భద్ర కాలువలో నలుగురు గల్లంతు | Four of Bhadravathi family go missing in Karnataka Bhadra canal | Sakshi
Sakshi News home page

భద్ర కాలువలో నలుగురు గల్లంతు

Jan 19 2026 4:46 AM | Updated on Jan 19 2026 4:46 AM

Four of Bhadravathi family go missing in Karnataka Bhadra canal

శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని హోలెహోన్నూరు వద్ద ఘో­ర విషాదం జరిగింది. ఆదివారం సాయంత్రం భద్ర ఎడమ గట్టు కాలువలో ఒకే కుటుంబా­నికి చెందిన నలుగురు గల్లంతయ్యారు.

అరెబి­లాచికి చెందిన నీలాబాయి(50), ఆమె కుమారుడు రవికుమార్‌(32), కుమార్తె శ్వేత(35), అల్లుడు పరశురాం(40) కాలువలో బట్టలు ఉ­త­కడానికి వచ్చి, కొట్టుకుపోయారు. ఈ సమయంలో ఒకరిని రక్షించే ప్రయత్నంలో మిగి­లి­న వాళ్లు మునిగిపోయారని చెబుతున్నారు. స­మాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సి­బ్బంది కాలువలో గాలింపు చేపట్టారు. ఇటీవ­ల భద్ర డ్యాం నుంచి నీటి విడుదలను పెంచడంతో కాలువల్లో ప్రవాహం ఎక్కువగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement