రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా గురుగుంట అమరేశ్వర జాతర ఉత్సవాలు ప్రశాంతంగా జరిగింది. మంగళవారం సాయంత్రం దేవాలయం వద్ద దేవస్థాన సమితి అధ్యక్షుడు రాజా సోమనాథ్ నాయక్ రథోత్సవానికి పూజలు చేశారు. వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిపారు. రాయచూరు, లింగసూగూరు, సింధనూరు, మాన్వి, కలబుర్గి, యాదగిరి, సురపుర, శహాపుర, కొప్పళ, గంగావతిల నుంచి భక్తులు అధికంగా పాల్గొన్నారు. మాజీ లోక్సభభ సభ్యుడు రాజా అమరేశ్వర నాయక్, మాజీ ఎమ్మెల్యేలు హులిగేరి, అమరేగౌడ బయ్యాపూర్లున్నారు.


