ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు అంటూ అమెరికాకు తలరి వెడుతున్న విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోతున్నాయి. మరో భారతీయ విద్యార్థి అదృశ్యం కావడం ఆందోళన రేపింది.
బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కెమికల్ అండ్ బయో మాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువు తున్న కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు. శనివారం నగరవ్యాప్తంగా గాలింపు చర్యలు ఐదో రోజుకు చేరాయి. ఇంతవరకూ అతని ఆచూకీ లభ్యం కాకపోవడం అటు అధికారుల్లోనూ, ఇంటు కుటుంబ సభ్యుల్లోనే భయాందోళనలు రేపుతోంది.
సాకేత్ శ్రీనివాసయ్య చివరిసారిగా క్యాంపస్ నుండి ఒక కిలోమీటరు దూరంలో కనిపించాడని అధికారులు చెబుతున్నారు. పాస్పోర్ట్ మరియు ల్యాప్టాప్ ఉన్న బ్యాక్ప్యాక్, క్యాంపస్ సమీపంలోని టిల్డెన్ రీజినల్ పార్క్ సమీపంలోని నివాసం సమీపంలో గుర్తించారు. లేక్ అంజా మరియు చుట్టుపక్కల ఉన్న బర్కిలీ హిల్స్ ప్రాంతాలపై దృష్టి సారించి నగరవ్యాప్తంగాగాలింపు కొనసాగుతోంది.
మరోవైపు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ శ్రీనివాసయ్య ఆదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతని కుటుంబ సభ్యులు, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు ప్రకటించింది.
కాగా 2025లో ఐఐటీ-మద్రాస్లో బీటెక్ పూర్తి చేసిన శ్రీనివాసయ్య బర్కిలీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అతను బెంగళూరులోని శ్రీవాణి ఎడ్యుకేషన్ సెంటర్లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం శ్రీనివాసయ్య, మరో ఐదుగురితో కలిసి, హైపర్లూప్ మైక్రోచానెల్ కూలింగ్ సిస్టమ్ ఫర్ హైపర్లూప్ అండ్ ఏ మెథడ్ దేర్ఆఫ్’’ కనిపెట్టినందుకు పేటెంట్ కలిగి ఉన్నారు.


