యేలోగా తెలంగాణలో స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా రెండు రౌండ్లలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము రాహుల్, ఇసాక్ న్యూటన్, చైర్పర్సన్ డి. శ్రీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. ఏఐక్యూ రెండో రౌండ్ రిజిగ్నేషన్ డెడ్లైన్ పూర్తయ్యేలోపు స్టేట్ మొదటి కౌన్సెలింగ్ పూర్తి చేయాలన్నారు. మెడికో డి.వెంకటేష్ కుమార్ విద్యార్థుల తరపున మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెంటనే రాష్ట్రంలో కౌన్సెలింగ్ ప్రారంభించాలని కోరారు. -
ముగ్గురు బీటెక్ విద్యార్థుల అదృశ్యం
ఇబ్రహీంపట్నం: వారం రోజుల్లో ముగ్గురు బీటెక్ విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు సోమవారం ఆలస్యంగా వెలుగుచూశాయి. మిస్సింగ్ అయిన వారిలో ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. స్థానిక ఎస్ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా, మోమిన్పేట మండలం రాంనాథ్గుడపల్లికి చెందిన కొత్తగాడి బాల్రాజ్ కుమారుడు (17) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యాసంస్థల్లో బీటెక్ (సీఎస్సీ) ప్రథమ సంవత్సరం చదువుతూ కాలేజ్ హాస్టల్లో ఉంటున్నాడు.14న హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. తండ్రి బాల్రాజ్ విష్ణుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మరుసటి రోజు నేరుగా కాలేజ్కి వచ్చి ఆరా తీయగా.. సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. ఇదిలా ఉండగా యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలం, కాప్రాయిపల్లికి చెందిన మరో విద్యార్థిని(17) గురునానక్ కాలేజ్లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ ఇదే కళాశాల హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 17న సాయంత్రం 6 గంటల నుంచి కనిపించకుండా పోయింది. అలాగే వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన 19 సంవత్సరాల విద్యారి్థని ఈనెల 20న అదృశ్యమైంది. ఈమె కూడా కాలేజ్ హాస్టల్లో ఉంటూ బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కాలేజీ నిర్వాహకులు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. -
విదేశీ విద్యకు ప్రయాణ బీమా దన్ను
విద్య కోసం విదేశాల బాట పట్టినప్పుడు కొత్త సంస్కృతులు, సవాళ్లు, వ్యక్తిగత వృద్ధి అవకాశాలు ఇలాంటివి ఎన్నో ఉక్కిరిబిక్కిరి చేసే అనుభవాలు ఎదురవుతాయి. అయితే, ఈ ఉత్కంఠభరితమైన సాహసయాత్రలో రిసు్కలు, అనిశి్చతులూ ఉంటాయి. హెల్త్ ఎమర్జెన్సీల నుంచి.. ట్రిప్లు రద్దవడం వరకు పలు రకాల సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే విదేశాల్లో విద్యాభ్యాసాన్ని ఎంచుకున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఒక ఆప్షన్ కాదు.. తప్పనిసరిగా తీసుకోతగిన రక్షణ కవచంలాంటిది. ఇందుకు గల అనేక కారణాల్లో కొన్ని... ఆరోగ్య సంరక్షణకు.. విదేశాల్లో హెల్త్కేర్ వ్యవస్థలు, వ్యయాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. పలు దేశాల్లో వైద్య వ్యయాలు భారీగానే ఉంటాయి. దీన్ని అధిగమించడం శక్తికి మించిన భారంగా అనిపించవచ్చు. ఉదాహరణకు అమెరికాలో మామూలుగా ఆసుపత్రికి వెళ్లినా వందల కొద్దీ డాలర్ల వ్యయంతో కూడుకున్న వ్యవహారంగా ఉంటుంది. ఇక మిగతా దేశాల్లో ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ అనేది వేల కొద్దీ డాలర్లతో ముడిపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఊహించని వ్యయాల భారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది ప్రయాణ బీమా. డాక్టర్ విజిట్స్, ఆసుపత్రిలో చేరడం, ఎమర్జెన్సీ మెడికల్ ఎవాక్యుయేషన్లు మొదలైన వాటన్నింటికీ కవరేజీని ఇస్తుంది. ఈ విషయంలో భరోసా లభించడం వల్ల విద్యార్థులు తమ చదువుపై నిశ్చింతగా ఫోకస్ చేసేందుకు వీలుంటుంది. ప్రయాణాలకు ఆటంకాలెదురైనా.. రాజకీయ అనిశి్చతి, ప్రకృతి వైపరీత్యాలు లేదా వ్యక్తిగతంగా అత్యవసర పరిస్థితులు తలెత్తడం మొదలైన ఊహించని అంశాల వల్ల ప్రయాణ ప్రణాళికలపై ప్రభావం పడొచ్చు. ఒకవేళ మీరు వెళ్లే దేశంలో ప్రకృతి వైపరీత్యం తలెత్తి, ట్రిప్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి, మళ్లీ కొత్తగా బుక్ చేసుకోవాల్సి వస్తే.. ఆయా వ్యయాలన్నింటికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా కవరేజీని పొందే అవకాశం ఉంటుంది. అదనంగా ఆర్థిక భారం పడకుండా మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే మీ ట్రిప్ను కుదించుకున్నా లేక అది రద్దయినా.. ప్రయాణ ఏర్పాట్ల కోసం మీరు వెచి్చంచిన మొత్తం డబ్బు వృధా కాకుండా చూసుకోవడానికి వీలవుతుంది. విలువైన వస్తువులకు భద్రత.. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్తున్నప్పుడు విలువైన ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, ఇతరత్రా అవసరమైన ఎల్రక్టానిక్స్ వస్తువులను వెంట తీసుకెళ్లే అవకాశం ఉండొచ్చు. సరిగ్గా పాఠాలు ప్రారంభమయ్యే సమయానికి మీ ల్యాప్టాప్ పోయిందంటే ఎంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. అదే ప్రయాణ బీమా ఉంటే ఈ గందరగోళం నుంచి బైటపడేందుకు ఆస్కారం ఉంటుంది. దీనితో ఆయా ఉత్పత్తుల రీప్లేస్మెంట్ ఖర్చులతో పాటు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత సామాన్లకు కూడా కవరేజీని పొందవచ్చు. విదేశాల్లో 24 గంటల ఎమర్జెన్సీ సహాయం.. 24/7 ఎమర్జెన్సీ అసిస్టెన్స్ సర్విస్ అనేది ట్రావెల్ ఇన్సూరెన్స్లో అత్యంత కీలకమైన ఫీచర్లలో ఒకటి. లోకల్ డాక్టరును సంప్రదించడం మొదలుకుని అత్యవసరంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం వరకు వివిధ ఎమర్జెన్సీ సందర్భాల్లో తక్షణ సహాయం పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటికి దూరంగా ఉండే సమయంలో విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు సహాయం అందుబాటులో ఉంటుందనే ఆలోచన ఎంతో నిశ్చింతనిస్తుంది. థర్డ్ పార్టీ లయబిలిటీ ప్రమాదాలనేవిఅనుకోకుండానే జరిగిపోతాయి. మనం ఎంత పరిశోధన చేసి, ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా.. సరిగ్గా సమయం వచ్చేసరికి అన్నీ పక్కకు వెళ్లిపోవచ్చు. విదేశాల్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ప్రమాదవశాత్తూ థర్డ్ పార్టీలకు ఏదైనా నష్టం కలిగించడం వల్ల పరిహారాన్ని చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. అద్దెకు తీసుకున్న ఇల్లు ప్రమాదవశాత్తూ దెబ్బతిన్నా, ఏదైనా ప్రమాదంలో ఎవరైనా గాయపడినా .. మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది లీగల్, ఆర్థిక వ్యయాలను కవర్ చేస్తుంది. దూరదృష్టి ముఖ్యం.. ప్రయాణ బీమా అనవసర ఖర్చు అనే ఉద్దేశంతో పక్కన పెట్టేసేద్దామని అనిపించినా.. విదేశాల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు ఎదురయ్యే రిసు్కల గురించి ఒకసారి ఆలోచిస్తే.. ఇది ఎంతో వివేకవంతమైన పెట్టుబడి కాగలదు. హెల్త్ ఎమర్జెన్సీలు, ప్రయాణాలు రద్దు కావడం, వస్తువులు పోవడం, లీగల్ ఖర్చులు, కాలేజీ ఫీజులపరమైన నష్టాలు మొదలైన వాటన్నింటికీ ట్రావెల్ ఇన్సూరెన్స్తో కవరేజీ ఉంటుందనే ఆలోచన కొండంత భరోసానిస్తుంది. మిగతా వాటి గురించి ఆందోళన చెందకుండా నిశ్చింతగా చదువుపై దృష్టి పెట్టేందుకు ఉపయోగపడుతుంది. -
గురుకుల పాఠశాల విద్యార్థుల నిరసన
-
విద్యార్థినిని గర్భవతిని చేసిన కెమిస్ట్రీ టీచర్..
అన్నానగర్: కడలూరు జిల్లా సేతియాతోపు పక్కన ఉన్న మంగళం ప్రాంతానికి చెందిన మలర్ సెల్వం (50). ఇతనికి పైళ్లె పిల్లలు కూడా ఉన్నారు. అదే ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ పాఠశాలలో చదువుతున్న ప్లస్–2 విద్యార్థినిని లైంగికంగా వేధించేవాడని తెలుస్తోంది. ఈ విద్యార్థి ప్రస్తుతం చైన్నెలోని ఓ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ స్థితిలో 15వ తేదీన కడుపునొప్పి రావడంతో విద్యార్థిని చికిత్స నిమిత్తం చైన్నెలోని కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అప్పుడు ఆమెకి అబ్బాయి పుట్టాడు. దీంతో విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది చూసిన ఆసుపత్రి సిబ్బంది విద్యార్థిని రక్షించి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం విద్యార్థిని బంధువులు సెంఽబియం తోప్పు ఆల్ మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడు మలర్ సెల్వంను గురువారం అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ప్రాక్టికల్స్లో మార్కులు తగ్గిస్తానని బెదిరించి గతేడాది స్కూల్లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. -
ఐదు గంటల్లో కోటీశ్వరుడైన 9వ తరగతి విద్యార్ధి.. అసలేం జరిగిందంటే?
బీహార్లోని ముజఫర్పూర్లో ఒక విద్యార్థి తన బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ను చెక్ చేసినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే తన బ్యాండ్ బ్యాలెన్స్ ఏకంగా రూ.87.63 కోట్లుగా చూపించింది. దీంతో ఐదు గంటల పాటు ఆ విద్యార్ధి కోటీశ్వరుడయ్యాడు.బీహార్కు చెందిన 9వ తరగతి విద్యార్థి 'సైఫ్ అలీ' రూ.500 విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎంకు వెళ్ళాడు, ఆ సమయంలో తన బ్యాంకు బ్యాలెస్ చెక్ చేస్తే.. రూ.87.65 కోట్లు ఉన్నట్లు చూపించింది. స్క్రీన్పైన కనిపించే బ్యాంక్ బ్యాలెన్స్ అతన్ని ఒక్కసారిగి ఆశ్చర్యపరిచింది. సైఫ్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లితో ఈ విషయాన్ని పంచుకున్నాడు.సైఫ్ ఖాతాలో రూ.87.63 కోట్లు ఉన్న విషయం ఆ ఊరు మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ అతడు బ్యాంక్ స్టేట్మెంట్ కోసం కస్టమర్ సర్వీస్ పాయింట్కు వెళ్లి చెక్ చేసాడు. అప్పుడు అతని ఖాతాలో కేవలం 532 రూపాయలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. అంతే కాకుండా అతని బ్యాంక్ అకౌంట్ కూడా కొంత సేపు స్తంభించింది.ఈ వింత సంఘటన కేవలం ఐదు గంటలు మాత్రమే కొనసాగింది. తనకు తెలియకుండానే వచ్చిన అదృష్టం.. తనకు తెలియకుండానే అదృశ్యమైంది. నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంక్.. సైఫ్ ఖాతాలో పొరపాటున ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయ్యిందో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించింది. ఈ తప్పిదం ఎలా జరిగిందన్న దానిపై బ్యాంకు అధికారులు ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక..ఇలాంటి సంఘటనలు మొదటిసారి కాదుఅనుకోకుండా బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయిన సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ తరువాత వచ్చిన డబ్బు వచ్చినట్లే వెనక్కి వెళ్లాయి. కొంతమంది తమకు తెలిసిన వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయడం వంటివి కూడా చేశారు. కానీ ఆ డబ్బును కూడా అధికారులు మళ్ళీ కట్టించుకున్నారు. అయితే సైఫ్ ఖాతాలో పడ్డ డబ్బు, ఐదు గంటల తరువాత మాయమైంది. -
పెద్దాపూర్ గురుకులంలో మరో విద్యార్థికి పాముకాటు
కోరుట్ల: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురు కులంలో పాము కాటు మరోసారి కలకలం రేపింది. 3 నెలల క్రితం వారం వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు పాము కాటుకు గురికాగా, అందులో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎనిమి దో తర గతి చదు వుతున్న మెట్పల్లి పట్టణానికి చెందిన ఓంకార్ రవి–రుచిత దంపతుల కుమా రుడు అఖిల్ (14) పాము కాటుకు గుర య్యాడు. బుధవారం ఉదయం ఆరుగంటల సమయంలో అఖిల్ తన చేయి తిమ్మిరిగా ఉందని విధుల్లో ఉన్న నర్స్కు చూపించు కు న్నాడు. పరిశీలించిన నర్స్ ఏమీ కాలే దని సర్దిచెప్పింది. 9 గంటల సమయంలో అఖిల్ చేయి పూర్తిగా చతికిలపడటంతో వెంటనే ప్రిన్సిపాల్ మాధ వీలత దృష్టికి తీసు కెళ్లారు. చేతిపై పాముకాటు గాట్లు ఉండటంతో తల్లి దండ్రులకు సమాచారం ఇచ్చారు. అఖిల్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురైన మరో విద్యార్థి
-
ఖాళీ అవుతున్న కోచింగ్ సిటీ.. ఆత్మహత్యలే కారణమా?
కోటా: ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన రాజస్థాన్లోని కోటాలోగల కోచింగ్ పరిశ్రమ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడిపోతోంది. ఇక్కడకు వచ్చి కోచింగ్ తీసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో కోచింగ్ ఇనిస్టిట్యూట్లు, హాస్టల్ యాజమాన్యాలు ఏంచేయాలో తెలియని స్థితిలో చిక్కుకున్నాయి.కోచింగ్పై తొలగిన బ్రమకోటాలోని కోచింగ్ సెంటర్లలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వాటిలో మొదటిది ఇక్కడి కోచింగ్ సెంటర్లపై ఇంతవరకూ ఉన్న బ్రమలు తొలగిపోవడమైతే, మరొకటి విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరగడమేనని చెబుతున్నారు. అలాగే లెక్కకుమించి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో వీరు అందించే విద్యానాణ్యత తగ్గిపోతున్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.వేల కోట్ల టర్నోవర్కు గండికోచింగ్ సిటీగా పేరొందిన కోటాలో ప్రస్తుతం 1.10 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇది మునుపటి కంటే 30-35 శాతం తక్కువ. రూ. 6.5 వేల కోట్ల విలువ కలిగిన పరిశ్రమ ఇప్పుడు రూ.3.5 వేల కోట్లకు దిగజారింది. ఇది కోటా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది. కోటాలో కోచింగ్ పరిశ్రమ 2000లో వేగంగా అభివృద్ధి చెందింది. గత 20 ఏళ్ల ప్రగతి ఈ ఏడాదిలో ఊహించనంతగా దిగజారింది.కనీస హాస్టల్ అద్దె కూడా కరువు2018 నుంచి 2022 వరకు ఒకరికి నెలకు హాస్టల్ అద్దె రూ.15-16 వేలు వరకూ ఉండేది. ఇప్పుడు ఒకరి నుంచి రూ. 3000 కూడా దక్కడం లేదని హాస్టల్ యజమానులు వాపోతున్నారు. నెలకు రూ.2500 అద్దె తీసుకున్నా 30 శాతం గదులు మాత్రమే నిండుతున్నాయంటున్నారు. స్థానికంగా చాలా మంది అప్పులు చేసి హాస్టళ్లు నిర్మించుకున్నారని, విద్యార్థుల కొరత కారణంగా ఆ రుణ వాయిదాలు చెల్లించడం కష్టంగా మారిందని పలు హాస్టళ్ల యజమానులు అంటున్నారు.ఆత్మహత్యలే కారణమా?స్థానికంగా ఉన్న హాస్టళ్లు గతంలో విద్యార్థులను పీడించిమరీ డబ్బులు వసూలు చేశాయని, అందుకే వాటికి ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయ్యిందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. కోటాలోని కోచింగ్ సెంటర్లపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విరక్తి చెందడానికి ఇక్కడ చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 2023లో కోటాలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చదువు ఒత్తిడే ఈ సంఘటనలకు ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారు. ఫలితంగా కోటాకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.ప్రముఖ కోచింగ్ సెంటర్లకు మరిన్ని బ్రాంచీలుమరోవైపు ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు దేశంలోని వివిధ నగరాల్లో తమ కేంద్రాలను తెరిచాయి. 2020 వరకు 10 కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలు ఇప్పుడు 80 నుండి 100 కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఫలితంగా విద్యార్థులకు కోటా ఒక్కటే కాకుండా పలు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ పెద్ద బ్రాండ్ కోచింగ్ సెంట్లర్ల కారణంగా స్థానిక కోచింగ్ ఇన్స్టిట్యూట్లు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి.పరిష్కారం కోసం మల్లగుల్లాలుప్రస్తుతం కోటా కోచింగ్ పరిశ్రమకు కష్టకాలం నడుస్తోంది. దీనిని సవాలుగా తీసుకున్న హాస్టళ్ల యజమానులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పరిష్కారం దిశగా యోచిస్తున్నారు. విద్యార్థుల భద్రత, వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అలాగే కోచింగ్ నాణ్యతను మెరుగుపరచడానికి, కొత్త కోర్సులను ప్రారంభించేందుకు కూడా కోచింగ్ సెంటర్ల యజమానులు ప్రయత్నిస్తున్నారు. మరి ఇవి ఎంతవరకూ సక్సెస్ అవుతాయో వేచిచూడాల్సిందే.ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హయత్నగర్ (హైదరాబాద్)/గోపాల్పేట: ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లికి చెందిన పండగ మధుసూదన్రెడ్డి రైతు. ఆయన కొడుకు లోహితస్యరెడ్డి (12) హయత్నగర్లోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి భోజనం అనంతరం 8 గంటలకు తోటి విద్యార్థులంతా స్టడీ అవర్లో చదువుకునేందుకు వెళ్లగా.. లోహితస్యరెడ్డి ఒక్కడే గదిలో ఉన్నాడు.స్టడీ అవర్ తర్వాత గదిలోకి వచి్చన విద్యార్థులకు.. ఫ్యాన్కు వేలాడుతూ లోహితస్యరెడ్డి కనిపించాడు. దీంతో వారు హాస్టల్ సిబ్బందికి చెప్పగా.. హయత్నగర్లోని సన్రైజ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఉపాధ్యాయుల ఒత్తిడి, నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు ఆత్యహత్యకు పాల్పడ్డాడని మృతుని తండ్రి మధుసూధన్రెడ్డి ఆరోపించారు. ఇక్కడ చదవనంటే.. ఈ ఏడాది పూర్తయ్యేవరకు చదవమని నచ్చజెప్పానని చెప్పారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో కూడా ఫోన్ చేసి మాట్లాడాడని.. ఆ తర్వాతే ఉరివేసుకుని మరణించాడనే వార్త తెలిసిందని వాపోయారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల గేటు ముందు ఆందోళన చేశారు. -
హైదరాబాద్: నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం.. హయత్నగర్లో నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడో తరగతి విద్యార్థి లోహిత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్నగర్ నారాయణ స్కూల్లో హాస్టల్ ఘటన జరిగింది.విద్యార్థి మృతిపై నారాయణ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతోంది. ఫిజిక్స్ టీచర్ వేధింపుల వల్లే తమ కుమారుడు ఉరి వేసుకున్నాడని.. ఫిజిక్స్ టీచర్ క్లాస్ లీడర్తో మా కుమారుడిని కొట్టించాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.కాగా, సాధారణంగా పలు కాలేజీల్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం.. ఒంటరితనంతో బాధపడుతుండటం.. వేరే వారితో వెంటనే కలవలేకపోవడం వంటి కారణాలతో ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.ఇక, హాస్టళ్లలో ఉండే వారికి ఎప్పుడూ చదువు గురించే చెబుతుండటం.. విశ్రాంతి లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు స్టడీ అవర్స్, క్లాసులు, హోంవర్కు.. రాత్రి చాలా ఆలస్యంగా పడుకొని, ఉదయమే నిద్రలేచి మళ్లీ క్లాసులు ఇలా తీవ్ర ఒత్తిడి తెస్తుంటారని, అందుకే విద్యార్థుల్లో తెలియని నైరాశ్యం ఏర్పడుతోందని అంటున్నారు. -
నీటి కుంటలో పడి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి మృతి
సాక్షి, పల్నాడు జిల్లా: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఓ మహిళ, శ్రీచైతన్య స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. గురజాల మండలం పులిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ (11) ప్రాణాలు కోల్పోయాడు. స్కూల్ బస్సు పులిపాడు గ్రామం నుండి స్కూల్ విద్యార్థులతో దాచేపల్లికి వెళ్తుంది. ఆ సమయంలో స్కూల్ బస్ రేడియేటర్లో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు బస్సు క్లీనర్ పప్పుల కోటేశ్వరరావు ప్రయత్నించాడు. ఇందుకోసం కుంటలో ఉన్న నీటిని తోడేందుకు ప్రయత్నించాడు. సాయం కోసం సుభాష్ను వెంట తీసుకెళ్లాడు. అయితే నీటి కుంటలో నుంచి నీటిని తోడేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవ శాత్తూ కాలు జారి నీటి కుంటలో జారి ఇద్దరూ పడిపోయారు. ఈ దుర్ఘటనలో బస్సు క్లీనర్ పప్పుల కోటేశ్వరరావు, ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ మృతి చెందారు.మరో దుర్ఘటనలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మరో దుర్ఘటనలో బంధువుల ఇంట్లో ఫంక్షన్కు స్కూటీపై వెళ్తున్న మహిళను ఓ కారు ఢీకొంది. రూరల్ ఎస్ఐ ఎస్కే మూర్తి తెలిపిన వివరాల మేరకు.. నగరి మండలం మాంగాడుకు చెందిన గోవిందమ్మ(48), తన కుమారుడు భానుప్రకాష్ సమీప బంధువు కిరణ్తో కలిసి చంద్రగిరి మండలం పిచ్చినాయుడుపల్లిలో బంధువుల ఇంట్లో పురుడు ఫంక్షన్కు స్కూటర్లో వెళ్తున్నారు.పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై వకుళామాత ఆలయం సర్కిల్ వద్ద పేరూరు పంచాయతీలో నుంచి వేగంగా బైపాస్ పైకి దూసుకొచ్చిన గుర్తు తెలియని కారు గోవిందమ్మ ప్రయాణిస్తున్న స్కూటర్ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో గోవిందమ్మ స్కూటర్పై నుంచి కింద పడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.స్కూటర్ నడుపుతున్న కిరణ్, మృతురాలి కుమారుడు భానుప్రకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని తిరుపతి రూరల్ ఎస్ఐ ఎస్కే మూర్తి పరిశీలించారు. కేసు నమోదు విచారిస్తున్నట్లు ఎస్ఐ మూర్తి తెలిపారు. -
విద్యార్థినులపై ప్రిన్సిపాల్ కర్కశత్వం
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ఐనపల్లి మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల ప్రిన్సిపాల్ అక్కడి విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఔటింగ్కు వెళ్లి అరగంట ఆలస్యంగా వచ్చారన్న కారణంతో రెండు గంటలపాటు బయట చలిలోనే నిల్చోబెట్టారు. మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులకు ఆదివారం తల్లిదండ్రులను కలిసేందుకు ఔటింగ్కు అనుమతి ఇచ్చారు. దీంతో వారు తమ తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్లారు.సాయంత్రం 4 గంటలలోపు వారు తిరిగి పాఠశాలలోకి వెళ్లాల్సి ఉండగా, అరగంట ఆలస్యంగా రావటంతో ప్రిన్సిపాల్ వారిని లోనికి అనుమతివ్వలేదు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదురుగానే చలిలో సుమారు రెండు గంటలపాటు వేచి ఉన్నారు. అటువైపుగా వెళ్లిన పోలీస్ సిబ్బంది గమనించి ఆరా తీసి పిల్లలను లోపలికి పంపాలని కోరినా ప్రిన్సిపాల్ వినిపించుకోలేదు. ఈ విషయాన్ని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వివరాలు తెలుసుకోవాలని డీటీడీఓకు కలెక్టర్ సూచించారు. దీంతో రంగంలోకి దిగిన డీటీడీఓ సదరు ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే విద్యార్థినులను హాస్టల్లోకి అనుమతివ్వాలని ఆదేశించడంతో ప్రిన్సిపాల్ దిగొచ్చారు. కాగా ప్రిన్సిపాల్ తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులతోనూ నిత్యం అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, తమ పిల్లలతో మాట్లాడనీయకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. -
గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థిని మృతి
భూదాన్పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో గుండెపోటు తో 9వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల మేరకు.. గ్యార స్వామి, యాదమ్మ దంపతుల కుమార్తె నవ్య (16) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా మంగళవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన కావ్య జ్వరంతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు అదే రోజు రాత్రి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించగా తగ్గింది. బుధవారం సాయంత్రం తిరిగి జ్వరం రావడంతో బీబీనగర్లోని ఓ ఆసుపత్రిలో చూపించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు జ్వరం, బీపీ ఎక్కువ ఉందని చెప్పడంతో మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి.. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే నవ్య మార్గమధ్యలోనే గుండెపోటుతో మృతి చెందిందని యశోద ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఆడపిల్ల కావాలనే కోరికతో స్వామి, యాదమ్మ దంపతులు రెండు నెలల వయసున్న నవ్యను బంధువుల నుంచి దత్తత తీసుకుని ఎంతో గారాబంగా పెంచుకున్నారు. Hydra: ఇల్లు పోతుందన్న భయంతో పేద గుండె ఆగింది -
అమెరికాలో భారత విద్యార్థి కెరియర్ నాశనం.. ఆ ఫొటో కారణమా?
వాషింగ్టన్ : పాలస్తీనాకు మద్దతుగా రాసిన ఓ వ్యాసం అమెరికాలో భారత విద్యార్థి భవిష్యత్ను ప్రమాదంలోకి నెట్టింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో పీహెచ్డీ చేస్తున్న ప్లహాద్ అయ్యంగార్పై నిషేదం విధిస్తున్నట్లు తెలిపింది.ప్రహ్లాద్ ఎంఐటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎంఐటీ నిర్వహిస్తున్న మల్టీ డిసిప్లినరీ స్టూడెండ్ మ్యాగజైన్లో పాలస్తీనాకు మద్దతుగా ఓ వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ‘వివాదాల్ని పరిష్కరించేందుకు యుద్ధం లేదంటే హింసకు పాల్పడాలి ’ అని అర్ధం వచ్చేలా రాసినట్లు తాము గుర్తించామని అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు తెలిపారు. ప్రహ్లాద్ వ్యాసం ఎంఐటీలో హింసకు, నిరసనలకు ప్రేరేపించేలా ఉందని స్టూడెంట్ లైఫ్ డీన్ డేవిడ్ వారెన్ రాండాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.వివాదం సృష్టించేలా వ్యాసం రాసినందుకు ప్రహ్లాద్పై ఎంఐటీ కఠిన చర్యలు తీసుకుంది. ఐదు సంవత్సరాల నేషనల్ సైన్స్ ఫౌండేషన్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్ను రద్దు చేసింది. క్యాంపస్లోకి అడుగు పెట్టకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి రాసిన వ్యాసాన్ని సైతం స్టూడెండ్ మ్యాగజైన్ నుంచి తొలగించింది.🚨🚨 MIT is effectively expelling PhD student Prahlad Iyengar for Palestine activism on campus. 🚨🚨EMERGENCY RALLY: Cambridge City Hall, Monday, 12/9 at 5:30pm. Org sign-on to letter: https://t.co/tCOrOLTeNy pic.twitter.com/7cAYrvn5ad— MIT Coalition Against Apartheid (@mit_caa) December 8, 2024ఎంఐటీ ఫిర్యాదుతో అమెరికా ప్రభుత్వం సైతం విచారణ చేపట్టింది. భారత విద్యార్థి రాసిన వ్యాసంలో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా అనే ఉగ్రవాద సంస్థ లోగో ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. .కాగా, ఎంఐటీ తీసుకున్న నిర్ణయంపై ప్రహ్లాద్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు కేవలం తాను అందించిన వ్యాసంలోని ఫొటోలే కారణమని చెప్పారు. ఎంఐటీ అడ్మినిస్ట్రేషన్ నన్ను 'ఉగ్రవాదానికి' మద్దతు ఇస్తున్నట్లు ఆరోపించింది. ఎందుకంటే నా వ్యాసంలో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఫొటోలు ఉన్నాయి ’ అని అతని తరుఫు న్యాయవాది ఎరిక్ లీ తెలిపారు. గతంలోనూ సస్పెండ్ ప్రహ్లాద్పై ఎంఐటీ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు చేయడంతో సస్పెండ్ అయ్యారు. ఆ సస్పెండ్పై అమెరికా క్యాంపస్లలో మాట్లాడే స్వేచ్ఛలేదని ఆరోపణలు గుప్పించారు. అడ్మినిస్ట్రేషన్ విభాగం తీసుకున్న చర్యలు ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తున్నాయి. నేను రాసిన వ్యాసాన్ని మ్యాగజైన్ నుంచి తొలగించడం, బ్యాన్ విధించడం విద్యార్థి సంఘాలు, లెక్చరర్ల హక్కుల్ని భంగం కలిగించేలా ఉన్నాయని అన్నారు. కాగా, ప్రహ్లాద్ ఎంఐటీ తీసుకున్న చర్యలు పలు అమెరికన్ కాలేజీల్లో విద్యార్థులు మద్దతు పలికారు. డిసెంబర్ 9న కేంబ్రిడ్జ్ సిటీ హాల్లో అయ్యంగార్కు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.