22 మంది బాలికలకు అస్వస్థత | 120 Children Fall Ill Due to Viral Fever Effect in Alluri District | Sakshi
Sakshi News home page

22 మంది బాలికలకు అస్వస్థత

Nov 17 2025 4:57 AM | Updated on Nov 17 2025 4:57 AM

120 Children Fall Ill Due to Viral Fever Effect in Alluri District

వాంతులు, విరేచనాలు, జ్వరం బారిన పడిన అల్లూరి జిల్లా రాజేంద్రపాలెం ‘ఆశ్రమ’ విద్యార్థినులు

కేజీహెచ్‌లో ఇద్దరు బాలికలకు చికిత్స.. మిగిలిన వారికి రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో.. 

కలుషిత ఆహారమే కారణం!

ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు.. గతనెలలో కురుపాం స్కూల్లో ఇద్దరు బాలికల మృతి  

120 మందికిపైగా అస్వస్థత అయినా చలనం లేని చంద్రబాబు సర్కారు  

కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ప్రమా­దఘంటికలు మోగుతున్నా.. చంద్రబాబు ప్రభు­త్వానికి పట్టడం లేదు. ఇప్పటికే గత­నెలలో పార్వతీపురం జిల్లా కురుపాం ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు గురై ఇద్దరు బాలికలు మరణించారు. 120 మంది అస్వ­స్థ­తకు గురయ్యారు. అయినా ప్రభు­త్వంలో మార్పు రాలేదు. ఆశ్రమ పాఠశా­లల్లో వస­తు­లు మెరుగు పరచడం లేదు. ఫలితంగా తాజాగా అల్లూరి జిల్లా రాజేంద్రపాలెం బా­లి­కల ఆశ్రమ పాఠశాలకు చెందిన 22 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వారి­లో ఇద్దరు కేజీహెచ్‌లో చికిత్స పొందుతు­న్నారు.

మిగి­లిన వారు రాజేంద్రపా­లెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 8వ తర­గతి విద్యార్థులు కీర్తి ప్రసస్న, హాసినిలకు తొలు­త జ్వరంతోపాటు విరేచనాలు కావ­డంతో నర్సీపట్నా­నికి తర­లిం­చారు. అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించారు. ఆదివారం ఉద­యం నుంచి పాఠశా­లకు చెందిన మరో 20 మంది బాలి­కలు అస్వస్థతకు గురయ్యారు. వారంతా తీవ్ర జ్వరంతో­పాటు రక్త విరేచనా­లతో బాధప­డ్డారు. ఇంత మంది బాలికలు ఒక్క­సారే అనా­రోగ్యా­నికి గురికావడంతో కలెక్టర్‌ దినేష్‌­కుమార్‌ వైద్యం అందించాలని ఆదేశాలి­చ్చారు.

దీంతో రాజేంద్ర­పాలెం పీహెచ్‌సీ­లో వైద్యురాలు స్నేహలత­రెడ్డి చికిత్స అందిస్తున్నారు. శనివారం మ­ధ్యా­హ్నం గుమ్మడి కాయ కూర, రాత్రి బంగాళదుంపల కూరతో బాలికలు భోజ­నం తిన్నారు. అస్వస్థతకు కార­ణాలు ఏమి­టన్న­ది పూర్తిగా తెలియ­డం లేదు. ఆది­వారం అనా­రోగ్యంతో భారవి,శ్రీవల్లి, గంగా­భవాని, హాసిని, ప్రసన్న, పద్మ, అచ్యుత, నాలుగో తరగతికి చెందిన సునీత, హేమ, దివ్య, బంగారం, నాగమణి, రాజేశ్వరి, వి.పూజ, ఆమని, డి.­లలిత, జి.మీనాక్షి భారత, కృష్ణవేణి పీహె­చ్‌సీలో చేరారు. వీరిలో 15 మందికి విరేచ­నా­లయ్యాయి.

మిగిలిన వారి­కి జ్వరం రావడంతో చికిత్స చేస్తు­న్నా­రు. బాలి­కల ఆశ్రమ పాఠశాలలో 300 మంది విద్యార్థు­లున్నారు. ఒకవేళ ఆహారం కలుషితమైతే వీలైనంత ఎక్కువ మందికి వ్యాపించే అవ­కా­శం ఉంది. వైద్యు­లు స్నేహలతరెడ్డి మా­ట్లా­­డుతూ కలు­షిత నీటి వల్ల అనారోగ్యంపాలై ఉండవ­చ్చన్నారు. 

పీహెచ్‌సీలో చాలని బెడ్లు
రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న చిన్నారులకు బెడ్లు చాలలేదు. దీంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరు బాలికలకు చికిత్స అందిస్తున్నారు. ఒక బెడ్‌పై మాత్రం ముగ్గురు బాలికలను పడుకోబట్టి చికిత్స చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement