breaking news
karnataka
-
‘ధర్మస్థళ తవ్వకాల’ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ
సామూహిక ఖననాల నేపథ్యంలో తవ్వకాలు జరిపిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వనుందా? అనే ఆసక్తి నెలకొంది. అదే సమయంలో.. తవ్వకాలపై ప్రభుత్వం తరఫున కర్ణాటక అసెంబ్లీలో మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువనుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ధరస్థళ తవ్వకాల వ్యవహారం.. కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతోంది. ధర్మస్థళ పుణ్యక్షేత్రంపై భారీ కుట్ర జరుగుతోందని, క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సిట్ విచారణలో వాస్తవాలు బయటపడతాయని, ఆరోపణలు ఉత్తవేనని తేలితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. ఈ క్రమంలో.. ఇదే తరహా ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ.. డీఎకేఎస్ కామెంట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూస్తోంది.ధర్మస్థళ తవ్వకాలను బీజేపీ మొదటి నుంచి ఖండిస్తోంది. దివారం సుమారు 20 మంది చట్టసభ్యులు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రతో కలిసి ధర్మస్థళ పెద్దలను కలిశారు. వాళ్లు కలిసిన వాళ్లలో ఆలయ ధర్మకర్త, రాజ్యసభ ఎంపీ వీరేంద్ర హెగ్డే కూడా ఉన్నారు. ఆధ్యాత్మిక పట్టణం విషయంలో జరుగుతున్న విషప్రచారాన్ని అడ్డుకోవడంలో సీఎం సిద్ధరామయ్య విఫలమయ్యారని, తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని వాళ్లంతా డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం శివకుమార్ నిజమైన మంజునాథుడి భక్తుడే అయితే.. జరిగిన ఆ కుట్ర ఏంటో, దానివెనక ఎవరున్నారో బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు.అదే సమయంలో ఇప్పటిదాకా జరిగిన సిట్ తవ్వకాలపై మధ్యంతర నివేదికను బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎవరో.. ఏదో చెప్పారని.. ప్రభుత్వం తవ్వకాలు చేయించడం ఏంటి?. పోనీ ఇప్పటిదాకా జరిగిన తవ్వకాల్లో ఏమైనా బయటపడ్డాయా? అంటే అదీ లేదు. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి.. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. నిజాలు.. నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది అని బీజేపీ అంటోంది. ఈ క్రమంలో.. శాసనసభ ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ సంచలన ఆరోపణలకు దిగారు.వామపక్ష భావజాలం ఉన్న ఓ అర్బన్ నక్సల్స్ గ్యాంగ్.. ధర్మస్థళపై తప్పుడు ప్రచారానికి దిగింది. హిందువులకు, ధర్మస్థళకు వ్యతిరేకంగా విషప్రచారం చేస్తోంది. ఆ దండుపాళ్య ముఠా చేసిన ప్రచారానికి ప్రభుత్వం తలొగ్గింది. దీనంతటికి సీఎం సిద్ధరామయ్యే కారణం. ఆయన అధికారంలోకి రాకముందు.. వాళ్లంతా అడవుల్లో తిండి కోసం కష్టాలు పడేవారు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ధర్మస్థళ ఆలయంపైకే జేసీబీలను నడిపిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. సౌజన్య కేసులోనో.. సిట్ దర్యాప్తునకో మేం అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. కానీ, ఏవరో ఏదో చెప్పారని సీఎం సిట్ను ఏర్పాటు చేయించడమే ఇక్కడ విడ్డూరంగా ఉంది. ఇధి ధర్మస్థళ ప్రతిష్టను దెబ్బ తీసే చర్యనే. అందుకే దానినే మేం వ్యతిరేకిస్తున్నాం అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ధర్మస్థళ వ్యవహారంలో సిట్ మధ్యంతర నివేదికను బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే హోం మంత్రి పరమేశ్వర మాత్రం ఈ వ్యవహారంలో పూర్తి స్వేచ్ఛ సిట్కే ఉందని తేల్చి చెప్పారు. ‘‘ఈ వ్యవహారంలో మధ్యంతర, తుది నివేదిక ఇవ్వడమనేది సిట్ చేతుల్లోనే ఉంది. మేం ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోం’’ అని అన్నారు. మరికాసేపట్లో ఆయన అసెంబ్లీలో తవ్వకాల వ్యవహారంపై ప్రకటన చేయబోతున్నారు.1995-2014 మధ్య వందలాది హత్యలు జరిగాయని, వాటి మృతదేహాలను తానే ఖననం చేశానంటూ గతంలో ధర్మస్థళ క్షేత్రంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన ఓ వ్యక్తి(61) ఆరోపణలకు దిగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆలయ పెద్దల ఆదేశాల మేరకు తాను ఆ పని చేశానంటూ చెప్పుకొస్తున్నాడా వ్యక్తి. ఈ క్రమంలో.. 2022లో ట్రిప్ కోసం ధర్మస్థళకు వెళ్లిన తన 22 ఏళ్ల కూతురు తిరిగి రాలేదంటూ బెంగళూరుకు చెందిన సుజాత భట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేగు(విజిల్ బ్లోయర్ ) ఆరోపణలు, సుజాత ఫిర్యాదు నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక బృందంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తోంది. ఆ వ్యక్తి తొలుత చూపించినట్లు 13 చోట్ల మాత్రమే కాకుండా.. ఆపై గుర్తించిన మరో నాలుగు చోట్ల కూడా సిట్ తవ్వకాలు జరిపించింది. అత్యాధునిక సాంకేతికత సాయం తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో రెండు చోట్ల మాత్రమే అస్థిపంజరాల అవశేషాలు బయటపడినట్లు తెలుస్తోంది. అయితే పశ్చిమ కనుమల్లో పుట్టిన నేత్రావతి నదీ.. గత దశాబ్దంన్నరకాలంగా తీవ్ర వరదలతో ప్రభావితం అయ్యింది. దీంతో తీర ప్రాంతం కోతకు గురై సమూలంగా మారిపోయిందని, బహుశా ఆ అవశేషాలు కొట్టుకుపోయి ఉంటాయని చెబుతున్నాడతను. మరోవైపు.. సుజాత తన కూతురు అనన్య ఫొటోను తొలిసారిగా మీడియాకు విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో ఈ కేసు మిస్టరీ ఎలా ముగుస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
డేంజర్ జోన్లో తుంగభద్ర డ్యామ్
-
ధర్మస్థళ తవ్వకాలపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారిన సామూహిక ఖననం కేసుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు. ధర్మస్థళ పుణ్యక్షేత్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, త్వరలోనే నిజం నిలకడ మీద తెలుస్తుందని అన్నారాయన.ధర్మస్థళలో రెండు దశాబ్దాల కిందట.. హత్యలు, అత్యాచారాలు జరిగాయని, వందల సంఖ్యలో మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని ఓ వ్యక్తి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్షేత్రంలో మాజీ పారిశుద్ధ్య కార్మికుడిగా చెబుతున్న ఆ 61 ఏళ్ల వ్యక్తి ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయించి అతను చూపించిన చోటల్లా తవ్వకాలు జరిపిస్తోంది. అయితే.. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలకు దిగడంతో.. డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందించారు. సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం ఉందని, త్వరలోనే ధర్మస్థళపై జరుగుతున్న కుట్ర బయటకు వస్తుందని, ఆ ఆరోపణలు రుజువుకాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తనతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని శివకుమార్ వెల్లడించారు. అయితే.. ‘‘నేను ఇప్పటికీ ధర్మస్థళ మంజునాథస్వామి భక్తుడినే. ధర్మస్థల వీరేంద్రహెగ్డే చేసిన సేవలను గౌరవిస్తాం. భక్తునికి– దేవునికి ఉన్న సంబంధానికి మనం భంగం కలిగించరాదు. అలాగని నేనేం ధర్మస్థళకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో మాట్లాడడం లేదు. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకవేళ ధర్మస్థళపై నిజంగా కుట్ర జరిగి ఉంటే విచారణలో బయటపడుతుంది. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించకతప్పదు. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. ఈ అంశంపై హోం మంత్రి పరమేశ్వర సోమవారం కర్ణాటక అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేస్తారు’’ అని శివకుమార్ వెల్లడించారు. గురువారం ధర్మస్థళ తవ్వకాలపై అసెంబ్లీలో హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడారు. ‘‘ఫిర్యాదు ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఆ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు జూన్ 19 సిట్ ను ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించాం. ఇది పూర్తి కావడానికి కాలపరిమితి ఉంటుంది. ఈలోపు సిట్ దర్యాప్తునకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని భావిస్తున్నాం’’ అని అన్నారాయన. 1995-2014 మధ్య తాను పని చేస్తున్న సమయంలో ధర్మస్థళ ఆలయ నిర్వాహకుల ఆదేశాల మేరకు తానే స్వయంగా ఆ మృతదేహాలను పాతిపెట్టినట్లు సదరు వ్యక్తి చెబుతున్నాడు. అందులో మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలు అధికంగా ఉన్నాయని, కొందరిపై లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ముసుగు ధరించిన ఆ వేగు(Whistleblower)ను.. ‘భీమా’.. ‘చిన్నయ్య’.. అని కర్ణాటక మీడియా వ్యవహరిస్తోంది. విక్టిమ్ ప్రొటెక్షన్ కింద సిట్ అతనికి రక్షణ కల్పిస్తోంది కూడా. ఇప్పటిదాకా నేత్రావతి నదీ తీరం వెంబడి అతను చూపించిన చోట్లలో సిట్ తవ్వకాలు జరిపింది. అందులో రెండు చోట్ల మాత్రమే అస్తిపంజరాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు ఆ వ్యక్తి. ఇదీ చదవండి: ఆలయ నిర్వాహకులే పూడ్చాలని.. సిట్ నన్ను నమ్మడం లేదుఇదిలా ఉంటే.. తీవ్ర చర్చకు దారితీసిన ధర్మస్థలలో మృతదేహాల కోసం తవ్వకాల కేసులో గురువారం విధానసభ దద్దరిల్లింది. ధర్మస్థల మీద అసత్య ప్రచారం చేస్తున్న ప్రభుత్వం కూకటి వేళ్లతో కూలిపోతుందని బీజేపీ, జేడీఎస్ నాయకులు శాపాలు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి 10, 15 ఏళ్ల క్రితం ధర్మస్థల లో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పడం ద్వారా పవిత్ర ధర్మక్షేత్రానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా కుట్ర జరుగుతోంది. అస్థికల కోసం తవ్వకాలంటూ హిందూ ధార్మిక కేంద్రాలపై జరుగుతున్న అసత్య ప్రచారం సహించడం సాధ్యం కాదు. ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రజలు ఆవేశం చెంది పోరాటం చేసే స్థితి తీసుకురాకూడదు.. .. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది దర్యాప్తా, హిందూ పుణ్యక్షేత్రంపై జరుగుతున్న కుట్రలో అసత్య ప్రచారంలో కాంగ్రెస్ యూట్యూబర్లు, ఇతర మతస్తుల చేతిలో కీలుబొమ్మగా మారుతోందా?’’ అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో సిట్ దర్యాప్తు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అలాగని ధర్మస్థళను టార్గెట్ చేయడం సరికాదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మాటలు విని గుంతలు తవ్వే పనిచేస్తున్నారని, ధర్మస్థల పవిత్రతను కాపాడటానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్ని రోజులు ఎన్ని గుంతలు తవ్వారు, ఎన్ని అస్థిపంజరాలు దొరికాయి అనేది చెప్పాలని సునీల్కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. -
ఆలయ నిర్వాహకులే పూడ్చాలని ఆదేశించారు
బెంగళూరు: కర్ణాటకలో అత్యంత వివాదాస్పదంగా మారిన మృతదేహాల పూడ్చివేత ఉదంతంలో ధర్మస్థల ఆలయ నిర్వాహకులే గుర్తుతెలియని మృతదేహాలను అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టాలని తనను ఆదేశించారని మాజీ పారిశుద్ధ్యకార్మీకుడు భీమ తాజాగా ప్రకటించారు. ఇండియాటుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భీమ ఇలాంటి సంచలన విషయాలను తొలిసారిగా పంచుకున్నారు. ‘‘నేను, నాతోపాటు మరికొందరం కలిసి డజన్ల కొద్దీ మృతదేహాలను 1995 నుంచి 2014కాలంలో అటవీ ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల పూడ్చిపెట్టాం. మృతుల్లో చాలావరకు మహిళలు, చిన్నారులే. ఆనాడు పారిశుద్ధ్యకార్మీకునిగా పనిచేశా. అయితే మృతదేహాలను పూడ్చిపెట్టాలని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం నుంచిగానీ గ్రామపంచాయితీ అధికారులుగానీ ఆదేశించలేదు. కేవలం ధర్మస్థల ఆలయ సమాచార కేంద్రం నిర్వాహకులు, అధికారులే మాకు ఈ ఆదేశాలిచ్చారు. మేం ఏ ఒక్క మృతదేహాన్ని స్మశానవాటికలో ఖననంచేయలేదు. అన్నింటినీ అడవిలోనే పాతిపెట్టాం. పాత రోడ్లు, నదీ పరివాహక ప్రాంతాల్లో పూడ్చిపెట్టాం. బాహుబలి కొండల్లో ఒక మహిళను పూడ్చిపెట్టాం. నేత్రావతి స్నానఘట్టం సమీపంలో ఏకంగా 70 మృతదేహాలను పాతిపెట్టాం. ఇప్పటికే అధికారులు తవ్వకాలు జరిపిన 13వ చోట అయితే నాకు గుర్తుండి దాదాపు 70, 80 మృతదేహాలను పూడ్చిపెట్టాం. కొన్ని సార్లు పూడ్చేటప్పుడు స్థానికులు మమ్మల్ని గమనించారు. కానీ ఎవరూ మాకు అడ్డుచెప్పలేదు’అని ప్రజావేగుగా మారిన భీమ చెప్పారు. లైంగిక వేధింపుల గుర్తులు ‘‘మృతదేహాలను చూస్తే హింసకు, లైంగిక వేధింపులకు గురైనట్లు స్పష్టంగా తెలిసేది. మృతదేహాలపై గాయాలైన గుర్తులుండేవి. హింసించి చంపేశారని అర్థమయ్యేది. కానీ వాస్తవంగా లైంగిక వేధింపులు జరిగాయో లేదో వైద్యనిపుణులే చెప్పగలరు’’అని భీమ అన్నారు. ‘‘చిన్నారుల మొదలు వృద్దుల దాకా అన్ని వయసుల వాళ్ల మృతదేహాలను మేం పూడ్చిపెట్టాం. వంద మృతదేహాల్లో దాదాపు 90 దాకా మహిళలవే. అడవిలో వర్షాల కారణంగా నేల కోతకు గురవ్వడం, అటవీ ప్రాంతందాకా నివాసభవన నిర్మాణాలు జరగడంతో ఇప్పుడు కొన్ని పూడ్చిన స్థలాలను గుర్తుపట్టడం కష్టమే. గతంలో నేను గుర్తుపట్టడానికి అక్కడో రోడ్డు ఉండేది. జేసీబీ తవ్వకాలతో ఇప్పుడా రహదారి మార్గం గుర్తించలేని పరిస్థితి తలెత్తింది. గతంలో కొన్ని చోట్ల చెట్లు తక్కువ ఉండేవి. ఇప్పుడు బాగా చెట్లు పెరిగి ఆ ప్రాంతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది’’అని అన్నారు. నేను సిట్ను నమ్మినా వాళ్లు నన్ను నమ్మట్లేరు ‘‘ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణను నేను పూర్తిగా నమ్ముతున్నా. కానీ సిట్ అధికారులు నేను చెప్పేది విశ్వసించట్లేరు. వాళ్ల దర్యాప్తు ధోరణి చూస్తుంటే నాకు విసుగొస్తోంది. నాకు గుర్తున్నమేరకు ఆయా చోట్లను చూపిస్తున్నా. సిట్ అధికారులు పైపైన తవ్వేసి ఏమీ దొరకట్లేదని నాపై నమ్మకం పోగొట్టుకుంటున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిన ఆయా ప్రాంతాల్లో మరింత విస్తృతస్థాయిలో తవ్వకాలు జరిపితే ఆధారాలు లభిస్తాయి. 13వ నంబర్ స్పాట్సహా కనీసం మరో నాలుగైదు చోట్ల తవ్వాల్సిందే. నాతోపాటు మృతదేహాలు పూడ్చినవాళ్లను సిట్ రప్పిస్తే ఈ వెతుకులాట సులభమవుతుంది. పశ్చాత్తాపంతోనే రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ధర్మస్థలకు వచ్చి పచ్చి నిజాలు బయటపెట్టా. కలలో ఎప్పుడూ అస్తిపంజరాలే కనిపించేవి. అనామకులను పూడ్చిపెట్టానన్న పాపభీతి నన్ను వెంటాడింది. ఆ భయం, భారం తగ్గించుకునేందుకు మీడియా ముందుకొచ్చి జరిగిందంతా చెబుతున్నా. పూడ్చిన కళేబరాలకు ఇకనైనా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా అంతిమసంస్కారాలు జరగాలని ఆశిస్తున్నా. ధర్మస్థల ఆలయ పరువును మంటగలపడం నా ఉద్దేశం కానేకాదు. నేనెక్కిడికీ పారిపోవాల్సిన అవసరం లేదు. పూడ్చిన ప్రాంతాల గుర్తింపునకు సాయపడతా. తర్వాత నా స్వస్థలానికి వెళ్లిపోతా. మృతదేహాలపై ఉండే బంగారు ఆభరణాలను నేను దొంగతనం చేశానన్న ఆరోపణల్లో నిజం లేదు. బంగారమే దోచేస్తే ఇన్నాళ్లూ పారిశుద్ధ్యకార్మీకునిగా బతుకీడ్చాలిన అగత్యమెందుకు?. నేను అలాంటి తప్పుడు పనులు చేయను. నేను హిందువును. అందులోనూ షెడ్యూల్డ్ కులస్తుడను’’అని భీమ అన్నారు.70 శవాలను నేనే పూడ్చా ‘‘దాదాపు 70, 80 మృతదేహాలను స్వయంగా నేనే పూడ్చిపెట్టా. కొన్నింటిని నేలలో చాలా లోతులో పూడ్చిపెట్టాం. మరికొన్నింటిని కొండల మీద పాతిపెట్టాం. ఆలయ ఇన్ఫర్మేషన్ సెంటర్ యాజమాన్యం సూచించిన ప్రాంతాల్లో మాత్రమే శవాలను పూడ్చిపెట్టాం. ఆలయ మేనేజర్ ఎప్పుడూ నన్ను నేరుగా కలవలేదు. రూమ్ బాయ్ ద్వారా మాకు ఆదేశాలు అందేవి. వాటిని మేం అమలుచేసేవాళ్లం. మేం పూడ్చిన ప్రాంతాల్లోనే భవన నిర్మాణాలు జరిగాయి. అందుకే సిట్ తవ్వకాలు జరిపిన చోట్ల మృతదేహాల ఆనవాళ్లు లభించట్లేదేమో. పట్టపగలే మేం మృతదేహాలను పూడ్చాం’’అని భీమ చెప్పారు. -
‘సిట్ నన్ను నమ్మడం లేదు’.. ధర్మస్థళ ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్
బెంగళూరు: కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు ఊహించని మలుపు తిరిగింది. పారిశుధ్య కార్మికుడిగా (విజిల్బ్లోయర్) విధులు నిర్వహించే సమయంలో ధర్మస్థళలో వందలాది శవాలను తాను ఖననం చేశానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ‘భీమ’ (స్థానికులు పిలుస్తున్న పేరు) మీడియా ముందుకు వచ్చారు.ధర్మస్థళలో అవశేషాల కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు తనని నమ్మడం లేదని, నేను వారిని నమ్ముతున్నానని అన్నారు. అంతేకాదు తాను ఖననం చేసిన వారి అస్థిపంజరాలు తన కల్లోకి కూడా వచ్చేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థళ కేసు పురోగతిపై ఇండియా టుడే పారిశుధ్య కార్మికుడిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలను బహిర్ఘతం చేశారు.ధర్మస్థళలో 1995-2014 మధ్య కాలంలో నేను పారిశుధ్య కార్మికునిగా పని చేసే సమయంలో వందల మంది బాధితుల మృతదేహాల్ని ఖననం చేశాను. ఆ మృతదేహాలపై హింస,లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశా. మృతదేహాలను ఖననం చేయాలని ఆలయ ప్రతినిధులు మాకు ఆ పని పురమాయించారు. మృతదేహాల ఖననం విషయంలో ప్రభుత్వం,గ్రామ పంచాయతీ పెద్దలు ఎప్పుడూ మాకు చెప్పింది లేదు. ఎవరి మృతదేహాలను ఎక్కడ ఖననం చేయాలో.. ఎక్కడ దహనం చేయాలో మొత్తం ఆలయ అధికారులే ఆదేశించారు. అడవులు,నదీ తీరంలో ఖననాలుధర్మస్థళ దేవాలయం అధికారుల ఆదేశాలకు అనుగుణంగా మేం మృతదేహాలను ఖననం చేసే వాళ్లం.పూడ్చి పెట్టేవాళ్లం.ఈ పనిలో నాతో పాటు మరో ముగ్గురు పాల్గొన్నారు.మహిళల మృతదేహాలను స్మశాన వాటికల్లో కాకుండా అడవుల్లో,పాతబడిన రోడ్లు,నదీ సమీపంలో పాతిపెట్టేవాళ్ళం.మేము బాహుబలి కొండలపై ఒక మహిళను,నేత్రావతి స్నాన ఘాట్లో దాదాపు 70 మృతదేహాలను ఖననం చేశాం. నేను చెప్పిన స్పాట్ నెంబర్ 13లో సుమారు 70 నుండి 80 మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలను ఖననం చేసే సమయంలో స్థానికులు మమ్మల్ని చూసేవారు. కానీ వాళ్లెప్పుడూ జోక్యం చేసుకోలేదు.పై నుంచి ఆదేశాలు వచ్చేవి. మృతదేహాలను ఖననం చేసేవాళ్లం. అదే మా పని.ధర్మస్థల ఆలయం నుండి కిలోమీటర్ దూరంలో ఓ కొండపైన దిగంబర్ జైన విగ్రహం ఉంది. దానిని బాహుబలికొండ అని పిలుస్తారు. దిగంబర్ జైన్ విగ్రహం చేరుకోవాలంటే కింది నుంచి 300మెట్లు ఎక్కాల్సి ఉంది.100 మృతదేహాలలో 90 వారివేఖననం లేదంటే దహనం చేసిన మహిళలు,యువతులు,బాలికల మరణానికి కారణాలేంటనేది చెప్పలేదు. అయితే ఆ మృతదేహాలపై హింస, లైంగిక దాడికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. కొన్ని మృతదేహాలపై స్పష్టమైన గుర్తులు ఉన్నాయి. వారిపై దాడి జరిగినట్లు అనిపించింది. బాధితులపై లైంగిక దాడి జరిగిందా? లేదా? అన్నది వైద్యలు మాత్రమే గుర్తించగలరు. మృతదేహాల్లో పిల్లలు,వృద్ధుల ఎక్కువగా ఉన్నారు. మహిళలు ఎక్కువ మంది ఉండగా.. ఖననం చేసినట్లు పేర్కొన్న 100 మృతదేహాలలో 90 మంది వారే ఉండటం గమనార్హం.మారిన స్థలాలు..ఆధారాలు మాయం ధర్మస్థళ పరిసర ప్రాంతాల్లో నాడు ఖననం చేసిన ప్రాంతాల వరకు ఆచూకీ కనిపించడం లేదు. 1995-2014 మధ్య కాలంలో మృతదేహాలను ఖననం చేసే సమయంలో ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉండేవి. ఇప్పుడు ఎటుచూసినా చెట్లు మొలిచాయి. నిర్మాణాలు ఏర్పడ్డాయి.అయినప్పటికీ వాటిల్లో ఓ పాత రహదారి ఇప్పటికీ అలాగే సజీవంగా ఉంది. కాకపోతే ఆ ప్రాంతం అంతా అడవిలా మారింది. ఇప్పటికే నేను కొన్ని ప్రదేశాలు గుర్తించాను. జేసీబీ సాయంతో మరిన్ని మృతదేహాలను గుర్తిస్తానని మాజీ పారిశుధ్య కార్మికుడు చెబుతున్నాడు.మీరు వందల మందిని ఖననం చేశామని చెబుతున్నారు సరే.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం 13 ప్రదేశాల్లో పాక్షికంగా మృతదేహాల అవశేషాలను గుర్తించింది. వారిలో ఒక పురుషుడు మాత్రమేనని తెలుస్తోంది.మరి మిగిలిన మృతదేహాల మాటేమిటీ అని ప్రశ్నిస్తే.. బాధితుల్ని ఖననం చేసింది మేమే.. నేను నిజమే చెబుతున్నాను అని తనని తాను సమర్ధించుకున్నారు.‘నేను సిట్ను నమ్ముతాను..సిట్ నన్ను నమ్మదు’ఈ సందర్భంగా సిట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు దర్యాప్తు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పర్యవేక్షణలో కొనసాగుతోంది. వారిలో సిట్ బృందానికి ఐపీఎస్ డాక్టర్ ప్రణవ్ మొహంతి నేతృత్వం వహిస్తున్నారు. ఐపీఎస్ అధికారాలు అనుచేత్,జితేంద్ర కుమార్ దయామ, ఎస్పీ సైమన్, పుత్తూరు తహసీల్దారు స్టెల్లా వర్గీస్, బెళ్తంగడి తహసీల్దారు పృథ్వీ సానికంలు ఉన్నారు. వీరితో పాటు వైద్య పరీక్షల కోసం మంగళూరు కేఎంసీ వైద్యులు,అవశేషాల పరిశీలన కోసం ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఉన్నారు. ఇప్పుడు అదే సిట్ను మాజీ పారిశుధ్యకార్మికుడు సంచలన ఆరోపణలు చేశారు. సిట్ బృందాన్ని తాను నమ్ముతున్నట్లు.. వారి విధానంపై నిరాశను వ్యక్తం చేస్తూ.. నేను సిట్ను నమ్ముతాను. వాళ్లు నన్ను నమ్మట్లేదు. నాకు గుర్తున్నంత వరకు ఖననం చేసిన ప్రదేశాల్ని చూపించడానికి వచ్చాను. సంవత్సరాలు గడిచిన కారణంగా మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతుంది. గుర్తించేందుకు నావంతు కృషి చేస్తున్నాను. అవశేషాల గుర్తించాలంటే జేసీబీ పనితీరులో వేగం పుంజుకోవాలి. స్పాట్ 13తో సహా ఇంకా నాలుగు నుండి ఐదు ప్రదేశాలను గుర్తించాల్సి ఉంది. సిట్ బృందం నాతో పాటు పనిచేసిన వారిని కూడా గుర్తించాలి.వాళ్లొస్తే.. మృతదేహాల గుర్తింపు సులభం అవుతుంది. వేగం అవుతుందన్నారు. సౌజన్య హత్య కేసుసిట్ బృందం పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే 2012లో ధర్మస్థళ సమీప నిర్మానుష్య ప్రదేశంలో 17 ఏళ్ల సౌజన్య హత్య జరిగిన నాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నారు. సౌజన్య హత్యకు గురైన రాత్రి నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నేను ఎక్కడ ఉన్నాననేది అవతల వ్యక్తి ఆరా తీశాడు. నేను సెలవు తీసుకుని ఊరికి వచ్చానని చెప్పడంతో ఫోన్లోని అవతలి వ్యక్తి నాపై గట్టిగా అరిచాడు. మరుసటి రోజు, హత్యకు గురైన అమ్మాయి మృతదేహాన్ని నేను చూశాను’అని విచారం వ్యక్తం చేశారు. అస్థి పంజరాలు కల్లోకి వచ్చేవి ఓసారి నా కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికనుపై అధికారులు లైంగికంగా వేధించారు. దాంతో ధర్మస్థళ నుంచి 2014లో పారిపోయినట్లు పారిశుధ్య కార్మికుడు చెప్పాడు. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉండేది.కొన్నిసార్లు మృతదేహాల అస్థిపంజరాలు నాకు కల్లోకి వచ్చేవి.అందుకే బాధితులకు న్యాయం చేయాలని సంకల్పంతో ప్రాణాల్ని ఫణంగా పెట్టి ముందుకు వచ్చాను. నా ఉద్దేశ్యం ఆలయాన్ని కించపరచడం కాదు, మృతదేహాలను గుర్తించడం.. వాటికి అంతిమ సంస్కారాలు నిర్వహించడమేనని మరోసారి స్పష్టం చేసిన ఆయన .. తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. మృతదేహాల నుంచి ఆభరణాలను దొంగిలించడమే కాదు.. ఆలయాన్ని కించపరచడానికి ప్రయత్నం చేస్తున్నాంటూ తనపై వస్తున్న ఆరోపణల్ని పారిశుధ్య కార్మికుడు ఖండించారు. నేను దొంగతనం చేసి బతకాలనిపిస్తే.. ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని. ఆలయంలో ఎందుకు విధులు నిర్వహించేవాడిని అని అన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు విషయానికొస్తే.. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు 16 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపింది. వాటిలో 6,11స్పాట్లలో అస్థిపంజర అవశేషాలు లభ్యమయ్యాయి. 13వ స్పాట్లో అత్యధిక మృతదేహాలు ఉన్నాయని భీమ పేర్కొన్నారు. అక్కడ తవ్వకాలు సాంకేతిక కారణాలతో నిలిపివేశారు. ఇప్పటి వరకు భీమ 15 ప్రదేశాలను గుర్తించగా.. వాటిలో 8 నేత్రావతి నది ఒడ్డున, మిగిలినవి హైవే పక్కన ఉన్నాయి. -
వర్షమొచ్చింది.. బీరు గిరాకీ తక్కువ.. ధర ఎక్కువ!
కర్ణాటక, బెంగళూరు, బనశంకరి: బీరు తాగుదామని మందుబాబులు అనుకుంటే జేబుకు రంధ్రం పడుతోంది. చాలా మొత్తాన్ని ఇచ్చుకోవాల్సి ఉండడంతో బీరు వద్దులే అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ పథకాల నిధుల కోసం తరచుగా మద్యం, బీరు ధరలను పెంచడం మందుబాబులకు ఇబ్బందిగా తయారైంది. ముఖ్యంగా బీర్లను తాగడం తగ్గించారు, ఫలితంగా రాష్ట్రంలో గత నాలుగునెలల్లో బీర్ విక్రయాలు 19.65 శాతం తగ్గాయి. వేసవి నుంచి తగ్గుదల సాధారణంగా వేసవిలో మద్యంప్రియులు మద్యానికి బదులు ఎక్కువగా బీర్లు తాగుతారు. నగర, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా బీర్కు ఓటేస్తారు. కానీ ఈ వేసవి నుంచి బీర్కు గిరాకీ క్షీణించింది. బీరు ధర ఎక్కువగా ఉందనే కారణంతో దేశీయ మద్యం వైపు మొగ్గుచూపారు. దీంతో మద్యంతో పోలిస్తే బీర్ విక్రయం గణనీయంగా తగ్గింది. ఏప్రిల్ నుంచి బీర్ల కొనుగోళ్లు తగ్గాయి. భారీ స్థాయిలో.. రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 వరకు 1,420 లక్షల లీటర్ల (182.08 లక్షల బాక్సులు) బీర్లు విక్రయమయ్యాయి. ఈ ఏడాది ఇదే అవధిలో 1,141 లక్షల లీటర్లు(146.30 లక్షల బాక్సులు) లే అమ్మారు. గత ఏడాదితో పోలిస్తే భారీ మొత్తంలో తగ్గుదల నమోదైంది. బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం షాపుల్లో స్టాకు ఖాళీ కావడం లేదని చెబుతున్నారు. ఎడాపెడా రేట్ల పెంపు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంపు లక్ష్యంతో బడ్జెట్కు ముందే బీర్ ధరలను పెంచింది. జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చేలా బీరుపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీనివల్ల సాధారణం నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు అన్ని బీర్ల ధరలు రూ.10 నుంచి 50 వరకు భగ్గుమన్నాయి. ఆల్కహాల్ అధికంగా ఉండే బీర్ల ధరలను మరింత పెంచేశారు. మే 15 నుంచి మరోసారి 5 శాతం పెంచారు. కాబట్టి అంత ధర పెట్టి బీరు తాగినా కిక్కు ఎక్కడం లేదని పానప్రియులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో అబ్కారీ శాఖ బీర్ల కంపెనీలకు ఇస్తున్న కొనుగోలు ఆర్డర్లను కూడా కోత కోసింది. బెంగళూరు వంటి నగరాల్లో వర్షాకాలంలో బీర్లకు అధిక డిమాండ్ ఉంటుంది. యువతీ యువకులు, ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు సేవించడం అధికం. కానీ సేల్స్ తిరోగమనంలో పడిపోయినట్లు మద్యం వ్యాపారులు తెలిపారు. ధరల పెంపు కారణమని ఎక్సైజ్ అధికారులు చెప్పారు. మద్యం వాడకం కూడా బీర్ తో పోలిస్తే దేశీయ మద్యం విక్రయాలు కూడా అంతగా పెరగలేదు. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 వరకు 2,164 లక్షల లీటర్ల ఐఎంఎల్ అమ్ముడైంది. ఈ ఏడాది ఇదే కాలంలో 2,135 లక్షల లీటర్లు విక్రయమైంది. బీర్లు, మద్యం కొనుగోళ్లు తగ్గినప్పటికీ ప్రభుత్వ ఆదాయానికి నష్టం లేదు, ఎందుకంటే ధరలు, పన్నుల పెంపుతో అనుకున్న దానికంటే ఎక్సైజ్శాఖ కు ఆదాయం పెరుగుతోంది. కానీ ధర పెంపుతో వ్యాపారాలు తగ్గినట్లు వైన్షాపుల ఓనర్లు వాపోయారు. కొనుగోలు శక్తి తగ్గడంతో మద్యం ప్రియులు చవగ్గా దొరికే బీర్లు, లేదా మద్యం తాగి పద అంటున్నారు. ప్రీమియం బ్రాండ్లు కొనేవారు స్థానిక సరుకుతో సరిపెట్టుకుంటున్నారు. -
అల్లుడు.. అత్తకు యముడు
కర్ణాటక: జిల్లాతో పాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి అనేకచోట్ల విసిరివేసిన భయానక హత్యాకాండలో మిస్టరీ వీడింది. సొంత అల్లుడే అత్తను అంతమొందించాడని తేలింది. తుమకూరు సిటీ కువెంపు నగరలో నివాసం ఉంటున్న ఆమె అల్లుడు, దంత వైద్యుడు డాక్టర్. ఎస్.రామచంద్రయ్య (47) సూత్రధారి కాగా, ఊర్డిగెరె సమీపంలో కళ్లహళ్ళివాసి సతీష్ కే.ఎన్.(38), కిరణ్ కే.ఎస్. (32) అనే ఇతర నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ అశోక్ మీడియాతో తెలిపారు. ఏం జరిగిందంటే వివరాలు... తుమకూరు తాలూకాలోని బెళ్ళావి గ్రామానికి చెందిన బసవరాజు భార్య లక్ష్మీదేవమ్మ (42) ఈ నెల 3వ తేదీన కూతురి తేజస్వినిని చూడాలని తుమకూరుకు వచ్చింది. ఆ తరువాత ఆమె ఆచూకీ లేదు. కూతురి ఇంటికి వచ్చిన అత్తను అల్లుడు, ఇతర దుండగులు కిడ్నాప్చేశారు. హత్య చేసి సుమారు 10 ముక్కలుగా చేసి చింపుగానహళ్లి పరిసరాలలో పడేశారు. గ్రామస్తుల సమాచారం ఎస్పీ, పోలీసులు గాలింపు జరిపి శరీర భాగాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవమ్మగా భర్త బసవరాజు, పిల్లలు గుర్తించారు. బంధువులను పిలిచి విచారణ చేసే సమయంలో అల్లుడు, డెంటిస్టు రామచంద్ర కనిపించలేదు. ధర్మస్థలలో అల్లుడు అల్లుడు ధర్మస్థలకు వెళ్లాడు. పోలీసులు అక్కడికే వెళ్లి నిర్బంధించి కొరటిగెరె స్టేషన్కు వచ్చి గట్టిగా విచారించగా జరిగింది వివరించాడు. తన భార్యను చెడుదారిలో తీసుకెళ్లేందుకు ఒత్తిడి చేసిందని, అందుకే హత్య చేశానని చెప్పాడు. శరీరాన్ని ముక్కలు చేసి 10 చోట్ల పడేశామని తెలిపాడు. కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కేసులో ఇంకా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ తెలిపారు. -
‘నాపై పెద్ద కుట్ర జరిగింది.. రాహుల్ గాంధీని కలుస్తా’
ఓట్ల చోరీ వ్యవహారంపై నోరుజారి పదవి కోల్పోయిన కర్ణాటక మాజీ మంత్రి కేఎన్ రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పెద్ద కుట్ర జరిగిందని, తెర వెనుక ఉన్నవారి పేర్లను త్వరలో బయటపెడతానని అన్నారాయన. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసి తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తానని పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితుడిగా కేఎన్ రాజన్నకు పేరుంది. అదే సమయంలో డీకే శివకుమార్తో పొసగదనే ప్రచారం ఉంది. అయితే ఓట్ల చోరీ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కాంగ్రెస్కే దెబ్బ వేసేలా ఉన్న ఆ వ్యాఖ్యలను అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆయన్ని పదవి నుంచి తొలగించింది. అయితే.. ఈ వ్యవహారంలో పెద్ద కుట్ర జరిగిందని.. తాను బాధితుడిని మాత్రమేనని అంటున్నారాయన. ‘‘ఈ వ్యవహారంలో ఇప్పుడే వివరాలేం చెప్పలేను. రాజీనామా అనుకోండి.. నన్ను తప్పించారనుకోండి.. ఇంకా మీరు ఏమైనా రాసుకోండి. కానీ, ఈ తతంగం వెనుక పెద్ద కుట్రే జరిగింది. ఎవరు.. ఎందుకు చేశారనేది సరైన సమయం వచ్చినప్పుడు చెప్తా. త్వరలో ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ప్రెసిడెంట్ను, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాలను కలిసి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చి అపార్థాలను తొలగించే ప్రయత్నం చేస్తాను. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నాతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అని మీడియాను ఉద్దేశించి అన్నారాయన. రాజన్న ఏమన్నారంటే.. ‘‘మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటర్ల జాబితా సవరణలు జరిగాయి. ఆ సమయంలో పార్టీ కళ్లు మూసుకుంది’’ అని రాజన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా ఉండటంతో.. కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో డీకే శివకుమార్ వర్గీయులు సైతం ఈ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం కోరగా.. రాజన్న స్పందించలేదు. ఈ తరుణంలోనే సిద్ధరామయ్య సిఫారసుతో గవర్నర్ ఆయనను కేబినెట్ నుంచి తొలగించారు.కర్ణాటక తాజా రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాజన్న తొలగించే ఉద్దేశంలో సిద్ధరామయ్య లేరని, అయితే సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా వచ్చేవారితో కలిసి సిద్ధరామయ్యను కలిశాకే తన తదుపరి కార్యాచరణను రాజన్న ప్రకటిస్తారని సమాచారం. అదే సమయంలో.. కాంగ్రెస్ అధిష్టానం ఆయన కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన గనుక మరోసారి నోరు జారితే తీవ్ర చర్యలు తీసుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు బోగట్టా.కర్ణాటక తుమకూరు జిల్లాకి చెందిన రాజన్న(74)కు కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉంది. సహకార సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ఎమ్మెల్యే టికెట్ నిరాకరణతో 2004 ఎన్నికల్లో జేడీఎస్లో చేరి.. ఆ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆపై కాంగ్రెస్ గూటికి చేరి 2013, 2023 ఎన్నికల్లో మధుగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. డీకే శివకుమార్ వర్గంతో విభేదాలు ఉన్నప్పటికీ.. తనకు సన్నిహితుడైన రాజన్నకు సిద్ధరామయ్య సహకార సంఘ శాఖను కట్టబెట్టారు. -
కర్ణాటక మంత్రి రాజన్న తొలగింపు
బెంగళూరు: కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నను సీఎం సిద్ధరామయ్య కేబినెట్ నుంచి తొలగించారు. ఈ మేరకు ఆయన గవర్నర్ థావర్చంద్ర గహ్లోత్కు సోమవారం మధ్యాహ్నం సిఫారసు చేశారు. ఈ సిఫారసుపై గవర్నర్ ఆమోద ముద్ర వేశారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాయి. పదవికి రాజీనామా చేయాలని కోరగా రాజన్న స్పందించలేదని, అందుకే తొలగించారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. సిద్ధరామయ్యకు విధేయుడిగా పేరున్న రాజన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహానికి కారణ మ య్యాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో మహదేవపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓట్ల చోరీకి పాల్పడ్డారంటూ సొంత పార్టీ నేతలపై ఆరోప ణలు చేయడం కలకలం రేపింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీకి దిగిందంటూ ఇటీవల తీవ్ర విమర్శలు చేస్తుండటం తెల్సిందే. అయితే, సోమవారం ఉదయం మంత్రి రాజన్న మీడియా ఎదుట తమ పార్టీ హయాంలో ఓట్ల చోరీ జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటరు జాబితా సవరణలను పార్టీ నేతలు సరిగ్గా పరిశీలించకపోవడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. ముసాయిదా ఓటరు జాబితా తయారీ సమయంలో మౌనంగా ఉన్నారని ఆరోపించారు. దీంతో, ఒకే వ్యక్తి పేరు మూడు చోట్ల కనిపించిందని, తక్కువ మంది ఉండే చాలా ప్రాంతాల్లో అనుమానాస్పద పేర్లను జత చేశారని పేర్కొన్నారు. మంత్రి రాజన్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే, నేత రాహుల్ సహా అగ్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. వెంటనే ఆయన్ను రాజీనామా చేయాలని తాఖీదులు పంపింది. ఈ పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చినట్లయింది. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో పస లేదని రాజన్న వ్యాఖ్యలతో తేలిపోయిందని బీజేపీ పేర్కొంది. తప్పు ఎత్తి చూపినందుకు ఎస్టీ వర్గానికి చెందిన రాజన్నతో బలవంతంగా రాజీనామా చేయించారంది. నిజం మాట్లాడితే కాంగ్రెస్ శిక్ష రాజీనామాయే అని బీజేపీ ఎంపీ మోహన్ వ్యాఖ్యానించారు. నిజాన్ని అంగీకరించే ధైర్యం కాంగ్రెస్పార్టీకి లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర పేర్కొన్నారు. ఓట్ల చోరీ బీజేపీ హయాంలో జరిగిందని రాహుల్ ఆరోపిస్తుండగా, సీఎం సిద్ధరామయ్య హయాంలో అవకతవకలు జరిగినట్లు తాజాగా రుజువైందన్నారు. ఇందుకు రాహుల్, సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ఈ ముగ్గురిలో ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. రాజన్న వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
మంత్రి పదవికి రాజీనామా చేసిన KN. రాజన్న
-
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు.. ప్రధాని మోదీకి చిన్నారి లేఖ వైరల్
బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా'రోడ్డు చాలా దారుణంగా ఉంది. దయచేసి సహాయం చేయండి' అంటూ ఐదేళ్ల చిన్నారి చేతితో రాసిన విజ్ఞప్తి ప్రజల దృష్టిని ఆకర్షించింది . నెట్టింట తీవ్ర చర్చకు దారి దీసింది.బెంగళూరు నివాసి అభిరూప్ కుమార్తె ఆర్య, నగరంలోని దీర్ఘకాలిక ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించమని కోరుతూ ప్రధానమంత్రికి ఒక చిన్న లేఖ రాసింది. “నరేంద్ర మోదీ జీ, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మేము పాఠశాలకు , కార్యాలయానికి ఆలస్యంగా వెళ్తాము. రోడ్డు చాలా దారుణంగా ఉంది. దయచేసి సహాయం చేయండి” అని ఆమె రాసింది.PM is visiting Bangalore. My 5-year-old girl sees it as her chance to finally fix traffic. pic.twitter.com/EJdzpxSs89— Abhiroop Chatterjee (@AbhiroopChat) August 10, 2025 చిన్నారి లేఖను తండ్రి అభిరూప్ ఎక్స్లో షేర్ చేశారు. ప్రధాని బెంగళూరును పర్యటన సందర్భంగా. నా 5 ఏళ్ల అమ్మాయి దీనిని చివరకు ట్రాఫిక్ను సరిదిద్దే అవకాశంగా భావిస్తోంది" అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ త్వరగా వైరల్ అయింది, నాలుగు లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. దీంతో నెటిజన్లు కూడా ఆమె మద్దతుగా స్పందించారు.మరికొంతమంది బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “కోరమంగళ నుండి ఇందిరానగర్ వరకు ఉన్న రోడ్ల కారణంగా అధ్వాన్నం. అటునుంచి వెళ్లాలంటేదాదాపు చచ్చినంత పని.. నేను రూ.3 లక్షలు ఆదాయపు పన్ను చెల్లిస్తాను. అయినా మనకు లభించేది యమపురికి దారుల్లాంటి రోడ్లు అంటూ మండిపడ్డారు. మరోవైపు ఒక యూజర్ ముంబైలో శబ్ద కాలుష్యం గురించి 15 సంవత్సరాల క్రితం తన కుమార్తె రాసిన లేఖను గుర్తు చేసుకున్నారు. ఆగస్టు 11 నుండి ఉదయం 6:30 గంటలకు బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్యాసింజర్ సర్వీసులు ప్రారంభమైనాయి. కర్ణాటక మెట్రో ప్రాజెక్టు నిధులలో 87శాతం అందిస్తుందని,చ, 2030 నాటికి బెంగళూరులో 220 కి.మీ నెట్వర్క్ పూర్తవుతుందని సీఎం సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి -
రెండుసార్లు ఓటేసిన మహిళ ఆధారాలివ్వండి
బెంగళూరు: గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ మహిళ రెండుసార్లు ఓటే సిందంటూ చేసిన ఆరోపణలకు ఆధారాలను అందజేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కర్ణాట క చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) లేఖ రాశారు. షకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటేసినట్లు పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డులు చెబుతు న్నాయని రాహుల్ కొన్ని పత్రాలను ప్రదర్శించారు. ఓటరు ఐడీ కార్డును ఆమె రెండు సార్లు ఉపయోగించుకున్నారు. పోలింగ్ బూత్ టిక్ మార్కు వేశారు’అని అందులో ఉందని రాహుల్ ఆరోపించా రు. అయితే, తమ దర్యాప్తుపై షకున్ రాణి ఒక్క సారి ఓటేసినట్లు వెల్లడైందని సీఈవో తెలి పారు. టిక్ మార్కు పెట్టినట్లుగా రాహుల్ గాంధీ చూపిన ఓటరు జాబితా పోలింగ్ అధికారి అందజేసిందని కాదని సీఈవో స్పష్టం చేశారు. ‘షకున్ రాణి లేదా మరొకరు రెండు సార్లు ఓటేశారని ఆరోపిస్తూ మీరు చూపిన పత్రాలను మాకు అందజేయండి. పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతాం’అని రాహుల్కు రాసిన లేఖలో సీఈవో కోరారు. లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, కర్ణాటకలో మహదేవపు రం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ఓటరు జాబితాలో దొంగ ఓట్లు నమోదయ్యా యని రాహు ల్ ఈసీ లక్ష్యంగా ఆరోపణలు చేయడం తెల్సిందే. -
ట్రంప్కు ప్రధాని మోదీ కౌంటర్!
బెంగళూరు: భారత్ ‘డెడ్ ఎకానమీ’ అంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ప్రపంచంలో భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఎంతో సమయం పట్టదంటూ స్పష్టం చేశారు. ఈరోజు( ఆదివారం, ఆగస్టు 10వ తేదీ) బెంగళూరులో మెట్రో ఫేజ్-3 కి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన మోదీ ప్రసంగించారు. భారత్ మూడో ఆర్థిక శక్తి కాబోతుందంటూ ఆయన స్పష్టం చేశారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనేవి భారత్ ఆర్థికంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ‘గత 11 ఏళ్లలో భారత ఆర్థికంగా బలోపేతమైంది. 10వ స్థానం నుంచి 5 స్థానానికి వచ్చాం. ఇప్పుడు మూడో ఆర్థిక శక్తిగా ఎదిగే ట్రాక్లో ఉన్నాం. కచ్చితమైన, నిజాయితీ పరమైన దృష్టి పెట్టడంతోనే ఇది సాధ్యమవుతూ వస్తుంది. అందుకే ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి మనం దగ్గర్లోనే ఉన్నాం,’ అని తెలిపారు.2014 నాటికి మన దేశంలో ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైలు అందుబాటులో ఉండేది. ఇప్పుడు 24 నగరాల్లో ఆ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో నెట్వర్క్. 2014 నాటికి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లు అనేవి ఏడు, మెడికల్ కాలేజీలు 387 ఉండేవి. ఇప్పుడు మెడికల్ ఇన్స్టిట్యూట్లు 22, మెడికల్ కాలేజీలు 704 ఉన్నాయి. ఎలక్రికల్ రైళ్లు 2014 నాటికి 20వేలు మాత్రమే ఉంటే నేటికి అవి 40వేలు అయ్యాయి. ఇక ఎయిర్పోర్ట్లు 74 నుంచి 180కు పెరిగాయి’ అని ప్రభుత్వం సాధించిన ఘనతలను చెప్పుకొచ్చారు మోదీ. -
మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కర్ణాటకలో పర్యటించారు. మూడు వందే భారత్ రైళ్లు, మెట్రో ఎల్లో మార్గాన్ని ఆయన ప్రారంభించారు. ప్రత్యేక విమానంలో హెచ్ఏఎల్ విమానాశ్రయానికి వచ్చిన ప్రధాని.. అక్కడి నుంచి హెలికాప్టర్లో మేఖ్రి సర్కిల్ వద్ద ఉన్న హెలిప్యాడ్కు చేరుకున్నారు.అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మెజెస్టిక్లోని సంగొళ్లి రాయణ్ణ రైల్వేస్టేషన్కు చేరుకొని బెంగళూరు– బెళగావి మధ్య వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపారు. అలాగే అమృత్సర్– శ్రీమాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్, నాగపూర్–పూణె మధ్య వందే భారత్ రైలు సేవలను ప్రారంభించారు. అనంతరం ఆర్వీ రోడ్డు రాగిగుడ్డ మెట్రో స్టేషన్కు చేరుకొని మెట్రో ఎల్లో మార్గం ప్రారంభించి.. మెట్రో రైలులో ఎల్రక్టానిక్ సిటీ వరకు ప్రయాణించారు. #WATCH | Bengaluru | Prime Minister Narendra Modi, along with Karnataka CM Siddaramaiah, Dy CM DK Shivakumar, and Union Minister Manohar Lal Khattar, undertakes a metro ride from RV Road (Ragigudda) to Electronic City metro station via the Yellow line that PM Modi inaugurated… pic.twitter.com/RxB1AcCPwC— ANI (@ANI) August 10, 2025 ఎల్రక్టానిక్ సిటీలో ఐఐఐటీ సభా మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెట్రో 3వ దశకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించారు. బెంగళూరు-బెళగావి వందే భారత్ రైలు సంచారంతో కళ్యాణ కర్ణాటకకు రవాణా వసతి మరింత మెరుగుపడుతుంది. ఈ రైలు బుధవారం తప్ప వారంలో అన్ని రోజులు అందుబాటులో ఉంటుంది. రోజూ ఉదయం 5.20కి బెళగావిలో బయలుదేరి మధ్యాహ్నం 1.50కి బెంగళూరు రాయణ్ణ రైల్వే స్టేషన్కు చేరుకొంటుంది. మధ్యాహ్నం 2.20కి రాయణ్ణ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి బెళగావికి రాత్రికి 10.40కి బెళగావి చేరుకొంటుంది. యశ్వంతపుర, తుమకూరు, దావణగెరె, హావేరి, హుబ్లీ–ధారవాడ స్టేషన్లలో నిలుస్తుంది. -
ముక్కలుగా నరికి..10 చోట్ల పడేశారు..!
బెంగళూరు: 2022నాటి శ్రద్ధా వాకర్ దారుణ హత్యను తలపించే ఘటన ఒకటి కర్నాటకలో వెలుగు చూసింది. ఈ నెల 7వ తేదీన కొరటగెరె తాలుకాలోని ఓ గ్రామంలో వీధి కుక్క ఒకటి రక్తమోడుతున్న మనిషి చేతిని లాక్కెళుతుండగా చూసి షాక్కు గురయ్యారు. మరో చేయి అక్కడికి కిలోమీటర్ దూరంలో గ్రామస్తులకు కనిపించింది. గుర్తు తెలియని మహిళ తల, మొండెం తదితర భాగాలు పది వేర్వేరు ప్రాంతాల్లో పడి ఉండగా గుర్తించారు. సాధారణంగా చోటుచేసుకునే హత్య వంటిది కాదని తేలి్చన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతురాలిని గుర్తించారు. హంతకుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. 10 చోట్ల 10 భాగాలు.. ఈ నెల 7వ తేదీ గురువారం ఉదయం చింపుగనహళ్లి గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన కుక్క ఒకటి మనిషి తెగిన చేతిని పొదల్లోకి లాక్కెళ్తుండగా స్థానికులు గమనించారు. ప్లాస్టిక్ కవర్లో చుట్టిన మరో చేయి ఆ సమీపంలోనే వారికి కనిపించింది. మరికొద్ది గంటల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో మరికొన్ని అవయవ భాగాలు కనిపించాయి. లింగపుర రోడ్డు వంతెన వద్ద పేగులు, ఇతర అంతర్గత భాగాలు బెండోన్ నర్సరీకి సమీపంలో, ఒక కాలు రక్తంతో తడిచిన బ్యాగు జోనిగరహళ్లి వద్ద పోలీసులకు దొరికాయి. సిద్దారబెట్ట, నాగాలాల్ మధ్య రోడ్డుపై రెండు బ్యాగుల్లో మరికొన్ని శరీర భాగాలను గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం సిద్దారబెట్ట సమీపంలో హతురాలి తల లభ్యమైంది. శరీర భాగాలన్నీకొరటగెరె, కొలాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం 10 ప్రాంతాల్లో పడి ఉండగా స్వా«దీనం చేసుకున్నారు పోలీసులు. హతురాలి చేతులపై ఉన్న పచ్చబొట్లు, ముఖకవళికల ఆధారంగా ఆమెను తుమకూరు తాలుకా బెళ్లావికి చెందిన లక్ష్మీదేవమ్మ(42)అని గుర్తించారు. ఆగస్ట్ 3వ తేదీన ఉర్దిగెరెలో ఉన్న కుమార్తెను చూసేందుకని వెళ్లిన లక్ష్మీదేవమ్మ కనిపించకుండా పోయిందంటూ ఆమె భర్త బెళ్లావి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసి, ముక్కలుగా నరికారని, ఆమె ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకే హంతకులు పలు ప్రాంతాల్లో శరీర భాగాలను పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ హత్యకు పాల్పడిందెవరు? కారణాలేమిటో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 2022లో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె బాయ్ఫ్రెండ్ ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసిన ఘటన తీవ్ర సంచలనం రేపడం తెల్సిందే. -
ధర్మస్థళపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: కర్ణాటకలోని ధర్మస్థళలో అనుమానాస్పద మిస్టరీ మరణాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రస్ట్ చైర్మన్, సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 500 మంది అమ్మాయిలపై లైంగిక దాడి చేసి, హత్య చేసి పూడ్చి పెట్టారంటూ ఆరోపణలు చేశారు.సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ..‘కర్నాటకలోని ధర్మస్థళ ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉంది. ధర్మస్థళ ట్రస్ట్కు ఏడాదికి రూ.100 కోట్లు ఆదాయం వస్తుంది. ట్రస్ట్ చైర్మన్, సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలి. ట్రస్ట్ను ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవాలి. 500 మందిపై లైంగిక దాడి చేసి హత్య చేసి పూడ్చి పెట్టారు. అది దేవస్థానమా లేక స్మశాన వాటికా?. తవ్వే కొద్దీ పుర్రెలు, ఎముకలు బయటపడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సిట్ వేశారు.. మరో ప్రభుత్వం అయితే ఇది బయటకు వచ్చేది కాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ తవ్వకాలు.. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కర్ణాటకలోని ధర్మస్థళ ఖననాల కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరో కొత్త ప్రదేశంలో తవ్వకాలను చేపట్టింది. గుర్తు తెలియని ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఆ ప్రాంతంలో సిట్తో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, సాంకేతిక సిబ్బంది కూడా ఉన్నారు. ఈ తవ్వకాలు కఠినమైన భద్రత మధ్య నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. అయితే ఆ స్థలం నుంచి కనుగొన్న వాటి గురించి ఇప్పటివరకు వెల్లడించలేదు. అన్ని ఆధారాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అన్నారు. తదుపరి చర్యలు, ఫోరెన్సిక్ నివేదికలు చట్టపరమైన ప్రక్రియల ఆధారంగా ఉంటాయని తెలిపారు. అయితే, ఈ దర్యాప్తు ప్రజలు, రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చలకు దారి తీసిందని అధికారులు అన్నారు.సుప్రీం కోర్టు కీలక నిర్ణయంమరోవైపు ధర్మస్థలలో సామూహిక అంత్యక్రియల కేసును నివేదించకుండా మీడియాను నిరోధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆలయాన్ని నిర్వహిస్తున్న కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మీడియా కథనాలు వస్తున్నాయని ధర్మస్థళ ఆలయ కార్యదర్శి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు పేర్కొంది. పరువు నష్టం కలిగించే కంటెంట్ను తొలగించాలని కోరుతూ ధర్మస్థళ ఆలయ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్ను పునఃపరిశీలించాలని కర్ణాటకలోని ట్రయల్ కోర్టును ఆదేశించింది. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే గ్యాగ్ ఆర్డర్లు జారీ చేస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. అన్ని విషయాలను ట్రయల్ కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్ను ఆదేశించింది. -
ఓట్ల దొంగతనానికి ఆధారాలు ఇదిగో..: రాహుల్ గాంధీ
ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం బెంగళూరులో ఓట్ అధికార్ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు.భారత రాజ్యాంగం విశిష్టమైనది. మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్, బసవన్న, పూలే, నారాయణ గురు ఆలోచనలు మన రాజ్యాంగంలో ప్రతిబింబిస్తున్నాయి. అలాంటి రాజ్యాంగాన్ని 2024 లోక్సభ ఎన్నికల నుంచి మేం మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక వ్యక్తి.. ఒక ఓటు అనేది రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన హక్కు. అలాంటిది బీజేపీ, మోదీ ఆ హక్కు ఇచ్చిన రాజ్యాంగంపై దాడి మొదలుపెట్టారు. ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గెలిచింది అని రాహుల్ అన్నారు.లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో మా సర్వే ప్రకారం.. 15 నుంచి 16 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాం. కానీ, 9 మాత్రమే గెలిచాం. ఆ ఫలితాలను విశ్లేషించినప్పుడు.. నిజంగానే మేం ఓడిపోయామా? అనిపించింది. వెంటనే ఓటర్ల సాఫ్ట్ కాపీని ఇవ్వమని ఈసీని కోరాం. కానీ, ఈసీ అందుకు నిరాకరించింది. ఎన్నికల వీడియోలు కావాలని కోరినా.. రూల్స్ మారిపోయాయంటూ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. లోక్సభ ఎన్నికల తరవాత మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. అక్కడ మా మహఘట్బంధన్ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారని గుర్తించాం. వీళ్లెవరూ లోక్సభ ఎన్నికలకు ఓటేయలేదు. ఇండియా కూటమికి ఓటు షేర్ ఎక్కడా తగ్గలేదు. కానీ, కొత్తగా చేరిన ఓటర్లు బీజేపీకి ఓటేశారు. అలా బీజేపీ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో నెగ్గింది. అక్కడే ఏదో తప్పు జరిగిందని గుర్తించాం. नरेंद्र मोदी वोट चोरी करके प्रधानमंत्री बने हैं चुनाव आयोग हमें डेटा दे, हम साबित कर देंगे pic.twitter.com/WUBm97WR4g— Congress (@INCIndia) August 8, 2025బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ పార్లమెంట్ ఫలితం.. అందునా మహదేవపుర సెగ్మెంట్ నుంచే మేం మా పరిశోధన మొదలుపెట్టాం. మహదేవపురలో 6.5 లక్షల ఓట్లు ఉంటే.. 1,00,250 ఓట్లు చోరీకి గురయ్యాయి. అంటే.. సగటున ఆరు ఓట్లలో ఒకటి చోరీకి గురైందన్నమాట. అలా లోక్సభ ఎన్నికల్లో ఈసీ బీజేపీ కలిసి మోసం చేశాయని నిరూపించగలిగాం. బెంగళూరులోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,250 ఫేక్ ఓట్లు నమోదయ్యాయని రాహుల్ గాంధీ అంటున్నారు. ఆయన లెక్క ప్రకారం ఫేక్ ఓట్లు ఇలా ఉన్నాయి• 11,965 డూప్లికేట్ ఓటర్లు• 40,009 ఫేక్/చెల్లని చిరునామాలు• 10,452 ఓటర్లు ఒకే చిరునామాలో నమోదు• 4,132 చెల్లని ఫోటోలు• 33,692 మంది Form 6 ద్వారా అనుమానాస్పదంగా ఓటర్లుగా నమోదుమహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారు. కర్ణాటకలోనూ ఫేక్ ఓట్లు నమోదయ్యాయి. ఒకే ఇంటిపై 40కిపైగా ఓట్లు నమోదు అయ్యాయి. మేం ప్రశ్నిస్తుంటే ఈసీ వెబ్సైట్ మూసేసింది. ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి ఎన్నికల మోసానికి పాల్పడింది. ఓట్ల దొంగతనం తీవ్రమైన నేరం. ఆ నేరం జరిగింది అనడానికి కర్ణాటక డేటానే ఆధారం. ఎన్నికల వీడియోలు, డిజిటల్ ఓటర్ లిస్టులు ఇవ్వకుండా ఈసీ నేరాన్ని దాచిపెడుతోంది. ఈ ఓట్ల దొంగతనంను దేశవ్యాప్తంగా బయటపెట్టేందుకు కాంగ్రెస్ ఉద్యమం ప్రారంభించబోతోంది.నన్ను అఫిడవిట్ ఇవ్వమని, ప్రమాణం చేయమని ఈసీ అడుగుతోంది. కానీ నేను పార్లమెంట్లో రాజ్యాంగం మీద ఇప్పటికే ప్రమాణం చేశాను. ఎన్నికల సంఘం బీజేపీకి గనుక పని చేయకపోతే.. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఎన్నికల వీడియోలు, డిజిటల్ ఓటర్ లిస్టులు మాకు అందించాలి’’ అని రాహుల్గాంధీ ఈసీకి సవాల్ విసిరారు. -
స్కూటీ నడిపి.. చిక్కుల్లో పడ్డ డీకే.. అసలేంటీ వివాదం?
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అసలేం జరిగిందంటే.. మంగళవారం ఆయన హెబ్బాళ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సమయంలో కొత్త వంతెనపై స్కూటీలో వెళ్లారు. అయితే ఆ స్కూటర్పై 34 చలానాలు, రూ.18,500 జరిమానా ఉందని తేలింది. ఆ స్కూటీని డీసీఎం ఉపయోగించడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష నేతలు సైతం ఆయన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దుమ్మెతిపోశారు...దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా.. ఈ వీడియో కొద్దిసేపటికే వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ఆ స్కూటిపై ఇప్పటికే 34 చలాన్లు ఉన్నట్లు తేల్చారు. డీసీఎం నడిపిన స్కూటీపై (నంబర్ KA 04 JZ 2087) పలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ స్కూటీపై ట్రాఫిక్ పోలీసులు 34కి పైగా జరిమానాలు విధించగా.. రూ.18,500 వరకూ చెల్లించాల్సి ఉంది.The Hebbal flyover loop is set to open, easing traffic congestion and ensuring smoother and faster commutes as part of our government's commitment to building a better Bengaluru.#HebbalFlyover pic.twitter.com/HotJ61mUpx— DK Shivakumar (@DKShivakumar) August 5, 2025డీకే శివకుమార్ వీడియోపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది. ప్రతిపక్షాలు.. డీకేపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోస్ట్లతో హోరెత్తిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పబ్లిసిటీ కోసం రీల్స్పై దృష్టి పెట్టకుండా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటూ ప్రతిపక్ష నేతలు హితవు పలుకుతున్నారు. -
‘ఓట్ చోరీ’ కామెంట్స్లో ట్విస్ట్.. తప్పని తేలితే రాహుల్ గాంధీకి శిక్ష
సాక్షి,బెంగళూరు: బీజేపీ కోసమే కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓట్ చోరీ పేరుతో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో చూపించిన ఆధారాలు తప్పని తేలితే శిక్ష పడే అవకాశం ఉందని తెలుపుతూ కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి లేఖ రాసింది.మహరాష్ట్ర,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఓట్ చోర్ పేరుతో గురువారం ఢిల్లీ ఇందిరా భవన్లో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో అక్రమాలు జరిగిన ఓటర్ల జాబితాను బహిర్ఘతం చేశారు. అయితే రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ ఆరోపణల్ని కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా ఖండించారు. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమైనవి తెలిపింది. ఎన్నికల సంబంధించిన అంశాలను న్యాయం స్థానాన్ని ఆశ్రయించాలని సూచించింది.అదే సమయంలో రాహుల్ ఆరోపణలకు సంబంధించి అధికారిక డిక్లరేషన్, నకిలీ ఓటర్ల వివరాలను సమర్పించాలని కోరింది. తప్పుడు ఆధారాలు సమర్పిస్తే, 1950 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం శిక్ష పడే అవకాశం ఉందని లేఖలో హెచ్చరించింది. The Chief Electoral Officer of Karnataka confirmed a meeting with the INC delegation on August 8. In response to Rahul Gandhi’s remarks on alleged irregularities in the voter rolls, the CEO stated that electoral rolls were transparently shared in Nov 2024 and Jan 2025. No… pic.twitter.com/gRfO8Eq3Nd— IANS (@ians_india) August 7, 2025 ఆ నియోజకవర్గంలో లక్ష నకిలీ ఓట్లు.. ఆధారాలివే ‘సార్వత్రిక ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చిన కొన్ని నెలలకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఫలితాలు తారుమారువడంపై మాకు అనుమానం వచ్చింది. గతేడాది 48 మహారాష్ట్ర లోక్సభ స్థానాల్లో సీట్లలో 30 సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి.. కేవలం ఐదు నెలల తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో 50 మార్కును ఎందుకు దాటలేకపోయింది.మహరాష్ట్ర,కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కోసమే ఈసీ పనిచేసింది. అందుకు మా వద్ద అణుబాంబులాంటి ఆధారాలున్నాయి. మేం అంతర్గతం చేపట్టిన సర్వేలో కర్ణాటకలో ఇండియా కూటమి 16 ఎంపీ స్థానాలు గెలుస్తుందని తేలింది. కానీ తొమ్మిది స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత ఊహించని విధంగా ఓడిపోయిన ఏడు స్థానాలపై దృష్టి సారించాం. అలా బెంగళూరు సెంట్రల్ లోక్సభ సెగ్మెంట్లోని అసెంబ్లీ స్థానమైన మహదేవపురలో ఓటమికి గల కారణాల్ని అన్వేషించాం. బెంగళూరు సెంట్రల్ లోక్సభలో పోలైన మొత్తం ఓట్లు 6.26 లక్షలు. బీజేపీకి 6,58,915 ఓట్లు పోలవ్వగా.. 32,707 ఓట్ల తేడాతో గెలిచింది. ఇదే బెంగళూరు సెంట్రల్ లోక్సభలో మహదేవపుర అసెంబ్లీ స్థానాన్ని పరిశీలిస్తే.. ఓట్ల చోరీ జరిగినట్లు గుర్తించాం. మహదేవపురలో కాంగ్రెస్కు 1,15,586 ఓట్లు పోలవ్వగా.. బీజేపీ 2,29,632 ఓట్లు పోలయ్యాయి. బెంగళూరు సెంట్రల్లో సర్వజ్ఞనగర్,సీవీ రామ్ నగర్,శివాజీ నగర్,శాంతీ నగర్,గాంధీ నగర్,రాజాజి నగర్,చామ్రాజ్పేట అన్నీ అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఒక్క మహదేవపురలో ఓడిపోయాం.ఈ మహదేవపుర అసెంబ్లీ నియోజక వర్గంలో ఐదు రకాలుగా 1,00,250 నకిలీ ఓట్లు గుర్తించాం. నకిలీ ఓటర్లు, నకిలీ, చెల్లని చిరునామాలు, ఒకే ఇంటి అడ్రస్తో పదుల సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇది నిజమా? కాదా? అని నిర్దారించేందుకు ఆ ఇంటి చిరునామాలకు వెళ్లాం. ఆ ఇంటి అడ్రస్లో ఉన్న ఓట్లను పరిశీలిస్తే.. అన్నీ నకిలీవేనని తేలింది’ అని ఆరోపించారు. -
ధర్మస్థల కేసులో కీలక మలుపు..
-
Rishabh Pant: ఆటలో ధీరుడు.. గుణంలో కర్ణుడు
టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, మానవత్వం ప్రదర్శించడంలోనూ అంతే దూకుడుగా ఉంటాడు. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై పాదం ఫ్రాక్చర్ అయినా బరిలోకి దిగి యావత్ క్రికెట్ ప్రపంచంచే జేజేలు పలికించుకున్న పంత్.. తాజాగా ఓ చర్య ద్వారా గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నాడు.కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలోని రబ్కవి గ్రామానికి చెందిన జ్యోతి కనబుర్ మఠ్ అనే విద్యార్థిని చదువుకు ఆర్దిక సాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. జ్యోతి 12వ తరగతిలో 85 శాతం మార్కులు సాధించింది. BCA చదవాలన్న ఆశతో ఉన్న ఆమెకు రూ. 40,000 ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. తండ్రి టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో, రిషబ్ పంత్ స్పందించి జులై 17న నేరుగా కాలేజీకి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాడు. “నీ కలలు నిజమవ్వాలి” అంటూ ఆమెకు భరోసా ఇచ్చాడు.పంత్ చేసిన ఈ పనికి యావత్ మానవాళి జేజేలు కొడుతుంది. ఆటలో ధీరుడు, గుణంలో కర్ణుడు అంటూ ఆకాశానికెత్తుతుంది. రియల్ హీరో అంటూ కొనియాడుతుంది. వాస్తవానికి పంత్కు ఇలాంటి దానాలు కొత్త కాదు. గతంలో చాలా సందర్భాల్లో పేదలకు ఆర్దిక సాయం చేశాడు. రిషబ్ పంత్ ఫౌండేషన్ ద్వారా తనకు వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు పంచి పెడుతున్నాడు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో అవసరమైన వారికి తగు సాయం చేస్తుంటాడు.గతంలో ఓ సందర్భంలో పంత్ మాట్లాడుతూ.. క్రికెట్ వల్ల నాకు లభించిన ప్రతిదానికి నేను కృతజ్ఞుడిని. ఇప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని అన్నాడు.తన ఆటతీరుతో విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను మెప్పించిన పంత్.. తన మానవతా గుణంతో దేశ ప్రజల మనసులు గెలుచుకుంటున్నాడు. సమాజానికి సేవ చేయాలనే తపనతో ఉన్న పంత్ చర్యలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. కాగా, తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే దురదృష్టవశాత్తు నాలుగో టెస్ట్ సందర్భంగా గాయపడి చివరి మ్యాచ్కు దూరమయ్యాడు. నాలుగో టెస్ట్లో పాదం ఫ్రాక్చర్ అయినా పంత్ బ్యాటింగ్కు దిగి అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో పంత్ 7 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 479 పరుగులు చేసి, ఆరో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సిరీస్ను భారత్ 2-2తో సమం చేసుకుంది. -
నేటి నుంచి ఆర్టీసీ బంద్!
కర్ణాటక: ప్రజా రవాణాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులు మంగళవారం బంద్ అయ్యే అవకాశముంది. పలు డిమాండ్లపై సర్కారుతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ఫలించలేదు. ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు 38 నెలల వేతన బకాయిల చెల్లింపుతో పాటు అనేక డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. రవాణాశాఖ ఒక్కోట నాయకులు సీఎం సిద్దరామయ్య సోమవారం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. మంగళవారం నుంచి బస్సులు రోడ్ల పైకి వెళ్లవు. ఉదయం 6 నుంచి సమ్మె చేస్తామని రవాణా మండలి కార్మిక సంఘాల జాయింట్ క్రియా సమితి అధ్యక్షుడు అనంత సుబ్బారావ్ తెలిపారు. 14 నెలల బకాయిలిస్తాం: మంత్రి ఉద్యోగులకు 14 నెలల వేతన బకాయిలను ఇవ్వడానికి సీఎం సమ్మతించారని రవాణాశాఖమంత్రి రామలింగారెడ్డి తెలిపారు. విధానసౌధ వద్ద విలేకరులతో రామలింగారెడ్డి మాట్లాడుతూ బకాయిల కింద రూ.718 కోట్లు చెల్లిస్తామని అన్నారు. వాయిదాకు హైకోర్టు సూచన రవాణా సమ్మెను ఒకరోజు వాయిదా వేయాలని హైకోర్టు న్యాయమూర్తులు కేఎస్.ముదగల్, ఎంజీఎస్.కమల్ ధర్మాసనం ఉద్యోగులకు సూచించింది. సమ్మె వల్ల జనజీవనం అస్తవ్యస్తమౌతుందని బెంగళూరువాసి జే.సునీల్ తదితరులు పిల్ వేశారు. విచారించిన జడ్జిలు ఒకరోజు వాయిదా వేయాలని సూచించారు. రవాణా ఉద్యోగులు సెలవులు రద్దు ఈ నేపథ్యంలో ప్రభుత్వం రవాణా శాఖ ఉద్యోగులు సెలవుల రద్దుచేసింది. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనకుండా కట్టడి చేసింది. ఎవరికీ సెలవులు ఇవ్వరాదని, వీలైతే వారం సెలవు కూడా రద్దుచేయాలని అధికారులను ఆదేశించింది. గైర్హాజరయ్యే ఉద్యోగులు వేతనాల్లో కోత విధించాలని ఆదేశించింది. సమ్మె విరమించండి: సిద్దరామయ్య ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలతో సీఎం సిద్దరామయ్య విధానసౌధలో సుదీర్ఘంగా చర్చించారు. డిమాండ్లను తీర్చడానికి గడువు ఇవ్వాలని, సమ్మె యోచనను విరమించాలని కోరారు. కానీ ఉద్యోగులు మాత్రం డిమాండ్లు నెరవేర్చాలని పట్టుబట్టారు. సమ్మె వల్ల జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగే అవకాశముంది. -
Dharmasthala Mystery: ధర్మస్థల మరణాల మిస్టరీలో ఇది రెండో ఆధారం
-
ప్రజ్వల్కు సరైన శిక్ష
డబ్బూ పలుకుబడీ జతగూడితే ఎన్ని నేరాలకు కారణమవుతుందో, ఎన్ని వికారాలకు ఆస్కార మిస్తుందో దాదాపు ఇరవయ్యేళ్లక్రితం అమెరికాలో ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టిన్ ఉదంతం రుజువు చేసింది. ఈ రెండింటికీ రాజకీయాధికారం తోడైతే ఏమవుతుందో కర్ణాటక జేడీఎస్ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ నిరూపించారు. ఒక మహిళపై అత్యా చారం చేసిన కేసులో ప్రజ్వల్కు యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజ్వల్ ఒక రాజకీయ నాయకుడే కాక మాజీ ప్రధాని దేవె గౌడకు మనుమడు కావటం, తండ్రి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవడం, అతని బాబాయ్ కుమార స్వామి లోగడ ముఖ్యమంత్రిగా పనిచేయటంతోపాటు ప్రస్తుతం కేంద్రమంత్రిగా వుండటం, తమ్ముడు ఎమ్మెల్సీ కావటం వంటివి ఈ సంచలనానికి కారణమైతే కావొచ్చు గానీ... అంతకన్నా ఎక్కువగా ప్రజ్వల్ దురంతాలు ప్రజల్ని దిగ్భ్రాంతిపరచటం అసలు కారణం. ఒకరు కాదు... ఇద్దరు కాదు, పదులకొద్దీ మంది ప్రజ్వల్ అఘాయిత్యాలకు బలైపోయారు. అతని ఘోరాలకు సంబంధించి 3,000 వీడియోలు ప్రచారంలోకొచ్చాయంటే అతని దుర్మార్గం ఎంతటిదో ఊహించవచ్చు. తమనేమీ చేయొద్దని, కనికరించి వదిలేయాలని బాధిత మహిళలు వేడు కోవటం వంటి హృదయవిదారక దృశ్యాలు ఈ వీడియోల్లో ఉన్నాయంటున్నారు. తన ఘన కార్యాన్ని తానే వీడియో తీసి బాధితుల్ని బ్లాక్మెయిల్ చేయటం ప్రజ్వల్కు అలవాటు. ఆ వీడియోలు, ఫొటోలు చూసి 70 మంది బాధిత మహిళలను గుర్తించగలిగినా వారిలో కేవలం అయిదుగురు మాత్రమే ఫిర్యాదులీయటానికి ముందుకొచ్చారు. అందులో ఒక కేసులో ప్రస్తుతం ప్రజ్వల్కు శిక్షపడింది. ఈ నేరాలు గుట్టుచప్పుడు కాకుండా జరగలేదు. కుటుంబంలో వీటికి సంబంధించి తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధాలవుతున్నాయని మీడియాలో కథనాలొచ్చాయి. కానీ ప్రజ్వల్ను చట్టానికి అప్పగించాలని కుటుంబంలో ఏ ఒక్కరూ భావించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతే కాదు... ప్రజ్వల్ తల్లిదండ్రులు బాధితుల్ని బెదిరించిన వైనం వెల్లడైంది. శిక్ష తప్పదనుకున్న ప్రజ్వల్ కొన్నాళ్లు విదేశాలకు పరారయ్యాడు. చిత్రమేమంటే ఇతర పార్టీలకు సైతం ఉప్పందినా అవి సైతం మౌనంగానే ఉన్నాయి. చివరకు ఒక మహిళా సంఘం ఫిర్యాదు చేయాల్సివచ్చింది. మరి పార్టీలున్నది దేనికి? ఆ ఫిర్యాదుపై రాష్ట్ర మహిళా కమిషన్ వేగంగా స్పందించి, డీజీపీకి ఆదేశాల్విటంతో అంతా బయటికొచ్చింది. రాజకీయంగా శక్తిమంతమైన కుటుంబంతో ఢీకొట్టి నట్టవుతుందని భయపడి బాధితుల్లో అత్యధికులు ఫిర్యాదు చేయటానికి ముందుకు రాలేదు సరి కదా... వారిలో చాలామంది ఏకంగా హసన్ నగరం నుంచి మకాం మార్చేశారు. ప్రఖ్యాత అమెరికన్ క్రిమినాలజిస్టు ఫ్రెదా అడ్లర్ ఒక సందర్భంలో బాధితులే దోషులుగా మారే ఏకైక నేరం అత్యాచారమేనన్నారు. బాధితులు ఎందుకంత భయపడ్డారో ఈ వ్యాఖ్యే చెబుతుంది. విచారణ పేరిట నిండు న్యాయస్థానంలో అవమానాలు పొంది, న్యాయమూర్తి నుంచే దుర్వా్యఖ్యానాలు ఎదురైన మహిళలు తక్కువేమీ కాదు. ఇందుకు మన దేశం కూడా మినహాయింపు కాదు.ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించి డీఎన్ఏ ఆధారాలతో సహా పకడ్బందీ సాక్ష్యాధా రాలు సేకరించినందుకు, త్వరితగతిన విచారణ పూర్తికావటానికి దోహదపడినందుకు కర్ణాటక పోలీసు విభాగాన్ని అభినందించాలి. ప్రజ్వల్ ఉదంతంలో వీడియోలను ప్రచారంలో పెట్టి బాధితుల్ని మరింతగా వేధించిన ఇతరులను సైతం బోనెక్కించాలి. డబ్బూ, పలుకుబడి గల నిందితు లకు శిక్ష పడేలా చేస్తే, సమాజంలో ఇతరులూ భయపడతారు. కర్ణాటకలో గతంలో కూడా కొందరు నాయకుల ఉదంతాలు వెల్లడైనా అవి పోలీసుల వరకూ రాలేదు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల్లో అభ్యంతరకర వీడియోలు వీక్షిస్తూ ఎమ్మెల్యేలు లైవ్ కెమెరాలకు చిక్కిన సందర్భాలు న్నాయి. బలహీనులపై అధికారం చలాయించటం, వారిని కనీసం మనుషులుగా గుర్తించక పోవటం స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా మన దేశంలో యథేచ్ఛగా సాగిపోతోంది. ఆ బలహీనులు మహిళలైతే ఇక చెప్పేదేముంది? వందలమంది బాలికలపైనా, మహిళలపైనా లైంగిక నేరాలకు పాల్పడిన ఎపిస్టిన్ 2019లో న్యాయ విచారణ మొదలుకావడానికి ముందే నిర్బంధంలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతగాడికి ఒకప్పుడు సన్నిహితులైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటిష్ రాజవంశీకుడు ప్రిన్స్ ఆండ్రూ తదితరుల్ని ఆ పాపం ఇప్పటికీ వెన్నాడుతోంది. ట్రంప్ అయితే తరచూ సంజాయిషీ ఇచ్చుకోక తప్పడం లేదు. మన దేశంలో కూడా మహిళలపై నేరాలు చేసే బడాబాబులు కటకటాల వెనక్కిపోయినప్పుడే నిజమైన న్యాయం, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నట్టు లెక్క! -
ధర్మస్థళ కేసు: అదే సస్పెన్స్.. తెరపైకి జీపీఆర్ టెక్నాలజీ!
కర్ణాటక దైవక్షేత్రం ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మొత్తం 13 పాయింట్లలో.. మిగిలిన పాయింట్లలో ఆరో రోజు సిట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ మూడు పాయింట్లు హైవేను ఆనుకుని ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి(Whistleblower)ని వెంటపెట్టుకుని అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు.ధర్మస్థళలో ఇవాళ 11, 12వ ప్రాంతాల్లో మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం 8, 9, 10వ పాయింట్ల వద్ద 8 ఫీట్ల లోతులో తవ్వకాలు జరిపినా ఏం లభించలేదు. ఆదివారం రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులకు సెలవు కావడంతో తవ్వకాలు జరపలేదు. అదే సమయంలో.. ఆయా పాయింట్లలో యాంటీ నక్సల్ ఫోర్స్ (ANF)ను కాపలాగా ఉంచారు.1998 నుంచి 2004 మధ్య ప్రముఖ దైవక్షేత్రం ధర్మస్థళంలో వందలాది మృతదేహాల ఖననం జరిగిందని, బలవంతంగా తనతో ఆ మృతదేహాలను పూడ్చి పెట్టించారని ఓ వ్యక్తి ముందుకు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అతను చూపించిన చోట్లలో అధికారులు తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీ చిన్న విషయం కేసుకు కీలకంగానే మారింది.నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఆరో పాయింట్లో మనిషి ఎముకలు బయటపడ్డాయి. కానీ పుర్రె మాత్రం లభించలేదు. ఫోరెన్సిక్ పరీక్షలు ద్వారా వయస్సు, లింగం, మరణ కారణం నిర్ధారణ కావాల్సి ఉంది. అదే సమయంలో.. కొన్ని స్థావరాల్లో PAN కార్డు, ATM కార్డు లభించాయి. PAN కార్డు నెలమంగళ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. అతను జాండిస్తో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. అయితే.. ఏటీఎం కార్డు వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.జీపీఆర్ టెక్నాలజీతో..2003 సమయంలో కోల్కతాకు చెందిన అనన్య భట్ అనే మెడికో ధర్మస్థళంలో అనూహ్య రీతిలో అదృశ్యమైంది. అయితే అనన్య హత్యాచారానికి గురైందని, ప్రస్తుత తవ్వకాల్లో అవశేషాలు బయటపడే అవకాశం ఉందని ఆమె తల్లి సుజాత భట్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె దక్షిణ కన్నడ జిల్లా బెత్తంగడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉంటే.. వర్షాలు, మట్టి తడిగా ఉండటం వల్ల తవ్వకాల్లో ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ కేసులో సుజాత భట్ తరఫున ఆమె న్యాయవాది మంజునాథ్ ‘జీపీఆర్(Ground Penetrating Radar)’ టెక్నాలజీ వాడే అవకాశాన్ని పరిశీలించమని సిట్ను కోరుతున్నారు.జీపీఆర్ టెక్నాలజీ.. బాంబ్ డిటెక్టర్ తరహాలో ఉండే పరికరం. ఇది ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను భూమిలోకి పంపుతుంది. అది భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి.. ఎముకలు, కేవిటీస్, తదితర మార్పులను గుర్తిస్తుంది. తద్వారా అనవసర తవ్వకాలను నియంత్రిస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్కియాలజీవాళ్లు ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ధర్మస్థళ కేసుకు ఇది ఎందుకు అవసరం అనే వాదనలోకి వెళ్తే.. ఈ కేసులో కీలకంగా ఉన్న పారిశుద్ధ్య మాజీ కార్మికుడు 13 పాయింట్లు చూపించాడు. అవి 2014 కంటే ముందు ప్రాంతాలని చెబుతున్నాడు. అయితే ఈ పదేళ్ల కాలంలో అక్కడ చాలా మార్పులు సంభవించాయి. భారీ వర్షం, మట్టి కొట్టుకుపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎక్కడ మానవ దేహాలను ఖననం చేశారో గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ధర్మస్థళం కేసులో జీపీఆర్ వినియోగం ఇప్పుడు కీలకంగా మారందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ డిమాండ్పై సిట్ ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టే ఆధారపడి ఉంటుంది. పైగా.. జీపీఆర్ ఉపయోగం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రాథమికంగానే.. రూ.10-15 లక్షలు అవుతుంది. అదే అడ్వాన్స్డ్ వ్యవస్థలు రూ.30-50 లక్షల మధ్య ఉండొచ్చు. అద్దె బేస్డ్గా కూడా వీటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే వీటి వినియోగానికి శిక్షణ తప్పనిసరి. తప్పుకున్న జడ్జిజులై 18వ తేదీన సిటీ సివిల్ కోర్టు అదనపు జడ్జి విజయ్ కుమార్ రాయ్.. ధర్మస్థళంపై వచ్చిన కథనాలకు సంబంధించిన 8,842 వెబ్ లింకులను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు నిలుపుదల చేసింది. ఈలోపు.. ఈ కేసులో 332 మంది డిఫెండెంట్స్లో 25వ వ్యక్తి నవీన్ సూరింజే ఆసక్తికరమైన వాదన తెర మీదకు తెచ్చాడు.విజయ్ కుమార్ రాయ్ గతంలో(25 ఏళ్ల కిందట) మంగుళూరులోని ఎస్డీఎం(శ్రీ ధర్మస్థళ మంజునాథేశ్వర లా కాలేజీ)లో చదివారని, ఇక్కడ పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుతో వ్యక్తిగతంగా సంబంధం లేకున్నా తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘న్యాయం జరగాలి మాత్రమే కాదు, అది జరుగుతున్నట్లు కనిపించాలి కూడా’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.ఐటీఆర్తో గుట్టురట్టుధర్మస్థళ, చుట్టుపక్కల ఊర్లకు సంబంధించి 2000–2015 మధ్య అసహజ మరణాల రిజిస్టర్ (UDR), పోస్టుమార్టం నివేదికలు, ఫోటోలు ఏవీ లేకపోవడం ఇప్పుడు అక్కడ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. చట్టవిరుద్ధంగా కొందరు పోలీస్ అధికారులే ఓ బాలిక మృతదేహాన్ని ఖననం చేయడం తాను కళ్లారా చూశానని అంటున్నారాయన. అయితే ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. -
‘ధర్మస్థల’ దారుణాలపై సాక్ష్యాధారాలు ధ్వంసం
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థలలో సామూహిక ఖననాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి, మృతదేహాలను సామూహికంగా ఖననం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ధర్మస్థలలో వందకు పైగా మహిళల మృతదేహాలను స్వయంగా ఖననం చేశానని ఓ పారిశుధ్య కార్మీకుడు ప్రకటించడంతో సంచలనం రేగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ధర్మస్థలలో 2000 సంవత్సరం నుంచి 2015 వరకు.. 15 ఏళ్లలో అసహజ మరణాల రికార్డులు కనిపించకుండాపోయాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి పోలీసులు వాటిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లు తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కార్యకర్త జయంత్ ఈ విషయం బహిర్గతం చేశారు. 2000 నుంచి 2015 దాకా అసహజ మరణాల రిజిస్టర్(యూడీఆర్)లో నమోదైన అన్ని ఎంట్రీలను పోలీసులు ఒక పద్ధతి ప్రకారం డిలీట్ చేసినట్లు వెల్లడయ్యింది. ధర్మస్థలలో అదే సమయంలో పెద్ద సంఖ్యలో అనుమానాస్పద, నమోదు కాని మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారుల సమక్షంలోనే ఖననం ఒక యువతి మృతదేహాన్ని చట్టవిరుద్ధంగా, రహస్యంగా ఖననం చేస్తుండగా అనుకోకుండా తాను చూశానని ఆర్టీఐ కార్యకర్త జయంత్ చెప్పారు. దీనిపై ఈ నెల 2వ తేదీన సిట్కు ఫిర్యాదు చేశారనని వివరించారు. ఆ ఖననం జరుగుతున్న సమయంలో పలువురు అధికారులు అక్కడే ఉన్నారని, చట్టబద్ధమైన ప్రక్రియ పాటించలేదని చెప్పారు. జయంత్ ఫిర్యాదుపై సిట్ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. పోలీసుల పనితీరును తెలుసుకోవడానికి జయంత్ చాలాకాలంగా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. ధర్మస్థలలో అదృశ్యమైన మహిళలు, యువతుల పూర్తి వివరాలు, ఫోటోలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద బెళ్తంగడి పోలీసులను కోరగా, వారు అందుకు నిరాకరించారని జయంత్ చెప్పా రు. సంబంధిత డాక్యుమెంట్లు, పోస్ట్మార్టం రిపోర్టులు, వాల్ పోస్టర్లు, నోటీసులు, ఫోటోలను నాశనం చేసినట్లు వారు బదులిచ్చారని పేర్కొన్నారు. గుర్తించని మృతదేహాలకు సంబంధించిన ఆధారాలేవీ లేవని, రొటీన్ ప్రక్రియలో భాగంగానే వాటిని నాశనం చేశామంటూ చెప్పారని స్పష్టంచేశారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది అధికారుల సమక్షంలోనే యువతి మృతదేహాన్ని చనిపోయిన శునకాన్ని ఖననం చేసినట్టుగా చేశారని, ఆ సంఘటన చాలాకాలం తనను వెంటాడిందని జయంత్ తెలియజేశారు. ఆ అధికారుల పేర్లు కూడా చెప్పగలనని అన్నారు. ధర్మస్థలలో మరణాలపై దర్యాప్తు బాధ్యతను నిజాయతీ గల అధికారులకు అప్పగించకపోతే తనకు నిజాలు బయటపెడతానని రెండేళ్ల క్రితం హెచ్చరించానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందన్నారు. అందుకే సిట్కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తన వెనుక ఎవరూ లేరని, తనను ఎవరూ ప్రభావితం చేయడం లేదని తేల్చిచెప్పారు. నేటి టెక్నాలజీ యుగంలో సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తవ్వకాల్లో అస్తిపంజరం బయటపడితే అది ఎవరిదో ఎలా గుర్తిస్తారని అన్నారు. సంబంధిత డాక్యుమెంట్లు, ఆధారాలు లేకపోతే అది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. ధర్మస్థలలో జరిగిన దారుణాల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరన్నది బయటపడాలని స్పష్టంచేశారు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్న వ్యక్తులెవరో ప్రభుత్వం తేల్చాలని అన్నారు. సాక్ష్యాధారాల ధ్వంసం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని చెప్పారు. -
ధర్మస్థల రహస్యం.. వందల శవాలను నేనే పూడ్చాను..
-
జీవితకాలం జైల్లోనే.. కోర్టులో ఏడ్చేసిన ప్రజ్వల్
-
JDS మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవితఖైదు
-
ప్రజ్వల్కు జీవితఖైదు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ కీలక నేత హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్కు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రజ్వల్పై రూ.11.50 లక్షల జరిమానా సైతం కోర్టు విధించింది. ఈ రూ.11.50 లక్షల్లో బాధిత మహిళకు రూ.11.25 లక్షలు చెల్లించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఆదేశించారు. పలు ఐపీసీ సెక్షన్లతోపాటు ఐటీ చట్టం కింద నిందితుడిని శుక్రవారం దోషిగా నిర్ధారించిన కోర్టు శనివారం శిక్షను ప్రకటించింది. మైసూరు జిల్లా కేఆర్ నగర ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల మహిళపై 34 ఏళ్ల ప్రజ్వల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రించి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. హోలెనరసింహపుర జిల్లాలోని హాసన పట్టణంలోని గన్నికడ ఫామ్హౌస్లో ఈ దారుణం జరిగిందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదుచేసిన పోలీసులు దాదాపు 14 నెలల క్రితం ప్రజ్వల్ను అరెస్ట్చేయడం తెల్సిందే. కోర్టు ఏకంగా జీవితఖైదు విధించడంతో కోర్టు హాల్లోనే ఉన్న దోషి ప్రజ్వల్ ఒక్కసారిగా ఏడ్వడం మొదలెట్టాడు. ‘‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన మెరిట్ విద్యారి్థని. పార్లమెంట్ సభ్యునిగా మంచి పనులు చేశా. నాపై ఇంతవరకు నమోదైన రేప్ కేసుల్లో ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి నాపై కేసు వేయలేదు. వేగంగా రాజకీయాల్లో పైకి ఎదిగానన్న కక్షతో నాపై కేసులు మోపారు. నేనింతవరకు ఏ తప్పూ చేయలేదు. రాజకీయాల్లో ఎదగడమే నేను చేసిన తప్పు. గత ఏడాది లోక్సభ ఎన్నికలకు కేవలం ఆరు రోజుల ముందు దురుద్దేశంతో నాపై లైంగిక ఆరోపణలు మొదలయ్యాయి. బాధితురాలిగా చెబతున్న మహిళ తన భర్త, కుటుంబసభ్యులకు కూడా తనకు అన్యాయం జరిగిందని అసలు చెప్పనే లేదు. ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఫిర్యాదుచేశారు. నాకూ కుటుంబం ఉంది. కనీసం ఆరు నెలల నుంచి కన్న తల్లిదండ్రులను చూడలేకపోయా. నాకు తక్కువ శిక్ష విధించండి’’అని ప్రజ్వల్ ఏడుస్తూ జడ్జీని వేడుకున్నాడు. కేసు నమోదువేళ జర్మనీకి పారిపోయిన ఆనాటి ఎంపీ ప్రజ్వల్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పోలీసులు గత ఏడాది మే 31వ తేదీన బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్చేశారు. 113 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని బలమైన ఆధారాలు సంపాదించారు. 1,632 పేజీలతో చార్జ్ïÙట్ను గతంలో కోర్టుకు సమర్పించారు. ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద నమోదైన అన్ని అభియోగాలపై కోర్టు ఏకీభవించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, అదనపు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీఎన్ జగదీశ చెప్పారు. బాధితురాలికి హ్యాట్సాఫ్: సీఐడీ చీఫ్ వ్యాఖ్య బనశంకరి: ఈ కేసులో ఎన్ని బెదిరింపులు ఎదురైనా బాధితురాలు ధైర్యంగా ఎదుర్కొన్నారని సీఐడీ అదనపు డీజీపీ బిజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘కేసు నమోదైన 16 నెలల్లో తీర్పు రావడం నిజంగా ప్రత్యేకం. లైంగిక వేధింపుల వీడియోలో ఉన్నది ప్రజ్వల్ అని కోర్టుకు నిరూపించడానికి సిట్ ఎంతో శ్రమించింది. నేర నిరూపణకు బాధితురాలి ధైర్యమే కారణం. ఆమెకు ఈ విషయంలో సీఐడీ నిజంగా ధన్యవాదాలు తెలుపుతోంది. ఈమె నిరుపేద కావడంతో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రాబల్యం కలిగిన వ్యక్తి కుటుంబం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు’’అని బిజయ్ అన్నారు. ఎప్పుడేం జరిగిందంటే? → 2024 ఏప్రిల్ 22: ప్రజ్వల్ రేప్ వీడియోలు వైరల్ → ఏప్రిల్ 25 : అశ్లీల వీడియోలపై దర్యాప్తు జరపాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి లేఖ → ఏప్రిల్ 26–27: జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ → ఏప్రిల్ 28 : ప్రజ్వల్పై ఎఫ్ఐఆర్ నమోదు → ఏప్రిల్ 28 : అశ్లీల దృశ్యాలు కలిగిన పెన్డ్రైవ్ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం → ఏప్రిల్ 30: జేడీఎస్ పార్టీ నుంచి ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తూ జేడీఎస్ నిర్ణయం → మే 1 : ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు → మే 30: బెంగళూరు ఎయిర్పోర్ట్లో ప్రజ్వల్ అరెస్టు → సెప్టెంబర్ 9 : 113 సాక్షులతో కూడిన 1,632 పేజీల రెండో చార్జ్ïÙట్ దాఖలు → నవంబర్ 11 : ప్రజ్వల్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు → 2025 జూలై 18 : విచారణ పూర్తి చేసి జూలై 30న తీర్పు వెలువరిస్తామని చెప్పిన కోర్టు → జూలై 30: ఆగస్టు 1కి తీర్పు వాయిదా → ఆగస్టు 1: ప్రజ్వల్ను దోషిగా తేలి్చన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం → ఆగస్టు 2: ప్రజ్వల్కు జీవిత ఖైదు విధింపు -
ధర్మస్థల మరణాల మిస్టరీ.. సిట్ దర్యాప్తులో సంచలనం
-
ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?
కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థళలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఆ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో వందకు పైగా మృతదేహాలను తాను ఖననం చేశానని (Mass Burial Case) ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడం.. అతడు చూపించినట్లు 13 ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టారు. అయితే 6వ పాయింట్లో మానవ అస్థిపంజరాల అవశేషాలు బయటపడటంతో దర్యాప్తులో కీలక ముందడుగు పడిందని భావించారంతా. ధర్మస్థళ(Dharmasthala) కేసులో ఇవాళ ఐదో రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రావళి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో.. 9వ పాయింట్ వద్ద అధికారులు మానవ అవశేషాలు గుర్తించే పనిలో ఉన్నారు. మిగిలిన ఈ ఐదు స్పాట్లను అధికారులు కీలకంగా భావిస్తున్నారు. మరోవైపు.. ఇవాళ ప్రత్యక్ష సాక్షిని అధికారులు విచారిస్తారని సమాచారం. ఇప్పటిదాకా జరిపిన తవ్వకాల్లో కేవలం గురువారం(జులై 31వ తేదీ) ఆరో పాయింట్లో ఓ చోట కొన్ని అవశేషాలను మాత్రమే అధికారులు గుర్తించారు. ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. అవి ఇద్దరు మహిళలకు చెందినవి కావొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్కు పంపించారు. అయితే ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు అంటున్నారు. అయితే.. ఆరో పాయింట్ తప్ప.. ఇప్పటిదాకా అధికారులు తవ్వకాలు జరిపిన ప్రాంతాలు నదీ తీరాన్ని ఆనుకుని ఉన్నాయి. అవి వరదలతో ప్రభావితం అయ్యాయి. ఈ క్రమంలో మానవ కంకాళాలు(ఎముకలు) కొట్టుకుపోయే అవకాశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో.. అటవీ ప్రాంతంలోని మిగతా పాయింట్ల మీద దృష్టి సారించారు. పైగా ఈ ప్రాంతాల్లోనే సామూహికంగా తాను శవాలను పాతిపెట్టానని అతను చెబుతున్నట్లు కర్ణాటకకు చెందిన కొన్ని వార్తా చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ కథనాలు ఇస్తుండడం విశేషం. దీంతో ఈ ఐదు ప్రాంతాలు ఈ కేసుకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదీ చదవండి: ధర్మస్థళ.. ఉష్ గప్చుప్!జనాలు రాకుండా.. గత సోమవారం నుంచి సిట్ అధికారులు.. అతడిని(మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని) వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతం కావడం, దానికితోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సిట్కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రణబ్ మొహంతి తెలిపారు. గుంతలు తవ్వేందుకు 20 మంది కార్మికులు, బుల్డోజర్ల సాయం తీసుకుంటున్నారు. ఐపీఎస్ అధికారులు అనుచేత్, జితేంద్ర కుమార్ దయామ, ఎస్పీ సైమన్, పుత్తూరు తహసీల్దారు స్టెల్లా వర్గీస్, బెళ్తంగడి తహసీల్దారు పృథ్వీ సానికం, మంగళూరు కేఎంసీ వైద్యులు, ఫోరెన్సిక్ ప్రయోగశాల నిపుణుల సమక్షంలో ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రవతీ నది ఒడ్డున సిట్ తవ్వకాలు జరుపుతుండడంతో జనం ఆ ప్రాంతాల్లో బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తవ్వకాలకు అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో పోలీసులు అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే.. ఏంటీ మిస్టరీ కేసు..దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక (Karnataka) ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ ఇక్కడికి భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు(62).. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని.. వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్కు ఇటీవల ఒక లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం క్లుప్తంగా.. ‘‘గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయి. నేనే ఎన్నో శవాలను పూడ్చిపెట్టా. 1998 నుంచి 2014 మధ్య వందకు పైగా మృతదేహాలను ఖననం చేశాను. ఆ వ్యక్తులే మా కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో మేం దూరంగా వెళ్లిపోయాం. నన్ను పాపభీతి వెంటాడుతోంది. నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలను బయటపెడతా’’2014 డిసెంబరులో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండడంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. అయితే మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు? వాటిని ఎవరి సహాయంతో తీసుకువెళ్లేవారు? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద అతనికి రక్షణ కల్పించారు. మరోవైపు.. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థళ పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి, కడతేర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు ఆ వ్యక్తి లేఖలో పేర్కొనడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.వందల మంది మిస్సింగ్?దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ఓ చిన్నగ్రామం. ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం విస్తరించింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఐదు దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ధర్మస్థళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యాసంస్థలు వెలిశాయి. దీంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటిచోట తాజా ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి. గత పదేళ్లలో.. ధర్మస్థళ, బెళ్తంగడి, ఉజిరె పీఎస్ల పరిధిలో 450 మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. వీటిలో ఒక్క కేసునూ పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలు నోరు మెదపకుండా డబ్బుతో నోరు మూయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థి(20)ని హత్యాచారానికి గురైంది. స్థానిక మోతుబరి కుటుంబానికి చెందినవారు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పలు ప్రజా సంఘాలతో కలిసి అప్పట్లోనే ఆందోళనలు చేశారు. తమకు అనుమానం ఉన్న కొందరు వ్యక్తులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయంటూ బాధితురాలి తల్లి సుజాత భట్ తాజాగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇదీ చదవండి: ధర్మస్థళ కేసు.. పురుషుల మృతదేహాలు కూడా?!మీడియాకు ఊరటధర్మస్థళలో ఏం జరుగుతోందంటూ.. గత కొన్నిరోజులుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో కథనాలు మారుమోగుతున్నాయి. ఈ తరుణంలో కొందరు పెద్దలు ధర్మస్థళ పేరును చెడగొడుతున్నారంటూ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సామూహిక ఖననాలకు సంబంధించిన వేలకొద్దీ కథనాల లింకులను తొలగించాలని, అసత్య ప్రచారం చేయవద్దని మీడియాకు సూచిస్తూ న్యాయస్థానం గాగ్ ఆర్డర్ను ఇచ్చింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. కోర్టు ఆ గాగ్ ఆర్డర్ను కొట్టేస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. -
15 వేల జీతంతో 30 కోట్ల ఆస్తులు?.. అవినీతికి అడ్రస్ చెప్పిన గుమస్తా!
బెంగళూరు: ఆయనో గుమస్తా(క్లర్క్). ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్లను నిర్వహించడం, డాక్యుమెంట్లను తయారు చేయడం, డేటా ఎంట్రీ, కార్యాలయ పరిపాలనకు సహాయం చేయడమే పని.నెలకు జీతం అక్షరాల రూ.15,000. ప్రభుత్వ ఉద్యోగి. అనుభవం ఉంది కాబట్టి ఆస్తులు మహా అయితే ఎంతుండొచ్చు. ఓ సొంతిల్లు. ఓ పదిపదిహేను లక్షల డబ్బు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ క్లర్క్ ఆస్తులు రూ.30కోట్లు,బంగారం,పదుల సంఖ్యలో భవానాలు,ఎకరాలకొద్దీ పొలాలు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? బెంగళూరులో శుక్రవారం లోకాయిక్తా అధికారులు ప్రభుత్వ కర్ణాటక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ (కేఆర్ఐడీఎల్) కార్యాలయంలో మాజీ క్లర్క్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం, కొప్పల్ జిల్లాలోని కొప్పల్ పట్టణంలో ప్రభుత్వ ఆఫీస్లో కలకప్ప నిడగుండి క్లర్క్గా విధులు నిర్వహించేవారు జీతం రూ.15000. కానీ లోకాయిక్తా అధికారులు జరిపిన దాడుల్లో భయటపడ్డ కలకప్ప నిండగుండి ఆస్తుల్ని చూసి కంగుతిన్నారు.కలకప్ప నిండగుండితో పాటు అతని ఇతర కుటుంబ సభ్యుల పేర్లమీద 24 ఇళ్లు,నాలుగు ఫ్లాట్లు, 40 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు,నాలుగు వాహనాలు 350 గ్రాముల బంగారం,1.5కేజీ వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.నిడగుండి, మాజీ కేఆర్ఐడీఎల్ ఇంజనీర్, జెడ్ఎం చిన్చోల్కర్, పూర్తి కాని 96 అసంపూర్ణ ప్రాజెక్టులకు నకిలీ పత్రాలను సృష్టించి రూ. 72 కోట్లకు పైగా స్వాహా చేశారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో లోకాయుక్తా అధికారులు మాజీ గుమస్తా నిడగుండి నివాసంలో తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్
బెంగళూరు: కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(35)కు భారీ షాక్ తగిలింది. పని మనిషిపై లైంగిక దాడి కేసులో జేడీఎస్ మాజీ నేతను దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. శనివారం శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది.హాసన్లోని గన్నికాడ ఫామ్హౌజ్లో 2021 COVID లాక్డౌన్ సమయంలో ప్రజ్వల్ తనపై మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ ఘటనను ప్రజ్వల్ తన మొబైల్లో వీడియో తీసి విషయం బయటకు చెప్పనీయకుండా బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. అదే సమయంలో..ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. అయితే.. ఈ ఆరోపణలను ప్రజ్వల్ పేరెంట్స్ ఖండించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగగా.. బెయిల్ కోసం ప్రజ్వల్ చేసిన విజ్ఞప్తులను కోర్టు తోసిపుచ్చుతూ వచ్చింది. ఇదీ చదవండి: ఏ గదిలో ఏం జరిగింది?.. వీడియో కెమెరా ఎక్కడ??ఫోరెన్సిక్ నివేదికలు లీకైన వీడియోలను ధృవీకరించాయి. కిందటి ఏడాది మే 31వ తేదీన జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ప్రజ్వల్ను ఎయిర్పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. గత 14 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలోనే ప్రజ్వల్ ఉన్నాడు. CID-SIT దర్యాప్తులో DNA, ఫోరెన్సిక్, 26 మంది సాక్షుల వాంగ్మూలాలు, 2,000 పేజీల చార్జ్షీట్ సమర్పించారు. ఈ కేసులో 26 మంది సాక్షులను కోర్టు విచారించి.. దోషిగా ప్రకటించింది.#BreakingA Special court in Bengaluru has convicted Janata Dal (Secular) leader and former MP Prajwal Revanna, in the first rape case registered against him at the Holenarasipura Rural Police Station of Hassan District. #PrajwalRevanna #Rape pic.twitter.com/fnzxJUp2Sc— Live Law (@LiveLawIndia) August 1, 2025ఎవరీ ప్రజ్వల్ రేవణ్ణ?ప్రజ్వల్ రేవణ్ణ.. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ తనయుడు. 2015లో జేడీఎస్లో చేరి.. 2019 ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యాడు. ఆ దఫా పార్లమెంట్లో.. మూడో అత్యంత పిన్నవయసున్న ఎంపీగా ఘనత సాధించాడు. అయితే 2023లో అఫిడవిట్లో లోపాల కారణంగా(రూ.24 కోట్ల లెక్కను చూపించకపోవడం) కర్ణాటక హైకోర్టు ఆయన ఎంపీ ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. లైంగిక దాడి కేసు నేపథ్యంలో జేడీఎస్ ఆయన్ని సస్పెండ్ చేసింది.ఇదీ చదవండి: ప్రజ్వల్కు చీర చిక్కుఅశ్లీల వీడియోల కలకలంపని మనిషిపై అత్యాచారం ఘటన మాత్రమే కాదు.. ప్రజ్వల్పై అశ్లీల వీడియోల కేసులు నమోదు అయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. హసన్లోని ఫామ్హౌజ్ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్డ్రైవ్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్రకలకలం రేపింది. ఇందుకుగానూ ప్రజ్వల్పై మూడు కేసులు నమోదు కాగా.. వాటిని సీఐడీ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుపుతోంది. ఇందులో స్వయంగా ప్రజ్వల్ చాలావరకు వీడియోలను చిత్రీకరించినట్లు అభియోగాల్లో దర్యాప్తు అధికారులు పేర్కొనడం గమనార్హం.ఇదీ చదవండి: అసహజ లైంగిక దాడి కేసులో పటుత్వ పరీక్షలు -
రేయ్.. ఎవరురా మీరంతా?
ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న నగరం.. బెంగళూరు(కర్ణాటక). వర్షాలు.. వరదలు, ట్రాఫిక్ రద్దీ, లైంగిక వేధింపులు, భాష ప్రతిపాదికన దాడుల ఘటనలు ఏవో ఒకటి నగరాన్ని నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి. ఈ తరుణంలో.. మరో తరహా ఘటనలు ప్రపంచవ్యాప్తంగానూ చర్చకు దారి తీస్తున్నాయ్.. నోయెల్ రాబిన్సన్, యూనెస్ జారో.. ఈ ఇద్దరూ ఆషామాషీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కాదు. కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు వీళ్లకి. అయితే తాజాగా ఈ ఇద్దరికీ బెంగళూరులోనే చేదు అనుభవం ఎదురైంది. వేర్వేరు ఘటనలో వీళ్లిద్దరు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సి వచ్చింది.జర్మన్ టిక్టాకర్ నోయెల్ రాబిన్సన్.. గుబురు జుట్టేసుకుని జనం మధ్య డ్యాన్సులు వేస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ముంబై, ఢిల్లీ, కోల్కతా సహా పలు నగరాల్లో ఇప్పటికే వీడియోలతో భారతీయులకూ దగ్గరయ్యాడు. అయితే.. బెంగళూరు వీధుల్లో సంప్రదాయ పంచెకట్టులో డాన్స్ చేస్తూ వీడియో చేయబోయాడు. దీంతో జనం భారీగా గుమిగూడారు. కాసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్ పేరుతో అతన్ని స్టేషన్కు లాక్కెళ్లారు. ఆ సమయంలో అతనితో కాస్త దురుసుగా ప్రవర్తించారు. తీరా పీఎస్కు తీసుకెళ్లాక ఓ పావు గంట తర్వాత అతని నుంచి వివరణ తీసుకుని.. జరిమానా విధించి వదిలేశారు. దీనిని అంతే తేలికగా తీసుకున్న నోయెల్.. దానిని ఓ ఫన్నీ వీడియోగా ప్రమోట్ చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Noel Robinson (@noel)మరో ఘటనలో.. పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ యూనస్ జారో నగరంలోని చర్చి స్ట్రీట్ వద్దకు రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే అతని రాకతో అక్కడ జనం గుమిగూడారు. ఇంతలో సడన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అతన్ని పీఎస్కు తరలించి.. ఫైన్ విధించి పంపించారు. ఆ సమయంలోనూ అతను వాళ్లతో షేక్ హ్యాండ్ ఇస్తూ మరో ఫొటో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Younes Zarou (@youneszarou)ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 9వ తేదీన బ్రిటిష్ మ్యూజీషియన్ ఇద్ షరీన్ రోడ్డు మీద ప్రదర్శన ఇస్తుండగా.. కుబ్బన్ పోలీసులు అంతరాయం కలిగించి అక్కడి నుంచి వెళ్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. అటు ఫ్యాన్స్తో పాటు అతిథి దేవోభవకు బెంగళూరు పోలీసులు తూట్లు పొడిచారంటూ ఇటు నెటిజన్లు నగర పోలీసుల తీరుపై మండిపడ్డారు.International artist @edsheeran was stopped playing in #Bangalore at church street. Even though, he had the permission. Literally! The cops pulled the plug. Damn sad! #Karnataka pic.twitter.com/C0F9tdm26g— Imran Khan (@KeypadGuerilla) February 9, 2025 అయితే.. పోలీసులు మాత్రం తమ అనుమతులు లేకుండా రోడ్లపై అలాంటి షోలను అనుమతించమని.. జనం గుమిగూడి జరగరానిది ఏదైనా జరిగితే ఎలాగ? అని ప్రశ్నిస్తున్నారు. జూన్ 4వ తేదీన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాట ఘటన.. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో.. కర్ణాటక ప్రభుత్వం క్రౌడ్ కంట్రోల్ బిల్ - 2025 తెర మీదకు తెచ్చింది. ఈ రకమైన ఈవెంట్లు గనుక అనుమతులు లేకుండా నిర్వహిస్తే.. గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 వేలజరిమానా విధించాలని ఈ చట్టం తేబోతోంది. -
ఆమె బ్లడ్ గ్రూపు ఎక్కడాలేదు!
కోలారు: కర్ణాటకలోని కోలారు జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ రక్తం గ్రూపు చాలా ప్రత్యేకమైనదిగా తేలింది. ఏ గ్రూపుతోనూ ఆమె రక్తం సరిపోలలేదని స్థానిక జిల్లా ఆస్పత్రి వైద్యనిపుణులు డాక్టర్ డీవీఎల్ఎన్ ప్రసాద్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఓ మహిళ గుండె శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని.. ఆమె బ్లడ్ గ్రూపును గుర్తించేందుకు పరీక్ష చేయగా బ్లడ్బ్యాంకులోని ఏ రక్తం గ్రూపుతోనూ ఆమె రక్తం సరిపోలేదన్నారు. ఆమె రక్త నమూనాలను బెంగళూరులోని మెడికల్ సర్వీసెస్ ట్రస్టుకు, ఇంగ్లండ్లోని బ్రిస్టల్ నగరంలోని అంతర్జాతీయ ల్యాబొరేటరీకి పంపించి ఏ గ్రూపు రక్తమో కనుక్కోవాలని కోరామని.. ఇంతవరకూ ఇలాంటి గ్రూపు రక్తం ఏదీలేదని నివేదిక వచ్చిందని డాక్టర్ ప్రసాద్ వెల్లడించారు. చివరకు.. ఈ రక్తం గ్రూపునకు స్థానిక పేరు వచ్చేలా క్రోమర్ ఇండియా బెంగళూరు (సీఆర్ఐబీ)గా వారే పేరు పెట్టారని, బెంగళూరుకు బదులు కోలారు అని పెడితే సమంజసంగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ కె.ప్రభాకర్, వైస్ ప్రిన్సిపాల్ వినుతా శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ధర్మస్థళ’ కేసులో దొరకని అవశేషాలు
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థళలో జరిగిన సామూహిక ఖననం కేసులో మొదటి రెండు ప్రాంతాల్లో మానవ అవశేషాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పుడు మూడవ ప్రదేశంలో తవ్వకాలు ప్రారంభించింది. 1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థళలో పనిచేశానని, మహిళలు, మైనర్లతో సహా అనేక మృతదేహాలను అక్కడ ఖననం చేశానని మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పడం, ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయడం తెలిసిందే. కార్మికుడు తెలిపిన 15 స్థావరాల వివరాల ఆధారంగా సిట్ ఇప్పటివరకు రెండు ప్రదేశాల్లో తవ్వకాలు చేసింది. ఆ రెండు ప్రదేశాల్లోనూ ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు. నేత్రావతి నది వెంబడి ఉన్న మొదటి ప్రదేశంలో మంగళవారం తవ్వకాలు నిర్వహించారు. జేసీబీని ఉపయోగించి లోతుగా తవ్వినప్పటికీ ఎలాంటి అవశేషాలు దొరకలేదు. రెండవ స్థలం కూడా అలాగే ఖాళీగా కనిపించింది. ప్రస్తుతం మూడో ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి. కార్మికుడు చెప్పిన 15 ప్రదేశాల్లో ఎనిమిది నేత్రావతి నది ఒడ్డున, నాలుగు ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయి. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై, మిగిలిన రెండు హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి.చీఫ్ మార్పు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం: హోంమంత్రి ఈ కేసు దర్యాప్తులో సిట్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతీని మార్చే విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేయడానికి డైరెక్టర్ జనరల్ ర్యాంకుల అధికారుల జాబితాలో మొహంతీ పేరు కూడా ఉండటంతో.. మార్పు విషయమై మీడియా మంత్రిని ప్రశ్నించింది. కేంద్రంలో ఉండి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించే అవకాశం ఆయనకు ఉంటుందని, ఆయనను కొనసాగించాలా? లేదా మరొకరిని నియమించాలా? అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చట్టం, నియమాలు అనుమతిస్తే ఆయన అక్కడే కొనసాగుతారని, లేదంటే అదే హోదా కలిగిన అధికారిని నియమిస్తామని పరమేశ్వర స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు గురించి ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు చేయను. దర్యాప్తు పూర్తయి నివేదిక అందిన తరువాత మాట్లాడతాను’అని హోంమంత్రి తెలిపారు. -
ఎనిమిదేళ్లకు గర్భం దాల్చిన భార్య.. షాకైన భర్త!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఏదో ఒక కారణంతో కట్టుకున్న భర్తను హతమార్చడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. అదే మాదిరిగా ప్రియునితో కలిసి భర్తను కడతేర్చిన భార్య, మరో ఇద్దరిని దావణగెరె జిల్లా చన్నగిరి పోలీసులు అరెస్టు చేశారు. దంపతులు వేర్వేరుగా మిస్సింగ్.. జిల్లా ఎస్పీ ఉమాప్రశాంత్ కేసు వివరాలను వెల్లడించారు. లింగప్ప తల్లి యల్లమ్మ 2024 జనవరి 22న తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లినవాడు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 10 రోజుల తరువాత లింగప్ప భార్య లక్ష్మి మిస్సయిందని ఆమె తల్లి మాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు కేసుల్లోనూ దర్యాప్తు చేపట్టారు. లింగప్ప, లక్ష్మికి పెళ్లయి 8 ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదు. లక్ష్మి వక్కతోటలో పనికి వెళ్తూ తిప్పేశ్ నాయక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడి గర్భం దాల్చింది. ఇది తెలిసిన లింగప్ప కడుపులో ఉన్నది తన బిడ్డ కాదని ఆగ్రహంతో కడుపు మీద కొట్టడంతో అబార్షన్ అయ్యింది. దీంతో లక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత తిప్పేనాయక్ను కలిసి భర్తను హతమార్చాలని కుట్ర చేసింది. ఇద్దరూ సంతోష్ అనే మరో వ్యక్తి సహకారంతో లింగప్పను హతమార్చి భద్రా కాలువలో పడేసి కేరళకు పరారయ్యారు. సుమారు ఏడాదిన్నర నుంచి అక్కడే సంసారం కొనసాగిస్తున్నారు. పోలీసులు జాడ పసిగట్టి అరెస్టు చేశారు. -
ధర్మస్థళ కేసు: 15 అనుమానిత ప్రాంతాల గుర్తింపు!
-
ధర్మస్థళ కేసు: 15 అనుమానిత ప్రాంతాల గుర్తింపు!
ధర్మస్థళ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. దేవాలయ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు తాను ధర్మస్థళ పరిసరాల్లో వందలాది శవాల అంత్యక్రియలు నిర్వహించానని, ఈ నెల నాలుగున ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం (ఎస్ఐటీ)ని ఏర్పాటు చేసింది కూడా. ఈ నేపథ్యంలో.. ఫిర్యాదుదారు తాజాగా తాను శవాలను కాల్చిన, పూడ్చిన 15 ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించారు. వీటిల్లో ఒకటి హైవే పక్కనే ఉండగా మిగిలినవన్నీ నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇతర కార్యకలాపాలు జరక్కుండా సిట్ అధికారులు వాటికి జియో ట్యాగింగ్ చేశారు. అంతేకాకుండా ఫొటోలు తీసి కాపలా కోసం సాయుధ పోలీసులను ఏర్పాటు చేశారు. 1998 -2014 మధ్య కాలంలో తాను కొందరి ఒత్తిడి కారణంగా వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని, వీరిలో చాలామంది మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసింది. జూలై నాలుగున ఫిర్యాదు ఇచ్చిన సందర్భంగా అతడు ఒక పుర్రెను సాక్ష్యంగా అందించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం జూలై 19న డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో ఒక ఎస్ఐటీని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు తరువాత ఫిర్యాదుదారుణ్ణి రెండు రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి జితేంద్ర కుమార్ దయామా ఆ వివరాలను రికార్డు చేశారు. ఆ తరువాత సోమవారం ఫిర్యాదుదారుడితో కలిసి ఆన్సైట్ పరిశీలనలను జరిపింది. మొత్తం 15 అనుమానిత ప్రాంతాలను గుర్తించింది. ఈ కార్యకలాపాల్లో ఫోరెన్సిక్స్, ఆంత్రోపాలజీ, రెవెన్యూ విభాగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో త్వరలో తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరోవైపు ఈ దర్యాప్తును ధర్మస్థళ మంజునాథేశ్వర ఆలయం స్వాగతించింది. విచారణ పారదర్శకంగా జరగాలని కోరింది. ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కొందరు ఎస్ఐటీ విచారణపై న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ అవసరమని కోరారు. అలాగే నిస్పక్షికత కోసం ఫోరెన్సిక్స్ సాయం తీసుకోవాలని సూచించారు. -
ఆత్మహత్యకు ప్రేరేపించిన ఫోన్ కాల్
కర్ణాటక: బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్య గ్రామంలో భీమన అమావాస్య రోజున భర్తకు పాదపూజ చేసి అదేరోజు రాత్రి భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో ట్విస్టు చోటుచేసుకుంది. అంచెపాళ్య నివాసి అభిషేక్ భార్య స్పందన (24) ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. తమ కుమార్తెను అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని, వరకట్నం కోసం వేధించేవారని స్పదన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో స్పందన ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. భర్తకు పరాయి స్త్రీతో సంబంధం ఉందని స్పందనకు అనుమానం ఉండేది. భీమన అమావాస్య రోజున భర్తకు పాదపూజ చేస్తున్న సమయంలో భర్తకు ఆ మహిళ ఫోన్ చేయడంతో కలత చెందిన స్పందన ఆరోజు రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇలా భర్త అక్రమ సంబంధం భార్య ప్రాణాలను బలిగొంది. -
అప్పుడు సీఎం స్థానం ఆశించి భంగపడ్డా.. ఆయనకు ఇచ్చారు: ఖర్గే ఆవేదన
బెంగళూరు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నడూ అధికారం కోసం పరుగు తీయలేదన్నారు. 1990ల్లో తాను కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతగానో శ్రమించినట్టు చెప్పుకొచ్చారు. తీరా, పార్టీ అధికారంలోకి వచ్చాక.. పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి బాధ్యతలను ఇవ్వలేదని ఖర్గే గుర్తు చేసుకున్నారు.కర్ణాటకలోని బేలిమఠంలో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని స్థాయి నుంచి ఏఐసీసీ అధ్యక్ష పదవి వరకు దేనికీ తాను ప్రయత్నించలేదని, పార్టీయే అవకాశం ఇచ్చిందన్నారు. నేను ఎప్పుడు పదవుల కోసం పరుగులు తీయలేదు. 1999లో కర్ణాటకలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను శ్రమించినా, పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి బాధ్యతలను ఎస్.ఎం.కృష్ణకు అప్పగించిందని గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలో తనకు ముఖ్యమంత్రి స్థానం దక్కకపోగా, తన సేవలన్నీ వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికీ నిరాశకు గురికాకుండా పార్టీ శ్రేయస్సు కోసం శ్రమించడంతోనే తనకు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని పేర్కొన్నారు. పదవులను తాను ఎప్పుడూ కోరుకోలేదని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాపై ఖర్గే స్పందిస్తూ.. ఆయన ఎందుకు రాజీనామా చేశారో నాకు తెలియదు. జగదీప్ మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. నేను రాజ్యసభలో మాట్లాడేందుకు ఆయన అవకాశమివ్వలేదు. రైతులు, పేదలు, అంతర్జాతీయ సమస్యలు, విదేశాంగ విధానంపై విపక్షాలు మాట్లాడితే, వారి స్వరం వినిపించకుండా చేసేవారు అని వ్యాఖ్యలు చేశారు. Mallikarjun Kharge, Congress chief and Gandhi family loyalist, voiced regrets on how he missed being the Chief Minister of Karnataka despite winning an election for the Congress... pic.twitter.com/KsdgSf2Nqx— MALLU PARUTI (@mallu_paruti) July 27, 2025 -
Tungabhadra Dam: 26 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
-
చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన
కలలు కంటూ కూర్చుంటే సరిపోదు. అనుకున్నట్టు ఎదగాలంటే పట్టుదల ఉండాలి. దానికి తగ్గ కృషి ఉండాలి. అందుకే కృషి ఉంటే మనుషులు మహాపురుషులౌతారు అంటాడో సినీ కవి. కర్ణాటకకు చెందిన రైతు లోహిత్ శెట్టి సక్సెస్ స్టోరీ వింటే మీరు కూడా ఔను అంటారు.జీవితం అంటే ఐటీ కంపెనీల్లో లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేసే వ్యక్తులదేనా, నాది కూడా అని ఒక సామాన్య రైతుగా లోహిత్ శెట్టి నిరూపించిన వైనం ఇది. విలక్షణమైన సాగుతో, మార్కెట్ అవసరాలను అవగాహన చేసుకొని కోట్లు సంపాదిస్తున్నాడు కర్ణాటకకు చెందిన 42 ఏళ్ల లోహిత్ శెట్టి పుట్టింది వ్యవసాయ కుటుంబం. 21 ఎకరాల భూమిలో రబ్బరు, కొబ్బరి, తమలపాకులు, జీడిపంటలు పండిస్తున్న తండ్రి, మేనమామలను చూస్తూ పెరిగాడు. అందరిలాగానే లోహిత్కు చాలా ఆశలు, ఆశయాలుండేవి. కానీ ఆర్థిక సమస్యల కారణంగా చదువును 10వ తరగతితోనే ఆపేయాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. ఉన్నచోటనే సక్సెస్ను వెదుక్కున్నాడు.కుటుంబ కష్టాలు తీవ్రతరం కావటంతో తొలుత క్వారీలో చిన్న ఉద్యోగిగా పనిచేశాడు. దీని తర్వాత స్వగ్రామానికి దగ్గరలోనే ఉన్న ధర్మస్థలలోని ఒక పొలంలో 10 ఏళ్ల పాటు పని చేశాడు. అయితే లోహిత్కు వ్యవసాయంపట్ల ఉన్న మక్కువ అతణ్ని వ్యవసాయం వైపు మళ్లించింది. తొలుత తన కుటుంబ వారసత్వంగా వచ్చిన సాంప్రదాయ పంటలను సాగు చేసేవాడు. ఈ పంటల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది పైగా లాభదాయకంగా కూడా లేదని గమనించాడు. దీంతో కొంత పరిశోధన చేసి విదేశీ పండ్ల పెంపకంవైపు మళ్లి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. 2006లో కేరళ నుండి రంబుటాన్ , మాంగోస్టీన్ మొక్కలను కొని దక్షిణ కన్నడ జిల్లాలోని తన పొలంలో నాటాడు. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఈ చెట్లు ఇప్పుడు సీజన్కు 80-100 కిలోల పండ్లను ఇస్తాయి. టోకు వ్యాపారులు వాటిని పొలం నుండి కిలోకు రూ.350 లేదా అంతకంటే ఎక్కువ ధర పలుకుతుంది. రంబుటాన్, మాంగోస్టీన్ , డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్లను పండించడంలో ప్రత్యేకతను సాధించాడు. ప్రకృతిలో మమేకమై, మెళకువలను అర్థం చేసుకుంటూ భారీగా లాభాలను ఆర్జించాడు. వీటిని బెంగళూరు, చెన్నై , ముంబై వంటి ప్రధాన నగరాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఏడాదికి కోటి రూపాయట టర్నోవర్ సాధించాడు. తన లాంటి ఎందరో రైతులకు ప్రేరణగా నిలిచాడు.చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవంఅదనంగా 20 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని, పెద్ద ఎత్తున సాగుచేసి సక్సెస్ అయ్యాడు.. అంతేకాదు మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఆయన ఒక నర్సరీని కూడా స్థాపించారు. దీని ద్వారా మరికొంత ఆదాయం లభించింది.లోహిత్ విజయం, విజ్ఞానం కేవలం తన సొంత పొలానికే పరిమితం కాలేదు. ఆయన తన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకుంటూ, తోటి రైతులకు వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో సలహాలు సూచనలు అందిసతూ ముందుకు సాగుతున్నాడు. కృషి, వినూత్న విధానం, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల పట్ల అంకితభావానికి లోహిత్ సక్సెస్ గొప్ప నిదర్శనం.చదవండి: వాళ్లకి బ్రెయిన్ అవసరం లేదట : హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్ప్రపంచంలోనే థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలు అతిపెద్ద రంబుటాన్ ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. 1980లలో మలేషియా, శ్రీలంక ద్వారా భారతదేశానికి చేరుకున్నట్లు చెబుతారు. -
సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య
కర్ణాటక: చెన్నపట్టణ తాలూకా కృష్ణాపురదొడ్డి గ్రామపంచాయతీ సభ్యురాలు చంద్రకళ భర్త లోకేష్ ఆత్మహత్య చేసుకున్న కేసు మలుపు తిరిగింది. భార్యే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతనెల 24న లోకేశ్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రకళ పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు వెళ్లి పరిశీలించగా మృతదేహం పక్కనే విషం బాటిల్ లభించింది. ఇతనిది ఆత్మహత్యే అని గ్రామస్తులతోపాటు పోలీసులు కూడా నమ్మారు. డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు చంద్రకళ తన భర్త మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మరీ గగ్గోలు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న ఎంకే దొడ్డి పోలీసులు చంద్రకళ ప్రవర్తనపై అనుమానంతో కాల్ రికార్డ్స్ పరిశీలించారు. చంద్రకళకు యోగేశ్ అనే వ్యక్తితో అక్రమసంబంధం ఉన్నట్టు గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా తన ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భావించి బెంగళూరుకు చెందిన నలుగురికి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు చంద్రకళ నోరు విప్పినట్లు పోలీసులు తెలిపారు. చంద్రకళను అరెస్టు చేసి మిగతా హంతకుల కోసం గాలిస్తున్నారు. -
మడికెరి పీతలు భలే రుచి : లొట్టలేస్తున్న జనం
బొమ్మనహళ్లి : కర్ణాటక జిల్లాలోని మడికెరి ప్రాంతంలో సీజనల్గా లభించే పీతలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పీతలతో కర్రీస్, వేపుళ్లు చేసుకొని ఆరగిస్తుంటారు. నిప్పులపై కాల్చడం, లేదా ఆవిరి ద్వారా పీతలను ఉడికించి రకరకాల వంటలు చేస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు పీతలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఎంతో శక్తిని ఇస్తాయి. ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, జింక్, ప్రొటీన్లకు మూలం. కొలస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో సహాయ పడతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.భాస్వరం అధికంగా ఉన్నందువల్ల దంతాలు, ఎముకలు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. అందుకే పీతలకు విపరీతమైన డిమాండ్. వర్షాలు కురిసినప్పుడే పీతలు లభ్యం పది కాళ్ల పీతల్లో ఎన్నో రకాలు జాతులు ఉన్నాయి. మడికెరిలో లభించే పీతలు మంచి రుచితో ఉంటాయి. దీంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వర్షాలు కురిసినప్పుడు మాత్రమే ఈ పీతలు లభిస్తాయి. వేసవిలో ఎండిపోయిన చెరువులో ఎక్కడ దాక్కొని ఉంటాయో కాని తొలకరి జల్లులు ప్రారంభం కాగానే బురద మట్టిలో, చెరువుల్లో దర్శనం ఇస్తాయి. వీటిని పట్టుకునేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతారు. చేతికి ఒక పీత దొరికిందంటే చాలు పట్టలేని సంతోషం కలుగుతుంది. చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవంజోరుగా పీతల విక్రయాలు మడికెరిలో పీతల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ప్రాణంతో ఉన్న పీతలను పట్టి విక్రయిస్తారు. గతంలో పంట పొలాలు, బురద మడుల్లో, చిన్న చిన్న కాలుల్లో పీతలు లభించేవి. కానీ ప్రస్తుతం పీతలు లభించడం లేదని స్థానికులు అంటున్నారు. వరి పంటకు ఎక్కువగా పురుగు మందులు వినియోగిస్తుండటంతో పీతలు కనుమరుగు అవుతున్నాయి. రానురాను వాటి సంతతి తగ్గుతోంది. మడికేరిలోని కేఎస్ఆర్టీసీ బస్టాండు సమీపంలో పీతల వ్యాపారం చేస్తున కుమార్ అనే వ్యక్తి మాట్లాడుతూ గతంలో మాదిరిగా పీతలు ఇప్పడు లభించడంలేదన్నాడు. గతంలో వరిపొలాల్లో, బురద ఉన్నమడిలో, కాలువలో పీతలను పట్టి విక్రయించేవారమని, ప్రస్తుతం పంట పొలాలు లేవు, వరిమడులు లేవు ఆందులో పీతలుకూడా లేవన్నారు. ప్రస్తుతం పీతలను పట్టడానికి రోజూ 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందన్నాడు. సుమారు ఐదారుమంది గుంపుగా కలిసి పగలు రాత్రి కష్టపడి ప్రాణాలతో ఉన్న పీతలను పడుతామన్నారు. డిమాండ్ మేర పీతలు లభ్యం కావడం లేదన్నాడు. ఇదీ చదవండి: జిమ్కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్లుక్ వైరల్ కృత్రిమంగా పీతలను పెంచవచ్చుపీతలను కృత్రిమంగా పెంచేందుకు అవకాశం ఉంది. ఇందుకు మత్స్యశాఖ సహకారం అందజేస్తుంది. అయితే కొడుగు జిల్లాలో కృత్రిమంగా పీతలు పెంచేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తమిళనాడు, కేరళలో ఎక్కువగా కృత్రిమ పద్ధతుల్లో పీతలు సాగు చేస్తున్నారు. వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. మడికెరిలో మాత్రం కృత్రిమంగా సాగు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. –సీ.ఎస్.సచిన్, మత్స్యశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ -
మిమ్మల్ని వదిలేది లేదు
న్యూఢిల్లీ: గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కర్నాటకలోని ఓ నియోజకవర్గంలో మోసం జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తామనుకోవద్దు..మేం మిమ్మల్ని వదిలిపెట్టం అంటూ ఆయన చేసిన హెచ్చరికలపై ఎన్నికల కమిషన్(ఈసీ) తీవ్రంగా స్పందించింది. రాహుల్ గురువారం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన..‘భారత ఎన్నికల సంఘం తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదు. గతేడాది కర్నాటకలో లోక్సభ ఎన్నికలు జరిగిన ఒక్కో నియోజకవర్గాన్ని పరిశీలిస్తూ వస్తున్నాం. ఒక నియోజకవర్గంలో తప్పు జరిగినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. 90 శాతం కాదు..100శాతం మోసం జరిగినట్లు రుజువులున్నాయి. అక్కడంతా డ్రామా నడిచింది. దీనిపై ఈసీకి మెసేజీ పంపుతా. ఈ విషయం ఇంతటితో ముగిసిందని ఈసీ, అధికారులు అనుకోవద్దు. మీరు తప్పు చేశారు. ఎక్కడికీ వెళ్లలేరు. మిమ్మల్ని వెంటాడుతాం’అని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఎన్నికలైన ఏడాది తర్వాత రాజ్యాంగ సంస్థపై నిరాధార బెదిరింపు ఆరోపణలు చేయడం తగదని పేర్కొంది. ప్రజాప్రాతినిధ్యచట్టంలోని సెక్షన్ 80 ప్రకారం హైకోర్టులో పిటిషన్ వేయకుండా ఇటువంటి విమర్శలు చేయడం దురదృష్టకరమంది. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా నమోదవలేదని ఈసీ తెలిపింది. -
పెదాలు కొరికి.. వీడియోలు తీసి.. కటకటాల్లోకి కామపిశాచులు
ఐటీ మహా నగరం బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు కామపిశాచులను పోలీసులు అరెస్ట్ చేశారు. రహస్యంగా అమ్మాయిలను చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ డెలివరీ ఏజెంట్ను(19), అలాగే ఓ మహిళ పెదాలను కొరికి పారిపోయిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. మణిపూర్కు చెందిన దిలావర్ హుస్సేన్.. బెంగళూరులో డెలివరీ ఏజెంట్గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొత్తనూరులోని బైరాతిలో అద్దెకు గది తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే సాయంత్రం కాగానే నగరంలోని ఎంజీరోడ్డు, చర్చ్ స్ట్రీట్, కొరమంగల ప్రాంతాల్లో అమ్మాయిలను రహస్యంగా ఫోన్లో చిత్రీకరించడం ప్రారంభించాడు. అలా ఆ అశ్లీల ఫొటోలను, వీడియోలను బెంగళూర నైట్ లైఫ్ అనే ట్యాగుతో తన దిల్బర్ జానీ-67 పేజీలో అప్లోడ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో అశ్లీల పేజీలు పెరిగిపోతుండడంపై దృష్టిసారించిన అశోక్ నగర్ పోలీసులకు దిలావర్ పేజీ కంటపడింది. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ తరహా కంటెంట్ చిత్రీకరించి.. నెట్టింట వైరల్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. మహిళల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా వీడియోలు తీసినందుకు బీఎన్ఎస్తో పాటు ఐటీ సెక్షన్లు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. బెంగళూరులో ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. మే చివరి వారంలో.. బెంగళూరు మెట్రో రైళ్లలో యువతులను అసభ్యకర రీతిలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన యువకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. జులై మొదటి వారంలో.. నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీ బాత్రూంలో మహిళా ఉద్యోగిణిని రహస్యంగా చిత్రీకరించబోయి ఓ సీనియర్ అసోషియేట్ జైలు పాలయ్యాడు. ఇక.. రెండు వారాల కిందట గురుదీప్ సింగ్ అనే వ్యక్తి రోడ్ల మీద మహిళలను తన ఫోన్లో బంధించే ప్రయత్నంలో ఓ యువతి చేతికి చిక్కి చెప్పు దెబ్బలు తిని.. ఆపై జైలు పాలయ్యాడు. తాజాగా మరో ఘటనలో.. గోవిందపూర్లో ఓ యువతిని లైంగికంగా వేధించిన వ్యక్తి.. ఆమె పెదాలను కొరికి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని మరూఫ్గా గుర్తించి అరెస్ట్ చేశారు. జూన్ 6వ తేదీన బెంగళూరు కూక్ టౌన్ మిల్టన్ పార్క్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తిని మహిళను అసభ్యంగా తాకి.. ఆపై పార్క్లో ఆమె వెంటపడి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. అంతకు ముందు.. ఏప్రిల్ 3వ తేదీన బీటీఎం లేఅవుట్లోనూ ఇదే తరహాలో ఓ ఘటన జరిగంది. ఓ వ్యక్తి ఇద్దరు యువతుల్ని వెంబడించి.. వాళ్లను అసభ్యంగా తాకి అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. -
నటుడు దర్శన్.. మళ్లీ జైలుకేనా?
కన్నడ అగ్రనటుడు దర్శన్ తూగుదీప బెయిల్ వ్యవహారంపై సుప్రీం కోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయాధికారం దుర్వినియోగమైందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది. దర్శన్ బెయిల్ రద్దు పిటిషన్పై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నాలుగు నెలలపాటు జైలులో గడిపాడు నటుడు దర్శన్. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్తో ఉపశమనం పొందిన సంగతి తెలిసిందే. అయితే.. దర్శన్తో సహా మరో ఏడుగురి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై వాదనలు వింది. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి CCTV ఫుటేజ్, ఫోటోలు, రేణుకాస్వామిపై జరిగిన హింసకు సంబంధించిన ఆధారాలు చూపిస్తూ, బెయిల్ రద్దు అవసరం ఉందని లూథ్రా వాదించారు. ఇది అత్యంత క్రూరమైన హత్యగా పేర్కొంటూ, రేణుకాస్వామి శరీరంపై గాయాలు, అంగవైకల్యం, రక్తస్రావం వంటి అంశాలను వివరించారు. ఇక దర్శన్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. అయితే.. జులై 17నాటి విచారణ సందర్భంగా జస్టిస్ పార్థీవాలా దర్శన్ తరఫు లాయర్ కపిల్ సిబాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘హైకోర్టు తీర్పు చదివితే, వాళ్లు నిందితులను ఎలా విడుదల చేయాలో చూస్తున్నట్టు ఉంది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఎందుకు జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నారో వివరించాంలి’’ అని సిబాల్ను కోరారు. దానికి కపిల్ సిబాల్ స్పందిస్తూ.. హైకోర్టు తీర్పును పక్కన పెట్టి, సాక్షుల స్టేట్మెంట్లను పరిశీలించాలంటూ కోరారు. ఈ తరుణంలో ఇవాళ్టి విచారణ సందర్భంగానూ సుప్రీం కోర్టు దర్శన్ బెయిల్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది న్యాయ అధికార వికృత వినియోగం అని వ్యాఖ్యానించింది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలిపిన బెంచ్.. పదిరోజుల్లో తీర్పు ఏంటన్నది వెల్లడిస్తామంది.కేసు ఏంటంటే..రేణుకాస్వామి అనే అభిమాని, దర్శన్ ప్రేయసి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఆపై వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చారు. 2024 డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఏడుగురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే విచారణలో దర్శన్కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. ఒకవేళ సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు అయితే, దర్శన్ మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కేసు టైంలైన్2024 జూన్: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. 2024 సెప్టెంబర్ 21: అనారోగ్య కారణంగా బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2024 అక్టోబర్ 31: కర్ణాటక హైకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.2024 డిసెంబర్ 13: హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. -
ధర్మస్థల హత్యల కేసులో 5 సమాధానం లేని ప్రశ్నలు
-
ఏఐ సాయంతో బెంగళూరు ట్రాఫిక్కు చెక్!
ఉద్యాన నగరి బెంగళూరు ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు బృహత్ ప్రయత్నం మొదలైంది. కోటి రూపాయలైనా ఖర్చుపెడతా.. ఈ కార్యక్రమంలో చేయి కలపండి అని పిలుపునిచ్చిన ప్రశాంత్ పిట్టి తన కార్యచరణ మొదలుపెట్టాడు. పది రోజుల క్రితం ఒకానొక ట్రాఫిక్ జామ్లో గంటకు పైగా చిక్కుకుపోయిన ప్రశాంత్.. ఈ సమస్యకు ఎలాగైనా చెక్ పెట్టాలని తీర్మానించుకోవడం... ఏఐ, ఎంఎల్ ఇంజినీర్లు ముందుకొస్తే టెక్నాలజీ సాయంతో ట్రాఫిక్ చిక్కులు తొలగిద్దామని ‘ఎక్స్’ వేదికగా(కోటి ఖర్చు పెడతా... ట్రాఫిక్ సమస్యను తీర్చేద్దాం!) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత.. ఈ పది రోజుల్లో ఏం జరిగిందో కూడా ప్రశాంత్ తన తాజా ట్వీట్లో వివరించారు. ‘‘ఏడాది కాలంలో బెంగళూరు ట్రాఫిక్ సమస్యను 25-30 శాతం వరకూ తీర్చగలనని నమ్మకంగా ఉన్నా’’ అన్న ప్రశాంత్ దిశగా చేసిన ప్రయత్నాలను ఇలా వివరించారు.అందరి సహకారం...బెంగళూరు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రశాంత్ బెంగళూరు ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) కమిషనర్లతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) ప్రొఫెసర్లు, రోడ్డు ఇంజినీర్లు, ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి ట్రాఫిక్తో సంబంధమున్న వ్యాపారస్తులను కలిశారు. కలిసికట్టుగా సమస్య పరిష్కారానికి కృషి చేద్దామన్న ప్రశాంత్ పిలుపునకు సానుకూల స్పందన వ్యక్తమైంది. ట్రాఫిక్ పోలీస్, బీబీఎంపీ కమిషనర్లు ఇప్పటికే తాము చేస్తున్న ప్రయత్నాలను, తమకున్న సామర్థ్యాలను వివరించారు. అటు ప్రభుత్వ అధికారులు.. ఇటు విద్యావేత్తలు.. మరోవైపు సమస్యను ఎదుర్కొంటున్న వారందరూ ఒక్కతాటిపైకి చేరారన్నమాట.కంప్యూటర్ మోడళ్లతో అధ్యయనం...బెంగళూరు ట్రాఫిక్ పోలీస్, ఐఐఎస్సీల వద్ద ఉన్న కంప్యూటర్ సిములేషన్ మోడళ్లను ట్రాఫిక్ రీమోడలింగ్కు ఉపయోగించాలని నిర్ణయించాము. ఏయే మార్గాల్లో ఎంత ట్రాఫిక్ ఉంటే బాగుంటుందో ఈ కంప్యూటర్ మోడళ్ల ద్వారా పరిశీలిస్తారు. దగ్గరి దారిపై దృష్టి పెట్టకుండా.. తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం ఈ మొడళ్ల లక్ష్యం. ‘‘గూగుల్, ఊబర్, ఓలా, ర్యాపిడోల నుంచి కూడా ట్రాఫిక్ సమాచారం కోరాను. కొంతమంది సహకరించేందుకు అంగీకరించారు. ఇతరుల కోసం వెయిట్ చేస్తున్నా. ఈ మోడల్ పనిచేస్తే ఎప్పుడు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో ముందుగానే గుర్తించవచ్చు. నివారించేందుకూ అవకాశం ఏర్పడుతుంది’’ అని ప్రశాంత్ వివరించారు.రోడ్లపై గుంతల సంగతి తేలుస్తా...‘‘రహదారిపై ఉండే గుంతలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే కొన్ని యాప్లు ఉన్నాయి. ఆ యాప్ ఓనర్షిప్ నేను తీసుకుంటా. గుంతలతోపాటు అక్రమ పార్కింగ్, సిగ్నల్స్ పనిచేయకపోవడం, రాంగ్సైడ్ డ్రైవింగ్, నీరు నిలిచిపోవడం, వాహనాల బ్రేక్డౌన్ వంటి అంశాలను ప్రజలే మా దృష్టికి తీసుకొచ్చేలా చేస్తాం. ఎవరి బాధ్యత ఏమిటన్నది స్పష్టంగా నిర్ణయించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే మంచి పని చేసిన వారికి గుర్తింపు కూడా. వచ్చిన ఫిర్యాదులు.. తీసుకున్న చర్యలను బహిరంగంగా ప్రదర్శిస్తాం. ‘‘ప్రభుత్వం మౌలికసదుపాయాల వృద్ధి, నిర్వహణల కోసం అప్పుడప్పుడూ రహదారులను బంద్ చేస్తూంటుంది. అయితే వర్షం పడగానే ఈ పనులు నిలిచిపోతాయి. ఫలితంగా ట్రాఫిక్ చిక్కులు ఎక్కువవుతాయి. ఈ సమస్య పరిష్కారం కోసం బెంగళూరు నగరంలోని ఒక్కో ప్రాంతంలో ఎప్పుడు, ఎంత వర్షం పడుతుందో తెలుసుకునేందుకు ‘హైపర్లోకల్ రెయిన్ ప్రిడిక్టర్’ ప్రాజెక్టును చేపడతాం. వర్షం పడకముందే డ్రెయినేజీ సమస్యలను సరిచేసేందుకు, కొన్ని ఇతర పనులకు ఇది ఉపయోగపడుతుంది’’ఒక మార్గంలో ట్రాఫిక్ సిగ్నల్స్ సమన్వయంతో ఒకదాని తరువాత ఒకటి పడేలా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఫలితంగా వాహనాలు ఒక క్రమ పద్ధతిలో కదులుతాయి. ప్రతి జంక్షన్లోనూ నిలవాల్సిన అవసరం ఉండదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పైలట్ ప్రోగ్రామ్ నడుస్తోంది. ఫలితాలను విశ్లేషించి అవసరమైతే నగరం మొత్తం విస్తరిస్తాం.’’విజన్ ఫర్ ఇండియా...‘‘పది రోజుల క్రితం నేను ట్రాఫిక్ సమస్యపై పోస్ట్ పెట్టినప్పుడు అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య అని కొందరు చెప్పారు. వాస్తవం చెప్పినందుకు కంగ్రాట్స్. అయితే ఈ మౌలిక సదుపాయాలు మెరుగయ్యేంత వరకూ వెయిట్ చేస్తే మనం పాశ్చాత్యదేశాలతో పోటీ పడినట్లుగా ఉంటుంది. ఉన్న సదుపాయాలను మరింత మెరుగ్గా వాడుకునేందుకు ఇక్కడ ఎంతో అవకాశం ఉంది. నేను దీనిపై దృష్టి పెడతా. నెపం వ్యవస్థలపై నెట్టేసే సమయం కాదిది. ఆచరణ సాధ్యమైన ఆశావహ దృక్పథం. మంచి ఉద్దేశంతో అన్ని రకాల సమాచారం సేకరించుకుని, అందరి సహకారంతో ఏం చేయలేము అనుకుంటున్న సమస్య విషయంలో ఎంతో కొంత చేయవచ్చునని నా నమ్మకం’’పాఠకుల నుంచి ఆశిస్తున్నది..‘‘మీ సహకారాన్ని కొనసాగించండి. ట్వీట్లు షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఫలితంగా ఈ సమస్య మరింత ఆంప్లిఫై అవుతుంది. ట్రాఫిక్ జామ్లను పరిష్కరించేందుకు సరైన వారు పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందుకు చాలా సమయం పడుతుందని నాకు తెలుసు. అందుకు సిద్ధంగానే ఉన్నా.. మీరు?’’‘‘వాట్సప్ కమ్యూనిటీలో చేరండి. ఎప్పుడేం చేయబోతున్నది అందులో వివరిస్తూంటాను. అంతేకాదు.. మీలో ప్రతి ఒక్కరి నుంచి మరింత సమాచారం కోరుతున్నా. ట్రాఫిక్ సమస్య ఏ జంక్షన్, రోడ్డులో ఎక్కువగా ఉంటుందో చెప్పండి. అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సులువుగా ఉంటుంది.’’ ప్రశాంత్ వాట్సప్ కమ్యూనిటీలో చేరేందుకు... https://whatsapp-traffic-community.forpublicgood.ai ఉపయోగించుకోండి. -
ధర్మస్థల కేసులో కొత్త ట్విస్ట్..!
-
పాపులర్ ట్రెక్కింగ్ డెస్టినేషన్ : నిశానబెట్ట గురించి తెలుసా?
బనశంకరి: దట్టమైన అడవులు, ఎత్తైన వృక్షాలు, పచ్చదనం పరుచుకున్న కొండలు, నయన మనోహరమైన సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలతో ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకా నిశానబెట్ట (Nishani Betta) పర్యాటకులను రా రమ్మని ఆహ్వానం పలుకుతోంది. ప్రకృతి ప్రేమికులు, పర్వతారోహకులకు నూనెబెట్ట స్వర్గధామంగా మారింది. ఉత్తరకన్నడ నుంచి వానల్లి-కక్క మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో నిశాన బెట్ట ఉంది. ప్రసిద్ధ ట్రెక్కింగ్ గమ్యస్థానం నిశాని బెట్ట, నిశాన మొట్టే అని కూడా పిలుస్తారు, ఇది కర్ణాటకలోని కొడగు (కూర్గ్) జిల్లాలో ఉన్న ఒక శిఖరం. సముద్ర మట్టం నుంచి 783మీటర్ల ఎత్తులో ఉన్న నిశాన బెట్టి ప్రకృతి అందాలతో రంగా ఉంటుంది. లోయలతో కూడిన ఈ కొండపైకి ట్రెక్కింగ్ చేయడం జీవితంలో మరచి పోలేని అనుభవం. గ్రామపంచాయతీ పరిదిలోని వాన నుంచి కక్కళ్లి మార్గంలో 5కిలోమీటర్లు ప్రయాణించాలి. కాలినడకన అరకిలోమీటర్ నడవాలి. కొద్దిదూరం దట్టమైన అడవిలో ప్రయాణించాలి. అడవి దాటగానే తగ్గుప్రదేశం నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఇది జారుడుగా ఉండటం వల్ల ప్రమాదకరంగా ఉంటుంది. వర్షాకాలంలో ట్రెక్కింగ్ కష్టసాధ్యం. వర్షాకాలం అనంతరం ట్రెక్కింగ్ చేయడం ఉత్తమం. ఆ పేరు ఎలా వచ్చిందంటేయాత్రను గుర్తించడానికి నిశానెబెట్టపై సైనికులు సహారా కాసేవారు. ఎదురుదాడి చేయడానికి సైన్యం వస్తుందని తెలియగానే నిశానెబెట్టపై నుంచి జెండా ఊపి విషయం చేరవేసేవారని, అందుకే ఈ బెట్టకు ని నెబెట అని పేరు వచ్చిందని చెబుతారు. వీకెండ్ సమయంలో పర్యాటకుల సందడి నిశానెబెట్టకు వీకెండ్ సమయంలో పర్యాటకులు, పర్వతారోహకులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రకృతి అం దాలను ఆస్వాదిస్తారు. సూర్యోదయం, సూర్యాస్థ మయం అద్భుతంగా ఉంటుంది. ఈ నయన మనోహర దృశ్యాన్ని కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీ పడతారు. నిశానెబెట్ట వీక్షణకు వచ్చే వారు పరిసరాల శుభ్రత పాటించాల్సి ఉంటుంది. సోందా అరసరపాలన కాలంలో శత్రువులు దండ తినుబండారాల కవర్లను, ఖాళీ వాటర్ బాటిల్స్ ను ఇష్టారాజ్యంగా పడేయరాదు. నిర్ణీత స్థలంలో ఉంచిన చెత్త బుట్టలో వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనల వల్లనే నిశానెబెట్ట ప్లాస్టిక్, చెత్త రహితంగా గుర్తింపు పొందింది.సాంస్కృతిక కార్యక్రమాలునినెబెట్ట కేవలం ట్రెక్కింగు కాకుండా సాంస్కృ తిక వైభవానికి వేదికగా మారింది. ఇక్కడ శివరాత్రి జాగరణ నిమిత్తం వైవిధ్యమైన సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహిస్తారు. స్థానికులతో కలిసి ఇక్కడ జాగరణ చేస్తారు. నిశానెబెట్టలో సాంస్కృతిక సంఘాలు నిర్వహించే కార్యక్రమాలు ప్రజాదరణ పొందాయి. నిశాన బెట్ట నైసర్గికంగా దట్టమైన అడవు లతో కూడుకుని ఉండటంతో అంతగా అభివృద్ధి కనబడలేదని స్థానికులు అంటారు.ఇదీ చదవండి: మునుపెన్నడూ ఎరుగని ఉల్లాస యాత్ర : పురాతన ఆలయాలు, సరస్సులు -
మునుపెన్నడూ ఎరుగని ఉల్లాస యాత్ర : పురాతన ఆలయాలు, సరస్సులు
బనశంకరి: విద్యా, వాణిజ్య పారిశ్రామిక రంగాలకు, ధ్యాత్మికతకు చిరునామాగా కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ- ధార్వాడ జంట నగరాలు భాసిల్లుతున్నాయి. రాష్ట్రంలో నడి మధ్యన ఉంటూ, వైవిధ్యమైన సాంస్కృతిక పరంపరను కలిగి ఉన్నాయి. అలాగే ఈ జంట నగరాల చుట్టుపక్కల అనేక పర్యాటకప్రాంతాలు కూడా కనువిందు చేస్తాయి. కొంచెం తీరిక చేసుకుంటే అందమైన ప్రకృతి స్థలాలతో పాటు పర్వతాలను కూడా అధిరోహించి కొత్త ఉత్సాహాన్ని పొందవచ్చు. ఇందుకోసం ఎంతో దూరం కూడా వెళ్లాల్సిన పని లేదు. వతుంగ బెట్ట: హుబ్లీ వద్ద నృపతుంగబెట్ట ఉద్యానవనం పర్యాటకు కు ప్రముఖ విహార స్థలం, కుటుంబ సమేతంగా దర్శించి ప్రకృతి రమణీయతతో కూడిన పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. ఇది మంచి పిక్నిక్ స్పాట్గా గుర్తింపు పొందింది. ట్రెక్కర్లకు ఇది స్వర్గ ధామం అని చెప్పొచ్చు. పొగమంచుతో కూడిన తావరణం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.ఉణకల్ బెట్ట: ఇది ఉణకల్ సరోవరం వద్ద ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తే సుందరమైన ప్రదేశాన్ని వీక్షించి మనసు పులకిస్తుంది. బేస్ క్యాంప్ సైట్ నుంచి గంట పాటు నడక దూరంలో విశాలమైన చెట్లతో డిన బండరాళ్ల మధ్య ట్రెక్కింగ్ చేయడం అబ్బురపరుస్తుంది. కొంచెం శ్రమ సైతం ఎదురవుతుంది. ఉణకల బెట్ట మీద నుంచి సూర్యోదయం, "సూర్యాస్తమయాలను చూడడం నయన మనోహరంగా ఉంటుంది. ఓ రకంగా ఇది ఉత్తర కర్ణాటక నందిహిల్స్గా చెప్పవచ్చు. ప్రకృతి ప్రేమికులు, ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఎంతో ఇష్టపడతారు.సాధనకేరి బెట్ట: పర్వతారోహరణకు మరో అద్భుత ప్రదేశం ధార్వాడలోని సాధనకేరిబెట్ట, నృపతుంగబెట్ట, ఉణ కలబెట్టకు వెళ్లే మార్గం సాధనకెరి బెట్ట ఉంది. దట్టమైన అడితో కూడుకొని ఉండటంతో బెట్టపైకి వెళ్లే ట్రెక్కర్లు క్రమించాల్సి ఉంటుంది. అయితే బెట్ట పైకి చేరుకున్నాక అప్పటివరకు పడిన శ్రమను మర చిపోయేలా ఆహ్లాదకరమై, రమణీయమైన దృశ్యాలు ఉల్లాసపరుస్తాయి. అక్కడి నుంచి ధార్వాడ నగరం అద్భుతంగా కనిపిస్తుంది. సాదనకేరి బెట్టపై వివిధ పక్షుల కిలకిలారావాలు అద్భుతంగా ఉంటాయి.కవల గుహలు: హుబ్లీ నుంచి కవల గుహలు 25 కిలోమీటర్ల ఉన్నాయి. గుహలవైపు వెళ్లాలంటే దట్టమైన అడవులు, బండరాళ్లను దాటాలి. కవల గుహలను చేరుకోగానే రెండువేల సంవత్సరాల పురాతన రాతి రచనలు కనబడతాయి. నైసర్గిక శివలింగాన్ని వీక్షిస్తే ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ప్రకృతి రమణీయతతోపాటు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన స్థలాలను సందర్శించడానికి ఇదే సరైన సమయం.అంశి అభయారణ్యం: హుబ్లీ- ధార్వాడకు వందకిలోమీటర్ల దూరంలో ఉన్న అంశ జాతీయ అభయారణ్యం నడక లేదా ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. కాళి పులి అభయార ణ్యంలో ఉద్యానవనంలో దట్టమైన అడవులు, నదులు, కొన్ని చోట్ల పర్వతాలతో కూడిన లోయల మధ్య ట్రెక్కింగ్ ఉత్కంఠంగా ఉంటుంది. ఈ ఉద్యా నవనంలో వైవిధ్యమైన వన్యజీవులు, పక్షులు, పులులు, చిరుతలను వీక్షించవచ్చు. -
కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల జీఎస్టీ
బెంగళూరు: యూపీఐ చెల్లింపులు చిన్నతరహా వ్యాపారులకు ముప్పుగా పరిణమించాయి. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి రాని వ్యాపారులను సైతం ఇవి బెంబేలెత్తిస్తున్నాయి. కర్ణాటకలోని హవేరికి చెందిన శంకర్గౌడ చిన్న కూరగాయల దుకాణం నడుపుతున్నాడు. రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలను కొని తన దుకాణంలో విక్రయిస్తుంటాడు. జీఎస్టీ రూ.29 లక్షలు చెల్లించాలంటూ శంకర్గౌడకు ఇటీవల నోటీసులొచ్చాయి. నాలుగేళ్లుగా కూరగాయలు అమ్ముతున్న శంకర్గౌడ.. మొత్తం రూ.1.63 కోట్ల లావాదేవీలు చేసినందున ఇప్పుడు 29 లక్షల జీఎస్టీ కట్టాలన్నది సారాంశం. తాను ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేస్తానని, రికార్డులు కూడా నిర్వహిస్తానని అయినా రూ.29 లక్షల జీఎస్టీ చెల్లించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్క శంకర్గౌడనే కాదు.. రాష్ట్రంలో వేలాది మంది కూరగాయ విక్రేతలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి క్లియర్ టాక్స్ ప్రకారం, తాజా పండ్లు, కూరగాయల విక్రయం జీఎస్టీ పరిధిలోకి రాదు. రైతుల నుంచి కొనుగోలు చేసి, ఎలాంటి ప్రాసెస్ చేయకుండా విక్రయించే ఈ వస్తువులకు జీఎస్టీ వర్తించదు. అయినా ఆదాయాన్ని బట్టి నోటీసులు ఇవ్వడమేంటని కూరగాయల వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. బ్యాంకులు లేదా డిజిటల్ మాధ్యమాల్లో చెల్లింపులు చేసినప్పుడు ఈ లావాదేవీలు పన్ను అధికారుల పరిశీలనలోకి వెళ్తున్నాయి. వ్యాపారి మొత్తం అమ్మకాలు ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే, ఆధారాలు, రికార్డులను అడిగే హక్కు పన్ను శాఖకు ఉంటుంది. ఇదే వ్యాపారులకు శాపంగా మారింది. దీంతో... చాలా మంది చిన్న తరహా వ్యాపారాలు డిజిటల్ చెల్లింపులు నివారించి, నగదు మాత్రమే తీసుకుంటున్నారు. వ్యాపారులు నగదుకు మారుతున్న విషయం తమకు తెలిసిందని, యూపీఐ లేదా నగదు ఏదైనా సరే.. వచ్చిన మొత్తానికి పన్ను వర్తిస్తుందని జూలై 17న కర్ణాటక జీఎస్టీ విభాగం హెచ్చరించింది. రూ.40 లక్షల టర్నోవర్ దాటితే... రూ.40 లక్షల కంటే ఎక్కువ యూపీఐ టర్నోవర్ ఉన్న 11,000 వ్యాపారులకు నోటీసులు అందజేసింది. నోటీసులను ఉపసంహరించుకోవాలని వర్తక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జీఎస్టీ నోటీసులను నిరసిస్తూ కర్ణాటక అంతటా టీ స్టాళ్లు, బేకరీలతో సహా మొత్తం చిన్న వ్యాపారాలను జూలై 25న రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేస్తామని హెచ్చరించాయి. యూపీఐ డేటాను యాక్సెస్ చేయడం చట్టబద్ధతను వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం లావాదేవీల ఆధారంగా, విక్రేతలకు పన్ను నోటీసులు జారీ చేయడం అన్యాయమంటున్నారు. సరైన తనిఖీలు లేకుండా జీఎస్టీ కట్టాలంటూ శిక్షించడం తమను దోచుకోవడమేనంటున్నారు.పరిమితిపై పునరాలోచించాలి..ఇలాంటి జీఎస్టీ నోటీసులు కొనసాగితే, చాలా మంది డిజిటల్ చెల్లింపులకు దూరమవుతారు. కాబట్టి జీఎస్టీ రిజిస్ట్రేషన్ పరిమితిపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు భావిస్తున్నారు. పన్ను చెల్లింపు దారులలో జీఎస్టీపై అవగాహనను, ముఖ్యంగా కొత్తగా ఈ లావాదేవీల్లోకి ప్రవేశిస్తున్నవారికి మరింత చైతన్యం కలి్పంచాల్సిన అవసరముందని చెబుతున్నారు. లేదంటే.. వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను మినహాయిస్తారని, ఇది నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోలేదని చెబుతున్నారు. -
రాజకీయ యుద్ధాల్లో.. మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు?
మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ భూకేటాయింపుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను దురుద్దేశపూర్వకంగా రంగంలోకి దించారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు కోసం ఈడీని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఈ విషయంలో మేం నోరువిప్పితే బాగోదు. రాజకీయ యుద్ధాల్లో ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఇలాంటి విపరీత పోకడ వైరస్ను దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయకండి. ఈడీని ఉసిగొల్పే వికృత క్రీడను దేశ మంతటా అమలు చేయకండి. ఎన్నికల వేదికలపై మాత్రమే రాజకీయ యుద్ధాలు చేసుకోండి. ఇదే ధోరణి కొనసాగిస్తే మేం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. – సుప్రీంకోర్టుసాక్షి బెంగళూరు: కర్ణాటకలో మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూకేటాయింపుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని దురుద్దేశపూర్వకంగా రంగంలోకి దించారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు కోసం ఈడీని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సుప్రీంకోర్టు సూటి ప్రశ్నవేసింది. ముడా భూకేటాయింపుల కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి వ్యతిరేకంగా ఈడీ గతంలో జారీచేసిన సమన్లు కొట్టేస్తూ కర్ణాటక హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సమర్థించింది.హైకోర్టు తీర్పును సవాల్చేస్తూ ఈడీ దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘ఈ విషయంలో మేం నోరువిప్పితే బాగోదు. అచ్చం ఇలాగే మహారాష్ట్రలో జరిగిన ఉదంతం మొత్తం మాకు తెలుసు. రాజకీయ యుద్ధాల్లో ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారు?. ఇలాంటి విపరీత పోకడ వైరస్ను దేశవ్యాప్తంగా వ్యాప్తిచేయకండి.ఈడీని ఉసిగొల్పే వికృత క్రీడను దేశమంతటా అమలుచేయకండి. ఎన్నికల వేదికలపై మాత్రమే రాజకీయ యుద్ధాలు చేసుకోండి. ఈ యుద్ధాల్లోకి ఈడీని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? మీరు ఇదే ధోరణి కొనసాగిస్తే మేం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేసుల విషయంలో ఈడీ అధికారులు అన్ని పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారు’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.స్వాగతించిన కాంగ్రెస్.. విమర్శించిన బీజేపీఈడీ వైఖరిని ఎండగడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఈడీ–బీజేపీ సమష్టిగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సుప్రీంకోర్టు బట్టబయలుచేసిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ రణ్దీప్ సూర్జేవాలా అన్నారు. కోర్టు తీర్పు కేంద్రప్రభుత్వానికి చెంపదెబ్బలా తగిలిందని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.ఈడీని రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేస్తున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షాలకు ఈ తీర్పు మేలుకొలుపు అని ఆయన అన్నారు. ముడా కేసులో తమ పోరాటం ఆగదని బీజేపీ స్పష్టంచేసింది. ‘‘ భూమికి బదులు ప్లాట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరగకపోతే వాటిని సీఎం కుటుంబం ఎందుకు మళ్లీ వెనక్కి ఇచ్చేసింది?. వాటిని వాళ్ల వద్దే ఉంచుకోవచ్చుగదా. ఈ అంశంలో మా పోరాటం కొనసాగుతుంది’’అని కర్ణాటక అసెంబ్లీలో విపక్షనేత, బీజేపీ నాయకుడు ఆర్.అశోక్ సోమవారం బెంగళూరులో అన్నారు.ఏమిటీ ముడా కేసు?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది.అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు. ‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు.అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్లో రద్దుచేశారు. అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. -
బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్!
బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) 2024 సెప్టెంబర్ వరకు జారీ చేసిన బీ-ఖాతా ఆస్తుల క్రమబద్ధీకరణకు కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ చర్య వల్ల ఆయా ఆస్తులను తర్వాత ఏ-ఖాతాకు అప్గ్రేడ్ చేసుకునేందుకు వీలవుతుంది. ప్రభుత్వ చర్యలతో ఆస్తుల యజమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న చట్టపరమైన స్పష్టత రానుందని భావిస్తున్నారు.‘ఆస్తులకు బీ-ఖాతా ధ్రువపత్రాలు ఇచ్చేటప్పుడు కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తాం. ఆస్తి యజమానులు ప్రమాణాలను పాటిస్తే బీ-ఖాతా జారీ చేస్తారు. తర్వాత పక్కా డాక్యుమెంట్లతో ఏ-ఖాతాకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కొన్ని లోపాలున్న ఆస్తులకు పరిమిత మినహాయింపులతో బీ-ఖాతా సర్టిఫికెట్లు జారీ చేస్తాం’ అని న్యాయ మంత్రి హెచ్కే పాటిల్ కేబినెట్ సమావేశంలో తెలిపారు. క్రమబద్ధీకరించిన తర్వాత బీ-ఖాతా ఆస్తి యజమానులకు చట్టపరమైన హోదా దక్కుతుంది. గతంలో అనుమతించని అమ్మకాలు, బ్యాంకు రుణాలు, తనఖాలకు వీలు కల్పించేలా ఏ-ఖాతాకు అప్గ్రేడ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.బీ-ఖాతా అంటే ఏమిటి?బీ-ఖాతా అనేది చట్టపరమైన, ప్రణాళికా నిబంధనలను పూర్తిగా పాటించని ఆస్తుల కోసం బీబీఎంపీ నిర్వహించే ఒక రకమైన ఆస్తి రికార్డు. వీటిలో అనధికార లేఅవుట్లలోని భవనాలు, అనుమతి లేని నిర్మాణాలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు లేనివి ఉన్నాయి. ఈ ఆస్తులు పూర్తిగా చట్టబద్ధం కానప్పటికీ యజమానులు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ప్రయోజనాల కోసం వారి వివరాలను నమోదు చేయాలి. ఇప్పటివరకు ఇలాంటి లోపాలున్న ఆస్తులు పూర్తిగా చట్టబద్ధమైనవిగా పరిగణించబడలేదు. అమ్మకం, భవన అనుమతులు పొందడం లేదా ట్రేడ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆంక్షలు ఎదురయ్యేవి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణంగా వాటిపై రుణాలు ఇవ్వవు. స్థానిక చట్టాలకు పూర్తిగా అనుగుణంగా ఉండే ఏ-ఖాతా ప్రాపర్టీలతో పోలిస్తే, బీ-ఖాతా ఆస్తులు సాధారణంగా తక్కువ మార్కెట్ విలువ, పరిమిత చట్టపరమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయని నిపుణులు అంటున్నారు.ఇదీ చదవండి: ‘డ్రాప్ చేసి ఇంటికి వచ్చేలోపు దుబాయ్ వెళ్లింది’అనధికారిక నిర్మాణాలు, ప్రణాళికారహిత అభివృద్ధి బీ-ఖాతాల సమస్యకు దారితీసింది. వీటిని నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్నోట్లో పేర్కొంది. కర్ణాటక టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ చట్టం నియంత్రణ పరిధిలోకి బీ-ఖాతా ఆస్తులను తీసుకురావాలనే డిమాండ్ ఉంది. 2024 సెప్టెంబర్ 30 తర్వాత సృష్టించిన లేదా నిర్మించిన అనధికారిక ఆస్తులకు బీ-ఖాతా జారీ చేయడాన్ని గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ చట్టం నిషేధించింది. బీ-ఖాతా అనే భావనను 2009లో ప్రవేశపెట్టారని, అందువల్ల 2009కి ముందు జారీ చేసిన అన్ని ఖతాలు ఏ-ఖాతాలేనని తెలిపింది.గృహ కొనుగోలుదారులకు ప్రయోజనంక్రమబద్ధీకరించిన తర్వాత బీ-ఖాతా ఆస్తి యజమానులకు చట్టపరమైన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామని న్యాయవాది ఆకాశ్ బంటియా తెలిపారు. ఈ చట్టపరమైన స్పష్టత వారి ఆస్తులను తాకట్టు పెట్టడానికి, బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుందని చెప్పారు. ఈ క్రమబద్ధీకరణ చర్య యాజమానికి అధికారిక రుజువుగా కూడా పనిచేస్తుందన్నారు. దీంతో వేలాది మంది నివాసితులకు దీర్ఘకాలిక ఉపశమనం లభిస్తుందని తెలిపారు. -
రాజకీయ పోరాటాలతో మీకేం పని?.. ఈడీపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పోరాటం ఈడీ పని కాదని.. అది ముమ్మాటికీ అధికార దుర్వినియోగం కిందికి వస్తుందంటూ పేర్కొంది. కర్ణాటక ‘మూడా స్కాం’ కేసుతో పాటు.. లాయర్లకు ఈడీ సమన్లు జారీ చేసిన వ్యవహారాలను విచారించే క్రమంలో సుప్రీం కోర్టు ఈడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: మూడా స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి కర్ణాటక హైకోర్టు కల్పించిన ఉపశమనాన్ని ఈడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఈడీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జి సమర్థించారని మీకు బాగా తెలుసు. అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో న్యాయ నిర్ణయాలు వచ్చాయి. వాటిని తిరగరాయడానికి ఈడీ ప్రయత్నించడం అనవసరం. ఇది రాజకీయ ప్రమేయంలా అనిపిస్తోంది. రాజకీయాలు పోరాటాలు అనేది ప్రజల మధ్య జరగాలి. మీరు(ఈడీ) దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రశ్నించారు. EDను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదు.. అది ప్రజాస్వామ్యానికి హానికరం. ఈ వైరస్ను దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందనివ్వకండి అని సీజేఐ వ్యాఖ్యానించారు.Let political battles be fought among the electorate.. రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి. రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలు, ఆరోపణలు, విమర్శలు కోర్టుల ద్వారా కాదు, ఓటర్ల తీర్పు ద్వారా పరిష్కరించాలి. అలాంటిది ED (Enforcement Directorate) వంటి సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయా?. కోర్టులను రాజకీయ వేదికలుగా ఉపయోగించకండి. ప్రజాస్వామ్యంలో ఓటర్లు మాత్రమే రాజకీయ నాయకుల భవితవ్యాన్ని నిర్ణయించాలి, న్యాయవ్యవస్థ కాదు.దురదృష్టవశాత్తూ.. మహారాష్ట్రలో ఈడీతో నాకు అనుభవం ఉంది. మాతో మీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసేలా చేసుకోకండి అని చీఫ్ జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. ఈ క్రమంలో అదనపు సోలిసిటర జనరల్ ఎస్వీ రాజు తమ పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని ధర్మాసనానికి తెలిపారు. అదే సమయంలో.. భవిష్యత్తులో ఈ పిటిషన్ను ఇతర కేసుల్లో ఉదాహరించవద్దంటూ విజ్ఞప్తి చేశారాయన. దీంతో పిటిషన్ను కొట్టేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. మరో కేసులో.. క్లయింట్లకు సలహాలు ఇస్తున్నారనే అభియోగాల కింద.. ఈడీ సీనియర్ అడ్వొకేట్లకు కొందరు సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు .. ఇవాళ విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ తోపాటు మరికొన్ని లీగల్ బాడీస్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. చైనా, టర్కీలలో బార్ అసోషియేషన్లు రద్దైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశాయి. అదే సమయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరాయి. దీంతో.. న్యాయపరమైన సలహాలు ఇవ్వడం తప్పెలా అవుతుంది? అని ఈడీ తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అయితే గుజరాత్లో ఓ హత్య కేసులో నిందితుడికి న్యాయవాది సలహా ఇవ్వడాన్ని ఈడీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో ఈడీని నెగెటివ్గా చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అయితే అది వేరే సందర్భమన్న సీజేఐ బెంచ్.. న్యాయవాదిని సమన్లు ఇవ్వాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలనే విషఁఆన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో మార్గదర్శకాల రూపకల్పనకు అమీకస్ క్యూరీని నియమిస్తామంటూ వచ్చేవారానికి విచారణ వాయిదా వేసింది.మూడా (MUDA) కేసు నేపథ్యంకర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య B.M. పర్వతికి సంబంధించి మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) ద్వారా భూ కేటాయింపులపై అక్రమతల ఆరోపణలతో ప్రారంభమైంది. సుమారు 3.16 ఎకరాల భూమి పర్వతి పేరుతో ఉంది, ఇది MUDA ద్వారా డెనోటిఫై చేయబడిన తర్వాత రెసిడెన్షియల్ లేఅవుట్గా అభివృద్ధి చేయబడింది. MUDA ఈ భూమిని ఉపయోగించినందుకు పర్వతి 14 ప్లాట్లు (ప్రతి ఒక్కటి ₹2 కోట్ల విలువ) విజయనగర ప్రాంతంలో పొందారు. అయితే.. బీజేపీ, JD(S) వంటి ప్రతిపక్షాలు దీన్ని ₹4,000 కోట్ల స్కాంగా అభివర్ణించాయి. మూడా (MUDA) కేసు కోర్టు విచారణ టైం లైన్కర్ణాటక గవర్నర్ తావార్చంద్ గెహ్లాట్ 2024 ఆగస్టు 17న MUDA కేసులో ED విచారణకు అనుమతి ఇచ్చారు. తద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది. ED తన Enforcement Case Information Report (ECIR) నమోదు చేసి, పర్వతి (CM భార్య) సహా ఇతరులపై ప్రీలిమినరీ విచారణ ప్రారంభించింది. ఆగస్టు 19, 2024👉 సీఎం సిద్ధరామయ్య గవర్నర్ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.👉 ED విచారణకు అనుమతి ఇచ్చిన గవర్నర్ ఆదేశాన్ని రద్దు చేయాలని కోరారు.ఆగస్టు 29, 2024👉 హైకోర్టు ప్రత్యేక కోర్టును MUDA కేసులో తాత్కాలికంగా ఆదేశాలు ఇవ్వకుండా ఉండమని సూచించింది.👉 విచారణ తదుపరి తేదీకి వాయిదా వేసింది. సెప్టెంబర్ 12, 2024👉 హైకోర్టు విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వ్ చేసింది.👉 న్యాయమూర్తి M. నాగప్రసన్న రెండు పక్షాల వాదనలు ఆఖరి రోజులోనే ముగించాలని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 24, 2024👉 కర్ణాటక హైకోర్టు సీఎం సిద్ధరామయ్య పిటిషన్ను తిరస్కరించింది.👉 గవర్నర్ అనుమతి చట్టబద్ధమైనదే అని తీర్పు ఇచ్చింది.2025 మార్చి 7కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్య సతీమణి B.M. పార్వతికి ఉపశమనంMUDA భూ కేటాయింపు కేసులో, ED జారీ చేసిన సమన్లను హైకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తి M. నాగప్రసన్న ఈ తీర్పును ఇచ్చారు, పార్వతి, మంత్రి బైరతి సురేష్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించి, ED చర్యలు చట్టపరంగా నిలబడవని తేల్చారు. Money Laundering Act (PMLA) ప్రకారం, “proceeds of crime” అనే అంశం స్పష్టంగా లేకపోతే, ED విచారణ కొనసాగించలేదని కోర్టు అభిప్రాయపడింది. పార్వతి 14 ప్లాట్లు స్వచ్ఛందంగా తిరిగి అప్పగించడంతో, ఆర్థిక లాభం పొందలేదని కోర్టు గుర్తించింది. సమన్లు జారీ చేయడం చట్టబద్ధంగా కాదని తీర్పు ఇచ్చారు.జూలై 21, 2025👉 సుప్రీం కోర్టు ఈ కేసులో ED అప్పీల్ను తిరస్కరించింది.👉 “రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి, కోర్టుల్లో కాదు” అని CJI BR గవాయ్ వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ‘మీట్ అండ్ గ్రీట్’
బెంగళూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ఈ రోజు(ఆదివారం, జూలై 20వ తేదీ) బెంగళూరులోని స్థానిక వేదికలో నిర్వహించబడింది. దేశం నలుమూలల నుండి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ సభ్యులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ పాలసీలు, డిజిటల్ ప్రచారం, మరియు భవిష్యత్ యూత్ ఎన్గేజ్మెంట్ వ్యూహాలపై చర్చలు జరిపారు. పార్టీలో యువత పాత్రను పటిష్టపరిచేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ప్రముఖులు మాట్లాడుతూ, “డిజిటల్ యుగంలో పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు ఐటీ వింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ సమావేశం ద్వారా మనం ఒక కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు సాగేందుకు మరో మెట్టు ఎక్కాం” అని తెలిపారు.అంతేకాక, పాల్గొన్న సభ్యుల మధ్య అవగాహన పెంపు, నెట్వర్కింగ్, మరియు టీమ్ స్పిరిట్ మరింత బలపడేలా ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఓ వేదికగా నిలిచింది. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. వీరిలో ఐటీ విభాగం ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ భాస్కర్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు ప్రతాప్ ముకుందాపురం, హరీష్రెడ్డి, జనార్థన్రెడ్డిలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యదర్శలు..భాస్కర్ రెడ్డి కొప్పల, నల్లప రెడ్డి, విజయ్ రాఘవ రెడ్డి, రమేష్ రెడ్డి,రోహిత్ రెడ్డి, జయచంద్ర రెడ్డి, సుధీర్ రెడ్డి, జగన్ పుసపాటి,గుజ్జల శ్రీనివాసులు రెడ్డి, మురళి రెడ్డి, శ్రీనివాస్ పులి,అంబవరం భాస్కర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి బాలం, మారుతి ఎం, గంగి రెడ్డి,రఘునాథ రెడ్డి ఎన్, బాబుల్ తుమ్మా, శేఖర్ రెడ్డి, ప్రవీణ్ రాజు,ఉదయ్ రెడ్డి, అశోక్ రెడ్డి, కల్యాణ్పార్టీకి అంకితమైన అనేక మంది వైఎస్ జగన్ అభిమానులు ఈ సమావేశంలో పాల్గొని, ఐటీ విభాగం భవిష్యత్ దిశపై విలువైన సూచనలు ఇచ్చారు. -
నేను డీకే పేరు చెప్పాలా?, మీరు నాకు సూచిస్తారా?: సీఎం సిద్ధరామయ్య అసహనం
కర్ణాటక సీఎం మార్పు అంశంపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం సిద్ధరామయ్యను మార్చే అవకాశం ఉందని, ఆ స్థానంలో డీకే శివకుమార్కు అవకాశం కల్పించడానికి రంగం సిద్ధమైందంటూ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై సిద్ధరామయ్య కానీ, డీకే శివ కుమార్ కానీ ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు.అయితే నిన్న (శనివారం, జూలై 19వ తేదీన) మైసూర్ జిల్లాలో జరిగిన పార్టీ ఈవెంట్లో ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తిని సీఎం సిద్ధరామయ్య బహిరంగంగానే వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ పేరును పేర్కొనాలనే సూచనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను కీర్తించే క్రమంలో కొత్త ప్రాజెక్టులను ప్రకటించడంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘సాధన సమావేశం’లో సీఎం సిద్ధరామయ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు,. అయితే అత్యవసరంగా ఆయన బెంగళూరు బయల్దేరాల్సి ఉండటంతో వేదిక పైనుంచి ఉన్నపళంగా వెళ్లిపోయారు. అయితే సిద్ధరామయ్య ప్రసంగానికి సిద్ధమైన క్రమంలో పార్టీ ముఖ్యులను పరిచయం చేసే క్రమంలో డీకే పేరు ప్రస్తావించలేదు. అయితే డీకే, డీకే, డీకే అంటూ సభకు వచ్చిన జనం నుంచి స్పందన వచ్చింది. దీనిపై సిద్ధరామయ్యలో కోపం కట్టలు తెంచుకుంది. అదే సమయంలో డీకే పేరును మరిచిపోయారనే ఉద్దేశంతో కాంగ్రెస్కు చెందిన ఒక న్యాయవాది.. ఆ విషయాన్ని ఆయనకు తెలియజేసే ప్రయత్నం చేశారు. దీంతో సిద్ధరామయ్యకు కోపం మరింత ఎక్కువవైంది. ‘ డీకే శివకుమార్ ఇక్కడ లేరు.. అవునా.. కాదా.. దయచేసి మీరు వెళ్లి కూర్చోండి. మీరు ఏ తరహా న్యాయవాది’ అంటూ కాస్త స్వరం పెంచి మరీ సిద్ధరామయ్య అనడంతో ఇది పార్టీలోని, ప్రభుత్వంలో అంతర్గత లుకలుకల్ని బయటపెట్టింది. -
ఆమె ఏమో దుబాయ్లో.. నేనేమో ఇంకా ఈ ట్రాఫిక్లో!
మన దేశంలో బెంగళూరు ట్రాఫిక్కంటూ (Bengaluru Traffic) ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. నిత్యం ఆ ట్రాఫిక్లో నరకం అనుభవించేవాళ్లకే ఆ బాధేంటో తెలుస్తుంది. ఇటు.. సోషల్ మీడియాలో దీనిపై నడిచే చర్చ అంతా ఇంతా కాదు. అలా అక్కడి పరిస్థితులపై ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దుబాయ్ వెళ్తున్న తన స్నేహితురాలిని ఒకడు బెంగళూరు ఎయిర్పోర్టులో దిగబెట్టాడట. తిరిగి తాను ఇంటికి వెళ్లే క్రమంలో ట్రాఫిక్లో చిక్కుకుపోయాడట. అలా ఆమె దుబాయ్కి చేరుకుంటే.. అతను మాత్రం ఇంకా ఆ ట్రాఫిక్లోనే ఉండిపోయాడట. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అకౌంట్ ఎక్స్ అకౌంట్లో ఈ వీడియో షేర్ అయ్యింది.బెంగళూరుకు చెందిన @bengalurupost1 యూజర్ ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదెంత వరకు నిజం? అని ప్రశ్నిస్తున్నాడు. అయితే ఇది సెటైరికల్ పోస్టే అని స్పష్టమవుతున్నా.. సరదాగా కాసేపు కామెంట్లతో బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై జోకులు పేలుస్తున్నారు.How true is this #Bengaluru? pic.twitter.com/02v0KwngoA— Bengaluru Post (@bengalurupost1) July 18, 2025ఇదిలా ఉంటే.. ఇటు గురుగ్రామ్కు చెందిన ఓ ట్రాఫిక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వర్షం పడడంతో నీరు నిలిచిపోయి.. నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్న దృశ్యాలు అవి. అయితే దానికి కూడా బెంగళూరుకు ముడిపెట్టి జోకులు పేలుస్తున్నారు. ఇది బెంగళూరు ట్రాఫిక్ కంటే ఎంతో నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ankit Tiwari (@nomadic_ankit_) ఇదీ చదవండి: బెంగళూరు ట్రాఫిక్ సమస్య చెక్ ఇలా.. -
గుదిబండగా మారిన నాలుగు కుంకీ ఏనుగులు
-
బెంగళూరులో హైటెన్షన్.. 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బెంగళూరు: ఓవైపు దేశరాజధానిలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న వేళ.. ఇటు నగరంలోనూ ఒక్కసారిగా కలకలం రేగింది. బెంగళూరు ఈ ఉదయం ఒకేసారి 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.నగరంలోని రాజరాజేశ్వరీనగర్, కెంగేరి తదితర ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశారు. నగర పోలీసులు బృందాలుగా విడిపోయి ఆయా విద్యాసంస్థల్లో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ టీమ్లు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నాయి. ఇటు.. ఢిల్లీలో 20 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అక్కడ కూడా పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇటీవల దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్ , ఈమెయిల్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది, ముఖ్యంగా విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు లక్ష్యంగా మారాయి.40 Bengaluru schools receive bomb threats via emails, bomb squads and police team are at the spot #Bengaluru #Schools #BombThreats pic.twitter.com/3t9NMeZRpQ— News18 (@CNNnews18) July 18, 2025 -
గుండెపోటుతో మరో మరణం.. ఆ వదంతులను కొట్టిపారేసిన మంత్రి
రాయచూరు రూరల్: కర్ణాటకలో వరుసగా గండెపోటు మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ యువతి మరణించిన ఘటన కొప్పళలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి శివగంగా కాలనీలో నివాసముంటున్న మంజుల హూగార్(26) గుండెపోటుకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. మంజుల ఇటీవల వరకు బెంగళూరులో పని చేస్తుండేది. అక్కడ పని వదిలిపెట్టి ఇటీవలే కొప్పళకు వచ్చింది. తల్లిదండ్రులు బస్టాండ్లో పూల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. మంజుల మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో గుండెపోటుతో ఎక్కువ మంది చనిపోతున్నారని తప్పుడు సందేశం ప్రచారం అయిందని, అయితే గుండెపోటు వల్లే ఎక్కువ మంది చనిపోతారనడం అబద్ధం అని ఆ రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ పాటిల్ తెలిపారు. హావేరి తాలూకా నిలోగల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈటీటీసీ శిక్షణ సముదాయాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గుండెపోటు కేసులపై వికాస సౌధలో ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్తో ఇటీవల సంయుక్త మీడియా సమావేశం నిర్వహించామన్నారు. ఆ మేరకు అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అయిందన్నారు. గత 6 నెలల గణాంకాల వివరాలు విశ్లేషించాం. దీని కోసం ఓ సమితిని కూడా ఏర్పాటు చేశామన్నారు. సమితి నివేదిక ప్రకారం మరణాల సంఖ్య ఎక్కువ కాలేదన్న సమాచారం ఉందన్నారు. అయితే ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లినందువల్ల భయకంపితులయ్యారు. ఈ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో గుండెపోటు మృతులపై పూర్తి సమాచారం తీసుకున్నాం. అంతేగాక ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండెపోటు వస్తుందన్న తప్పుడు విశ్వాసం ఉంది. గుండెపోటుకు సదరు వ్యాక్సిన్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. -
క్రెడిట్ కాంగ్రెస్ సర్కార్కు.. నిందలు కోహ్లీకి..
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, కర్ణాటక క్రికెట్ ఆసోసియేషన్ కారణమని పేర్కొంటూ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించడంపై బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.ఐపీఎల్లో ఆర్సీబీ విజయానికి క్రెడిట్ కొట్టేయాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దుర్ఘటనలకు మాత్రం ఆర్సీబీ క్రికెటర్ విరాట్ కోహ్లీపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. క్రెడిట్ సొంతం చేసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరాటపడ్డారని చెప్పారు. ఆర్సీబీ యాజమాన్యంతోపాటు శివకుమార్, కర్ణాటక ప్రభుత్వ అధికారుల పిలుపు మేరకు భారీగా జనం తరలివచ్చారని అరవింద్ బెల్లాద్ గుర్తుచేశారు.చిన్నస్వామి స్టేడియంలో జరిగే విజయోత్సవాలకు హాజరు కావాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది డి.కె.శివకుమార్ కాదా? అని ప్రశ్నించారు. దుర్ఘటనకు ఆర్సీబీ కారణమైతే పోలీసులను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని నిలదీశారు. 11 మంది మరణానికి కారణమైన తొక్కిసలాటకు కర్ణాటక ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరొకరిపై నిందలు వేసి తప్పించుకోవాలని చూడడం సరైంది కాదన్నారు. -
ధర్మస్థళలో ఏం జరిగింది?
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థళ. ఇప్పటి వరకు ఇది మంజునాథుడి ఆలయం నుంచి ఆధ్యాత్మిక ప్రాంతంగానే సుపరిచితం. ఈ నెల 3న ఓ న్యాయవాదితో కలిసి అక్కడి పోలీసుస్టేషన్కు వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన తాను దాదాపు 20 ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టానని బాంబు పేల్చాడు. హతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరిపై అత్యాచారం జరిగినట్లు, మరికొందరిపై యాసిడ్ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని అంతా ఉలిక్కిపడేలా చేశాడు. ప్రస్తుతం మానవహక్కుల, మహిళ సంఘాలు నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.ధర్మస్థళ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి మంజునాథ స్వామి ఆలయం ఏళ్లుగా లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయాన్ని నడిపే ట్రస్ట్ కర్ణాటకలోని అత్యంత శక్తిమంతమైన హెగ్డే కుటుంబం నేతృత్వంలో పని చేస్తుంటుంది. అత్యంత సంప్రదాయకమైన ఈ కుటుంబం కేవలం దక్షిణ కన్నడ జిల్లాలోనే కాకుండా ఆ రాష్ట్రంలోనే సామాజిక, రాజకీయంగా శక్తిమంతమైంది. అలాంటి ధర్మస్థళ దేవాలయం సూపర్వైజర్లు, నిర్వాహకులపై మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు కేసు నమోదైంది. ఇందులోని నిజానిజాలు గుర్తించే పనిలో ధర్మస్థళ పోలీసులు ఉండగా... సుజాత భట్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు విభాగం మొత్తం అప్రమత్తమైంది. ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ‘తాను దళితుడినని, 1995 నుంచి 2014 డిసెంబర్ దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని’ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనేక కీలకాంశాలు పొందుపరిచాడు. అంతా ఉలిక్కిపడేలా చేసిన ఆ వివరాలివి....‘‘ఉద్యోగంలో చేరిన తొలినాళ్లల్లో ధర్మస్థళ ఆలయానికి సమీపంలో ఉన్న నేత్రావతి నది వద్ద విధులు నిర్వర్తించా. ఆ పరిసరాలను శుభ్రం చేసే డ్యూటీ నుంచి సూపర్వైజర్ల ఆదేశాల మేరకు హఠాత్తుగా హేయమైన, దారుణ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేసే పని చేయాల్సి వచ్చింది. పురుషులతో పాటు మహిళలు, బాలికలు, చిన్నారుల మృతదేహాలను తీసుకువెళ్లి సమీపంలో ఉన్న అడవిలోని వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టేలా సూపర్వైజర్లు ఆదేశించారు. మొదట్లో ఇవన్నీ నేత్రావతి నదితో పాటు ధర్మస్థళ ప్రాంతానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించినవి భావించా. అయితే కొన్నాళ్లకు ఆ మృతదేహాలను ఉన్న గాయాలు, ఇతర గుర్తులను చూసి అనుమానించాం. దీంతో ఆ మృతదేహాలు ఏమిటి? అంటూ ఆ బాధ్యతలు అప్పగించిన సూపర్వైజర్లను ప్రశ్నించా. పోలీసులకు చెప్పకుండా ఇలా మృతదేహాలను మాయం చేయకూడదని, అసలు విషయం చెప్పకపోతే ఆ పని చేయనని స్పష్టం చేశా. ఆగ్రహానికి గురైన వాళ్లు నన్ను తీవ్రంగా కొట్టారు. తాము చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానంటూ బెదిరించారు. ‘ముక్కలుగా నరికేస్తాం’, ’మీ మృతదేహాన్ని మిగిలిన వాటిలాగే పాతిపెడతాం’, ’మీ కుటుంబాన్ని కూడా ఉండనీయం’ అంటూ వాళ్లు భయపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని కొనసాగించా.కొన్నిసార్లు ఆయా మృతదేహాలపై అత్యాచారం, తీవ్రమైన హింసకు సంబంధించి ఆనవాళ్లు కనిపించాయి. మహిళల మృతదేహాల్లో అనేకం వస్త్రాలు లేకుండా లో దుస్తులు లేకుండా ఉండేవి. వారి శరీరాలపై లైంగికదాడులకు సంబంధించి గుర్తులు, గాయాలు కనిపించేవి. కొన్ని మృతదేహాలకు ఏకంగా గొంతులు కోసి, తీవ్రరక్తస్రావమై ఉండేవి. 1994 నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు ఎన్నో మృతదేహాలను తీసుకువెళ్లి ధర్మస్థళ చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టా. వాటిలో 2010లో పూడ్చిన బాలిక మృతదేహం స్కూల్ యూనిఫాంతో ఉంది. ఆ రోజు సూపర్వైజర్లు నన్ను నేత్రావది నది సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్కు అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రదేశానికి పంపారు. అక్కడే నాకు ఆ బాలిక మృతదేహం కనిపించింది. అప్పట్లో ఆమె వయస్సు 12 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండచ్చు. ఆమె శరీరంగా లైంగిక దాడికి సంబంధించిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి.యాసిడ్ దాడిలో ముఖం, చేతులు కాలిపోయి ఉన్న మహిళలవి, గొంతు పిసికి చంపిన పురుషుల మృతదేహాలు కూడా తీసుకువెళ్లి పాతిపెట్టి వచ్చా. నా సమక్షంలోనూ కొందరిని చంపిన సూపర్వైజర్లు ఆ శవాలను మారుమూల అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టించారు. 1998లో వారికి ఎదురు తిరగడంతో తీవ్రంగా కొట్టారు. నా ప్రాణంతో పాటు నా కుటుంబ ప్రాణాల కోసం 2014 వరకు ఈ పని చేశా. ఆ ఏడాది డిసెంబర్లో సూపర్వైజర్ల సంబంధీకుడు నా కుటుంబానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో నా ఉద్యోగంతో పాటు ధర్మస్థళ వదిలి కుటుంబంతో సహా పారిపోయా. ఇతర రాష్ట్రంలో తలదాచుకున్నా... నాకు, నా కుటుంబానికి హాని తప్పదనే భయం నిత్యం వెంటాడుతూనే ఉంది. అప్పట్లో జరిగిన దారుణాలను బయటకు చెప్పాలని ఇటీవల తిరిగి వచ్చా’’ అని పేర్కొన్నాడు.ధర్మస్థళకు వచ్చిన వెంటనే తాను అప్పట్లో ఓ శవాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్లానని పోలీసుల దృష్టికి తెచ్చాడు. అక్కడ తవ్వి కొన్నేళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని తవ్వి తీశానంటూ కొన్ని ఫొటోలను తన ఫిర్యాదుతో జత చేసి ధర్మస్థళ పోలీసులకు అందించాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ ఇవ్వాలని కోరాడు. పోలీసులు తనతో వస్తే తాను మృతదేహాలను పాతిపెట్టిన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్తాననీ పేర్కొన్నాడు. ఆ మృతదేహాలను బయటకు తీసి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేయాలని ఆశిస్తున్నానని, అలా చేస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, తనలో ఉన అపరాధ భావం పోతుందని సదరు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు. అప్పట్లో మృతదేహాలను మాయం చేయాలని ఆదేశించిన వారిలో సూపర్వైజర్లతో పాటు ఆలయ పాలకమండలి సభ్యులూ ఉన్నట్లు వివరించాడు. ప్రాణభయంతోనే వారి పేర్లు చెప్పలేదని, పలుకుబడి ఉన్న వారి నుంచి తనకు రక్షణ కావాలని కోరాడు. పోలీసుల ఆ భరోసా ఇస్తే అన్ని పేర్లు చెప్తానని అన్నాడు. ఈ ఫిర్యాదును కోర్టుకు నివేదించిన ధర్మస్థళ పోలీసులు న్యాయమూర్తి అనుమతితో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.- శ్రీరంగం కామేష్త్వరలో మరిన్ని వివరాలు.. -
నీట్, యూపీఎస్సీలలో ఓటమి..ఇవాళ రోల్స్ రాయిస్లో రూ. 72 లక్షలు..
వరుస ఓటములు కొందరిని కుంగదీసి ఏమి చేయలేని స్థితికి చేరుస్తాయి. కొందరికి అవి మరింతగా బలంగా పుంజుకోవడానికి దోహదపడి..ఎవ్వరూ ఊహించనంత స్థాయికి చేరుస్తాయి. గెలవాలన్న దృఢ సంకల్పం, వెనక్కి తగ్గని పట్టుదల ఉన్నవారే ఫెయిల్ అనే పదానికి సరైన అర్థం ఇచ్చేలా గెలిచి చూపిస్తారు. అలాంటి ఘనతనే సాధించింది ఈ కర్ణాటక అమ్మాయి. అంతేగాదు చిన్న వయసులోనే యూకే ఆధారిత విమానాయన దిగ్గజం రోల్స్ రాయిస్లో భారీ వేతనంతో పనిచేసే అవకాశాన్ని అందుకుని శెభాష్ అనిపించుకుంది. కర్ణాటకలోని తీర్థహళ్లి తాలూకాలోని కోడూరుకి చెంఇన రీతూపర్ణ సెయింట్ ఆగ్నెస్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, నీట్ ద్వారా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీటు సంపాదించాలనుకుంది. అందులో విఫలమవ్వడంతో తీవ్రంగా నిరుత్సాహపడింది. డాక్టర్ కావాలన్నది ఆమె కల..కానీ అది చూస్తుండగానే ఆవిరైపోయింది. సరిగ్గా ఆ సమయంలో రీతూపర్ణ తండ్రి ఆమెను ఇంజనీరింగ్ వైపుకి వెళ్లమని సూచించారు. అలా ఆమె 2022లో మంగళూరులోని సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ (SCEM)లో సెట్ ద్వార్ అడ్మిషన్ పొంది ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యింది. కాలేజ్ మొదటి రోజు నుంచే శ్రద్ధగా చదవడం మొదలు పెట్టింది. అలా ఆమె ఆటోమేషన్ పట్ల ఆకర్షితురాలై రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ వైపుకి వెళ్లింది. తన సీనియర్ విద్యార్థుల నుంచి ప్రేరణ పొంది..ప్రభావవంతమైన ప్రాజెక్టులను రూపొందించడం ప్రారంభించింది. రోబోలు నిర్మించడం..పతకాలు గెలుపొందడం..తన బృందంతో కలిసి రితుపర్ణ వక్క రైతుల కోసం రోబోటక్ స్ప్రేయర్ హార్వెస్టర్ని నిర్మించింది. గోవాలో జరిగిన అంతర్జాతీయ ఇనెక్స్లో జరిగిన పోటీలో ఈ రోబోలిక్ స్ప్రేయర్ బంగారం, వెండి పతకాలను గెలుచుకుంది. ఆ పరిజ్ఞానమే తనకు నిట్కే సూరత్కల్లో రోబోటిక్ సర్జరీపై పరిశోధన చేసేందుకు దోహదపడింది. దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ ములై ముహిలన్ ఎంపీతో నేరుగా సంభాషించి, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం మొబైల్ యాప్ని డెవలప్ చేయడంలో సహాయపడింది. మంచి గుర్తింపు కోసం..తన పరిజ్ఞానంతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో రీతూపర్ణ ఇంటర్న్షిప్ కోసం రోల్స్ రాయిస్ను సంప్రదించింది. కంపెనీ ప్రారంభంలోనే ఆమె అవకాశాలను తోసిపుచ్చింది. అలా ఒక నెలలో కేటాయించిన పనిని కూడా పూర్తి చేయలేకపోయింది రీతూపర్ణ. దాంతో ఒక్క ఛాన్స్ అంటూ ఒక్క నెల గడువుతో పూర్తి చేసే మరో సవాలుని తీసుకోవాల్సి వచ్చింది. అయితే దానిని ఆమె కేవలం ఒక వారంలోనే పూర్తి చేసింది. రీతూ సామర్థ్యం చూసి ఇంప్రెస్ అయిన రోల్స్ రాయిస్ మరో అసైన్మెంట్ ఇచ్చింది. అలా ఎనిమిది నెలలు కష్టతరమైన ప్రాజెక్టులు, ఇంటర్వ్యూలతో గడిచిపోయింది. చెప్పాలంటే తన ఆరవ సెమిస్టర్లో కాలేజ్కి డుమ్మా కొట్టి మరీ యూకే వర్క్షిప్ట్స్లో పనిచేసింది. అలా డిసెంబర్ 2024 నాటికి 39.6 లక్ష ప్రీ ప్లేసమెంట్ ఆఫర్ అందుకుంది. ఇక ఏప్రిల్ 2025 నాటికి తన పనితీరుతో రూ. 72.3 లక్షలకు వేతన ఆఫర్ని అందుకుంది. అమెరికాకు వెళ్లనుంది..రీతూపర్ణ తన ఏడో సెమిస్టర్ పూర్తి చేసిన తదనంతరమే రోల్స్ రాయిస్లో పూర్తి సమయం పనిచేసేందుకు యూఎస్ఏలోని టెక్సాస్కు వెళ్లనుంది. అక్కడ ఆమె జెట్ ఇంజిన్ తయారీ యూనిట్లో పనిచేయనుంది. ఆమె ఈ కంపెనీలోకి ప్రాబ్లం సొల్యూషన్ అనే ప్రతిష్టాత్మక డీసీ ఫెలోషిఫ్ ప్రోగామ్ ద్వారా ఎంపికైంది. ఆమె తోపాటు కన్నడ నుంచి సుమారు 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కాగా ఆమె డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ లారెన్స్ జోసెఫ్ ఫెర్నాండెజ్ రీతూపర్ణ విజయాన్ని కళాశాలకు గర్వకారణమైన క్షణంగా అభివర్ణించడమే గాక ఔత్సాహిక యువ ఇంజనీర్లకు ప్రేరణగా నిలిచిందని కొనియాడారు. చివరగా రీతూపర్ణ మాట్లాడుతూ.."ఇటీవల యువత చాలా పెద్ద కలలు కంటున్నారు గానీ 50% మాత్రమే ఔట్పుట్ ఇస్తున్నారు. కానీ విజయం సాధించాలంటే 200% ఔట్పుట్ ఇవ్వాలి. దృఢ సంకల్పంతో ఉంటూ మూలాల్ని మర్చిపోకూడదు. అప్పుడే గెలుపు తీరాన్ని అందుకోగలమని చెబుతోంది." రీతూపర్ణ.(చదవండి: మహాత్మా గాంధీ అరుదైన పెయింటింగ్..వేలంలో ఏకంగా..!) -
బెంగళూరులో దారుణం.. విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం
బెంగళరూరు: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగుచూసింది. క్లాస్లో పాఠాలకు సంబంధించి ఓ విద్యార్థినికి టెక్ట్స్ మెసేజ్ చేసిన లెక్చరర్.. ఆపై సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఫ్రెండ్ రూమ్కు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై మరొక లెక్చరర్, అతని ఫ్రెండ్ కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూడటంతో బెంగళూరులో తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటకలోని ఓ విద్యార్థినిని ఫిజిక్స్ బోధించే లెక్చరర్ నరేంద్ర పరిచయం చేసుకున్నాడు. చదువులో సాయంతో పరిచయాన్ని సాన్నిహిత్యంగా మార్చుకున్నాడు. ఇలా అనూప్ అనే స్నేహితుడి రూమ్కి తీసుకెళ్లాడు. అక్కడ అనూప్ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డ వీడియోను చూపించి మరొక లెక్చరర్ సందీప్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ విద్యార్థినిని నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వీరు కర్ణాటక మహిళా కమిషన్ను ఆశ్రయించడంతో విషయం బయటకొచ్చింది. దీంతో మారతహళ్లి పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇద్దరు లెక్చరర్లు సహా స్నేహితుడు అనూప్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇదిలావుంచితే, ఒడిశాలో కూడా ఇదే తరహా దారుణం ఇటీవల చోటు చేసుకుంది. తనను లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్పై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసి ప్రాణాలు తీసుకుంది. ప్రిన్సిపాల్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాలాసోర్ బీఈడీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. ఒంటికి నిప్పంటించుకుని 90 శాతం కాలిన గాయాల పాలైన ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది. ముందే చెబుతున్నా.. న్యాయం జరగకపోతే.. -
పల్లెకు పరిచయమైన "వర్చువల్ రియాలిటీ గేమింగ్".. స్పందన మామూలుగా లేదు..!
వర్చువల్ రియాలిటీ గేమింగ్ (VR Gaming) అనేది గేమింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన సాంకేతికత. ఇది ఆటగాళ్లను త్రిమితీయ (3D) వాతావరణంలోకి తీసుకెళ్లి, నిజంగానే ఆ ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ క్రీడలను VR హెడ్సెట్, మోషన్ కంట్రోలర్ లాంటి సాధనాలను ఉపయోగించి ఆడతారు. VR Gamingను కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విద్య, శిక్షణ, వైద్య రంగాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని పెద్దపెద్ద నగరాల్లో మాత్రమే ఈ VR Gaming సెంటర్లు వెలిశాయి.Few youths opened a "Virtual Reality Gaming Centre" in Karnataka 's village. The response was overwhelming 🤩 pic.twitter.com/hNTfIY0qoQ— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) July 14, 2025అయితే, ఇటీవల కర్ణాటకలోని హసన్ జిల్లాకు కొందరు ఔత్సాహిక యువకులు ఈ VR Gamingను ఓ మారుమూల పల్లెకు పరిచయం చేశారు. టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని ఆ పల్లె ప్రజలు ఈ కాల్పనిక క్రీడలను తెగ ఎంజాయ్ చేశారు. సదరు యువత ఇచ్చిన Meta Quest VR Headsetలను ధరించి నిజంకాని ప్రపంచంలోకి వెళ్లిపోయారు.పిల్లలు, మహిళలు, వృద్దులు అన్న తేడా లేకుండా ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరు VR Gamingతో కలిగిన కొత్త అనుభూతిని ఆస్వాధించారు. VR Gaming ద్వారా బాక్సింగ్, బిల్డింగ్పై నడవడం లాంటి కాల్పనిక క్రీడలను ఆడారు. ఈ VR Gaming కేంద్రానికి విశేషమైన స్పందన రావడంతో సదరు యువకులు దీనికి సంబంధించిన వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు కూడా విపరీతమైన స్పందన వస్తుంది. -
కోటి ఖర్చు పెడతా... ట్రాఫిక్ సమస్యను తీర్చేద్దాం!
మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యల గురించి నిత్యం వింటూనే ఉన్నాం.. చినుకుపడితే చాలు.. కిలోమీటర్ల జామ్లు.. గతుకుల రోడ్లు, కార్పొరేషన్ల తవ్వకాలు.. పూర్తికాని నిర్మాణాలు..ట్రాఫిక్ చిక్కులకు బోలెడు కారణాలు ఉండవచ్చు కానీ.. పరిష్కార మార్గాలు మాత్రం గగన కుసుమాలే! వీటన్నింటితో ప్రశాంత్ పిట్టి ఎంత విసిగిపోయాడో కానీ.. ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టాల్సిందేనని తీర్మానించాడు! కోటి రూపాయలు ఖర్చు పెడతా కలిసి రండని ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లకు పిలుపునిచ్చాడు!కర్ణాటక రాజధాని బెంగళూరును ఒకప్పుడు ఉద్యాన నగరి అని పిలుచుకునేవారు కానీ ఇప్పుడది వాహనాల పద్మవ్యూహం! అభిమన్యుడు సైతం ఛేదించలేని దుర్భర నరకం! ‘ఈజ్ మై ట్రిప్’ కంపెనీ వ్యవస్థాపకుడిగా ఎందరి ప్రయాణాలనో సులభతరం చేసిన ప్రశాంత్ పిట్టికి కూడా బెంగళూరు ట్రాఫిక్ రోజూ సవాళ్లు విసురుతూనే ఉంది. మొన్నటికి మొన్న శనివారం అర్ధరాత్రి.. 11.5 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 145 నిమిషాల టైమ్ పట్టిందట.ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఉద్దేశించిన ఔటర్ రింగ్ రోడ్డులోనే ఒక చోట సుమారు వంద నిమిషాలు ఇరుక్కుపోయానని, అక్కడ కనీసం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదా సిగ్నల్ కానీ లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని వాపోయాడు ప్రశాంత్! ఈ జామ్లతో విసిగిపోయిన ప్రశాంత్... తన ఎక్స్ అకౌంట్లో ఒక ప్రకటన చేశాడు. ‘‘కోటి రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధం. గూగుల్ మ్యాప్స్, కృత్రిమ మేధల సాయంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్న ప్రాంతాలను గుర్తిద్దాం’’ అని కోరాడు.గూగుల్ మ్యాప్స్కు శాటిలైట్ ఇమేజరీ తోడు...ఈ ఏడాది ఏప్రిల్లో గూగుల్ మ్యాప్స్ ‘‘రోడ్ మేనేజ్మెంట్ ఇన్సైట్’’ పేరుతో కొన్ని వివరాలు ఇవ్వడం మొదలుపెట్టిన విషయాన్ని ప్రస్తావించాడు ప్రశాంత్. ఏ రోడ్డులో ట్రాఫిక్ ఉన్నదో గుర్తించి ఇంకోమార్గంలో వెళ్లమని సూచిస్తుందన్నమాట ఈ రోడ్ మేనేజ్మెంట్ ఇన్సైట్. దీనికి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా అందే సమాచారాన్ని జోడించి బెంగళూరు నగరం మొత్తమ్మీద ట్రాఫిక్ను అడ్డుకునే ఇరుకు ప్రాంతాలను గుర్తిద్దామని ప్రశాంత్ పిలుపునిచ్చాడు. ఒక నెలరోజులపాటు గమనిస్తే ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందో తెలిసిపోతుందని, ఆ తరువాత ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించగలరని వివరించాడు.I am committing INR 1 Cr to find Bangalore Choke-Points via Google Maps & AL.11 km → 2.15 hours in Bangalore Traffic on Saturday late night!I was stuck at one choke-point at ORR, where I spent 100 mins struggling to understand why there is no traffic-light or cop here!But… pic.twitter.com/b8Nf5vnUKf— Prashant Pitti (@ppitti) July 14, 2025ఈ పని తన ఒక్కడి వల్లే కాదన్న ఆయన ఒకరిద్దరు ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లు కలిసిరావాలని కోరాడు. గూగుల్ మ్యాప్స్, జీపీయూ, ఏపీఐ కాల్స్, ఉపగ్రహ ఛాయాచిత్రాల కోసం కావాల్సిన మొత్తాలతో కలిపి ఈ ప్రాజెక్టు కోసం కోటి రూపాయల వరకూ తాను ఖర్చు పెడతానని కూడా ప్రకటించాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు, కార్పొరేషన్లు ఇప్పటికే సేకరిస్తున్న సమాచారాన్ని అందించడంతోపాటు... తామిచ్చే సలహా, సూచనలను పాటించేందుకు ఒక టీమ్ను ఏర్పాటు చేస్తే చాలు పని మొదలుపెడతానని చెప్పారు.బెంగళూరు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులకు తెలిసేంతవకూ తన ట్వీట్ను ట్యాగ్ చేయాలని పిలుపునిచ్చాడు. అలాగే ఈ పనిలో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇంజినీర్లు తన ట్వీట్కు ‘ఇన్’ అని కామెంట్ చేయాలని, ట్రాఫిక్ కారణంగా సమయం వృథా అవుతోందని భావిస్తున్న వాహనదారులందరూ ట్వీట్పై కామెంట్ చేయడంతోపాటు నలుగురికి షేర్ చేయాలని కోరారు. ఆల్ ద బెస్ట్ ప్రశాంత్ పిట్టి!. -
600 మీటర్ల లోతు నీటి గుహలో ప్రయాణం..నరసింహ స్వామి దర్శనం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
ఫొటో తీస్తానని.. నదిలోకి నెట్టేసి..
కృష్ణా: కొత్తగా పెళ్లయిన జంట.. బైక్పై వెళ్తూ మాంచి లొకేషన్ కనిపిస్తే ఫొటోలు తీసుకోవాలని ముచ్చటపడ్డారు. వారు వెళ్తున్న దారిలో కృష్ణానదిపై గుర్జాపూర్ బ్రిడ్జి వచి్చంది. అదే మంచి స్పాట్ అనుకొని ఫొటోలు దిగటానికి సిద్ధమయ్యారు. భర్త తన భార్యకు ఫోన్ ఇచ్చి.. తనను ఫొటోలు తీయాలని కోరి వెళ్లి బ్రిడ్జి అంచున నిలబడ్డాడు. భార్య కూడా ఫొటోలు తీస్తూనే భర్త వద్దకు వెళ్లి ఒక్కసారిగా అతన్ని నదిలోకి తోసేసింది. బిక్కచచ్చిపోయారు భర్త నీళ్లలో పడి కొట్టుకుపోతూ.. నదిలో ఓ రాయిని పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. అతడి కేకలు విని జాలర్లు రక్షించి పైకి తీసుకొచ్చారు. అయితే, భార్యే తనను నదిలోకి తోసిందని భర్త చెబుతుండగా, లేదులేదు.. అతడే నదిలో పడిపోయాడని భార్య వాదిస్తోంది. ఏం చేయాలో తెలియని పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులో నారాయణపేట జిల్లాలో ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. ప్రమాదమా? హత్యాయత్నమా? కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్కు చెందిన తాతప్ప (23)కు యాద్గిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మ (20)తో మూడు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఇద్దరు బైక్పై వడిగేరికి వెళ్లి శనివారం ఉదయం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. భర్త తన ఫోన్ను భార్య చేతికి ఇచ్చి ఫొటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫొటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది. నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి ‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’అంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచి్చన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేయగా.. భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది. ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ బస్వరాజ్ను వివరణ కోరగా ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆదివారం ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు. -
గుహలో తన ఇద్దరు పిల్లలతో రష్యన్ మహిళ నివాసం.. ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే?
గత రెండు వారాలుగా ఓ రష్యన్ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రమాదకరమైన గుహలో నివసిస్తున్న ఘటన కర్ణాటకలో సంచలనం రేపింది. ఉత్తర కన్నడ జిల్లా కుమ్టా తాలూకాలోని రామతీర్థ కొండల్లోని మారుమూల గుహ నుంచి నినా కుటినా అలియాస్ మోహి (40), ఆమె ఇద్దరు పిల్లలను పోలీసులు రక్షించారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటల సమయంలో గోకర్ణ పోలీసులు పర్యాటకుల భద్రత కోసం గోకర్ణ అడవి ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. గుహ వద్ద వారి కదలికలు కనిపించాయి. ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గుహలో నివసిస్తున్నట్లు కనుగొన్న పోలీసులు.. వారిని కాపాడారు.కొన్నేళ్ల క్రితం బిజినెస్ వీసాపై భారత్కు వచ్చిన మోహి.. గోవా నుంచి ఆధ్యాత్మిక తీర ప్రాంతమైన గోకర్ణకు చేరుకుంది. ఆమె వీసా గడువు కూడా ముగిసింది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఆకర్షితురాలైన ఆమె తన ఇద్దరు పిల్లలు ప్రయా (6), అమా (4)లతో కలిసి రెండు వారాల క్రితం గోకర్ణలోని దట్టమైన అటవీప్రాంతంలోకి వెళ్లింది. అక్కడ ఒక గుహలో తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసించడం ప్రారంభించింది.ఆ గుహను ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేసిన ఆ మహిళ.. రుద్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు పూజలు నిర్వహించేంది. నిత్యం ధ్యానం చేస్తూ రోజులు గడిపింది. అయితే ఆ మహిళ, ఆమె పిల్లలు అడవిలో ఉన్న సమయంలో ఆహారాన్ని ఎలా సంపాదించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2024 జూలైలో గుహ ఉన్న రామతీర్థ కొండ ప్రాంతం నుంచి పెద్ద పెద్ద కొండచరియలు విరిగిపపడ్డాయి. విష పూరిత పాములు సహా ప్రమాదకరమైన వన్య ప్రాణులకు నిలయమైన ఆ ప్రాంతం. చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా పోలీసులు తెలిపారు. ఆ రష్యన్ మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసుల బృందం.. కొండ కిందకు తీసుకెళ్లింది. ఆమె అభ్యర్థన మేరకు కుంటా తాలూకాలోని బంకికోడ్ల గ్రామంలో 80 ఏళ్ల మహిళా సన్యాసిని యోగరత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు. మోహి వీసా గడువు 2017లోనే ముగిసిందని అధికారులు తెలిపారు. ఆమె భారత్లో ఎంత కాలం నుంచి ఉంటుందో తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సాయంతో రష్యా రాయబార కార్యాలయాన్ని అధికారులు సంప్రదించారు. -
సెల్పీ దిగుదాం రా బావా..!
భార్యభర్తల బంధాలకు ఈ మధ్యకాలంలో అనూహ్య ముగింపు లభిస్తోంది. వివాహేతర సంబంధాలతోనో, పాత పరిచయాల కోసమే ఒకరినొకరు కడతేర్చుతున్న ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సెల్ఫీ కోసం ఓ బ్రిడ్జి మీద ఆగిన కొత్తజంట.. వీడియోతో నెట్టింట రచ్చ చేస్తోంది. తన బావ(భర్త) ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడని ఆ నవవధువు, లేదు తన భార్యే తనను తోసేసి చంపాలని చూసిందని ఆ భర్త హల్ చల్ చేశారు. కర్ణాటక రాయ్చూర్లో తాజాగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..కాడ్లూరు సమీపంలో కృష్ణా నది వంతెన మీదుగా బైక్ మీద వెళ్తున్న ఓ జంట ఆగింది. కాసేపటికే ఆ వ్యక్తి చేతులు ఊపుతూ సాయం కోసం అరవసాగాడు. ఈలోపు వంతెన మీద ఉన్న అతని భార్య దారినపోయే వాళ్లను రక్షించమని సాయం కోరుతూ కనిపించింది. ఇది గమనించిన మత్స్యకారులు కొందరు తాడు సాయంతో ఆ వ్యక్తిని వంతెన పైకి తీసుకొచ్చారు. తమకు ఈ మధ్యే వివాహం అయ్యిందని, సెల్ఫీ దిగుదామని తన భార్య కోరిందని.. ఆ సమయంలో ఆమె తనను నీళ్లలోకి తోసేసిందని, ఎలాగోలా వచ్చిన కాస్త ఈతతో ఈదుకుంటూ బండరాళ్ల మీదకు చేరానని, తనను చంపేందుకు కుట్ర పన్నిందని సదరు వ్యక్తి వాపోయాడు. అయితే కాలు జారి తన భర్త నదిలో పడిపోయాడని, తనకు ఎలాంటి పాపం తెలియదని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఆ జంటను స్థానికంగా ఉన్న పీఎస్కు తీసుకెళ్లగా.. వాళ్లు పెద్దల సమక్షంలో ఆ జంటకు కౌన్సెలింగ్ ఇప్పించి పంపించినట్లు తెలుస్తోంది.A newlywed man in #Raichur was allegedly pushed into the River by his wife during a photoshoot near Gurjapur Bridge.He clung to rocks & was rescued by fishermen.The wife claimed it was accidental but husband accused her of a deliberate act.Police are investigating the viral video pic.twitter.com/4Da9x8ShXx— Yasir Mushtaq (@path2shah) July 12, 2025 -
భార్య ముక్కు కొరికేసిన భర్త.. అసలేం జరిగిందంటే?
బెంగళూరు: ఓ భర్త.. భార్య ముక్కును కొరికేసిన ఘటన కర్ణాటకలోని దేవనగరిలో కలకలం సృష్టించింది. అప్పు చెల్లింపు విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో కోపంతో భార్య ముక్కును కొరికాడు. భార్య విద్య అప్పు తీసుకోగా, భర్త విజయ్ పూచీకత్తు ఇచ్చాడు. విద్య.. కిస్తీలు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.మంగళవారం జరిగిన ఈ గొడవలో భార్యపై దాడి చేశాడు.. ఆమె నేలపై పడిపోగా.. తర్వాత విజయ్ ఆమె ముక్కును కొరికేశాడు. ఆమెను స్థానికులు వెంటనే చిన్నగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ముక్కుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.విద్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, విజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటగా శివమొగ్గలోని జయనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, పరిధి ఆధారంగా దావణగేరె జిల్లా చిన్నగిరి పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ చేశారు. -
కిటికీలో కృష్ణుడు, సముద్రంలో సూర్యుడు
ఉడుపి: ఆహారం కాదు అంతకు మించి... ‘ఉడుపి’ (Udupi) అనే పదం వినగానే, నోట్లో కరిగిపోయే ఇడ్లీ, కరకరలాడే మసాలా దోస, ఇంట్లో రుచికరమైన పరిమళలాలు వెదజల్లే సాంబార్ గిన్నె గుర్తొస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఉడుపి హోటల్స్ దానికి కారణం కావచ్చు. కానీ ఉడుపి అంటే అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన ఆహారం వండే శైలి, పదార్ధాలు మాత్రమే కాదు. కర్ణాటకలోని ఈ మనోహరమైన తీరప్రాంత పట్టణం వైవిధ్య భరిత సంస్కృతి ఆధ్యాత్మికతతో నిండింది, దాని పురాతన దేవాలయాలు, నిశ్శబ్ద బీచ్లు, దట్టమైన అటవీ ప్రాంతాలు ఉత్సాహభరితమైన మార్కెట్లు అన్నింటికీ మించిన గొప్ప చరిత్రతో. ఇక్కడ భక్తి రోజువారీ జీవితాన్ని మేళవించుకుని ఉంటుంది. పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.అందుకే ఉడుపి అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు మరెన్నో అందాలు, ప్రకృతి సౌందర్యాలకు చిరునామా కూడా. ఉడుపి పర్యాటకులు సందర్శించాల్సిన ప్రాంతాల్లో...కృష్ణ దేవాలయం..ఇక్కడి శ్రీ కృష్ణ దేవాలయం తప్పక సందర్శించాల్సిన 13వ శతాబ్ధపు ప్రాచీన దేవాలయం, ఆధ్యాత్మిక వేత్త గురు మాధవాచార్య దీనిని నిర్మించారు. ఈ ఆలయ ప్రధాన వైవిధ్యం నవగ్రహ కిటికీ,9 రంధ్రాలు కలిగిన వెండి పూత పూసిన కిటికీ ద్వారా మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడి వంటశాల ద్వారా వేల మందికి ఉచితంగా రోజూ అన్నదానం జరుగుతుంటుంది. అలాగే అనంతేశ్వర–చంద్రమౌలేశ్వర దేవాలయాలు కూడా ఈ మందిరం దగ్గరే ఉన్నాయి. అనంతేశ్వరేశ్వరాలయాన్ని 8వ శతాబ్దంలో ఆలుపా రాజవంశంలోనిర్మించారు. అంబల్పాడి మహాకాళి దేవాలయం జానార్దన స్వామి దేవాలయం ఎదురుగా, ఉండే ఈ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉంది.తీరప్రాంత ఆస్వాదన కోసం ఉడుపి పట్టణం నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్పే బీచ్ బంగారు ఇసుక అంతులేని సముద్రపు మిశ్రమాన్ని అందిస్తుంది. చల్లని గాలులతో కూడిన ఉదయం నడక, సీఫుడ్ లేదా పారాసెయిలింగ్ జెట్ స్కీయింగ్ వంటివి ఆస్వాదించాలనుకుంటే, ఇది బెస్ట్ ప్లేస్. దీనికి కొద్ది దూరంలో ఉన్న సెయింట్ మేరీస్ ద్వీపం, అద్భుతమైన షడ్భుజాకార బసాల్ట్ రాతి నిర్మాణాలు మెరుపు జలాలతో కూడిన భౌగోళిక అద్భుతం. కాలికట్ చేరుకోవడానికి ముందు వాస్కోడగామా మొదట ఇక్కడ అడుగు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి.సూర్యుడు సముద్రంలో కలిసిపోయే అద్భుతమైన దృశ్యాలు లైట్హౌజ్లో నుంచి చూడాలంటే ఇక్కడి కౌప్ బీచ్ కి వెళ్లాలి. 1901లో నిర్మితమైన ఈ లైట్హౌజ్ ప్రధాన ఆకర్షణగా కలిగిన ఈ బీచ్కు ఉడుపి నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. ఇదే కాకుండా నదీ సముద్రాల అరుదైన సంగమాన్ని మనకు చూపించే డెల్టా బీచ్, దాదాపు 40 కి.మీ దూరంలో ఉన్న కుడ్లు తీర్థ వాటర్ ఫాల్స్ ప్రకృతి ప్రేమికులకు కనువిందే. దాదాపు 120 ఏళ్ల క్రితం హజీ అబ్ధుల్లా సాహెబ్ నిర్మించిన కాయిన్ మ్యూజియం మన దేశపు ఆర్ధిక మూలాలను విశేషాలను మనకు దర్శింపజేస్తుంది. ఇవే కాక మరెన్నో పూరాతన -దేవాలయాలు, , 8వ శతాబ్దపు శిల్ప సంపద వంటివి ఉడుపిని కేవలం ఒక ఆహార నగరంగా చూడడం ఎంత తప్పో మనకు తెలియజేస్తాయి. -
గుండెపోటు భయాలు.. ఆ ఒక్క ఆస్పత్రికే వేలమంది క్యూ!
గుండె సమస్యలతో ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోతున్న ఉదంతాలు నిత్యం చూస్తున్నాం. కర్ణాటక హసన్ జిల్లాలో 40 రోజుల వ్యవధిలో 23 మంది మరణించారు. ఈ కథనాలు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందునా 25-40 మధ్యవయసున్న వాళ్లే ఎక్కువగా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది.దేశంలో నిత్యం ఏదో ఒక మూల హఠాన్మరణం ఘటన చోటు చేసుకుంటోంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వ్యక్తులు, ఎలాంటి అరోగ్య సమస్యలు లేని వ్యక్తులు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణం విడుస్తున్నారు. హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్టులతోనే వాళ్లు చనిపోతున్నారని డాక్టర్లు సైతం నిర్ధారిస్తున్నారు. దీంతో కొందరు ఎలాంటి లక్షణాలు లేకున్నా పోటు తప్పదని అంచనాకి వస్తున్నారు. ఈ క్రమంలో..ముందస్తుగా గుండె పరీక్షలు చేయించుకుంటున్నారు. కర్ణాటక మైసూర్లోని ప్రముఖ జయదేవ ఆస్పత్రికి గత మూడు నాలుగు రోజుల నుంచి వేలమంది జనం క్యూ కట్టారు. ఓపీ కోసం వేకువ జాము నుంచే ఆస్పత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. క్యూ లైన్లలో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. మైసూర్తో పాటు బెంగళూరు బ్రాంచ్ ముందు కూడా ఇదే పరిస్థితి. జయదేవ ఆస్పత్రి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అటానమస్ ఆస్పత్రి.ಮೈಸೂರು: ರಾಜ್ಯದಲ್ಲಿ ಹೃದಯಾಘಾತ ಹೆಚ್ಚಿದ ಹಿನ್ನಲೆ, ಜಯದೇವ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಬೆಳಿಗ್ಗೆಯಿಂದಲೇ ಕ್ಯೂ.#mysore #jayadevahospital #newskarnataka pic.twitter.com/KJDtN2DwwV— News Karnataka (@Newskarnataka) July 8, 2025VIDEO Credits: News Karnatakaఅయితే మీడియా కథనాలతో, సోషల్ మీడియా ప్రచారాలతో ఆందోళన చెందవద్దని జయదేవ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కేఎస్ సదానంద ప్రజలకు సూచిస్తున్నారు. ‘‘జనాలు అంతా ఒక్కసారిగా ఇక్కడికి ఎగబడినంత మాత్రాన.. సమస్య పరిష్కారం కాదు. కేవలం పరీక్షలు చేసుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఊహాగానాలకు అతిగా స్పందించొద్దు. మీరు ఆస్పత్రులకు ఎగబడడం వల్ల.. అత్యవసర పరిస్థితి ఉన్న రోగులకు చికిత్సలో అంతరాయం కలగవచ్చు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకున్న మాత్రాన సమస్య పరిష్కారం కాదు. మంచి ఆహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి’’ అని సూచించారాయన.హసన్ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. వీటిపై విచారణకుత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తాజాగా నివేదికను సమర్పించింది కూడా. అదే సమయం కోవిడ్ వ్యాక్సిన్ల పనితనం గురించి ఆయన అనుమానాలు వ్యక్తం చేయగా.. కేంద్ర ఆరోగ్య శాఖ పలు అధ్యయనాలను ప్రస్తావిస్తూ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. -
ఐఏఎస్ కల చెదిరింది
కర్ణాటక: రాష్ట్రంలో గుండెపోటు మరణాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. తమ ఆప్తులు కళ్లముందే తిరిగి రాని లోకాలకు వెళ్తుంటే కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత 24 గంటల్లో పలు జిల్లాలలో 7 మంది వరకూ హఠాన్మరణం పాలయ్యారు. కలబుర్గి జిల్లా చించోళి తాలూకా చందనకేరాలో మెహసిన్ ఒశా పటేల్ (22) అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలాడు. ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. ఇతనికి గత నెల 15న పెళ్లయింది. ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబీకులు విలపించారు. కాగా, కలబురగి జిల్లా వ్యాప్తంగా ఆరు నెలల నుంచి గుండెసమస్యలతో 40 మంది వరకు చనిపోయినట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో 15 మంది 45 ఏళ్ల లోపువారు. సివిల్స్ కలలు భగ్నంహుబ్లీ: సివిల్స్ పరీక్షల్లో పాస్ కావాలి, ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలనేది ఆమె కల. కానీ మాయదారి గుండెపోటు ఆ కలల్ని ఛిద్రం చేసింది. బుధవారం ధార్వాడ పురోహిత నగరలో జీవిత కుసగూర (26) అనే విద్యావంతురాలు ఆకస్మికంగా మరణించింది. ఉదయం ఇంట్లో ఉండగా తల తిప్పినట్లుగా ఉందని చెబుతూ కూర్చుండిపోయింది. కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే శ్వాస వదిలింది. ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించగా గుండెపోటుతో మరణించిందని ప్రకటించారు. ఎంఎస్సీ అగ్రిక ల్చర్ చదువుతున్న జీవిత యూపీఎస్ఈ పరీక్షలు రాసి ఐఏఎస్ అధికారి కావాలని కలలు కంది. ఈమె తండ్రి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. బిడ్డ చిరుప్రాయంలోనే మృత్యువాత పడటంతో కన్నీటి సంద్రంలో మునిగి పోయారు. పారిశ్రామికవేత్త కొడుకు.. దావణగెరె నగరంలోని జయనగరలో పారిశ్రామికవేత్త రేఖా ముర్గేశ్ కొడుకు అక్షయ్ (22) ఇంటిలో గుండెపోటుతో కిందపడి మరణించాడు. ఇతడు కాలేజీలో చదివేవాడు. ఎలాంటి అనారోగ్యం లేదని తెలిసింది. బెళగావిలో రైతు.. బెళగావి జిల్లా సవదత్తి పట్టణంలోని ఎపిఎంసీలో వాహన డ్రైవర్ అశోక్ జీరిగవాడ (40) కుప్పకూలి మృతి చెందారు. రైతు అయిన అశోక్ తన పొలంలో పెసర్లను అమ్మడానికి వచ్చి ప్రాణాలు విడిచాడు. కనకపురలో అటవీ ఉద్యోగి కనకపుర తాలూకా కోగ్గె దొడ్డి గ్రామానికి చెందిన మాదేశ్ నాయక్ (30) ఫారెస్ట్ గార్డ్గా పని చేస్తున్నాడు. ఒక్కసారిగా ఎద నొప్పి వచ్చి కింద పడి మృతి చెందారు. తరగతిలో బాలుడు.. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా కురుబగెరి గ్రామంలో నాలుగో తరగతి చదువుతున్న మనోజ్కుమార్ (9) అనే బాలుడు తరగతిలోనే కన్నుమూశాడు. పాఠం వింటూ కుప్పకూలాడు. మనోజ్ ఇప్పటికే గుండెలో రంధ్రం పడి చికిత్స పొందుతున్నాడు. అవుల కాపరి.. బెంగళూరు దక్షిణ జిల్లా గోల్లరదొడ్డికి చెందిన పశువుల కాపరి గిరీశ్ (25) గుండెపోటుకు బలయ్యాడు. గత మూడు రోజుల నుంచి గిరీశ్ ఎద నొప్పి అని కుటుంబీకులకు చెప్పేవాడు. బుధవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై మరణించాడు. -
దెయ్యం విడిపిస్తానని.. ప్రాణం తీసింది
కర్ణాటక: దెయ్యం పట్టిందని తీవ్రంగా హింసించడంతో ఓ మహిళ మరణించిన ఘటన జిల్లాలోని భద్రావతి తాలూకా హొళెహొన్నూరు సమీపంలోని జంబరగట్టె గ్రామంలో జరిగింది. మృతురాలు గీతమ్మ (55). వివరాలు.. ఆదివారం సాయంత్రం మృతురాలు గీతమ్మ అసహజంగా ప్రవర్తించింది. ఆమె కుమారుడు సంజయ్ అదే గ్రామానికి చెందిన నిందితురాలు ఆశ (45)ను ఇంటికి పిలిపించాడు. గీతమ్మకు దెయ్యం పట్టిందని, విడిపిస్తానని ఆశా చెప్పింది. ఆశా తనకు చౌడమ్మ దేవి పూనిందంటూ గీతమ్మకు పట్టిన దెయ్యం వదిలిపో అంటూ చర్నాకోలు తీసుకుని కొట్టడం ప్రారంభించింది. రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హళేజంబర ఘట్టె చౌడమ్మ గుడి వరకు ఇలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లింది. అయినా దెయ్యం వదిలిపోలేదంటూ తెల్లవారుజామున 2.30 గంటల వరకు చితకబాదుతూనే ఉంది. దాడితో తీవ్రంగా అస్వస్థురాలైన గీతమ్మ కుప్పకూలింది. దయ్యం వదలడం ఏమో గానీ ఆమె ప్రాణం వదిలిపోయింది. ఆమె స్పృహ తప్పి పడిపోయిందనుకున్న ఆశ.. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా సర్దుకుంటుంది అని చెప్పి వెళ్లిపోయింది. కళ్లు తెరవకపోవడంతో కొడుకు గీతమ్మను హొళెహొన్నూరులోని సముదాయ ఆస్పత్రికి తరలించగా చనిపోయిందని వైద్యులు తెలిపారు. గీతమ్మకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కాగా గీతమ్మపై జరిగిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆశను అరెస్టు చేశారు. -
డాక్టర్ ఆకస్మిక మృతి.. చేతబడే కారణామా?
కర్ణాటక: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పాలనాధికారిగా ఉన్న డాక్టర్ వసంతకుమార్ గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన సంగతి విదితమే. సోమవారం ఆయన ఉన్న కార్యాలయం గదిని సిబ్బంది తెరచిన సమయంలో గదిలో చేతబడి చేసిన గుర్తులు కనిపించి ఆస్పత్రి సిబ్బంది అవాక్కయ్యారు. మాలూరు నగరంలోని ఆస్పత్రిలో డాక్టర్ వసంతకుమార్ కంటి వైద్య నిపుణులుగా గత 10 సంవత్సరాలుగా పని చేసి అనంతరం ఆస్పత్రి వైద్యాధికారిగా నియమితులయ్యారు. రోగులకు ఉత్తమ సేవలు అందించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే గత నెల 5వ తేదీన బెంగళూరు నుంచి రైలులో మాలూరుకు వస్తుండగా తీవ్ర గుండెపోటుకు గురై ఆకస్మికంగా మరణించారు. సోమవారం ఉదయం ఆస్పత్రిలోని ఆయన గదిని తెరచిన సమయంలో చేతబడి చేసిన విషయం వెలుగు చూసింది. గదిలో మరణించిన రెండు గబ్బిలాలు, బీరువాలో చేతబడికి ఉపయోగించిన బొమ్మలు కనిపించాయి. విషయాన్ని వసంతకుమార్ కుటుంబ సభ్యులు పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వైద్యుడు వసంతకుమార్ గుండెపోటుతో మరణించడానికి చేతబడికి ఏదైనా సంబంధం ఉందా? చేతబడి ఎవరు చేశారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీసుకున్నారు. -
పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం?
సాక్షి,కర్ణాటక: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఐదు గ్యారెంటీలను ప్రకటించడంతో జనం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సిద్దరామయ్య శక్తియోజన కింద మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. మూడేళ్లుగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పురుషులు తాము కూడా ఓటు వేశామని, తామేం పాపం చేశామని చర్చించుకుంటున్న తరుణంలో ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా నడుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, పురుషులపై అధిక టికెట్ ధరలను విధించినట్లు కూడా విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అభివృద్ధి పనులు అటకెక్కించారని విమర్శలు ప్రజాకర్షక హామీలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదని విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గ్యారెంటీలను రద్దు చేస్తే అభివృద్ధి చేయవచ్చని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, యువ నిధి, గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ.2000 ఇచ్చేందుకు దాదాపు రూ.50 వేల కోట్ల బడ్జెట్ అవసరం అవుతోంది. బాంబు పేల్చిన బసవరాజ రాయరెడ్డి ఈ తరుణంలో సీఎం సలహాదారు బసవరాజ రాయరెడ్డి తాజాగా మరో బాంబు పేల్చారు. సోమవారం కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లుగానే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సమాలోచన చేస్తోందన్నారు. ఈ విషయంలో సాధక బాధకాలను పరిశీలించి ఖచ్చితంగా అమలు చేస్తుందని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. తమ ప్రభుత్వంలో నిధుల కొరత లేదని, గ్యారెంటీలను చక్కగా అమలు చేస్తున్నామని, గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళలకు రూ.2 వేలు, ఉచిత బస్సు తదితర గ్యారెంటీల ద్వారా ప్రభుత్వం హామీలు అమలు చేసిందని, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే చర్యలు తీసుకుంటుందని వివరించారు. -
రూ.200 మోసం .. 30 ఏళ్ల తరువాత అరెస్టు
కర్ణాటక: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 30 ఏళ్ల క్రితం రెండు వందలు తీసుకొన్నాడో వ్యక్తి. కానీ పని చేసిపెట్టలేదు. బాధితుడు అప్పట్లో ఫిర్యాదు చేశాడు. నిందితున్ని ఉత్తర కన్నడ జిల్లా శిరసి పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. వివరాలు.. వెంకటేశ్ వైద్యకు ఉద్యోగం ఇప్పిస్తానని కేశవమూర్తి రావ్ రూ. 2 వందలు తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా ఉద్యోగం రాలేదు. నిరాశచెందిన వెంకటేశ్ 1995 ఫిబ్రవరి 18న శిరసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరువాత రావు పరారయ్యాడు. ఇటీవల శిరసి సీఐ మంజునాథగౌడ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించగా ఈ ఫిర్యాదు బయటకు వచ్చింది. పోలీసులు ముమ్మరంగా గాలించి నిందితుడు రావును అరెస్ట్ చేశారు. -
Ajibabu చౌరస్తా నుంచి జిమ్ వరకు...!
‘మాట్లాడితే నవ్వు. నడిస్తే నవ్వు. నా జీవితం నవ్వుల పాలైంది’ అంటూ నిరాశ చీకట్లో అనీ మంగుళూరు మగ్గిపోయి ఉంటే... ఎంతో మందికి ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చేది కాదు. భిక్షాటన స్థాయి నుంచి అయిదు ఆటోల యజమాని స్థాయికి ఎదిగిన అనీ ఇతరులకు ఉపాధి ఇవ్వడంతో పాటు ట్రాన్స్జెండర్ వృద్ధులకు అండగా ఉంది.కర్నాటకలోని రాయచూర్లో పేదింట్లో పుట్టిన అజిబాబు మాటతీరు, నడక అమ్మాయిలను పోలి ఉండేవి. దాంతో స్కూల్ రోజుల నుంచి వెక్కిరింపులు, అవమానాలు కొత్త కాక΄ోయినా మంగుళూరులో డిగ్రీ చేయడానికి వెళ్లినప్పుడు ఎదుౖరైన చేదు అనుభవాలు తనకు చదువును దూరం చేశాయి. చదువును మధ్యలోనే వదిలేసిన అజిబాబు బెంగళూరులోని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో చేరాడు.జెండర్ చేంజ్ సర్జరీ తరువాత అనిబాబు అనీ మంగుళూరుగా మారింది. సిటీలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టం అయింది. ఉద్యోగం దొరకడం గగనం అయింది. గత్యంతరం లేక భిక్షాటన చేయాల్సి వచ్చింది. ఆ తరువాత అమ్మ ఇచ్చిన కొద్దిమొత్తంతో ఆటో కొనుగోలు చేసి నడపడం మొదలుపెట్టింది అనీ. ఆటో కొనడం తన జీవితానికి టర్నింగ్ పాయింట్గా మారింది. మరో మూడు ఆటోలు కొనేస్థాయికి, ఇతరులకు ఉపాధిని ఇచ్చే స్థాయికి ఎదిగింది.అయినప్పటికీ ‘ఇక నాకు ఎలాంటి కష్టాల్లేవు’ అనుకోలేదు అనీ. కష్టాల్లో ఉన్న ట్రాన్స్జెండర్లకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది.అనీ నటి కూడా. ‘శివలీల’ అనే కన్నడ సినిమాలో నటించింది. ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్గా పనిచేసింది. ఫిట్నెస్పై శ్రద్ధ చూపే అనీ ఇప్పుడు జిమ్ ట్రైనర్గా మారింది.ట్రాన్స్ జెండర్ వృద్ధుల కోసం భవిష్యత్తులో ఆశ్రమం నిర్మించాలనేది అనీ లక్ష్యంఇదీ చదవండి: జిమ్కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది -
దర్శన్ కేసు స్ఫూర్తితో..! కర్ణాటకలో మరో దారుణం
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తన గర్ల్ఫ్రెండ్కు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెలమంగళ తాలుకా సోలదేవనహళ్లిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. కుశాల్ అనే కుర్రాడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే తర్వాత ఇద్దరికీ బ్రేకప్ కాగా, ఆ యువతి మరో యువకుడితో రిలేషన్ మొదలుపెట్టింది. ఇది భరించలేని కుశాల్.. సదరు యువతికి అసభ్య సందేశాలు పంపాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన తాజా ప్రియుడికి చెప్పింది. దీంతో రగలిపోయిన సదరు యువకుడు తన స్నేహితులతో కలిసి కుశాల్పై దాడికి పాల్పడ్డాడు. అయితే.. కుశాల్ను కిడ్నాప్ చేసి.. ఓ బహిరంగ ప్రదేశంలోకి ఈడ్చుకెళ్లి పడేశారు. పది మంది అతన్ని చుట్టుముట్టి కాళ్లతో, కర్రలతో తన్నారు. బట్టలు విప్పించి.. ప్రైవేట్ బాగాలపై దాడి చేస్తూ హింసించారు. దాడి సమయంలో ఆ యువతి కూడా అక్కడే ఉంది. దాడికి పాల్పడిన టైంలో ఆ గ్యాంగ్ మొత్తం కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి కేసు ప్రస్తావన తెచ్చి మరీ కుశాల్పై దాడికి పాల్పడింది. వీడు మరో రేణుకాస్వామి రా అంటూ ఒక్కొక్కరుగా కుశాల్ను చితకబాదారు. ఇది కూడా ఆ కేసులాగే ముగుస్తుందంటూ హెచ్చరించారు కూడా. జూన్ 30వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 మందిపై సోలదేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా 8 మందిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, బెదిరింపు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టింగ్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.కన్నడనాట చాలెంజింగ్ స్టార్గా పేరున్న దర్శన్ నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే వ్యక్తిని సుపారీ గ్యాంగ్తో కిడ్నాప్ చేయించి.. అత్యంత దారుణంగా హింసించి చంపాడని తెలిసిందే. ఈ ఉదంతం కర్ణాటకను మాత్రమే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్ బెయిల్ మీద బయట ఉన్నాడు. -
కామపిశాచులకు అడ్డాగా..
వరస ఘటనలు బెంగళూరులో మహిళలను బెంబేలెత్తిస్తున్నాయి. తమకు భద్రత కరువైందని వాపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సహోద్యోగిణి పట్ల ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఘటనతో ఐటీ క్యాపిల్ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు కామపిశాచులకు అడ్డాగా మారుతోందన్న చర్చ నెట్టింట నడుస్తోంది. అసలేం జరిగిందంటే.. బెంగళూరు: నగరంలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా సహోద్యోగిని టాయిలెట్లో రహస్యంగా వీడియో తీసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్లో ఈ దారుణం జరిగింది. ఓ మహిళా ఉద్యోగి టాయిలెట్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తన ఫోన్లో చిత్రీకరించాడు. అయితే.. పక్కనున్న క్యూబికల్ ద్వారా ఏవో కదలికలు గమనించిన ఆమె అప్రమత్తమై గట్టిగా అరిచింది. దీంతో ఆమె కొలీగ్స్ అప్రమత్తమై అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని పట్టుకున్నారు. సదరు వ్యక్తిని సీనియర్ అసోసియేట్గా పనిచేస్తున్న స్వప్నిల్ నాగేశ్ మాలి (28)గా గుర్తించారు. ఈ ఘటనపై బాధితురాలు తొలుత హెచ్ఆర్ విభాగంలో ఫిర్యాదు చేసింది. స్వప్నిల్ ఫోన్ పరిశీలించగా.. 30కి పైగా మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఆపై ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై ఫిర్యాదు నమోదు అయిన నేపథ్యంలో.. ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. నిందితుడిపై బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇన్ఫోసిస్ స్పందించింది. సదరు ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించినట్లు తెలిపింది. ఇటీవల బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే నడిరోడ్డు మీద, మెట్రో రైళ్లలో జరిగిన ఉదంతాలు సీసీఫుటేజీల ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా ఆఫీసుల్లో.. అదీ ప్రముఖ ఐటీ కంపెనీల్లోనూ చోటు చేసుకోవడం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. బెంగళూరులో ప్రధానంగా జరిగిన కొన్ని ఘటనలు.. 2023 నవంబర్ 22 – మెట్రో స్టేషన్లో వేధింపులుమెజెస్టిక్ మెట్రో స్టేషన్.. రద్దీ సమయంలో ఓ యువతిని వెనుక నుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి. బాధితురాలు సహాయం కోరినా ప్రయాణికులు స్పందించలేదు. 2024 జనవరి 27 – క్యాబ్లో వేధింపులుకమ్మనహళ్లి వద్ద.. ఓ యువతి బుక్ చేసిన క్యాబ్లోకి ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ప్రవేశించి వేధించారు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. Woman molested in Bengaluru while she was out on a morning walk. The man fled the spot soon after and a case against him was registered. Efforts are on to nab him.#Bengaluru pic.twitter.com/k8xlSOvXK7— Vani Mehrotra (@vani_mehrotra) August 5, 2024 కిందటి ఏడాది ఆగష్టులో.. మరో ఒంటరి మహిళపై చోటు చేసుకున్న వేధింపుల తాలుకా వీడియో ఇది.. Video Credits: Vani Mehrotra2025 ఏప్రిల్ 4 – వీధిలో వేధింపులు (BTM లేఅవుట్)సుద్దగుంటెపాళ్య, BTM లేఅవుట్ వద్ద తెల్లవారుజామున ఇద్దరు మహిళలు నడుస్తుండగా, ఓ వ్యక్తి వారిలో ఒకరిని వెనుక నుంచి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. సీసీ కెమెరాలో రికార్డు, వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే, కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు నగరాల్లో సాధారణమే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు, ఇది వేధింపులను ప్రోత్సహించేలా ఉందని విమర్శించారు. 2025 మే 23న.. బెంగళూరు మెట్రో రైలులో మహిళలను అసభ్యరీతిలో రహస్యంగా చిత్రీకరించి.. ఆ ఫొటోలను సోషల్ మీడియా(ఇన్స్టా)లో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్. ఫోన్లో ఫొటోలు, వీడియోలు లభ్యం. 2025 జూన్ 22 మైలసంద్ర, బెంగళూరు శివారులో.. కిరాణా దుకాణానికి వెళ్తున్న మహిళపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను రక్షించిన స్నేహితుడిపై కూడా దాడి జరిగింది. -
‘నాకు ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పండి?’.. డీకేఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు
కర్ణాటకలో ముఖ్యమంత్రి త్వరలోనే మారతారంటూ ఊహాగానాలు వినిపించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో మొదలు.. బీజేపీ, జేడీఎస్ల సెటైర్లతో అది జరగొచ్చని జోరుగా ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికి ఎట్టకేలకు తెర పడింది. తానే ఐదేళ్లు సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య ప్రకటించగా.. దానికి కొనసాగింపుగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం కొట్టిపారేశారు. ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మీడియాతో అన్నారాయన. అయితే కాసేపటికే ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.‘‘నాకు ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పండి. ఆయనకు మద్దతుగా నిలవడం తప్ప..’’ అంటూ డీకేఎస్ బదులిచ్చారు. ‘‘నన్ను సీఎంగా చేయాలని నేరు ఎవరినీ కోరలేదు. నాకు మద్దతుగా మాట్లాడమని ఎవరినీ పురమాయించలేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. ఒకరు సీఎం ఉన్నప్పుడు.. ఇలాంటి ప్రకటనలు ఎందుకు?. పార్టీలో నాతో పాటు లక్షల మంది పని చేస్తున్నారు. పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం’’ అని స్పష్టం చేశారాయన. అంతకుముందు.. సీఎం మార్పు ప్రచారంపై సీఎం సిద్ధరామయ్య కాస్త కటువుగానే స్పందించారు. యస్.. ఐదేళ్లు నేనే సీఎంగా కొనసాగుతా. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. మార్పు ఉందని చెప్పడానికి వాళ్లు(బీజేపీ, జేడీఎస్)ఏమైనా కాంగ్రెస్ అధిష్టానమా? అని మీడియాను ఎదురు ప్రశ్నించారాయన. 👉2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే అప్పట్లోనే ఇద్దరూ రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారాన్ని ఇద్దరూ తోసిపుచ్చారు. కట్ చేస్తే..👉ఈ ఏడాది జూన్ 29వ తేదీన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్.. 2–3 నెలల్లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు అని వ్యాఖ్యానించడంతో అసలు చర్చ మొదలైంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది అని బదులిచ్చారు. అయితే.. 👉ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేసింది. పార్టీ అధ్యక్షుడే హైకమాండ్ కాకపోతే మరెవరు?” అని ప్రశ్నించింది. మరోవైపు జేడీఎస్ కూడా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ను ఎద్దేవా చేస్తూ సీఎం మార్పు తథ్యమన్నట్లు ప్రకటనలు ఇచ్చింది. ఈ తరుణంలో.. ఇటు సిద్ధరామయ్య, అటు శివకుమార్లు ఈ వ్యాఖ్యలను ఖండించారు. హుస్సేన్కు నోటీసులు ఇస్తాం: డీకేఎస్సీఎం మార్పు ప్రచారాన్ని ఖండించిన డీకే శివకుమార్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్కు నోటీసు ఇస్తాం. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరతాం. పార్టీ నియామావళికి అందరూ కట్టుబడి ఉండాలి.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదు అని డీకే శివకుమార్ హెచ్చరించారు. -
ఆటోలో ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి,బళ్లారి(కర్ణాటక): వారిద్దరూ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామని ఆశపడ్డారు. కానీ ఆటో రిక్షాలో శవాలై తేలారు. ఇది ఆత్మహత్య, హత్య అనే అనుమానాలు వ్యాపించాయి. వివరాలు.. బెళగావి జిల్లాలో గోకాక్ వద్ద సవదత్తి తాలూకా మనవళ్లికి చెందిన రాఘవేంద్ర జాదవ్ (28), రంజిత (26) అనే ఇద్దరు ఊరి బయట ఆటోలో విగతజీవులై కనిపించారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని, అయితే వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని తెలిసింది. ఇటీవల ఆమెకు మరొకరితో నిశ్చితార్థం చేశారు. దీంతో ఆవేదనకు గురైన ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు చిక్కనంది సమీపంలో ఆటోలో పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. సమగ్ర విచారణ జరిపించాలని జాదవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గోకాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.లవ్ బ్రేకప్.. ప్రియుడు ఆత్మహత్య మైసూరు: ప్రేమించిన యువతి ముఖం చాటేయడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకా బన్నితాళపుర గ్రామంలో జరిగింది. సాగడె గ్రామానికి చెందిన సంతు అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే తాను మరో యువకున్ని ప్రేమిస్తున్నట్లు సంతు వాట్సాప్కు మెసేజ్ పంపింది. దీంతో విరక్తి చెందిన సంతునా మరణానికి ప్రియురాలే కారణం, ఆమె వదిలేయడంతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు పలువురికి మెసేజ్లు పంపాడు. తమ ఇద్దరి ఫోటోని స్టేటస్లో పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్లుపేటె పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆకస్మిక మరణాలపై కేంద్రం కీలక ప్రకటన
గుండె సంబంధిత సమస్యలతో.. వయసుతో నిమిత్తం లేకుండా మృత్యువాత పడుతున్న ఉదంతాలు రోజుకోటి చొప్పున చూస్తున్నాం. ప్రత్యేకించి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే కుప్పకూలిపోతున్నారు. అయితే కరోనా కాలం నుంచే ఇవి ఎక్కువగా నమోదు అవుతుండడంతో.. వైరస్-వ్యాక్సిన్లకు ముడిపెడుతున్నారు చాలామంది. ఈ తరుణంలో.. హఠాన్మరణాలకు గల కారణాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.వ్యాక్సిన్ల కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఇటీవల ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ అంశంపై విచారణ జరపడానికి ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారాయన. మరీ ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసులోపు వాళ్లు ఉన్నట్లుండి మరణించడం కలవరపెడుతోందని అన్నారాయన. అయితే గుండె సంబంధిత హఠాన్మరణాలకు.. కోవిడ్ టీకాలతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టంచేసింది. ఈ మేరకు పలు అధ్యయనాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం వెల్లడించింది. ఐసీఎంఆర్, ఎయిమ్స్ విస్తృతంగా నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. కోవిడ్ టీకాలు సురక్షితమైనవే. ఆకస్మిక మరణాలకు కింది విషయాలు కారణాలై ఉండొచ్చు.. జన్యుపరమైన లోపాలుజీవనశైలి (ధూమపానం, ఒత్తిడి, వ్యాయామపు అలవాట్లు)కోవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలుఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు.. అని పేర్కొంది #HealthForAll Extensive studies by @ICMRDELHI and AIIMS on sudden deaths among adults post COVID have conclusively established no linkage between COVID-19 vaccines and sudden deathsLifestyle and Pre-Existing Conditions identified as key factorshttps://t.co/QEN1X1PKfv— Ministry of Health (@MoHFW_INDIA) July 2, 2025టీకాలపై ఇలాంటి ఆరోపణలు ప్రజల్లో భయాందోళనలు కలిగించొచ్చు. విజ్ఞానపరమైన ఆధారాలు లేని వ్యాఖ్యలు ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆధారాల ఆధారంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో నెల వ్యవధిలో 20 మంది గుండె సంబంధిత సమస్యలతో హఠాత్తుగా చనిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. గుండె సంబంధిత మరణాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ జిల్లా ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. రెండేళ్ల కాలంలో 507 గుండె పోటు కేసులు నమోదుకాగా.. అందులో 190 మంది మరణించారు. అయితే కోవిడ్ టీకాల త్వరిత ఆమోదం, పంపిణీ కూడా ఈ మరణాలకు కారణమై ఉండొచ్చు. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే.. తక్షణమే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి అని ప్రజలకు సూచించారు. అలాగే.. ఈ మరణాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక నిపుణుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారాయన. In the past month alone, in just one district of Hassan, more than twenty people have died due to heart attacks. The government is taking this matter very seriously. To identify the exact cause of these series of deaths and to find solutions, a committee of experts has been…— Siddaramaiah (@siddaramaiah) July 1, 2025 అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటనను తోసిపుచ్చింది. ఈ మేరకు అధ్యయనాల తాలుకా వివరాలను వెల్లడించింది. ICMR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అధ్యయం.. 2023 మే–ఆగస్టు మధ్య 19 రాష్ట్రాల్లో 47 ఆసుపత్రుల్లో నిర్వహించారు. ఇందులో 18–45 ఏళ్ల మధ్య వయస్సు గల, ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా మరణించిన వ్యక్తులపై అధ్యయనం జరిపారు. అందులో కోవిడ్ టీకాలకు సంబంధం లేదని తేలింది. అలాగే.. ఢిల్లీ AIIMS అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందులో గుండెపోటు (Myocardial Infarction) ప్రధాన కారణంగా గుర్తించారు. పైగా జన్యుపరమైన లోపాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రాథమిక విశ్లేషణలో తేలింది. -
కర్ణాటక సీఎం మార్పు.. డీకే కీలక వ్యాఖ్యలు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ మంగళవారం కొట్టిపారేశారు. ప్రస్తుతం అలాంటి చర్చే లేదని అన్నారు. అవాస్తవ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నేతలను ఆదేశించారు. డి.కె.శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హెచ్.ఎ.ఇక్బాల్ హుస్సేన్కు నోటీసు ఇస్తామని, ఆయన వివరణ కోరుతామని వెల్లడించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు. పార్టీ నియామావళికి అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు. సీఎం మార్పును ఇప్పుడు ఎవరూ కోరుకోవడం లేదని, తమ దృష్టి మొత్తం 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని శివకుమార్ తేల్చిచెప్పారు. తన గురించి ఇతరులు మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. అలాంటి అంశాలపై ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని పేర్కొన్నారు. -
ఒక్క నెలలో 18 గుండెపోటు మరణాలు.. ‘హసన్’పై విచారణకు ఆదేశాలు
హసన్: దేశంలో ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య మరింతగా పెరుగుతూ వస్తోంది. ఇదే కోవలో కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక్క నెలలోనే 18 మంది గుండెపోటుతో మరణించిన దరిమిలా రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు ఈ మరణాలపై దర్యాప్తు చేప్టటాలని వైద్యాధికారులను ఆదేశించారు.కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక్క నెలలో 18 మంది గుండెపోటుతో మరణించగా, వారిలో యువకులే అత్యధికంగా ఉన్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు ఈ విధమైన గుండెపోటు కేసుల పెరుగుదలను నివారించేందుకు వైద్యాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అధికారిక దర్యాప్తు జరుగుతోందని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఆందోళనకర పరిస్థితుల వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు.హసన్ జిల్లాలో చోటుచేసుకున్న గుండెపోటు మరణాలపై జయదేవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్కు చెందిన డాక్టర్ సి.ఎన్. రవీంద్ర నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం అధ్యయనం చేసి, నివేదికను పది రోజుల్లోగా అందజేయనుంది. హసన్లో ఇటీవలి కాలంలో 20 నుంచి 30 ఏళ్లలోపు వయసుకలిగిన యువకులు గుండెపోటులో మృతిచెందడం గమనార్హం. జంక్ ఫుడ్, ఆల్కహాల్, ధూమపానం, అధిక ఒత్తిడిని కలిగించే జీవనశైలి మొదలైనవి గుండెపోటుకు ప్రధాన కారణాలని ఆరోగ్య శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.ఇది కూడా చదవండి: ‘మహా’ యూ టర్న్ చూసి.. రెండు భాషలకు కర్నాటక -
‘మహా’ యూ టర్న్ చూసి.. రెండు భాషలకు కర్నాటక
ముంబై: మహారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా విధానం అమలు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయంపై వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ పరిణామాలను గమనించిన కర్నాటక కూడా ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది.జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)దేశవ్యాప్తంగా పాఠశాలల్లో త్రిభాషా సూత్రాన్ని సిఫార్సు చేసినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా దానిని తిరస్కరించింది. మహారాష్ట్ర సర్కారు ప్రాథమిక పాఠశాలలకు త్రిభాషా విధానాన్ని నిలిపివేసిన దరిమిలా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ ప్రభుత్వం కూడా పాఠశాల విద్యావిధానంలో ద్విభాషా సూత్రానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మైసూరులో విలేకరులతో మాట్లాడిన సిద్ధరామయ్య తాము ద్విభాషా విధానానికి అనుకూలంగా ఉన్నామని, తమ ప్రభుత్వం దీనికే కట్టుబడి ఉంటుందని ప్రకటించారు.వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో భాషా విధానాలపై చర్చలు జరుగుతున్న సమయంలో సీఎం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక పాఠశాలల్లో ప్రస్తుతమున్న విద్యావిధానంలో.. విద్యార్థులు ఐదవ తరగతి వరకు రెండు భాషలు నేర్చుకోవాలి. ఆరవ తరగతి నుండి హిందీని మూడవ భాషగా ప్రవేశపెడతారు. ఎనిమిదవ తరగతిలో విద్యార్థులకు కన్నడ, ఇంగ్లీష్ లేదా సంస్కృతంలలో ఏదో ఒక దానిని మొదటి భాషగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా విద్యార్థి సంస్కృతాన్ని మొదటి భాషగా ఎంచుకున్న పక్షంలో, వారికి కన్నడ మూడవ భాషగా తప్పనిసరి అవుతుంది.ఇది కూడా చదవండి: ‘భాగస్వామి’పై దారుణం.. మృతదేహంతో రెండు రోజులు సావాసం -
ఆ వ్యాఖ్యల్లో అర్థం ఇదేనా ?.. సీఎం మార్పు ఖాయమేనా?
బెంగళూరులో తొక్కిసలాట ఘటన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టిందా?, కర్ణాటకలో సీఎంను మార్చాలా? అనేది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా చర్చిస్తున్న అంశం. మరొకవైపు తొక్కిసలాట ఘటన పేరుతో డీకే శివకుమార్ను సీఎం చేయడానికి రంగం సిద్ధమైందా? అనేది ఆ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ హైకమాండ్ నుంచి ఎటువంటి ప్రకటనా నేరుగా రాకపోయినప్పటికీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కర్ణాటకలో సీఎంను మార్చబోతున్నారా? అనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే డైరెక్ట్గా ఏమీ చెప్పలేకపోయారు. ఆయన నో అనే అవకాశం ఉన్నా కూడా ‘ అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ హైకమాండ్ అంటే తానే అనే విషయం మరిచిపోయి ఖర్గే ఇలా వ్యాఖ్యానించినప్పటికీ కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఏదో జరుగబోతుందనే సంకేతాలిచ్చారు ఖర్గే. మీడియా అడిగిన దానికి.. ‘ఇప్పుడు కర్ణాటకలో సీఎంను మార్చాల్సిన అవసరం ఏమిటి?’ అని చెప్పకుండా, అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది అనడం త్వరలో ఏదో జరగబోతుందనే దాన్ని బలపరిచింది.డీకే శివకుమార్కు చాన్స్..? అక్కడ ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్యను తప్పిస్తే, ఆ తర్వాత రేసులో ఉన్నది డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్కే అవకాశం దక్కుతుంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిన సమయంలో డీకే శివకుమార్ సీఎం అనే ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్ మాత్రం సిద్ధరామయ్యనే సీఎంను చేసింది. కర్ణాటకలో ఎటువంటి మార్పులు లేకుండా సీనియర్ అయిన సిద్ధరామయ్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అప్పట్నుంచి డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య కాస్త దూరం పెరిగిందనేది జనాల్లో వినిపిస్తున్న మాట. అయితే సిద్ధరామయ్య కోసం తన చివరి శ్వాస వరకూ నిలబడతా అనే వ్యాఖ్య కూడా డీకే శివకుమార్ ఒకానొక సందర్భంలో చేసి తమ మధ్య ఏమీ విభేదాల్లేవని సంకేతాలిచ్చారు. ఈ ఏడాది శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది. ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలం చేకూర్చింది. అయితే డీకే శివకుమార్ తనపై వచ్చిన ఆరోపణలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఎవరు ఏమనుకున్నా తాను చివరి శ్వాస వరకూ కాంగ్రెస్లోనే ఉంటానని తేల్చి చెప్పారు.మరింత పటిష్టం చేసే దిశగా పావులు..!కర్ణాటకలో కాంగ్రెస్ను మరింత పటిష్టం చేసి.. బీజేపీకి ధీటుగా నిలబడాలంటే డీకే శివకుమార్ సీఎం పగ్గాలు అప్పజెప్పాలని గత కొద్దికాలంగా వినిపిస్తున్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఆలోచన చేసే దిశగా ముందుగా సాగుతున్నట్లు ఖర్గే వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ఉన్న సారాంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ందేళ్లు జీవించాల్సిన పిల్లలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో బలికావడాన్ని తట్టుకోలేకపోతున్నా. ఈ ఘటనతో బెంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చింది’అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. 14–15 ఏళ్ల వయసున్న పిల్లలు చనిపోవడం కళ్లారా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సదాశివనగరలోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. -
కళాకారుడిగా మారిన పోలీసు..! సొంతంగా ఫోటో స్టూడియో పెట్టి..
కళ కోసం తపించే మహానుభావులెందరినో చూశాం. తమ సర్వస్వం దానికే అర్పించి..భావితరాలకు వాటి గొప్పతనం తెలియజేసిన మహానుభావులెందరో ఉన్నారు. అయితే ఇక్కడొక పోలీసు అంతలా కాకపోయినా..చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు కళకారుడిగా మారిన కథ ఇది. కుటుంబ భాద్యతల నడుమ మరుగున పడ్డ తన కలకు ప్రాణం పోసి శెభాష్ అనిపించుకుంటున్నాడు.అతడే కర్ణాటకకు చెందని పోలీసు బి ఎస్ శివరాజు. ఆయన తన తల్లి గౌరమ్మతో కలిసి ఒక్కఫోటో కూడా దిగలేదు. తన స్నేహితులు, బంధువులు ఇంటికి వెళ్లినప్పుడూ..గోడలపై కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు చూసి కలత చెందేవాడు. తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గుర్తుచేసుకుంటూ శివ..తన తాత తనను, తన తల్లిని తీసుకుని ఫోటోస్టూడియోకి తీసుకువెళ్లి..ఫోటో తీయించుకోకుండానే బాధగా ఎలా వెనుతిరిగి వచ్చిందో చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అప్పటి తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటం, పైగా స్టూడియో అతను తక్కువ డబ్బులకు తీయడం కుదరదనడంతో నాటి ఫోటో ముచ్చట నీరుగారిపోయిందని బాధగా చెప్పుకొచ్చాడు శివ. ఆ విధంగా ఫోటో తీసుకోలేకపోయిన వెలితి శివ మనసులో అలానే బలంగా ఉండిపోవడంతో..2017లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఫోటో స్టూడియో పెట్టుకుని..ఆల్బమ్లు డాక్యుమెంటేషన్ చేస్తున్నాడు. ఈ పనిని ఆయన తన తల్లి రగౌరమ్మతో కలిస చేస్తుండటం విశేషం. బాల్యంలో అమ్మతో కలిసి ఫోటో దిగలేకపోయిన లోటుని ఇలా భర్తీ చేసుకుంటున్నాడు శివ. ప్రస్తుతం బెంగళూరులో జాషువా ముయివా నిర్వహిస్తున్న నో లాంగర్ ఎ మెమరీ, పాతకాలపు స్టూడియో-షాట్ ఫోటో ఆల్బమ్ల నోస్టాల్జియా గ్యాలరీ సుముఖ ప్రదర్శనలో అతడి ఫోటో డాక్యుమెంట్లు సందడి చేస్తున్నాయి. ఆ ఫోటోల ఆల్బమ్లన్నింటిల్లోనూ తన తల్లితో కలసి రకరకాల వేషాల్లో కనిపిస్తాడు.ప్రతి ఒక్క ఫోటో అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంటుంది. సెల్ఫోన్లు, కెమెరాలు లేని ఫోటో స్టూడియా ముచ్చట్లు కదలాడేలా ఆ గ్యాలరీ ప్రదర్శన ఉంటుంది. ఆ ఆల్బమ్ని శివ ప్రాణం పెట్టి తీర్చిదిద్దాడు. 21 ఏళ్లకు పోలీసు ఉద్యోగం సంపాదించాడు శివ. సహజంగా ఆ వృత్తిపరంగా టెన్షన్తో కూడిన కాఠిన్యం ఎక్కడ శివ ముఖంలో మచ్చుకైన కానిరాని విధంగా ఆ ఫోటోల్లో కనిపిచడం విశేషం. ఇలా ఈ కళను ఎంచుకోవడానికి కారణాన్ని కూడా వివరించాడు శివ. "నాటక సంప్రదాయం అంతరించిపోతోంది. ప్రస్తుత వాతావరణం చాలా భిన్నంగా ఉంది. ఫోటో స్టూడియోలు గతంలో ఉన్నట్లుగా లేవు. అందువల్ల నేను నా జ్ఞాపకాలతో, నా ప్రజలతో, నా సంస్కృతితో పనిచేయాలనుకుంటున్నాను. ఇది ఒకరకంగా నా జీవితంలోకి తిరిగి వచ్చిన ఫీల్ని అందిస్తోంది. ఇంకా ఇలాంటివి మరిన్ని డాక్యుమెంట్లు చేయాలి అదే తన ఆకాంక్ష అని నవ్వుతూ చెబుతున్నాడు". ఈ మాజీ పోలీస్ శివ.(చదవండి: 'బంగారంలాంటి ఇల్లు' అంటే ఇదే..! స్విచ్ బోర్డుల నుంచి...) -
‘ఖర్గేజీ.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉందా?.. మీరు హైకమాండ్ కాదా?
బెంగళూరు: కాంగ్రెస్లో హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకే కట్టుబడి ఉండాలనేది ఎప్పట్నుంచో వస్తుంది. రాష్ట్రాల్లో ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలొ అది హైకమాండ్ ఫైనల్ చేస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర సీఎంలు కూడా హైకమాండ్ మాటకు ఎదురుచెప్పకూడదు. ఈ తరహా పరిణామాలను తరుచూ చూస్తూనే ఉన్నాం. మరి హైకమాండ్ అంటే ఎవరు?, ఏఐసీసీ అధ్యక్షుడే కాంగ్రెస్ హైకమాండ్ కదా.. మరి పార్టీ చీఫ్ అయిన మల్లిఖార్జున ఖర్గే నోట నుంచే హైకమాండ్ చూసుకుంటుంది అనే మాట వస్తే ఏమనాలి?ఇప్పుడు అదే జరిగింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే.. ‘హైకమాండ్ చేతుల్లో ఉంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లొ ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా> సీఎంను మార్చబోతున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే ఒక్క ముక్కలో తెగ్గొట్టి చెప్పేశారు. అది హైకమాండ్ చేతుల్లో ఉంది అంటూ దాటవేత ధోరణి అవలంభించారు. ఇది బీజేపీకి మంచి టానిక్లా దొరికింది. అటు కాంగ్రెస్ను, ఇటు ఖర్గేపై విమర్శలు చేయడానికి అవకాశం దొరికినట్లయ్యింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సెటైర్లతో విరుచుపడ్డారు. ‘ ఇక్కడ హైకమాండ్ అంటే ఎవరు? మీరు కాదా?, కాంగ్రెస్ చీఫ్గా ఉన్న మీరు హైకమాండ్ కాదా?, మరి ఇంకా హైకమాండ్ ఎవరు? అని తేజస్వి సూర్య పంచ్లు వేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కనపడదు.. అది మనకు కనిపించదు.. వినిపించని దెయ్యంలా ఉంటుందేమో. మనం మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ఉందని ఫీలవుతూ ఉండాలి’ అని సెటైరికల్ పంచ్లు విసిరారు.The Congress High Command is like a ghost. It is unseen, unheard, but always felt. Even the Congress President, who people thought is the high command, whispers its name and says it’s not him. So eerie! https://t.co/GpcdHWQbSs— Tejasvi Surya (@Tejasvi_Surya) June 30, 2025 -
కూతురిపై తల్లి అత్యాచార పర్వం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కన్నకూతురిపై తల్లి లైంగిక దాడులు చేస్తున్న దారుణ ఉదంతం బెంగళూరులో వెలుగు చూసింది. ఆరేళ్లుగా ఓ తల్లి కుమార్తెపై లైంగికదాడి చేస్తున్నట్టు తెలిసింది. ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి చదువుతున్న బాలిక తల్లి దాష్టీకం గురించి ఉపాధ్యాయురాలికి మొరపెట్టుకుంది. దీంతో విషయం పోలీసులకు చేరింది. కేసు నమోదు చేసి, తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వివాహం జరిగాక భర్తతో ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తున్నట్లు నిందితురాలు బుకాయించింది. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన తల్లి కుమార్తె మీద లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
కాంట్రాక్టర్ హంతకులపై తూటా
దొడ్డబళ్లాపురం: హావేరి జిల్లా శిగ్గాంవి పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన కాంట్రాక్టర్ శివానంద కున్నూరు (40) హత్య కేసులో నిందితులపై పోలీసులు ఫైరింగ్ చేశారు. నిందితులు అష్రఫ్, నాగరాజు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, వారికి హావేరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హుబ్లి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మూడురోజుల కిందట పట్టపగలు నలుగురు దుండగులు శివానందను కత్తులతో నరికి చంపడం జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ హత్య వీడియోలు వైరల్ అయ్యాయి.దాగి ఉండగా..పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి వారి కోసం శోధించారు. హానగల్ తాలూకా కొండోజి క్రాస్ వద్ద నిందితులు దాగి ఉన్నట్టు తెలిసి గురువారం తెల్లవారుజామున అరెస్టు చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. శిగ్గాంవి సీఐ సత్యప్ప, ఎస్సై సంపత్ నిందితుల కాళ్లకు షూట్ చేయడంతో గాయాలై దొరికిపోయారు. ఈ ఘటనలో సత్యప్ప, సంపత్, కానిస్టేబుల్ రవికి స్వల్ప గాయాలయ్యాయి. హత్యకు ఆర్థిక వ్యవహారాలు, లేదా అక్రమ సంబంధం కారణమని అనుమానాలున్నాయి. ఇప్పటికే సుదీప్, సురేష్ గౌళి, హనుమంత అనే ముగ్గురు అరెస్టయ్యారు. -
దేశీ టొమాటోల సిరి! మైసూరులో విత్తనోత్సవం
కొన్ని పంటల్లో దేశీ వంగడాల వైవిధ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. కర్ణాటకకు చెందిన వి. కాంతరాజు 27 రకాల దేశీ టొమాటో వంగడాలను సాగు చేస్తూ పరిరక్షిస్తున్నారు. అత్యంత విలక్షణమైన ఆఫ్రికా టోగో, బ్లాక్ ప్లమ్, బ్లాక్ టొమాటో వంటి విశిష్ట రకాలు కూడా ఇందులో ఉన్నాయి. టొమాటోలే కాదు అనేక పంటల దేశీ వంగడాలను సేకరించటం, వాటిని రైతులకు ఇచ్చి ఏటేటా పండిస్తూ సంరక్షించటమే పనిగా పెట్టుకుంది మైసూరుకు చెందిన సేంద్రియ రైతుల సంఘం ‘సహజ సమృద్ధ’. కాంతరాజు కూడా ఈ సంఘం సభ్యుడే. ఈ 27 రకాల టొమాటోలతో పాటు చాలా రకాల ధాన్యాలు, పప్పుధాన్యాలను సైతం ఆయన సాగు చేస్తున్నారు. దేశీ విత్తనాలతో కూడిన సమీకృత సేంద్రియ వ్యవసాయమే ఆహార, పౌష్టికాహార, ఆదాయ భద్రతను కల్పిస్తుందని కాంతరాజు అంటున్నారు. కర్ణాటక దేశీ పంటల వైవిధ్యాన్ని కళ్లారా చూడాలంటే జూలై 5,6 తేదీల్లో మైసూరులో జరిగే దేశీ విత్తనోత్సవాన్ని సందర్శించాల్సిందే! అందరూ ఆహ్వానితులే. వివరాలకు 70900 09944.బీఆర్సీలపై 4 రోజుల శిక్షణప్రకృతి వ్యవసాయంలో ఘన, ద్రవరూప ఎరువులు, ద్రావణాలు, కషాయాలు, జీవన ఎరువులు, జీవన పురుగు మందులను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చే కేంద్రాలను బయో రిసోర్స్ సెంటర్లు(బిఆర్సిలు) అంటారు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకునే వ్యక్తులు, సహకార సంస్థలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాల నిర్వాహకులకు నూజివీడు సమీపంలో కొండపర్వలో ఏర్పాటైన కృష్ణసుధ అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీలో జులై 1 నుంచి 4 వరకు 4 రోజుల పాటు ఆంగ్లంలో శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. బిఆర్సిలకు సంబంధించిన 10 అంశాలపై శిక్షణ ఇస్తారు. ఫీజు, రిజిస్ట్రేషన్ వివరాలకు.. 850 028 3300. -
పునర్జన్మనిచ్చిన జట్టుకు షాకిచ్చిన కరుణ్ నాయర్
ప్రస్తుతం భారత క్రికెట్లో వినిపిస్తున్న పేర్లలో కరుణ్ నాయర్ పేరు ముందువరుసలో ఉంది. దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణించి, 8 ఏళ్ల తర్వాత టీమిండియా తలుపులు తట్టిన 33 ఏళ్ల ఈ కర్ణాటక మిడిలార్డర్ బ్యాటర్.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్ ఆడేందుకు రెడీగా ఉన్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా ఇవాల్టి నుంచి (జూన్ 20) తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో కరుణ్ ఆడటం దాదాపుగా ఖరారైపోయింది. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించిన కారణంగా కరుణ్కు భారత జట్టులో చోటు దక్కింది. ఇదే సమయంలో స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లి రిటైర్ కావడం కూడా కరుణ్కు కలిసొచ్చింది. ఇంగ్లండ్తో నేటి నుంచి ప్రారంభం కాబోయే మ్యాచ్లో కరుణ్ ఆరో స్థానం లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగే అవకాశం ఉంది. కరుణ్ ఇటీవలే ఇంగ్లండ్ లయన్స్పై డబుల్ సెంచరీ బాది మాంచి జోష్లో ఉన్నాడు. భారత క్రికెట్ అభిమానులు సైతం కరుణ్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా కరుణ్ మరో అంశానికి సంబంధించి వార్తల్లోకెక్కాడు. కరుణ్ తనకు పునర్జన్మనిచ్చిన దేశవాలీ జట్టు విదర్భను వీడాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని విదర్భ క్రికెట్ అసోసియేషన్ కూడా పరోక్షంగా ధృవీకరించింది. అధికారిక లాంఛనాలు పూర్తి కావడమే తరువాయిగా తెలుస్తుంది. కరుణ్ తన సొంత రాష్ట్రమైన కర్ణాటకకు తిరిగి వెళ్తున్నాడని సమాచారం. కరుణ్ 2023-24 సీజన్కు ముందే కర్ణాటకను వదిలి విదర్భకు వలస వచ్చాడు. విదర్భకు మారడమే కరుణ్ కెరీర్ను మలుపు తప్పింది. ఎనిమిదేళ్లు స్వప్నించిన టీమిండియా రీఎంట్రీ కల సాకారమైంది. విదర్భకు ఆడిన రెండు సీజన్లలో కరుణ్ ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఇంకా చెప్పాలంటే కరుణ్ ప్రదర్శనల కారణంగా విదర్భ తమ చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాలను అందుకుంది. గత దేశవాలీ సీజన్లో (2024-25) కరుణ్ పరుగుల వరద పారించి (863 పరుగులు) విదర్భను రంజీ ఛాంపియన్గా నిలిపాడు. అదే భీకర ఫామ్ను విజయ్ హజారే ట్రోఫీలో (779 పరుగులు) కూడా కొనసాగించి విదర్భను రన్నరప్గా నిలబెట్టాడు. ఈ టోర్నీలో కరుణ్ విదర్భకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్ క్రియాశీలకంగా వ్యవహరించి విదర్భను క్వార్టర్ ఫైనల్స్కు చేర్చాడు. కరుణ్ రెండు సీజన్లలోనే తన తలరాతను మార్చుకోవడంతో పాటు విదర్భ క్రికెట్ జట్టు స్థాయిని కూడా పెంచాడు. అయితే వ్యక్తిగత, కుటుంబ కారణాల చేత కరుణ్ తనకు పునర్జన్మనిచ్చిన విదర్భను వదిలి సొంత రాష్ట్రం కర్ణాటకకు తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా కరుణ్ను తిరిగి తమ దేశవాలీ జట్టులో చేర్చుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తుంది.విదర్భకు మరో షాక్విదర్భకు మరో షాక్ కూడా తగలనున్నట్లు తెలుస్తుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జితేశ్ శర్మ (ఆర్సీబీ వికెట్కీపర్ బ్యాటర్) కూడా ఆ జట్టును వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. 31 ఏళ్ల జితేశ్ బరోడాకు మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ దాదాపుగా ధృవీకరించినట్లు తెలుస్తుంది. జితేశ్ మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉంటాడని బరోడా క్రికెట్ బోర్డుకు చెందిన కీలక వ్యక్తి ఒకరు చెప్పారు. జితేశ్ విదర్భకు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కెప్టెన్గా వ్యవహరించాడు. విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ కెప్టెన్సీలో ఆడాడు. అయితే జితేశ్కు రంజీల్లో ఆడే అవకాశం రాలేదు. -
CCL: కర్నాటకలో కొత్త చట్టం
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విక్టరీ పరేడ్(Bengaluru Stampede Incident) విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. ఇలాంటి వేడుకల విషయంలో ఇక మీదట కఠినంగా వ్యవహరించాలని కర్నాటక ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కొత్తగా Crowd control law(CCL) తీసుకురావాలనే ప్రతిపాదన తెర మీదకు తెచ్చింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించే యోచనలో ఉంది.బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం "కర్ణాటక క్రౌడ్ కంట్రోల్ బిల్- 2025(Crowd Control Bill 2025) అనే కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనల కట్టడికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులో ముఖ్యాంశాలు:ఈ చట్టాన్ని పాటించకపోయినా.. ఉల్లంఘించినా.. గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందిరూ. 5,000 నుంచి రూ. 50,000 వరకు జరిమానా ఉంటుందిఈ చట్టం ఉత్సవాలు, జాతరలు, ఊరేగింపులు, మతపరమైన వేడుకలకు వర్తించదుఅవాంఛనీయ ఘటనలు జరిగితే.. ఈవెంట్ నిర్వాహకులు బాధ్యత వహించాల్సి ఉంటుందితొక్కిసలాటలు జరిగితే బాధితులకు నిర్వాహకులే నష్టపరిహారం చెల్లించాలిచెల్లించకపోతే.. వసూలు చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందిఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు ఇవాళ(జూన్ 19, గురువారం) కేబినెట్ ముందుకు వచ్చింది. రాజకీయ ర్యాలీలు, సభలతో పాటు స్పాన్సర్డ్ ఈవెంట్లను నియంత్రించే చర్యలను ఈ డ్రాఫ్ట్ ప్రస్తావించింది. మతపరమైన ఊరేగింపులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. పోలీసుల అనుమతి తీసుకోకపోయినా.. జనాలను నియంత్రించలేకపోయినా.. ఉల్లంఘన కిందకే వస్తుంది. ఏదైనా అనుకోని ఘటనలు జరిగితే ఆ నిర్లక్ష్యానికి నిర్వాహకులదే పూర్తి బాధ్యతనాన్ కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ కేసుగా పరిగణిస్తారు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేసును విచారణ జరుపుతారు. వచ్చే భేటీలో కేబినెట్ ఈ బిల్లుకు పచ్చ జెండా ఊపొచ్చనే ప్రచారం ఊపందుకుంది. -
థగ్ లైఫ్ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీం సీరియస్!
కోలీవుడ్ అగ్రనటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. మణిరత్న- కమల్ కాంబోలో వచ్చిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో విఫలమైంది.అయితే బెంగళూరులో కమల్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్ను కర్ణాటక రిలీజ్ చేయలేదు. కన్నడ భాషను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి. దీంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ థగ్ లైఫ్ సినిమాపై నిషేధం విధించింది. ఈ వివాదంపై కమల్ హాసన్ టీమ్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. థగ్ లైఫ్ను కర్ణాటకలో అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది మీ కర్తవ్యమని కర్ణాటక ప్రభుత్వానికి గుర్తు చేసింది.సుప్రీం తీర్పుతో థగ్ లైఫ్ సినిమా స్క్రీనింగ్కు ఎట్టకేలకు రక్షణ కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం నుంచి హామీ లభించింది. ఈమేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ చిత్రంపై అనధికారిక బ్యాన్కు సంబంధించి దాఖలైన పిల్ విచారణను ముగించింది. తమిళం నుంచే కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలతో ఈ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. -
Bike Taxi Ban: అవసరమైతే హైదరాబాద్కి పోతాం!
కర్నాటకలో యాప్ ఆధారిత అగ్రిగేటర్లు నడుపుతున్న టూ-వీలర్ టాక్సీ సర్వీసుల కార్యకలాపాలకు నిన్నటి(జూన్16) నుంచి బ్రేకులు పడ్డాయి. కోర్టు తీర్పు.. ప్రభుత్వం నుంచి విధానాల రూపకల్పనపై సరైన స్పందన లభించకపోవడంతో ప్రస్తుతం బైక్ ట్యాక్సీలపై నిషేధం అమలు అవుతోంది. దీంతో లక్ష మంది గిగ్ వర్కర్లపై ప్రభావం పడుతోంది. ఇందులో.. ఇదే తమ జీవనోపాధి అని వాపోతున్నారు వేలమంది రైడర్లు. కర్నాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం వేలాది మంది రైడర్లను తీవ్రంగా ప్రభావం చేస్తోంది. కాలేజీ ఫీజులు చెల్లించేందుకు బైక్లు నడుపుతున్న విద్యార్థుల దగ్గరి నుంచి.. ఉద్యోగాలు పొగొట్టుకున్న టెక్కీల దాకా ఈ సేవలనే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొందరికి ఇది పార్ట్ టైం జాబ్ కాగా.. మరికొందరికి ఫుల్ టైం ఆదాయం అందించే వనరు. 👉కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మధ్యలోనే మానేసిన ఓ యువకుడు మాట్లాడుతూ.. ప్రతీ రైడ్ ఒక కొత్త వ్యక్తిని కలవడానికి కలిగించిన అవకాశం. ఈ ప్రయాణం నా ఒంటరితనాన్ని అధిగమించడంలో సహాయపడింది. నేను ఆనందంగా చేసే పనిలో ఆదాయం కూడా వచ్చింది. అలాంటి ఆదాయ వనరుకు ఇప్పుడు గండిపడింది.👉ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదు. బిజినెస్ ప్రారంభించాలన్న కల ఉంది. కానీ నెలవారీ జీతంతో పొదుపు కష్టం. అందుకే బైక్ టాక్సీల వైపు వచ్చాను. టార్గెట్లు లేవు, ఒత్తిడి లేదు, పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ నిషేధం నా వంటి కలలవాళ్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అవసరమైతే హైదరాబాద్కు మారిపోతాను, కానీ ఈ పని వదలను:::మహదేవపురకు చెందిన ఇంద్ర శేఖర్(25) 👉బైక్ రైడ్లతో రోజుకు రూ.3,000 సంపాదించేవాడిని. అందులో కనీసం రూ.2,000 పొదుపు చేసేవాడిని. ఈ రోజుల్లో ఖర్చులకు ఫుల్ టైం ఉద్యోగం ఒక్కటే సరిపోవడం లేదు. పెద్ద నగరాల్లో జీవించాలంటే అదనపు ఆదాయం కచ్చితంగా అవసరం. అలాంటి ఆదాయం లేకుండా పోయింది:::జగదీష్(24), నాన్-ఐటీ ప్రొఫెషనల్👉సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు సాగర్ బైక్ ట్యాక్సీలతో రైడ్లు కొడుతూ సంపాదించుకుంటున్నాడు. ఈ సేవలు నా జీవన విధానాన్ని మార్చేశాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోవడం చాలా నిరాశ కలిగిస్తోంది. నా ఆదాయ మార్గం పూర్తిగా కోల్పోయాను. ఇప్పుడు మరో ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అని తెలిపాడు. 👉వైట్ఫీల్డ్లో నివసించే 27 ఏళ్ల టెకీకి ఇది పార్ట్టైం జాబ్. ఆఫీస్ తర్వాత బైక్ టాక్సీ రైడ్లు చేస్తాను. ట్రాఫిక్లో ఒంటరితనాన్ని తగ్గించేందుకు ఇది మంచి మార్గం. కానీ, ఇప్పుడది లేకుండా పోతోంది అని అంటున్నాడు. నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ స్పందనబైక్ ట్యాక్సీ డ్రైవర్లను ఏదో నేరస్తుల్లాగా పరిగణించడం అన్యాయం. ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో మేమూ భాగమే. మమ్మల్ని చర్చ లేకుండానే ఎందుకు బయటకు తోసేస్తున్నారు?. లైసెన్సింగ్, ఇన్సూరెన్స్, భద్రతపై స్పష్టమైన నిబంధనలు కావాలి. లక్షకు పైగా గిగ్ వర్కర్ల జీవనాధారాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వినతిపత్రం సమర్పించింది. తీర్పు ఇలా..కర్ణాటక వ్యాప్తంగా బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే.. గత శుక్రవారం ( జూన్ 13న) ఉబర్, ఓలా, రాపిడో యాప్ సంస్థలు దాఖలు చేసిన స్టే అభ్యర్థనలను డివిజన్ బెంచ్ తిరస్కరించింది. అయితే, నిబంధనల రూపకల్పనలో పురోగతి కనిపిస్తే స్టే ఇచ్చేందుకు సుముఖత చూపిస్తామని కోర్టు తెలిపింది. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి నిబంధనలను రూపొందించేది లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 24కు వాయిదా వేసింది.మాకు అవసరంబెంగుళూరులో నిత్యం తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యను ప్రస్తావిస్తూ అనేకమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫోటోలు, వ్యాఖ్యలతో తమ ఆవేదనను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతంగా ట్రాఫిక్తో స్తంభించిపోయే బెంగుళూరుకు బైక్ టాక్సీలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రజా రవాణా మార్గాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కోర్టు తీర్పును, ప్రభుత్వవ విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.వా.. ఎన్ను ఐడియాఇలాంటి నిర్ణయాలతో సంబంధం లేకుండా తమ దారులు తమకు ఉన్నాయని యాప్ ఆధారిత అగ్రిగేటర్లు అంటున్నాయి. రాపిడో తమ యాప్లో 'బైక్' సర్వీసును 'బైక్ పార్శిల్'గా మార్చినట్టు తెలుస్తోంది. ప్రయాణికులు తమను తామే 'పార్శిల్'గా బుక్ చేసుకుని ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. ‘‘రైడ్ బుక్ చేసుకోలేకపోతున్నారా? ఫర్వాలేదు, మిమ్మల్ని మీరే పార్శిల్గా పంపించుకోండి. దీనిని 'ప్యాస్ - ప్యాసింజర్ యాజ్ ఏ సర్వీస్' అనొచ్చు" అంటూ ఓ యూజర్ ఇందుకు సంబంధించిన బుకింగ్ స్క్రీన్షాట్ను షేర్ చేశారు. అలాగే.. ఉబెర్ 'మోటో'ను 'మోటో కొరియర్'గా మార్చింది. వా.. ఎన్ను ఐడియా(వా.. ఏం ఐడియా!) తెలివైన ఎత్తుగడ" అని మరో యూజర్ పేర్కొన్నారు. -
వాడితో తిరగడం మానుకో బిడ్డా.. ఇంతలోనే..
సాక్షి, రాయచూరు: ప్రేమించిన పాపానికి అమ్మాయిని ఆరు నెలల క్రితం హత్య చేసి పాతిపెట్టాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన కారణంగానే హత్య చేసినట్టు ప్రియుడు పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గదగ్ తాలూకా నారాయణపుర గ్రామంలో మధుశ్రీ (21) అనే యువతిని సతీష్ హిరేమఠ (22) అనే యువకుడు ప్రేమించాడు. ప్రేమ పేరుతో షికార్లకు తీసుకెళ్లాడు. ఐదేళ్ల నుంచి ఈ ప్రేమాయణం సాగుతోంది. ఇది నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు హిరేమఠతో తిరగడం మానుకోవాలని ఆమెను హెచ్చరించి గదగ్లోని బంధువుల ఇంట్లో ఉంచారు. గత ఏడాది డిసెంబర్ 16న గదగ్ నుంచి మధుశ్రీ వెళ్లిపోయింది. ఈ ఏడాది జనవరి 12న బెటగేరి పోలీస్ స్టేషన్లో కనబడుట లేదనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సతీష్ హిరేమఠ్పై అనుమానంతో పోలీసుల విచారణ జరిపారు.పెళ్లి చేసుకోమనడంతో..ఇద్దరూ బైక్లో వెళ్తున్నట్లు గదగ్లో కొన్ని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టిగా విచారించగా నిందితుడు నిజం కక్కాడు. పెళ్లి చేసుకోవాలని మధుశ్రీ ఒత్తిడి చేసింది.. తనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే ఊరి బయటకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపి, వాగులో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిపాడు. అనంతరం, గదగ్ యస్ఐ మారుతి, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చూడగా యువతి అస్తిపంజరం కనిపించింది. ప్రేమోన్మాది చేతిలో బలయ్యావా తల్లీ అని తల్లిదండ్రులు విలపించారు. -
ఆస్తినంతా ప్రియురాలికి ఇచ్చాడు
కర్ణాటక: వారం రోజుల క్రితం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో భార్య కారణాలను వెల్లడించింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47) నిద్రపోతుండగా భార్య కవిత (44) పెట్రోలు పోసి తగలబెట్టడంతో చనిపోయాడు.పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారించారు. తమకు పెళ్లి జరిగి 22 ఏళ్లు అయ్యిందని, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారని, తమకు ఆస్తి, డబ్బు, నగలు అన్నీ ఉన్నాయని, కుటుంబంతో బాగానే ఉన్నామని తెలిపింది.అయితే భర్త కూలి పని చేసే చోట మరో మహిళ మంజులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఇంట్లో ఉన్న నగలు మంజులకు అందజేశాడు. ఆస్తిని విక్రయించి ఆమెకు ముట్టజెప్పాడని తెలిపింది. రోజూ తాగి వచ్చి అందంగా లేవని నన్ను దూషించేవాడని, దీంతో హత్య చేశానని చెప్పింది. కాగా తండ్రి మరణించి, తల్లి జైలుకెళ్లి ముగ్గురు పిల్లలు బోరుమని విలపించారు. -
భారత్లో 7400 కోవిడ్ కేసులు.. 24 గంటల్లో 9 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్ కేసుల 7,400కు చేరింది. గత 24 గంటల్లో 269 కేసులు నమోదు కాగా తొమ్మిది మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. కర్ణాటకలో అత్యధికంగా ఒక్కరోజులోనే 132 కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 79, కేరళలో 54, మధ్యప్రదేశ్లో 20, సిక్కింలో 11, తమిళనాడులో 12, హర్యానాలో 9తోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా 24 గంటల్లో యాక్టివ్ కోవిడ్ కేసుల్లో పెరుగుదల నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, లద్దాఖ్, మిజోరం, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కేసులేవీ నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ముగ్గురు, రాజస్థాన్, తమిళనాడులలో ఒక్కొక్కరు మరణించారు. జనవరి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 87కు చేరుకుంది. కోవిడ్కు అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా కేరళ ఉంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,109గా ఉంది. తరువాత స్థానాల్లో గుజరాత్ 1,437, ఢిల్లీ 672, మహారాష్ట్ర 613, కర్ణాటక 527, ఉత్తరప్రదేశ్ 248, తమిళనాడు 232, రాజస్థాన్ 180, ఆంధ్రప్రదేశ్ 102 ఉన్నాయి. మణిపూర్, రాజస్థాన్లలోనూ కేసులు పెరిగాయి. -
డ్రైవర్ నిర్లక్ష్యానికి ఐదుగురు బలి
సాక్షి బెంగళూరు/కార్వేటినగరం: కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీ వాసులు మృతిచెందారు. ఏపీఎస్ ఆర్టీసీ చిత్తూరు–2 డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు గురువారం రాత్రి తిరుపతి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. బస్సు శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు శివారులోని హోసకోటె–కోలారు జాతీయ రహదారిపై గొట్టిపుర గేట్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ వేగంగా వెళుతూ ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. బస్సు అదుపు తప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో 18 మందిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె పంచాయతి మారేడుపల్లె గ్రామానికి విశ్వనాథరెడ్డి భార్య శారద(40), వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు గ్రామానికి చెందిన కె.కేశవులురెడ్డి(45), అతని తమ్ముడు జనార్దన్రెడ్డి కుమారుడు 45 రోజుల చిన్నారి, శ్రీరంగరాజపురం మండలంలోని కమ్మకండ్రిగ గ్రామానికి చెందిన తులసి (22), తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం తిమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన హరిబాబు, రోహిణి దంపతుల కుమార్తె ప్రణతి(4)గా గుర్తించారు. ప్రణతి తండ్రి బెంగళూరులో ఆర్మీ ఉద్యోగం చేస్తున్నాడు. క్షతగాత్రులను సిలికాన్ సిటీ, ఎంవీజే ఆస్పత్రుల్లో చేర్పిం చి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోపాటు అతి వేగంతో లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయతి్నంచడమే ఈ ప్రమాదానికి కారణమని హోసకోటె పోలీసులు తెలిపారు. బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ సీకే బాబా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
థగ్ లైఫ్ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు!
కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. తొలి మూడు రోజుల్లో భారీగానే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీ ఇప్పటివరకు పెద్దగానే వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోవడం కూడా కలెక్షన్స్పై ప్రభావం చూపింది.అయితే థగ్లైఫ్ సినిమా నిషేధంపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కన్నడపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్ను కర్ణాటకలో నిషేధిస్తున్నట్లు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఆ తర్వాత హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. కమల్ క్షమాపణలు చెబితే విడుదలకు అనుమతి ఇస్తామని చెప్పిన ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో థగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ చేయలేదు.అయితే సెన్సార్ పూర్తయిన చిత్రాన్ని అనధికారికంగా నిషేధించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా థగ్ లైఫ్పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది. చాలా ఏళ్ల తర్వాత కమల్- మణిరత్నం కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శింబు, త్రిష కీలక పాత్రలు పోషించారు. -
కర్ణాటకలో APSRTC బస్సు ప్రమాదం.. నలుగురు మృతి
-
కర్ణాటకలో APSRTC బస్సుకి ప్రమాదం.. చిత్తూరువాసుల మృతి
బెంగళూరు: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు, ఓ లారీ ఢీ కొట్టడంతో నలుగురు స్పాట్లోనే మరణించారు. 16 మందికి గాయాలు కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చిత్తూరు వాసులుగా తెలుస్తోంది.తిరుపతి నుంచి ఏపీ 03 జెడ్ 0190 నెంబర్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. కోలారు జిల్లా హోసాకోట్లోని పుట్టిపురా గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలుకేశవరెడ్డి(44)తులసి(21)ప్రణతి(5)ఏడాదిన్నర వయసున్న చిన్నారి -
Murudeshwar కోరిన కోర్కెలు తీర్చే పరమ పావన క్షేత్రం
పాండవులు పూజించిన పుణ్యక్షేత్రమిది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరుల పాదధూళి పడిన పావన తీర్థమిది. సురపతి అయిన ఇంద్రుడు సందర్శించిన ఆలయమిది. అదే మురుడేశ్వర్ (Murudeshwar temple). ఇక్కడ కొలువైన స్వామికి మురుడేశ్వరుడని పేరు. ఈ స్వామిని పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి పూజిస్తుంటారు. అతి ప్రాచీనక్షేత్రమైన ఈ పుణ్యస్థలి ఉన్నది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్ తాలూకాలో. రావణాసురుడు తన అనన్యసామాన్యమైన భక్తితో శివుని మెప్పించి, కైలాసం నుంచి ఆయన ఆత్మలింగాన్ని తీసుకుని వస్తుంటాడు. రావణాసురుడి చేతికి శివుడి ఆత్మలింగం చిక్కితే, అతను దాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ఇక రావణుని అకృత్యాలకు అడ్డుకట్ట వేయగలవారే ఉండరనే ఉద్దేశ్యంతో దేవతల కోరికమేరకు వినాయకుడు ఒక పిల్లవాడి రూపంలో వస్తాడు. సాయంత్రం వేళ సంధ్యావందనం చేయడం కోసం ఆత్మలింగాన్ని ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రావణుడు, ఆత్మలింగాన్ని తన చేతిలో పెట్టేముందు దానిని మార్గమధ్యంలో భూమిమీద ఎక్కడా ఉంచకూడదని శివుడు చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్న రావణుడి కంట పడతాడు బ్రాహ్మణ బాలుడి వేషంలో ఉన్న గణపతి. కాసేపు శివలింగాన్ని చేతితో పట్టుకుని ఉంటే, తాను స్నానసంధ్యలు ముగించుకుని వస్తానని చెప్పి వెళతాడు రావణుడు. పథకం ప్రకారం, రావణుడు వచ్చేలోగా శివలింగాన్ని నేలమీద పెట్టేస్తాడా బాలుడు. ఇంకేముంది, శివలింగం భూమిలో దిగబడిపోతుంది. రావణుడు ఎంత ప్రయత్నించినా బయటకు రాదు. అప్పుడు రావణుడు ఆగ్రహంతో ఆత్మలింగానికి కప్పి ఉన్న వస్త్రం, దారం తదితర వస్తువులను విసిరి పాండవులు పూజించిన పుణ్యక్షేత్రమిది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరులపాదధూళి పడి పావన తీర్థమిది. సురపతి అయిన ఇంద్రుడు సందర్శించిన ఆలయమిది. అదే మురుడేశ్వర్. చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్ఇక్కడ కొలువైన స్వామికి మురుడేశ్వరుడని పేరు. ఈ స్వామిని పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి పూజిస్తుంటారు. అతి ప్రాచీనక్షేత్రమైన ఈ పుణ్యస్థలి ఉన్నది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్ తాలూకాలో పారేస్తాడు. ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో, అక్కడ శివలింగాలు ఉద్భవించి, ఆ ప్రదేశాలు మహిమాన్విత ప్రదేశాలుగా మారిపోయాయి. అవే, గోకర్ణక్షేత్రానికి దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వర లింగాలు. ఈ క్షేత్రాలన్నీ కలిపి పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరేస్తే, ఆ వస్త్రం పడిన ప్రదేశమే మురుడేశ్వరమయింది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. సంతోషం అనే అర్థం కూడా ఉంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే ప్రదేశం కాబట్టి ఇది మురుడేశ్వరక్షేత్రమయిందని అంటారు. మురుడేశ్వరంలో ఉద్భవించిన శివలింగానికి పానవట్టాన్ని దేవశిల్పి విశ్వకర్మను రప్పించి, శివుడే స్వయంగా దగ్గరుండి తయారు చేయించాడని ప్రతీతి. ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీమాత, తూర్పున దుర్గామాత, ఇతర దేవతలందరూ మిగిలిన దిక్కులలో ఉండి పరిరక్షిస్తూ ఉంటారని, బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పూలు, పత్రాలతో పూజించి, పండ్లను నివేదించి వెళుతుంటాడని, బ్రహ్మదేవుడు శివుడిపై తన కమండలంతో చిలకరించిన నీటితో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సు ఏర్పడిందనీ స్థలపురాణం చెబుతోంది. .అనితర సాధ్యమైన శిల్పసౌందర్యం... మురుడేశ్వర దేవాలయం ఆ కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, అద్భుత శిల్పసౌందర్యానికి నిదర్శనం. మురుడేశ్వర దేవాలయం ఆవర ణంలో కనిపించే శివుని ఎత్తైన పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తుంది. 123 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని నిర్మించడానికి రెండేళ్ల పట్టిందట. 20 అంతస్థులతో కూడిన ఆలయ గాలిగోపురం సుమారు 250 అడుగుల ఎత్తులో ఉంటుంది. గాలిగోపురానికి ఇరుపక్కలా గల ఏనుగు ప్రతిమలు సజీవ శిల్పాల్లా కనిపిస్తాయి.తీర్థేశ్వరం కూడా... మురుడేశ్వరంలో పవిత్ర స్నానాలు చేయడానికి బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం అనే ముఖ్యమైన తీర్థాలున్నాయి. ఈ తీర్థాలలో స్నానం చేయడం వల్ల దీర్ఘవ్యాధులు నశిస్తాయని, కోరిన కోరికలు నెరవేరతాయనీ అంటారు. ఆలయ ప్రాంగణంలోనే ఇతర దేవతల సన్నిధులు కూడా ఉన్నాయి. వాటిలో గణపతి మందిరం, గౌరీమందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, ఆంజనేయ మందిరాలు ముఖ్యమైనవి. ఆలయం ఆవరణలో ఉన్న రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి, తమ కోరికలను నెరవేర్చమని భక్తులు ముడుపులు కడుతుంటారు. ఎలా వెళ్లాలంటే..? గోకర్ణం నుంచి మురుడేశ్వరం సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురుడేశ్వరం 17వ నంబరు జాతీయ రహదారిలో ఉండటం వల్ల రవాణా సౌకర్యాలు బాగానే ఉన్నాయి. బెంగళూరు, మంగుళూరు, హుబ్లీ, ధర్మస్థల నగరాలనుంచి బస్సులున్నాయి. నేరుగా రైలు సౌకర్యం కూడా ఉంది. భోజన, వసతి: ఇక్కడ యాత్రీకులు ఉండటానికి వసతి గృహాలు, హోటళ్లు ఉన్నాయి. – డి.వి.ఆర్. భాస్కర్ -
కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ దాడులు
బనశంకరి: కర్ణాటకలో సంచలనం రేకెత్తించిన మహర్షి కర్ణాటక వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి (కేఎం వీఎస్టీడీసీ)లో కోట్ల రూపాయల కుంభకోణంలో కేంద్ర ఈడీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయమే ఉమ్మడి బళ్లారి జిల్లాలో, బెంగళూరులో పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు జరిపారు. బళ్లారి జిల్లా ఎంపీ తుకారాం, కంప్లి ఎమ్మెల్యే గణేశ్, కూడ్లిగి ఎమ్మెల్యే ఎన్టీ శ్రీనివాస్, బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర పీఏ గోవర్ధన్ ఇళ్లు, బెంగళూరులోని ఆఫీసుల్లో సోదాలు చేశారు. వారి సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అక్రమ నగదు బదిలీ నియంత్రణ చట్టం కింద చేపట్టిన ఈ తనిఖీలు కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపాయి. వాల్మీకి అభివృద్ధి మండలి స్కాం గతేడాది ఫిబ్రవరిలో బయటకు వచ్చింది. ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడాలని ఒత్తిళ్లు వస్తున్నాయని లేఖ రాసి మండలి ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలి ఖాతాల నుంచి ఓ మంత్రి రూ.94 కోట్లు తమ ఖాతాలకు బదిలీ చేసి తెలంగాణ శాసన సభ ఎన్నికలు, బళ్లారి లోక్సభ ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి బి.నాగేంద్ర రాజీనామా చేశారు. తరువాత ఈడీ ఆయన్ని అరెస్టు చేసింది. మండలి మేనేజింగ్ డైరెక్టర్ను, కొందరు ఉన్నతాధికారులను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఈడీ తాజాగా దాడులు ప్రారంభించింది. మళ్లించిన నిధుల నుంచి కంప్లి ఎమ్మెల్యే గణేశ్కు రూ.3 కోట్లు, ఎంపీ తుకారాంకు రూ.10 కోట్లు, ఎన్టీ శ్రీనివాస్కు కూడా కొంత నగదు చేరినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. -
భార్యతో విసుగు చెంది భర్త ఆత్మహత్య
బనశంకరి(కర్ణాటక): పదే పదే ఇల్లు వదిలిపెట్టి వెళుతున్న భార్య ప్రవర్తనతో విరక్తి చెందిన భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో కేపీ అగ్రహార పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గోవర్ధన్, ప్రియా దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ప్రియా అప్పుడప్పుడు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లేది. నెల క్రితం కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. గోవర్ధన్ కుటుంబం మూడో అంతస్తులో ఉంటుంది. గోవర్ధన్ తల్లి కింది అంతస్తులో ఉంటుంది. 8వ తేదీ రాత్రి తల్లి గోవర్దన్ కు భోజనం అందించి వచ్చింది. భోజనం కూడా చేయకుండా గోవర్ధన్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు సాయంత్రం వరకు కొడుకు బయటకు రాలేదని తల్లి వెళ్లిచూడగా ఉరికి వేలాడుతూ ఉన్నాడు. కేపీ.అగ్రహార పోలీసులు చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
మళ్లీ కులగణన.. అధిష్టానం ఆదేశాలతో కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మళ్లీ కులగణన చేపట్టాలని భావిస్తోంది. అధిష్టానం ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంగళవారం సూచన ప్రాయంగా ప్రకటించారు. అయితే కుల గణన అంశంపై సమీక్ష జరిపేందుకు ఎల్లుండి (జూన్ 12న) కర్ణాటక కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇదిలా ఉంటే. . కర్ణాటకలో 2015లోనే అప్పటి ప్రభుత్వం కుల గణన జరిపింది. హెచ్ కాంతారాజ్ నేతృత్వంలో కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ ఈ సర్వేను నిర్వహించింది. ఆ సమయంలో కోటి 35 లక్షల ఇళ్లను సర్వే చేశారు. 51 ప్రమాణాల ఆధారంగా 5.98 కోట్ల మంది డాటాను సేకరించారు. అయితే.. రాజకీయపరమైన కారణాలు, ఇతర కారణాల దృష్ట్యా ఆ నివేదికను సీల్డ్ కవర్లోనే ఉంచారు. ఈ ఏడాది ఏప్రిల్లో కేబినెట్ ముందుకు ఆ నివేదిక వచ్చింది. అప్పటి నుంచి దఫ దఫాలుగా కేబినెట్ భేటీ అవుతూ.. కర్ణాటక సోషియో ఎకనమిక్ అండ్ ఎడ్యుకేషన్ సర్వేపై చర్చలు జరుపుతోంది. అయితే ఆ నివేదికలోని ఓబీసీ రిజర్వేషన్లను 51 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదేసమయంలో లింగాయత్, వక్కలింగ కులాలు ఈ నివేదికను తోసిపుచ్చుతున్నాయి.మరోవైపు .. మళ్లీ కుల గణన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఇటు రాజకీయ వర్గాలు, అటు మేధో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా టీచర్లను సర్వేలో భాగం చేయడం వల్ల అకడమిక్ ఇయర్కు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జన గణనతో పాటే కుల గణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరోసారి కుల గణన జరపాలని అనుకుంటుండడం విశేషం. కేబినెట్ సబ్కమిటీ లేదంటే లెజిస్లేటివ్ కమిటీ ద్వారా కుల గణన సర్వేపై తుది నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఓయో రూంలో వివాహిత హత్య
బెంగళూరు: బెంగళూరులో ఘోరం చోటుచేసుకుంది. ఓ టెక్కీ.. వివాహితను కత్తితో పొడిచి హత్య చేశాడు. సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగితే, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హరిణి (35) హత్యకు గురైన మహిళ కాగా, యశస్ (25) అనే ఐటీ ఇంజినీరు నిందితుడు. ఇద్దరు కూడా కెంగేరి నివాసులు కాగా, పూర్ణ ప్రజ్ఞా లేఔట్లో ఓయో రూమ్లో ఘటన జరిగింది.గత శుక్రవారం ఇద్దరూ రూంని తీసుకున్నారు. గొడవ జరిగి యశస్ కత్తితో ఆమెను కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హరిణికి పెళ్లయి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడు అవివాహితుడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఏడాది నుంచి అనైతిక బంధానికి దారి తీసిందని సమాచారం. తాను ఈ బంధాన్ని కొనసాగించలేనని హరిణి చెప్పగా, నిందితుడు కోపంతో ప్రాణాలు తీశాడని అనుమానాలున్నాయి. హరిణి మృతదేహంపై 17కు పైగా కత్తిపోట్లు ఉన్నాయి. -
ఆమెకు 35.. అతడికి 25.. జాతరలో పరిచయం కాస్తా..
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆమెకు 36, అతడికి 25 ఏళ్లు కాగా.. ఓయో హోటల్ రూమ్లో తన ప్రేయసిని ప్రియుడు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. బెంగళూరులోని కెంగేరికి చెందిన హరిణి(36), దాసేగౌడకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ కెంగేరిలో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం కెంగేరిలో జాతర జరిగింది. ఈ జాతరకు హరిణి వెళ్లింది. అక్కడే ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ యశస్ కూడా ఇదే జాతరకు వెళ్లడంతో.. అక్కడ హరిణిని చూశాడు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయడంతో.. వారిద్దరికి పరిచయం ఏర్పడింది. జాతరలోనే ఇద్దరూ ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. తరువాత వారి మధ్య స్నేహం పెరిగింది. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో మరింత సన్నిహితంగా మెలిగారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ విషయం హరిణి భర్త దాసేగౌడకు కూడా తెలియడంతో ఆమెను హెచ్చరించాడు. అనంతరం, దాసేగౌడ.. ఆమె వద్ద నుంచి ఫోన్ తీసుకున్నాడు. వారి మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేశాడు. దీంతో, హరిణి తన తప్పును తెలుసుకుని.. భర్త వద్ద కన్నీరుపెట్టుకుని తనను క్షమించాలని కోరింది. ఆమెను నమ్మిన భర్త.. ఫోన్ ఇవ్వడంతో.. మళ్లీ హరిణితో యశస్ కంటాక్ట్లోకి వచ్చాడు. ఆమెతో మాట్లాడాలి అని ఫోన్ చేసి బెంగళూరులోని ఓ హోటల్ గదికి పిలిచాడు. దీంతో, శుక్రవారం వీరద్దరూ పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్లోని ఓయో హోటల్కు వెళ్లి గది అద్దెకు తీసుకున్నారు. గదిలో ఉన్న సమయంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.హరిణి తనతో పాటే ఉండాలని యశస్ పట్టుబట్టాడు. తాను లేకుండా జీవించలేనని.. తనతోనే ఉండాలన్నాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో.. ఆవేశానికి గురైన యశస్.. హరిణిని దారుణంగా హత్య చేశాడు. హరిణిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత యశస్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి సుబ్రహ్మణ్యపుర పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. విచారణలో భాగంగా యశస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
నన్ను రమ్మని పిలిచారు అంతే.. నాకు ఇంకేమీ తెలీదు: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025 టైటిల్ను గెలిచిన సందర్భంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ల సన్మానం కార్యక్రమం.. పెను విషాదాన్ని మిగిల్చింది. గతవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ ఈవెంట్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృత్యువాత పడగా, 48 మంది వరకూ గాయపడ్డారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ.. అధికార కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ ధ్వజమెత్తింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినా అది ప్రభుత్వ వైఫల్యం అని విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. దీనిపై తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘ఆర్సీబీకి సంబంధించిన ఈవెంట్ను తాము నిర్వహించలేనప్పుడు ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుందని అంటున్నారు. ‘నన్ను ఆ ఈవెంట్కు రమ్మని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) ఆహ్వానించింది. నా వద్దకు వచ్చి మరీ కేఎస్సీఏ పెద్దలు నన్ను ఆహ్వానించారు. గవర్నర్ కూడా ఆ ఈవెంట్కు వస్తున్నారని నాకు చెప్పారు. నేను కూడా ఆ ఈవెంట్కు వెళ్లా. అంతేకానీ మేము ఆ ఈవెంట్ను నిర్వహించలేదు. నన్ను రమ్మన్నారు.. వెళ్లాను.. అంతకుమించి నాకైతే ఏమీ తెలీదు’ అని స్పష్టం చేశారు. ఆ కార్యక్రమాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఐపీఎల్ టైటిల్ను సాధించాలనే చిరకాల కోరిక ఆర్సీబీకి ఎట్టకేలకు లభించడంతో ఆ జట్టును ఘనంగా సన్మానించాలనుకున్నారు. దాంతో ఆదరా బాదరగా ఈవెంట్ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. లక్షల్లో అభిమానల హాజరుకావడంతో ఆ ఈవెంట్ కాస్తా విషాదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కేఎస్సీఏలతో పాటు కర్ణాటక ప్రభుత్వంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ టీమ్ పెద్ద ఈవెంట్ను నిర్వహిస్తంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ విమర్శల వర్షం కురిసింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు సంజాయిషీలు ఇస్తూనే వస్తున్నారు. -
కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను
యశవంతపుర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన హాసన్ జిల్లా వాసి భూమిక్ (20) ఇంటిలో చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విగతజీవి అయ్యాడు. ఇంజనీరింగ్ చదువుతున్న భూమిక్ మృతితో తండ్రి తల్లడిల్లిపోతున్నారు. 100 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించి భూమిక్ కోసం పెట్టానంటూ కొడుకు శవం వద్ద తండ్రి బోరుమంటున్న వీడియో అందరినీ కలిచివేస్తోంది.హాసన్ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్. బెంగళూరులో ఉంటు ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. కాలేజీ స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియం వద్దకెళ్లి తొక్కిసలాటలో మరణించాడు. విక్టోరియా ఆస్పత్రిలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.పోస్టుమార్టం చేయొద్దుఎంతో ముద్దుగా పెంచాను. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని తండ్రి రోదించాడు. నా కొడుక్కి పోస్టుమార్టం చేయవద్దు, కోసి ముక్కలు చేయొద్దు అని ప్రాధేయపడ్డాడు. సీఎం, డీసీఎం వచ్చి పరామర్శిస్తారు, కానీ నా కుమారుడు రాడంటూ తండ్రి లక్ష్మణ బోరుమన్నాడు. అంబులెన్స్ లేని కారణంగా జీపులో భూమిక్ మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.కన్నీటి మధ్య అంత్యక్రియలుతుమకూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన మనోజ్ (20) అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య జిల్లాలోని కుణిగల్ తాలూకా ఎడెయూరు సమీపంలోని నాగసంద్ర గ్రామంలోని వారి తోటలో జరిగాయి. అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.బెంగళూరులోని హెబ్బాళ సమీపంలోని కెంపాపుర రెసిడెన్సీ కాలేజీలో బీబీఎం చదువుతున్న మనోజ్ యలహంకలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉండేవాడు. బుధవారం స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృత్యువాత పడ్డాడు.ప్రభుత్వానిదే బాధ్యత: మంత్రియశవంతపుర: తొక్కిసలాటకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీబీటీ మంత్రి ప్రియాంక ఖర్గే తెలిపారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటన జరగిఉండరాదు, ఎక్కువమంది అభిమానులు రావడంతో జరిగింది.సరైన వ్యవస్థలను కల్పించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం నుంచి లోపం జరిగిన మాట వాస్తవమే, అంగీకరిస్తున్నాం అన్నారు. ఒక ప్లాన్ ప్రకారం కార్యక్రమంను నిర్వహించి ఉంటే బాగుండేదని అన్నారు. మంత్రి ప్రకటనను జేడీఎస్ ఎక్స్లో పోస్టు చేసింది.చదవండి: పెళ్లి చేసి పంపాలనుకున్నాం.. పాడె కట్టి సాగనంపారు -
తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన విచారణలో బెంగళూరు పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. సీఎం సిద్దరామయ్య ఆదేశాల మెరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మెనెజ్మెంట్పై చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను శుక్రవారం అరెస్టు చేశారు.ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.నిఖిల్ సోసాలేను పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి అరెస్ట్పై ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు. కాగా బుధవారం (జూన్ 4) జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతిచెందారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు.ఇక ఈ ఘటనపై గురువారం విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం మండిపడింది. ఈ ఘటన వెనుక కారణాలను తేల్చాలని సిద్దరామయ్య సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం సీఐడీ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఇప్పటికే బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్, డీసీపీ శేఖర్, ఇన్స్పెక్టర్ గిరీశ్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిందిచదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్కు కొత్త పేరు ఖరారు -
రాష్ట్రమంతా చూసింది.. మమ్మల్ని క్షమించండి: డిప్యూటీ సీఎం
బెంగళూరు: ఐపీఎల్ టైటిల్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) గెలిచిన సందర్బంలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో తొక్కిసలాట(Bengaluru Stampede) జరిగి 11 మంది మృత్యువాత పడటంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకర సంఘటనగా పేర్కొన్న డీకే శివకుమార్.. దీనికి తమ ప్రభుత్వం తరఫున క్షమాపణలు తెలియజేశారు. ‘ఈ సంఘటనను రాష్టం అంతా చూసిందని, ఇది చాలా మనోవేదనకు గురి చేసే సంఘటనని, తొక్కిసలాట జరగడం పదకొండు మంది చనిపోవడం అత్యంత బాధాకరం. మేము ప్రజలకు క్షమాపణలు చెప్పడం తప్పిస్తే ప్రస్తుతం ఏమీ చేయలేము. ఆ విషాద ఘటన గురించి ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంఇ. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అక్కడ ఏం జరిగిందో అంతా చూశారు. దీన్ని రాజకీయం చేయడం మంచిది కాదు. ఇక్కడ జరిగింది వేరు.. రాజకీయం చేయాలనుకోవడం లేదు’ అని డీకే శివకుమార్ జాతీయ మీడియా చానల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ తొక్కిసలాటలో చనిపోయింది అంతా కూడా యువకులే. వారి జీవితాలు ఇలా అయినందుకు చాలా బాధగా ఉంది. అయితే గవర్నమెంట్ వైఫల్యంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని మీరు బావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇక్కడ ఎవర్ని బాధ్యుల్ని చేయాలని అనుకోవడం లేదన్నారు. ఈ ఘటనపై బీజేపీ అడుగుతున్న ప్రశ్నలకు తాము పారిపోవాలని అనుకోవడం లేదన్నారు డీకే శివకుమార్. ఈ ఘటనపై వారికి కచ్చితంగా సమాధానం చెబుతామన్నారు. ఇక ఈ ఈవెంట్కు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని పోలీస్ కమిషనర్ చెబుతుండగా, ఆర్సీబీ ఒక స్టేట్మెంట్తో బయటకు రావడంపై ప్రశ్నించగా, ఇప్పుడు దానిపై మాట్లాడదలుచుకోలేదన్నారు తాను కేవలం ఎంతో ముఖ్యమైన ప్రజల జీవితాల గురించే ఆలోచిస్తున్నానన్నారు డీకే శివకుమార్.బెంగళూరు పోలీస్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటుతొక్కిసలాట ఘటనపై బెంగళూరు సీపీపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. సీపీతో పాటు అడిషనల్ సీపీ, ఏసీపీ, డీసీపీలను సైతం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విచారణకు సీఐడీని ఆదేశించింది. 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై హైకోర్టు ఆగ్రహంఆర్సీబీ, కేఎస్సీఏలకు షాక్ -
కొడుకు మృతిపై తల్లడిల్లిన తల్లి : కన్నీటి పర్యంతమైన డిప్యూటీ సీఎం
ఐపీఎల్ 2025లో టైటిల్ దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవంలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బెంగళూరులోని విధాన సౌధా, చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సమయంలోఅనేక హృదయవిదారక దృశ్యాలు, కథనాలు అందర్నీ కలచి వేస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్ మీద పిచ్చితో, తమ అభిమాన క్రికెటర్లను చూడాలన్న ఆశతో వచ్చిన యువకులు ప్రాణాలు కోల్పోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురించేసింది. ఇది ఇలా ఉంటే "పోస్ట్మార్టం చేయకుండానే తన కొడుకు మృతదేహాన్ని ఇవ్వాలని బిడ్డను కోల్పోయిన తల్లి వేడుకుంది. దీనిపై ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DK Shivakumar) భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి బాధను అర్థం చేసుకోగలం. కానీ అది చట్టపరమైన ప్రక్రియ అంటూ శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు.నిన్న బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన తండ్రిని ఓదార్చడం ఎవ్వరి తరమూ కాలేదు. ‘‘కనీసం నా కొడుకు మృతదేహాన్ని నాకు ఇవ్వండి. పోస్ట్మార్టం చేయవద్దు, ముక్కలుగా కోయవద్దు..’’ అంటూ అధికారులను వేడుకున్నాడు. తనకు తెలియకుండానే వచ్చాడు..ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవ్వరొచ్చినా నా బిడ్డను తీసుకురాలేరు అంటూ కన్నీరుమున్నీరయ్యాడుకేంద్ర మంత్రి శోభా కరండ్లజే శివకుమార్ వెంటనే రాజీనామా చేయాలని తొక్కిసలాటపై దర్యాప్తు చేయడానికి హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శివకుమార్ స్పందించారు. ఈ విషాదంపై బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కాగా సంఘటన జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పారు. 35వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేడియంలో భారీ జనసమూహం సరిపోలేదన్నారు. మరోవైపు ఊహించని దానికంటే సుమారు 8 లక్షల మంది జనం రావడంతోనే ప్రమాదం జరిగిందని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర తెలిపారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే ఈ విషయంపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించినట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ప్రకటించారు. -
RCB: హైదరాబాద్లో తప్పిన ముప్పు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సన్మానం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కొందరు చనిపోగా, అనేక మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోనూ ఇలాంటి ముప్పు తప్పింది. బుధవారం రాత్రి ఆర్సీబీ (RCB) జట్టు ఐపీఎల్ కప్పు గెలిచిన వెంటనే ట్యాంక్బండ్, తెలుగు తల్లి చౌరస్తా, అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్లతో పాటు అనేక ప్రాంతాలు క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. ద్విచక్ర వాహనాలపై ఫీట్లు చేస్తూ యువకులు కేరింతలు కొట్టారు. రహదారులపై పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు.ఎన్డీఆర్ మార్గ్, సచివాలయం, తెలుగుతల్లి చౌరస్తా ప్రాంతాల్లో కొందరు రెచ్చిపోయారు. అక్కడ ఆగిన వాహనాల పైకి ఎక్కి హంగామా చేశారు. ద్విచక్ర వాహనాల హారన్లు మోగిస్తూ, మితిమీరిన వేగంతో నడిపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు (Police) వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఉన్నతాధికారులు అదనపు బలగాలను ఆ ప్రాంతాలకు పంపారు. వీళ్లు అక్కడ ఉన్న యువకుల్ని చెదరగొట్టి పరిస్థితుల్ని చక్కదిద్దారు. చదవండి: ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా -
మాటలు రావడం లేదు.. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై విరుష్క
బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విక్టరీ పరేడ్ సెలబ్రేషన్స్ తీవ్ర విషాదాన్ని నింపాయి. బుధవారం నగరంలోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ఆర్సీబీ స్టార్ప్లేయర్ విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మాటలు రావడం లేదు. తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది‘ అంటూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజీ స్పందించింది. ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది. ‘‘చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల మేం తీవ్రంగా కలత చెందాం. ఈ మధ్యాహ్నం జట్టు రాకను అంచనా వేస్తూ బెంగళూరు అంతటా అభిమానులు భారీ ఎత్తున గుమిగూడారు. అయితే మీడియా ద్వారా మేం ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకున్నాం. ప్రతీ ఒక్కరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారికి ఆర్సీబీ సంతాపం తెలుపుతోంది. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ప్రాణ నష్టం మమ్మల్ని మరింత కలిచి వేసింది. ఈ సంఘటన గురించి మా దృష్టికి వచ్చిన వెంటనే మా కార్యక్రమాన్ని ఆపేసాం. స్థానిక అధికారుల మార్గదర్శకత్వం, సలహాలను పాటించే ఈ వేడుకలను నిర్వహించాం. అభిమానులంతా సురక్షితంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం.’’అని తెలిపింది. మరోవైపు ఇదే ప్రకటనను కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఐపీఎల్లో 18 ఏళ్ల నిరీక్షణ ఫలించి, ఆర్సీబీ తొలిసారి టైటిల్ కప్ కైవసం చేసుకోవడంతో అసంఖ్యాక అభిమానులు సంబరాల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. వాస్తవానికి ఆర్సీబీ యాజమాన్యం విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రకటించింది. అయితే, ఉదయం ఆలస్యంగా ట్రాఫిక్ పోలీసులు ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అప్పటికే భారీగా చేరుకున్న అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంది. బుధవారం మధ్యాహ్నానికే విధానసౌధ, ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్ పరిసర ప్రాంతాలకు సుమారు రెండు లక్షల మంది అభిమానులు చేరుకున్నారని ఒక అంచనా. ఈ అంచనా పోలీసుల అంచనాని మించిపోయి వాళ్ల చేతులు దాటిపోయింది. అదే సమయంలో.. ఏడో నెంబర్ గేటు దగ్గర విపరీతమైన రద్దీ, ఫ్రీ టికెట్ పుకార్లు, వర్షం, స్టేడియంలో జనాల బరువుకు కాలువ పైకప్పు కుప్పకూలిపోవడం.. ఇలా ఒకేసారి అన్నింటితో పరిస్థితి అదుపుతప్పడంతో తీవ్రమైన తొక్కిసలాటకు కారణమైందని పోలీసులు అంటున్నారు. మరోవైపు ఈ ఘటనకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) కారణమనే విమర్శ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ఘటనపై కేఎస్సీఏ విచారం వ్యక్తం చేసింది. ’చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న దురదృష్ట ఘటనపై ఆర్సీబీ, కేఎస్సీఏ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.’అని ఓ ప్రకటనను విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయలు అందజేస్తామని కేఎస్సీఏ ప్రకటించింది. ఇక.. ఈ దుర్ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. అది తమ ఈవెంట్ కాదని, అయితే నిర్వహణలో లోపాలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ అన్నారు. "పూర్తి వాస్తవాలు తెలియకుండా నేను ఇప్పుడు ఎవరినీ నిందించదలచుకోలేదు. గత ఏడాది వెస్టిండీస్లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ముంబైలో బీసీసీఐ విజయోత్సవ సభ నిర్వహించినప్పుడు, స్థానిక క్రికెట్ సంఘం, ముంబై పోలీసులు, అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి పక్కా ప్రణాళిక రచించాం. లక్షలాది మంది హాజరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. అన్ని నిబంధనలు పాటించాం" అని సైకియా తెలిపారు. -
RCB విజయోత్సవంలో ఘోర విషాదం
-
విషాదం నడుమే.. ఆర్సీబీ జట్టుకు కర్ణాటక ప్రభుత్వ సన్మానం (ఫొటోలు)
-
తొక్కిసలాటపై రాజకీయ దుమారం.. సీఎం నోట కుంభమేళా మాట
సాక్షి, బెంగళూరు: గెలుపు సంబరాల్లో ఘోరం చోటుచేసుకుంది.. అభిమానుల కేరింతలు, కోలాహలంతో సందడిగా ఉన్న ప్రాంగణం ఒక్కసారిగా ఆర్తనాదాలతో మార్మోగింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవాలకు అసంఖ్యాకంగా అభిమానులు తరలిరావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద పరిస్థితి అదుపుతప్పి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతిచెందగా 47 మంది గాయపడ్డారు. ఈ విషాదంపట్ల ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య... మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ), ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ కలిసి రూ. 5 లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించాయి. మరోవైపు ఈ ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పరస్పర రాజకీయ విమర్శలకు దిగాయి. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ‘‘ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. సరైన ప్రణాళిక లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందుకే ఈ ఘోరం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని ఆరోపిస్తోంది. ఇంకోవైపు.. జేడీఎస్ కీలక నేత, కేంద్ర మంత్రి కుమారస్వామి డిప్యూటీ సీఎం శివకుమార్ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘క్రికెటర్లను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు ఎవరు వెళ్లారు?. ఈవెంట్కు డిప్యూటీ సీఎం మద్దతుదారులు ఎందుకు వచ్చారు?. అమాయకమైన అభిమానుల మృతికి బాధ్యత ఎవరు వహిస్తారు?’’ అని ప్రశ్నించారు. అయితే ఈ ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్మీట్లో సీఎం సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన నోట కుంభమేళా తొక్కిసలాట ప్రస్తావన రావడం గమనార్హం.‘‘ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. సరైన ప్రణాళిక లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందుకే ఈ ఘోరం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని ఆరోపించింది. కాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఖౌy్చ∙ఇజ్చి ్ఛnజ్ఛటటఆ్ఛnజ్చ uటu) విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా అధిక సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఇలాంటి తొక్కిసలాట ఘటనలు జరిగేవే. ఇంతకంటే దారుణమైనవి కూడా జరిగాయి. ఈ ఏడాది ఆరంభంలో.. మహా కుంభమేళాలోనూ ఇది జరిగింది. ఆ ఘటనలో 50 నుంచి 60 మంది చనిపోయారు కదా. అలాగని ఇప్పుడు జరిగిన ఘటన నుంచి తప్పించుకోవాలని మేం అనుకోం. ఇది ప్రభుత్వం నిర్వహించిన ఈవెంట్ కాదు. క్రికెట్ అసోషియేషన్ నిర్వహించింది. ఈవెంట్కు ప్రభుత్వం కేవలం అనుమతి మాత్రమే ఇచ్చింది. పూర్తి బందోబస్తును అందించింది. అయినప్పటికీ.. స్టేడియం కెపాసిటీ 35 వేలు అయితే.. మూడు లక్షల మంది వచ్చారు. ఘటనలో 11 మంది మరణించగా.. గాయపడిన వాళ్లంతా త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అదృష్టవశాత్తూ.. విధాన సౌధ వద్ద జనం గుమిగూడినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు అని సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. ఈ ఏడాది మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించారని, 60 మంది గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏం జరిగిందంటే? ఆర్సీబీ అభిమానులు మంగళవారం రాత్రి నుంచే బెంగళూరులో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ జట్టు తమ హోం గ్రౌండ్లో అభిమానుల సమక్షంలో ఆనందం పంచుకోవాలని భావించింది. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి జట్టు సభ్యులు వచ్చారు. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేరుగా హెచ్ఏఎల్ విమానాశ్రయానికి వెళ్లి వారికి స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం ముందుగా విధాన సౌధ వద్ద కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ కార్యక్రమం సజావుగానే సాగింది. అక్కడి నుంచి ఓపెన్ టాప్ బస్సులో ‘విక్టరీ పరేడ్’తో చిన్నస్వామి స్టేడియానికి ఆటగాళ్లు చేరుకోవాల్సి ఉంది. అయితే.. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి పోటెత్తడంతో మైదానం పూర్తిగా నిండిపోయింది. అయినప్పటికీ బయట కూడా భారీగా ఫ్యాన్స్ నిరీక్షిస్తూ ఉండిపోయారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. భారీ సంఖ్యలో జనం గుమిగూడడంతో అక్కడ ఉన్న డ్రెయిన్ కూలిపోయింది. దీంతో ఆందోళనకు గురైన వాళ్లంతా చెల్లాచెదురుకాగా.. చివరకు ఇదే తొక్కిసలాటకు దారితీసింది. వారిని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ తోపులాటలో శ్వాస అందక కొందరు సొమ్మసిల్లారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించేందుకు కూడా వీల్లేని స్థితిలో అభిమానులు పోటెత్తారు. చివరకు క్షతగాత్రులను బౌరింగ్ ఆస్పత్రికి, వైదేహీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రణాళికా లోపమే కారణం?దాదాపు ఏడాది క్రితం భారత టి20 జట్టు వరల్డ్ కప్ గెలిచి వచ్చిన తర్వాత ముంబైలో ఓపెన్ టాప్ బస్సులో విజయయాత్ర జరిగింది. అయితే అంతటి మహానగరంలో కూడా ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా అధికారులు, పోలీసులు చక్కటి ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు ఆర్సీబీ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిజానికి టీమ్ మేనేజ్మెంట్ చాలా హడావుడిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఫైనల్ జరిగిన 24 గంటల్లోపే బెంగళూరు వచ్చేసి ఇలాంటి ఈవెంట్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సన్నాహాలకు కనీస సమయం కూడా ఇవ్వకుండా ప్రోగ్రామ్ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టీమ్ ఫ్యాన్స్కు పిలుపు ఇచ్చేసింది. మంగళవారం రాత్రి నుంచి ఇంకా గెలుపు ఆనందంలోనే ఉన్న అభిమానులకు ఈ కార్యక్రమం దానికి కొనసాగింపులా కనిపించి అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు. పోలీసులు చివరకు పరిస్థితిని వివరించి ఓపెన్ టాప్ బస్సు ర్యాలీ జరగకుండా నిలువరించినా... అప్పటికే పెద్ద నష్టం జరిగిపోయింది. ఒకవైపు తొక్కిసలాటతో మైదానం బయట పరిస్థితి విషాదం నెలకొన్నప్పటికీ మరోవైపు స్టేడియంలో వేడుకలు కొనసాగాయి. అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఆర్సీబీ అధికారులకు ఫోన్ చేసి వెంటనే కార్యక్రమం ఆగిపోయేలా చేశారు. జనాన్ని అదుపు చేయడం చాలా కష్టంగా మారిందని, పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. -
ఆర్సీబీ విజయోత్సవంలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురి దుర్మరణం (ఫోటోస్)
-
కట్టిపడేసే కూర్గ్ అందాలు..తప్పక చూడాల్సిన ప్రాంతాలివే..!
-
నటుడు కమల్ హాసన్పై కర్ణాటక హైకోర్టు సీరియస్
-
ఉమెన్ సేఫ్టీ: ఆపదలో అండగా..!
బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మైసూర్కు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కరణ్ సరికొత్త పరికరాన్ని తయారుచేశాడు. ఐజీడబ్ల్యూఎస్(ఇన్నోవేటివ్ ఇంటెలిజెంట్ జీయోఫెన్స్–ఎనేబుల్డ్ వేరుబుల్స్ సిస్టమ్స్) అనే పరికరం మహిళలు ఆపదలో ఉంటే వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ను ఎలార్ట్ చేస్తుంది.‘డివైజ్లోని ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి...జియోఫెన్స్–బేస్డ్ డిటెక్టర్. ఒక మహిళని ఎవరైనా మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాలో అవుతున్నప్పుడు ఈ డివైజ్ సందేహాస్పద వ్యక్తి మొబైల్ ఫోన్ను గాని, బ్లూటూత్ డివైజ్ అడ్రస్ గుర్తించడానికి ఉపయోగపడుతుంది’ అంటున్నాడు కరణ్.ఈ డివైజ్లో జియోఫెన్స్–బేస్డ్ సేఫ్టీ టైమర్ కూడా ఉంటుంది. యూజర్ ఒక డెస్టినేషన్ చేరుకోవడానికి టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి షాపింగ్కు వెళ్తూ 30 నిమిషాలలో ఇంటికి వస్తానని చెబితే సిస్టమ్ ఆమె జియోలోకేషన్ని మానిటర్ చేస్తుంది. సెట్ చేసిన టైమ్ లోపు ఇంటి జియోఫెన్స్లోకి రాకపోతే డివైజ్ ఆటోమెటిక్గా ఆమె లోకేషన్ని ఎమర్జెనీ కాంటాక్ట్కి పంపిస్తుంది. డివైజ్లో ‘రిటర్న్ హోమ్ సేఫ్టీ రిమైండర్’ కూడా ఉంటుంది. డివైజ్లో మరో సేఫ్టీ ఫీచర్...డేంజర్–జోన్ నోటీఫైయర్. ఇది హై–రిస్క్ జీపీఎస్ లొకేషన్స్ ప్రీలోడెడ్ జాబితాను ఉపయోగిస్తుంది. యూజర్ ఈ ప్రాంతాలలోకి వెళ్లినప్పుడు వేరబుల్ బజర్ యాక్టివేట్ అవుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్కి తెలియజేస్తుంది. (చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..) -
'థగ్ లైఫ్ ఆడకూడదు అంటూ వార్నింగ్'
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్పై కర్ణాటక వ్యాప్తంగా వ్యతిరేకత అధికమవుతోంది. ఆయన నటించిన కొత్త సినిమా థగ్ లైఫ్ను కర్ణాటకలో విడుదల చేయకండి అంటూ కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఒక్క థియేటర్లో సినిమా ఆడినా బెంగళూరును బంద్ చేస్తామని కర్ణాటక రక్షణా వేదిక నాయకులు తెలిపారు. ఈ సినిమా జూన్ 5న దేశమంతటా విడుదల అవుతోంది. కమల్ క్షమాపణ చెప్పకపోవడంతో కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. సినిమా ఆడిస్తే థియేటర్ లోపలికి చొరబడి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కన్నడ సంఘాలన్ని ఏకమై ఈ తీర్మానం చేసినట్లు నేతలు తెలిపారు. కమల్ సినిమా ఎట్టిపరిస్థితిల్లోనూ ఇక్కడ రన్ చేసేది ఉండదని వారు పేర్కొన్నారు. కమల్ని అరెస్టు చేయాలి కమల్ హాసన్ను వెంటనే అరెస్టు చేయాలని మైసూరులో కన్నడ చళువళి పోరాటదారుడు వాటాల్ నాగరాజు, సంఘాల నేతలు కమల్ చిత్రానికి నిప్పుపెట్టారు. కమల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాటాల్ మాట్లాడుతూ కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాలను పూర్తిగా బహిష్కరణ చేయాలని అన్నారు. కన్నడ ప్రజలు కమల్ సినిమాలను వ్యతిరేకించాలని చెప్పారు. -
ఆటోడ్రైవర్ను తిట్టి.. చెప్పుతో కొట్టి, ఆపై శిరస్సు వంచి క్షమాపణలు
బెంగళూరు: రాష్ట్రంలో కన్నడిగులపై.. కన్నడేతర వ్యక్తులు దాడులు చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. వీటిని అక్కడి ప్రజలు కూడా అంతే తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓ ఆటోడ్రైవర్ను ఇస్టానుసారం తిడుతూ చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. గంటల వ్యవధిలోనే ఆమెతో క్షమాపణలు చెప్పించిన మరో వీడియో బయటకు వచ్చింది. పంకూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో స్కూటీ మీద శనివారం బయటకు వెళ్లింది. శివాజీనగర్ ప్రాంతంలో.. వాళ్ల బండి పక్కనే ఆగిన ఆటోడ్రైవర్తో ఒక్కసారిగా ఆమె వాగ్వాదానికి దిగింది. ఆటో టైర్ తన కాలు మీద నుంచి వెళ్లిందని చెబుతూ ఆమె అతని దూషించసాగింది. అయితే అలాంటిదేం జరగలేదు కదా అని ఆ ఆటోడ్రైవర్ ఆమెకు బదులిచ్చాడు. అయినా ఆమె అస్సలు తగ్గలేదు. ఆమె తిట్ల పురాణాన్ని ఆ డ్రైవర్ ఫోన్లో వీడియో తీయబోయాడు. అంతే.. ఆ పరిణామంతో ఆ యువతి రగిలిపోయింది. ‘‘వీడియో తీస్తావా.. తీసుకో’’ అంటూ కాలికున్న చెప్పు తీసి అతన్ని కొట్టింది. స్థానికులు కొందరు సర్దిచెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఘటన జరిగిన వెంటనే ఆ ఆటోడ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి పేరు లోకేష్గా తెలుస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగర పోలీసులు సత్వర చర్యలకు దిగారు. ఆ యువతిని అరెస్ట్ చేశారు. ఆపై ఆమె స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆదివారం సాయంత్రం ఆ ఆటోడ్రైవర్, మరికొందరి సమక్షంలో పంకూరి మిశ్రా క్షమాపణలు కోరింది. తాను గర్భవతినని, ఏదైనా అనుకోని ఘటన జరగొచ్చనే ఆందోళనతో తాను అలా ప్రవర్తించానని చెప్పుకొచ్చింది. జరిగిందానికి లోకేష్కు క్షమాపణలు చెబుతూ.. శిరస్సువంచి నమస్కారాలు చెప్పింది. బెంగళూరు నగరమన్నా.. కన్నడ సంప్రదాయాలన్న తనకు మంచి ఉద్దేశాలే ఉన్నాయని, కన్నడ ప్రజలనుగానీ.. భాషనుగానీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని.. జరిగిందానికి తనను క్షమించాలని ఆ భార్యాభర్తలు వేడుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. In #Bengaluru: The female software engineer, who was arrested for assaulting an autorickshaw driver with her slipper in Bellandur area over a road dispute, has apologised to the autodriver, his family & Kannadigas. Videos of assault & apology👇@timesofindia pic.twitter.com/61xXewMgI8— TOI Bengaluru (@TOIBengaluru) June 2, 2025 VIDEO CREDITS: TOI Bengaluru -
ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం దండేలి..! చూడచక్కని ప్రదేశాలివే..
-
COVID-19: పిల్లలను స్కూళ్లకు పంపొద్దు: కర్నాటక ప్రభుత్వం
బెంగళూరు: దేశమంతటా కోవిడ్-19 కేసులు(Covid-19 cases) పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు నూతన మార్గదర్శకాలను జారీచేసింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎవరైనా పిల్లలు జ్వరం, దగ్గు లేదా జలుబు లాంటి లక్షణాలతో బాధపడుతుంటే వారిని తల్లిదండ్రులు పాఠశాలలకు పంపవద్దని కోరింది.ఈ ప్రకటన విడుదల చేసిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రంలోని విద్యా సంస్థలలో(educational institutions) ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ఇటువంటి నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటమే ధ్యేయంగా ఈ ప్రకటనను వెలువరించింది. ఫ్లూ లాంటి లక్షణాలు కలిగిన విద్యార్థులు పాఠశాలలకు రావద్దని, ఇంట్లోనే ఉంటూ తగిన వైద్య సంరక్షణ పొందాలని తెలిపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కోవిడ్-19 సమీక్షా సమావేశం అనంతరం పాఠశాలలకు ఈ ఆదేశాలను జారీ చేశారు.చిన్నారులలో జ్వరం, దగ్గు, జలుబు(Fever, cough, cold) లేదా ఇతర లక్షణాలు గమనించినప్పుడు వారి తల్లిదండ్రులు తమ చిన్నారులకు తగిన చికిత్స అందించి, కోలుకున్నాకనే పాఠశాలలకు పంపించాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు పాఠశాలల్లో కోవిడ్-19 వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించడం, మాస్క్లు ధరించడం శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం లాంటివి అమలు చేయాలని సూచించింది. కర్ణాటకలో 230కి పైగా కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆరోగ్య అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దేశంలో కోవిడ్-19 కేసులలో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.ఇది కూడా చదవండి: ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. పాక్తో సంబంధాలపై ఆరా -
ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..
‘ది సెకండ్ విండ్’ చిత్రానికి వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు, ప్రశంసల మాట ఎలా ఉన్నా... ‘ఎవరీ మయూర శివల్కర్?’ అనే ప్రశ్న ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముగ్గురు మహిళల నిజజీవిత సంఘటనల ఆధారంగా ఇందిర బైరికర్ ‘ది సెకండ్ విండ్’ చిత్రాన్ని రూపొదించారు. ఆ చిత్రంలో మయూర శివల్కర్ జీవితం కూడా ఉంది...కర్నాటకలోని బెల్గావికి చెందిన మయూర శివల్కర్ మారథానర్, అథ్లెట్, బ్రెస్ట్ కేన్సర్ సర్వైవర్. ‘ది సెకండ్ విండ్’లో మయూర శివల్కర్ పాత్ర భావోద్వేగాలకు పరిమితమైనదే కాదు ప్రభావం వంతమైనది.ధైర్యమిచ్చేది... దారి చూపేది.ముప్పైలలో తనకు బ్రెస్ట్ కాన్సర్ అని నిర్ధారణ అయినప్పుడు ఆమె కాసేపు విచారపడి ఉండొచ్చుగానీ కష్టాలు, ప్రతికూలతలకు తలవొగ్గకూడదని నిర్ణయించుకుంది. పోరాట బాటను ఎంచుకుంది. ఎన్నో మారథాన్లలో ఉత్సాహంగా పాల్గొంది. ఆమె పేరు ఆశావాదానికి అరుదైన ప్రతీకగా మారింది. మయూర ఆశావాదమే, అరుదైన ధైర్యమే ‘ది సెకండ్ విండ్’ కథలోకి వచ్చింది. కాస్త వెనక్కి వెళితే... మయూర రేసులలో పాల్గొన్నప్పుడల్లా... ‘ఈ పరిస్థితుల్లో ఎందుకు?’ అన్నవారు లేకపోలేదు.ఆ సందేహానికి ఆమె చిరునవ్వే... సమాధానం. 36 నుంచి 37 డిగ్రీల టెంపరేచర్లోనూ రేస్ను పూర్తి చేసింది. తాను యావరేజ్ స్విమ్మర్ అయినా తొలి సీ–స్విమ్ను విజయవంతంగా పూర్తి చేసింది. బైకింగ్లోనూ ‘వావ్’ అనేలా చేసింది. ‘ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తావు! ఇది ఎలా సాధ్యం?’ అని మయూరను అడిగేవారు. ఉత్సాహం కొని తెచ్చుకునేది కాదు కదా!అది ఆమె రక్తంలోనే ఉంది. మయూర తల్లిదండ్రులు ఆమెకు తల్లిదండ్రులు మాత్రమే కాదు స్నేహితులు, మార్గదర్శకులు. ‘నా తల్లిదండ్రులు ఒకమాట చెప్పే వారు... మొదటి నుంచి నీదైన ఒక మార్గాన్ని ఎంచుకున్నావు. ఆ మార్గం నుంచి బయటకు రావద్దు. మంచి రోజులను ఎంజాయ్ చేసినట్లే, చెడు అనుకునే రోజులను ఎంజాయ్ చెయ్. ఫుల్స్టాప్ కంటే కామా బెటర్’ అని గతాన్ని గుర్తు చేసుకుంది మయూర శివల్కర్. (చదవండి: S Jaishankar: చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై జైశంకర్ మాట) -
జోగ్ అందాలు అదరహో..కళకళలాడుతున్న జలపాతాలు
బనశంకరి: వర్షాకాలంలో ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. పర్వతాలు, అడవులు పచ్చదనంతో అలరారుతున్నాయి. భారీ వర్షాలతో జలపాతాలు పాలనురగలా పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. ప్రకృతి అందాలను వర్షాకాలంలో వీక్షించేందుకు రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఆగుంబె.... భారతదేశంలో అత్యధిక వర్షం లేదా తేమతో కూడిన ప్రదేశాల్లో ఒకటి మలెనాడులోని ఆగుంబె. దట్టమైన అడవితో కూడిన పర్వతప్రాంతంలో ఆగుంబె అందాలను వర్షకాలంలో వీక్షిస్తే అ అనుభూతే వేరు. ఈ కారణంతో ఆగుంబెను దక్షిణభారతదేశ చిరపుంజీ అని పిలుస్తారు. సొగసైన జలపాతాలు, సూర్యాస్తమయ నయన మనోహరదృశ్యాలు వీక్షించవచ్చు. జోగ్జలపాతం... వర్షాకాలంలో పర్యాటకులు భారీ ఎత్తున సందర్శించే స్థలాల్లో జోగ్జలపాతం ఒకటి. వర్షాకాలంలో జోగ్జలపాతం నయమనోహర దృశ్యాలు చూపరులను కనువిందుచేస్తాయి. 830 అడుగులు ఎత్తునుంచి నీరు జాలువారుతుండగా ఏర్పడే పొగ మంచులో జోగ్ అందాలను వీక్షించడం మధురానుభూతిని మిగుల్చుతుంది. జోగ్జలపాతం నాలుగు విభిన్నభాగాలుగా జాలువారుతుంది. కర్ణాటక వాసులే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. కొడగు... భారత్ స్కాట్ల్యాండగ్గా పిలిచే కొడగు లేదా కూర్గ్ కర్ణాటక ప్రకృతిరమణీయ ప్రదేశాల్లో ఒకటి. ఇది హనీమూన్, కుటుంబపర్యటన, ట్రెక్కింగ్కు సరైన పర్యాటక స్థలం. కూర్గ్ వర్షాకాలం సమయంలో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రఫీపై ఇష్టం ఉండేవారు అందమైన ఫొటోలు తీసుకోవచ్చు. ఇక్కడ ఇరుప్పుజలపాతం, కాపీ తోటలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి. సకలేశపుర... కర్ణాటకలో అత్యంత సొగసైన పర్వతప్రాంతాల్లో సకలేశపుర ఒకటి. సకలేశపుర హిల్స్టేషన్గా గుర్తింపుపొందింది. వర్షాకాలం సమయంలో అధికంగా పర్యాటకులు సందర్శిస్తారు. ఇక్కడ పురాతన సకలేశ్వరస్వామి ఆలయం ఉంది. ట్రెక్కింగ్కు అనుకూలం, మంజేహళ్లిజలపాతం, బిస్లే ఘాట్పాయింట్, మంజరాబాద్ కోట ఆకట్టుకుంటాయి. చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?ఉత్తరకన్నడ జిల్లా పశ్చిమమకనుమల్లో ఒకటైన దాండేలి ప్రకృతి ప్రేమికులను, సాహసికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ సాహసక్రీడలైన ర్యాప్టింగ్, వన్యజీవులు వీక్షణ, వైట్ రివర్రాప్టింగ్ లాంటి జలక్రీడలతో సందడిచే యవచ్చు. దాండేలి వన్యజీవి అభయారణ్యం, కవలేగుహలు, సిందేరిరాక్, సాతోడి జలపాతం తదితర పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కుదురేముఖ్... చిక్మగళూరు జిల్లాలో కుదురేముఖ్ పశ్చిమకనుమల్లో ఒక సుందరమైన పట్టణం. ఇక్కడ ప్రకృతి అందాలతో పాటు పచ్చని లోయలు, ట్రెక్కింగ్ ప్రదేశాలను వీక్షించవచ్చు. కుదురేముఖ్లో కాపీ ఎస్టేట్లు వర్షాకాలంలో అద్భుతంగా ఉంటాయి. కుదురేముఖ్ నేషనల్ పార్కు, మాన్సున్ ట్రెక్కింగ్తో పాటు అనేక పర్యాటకప్రాంతాలను వీక్షిస్తూ సందడిచేయవచ్చు. ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్ -
కమల్ హాసన్ కామెంట్స్.. కర్ణాటకలో థగ్ లైఫ్కు బిగ్ షాక్!
కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్పై వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే క్షమాపణ చెప్పాలని కమల్కు డెడ్లైన్ విధించిన కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమల్ కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేఎఫ్సీసీ కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన గడువులోగా క్షమాపణలు చెప్పకపోతే నిషేధం అమల్లోకి వస్తుందని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధి సారా గోవిందు స్పష్టం చేశారు. కర్ణాటక రక్షణ వేదిక, ఇతర కన్నడ అనుకూల సంస్థల డిమాండ్లకు కూడా తమ మద్దుతు ఉంటుందని ఆయన తెలిపారు.కాగా.. ఇటీవల బెంగళూరులో జరిగన థగ్ లైఫ్ ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడం తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైంది. ఆయన వ్యాఖ్యలపై కన్నడ భాష సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో కమల్ సినిమాను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) 'థగ్ లైఫ్' సినిమాను కర్ణాటకలో నిషేధించింది. ఇప్పటికే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశారని కమల్ హాసన్పై కర్ణాటక రక్షణ వేదిక ఫిర్యాదు చేసింది. -
‘ముందెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పండి’
బెంగళూరు: బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ ఐఏఎస్ అధికారిణి ఫౌజియా తరన్నుమ్ (Fouzia Taranum)పై చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు మండిపడింది. ముందెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన్ని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఓ కార్యక్రమంలో.. సీనియర్ ఐఏఎస్ ఫౌజియాను ఉద్దేశించి ‘పాకిస్తానీ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకుగానూ ఆయనపై కేసు కూడా నమోదయ్యింది.అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ రవికుమార్ హైకోర్టును (Karnataka High Court)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మధ్యప్రదేశ్లో ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సుప్రీం కోర్టు ఎలా స్పందించిందో మీరూ చూశారు. కాబట్టి మీరేం అందుకు అతీతులు కారు. మీరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. కాబట్టి మొక్కుబడిగా కాకుండా మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పండి’’ అని ధర్మాసనం రవికి స్పష్టం చేసింది.మధ్యప్రదేశ్లో ఏం జరిగిందంటే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత మీడియాకు కర్నల్ సోఫియా ఖురేషీ (Sofiya Qureshi) ఆ వివరాలను వెల్లడించారు. అయితే.. మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కున్వర్ విజయ్ షా (Kunwar Vijay Shah) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని (సోఫియా ఖురేషీని ఉద్దేశించి) సైనిక విమానంలో మోదీజీ పాక్కు పంపించి పాఠం నేర్పించారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయనపై కేసు నమోదుకు పోలీసులను ఆదేశించగా.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే..చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆయన తీరును తీవ్రంగా తప్పు బట్టింది. పదవిలో ఉంటూ అవేం మాటలంటూ మందలించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు క్షమాపణలు తెలియజేయగా.. ఆపై ద్విసభ్య ధర్మాసనం వాటిని అంగీకరించ లేదు. ఏదో మొక్కుబడిగా క్షమాపణలు చెప్పారని.. మొసలి కన్నీరు కార్చరని మళ్లీ ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు సమగ్ర నివేదికను కోర్టు కోరింది. అయితే అరెస్ట్ నుంచి మాత్రం కున్వర్కు ఊరట ఇచ్చిన న్యాయస్థానం.. తాజాగా ఆ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.కర్ణాటకలో ఏం జరిగిందంటే..బీజేపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష చలవాడి నారాయణస్వామి (Chalavadi Narayanaswamy) ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే (ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు)ను ఉద్దేశిస్తూ.. ‘కుక్క’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట రాజకీయ దుమారం రేపాయి. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నారాయణస్వామి గెస్ట్ హౌజ్ వద్ద నిరసనలు తెలిపారు. అయితే..అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. నారాయణస్వామికి భద్రతా కల్పించడంలో డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరన్నుమ్ విఫలమయ్యారంటూ ఎమ్మెల్సీ రవికుమార్ (MLC N Ravikumar) పార్టీ అనుచరులతో నిరసనలకు దిగారు. ఈ క్రమంలో.. ఫౌజియాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కలబురాగి డిప్యూటీ కమిషనర్ ఇక్కడ ఐఏఎస్ అధికారిణేనా? లేదంటే పాకిస్తాన్ నుంచి వచ్చారా? ఆమె తీరు చూస్తుంటే పాక్ నుంచి వచ్చినట్లే ఉంది’’ అంటూ రవికుమార్ వ్యాఖ్యానించారు.మతపరమైన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై స్థానికంగా పీఎస్లో ఫిర్యాదు నమోదు కాగా.. రవికుమార్పై కేసు ఫైల్ అయ్యింది. మరోవైపు.. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమని.. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఐఏఎస్ అధికారుల సంఘం ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ తరుణంలో తాను ఏదో భావోద్వేగంలో అలా అనేశానంటూ వివరణచ్చారు. మరోవైపు.. రవికుమార్పై చర్యలు కోరుతూ గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఇంకోవైపు.. ఈ వ్యవహారంపై స్పందించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఫౌజియా నిరాకరించారు. ఇదీ చదవండి: మస్క్ ఎగ్జిట్పై స్పందించిన ట్రంప్, ఏమన్నారంటే.. -
మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్
-
Comment X: పబ్లిక్ రోడ్లు కాస్త..
నడిరోడ్డులో.. పగలురాత్రి తేడాల్లేకుండా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనలెన్నో ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల కారణంగా అవి వైరలూ అవుతున్నాయి. మొన్నీమధ్యే మధ్యప్రదేశ్లో ఓ నేత రోడ్డు మీదే ఓ మహిళతో నగ్నంగా శృంగారం జరిపి కటకటాల పాలయ్యాడు. తాజాగా కర్ణాటకలో కదిలే కారులో రెచ్చిపోయింది ఓ జంట.బెంగళూరుకు చెందిన ఓ జంట మే 27వ తేదీన కోరమంగళలో డిన్నర్ చేసింది. ఆపై కారులో వెళ్తూ.. సన్రూఫ్ నుంచి బయటకు వచ్చి రొమాన్స్ చేయసాగింది. దారినపోయే వాహనదారులు ఆ తతంగం అంతా రికార్డు చేశారు. అయితే.. Karnataka Portfolio అనే ఎక్స్ పేజీ ఆ వీడియోను హైలైట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇలాంటి జుగుప్సాకరమైన చేష్టలు ప్రజలకు ఇబ్బందికరమైనవని, కారులో ఉన్నవాళ్లతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం ఇబ్బందుల్లోకి నెడతాయని పేర్కొంది. వీడియో బాగా వైరల్ కావడంతో నగర పోలీసులు స్పందించారు. వీడియోలో నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసి ఓనర్ను పట్టుకున్నారు. ప్రమాదకరీతిలో వాహనం నడపడం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కింద మొత్తం రూ.1,500 జరిమానా చేతిలో పెట్టి ఈసారికి వార్నింగ్తో వదిలిపెట్టారు. మొన్నీమధ్యే.. ఏప్రిల్లో నగరంలోని మాదవర మెట్రో స్టేషన్లో ఓ జంట అభ్యంతరకర చేష్టలకు దిగడం.. ఈ వీడియో సైతం నెట్టింట తెగ వైరల్ అవ్వడం తెలిసే ఉంటుంది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. పబ్లిక్ రోడ్లు కాస్త ప్రైవేట్ బెడ్రూంలుగా మారిపోయాయంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ అయ్యింది.ఇదీ చదవండి: మెట్రోలో వెళ్లే అమ్మాయిలను సీక్రెట్గా ఫొటో తీసి.. -
క్షమాపణలు చెప్పను: కమల్ హాసన్
కన్నడ భాష వివాదం నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనని, ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోనంటూ స్పష్టం చేశారాయన. బుధవారం థగ్ లైఫ్ ఈవెంట్లో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో తనను విమర్శించిన నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ఈ ఇష్యూపై గందరగోళం నెలకొంది. అందుకే స్పష్టత ఇవ్వదల్చుకున్నా. చాలామంది చరిత్రకారులు(రాజకీయ నాయకులను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ..) నాకు భాష చరిత్ర గురించి పాఠాలు బోధిస్తున్నారు. కానీ, నాతో సహా రాజకీయ నాయకులెవరికీ భాష వ్యవహారంపై మాట్లాడే అర్హత లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. తమిళంతో పాటు మీనన్, రెడ్డి, అయ్యంగార్ ముఖ్యమంత్రులయ్యారు. చాలా కాలం కిందట కర్ణాటక నుంచి వచ్చి తమిళనాడుకు సీఎం అయిన వ్యక్తి నుంచి నాకు సమస్య ఎదురైంది. ఆ సమయంలో కర్ణాటక నాకు మద్దతు ఇచ్చింది. ఎక్కడికీ వెళ్లొద్దు.. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోండి అంటూ కన్నడ ప్రజలు ప్రేమ చూపించారు. కాబట్టి ఇప్పుడు కూడా థగ్ లైఫ్, కమల్ హాసన్ను ప్రజలే చూసుకుంటారు.#WATCH | Thiruvananthapuram, Kerala: On his recent remarks where he said, 'Kannada was born out of Tamil', MNM President and actor Kamal Haasan says, "... What I said was said out of love and a lot of historians have taught me language history. I didn't mean anything. Tamil Nadu… pic.twitter.com/YjW8qAUIB3— ANI (@ANI) May 28, 2025భాషా వ్యవహారం చాలా లోతైన అంశం. నాతో సహా ఏ రాజకీయ నాయకుడికి దాని గురించి మాట్లాడే అర్హత లేదు. కాబట్టి ఈ చర్చను భాషా నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాఖ వాళ్లకు వదిలేయండి. శివన్న, ఆయన తండ్రి మీద ప్రేమతో ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడిందే తప్ప అందులో మరే ఉద్దేశం లేదు. ప్రేమతోనే మాట్లాడినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి ఆ పని చేయను’’ అని కమల్ అన్నారు. ఇటీవల చెన్నైలో తన చిత్రం థగ్ లైఫ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని శివరాజ్ కుమార్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కన్నడ సంఘాల నాయకులు ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. ‘కన్నడ- కస్తూరి’ అనే విషయాన్ని ఆ నటుడు మర్చిపోయినట్లు ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. రెండున్నర వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భాషను కమల్ మర్చిపోయినట్లు ఉందని సీనియరు నటుడు జగ్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్ర ప్రదర్శనను కర్ణాటకలో అడ్డుకుంటామని వివిధ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆయనపై నిషేధం విధిస్తామని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బి.వై.విజయేంద్ర, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ తదితరులు కమల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. -
పాపం కమల్ హాసన్.. సిద్ధరామయ్య సెటైర్లు
బెంగళూరు: కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందన్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలపై(Kamal Kannada Comment) కన్నడనాట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమల్ కామెంట్పై స్పందించారు.కన్నడ భాషకు(Kannada Language) ఎంతో చరిత్ర ఉంది. పాపం కమల్ హాసన్కు ఆ విషయం తెలియకపోయి ఉండొచ్చు అంటూ సిద్ధరామయ్య అన్నారు. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర యడియూరప్ప సైతం కమల్ వ్యాఖ్యపై మండిపడ్డారు. ‘‘మాతృభాషను ప్రేమించడం మంచిదే అయినా.. ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని అన్నారాయన. ఇది కన్నడ ప్రజలను మాత్రమే కాదు.. శివరాజ్ కుమార్ లాంటి అగ్రనటుడిని కూడా అవమానించడమే. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన కమల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి’’ అని విజయేంద్ర డిమాండ్ చేశారాయన. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ చిత్ర(Thug Life) ఈవెంట్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ను ఉద్దేశిస్తూ ‘‘మీ భాష(కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’ అని అన్నారు. ఈ కామెంట్పై ఇటు రాజకీయంగా, అటు సోషల్ మీడియాలోనూ కమల్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడ పరిరక్షణ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక కమల్ వ్యాఖ్యలపై భగ్గుమంది. క్షమాపణలు చెప్పకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి లీడ్ రోల్స్లో నటించిన థగ్ లైఫ్ సినిమా జూన్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఖబడ్దార్ కమల్.. నల్ల ఇంకు పోస్తాం -
కమల్ హాసన్ కామెంట్స్ పై భగ్గుమన్న కర్ణాటక బీజేపీ
-
కన్నడ, తమిళ భాషపై కమల్ వ్యాఖ్యలు.. కర్ణాటకలో దుమారం
చెన్నై: కన్నడ భాషకు తమిళమే మాతృక అంటూ ప్రముఖ నటుడు కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కమల్ వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. కమల్ కార్యక్రమానికి కన్నడ సూపర్స్టార్ శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఆదివారం చెన్నైలో జరిగిన తన సినిమా థగ్లైఫ్ ఆడియో విడుదల వేడుకలో కమల్ హాసన్, శివరాజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కమల్ మాట్లాడుతూ.. కన్నడ భాషకు తమిళమే మాతృక. ఇక్కడ ఉన్నది నా కుటుంబం. అందుకే ఆయన (శివరాజ్ కుమార్) ఇక్కడకి వచ్చారు. అందుకే నా జీవితం, బంధం, తమిళ్ అని మొదలుపెట్టాను. మీ భాష (కన్నడ) తమిళం నుంచి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగమే’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో కమల్ వ్యాఖ్యలను పలు కన్నడ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. లేదంటే కర్ణాటకలో కమల్ సినిమాలను బహిష్కరిస్తామని కన్నడ రక్షణ వేదిక హెచ్చరించింది. బెంగళూరు వ్యాప్తంగా థగ్లైఫ్ సినిమా బ్యానర్లను నిరసన కారులు చించేశారు. ఆ సినిమాను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బెంగళూరులో జరిగిన థగ్లైఫ్ ప్రీ రిలీజ్ కార్యక్రమ వేదిక వద్ద భారీ సంఖ్యలో గుమిగూడారు. కమల్పై నల్ల ఇంకు పోస్తామంటూ హెచ్చరించారు. తమకు భయపడి ఆయన వేడుకకు గైర్హాజరయ్యారని ఎద్దేవా చేశారు.Kamal Haasan says Kannada came from TamilHello @ikamalhaasan before making such claims, learn some real history. This land doesn’t need language lessons from Periyar fanatics🤡Kannada has a history spanning over 2,000 years, one of the world’s oldest living languages, with… pic.twitter.com/BQFUloI0Sg— Akshay Akki ಅಕ್ಷಯ್🇮🇳 (@FollowAkshay1) May 27, 2025మరోవైపు.. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప, తదితరులు కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయేంద్ర యడియూరప్ప స్పందిస్తూ..‘కమల్ హాసన్ సంస్కారం లేని వ్యక్తి. కన్నడ భాషను అవమానించారు. మాతృ భాషను ప్రేమించడం మంచిదే కానీ, ఇతర భాషలను అవమానించడం సంస్కారం కాదు. కన్నడ, సహా అనేక భారతీయ భాషల్లో నటించిన కమల్ హాసన్, తన ప్రసంగంలో తమిళాన్ని గొప్పగా చెబుతూ శివరాజ్కుమార్ను అందులో భాగం చేయడం కన్నడను అవమానించడమే కాదు.. అహంకారం ఉన్నట్టు స్పష్టమవుతోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ಮಾತೃಭಾಷೆಯನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು, ಆದರೆ ಅದರ ಹೆಸರಿನಲ್ಲಿ ದುರಭಿಮಾನ ಮೆರೆಯುವುದು ಸಂಸ್ಕೃತಿ ಹೀನ ನಡವಳಿಕೆಯಾಗುತ್ತದೆ. ಅದರಲ್ಲೂ ಕಲಾವಿದರಿಗೆ ಪ್ರತಿಯೊಂದು ಭಾಷೆಯನ್ನೂ ಗೌರವಿಸುವ ಸಂಸ್ಕಾರ ಇರಬೇಕು. ಕನ್ನಡವೂ ಸೇರಿದಂತೆ ಅನೇಕ ಭಾರತೀಯ ಭಾಷೆಗಳಲ್ಲಿ ನಟಿಸಿರುವ ನಟ @ikamalhaasan ತಮ್ಮ ತಮಿಳು ಭಾಷೆಯನ್ನು ವೈಭವಿಕರಿಸುವ ಮತ್ತಿನಲ್ಲಿ ನಟ… pic.twitter.com/PrfKX099lZ— Vijayendra Yediyurappa (@BYVijayendra) May 27, 2025 -
కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు
-
ఐఏఎస్ అధికారిణికి బీజేపీ ఎమ్మెల్సీ క్షమాపణలు
బెంగళూరు: కర్ణాటక బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ ఐఏఎస్ అధికారిణి ఫౌజియా తరణమ్(Fouzia Taranum)కు క్షమాపణలు చెప్పారు. ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అక్కడ. అయితే.. తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్య చేయలేదంటూ మంగళవారం ఆయన క్షమాపణలు తెలియజేశారు. ‘‘ఆ సమయంలో ేనేను భావోద్వేగంలో ఉన్నా. మా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అలాంటి పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. అందుకు క్షమాపణలు చెబుతున్నా అని ఎన్డీటీవీతో ఎన్ రవికుమార్(N Ravikumar) అన్నారు.అసలేం జరిగిందంటే..బీజేపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష చలవాడి నారాయణస్వామి(Chalavadi Narayanaswamy) ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే(ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు)ను ఉద్దేశిస్తూ.. ‘కుక్క’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట రాజకీయ దుమారం రేపాయి. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నారాయణస్వామి గెస్ట్ హౌజ్ వద్ద నిరసనలు తెలిపారు. అయితే.. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. నారాయణస్వామికి భద్రతా కల్పించడంలో డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరణమ్ విఫలమయ్యారంటూ ఎమ్మెల్సీ రవికుమార్ పార్టీ అనుచరులతో నిరసనలకు దిగారు.ఈ క్రమంలో.. ఫౌజియాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కలబురాగి డిప్యూటీ కమిషనర్ ఇక్కడ ఐఏఎస్ అధికారిణేనా? లేదంటే పాకిస్తాన్ నుంచి వచ్చారా? ఆమె తీరు చూస్తుంటే పాక్ నుంచి వచ్చినట్లే ఉంది’’ అంటూ రవికుమార్ వ్యాఖ్యానించారు.మతపరమైన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై స్థానికంగా పీఎస్లో ఫిర్యాదు నమోదుకాగా.. రవికుమార్పై కేసు ఫైల్ అయ్యింది. మరోవైపు.. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమని.. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఐఏఎస్ అధికారుల సంఘం ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ తరుణంలోనే ఆయన క్షమాపణలు చెప్పారు. ఇంకోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని, రవికుమార్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని ఆరా తీస్తానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాకు వెల్లడించారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య
యశవంతపుర)(కర్ణాటక): ప్రియునితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్పుర తాలూకా కరగుంద వద్ద జరిగింది. ఎన్ఆర్పుర పోలీసుస్టేషన్లో మొదట అనుమానాస్పద కేసు నమోదైయింది. అయితే భార్య, ప్రియుని పనేనని బయట పడింది. ఎన్ఆర్ పుర పట్టణానికి చెందిన సుదర్శన్ మృతదేహం కడుహినబైలు గ్రామం కరుగుండ బస్టాండ్ సమీపంలో శనివారం బయట పడింది. ఆమె భార్య కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనేక అనుమానాలు రావడంతో పోలీసులు విచారణకు రెండు బృందాలను రచించారు. విచారణలో కమల హత్య చేయించిన్నట్లు బయట పడింది. కమల 10 ఏళ్లు క్రితం సుదర్శన్ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. కమల, శివరాజ్ అనే వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకొంది. దీనికి భర్త సుదర్శన్ అడ్డుచెప్పేవాడు, దీంతో భర్తని అడ్డు తొలగించాలని ప్లాన్ వేసుకొన్నారు. మద్యంలో నిద్రమాత్రాలను కలిపి ఇవ్వడంతో స్పృహ తప్పి పడిపోయాడు. శివరాజ్ అతని స్నేహితులు కలిసి గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని పారవేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. -
బెంగళూరు శివారులో రేవ్ పార్టీ
-
Mysore Pak: అలానే పిలవాలి..మార్చకూడదు..! ఎందుకంటే..
గత నెలలో జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తదనంతరం భారత్ పాక్ల మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ చాలా చోట్ల దుకాణలో ఐకానిక్ స్వీట్ మైసూర్ పాక్ పేరుని మార్చేశారు కొందరు దుకాణాదారులు. దాంతోపాటు పాక్ పేరు వినిపించేలా ఉన్న కొన్ని రకాల ప్రసిద్ధ వస్తువుల పేర్లను కూడా మార్చేశారు. అయితే ఆ స్వీట్ని మైసూర్ శ్రీగా మార్చి.. అమ్మడం వివాదాలకు దారితీసింది. మైసూర్ రాజు కృష్ణరాజ వడియార్ IV పాలనలో మైసూర్ ప్యాలెస్ వంటగదిలో తయారైంది ఈ స్వీట్. ఆ రాజు వంటవాడి ఘనతకు నిదర్శనం ఆ స్వీట్. దాంతో ఆ వంటవాడి వారుసులు ఇలా పేరు మార్చడంపై మండిపడుతున్నాడు. ఇప్పటికీ మైసూర్ ప్యాలెస్లోనే తయారయ్యే ఆ స్వీట్ సృష్టికర్త కాకాసుర మాడప్ప మునిమనవడు ఎస్ నటరాజ్ అలా పేరు మార్చడాన్ని అస్సలు అంగీకరించటం లేదు. అలానే పిలవండి..ఆ స్వీట్ని మైసూర్ పాక్ అనే పిలవండి. ఎందుకంటే మా పూర్వీకులు అందించిన ఈ పాక ఆవిష్కరణకు మరో పేరు ఉండకూదని అన్నారు. ప్రతి స్మారక చిహ్నం లేదా సంప్రదాయానికి ఒక ప్రత్యేక పేరు ఉన్నట్టే..ఈ స్వీట్కి ఓ ప్రత్యేక పేరు ఏర్పడింది. దాన్ని తప్పుగా సూచించకూడదు..అలాగే మార్చకూడదు కూడా అని వ్యాఖ్యానించారు నటరాజ్.'పాక్' అనే పదం ఎందుకు వచ్చిందంటే..కన్నడలో 'పాక్' అనే పదం చక్కెర సిరప్ను సూచిస్తుంది. అలాగే ఈ స్వీట్ని మైసూర్ ప్యాలెస్లో తయారు చేయడంతో ..ఈ రెండు పేర్ల కలయికతో ఆ స్వీట్ని అలా పిలవడం జరగిందని అని వివరించారు నటరాజ్. అందువల్ల దీన్ని వేరే పేరుతో పిలిచే ప్రశ్నే లేదు అని తెగేసి చెప్పారు. అంతేగాదు..ఆ పేరే ఎందుకు ఉండాలంటే..ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా..ఆ స్వీట్ని చూసినా..దాన్ని చూడగానే ఎలా తయారైందని కథ గుర్తొచ్చేలా ఆ పేరులో ఉండాలి. అప్పుడే ఆ స్వీట్కి ప్రాముఖ్యత ఉంటుందన్నారు. దాని పేరు మార్చే హక్కులేదని నొక్కి చెప్పారు నటరాజ్. కర్ణాటకలో మైసూరు ప్రసిద్ధ గురు స్వీట్స్ కుటుంబం దీన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు దాని ఐదవతరం స్వీట్లో రారాజుగా పేరొందిన ఈ మిఠాయిని ప్రజాక్షేత్రంలో మరింత ప్రాచుర్యం కల్పించేలా నటరాజ్ ముత్తాత దుకాణాలను ప్రారంభించారు. అలా దీని గురించి దేశమంతటా తెలిసిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు. అంతేగాదు ఆ కుటుంబం నాల్గోతరం సభ్యుడు సుమేఘ్..వైసూర్, కర్ణాటక సాంస్కృతిక చారిత్రకలతో ముడిపడి ఉన్న స్వీట్ అని చెబుతున్నారు. ఇది తమ కన్నడిగ సమాజానికే గర్వకారణమని అన్నారు. ఇది మా ప్రజల మాధుర్యాన్ని కన్నడ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించేలా మధురంగా ఉంటుందన్నారు. అంతేగాదు ఈ స్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యింది కాబట్టి దీన్ని అనవసర వివాదాల్లోకి లాగొద్దని కోరుతున్నారు ఆ స్వీట్ సృష్టించిన కుటుంబ వారసులు. నోటిలో ఈజీగా కరిగిపోయే ఈ స్వీట్ భారతదేశం అంతటా వివిధ వేడుకలకు, పండుగల్లో తప్పనిసరిగా ఉండే ప్రముఖ స్వీట్ ఇది.(చదవండి: ‘మైసూర్’లో ‘పాక్’ మాయం! ) -
రేవ్ పార్టీ.. 20 మంది అమ్మాయిలు అరెస్టు..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): దేవనహళ్లి ఎయిర్పోర్టు సమీపంలో కన్నమంగల వద్ద ఉన్న ఫాంహౌస్లో రేవ్ పార్టీపై దేవనహళ్లి పోలీసులు ఆదివారంనాడు దాడి చేసి 10 మంది యువతులు, 20 మంది యువకులను అరెస్టు చేశారు. అందరూ శనివారం ఉదయం నుంచే మజా చేస్తున్నట్లు తెలిసి పోలీసులు సోదాలు జరిపారు. అందరినీ నిర్బంధించి సోదాలు చేశారు. నిషేధిత మత్తు పదార్థాలు లభించినట్లు సమాచారం. వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎయిర్పోర్టుకు అతి సమీపంలో ఉన్న ఫాంహౌస్లో రేవ్ పార్టీ జరగడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో పాల్గొన్నవారు బడాబాబులని, అమ్మాయిలను పిలిపించి నృత్యాలు, మద్యం తదితరాలతో జల్సా చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పెద్దసంఖ్యలో కార్లు, బైక్లు, మొబైళ్లు తదితరాలను సీజ్చేశారు. -
పేకాట సిగ్గుమాలిన పని కాదు
న్యూఢిల్లీ: పేకాట ఆడటం సిగ్గుమాలిన పని కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. జూదం, గ్యాంబ్లింగ్లో భాగంగా పేకాట ఆడితే మాత్రం నేరమని స్పష్టంచేసింది. ఎలాంటి గ్యాంబ్లింగ్, బెట్టింగ్తో సంబంధం లేకుండా, ఎలాంటి మోసంతో ప్రమేయం లేకుండా కేవలం వ్యక్తిగతంగా, సొంత వాళ్లతో సరదాగా ఆడితే తప్పుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోడ్డు పక్కన ఆటవిడుపుగా పేకాట ఆడాడన్న కారణంతో కర్ణాటకలో ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డ్లో డైరెక్టర్ సభ్యత్వానికి దూరం చేయడం సబబుకాదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. కర్ణాటకలో గవర్నమెంట్ పోర్సలిన్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ హౌసింగ్ కో–ఆపరేటివ్ సొసైటీలో వైసీ హనుమంతరాయప్ప ఎన్నికల్లో అత్యధిక ఓట్లు గెలిచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యత్వం సాధించారు. అయితే రోడ్డుపక్కన పేకాట ఆడారన్న కారణంగా ఆయనపై రూ.200 జరిమానా వేసి, సభ్యత్వాన్ని రద్దుచేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టగా మే 14వ తేదీన ఆయనకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హౌసింగ్ సొసైటీలో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ తీర్పు వెలువర్చింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ పేకాట అనేది నైతికంగా తప్పు కాదు. బెట్టింగ్, జూదం, గ్యాంబ్లింగ్లో భాగంగా ఆడితేనే నేరం. సరదాకి సొంత వాళ్లతో ఆడితే దానిని నేరంగా భావించొద్దు. ఈ కేసులో నిందితుడు హనుమంతరాయప్ప పేకాటకు బానిస కాదు. గ్యాంబ్లింగ్ చేయలేదు. కేవ లం విరామం, విశ్రాంతి వేళ మానసిక ప్రశాంతత కోసం పేకాట ఆడారు. 2020 ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించి డైరెక్టర్ల మండలిలో స్థానం సంపాదించిన ఈయనను పేకాట ఆడాడన్న ఒకే ఒక్క కారణం చూపి శిక్షించడం సహేతుకం అనిపించుకోదు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
కుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
మైసూరు(కర్ణాటక): కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని తల్లిదండ్రులు సహా ముగ్గురు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మైసూరు జిల్లాలోని హెచ్డి కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో జరిగింది. మహాదేవస్వామి, భార్య మంజుల, వీరి చిన్న కుమార్తె హర్షిత మృతులు. మహాదేవస్వామిపెద్దకుమార్తె హర్షిత రెండురోజుల క్రితం ప్రియునితో కలిసి ఎక్కడికో వెళ్లిపోయింది. గ్రామంలో తల ఎత్తుకోలేకపోయామని తల్లిదండ్రులు, చెల్లెలు ఆవేదనకు లోనయ్యారు. శనివారం గ్రామ సమీపంలోని చెరువులోకి దూకారు. చెరువు కట్టపై బైక్, చెప్పులు ఉండడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా ఏమీ కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫైర్ సిబ్బందితో వచ్చి చెరువులో గాలించగా ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి.