breaking news
Karnataka Latest News
-
పారిశుధ్య కార్మికుడిపై దాడి: ఇద్దరు అరెస్ట్
హుబ్లీ: పారిశుధ్య కార్మికుడిపై దాడి చేసిన ఇద్దరిని దావణగెరె అజాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్జు, నూర్ అరెస్ట్ అయిన నిందితులు. కరిబసప్ప దాడికి గురైన వ్యతి. వివరాలు.. దావణగెరె 4వ వార్డు మెహబూబ్ నగర్లో శుక్రవారం ఉదయం కార్మికుడు కరిబసప్ప చెత్త సేకరణకు వచ్చాడు. పొడి, తడి చెత్త రెండు కలిపి ఓ మహిళ చెత్త వాహనానికి ఇచ్చింది. ఈ రెండింటికి కలిపి ఇవ్వరాదు.. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వమని కోరాడు. దీనిపై మాట మాట పెరగడంతో అజ్జు, నూర్ కలసి కరిబసప్పపై దాడి చేశారు. కరిబసప్ప ఫిర్యాదు మేరకు అజ్జు, నూర్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ వసంత్ తెలిపారు. కార్మికుడిపై దాడిని ఖండిస్తూ సదరు కార్మికులు ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగి చెత్త వాహనాన్ని తెచ్చి నిరసన తెలిపారు. -
ఇకపై హంపీ ఉత్సవాలు నవంబర్లోనే
ఇకపై కూడా అదే మాదిరిగా ప్రతి ఏటా నవంబర్ నెలలోనే హంపీ ఉత్సవాలు జరుపుతామన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందించేందుకు గ్యారెంటీ పథకాలను అమలు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. విజయనగర చరిత్ర, గత పాలనా వైభవం అందరికీ తెలియజేసేందుకు హంపీ ఉత్సవాలు దోహదం చేస్తాయన్నారు. మంత్రులు శివరాజ్ తంగడిగి, జమీర్ అహ్మద్ ఖాన్, హెచ్కే.పాటిల్ మాట్లాడుతూ హంపీ గొప్పతనాన్ని, విజయనగర పాలన వైభవాన్ని వివరించారు. వేదికపై ప్రముఖ కన్నడ సినీ నటుడు శివరాజ్కుమార్, విద్యారణ్య భారతీ స్వామీజీ, ఎమ్మెల్యేలు నాగేంద్ర, గవియప్ప, నారా భరత్రెడ్డి, నాగరాజు, లోక్సభ సభ్యుడు తుకారాం, జిల్లా అధికారి, ఎస్పీ పాల్గొన్నారు. -
పనుల్లో వేగం పెంచాలి
రాయచూరు రూరల్: రాయచూరు ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర పరిశ్రమల మౌలిక సౌకర్యాల అభివృద్ధి మండలి అధ్యక్షుడు నంజయ్యన మఠ్ ఆదేశించారు. శుక్రవారం విమానాశ్రయం వద్ద జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 321 ఎకరాల్లో జరగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. త్వరిగతిన రక్షణ గోడల నిర్మాణ పనులను పూర్తి చేయాలని తెలిపారు. రన్వే 1.7 కి.మీ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేవలం 800 మీటర్ల పనులు జరిగాయని పేర్కొన్నారు. విద్యుత్ ఉప కేంద్రం, భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాలు, ఆరు టవర్ల నిర్మాణం ఇతర పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు మహేష్, ప్రవీణ్, తహసీల్దార్ సురేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలురాయచూరు రూరల్: మహా శివరాత్రిని పురస్కరించుకుని నగరంలో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. శుక్రవారం ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వాల్కట్ మైదానంలో 12 జ్యోతిర్లింగాల దర్శనం, శివ లింగాల యాత్ర చేపడుతామన్నారు. 14న శాంతియాత్ర, 15న సాంస్కృతిక మహోత్సవం, 16న గౌరవ సమర్పణ, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. 14వ తేదీన 12 కార్లపై శివలింగాలను కొలువుదీర్చి యాత్ర జరుపుతామన్నారు. భక్తులు సందర్శించుకునేందుకు వీలుగా వాల్కట్ మైదానంలో 40 అడుగుల శివలింగం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో శారద, దానమ్మ, రేఖ, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ హుబ్లీ: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం గ్రిన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో గుర్తించి వాటిని సైట్లుగా మార్చి అందజేస్తామని మంత్రి సతీష్ జారకిహొళి తెలిపారు. శుక్రవారం ఆయన దావణగెరెలో మీడియాతో మాట్లాడారు. మార్చి 6న సీఎం సిద్దరామయ్య బడ్జెట్ ప్రతిపాదిస్తారన్నారు. ఈసారి బడ్జెట్పై చాలా ఆశలు పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగేలా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయన్నారు. -
హంపీ ఉత్సవాలకు ఆహ్వానం
హొసపేటె: హంపీ ఉత్సవాలకు రావాలని హొసపేటె ఎమ్మెల్యే గవియప్పను జిల్లా ఇన్చార్జ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ శుక్రవారం ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఇటీవల హంపీ ఉత్సవాల ఏర్పాటు పనుల్లో ఎక్కడ కూడా ఎమ్మెల్యే గవియప్ప కనిపించలేదు. ఈ నేపథ్యంలో మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ స్వయంగా ఎమ్మెల్యే గవియప్ప ఇంటికి వెళ్లి హంపీ ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య హోసూరు: భార్య కోపంతో కూతురు ఇంటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల మేరకు.. హోసూరు పారిశ్రామికవాడ మూకొండపల్లి సమీపంలోని మత్తంఅగ్రహారం ప్రాంతానికి చెందిన కార్మికుడు శ్రీనివాసన్, కవిత దంపతులు నివసిస్తున్నారు. శ్రీనివాస్కు తాగుడు అలవాటు ఉండటంతో రోజూ మద్యం సేవించి ఇంటికెళ్లి భార్యతో గొడవపడేవాడు. నెల రోజుల క్రితం భర్త చిత్రహింసలు తాళలేక కవిత కూతురి ఇంటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెందిన శ్రీనివాసన్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
బైరతి బసవరాజుకు ఆస్పత్రిలో చికిత్స చేయించండి
బనశంకరి: రౌడీషీటర్ బిక్లు శివ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ గురువారం అరైస్టెన మాజీమంత్రి, కేఆర్పుర బీజేపీ ఎమ్మెల్యే బైరతిబసవరాజ్ను సీఐడీ పోలీసులు విచారణ చేపడుతున్నారు. విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన ఆయన్ను తొలుత బౌరింగ్ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి సీఐడీ కార్యాలయానికి తరలించారు. శుక్రవారం నగరంలోని 42వ జేసీఎంఎం కోర్టులో హాజరుపరిచి కస్టడీకి ఇవ్వాలని కోరారు. బైరతి బవసరాజ్కు గుండె సంబంధిత వ్యాధి ఉందని, ఆయనకు చికిత్స అవసరమని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స అందించి శనివారం కోర్టులో హాజరు పరచాలని సీఐడీ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. బిక్లు శివ హత్యకేసులో ఏ 20 ఆరోపిగా ఉన్న మలయాళిఅజిత్ బెయిల్ను గురువారం కోర్టు రద్దుచేయడంతో అతన్ని సీఐడీ అరెస్ట్ చేసింది. చిరుతపులి దాడిలో జూపార్కు ఉద్యోగికి గాయాలు బొమ్మనహళ్లి: చిరుతపులిదాడిలో జూ కీపర్ గాయపడిన ఘటన బన్నేరుఘట్ట బన్నేరుఘట్ట్ట పార్క్ పునరావాస కేంద్రంలో జరిగింది. శాంతప్ప అనే వ్యక్తి ఇక్కడ కాంట్రాక్టు విధానంలో జూ కీపర్గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం చిరుతపులి ఉన్న బోనును శుభ్రం చేస్తుండగా చిరుతపులి ఇనుప మెష్ ద్వారా ముందు కాళ్లను బయటకు పెట్టి దాడి చేసింది. దీంతో చెంప, మెడపై కాలిగోళ్లు గుచ్చుకొని శాంతప్పకు బలమైన గాయాలయ్యాయి. సిబ్బంది గమనించి శాంతప్పను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ పాఠశాలలను మూసేయొద్దు చిక్కబళ్లాపురం: రాష్ట్ర ప్రభుత్వం కేపీఎస్ మ్యాగ్నట్ విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో 40 వేల ప్రభుత్వ పాఠశాలలు, చిక్కబళ్లాపురం జిల్లాలో 1300 ప్రభుత్వ పాఠశాలలను మూసేయడానికి సిద్ధమవుతోందని ఏఐడీఎస్ఓ రాష్ట్ర కోశాధికారి సుభాష్ బెట్టదకొప్ప అన్నారు. ఆయన మరళుకుంటె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రామ పెద్దల సమక్షంలో చేపట్టిన ధర్నాలో మాట్లాడారు. ప్రతి జీపీలో ఒక పాఠశాల ఏర్పాటుకు సర్కార్ సిద్ధమవుతోంది. 1, 2వ తరగతి పిల్లలు 5 నుంచి 6 కిమీ దూరం నడుచుకొని వెళ్లి రావడం కష్టతరం. సరైన బస్ వ్యవస్థ లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం కొద్ది మంది మన ఊరిలోనే మన పిల్లలు చదువుకోవాలి అనే ఉద్దేశంతో పాఠశాలకు స్థలాన్ని అందించారు. ఇలా పాఠశాలను మూసేయడం ద్వారా అనేక మంది పిల్లలు బడి మానేస్తారని అన్నారు. అందువల్ల ప్రభుత్వం కేపీఎస్ మ్యాగ్నట్ పథకాన్ని వదులుకోవాలి లేదా ఉన్న పాఠశాలలను అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. -
ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల పట్టివేత
●రూ.6 లక్షల విలువైన సొత్తు స్వాధీనం కోలారు: వివిధ ప్రాంతాల్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలు పట్టుబడ్డారు. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా వాణియంబాడికి చెందిన మహమ్మద్ యాసిన్ (25), జీలన్ (24)అనే దొంగలను కోలారు నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్దనుంచి 6.25 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 21న నగరంలోని కరుబర పేటలో ఓ మహిళ కాలినడకన వెళ్తుండగా నిందితులు చైన్స్నాచింగ్కు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నగర పోలీసులు సుమారు 200కుపైగా సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల జాడ కనుగొని అరెస్టు చేశారు. తులపై ఆంధ్రలోని వి కోట అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు. -
ఆకట్టుకున్న ఎద్దుల ప్రదర్శన పోటీలు
హొసపేటె: కమలాపూర్లోని హంపీ వరల్డ్ హెరిటేజ్ సైట్ మేనేజ్మెంట్ అథారిటీ (హవామా) కార్యాలయం వెనుక జిల్లా యంత్రాంగం, పశుసంవర్ధక, పశువైద్య సేవల విభాగం నిర్వహించిన ఎద్దుల ప్రదర్శన పోటీలు ఆకట్టుకున్నాయి. గృహ నిర్మాణం, వక్ఫ్, మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి బీజెడ్ అహ్మద్ ఖాన్ ఎద్దులకు పూజలు చేసి ప్రదర్శనను ప్రారంభించారు. హొస్పేట్ రైతు మంజునాథ్.ఆర్ హాలికర్ జాతి ఎద్దులు పోటీలో మొదటి స్థానంలో నిలవడంతో రూ.10,000, సర్టిఫికెట్ అందజేశారు. గడినగనూర్ గ్రామానికి చెందిన బి.బసవ ఎద్దులు రెండవ స్థానంలో నిలిచి రూ.7500, సర్టిఫికేట్ అందుకున్నాయి. బాలాపూర్కు చెందిన శంకరప్ప ఎద్దులు మూడవ స్థానంలో నిలవడంతో రూ.5,500, సర్టిఫికెట్ అందజేశారు. హోస్పేట్ మహమ్మద్ హుస్సేన్ ఎద్దులు రూ.2,500 అందుకుని నాలుగో స్థానం దక్కించుకున్నాయి. అవార్డు గెలుచుకున్న నాలుగు జతల గుర్రాలకు మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ సొంతంగా రూ.2 లక్షల నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో బళ్లారి లోక్సభ ఎంపీ తుకారాం, హోస్పేట్ ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప, డిప్యూటీ కమిషనర్ కవితా మన్నికేరి, సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా, నందిపుర మఠం మహేశ్వర స్వామిజీ, పశుసంవర్ధక, పశువైద్య సేవల విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఇమ్రాన్, డాక్టర్ యుగంధర్ మాన్వి, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ సురేష్, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ చంద్రనాయక్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ లోహిత్, డాక్టర్.సతీష్, డాక్టర్ నేమినాయక్ పాల్గొన్నారు. -
ఆనకట్టలు.. అభివృద్ధికి జీవనాడులు
బనశంకరి: ఆనకట్టలు వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి, సామాజిక అభివృద్ధికి జీవనాడులు అని సీఎం సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు. శుక్రవారం బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ(ఐఐఎస్సీ)లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆనకట్టల సురక్షత సమ్మేళనం–2026ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆనకట్టల సురక్షత కేవలం సాంకేతిక విషయమే కాదు, జాతీయ భద్రత అంశమని అన్నారు. కర్ణాటక దేశంలోనే అత్యధిక ఆనకట్టలు కలిగిన రాష్ట్రాల్లో ఒకటన్నారు. సురక్షత విషయంలో అనుభవం, జవాబుదారీ రెండూ కలిగి ఉందన్నారు. దేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రు ఆనకట్టలను ఆధునిక భారత దేవాలయాలు అని పిలిచారని గుర్తు చేశారు. దేశంలో ప్రస్తుతం 6,628 నిర్ధిష్ట ఆనకట్టలు ఉండగా, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆనకట్టలు కలిగిన దేశం భారత్ అన్నారు. కర్ణాటకలో 231 ఆనకట్టలు ఉండగా, దేశంలో 6వ స్థానంలో ఉందన్నారు. మైసూరు మహారాజులు ప్రత్యేకంగా నాల్వడి కృష్ణరాజ ఒడెయర్ నీటిపారుదల అభివృద్ధికి అధిక ప్రోత్సాహాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి స్మరించారు. అనంతరం దేవరాజ అరసు పాలనలో సమాన ప్రాంతీయ అభివృద్ధికి నీటిపారుదల విస్తరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో స్థాపించిన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సామర్ద్యం సుమారు 4,800 మెగావాట్లు కాగా వందలాది టీఎంసీల నీటిని సేకరించే సామర్థ్యం కలిగిన జలాశయాలు వ్యవసాయం, తాగు నీటి అవసరాలను తీరుస్తున్నాయన్నారు. సమ్మేళనంలో వివిధ దేశాల నిపుణులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాల్గొన్నారు. కేంద్రం అనుమతిస్తే మేకెదాటు, యూకేపీ అమలు కేంద్రప్రభుత్వం అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం మేకెదాటు, అప్పర్ కృష్ణా పథకా(యూకేపీ)లను అమలు చేస్తామని, కేంద్రం తమకు సహకారం అందిస్తుందన్న నమ్మకం ఉందని డిప్యూటీ సీఎం, జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం భారతీయ విజ్ఞాన సంస్థ జేజే టాటా సభాంగణంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆనకట్టల సురక్షత సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు మేకెదాటు, అప్పర్ కృష్ణా పథకాలపై తీర్పు ఇచ్చిందన్నారు. కేంద్రప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నామని అన్నారు. మేకెదాటు పథకంతో బెంగళూరుతో పాటు ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించడానికి, 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సహాయపడుతుందన్నారు. -
ఏనుగు పట్టివేత
మైసూరు: జిల్లాలోని సరగూరు తాలూకా ఎన్.బేగూరు, మోళేయూరు అటవీ జోన్ పరిధిలోని 25కు పైగా గ్రామాల ప్రజలను, రైతులను వేధిస్తున్న అటవీ ఏనుగు పట్టుబడింది. ఏనుగు కోసం అటవీశాఖ అధికారులు పెంపుడు ఏనుగుల సహాయంతో కూంబింగ్ నిర్వహించారు. శుక్రవారం సరగూరు తాలూకా మఠదకట్టె సమీపంలో ఒంటరిగా తిరుగుతుండగా బంధించారు. క్రేన్ద్వారా లారీలోకి ఎక్కించి అటవీ ప్రాంతానికి తరలించారు. ఏనుగును బంధించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థిని బ్యాగులో పాము మైసూరు: పాఠశాల విద్యార్థిని బ్యాగులో నాగుపాము ఒకటి ప్రత్యక్షమైంది. ఈ ఘటన మైసూరు ఇలవాల మధురానగరలో జరిగింది. ఆడుకునే సమయంలో బాలిక మైదానంలో బ్యాగును పెట్టింది. ఈ సమయంలో బ్యాగు లోపలకు పాము ఒకటి వచ్చి చేరింది. బ్యాగులో పామును చూసిన బాలిక కంగారుతో భయపడి కేకలు వేసింది. విషయం తెలిసిన వెంటనే స్నేక్శ్యామ్ అక్కడికి వచ్చి ఆ పామును క్షేమంగా పట్టుకున్నారు. తల్లిని చంపిన కుమార్తె ● ఆస్తి గొడవలే కారణమని అనుమానం తుమకూరు: కన్న తల్లిని హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. తుమకూరు తాలూకా అనుపనహళ్లిలో పుష్పావతి (55) హత్యకు గురైన మహిళ కాగా, ఆమెను సుచిత్ర(33) అనే కుమార్తె హత్య చేసింది. పుష్పావతి తన కుమార్తెతో కలిసి నగరంలోని శ్రీనగరలో నివాసం ఉంటోంది. రాత్రి పుష్పావతి నిద్రిస్తుండగా సుచిత్ర ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఆమెను అంత్యక్రియలకు తీసుకెళ్లిన సమయంలో ఈ హత్య విషయం బయటపడింది. ముఖంపై గాయం గుర్తులు కనిపించాయి. అంత్యక్రియల సమయంలో పుష్పావతి సోదరుడు అనిల్ కుమార్ దీన్ని గమనించి అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్యాత్సంద్ర పోలీసులు సుచిత్రను అరెస్టు చేశారు. చేతబడి చేయడం వల్ల తండ్రి చనిపోయాడని సుచిత్రకు కోపం ఉన్నట్లు, ఈ కారణంతోనే తల్లిని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. తండ్రి మరణం అనంతరం సుచిత్ర మానసికంగా కుంగిపోయింది. సుచిత్ర, పుష్పావతికి మధ్య తరచూ ఆస్తి గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే కన్నతల్లిని సుచిత్ర హత్య చేసినట్లు తెలుస్తోంది. సీఎంపై సిఫార్సు లేఖ బాంబు యశవంతపుర: సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ సిఫార్సు లేఖ బాంబు పేల్చారు. ఆరోగ్య శాఖ నుంచి ఎకై ్సజ్ శాఖకు ఓ అధికారిని బదిలీ చేయాలని కోరుతూ సీఎం సిఫార్సు చేసిన లేఖను ఆయన బట్టబయలు చేశారు. ఈ విషయంపై ఆయన ఎక్స్లో ఆ లేఖను పోస్టు చేశారు. సీఎం సిద్ధరామయ్య పాలన గాడి తప్పిందనడానికి ఈ లేఖ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. మండ్య జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారిని మైసూరు గ్రామీణ జిల్లా ఎకై ్సజ్ డీసీగా బదిలీ చేయాలని సీఎం స్వయంగా ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. యోగేష్గౌడ కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు హుబ్లీ: ధార్వాడలో బీజేపీ నేత యోగేష్ గౌడ హత్య కేసుకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఓ వారంలోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐకు సూచించింది. ఇటీవల ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధార్వాడ గ్రామీణ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో ఈ ఆదేశాలను ప్రశ్నిస్తూ వినయ్ కులకర్ణి సుప్రీంకోర్టులో రిట్ వేశారు. ఆ రిట్పై విచారణ సందర్భంగా స్పందించిన సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. నోటీసులపై వారంలోగా ప్రతిస్పందించాలని సూచించింది. -
హంపీ ఖ్యాతి అజరామరం
సాక్షి బళ్లారి/హొసపేటె: ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరై మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఎం.పీ.ప్రకాష్ వేదిక వద్ద సీఎం సిద్దరామయ్య ఉత్సవాలను ప్రారంభించే ముందు తాయి భువనేశ్వరి విగ్రహానికి పూజలు చేశారు. విరుపాక్షేశ్వర ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఉదయం నుంచే హంపీకి పర్యాటకులు పోటెత్తారు. శ్రీకృష్ణదేవరాయల పాలనను మైమరిపించేలా మన సంస్కృతి, వారసత్వాన్ని కాపాడే దిశగా హంపీ ఉత్సవాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలి రోజు మాతాంగ పర్వత మైదానంలో మత్య్స మేళా, ఫల, పుష్ప ప్రదర్శన, కమలాపురం చెరువులో బోటింగ్, విరుపాక్షేశ్వర హంపీ చరిత్రపై చర్చా గోష్టి, మాతాంగ పర్వతం సమీపంలో ఆహార మేళా, ఎద్దుల ప్రదర్శన, రంగోలి పోటీలు నిర్వహించారు. ఈసారి ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఆరు వేదికలను సుందరంగా ముస్తాబు చేశారు. హంపీలో కట్టడాలను విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. ఎంపీ ప్రకాష్ వేదిక, శ్రీకృష్ణదేవరాయ వేదిక, శ్రీ విరుపాక్షేశ్వర వేదిక, సాసువేకాళు గణపతి వేదిక, విద్యారణ్య వేదికలపై నిర్వహించిన వివిధ సాంస్కృతిక, మనోరంజన కార్యక్రమాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేశాయి. ఉమ్మడి బళ్లారి జిల్లాతో పాటు కర్ణాటకలో వివిధ జిల్లాల నుంచి కాకుండే దేశ, విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో హంపీ ఉత్సవాలకు తరలివస్తున్నారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు చేపట్టారు. రంగోలి పోటీలు జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ, సాంస్కృతిక శాఖ, వివిధ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో విరుపాక్ష ఆలయం ముందు నిర్వహించిన రంగోలి పోటీల్లో 41 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సేవ్ ది ఫిమేల్ ఫెమి చిత్రం, వరాహ చిహ్నం, శ్రీకృష్ణ దేవరాయలు, శివలింగం, సింహం తదితర చిత్రాలు సహా విరుపాక్ష ఆలయం ముందు వేసిన రంగోలి చిత్రాలు ఆకట్టున్నాయి. ఎగ్జిబిషన్.. హంపీ ఉత్సవాల్లో మన సంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా పురాతన కాలం నాటి మానవులు వాడిన పరికరాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. రోకలితో దంచడం, మహిళలు ఇసరాయితో తిప్పి పిండి తయారు చేయడం, చేదుబావి నుంచి నీటిని తోడటం తదితర దృశ్యాలను పర్యాటకులు తిలకించారు. చిరు ధాన్యాలు, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు, వివిధ రకాల పూలతో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన, పంటకోత వేడుక, వ్యవసాయ ప్రదర్శనలు అలరించాయి. గణేశుడు, కేఎస్డీఏ లోగో, ధాన్యాల రూపంలో నంది ప్రతిమ, వ్యవసాయంలో డ్రోన్ల వాడకం, ట్రాక్టర్లు, పశుపోషణ, పట్టుపురుగుల పెంపకం, ధాన్యాల అమ్మకం చిత్రాలు ఏర్పాటు చేశారు. మస్త్య ప్రదర్శన మాతాంగ పర్వత మైదానంలో మత్స్యశాఖ నిర్వహిస్తున్న చేపల ప్రదర్శనను జిల్లా అధికారి కవితా ఎస్ మన్నికేరి ప్రారంభించారు. సముద్రంలోని మత్స్యసంపద వైవిధ్యాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో దేశీయ మూలాలకు చెందిన 50కి పైగా అలంకార చేపలను అక్వేరియంలో ఉంచారు. జలాశయంలో కనిపించే చేపల వైవిధ్యం, మత్స్యకారుల జీవనోపాధిలో దాని పాత్రను వివరిస్తున్నారు. కుటుంబాలతో వచ్చిన పెద్ద సంఖ్యలో ప్రజలు చేపల జాతరను వీక్షిస్తున్నారు. ఎద్దులను అలంకరించి పోటీలకు తీసుకొచ్చిన యువకులు ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం సిద్దరామయ్య పర్యాటకులతో కిటకిటలాడిన హంపీ వీధులు అలరించిన సాంస్కృతిక, మనోరంజన కార్యక్రమాలుసాలువేకలు గణపతి వేదికలో సాంస్కృతిక వైభవం విజయనగర జిల్లా యంత్రాంగం, కన్నడ, సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాలువేకలు గణపతి వేదికలో వచనగానం, రంగస్థల గీతాల గానం, జానపద గీతాలు, హిందుస్తానీ గానం, భరతనాట్యం, సుగమ సంగీతం, తబలా వాయిద్యం, శాసీ్త్రయ నృత్యం, నృత్య రూపక, బయలత పదాలు, తత్వపద గానం విషు కళా ప్రదర్శన, మిమిక్రీ, దసరా పదాల గానం, సముహా నృత్య రూపకం, వచన సంగీతం, చౌదకి పదాల గానం, అనేక ఇతర కార్యక్రమాలు వివిధ బృందాలచే ప్రదర్శించబడ్డాయి. -
గ్రామాల్లో సమస్యలు పరిష్కరించండి
రాయచూరు రూరల్: గ్రామీణ విధాన సభ పరిధిలో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి జరిగిన టా్స్క్ పోర్స్ సభలో గ్రామీణ శాసనసభ సభ్యుడు బసన గౌడ దద్దల్ అధికారులపై మండిపడ్డారు. శుక్రవారం తాలుకా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జెస్కాం, సాంఘిక సంక్షేమ శాఖ, పంచాయతీ అభివృద్ధి అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఓలు గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, పంచ గ్యారంటీల అధ్యక్షుడు పవన్ పాటిల్, టీపీఈఓ చంద్ర శేఖర్, తహసీల్దార్ సురేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్పై అప్రమత్తత అవసరం రాయచూరు రూరల్: నేటి సమాజంలో క్యాన్సర్ వ్యాధికి గురవుతున్న వారి సంఖ్య అధికమైంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు ఇంటింటా ప్రచారం చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు యలహంక మణిపాల్ క్యాన్సర్ అస్పత్రి వైద్యులు విక్రమయ్య, అరన్ ఫెర్నాండజ్ పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇమ్యూనోథెరపీ, ట్రోమో సెంటర్ ద్వారా క్యాన్సర్ రోగులకు చికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. తాగునీటి సమస్య తలెత్తనీయొద్దురాయచూరు రూరల్: రానున్న వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారి నితీష్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా అధికారి సభా భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఇతర శాఖల ఉద్యోగులు కలసి కట్టుగా పని చేయాలని సూచించారు. తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణ పుర కుడి కాలువల కింది భాగంలో మూడు నెలల పాటు నీటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, బావుల్లో నీటిని నింపాలని సూచించారు. నీటిని సంరక్షించి పొదుపుగా వాడుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. బాల్య వివాహాలతో అనర్థాలురాయచూరు రూరల్: బాల్య వివాహాలతో అనర్థాలు చోటుచేసుకుంటాయి. నేటి ఆధునిక సమాజంలో బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు ముందుండాలని జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కార్మిక శాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే మహిళా శిశు సంక్షేమ అధికారులు స్పందించాలని సూచించారు. డ్రగ్ పెడ్లర్ దౌలా అరెస్ట్ బళ్లారి అర్బన్: డ్రగ్ పెడ్లర్ డి.దౌలా అలియాస్ ఎస్.దౌలాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 2010 నుంచి 2025 వరకు వివిధ పోలీస్స్టేషన్ల రికార్డులను పరిశీలించగా దౌలాపై మొత్తం 21 కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన కేసులే ఎక్కవగా ఉన్నట్లు సమాచారం. దౌలా పలుమార్లు అరెస్ట్ అయినప్పటికీ బెయిల్పై విడుదలై తిరిగి అదే నేరాలు చేసేవాడు. అతడిపై వరుస కేసులు నమోదు కావడంతో గతంలో జిల్లా నుంచి బహిష్కరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మళ్లీ నగరంలోకి వచ్చి యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసిన కొద్ది రోజుల్లోనే బెయిల్పై బయటకు వచ్చి తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగించడం పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
యమస్పీడు.. తీసింది ప్రాణం
మృతుల వివరాలు ● అశ్విన్ నాయర్ (17), ఫస్ట్ పీయూసీ, ఆర్వీ పీయూ కాలేజీ, యలహంక, చిరునామా: కొత్తనూరు ● ఇథన్ (17), ఫస్ట్ పీయూసీ, ఆర్వీ పీయూ కాలేజీ, యలహంక, చిరునామా: హుళిమావు, హెణ్ణూరు రోడ్డు ● అహ్రామ్ షరీఫ్ (16), 10వ తరగతి, ఏఓకేహెచ్ పాఠశాల, చిరునామా: ఉగిఖా లేఅవుట్ ● అయాన్ అలీ (17), 10వ తరగతి, ఆర్ఓఏ పాఠశాల, చిరునామా: కొత్తనూరు ● భరత్ (17), 10వ తరగతి, శోభన మెమోరియల్ స్కూల్, ఫ్రేజర్ టౌన్, చిరునామా: ఫ్రేజర్ టౌన్ ● ఫర్హాన్ (18), చిరునామా: కమ్మనహళ్లి ● గగన్ (26), సఫూల్ మార్కెట్ సూపర్వైజర్, చిరునామా: దేవనాయకనహళ్లి, చెన్నరాయపట్న, (ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి)కృష్ణరాజపురం: తెలిసీ తెలియని తనంతో బాలురు చేతిలోకి కారు స్టీరింగ్ తీసుకొని యమస్పీడుగా వెళ్లి మృత్యువాత పడ్డారు. జాలీ రైడ్ అంటూ వెళ్లి మృత్యువుకు చిక్కి తల్లిదండ్రుల కడుపుకోతకు కారణమయ్యారు. ఎంతో భవిష్యత్ ఉన్న బాలురు అర్ధంతరంగా తనువు చాలించడంతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. హొసకోటె శివార్లలో హొసకోటె, డాబస్పేటె మధ్య శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై కారు, బైక్, క్యాంటర్ మధ్య జరిగిన వరుస ప్రమాదాల్లో బెంగళూరు నగరానికి చెందిన కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు బాలురు, బైక్పై వెళుతున్న వ్యక్తితో కలిసి మొత్తం ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిలో క్యాంటర్ వాహనానికి చెందిన మాలూరు తాలూకా సంతెహళ్లి గ్రామ నివాసి బాలసుబ్రమణ్యం (32) కూడా ఉన్నారు. మృతులందరూ హెచ్బీఆర్ లేఅవుట్, ఫ్రేజర్ టౌన్, హెణ్ణూరు, కొత్తనూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారు. ఎస్ఎస్ఎల్సీ, పీయూసీ చదువుతున్నారు. తెల్లవారు జామున 1 గంట ప్రాంతంలో వారందరూ జాలీ రైడ్ కోసం తమ ఇళ్ల నుంచి కార్లలో బయలుదేరి వెళ్లారు. హొసకోటె, డాబస్పేటె జాతీయ రహదారిపై తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో హొసకోటె నుంచి వచ్చిన క్యాంటర్ వాహనం, సూలిబెలె పోలీస్ స్టేషన్ పరిధిలోని. సత్యావర గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టి, ఆపై నియంత్రణ కోల్పోయి క్యాంటర్ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ వార్త అందిన వెంటనే సూలిబెలె స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏడుగురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం హొసకోటె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు క్యాంటర్ యాక్సిల్ పూర్తిగా కట్ అయి చక్రాలు విడిపోయి బోల్తా పడ్డాయి. కారు, బైక్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.వరుస ప్రమాదాల కారణంగా ఈ మార్గంలో ప్రయాణించాల్సిన వాహనాలను జాతీయ రహదారిపై కొన్ని గంటలపాటు నిలిపివేశారు. ఆ తర్వాత పోలీసులు క్రేన్ను ఉపయోగించి దెబ్బతిన్న వాహనాలను రోడ్డు నుంచి పక్కకు తరలించి వాహన రాకపోకలు పునరుద్ధరించారు.ప్రమాదంలో చనిపోయిన బాలురు (ఫైల్) హొసకోటె సమీపంలో జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు ఆరుగురు బాలురు, వ్యక్తితో సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి -
సొంతదారులకు చోరీ సొత్తు అప్పగింత
యశవంతపుర: మల్లేశ్వరం, రాజాజీనగర, సుబ్రమణ్యనగర, మహాలక్ష్మి, యశవంతపుర, ఆర్ఎంసీ యార్డ్ పోలీసుస్టేష్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి బెంగళూరు ఉత్తర విభాగం పోలీసులు కార్యచరణ చేసి 75 కేసుల్లో 83 మంది నించితులను అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ.1.76 కోట్ల విలువైన 67 ముబైల్ఫోన్లు, మూడు లక్షల నగదు, బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మల్లేశ్వరం పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న జీబీఏ అట మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చోరీ సొత్తును సొంతదారులకు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సీమంతకుమార్ సింగ్ అప్పగించారు. -
కేఎస్ఆర్పీ బెటాలియన్ ఏర్పాటు చేయాలి
రాయచూరు రూరల్: జిల్లాలో కేఎస్ఆర్పీ బెటాలియన్ ఏర్పాటు చేయాలని అఖిల మహర్షి వాల్మీకి నాయక్ సంఘటన సంచాలకుడు వెంకటేష్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హట్టి బంగారు గనుల కంపెనీ, రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పలు రకాలైన జాతరలు, రథోత్సవాల సమయంలో గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కేఎస్ఆర్పీ 13వ పోలీస్ బెటాలియన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని శాసన సభ్యులు అభివృద్ధి విషయంలో ఏకం కావాలన్నారు. బెంగళూరు, తుమకూరు ప్రతినిధుల మాదిరిగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. -
చనిపోతూ నలుగురికి పునర్జన్మ
హుబ్లీ: బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి నలుగురికి పునర్జన్మ ప్రసాదించారు. వివరాలు.. విజయపుర జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దు మృతి చెందగా.. అతడి స్నేహితుడు బలరామ తీవ్రంగా గాయపడటంతో విజయపుర నగరంలోని బీఎల్డీఈ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు యువకుడి మొదడు దెబ్బతినడంతో బతకడం కష్టమని చెప్పారు. సదరు కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి అవయవ దానానికి అనుమతి తీసుకున్నారు. న్యాయపరమైన ప్రక్రియ ముగిశాక అవయవ దానాన్ని ప్రారంభించిన ఆస్పత్రి వైద్యులు ఓ మూత్రపిండాన్ని కలబుర్గి ఆస్పత్రికి జీరో ట్రాఫిక్ ద్వారా తరలించారు. మరో మూత్రపిండాన్ని బీఎల్డీఈ ఆస్పత్రి రోగికి అమర్చారు. ఇతర అవయవాలు సరిపోని కారణంగా తీసుకోలేదు. అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను స్థానికులు అభినందించారు. -
ఎర్రజెండాల కన్నెర్ర
గౌరిబిదనూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, రైతు విరోధి చట్టాలను రద్దు చేయాలని కార్మికులకు, రైతులకు న్యాయం చేయాలని సీఐటియూ ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎర్రజెండాలు చేబూని నిరసనలకు దిగారు. గౌరిబిదనూరులో వేలాదిమంది ర్యాలీ జరిపారు. రైతుల భూములను లాక్కుని పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారని, కార్మికుల కడుపు కొట్టేలా 4 చట్టాలను తెచ్చారని, ఉపాధి హామీ పథకం పేరును మార్చేశారని, ప్రజలలో మతమౌఢ్యం నింపుతూ ఉన్నారని కార్మిక నేతలు ఆరోపించారు. మనదేశంలో కార్మికుల పరిస్థితి చింతాజనకంగా ఉందన్నారు. జపాన్ దేశంలో కార్మికులకు గంటకు రూ.600 వేతనం ఇస్తుంటే, మనదేశంలో రూ.5 మాత్రమే లభిస్తోందన్నారు. కార్మికులకు నెలకు రూ.15 వేల వేతనం ఇవ్వడానికి పారిశ్రామిక యాజమాన్యాలు, ప్రభుత్వాలు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందే తప్ప తగ్గింది లేదని, ప్రధాని మోదీ మాత్రం ముస్తాబై విదేశాల పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మిక నేతలు, వేలాదిగా కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. బెంగళూరులో ధర్నాలు శివాజీనగర: కేంద్రం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు రాష్ట్రంలో ఆందోళనలు నిర్వహించాయి. బంద్ పిలుపునకు పెద్ద స్పందన లభించలేదు. మైసూరు, హుబ్లీ, మంగళూరు సహా అన్ని నగరాలు, పట్టణాలలో ర్యాలీలు జరిపారు. అన్ని సేవలు యథాతథంగా నడిచాయి. బెంగళూరులో టౌన్హాల్ ముందు కార్మికులు, కమ్యూనిస్టు కార్యకర్తలు ధర్నా చేయగా, పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ మార్గాలలో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు -
విజ్ఞానంతో జ్ఞాన వికాసం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో మానవుడి మెదడులో ఉన్న జ్ఞానం విజ్ఞానంతో వికాసం చెందుతుందని రాయచూరు విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద పేర్కొన్నారు. గురువారం మాత్రుశ్రీ తపోవనంలో కసాప, బసవ సేవా ప్రతిష్టాన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మానవుడిలో ఉన్న విషయాలు నేటి సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందడంతో జ్ఞాన భండాగారం తరించి పోతుందన్నారు. మనపై విచారించకుండా మరొకరి గురించి మాట్లాడుకోవటం మానుకోవాలన్నారు. 1970లో కూడు, గూడు, దుస్తుల పట్ల ఆలోచించే వారన్నారు. నేడు బంధుత్వాలకు, పండుగలు, జాతరలకు విలువ లేదన్నారు. సమావేశంలో బసవరాజ్ స్వామి, అశోక్ కుమార్ జైన్, వాేసుదేవ్ మూర్తి, విజయ రాజేంద్ర, హులి, ఆంజనేయ, వెంకటరావ్, నాగప్ప, రేఖ, విరుపాక్షి, ప్రతిభ, రావుత్ రావ్, వెంకటేష్లున్నారు. -
చాక్లెట్లలో గంజాయి.. ఎయిర్పోర్టులో సీజ్
దొడ్డబళ్లాపురం: క్యాండీలు, చాక్లెట్ల రూపంలో గంజాయి, డ్రగ్స్ని తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుని లగేజీలో 9.7 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.3.39 కోట్లుగా తెలిసింది. క్యాండీలు, చాక్లెట్ల రూపంలో గంజాయిని తరలిస్తున్నారు. మరో ప్రయాణికుడు 1.7 కేజీల చరస్, హషిష్ తరలిస్తూ పట్టుబడ్డాడు. విలువ రూ.4.7 కోట్లుగా అధికారులు తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేశారు. కారు దూసుకెళ్లి చిన్నారి మృతి దొడ్డబళ్లాపురం: ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని కారు ఢీకొన్న ప్రమాదంలో చిన్నారి అక్కడే చనిపోయిన సంఘటన బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా వాటరె గ్రామంలో జరిగింది. త్రిష (17 నెలలు) అనే పాప ఇంటి ముందు ఆడుకుంటుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. చక్రాల కింద నలిగిన బాలిక క్షణాల్లోనే మృత్యువాత పడింది. కారు డ్రైవరుపై ఖానాపుర పోలీసులు కేసు నమోదు చేశారు. భూ స్కాం కేసులో సబ్ రిజిస్ట్రార్ అరెస్టు దొడ్డబళ్లాపురం: కోట్ల రూపాయల విలువ చేసే భూమికి నకిలీ పత్రాలు తయారుచేసి విక్రయించిన కేసులో బెళగావి జిల్లా హుక్కేరి పోలీసులు సబ్ రిజిస్ట్రార్తో పాటు 9 మందిని అరెస్టు చేశారు. సబ్ రిజిస్ట్రార్ మడివాళయ్య, పత్రాలను తయారుచేసిన అశోక్, రైటర్ ఆనంద నిందితుల్లో ఉన్నారు. కురణి గ్రామంలోని 2.1 ఎకరాల భూమి యజమాని శివానంద. ఆయనకు తెలియకుండా నిందితులు ఫోటోషాప్ ద్వారా ఆధార్ కార్డ్, ఇతర పత్రాలను రూపొందించి, తమదేనంటూ ఒక బిల్డర్కి విక్రయించారు. ఇందుకు సబ్ రిజిస్ట్రార్ కూడా సహకరించాడు. ఇది తెలుసుకున్న భూ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రైలులో మొబైల్ చోరీ శివమొగ్గ: మంగళవారం రాత్రి శివమొగ్గలోని విద్యానగర రైల్వే స్టేషన్ సమీపంలో ఒక దుండగుడు రైలు బోగీలోకి ప్రవేశించి, ప్రయాణికులను బెదిరించి, మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయాడు. ఈ సంఘటన యశ్వంతపుర– తలగుప్ప రైలులో జరిగింది. రైలు శివమొగ్గలోని విద్యానగర రైల్వే స్టేషన్కు చేరుకున్నప్పుడు ఓ దొంగ బోగీలోకి ప్రవేశించాడు. కత్తితో భయపెట్టి ఒక ప్రయాణికుని మొబైల్ ఫోన్ను లాక్కొని పారిపోయాడు. బాధితుడు రైల్వే శాఖ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేశాడు. రాహుల్పై పోస్టు.. అరెస్టు శివమొగ్గ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ గురించి అవమానకరమైన పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అభియోగంపై తీర్థహళ్లి బీజేపీ ఎమ్మెల్యే అరగ జ్ఞానేంద్ర సన్నిహితుడు రాజేష్ హిరిమానైపె కేసు నమోదైంది. రాహుల్గాంధీని పాకిస్తాన్ సైనికాధికారి ముఖంతో కలిపిన ఫోటోని రాజేష్ పోస్ట్ చేశాడు. వీరిద్దరిదీ ఒకే అజెండా అనే వ్యాఖ్య కూడా చేశాడు. దీంతో స్థానిక పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరచగా ఈ నెల 24 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించారు. -
నేటి నుంచి హంపీ ఉత్సవాలు
సాక్షి,బళ్లారి: ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన హంపీలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు హంపీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాల కోసం హంపీని నవవధువులా ముస్తాబు చేశారు. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా పరమ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి రోజున హంపీ ఉత్సవాలు ముగియనున్నాయి. హంపీలో సాక్షాత్తు విరుపాక్షేశ్వరుడు లింగరూపంలో కొలువు దీరిన నేపథ్యంలో అదే రోజు హంపీ ఉత్సవాలతో పాటు శివుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు విచ్చేస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. విజయనగర జిల్లా యంత్రాంగం హంపీలో ప్రతి చారిత్రక కట్టడానికి విద్యుత్ దీపాలంకరణ చేయడంతో హంపీ సౌందర్యం మరింత ఆకట్టుకునేలా ఉంది. ఉత్సవాలు నేపథ్యంలో కర్ణాటక నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి పర్యాటకుల సందడి పెరగనుంది. ఆరు ప్రధాన వేదికలు ఏర్పాటు చేసి, మన సంస్కృతి వారసత్వాలను కాపాడే దిశగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గత వైభవాన్ని చాటేలా .. హొసపేటె: ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపీలో ఈనెల 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు హంపీ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, 1000 డ్రోన్లతో ప్రత్యేక హైటెక్ షో, హంపీ బైస్కై హెలిరైడ్, జానపద కళారూపాలతో ఊరేగింపు అంగరంగ వైభవంగా జరగనుంది. హంపీ ఉత్సవాలకు ఈసారి సుమారు 8 నుంచి 10 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా. హంపీ ఉత్సవాలను శుక్రవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభించనున్నారు. 50 కిలో మీటర్ల మేర ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆరు ప్రధాన వేదికల్లో కృష్ణదేవరాయ వేదిక, విరుపాక్ష వేదిక వద్ద ప్రముఖ నటీనటులు, గాయకుల ప్రదర్శనలు, డోలు కుణిత, పులి వేషధారణలు వంటివి రాష్ట్ర వ్యాప్త కళాకారుల ప్రదర్శనలు అలరించనున్నాయి. సుమారు రూ.14–15 కోట్ల బడ్జెట్తో, 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. పర్యాటకులకు ప్రభుత్వం తరఫున ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. విద్యుద్దీప కాంతుల్లో మిరుమిట్లుగొలుపుతున్న ప్రధాన వేదికఉత్సవాల సందర్భంగా స్మారకాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ నవవధువులా రాయల రాజధాని ముస్తాబు దేదీప్యమానంగా స్మారకాలకు దీపాలంకరణ -
కార్మిక సంఘాల సమ్మె
బళ్లారి రూరల్: దేశ వ్యాప్తంగా గురువారం జేసీటీయూ(జాయింట్ కమిటీ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో భాగంగా నగరంలో కార్మిక సంఘాల కార్యకర్తలు నగరంలో సమ్మె నిర్వహించారు. నారాయణరావు పార్క్ వద్ద నుంచి ర్యాలీగా పాత జిల్లాధికారి కార్యాలయం వరకు వెళ్లి అక్కడ భైటాయించి నిరసన చేపట్టారు. కార్మిక నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కష్టించి పని చేసే కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ను తెస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రజా సేవా రంగాలైన రైల్వే, గనులు, బ్యాంకులు, బీమా, విమానయాన, ఆయిల్, పోస్టల్, రోడ్డు రవాణా, టెలికాం సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. నరేగ పథకాన్ని వీబీ జీ రామ్ జీ అని పేరు మార్చడాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు. సమ్మెలో భాగంగా గురువారం ఎల్ఐసీ, బ్యాంకులు మూతపడ్డాయి. ఎల్ఐసీ ఉద్యోగ సంఘ ప్రముఖులు సూర్యనారాయణ, దత్తాత్రేయ, కార్మిక సంఘ ప్రముఖులు సత్యబాబు, ఆదిమూర్తి, దేవదాస్ తదితరులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించాలని సీఐటీయూ రాష్ట సంచాలకులు వీరేష్ డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రైతు, వ్యవసాయ, ఏపీఎంసీ, విద్యుత్ కార్మిక చట్టాలను జారీ చేయడం వల్ల రై తు, కార్మిక, వ్యవసాయ కూలీలకు అన్ని విధాలుగా నష్టపోతారని ఆరోపించారు. ప్రైవేట్ పెట్టుబడిదారులకు మద్దతు పలుకుతూ ఎర్ర తివాచీ పరచడాన్ని తప్పుబట్టారు. మనరేగలో తొలగించి వికసిత భారత్ మిషన్ రోజ్గార్ పేరును నమోదు చేయడం తగదని ఆరోపించారు. మనరేగ పథకం రద్దు వల్ల నేడు వలస వెళుతున్న కూలీలు, కార్మికులకు భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడంతో యరగేరలో రాయచూరు, కర్నూలు, మంత్రాలయం రహదారులను బంద్ చేసి రాస్తారోకో చేపట్టారు. అంబేడ్కర్ సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆందోళనలో పద్మ, వరలక్ష్మి, శరణ బసవ, రేణుకమ్మ, రంగమ్మ, అజీజ్, జిలాని, భీమణ్ణ, జగదీష్, ఆంజనేయ, తిమ్మప్ప తదితరులున్నారు. -
అగ్రనేతల ముందుకు సీటు పాట్లు
శివాజీనగర/ బనశంకరి: రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న ముఖ్యమంత్రి పదవి మార్పిడి వివాదంలో ఇదో మైలురాయి. ఎట్టకేలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీని కలిశారు. సీటు గొడవలో అనేకసార్లు భేటీకి డీకే యత్నించినా అపాయింట్మెంట్ లభించలేదు. ఇటీవల మైసూరులో ఎయిర్పోర్టులోనే రాహుల్ కొంతసేపు చర్చించారు. రెండురోజుల కిందట ఢిల్లీకి వచ్చిన డీకే శివకుమార్ ఈదఫా రాహుల్గాంధీతో సమావేశమై సీఎం పీఠం మార్పిడి అంశం, రాష్ట్ర రాజకీయ పరిణామాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సోనియాగాంధీ నివాసంలో ప్రియాంకగాంధీ, తరువాత సోనియాగాంధీని కూడా కలిశారు. వారిముందే రాహుల్గాంధీతో చర్చలు జరిపారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, తమ శ్రమకు ప్రతిఫలం ఇవ్వాలని విన్నవించారని తెలిసింది. అధికార పంపిణీ ఒప్పందాన్ని గుర్తుచేశారు. దీనికి స్పందించిన రాహుల్, ప్రియాంకగాంధీ.. త్వరగా తీర్మానం చేస్తాం, కొంతవరకు సహనంతో ఉండాలని చెప్పారని తెలిసింది. తక్షణం ఓ నిర్ణయానికి రాలేం, సీఎం సిద్దరామయ్యను ఢిల్లీకి పిలిపించి మాట్లాడుతాం. ఆ తరువాత ఒక నిర్ణయానికి వస్తామని హామీ ఇచ్చినట్లు డీకే సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయం చేయడానికే వచ్చా: డీకే నేను రాజకీయాల్లో ఉన్నా, రాజకీయం చేయాలి, హైకమాండ్కు అన్నీ వివరించాను అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. గురువారం ఢిల్లీలో కర్ణాటక భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పదవిపై హైకమాండ్ నుంచి స్పష్టత లభించిందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, నేను దీని గురించి చర్చించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ నేత రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. సహనం కూడా ప్రతిఫలం ఇస్తుందన్నారు. నేను ఢిల్లీకి వస్తే రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ.వేణుగోపాల్, సుర్జేవాలా ఇలా అందరినీ కలుస్తానని తెలిపారు. రాజకీయాలు చర్చించకుండా ఉంటామా?, కానీ వాటిని మీడియా ముందు వెల్లడించడం సబబు కాదన్నారు. సీఎం తనయుడు యతీంద్ర మా హైకమాండ్ కదా, ఆయన మాటలను స్వీకరించాలని చమత్కరించారు. ఎమ్మెల్యేల విదేశీ పర్యటన గురించి నేను ఏమీ మాట్లాడను, వారికి సీఎం ఏ మార్గదర్శకం చేస్తున్నారో తెలియదన్నారు. టూర్ గురించి తనతో చర్చించలేదన్నారు. తమ మధ్య సంఘర్షణ లేదని, తాను, సీఎం పార్టీ తీర్మానానికి కట్టుబడి నడుచుకుంటున్నామని చెప్పారు. తమ సర్కారుకు 1000 రోజులు పూర్తి కావడం సంతోషంగా ఉంది, ఈ సందర్భంగా భూమి గ్యారంటీ పథకాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తామన్నారు. భూమి హక్కుపత్రం లేని వారికి హక్కుపత్రాలు, పట్టా పుస్తకాలను అందిస్తామని తెలిపారు. సోనియాగాంధీ, ప్రియాంక, రాహుల్తో డీసీఎం శివ భేటీ సీఎం పదవి కోసం విజ్ఞప్తి సహనంతో ఉండాలని హైకమాండ్ హితబోధ సీఎం సిద్దును పిలిచి చర్చించి, ఆపై నిర్ణయానికి భరోసా -
హంపీ బై స్కైకి శ్రీకారం
హొసపేటె: హంపీ ఉత్సవాల సందర్భంగా గురువారం కమలాపుర భువనేశ్వరి హోటల్ మైదానంలో హంపీ బై స్కై కార్యక్రమాన్ని జెడ్పీ సీఈఓ మహ్మద్ అక్రమ్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన హంపీలో వెలసిన రాయల కాలం నాటి సుందరమైన స్మారకాలను, కట్టడాలను, ఆలయాలను ఆకాశంలో నుంచి వీక్షించడం ఎంతో అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ఒక్కరికి రూ.3800 టిక్కెట్ ధర కల్పించామని, 5, 6 నిమిషాల పాటు హెలికాప్టర్ ద్వారా హంపీ అందాలను వీక్షించవచ్చని తెలిపారు. ఈనెల 12 నుంచి 16 వరకు హంపీ బై స్కై కార్యక్రమం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. భక్తిశ్రద్ధలతో తుంగా హారతి హొసపేటె: హంపీ ఉత్సవంలో భాగంగా విరుపాక్షేశ్వర ఆలయం సమీపంలోని తుంగభద్ర నది స్నానఘాట్ వద్ద తుంగా హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంత్రోచ్ఛారణల మధ్య, జిల్లా ఇన్చార్జి మంత్రి, డిప్యూటీ కమిషనర్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు కాంస్య దీపాలను వెలిగించారు. నది నీటిలో ప్రతిబింబించే దీపాల కాంతి, మంత్రాల జపం, పెద్ద పెట్టున శంఖం ఊదడంతో భక్తులు, పర్యాటకుల్లో భక్తిభావం ఉట్టిపడింది. కొప్పళ సీఐ జయప్రకాష్ బదిలీ రాయచూరు రూరల్: కొప్పళ టౌన్ సీఐ జయప్రకాష్ను కొప్పళ గ్రామీణ పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తూ ఉత్తర వలయం ఐజీపీ చేతన్సింగ్ రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న డి.సురేష్ను లోకాయుక్తకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానిపై హేళన తగదు రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్లో దేశం పురోగమనం చెందుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ సమావేశంలో అవమాన పరిచే విధంగా మహిళా సభ్యురాలిని ప్రశ్నించడం సబబు కాదని బీజేపీ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు సుమతి శాస్త్రి మాట్లాడారు. అసభ్య పద జాలాన్ని వాడకుండా కట్టడి చేయాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా రాష్ట్ర గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సుమా గీస్తీ, శారద, సావిత్రి, రూప, లక్ష్మి, అశ్విని, గోవిందులున్నారు. ఘనంగా వసంత వైభవం హొసపేటె: హంపీ ఉత్సవాల సందర్భంగా గురువారం నగరంలో వసంత వైభవాన్ని ఘనంగా నెరవేర్చారు. వివిధ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. వసంత వైభవం ఊరేగింపును నగరంలోని వడకరాయ దేవస్థానం వద్ద నుంచి ప్రారంభించారు. నగరంలోని ప్రముఖ వీధుల గుండా చేపట్టి పునీత్ సర్కిల్ వరకు నిర్వహించారు. -
నేత్రపర్వంగా కొట్టూరేశ్వర రథోత్సవం
సాక్షి,బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, దైవాంశ సంభూతుడుగా పేరుగాంచిన శ్రీగురు కొట్టూరేశ్వర జాతర, రథోత్సవం కన్నుల పండువగా ఆచరించారు. ప్రతి ఏటా మాఘమాసంలో జరుపుకునే కొట్టూరేశ్వర రథోత్సవం ఈ ఏడాది కూడా ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరిపారు. గురువారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కొట్టూరు పట్టణంలో గురు కొట్టూరేశ్వర రథోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక, సామాజిక ఐక్యతను చాటే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు బళ్లారి జిల్లా నుంచే కాకుండా గదగ్, దావణగెరె, చిత్రదుర్గ, రాయచూరు తదితర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పట్టణంలో పండుగ వాతావరణం హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం సందర్భంగా పట్టణంలో జాతర, పండుగ వాతావరణం నెలకొంది. ఇంటింటా రంగవల్లులు వేసుకుని భక్తిశ్రద్ధలతో ఆచరించి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను సాదరంగా స్వాగతం పలికి, రథోత్సవాన్ని విజయవంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం విశేషం. వివిధ సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. కొట్టూరేశ్వర రథోత్సవానికి ఘనమైన చరిత్ర దాగి ఉండటంతో భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలిచింది. ఆలయంలో ప్రత్యేక పూజలు కొట్టూరేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, పూజలు, అర్చనలు కూడా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో కొట్టూరులో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా భక్త జనసందోహంతో రథోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా, మూఢ నమ్మకాలను పారదోలేందుకు కూడా ఈ రథోత్సవం ఎంతో దోహదం చేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అందరూ అశుభంగా భావించే మూలా నక్షత్ర ఆగమ సమయంలోనే రథం లాగుతూ సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలను పారదోలేందుకు కృషి చేస్తుండటం విశేషం. వేలాదిగా తరలివచ్చిన భక్తులు -
పేదలకు ఏడాదిలో లక్ష ప్లాట్లు అందిస్తాం
హొసపేటె: రాష్ట్రంలో భూమి లేని వారికి వచ్చే ఏడాదిలోపు లే అవుట్లు నిర్మించి ప్లాట్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జిల్లా ఇన్చార్జి, గృహ నిర్మాణ, వక్ఫ్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా పంచాయతీ హాలులో ప్రస్తుత సంవత్సరం జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. 2021 సర్వే ప్రకారం రాష్ట్రంలో 36 లక్షల మంది భూమి లేనివారు ఉన్నారు. అటువంటి అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ యాజమాన్యంలోని భూమిని లేదా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా ప్లాట్లు అందిస్తారన్నారు. రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ పేరిట ఉన్న 24,000 ఎకరాల్లో ప్లాట్లు నిర్మించి దశల వారీగా భూమి లేని వారికి పంపిణీ చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు డాక్టర్ ఎన్టీ.శ్రీనివాస్, ఎంపీ లత మల్లికార్జున, కృష్ణనాయక్, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఎన్.రూపేష్కుమార్, జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి, జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ అనుపమ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ -
ఎమ్మెల్యేల టూర్ వెనుక సీఎం సిద్దు
● సీఎంఓ ద్వారా త్వరగా వీసాల కోసం లేఖ ● విహారయాత్రపై హైకమాండ్ ఆరా శివాజీనగర: రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విదేశీ పర్యటన ప్రతిపాదన తీవ్ర చర్చకు కారణమైంది. దీనిపై పార్టీలోనే విస్మయం వ్యక్తమవుతోంది. 30 మంది ఎమ్మెల్యేలు ఈ నెల 15 లేదా 16న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విహారయాత్రకు బయల్దేరతారని ప్రచారం కావడం తెలిసిందే. సీఎం సీటు కోసం జరుగుతున్న యుద్ధంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు కొత్త వ్యూహాలతో కదులుతున్నారు. ఎమ్మెల్యేలకు ఓ వర్గం విదేశీ యాత్రను ఏర్పాటు చేసినట్లు, అది సీఎం సిద్దరామయ్యేనని గురువారం తేటతెల్లమైంది. టూర్పై డీకే అసంతృప్తితో ఉన్నారు. నివేదిక ఇవ్వండి ఈ నేపథ్యంలో ఏమిటీ యాత్ర అని ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆరా తీశారని తెలిసింది. పశు సంవర్ధక శాఖ అధ్యయన పర్యటన పేరుతో కొందరు ఎమ్మెల్యేలు విదేశీ టూర్కు సిద్ధమయ్యారు. ఆ తరువాత ప్రైవేట్ పర్యటనగా మారిందని సమాచారం. ఈ టూర్ గురించి నివేదిక సమర్పించాలని కేపీసీసీ నేతలకు హైకమాండ్ ఆదేశించినట్లు తెలిసింది. అధ్యయన పర్యటన అయితే ప్రభుత్వ అనుమతి ఉందా? అని అడిగినట్లు తెలిసింది. సీఎంఓ హడావుడి టూర్కి సాక్షాత్తు సీఎం ఆఫీసే ఎన్ఓసీ ఇచ్చేసిందని, అంతేకాకుండా ఆ రెండు దేశాల వీసాలను త్వరగా మంజూరు చేయాలని లేఖ కూడా పంపినట్లు తెలిసింది. మొత్తం మీద ఎమ్మెల్యేల విహారయాత్ర కొత్త చర్చకు దారిచ్చింది. యాత్ర జరిగేనా, లేదా బ్రేక్ పడేనా అనేది ఉత్కంఠగా మారింది. నాకు సంబంధం లేదన్న మంత్రి బనశంకరి: కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల విదేశీ పర్యటనతో తనకు సంబంధం లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి కే.వెంకటేశ్ అన్నారు. తమ శాఖ నుంచి ఎలాంటి విహారయాత్ర ఏర్పాటు చేయలేదని అన్నారు. నగరంలో మాట్లాడుతూ ఈ మేరకు చెప్పారు. పశుసంవర్ధక శాఖ ప్రాయోజకత్వంతో కొందరు ఎమ్మెల్యేలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ యాత్రకు వెళ్తున్నారని వార్తలు రావడంతో మంత్రి వివరణ ఇచ్చారు. -
మా కూతుర్ని కాపాడండి
● లవ్ జిహాద్ కేసులో తండ్రి ఫిర్యాదు యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా సురత్కల్లో హిందూ యువతి వైశాలి, ముస్లిం యువకుడు మహమ్మద్ మిద్లాజ్ పరారైన ఘటన లవ్ జిహాదేనని యువతి తండ్రి విశ్వనాథ్ గురువారం మంగళూరులో ఆరోపించారు. తమ కూతురు లవ్ జిహాద్లో పడి మోసపోయిందని విలపించారు. దీని వెనుక ఎస్డిపిఐ సంస్థ హస్తం ఉన్నట్లు చెప్పారు. మిద్లాజ్ ఎస్డిపిఐ కార్యకర్త అన్నారు. ఎస్డిపిఐ నాయకులు మిద్లాజ్ తరఫున వయనాడు పోలీసుస్టేషన్కు వెళ్లడమే నిదర్శనమన్నారు. తమ కూతురికి మత్తుమందులు ఇచ్చి, బ్రెయిన్ వాష్ చేసి తీసుకెళ్లాడన్నారు. విచారణ చేసి న్యాయం చేయాలని మనవి చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇంజనీరు ఇంట్లో రూ.1.70 కోట్ల నగదు
బనశంకరి: అవినీతికి పాల్పడుతూ రూ.కోట్లు కూడట్టిన అధికారులపై లోకాయుక్త దాడులు జరిపింది. బెంగళూరు, శివమొగ్గ, ధారవాడ, దావణగెరెలో గురువారం ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. ఎవరెవరు? బెంగళూరు గ్రామాంతర కర్ణాటక రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ హెచ్ఎం జనార్దన్, ప్రజాపనుల శాఖ చీఫ్ ఇంజనీర్ పురుషోత్తమదాస్ హెగ్డే, దావణగెరె బెస్కాం అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్హెచ్ అర్జున్, ధార్వాడ సర్వేయర్ సోమలింగప్పల ఇళ్లు, ఆఫీసులు, సన్నిహితుల ఇళ్లలో గాలింపు జరుగుతోంది. భారీగా నగదు, ఫాంహౌస్లు ●ఇంజనీరు హెచ్ఎం.జనార్దన్ ఇంట్లో రూ.1.70 కోట్ల నగదు దొరికింది. పెద్దమొత్తంలో అక్రమ ఆస్తుల పత్రాలు లభించాయి. ఈయనకు సంబంధించి మైసూరులో 5 చోట్ల, బెంగళూరులో 6 చోట్ల తనిఖీ జరుగుతోంది. ● దావణగెరెలో బెస్కాం ఇంజనీర్ ఆర్హెచ్.అర్జున్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు వచ్చాయి. ఇళ్లో భారీగా ఆస్తుల పత్రాలు, బంగారం లభించాయి. సాగర ఆనందపుర సమీపంలో తళలు గ్రామంలో అర్జున్ కు చెందిన 2.5 ఎకరాలు, 4.5 ఎకరాల విస్తీర్ణంలోని విలాసవంత ఫాంహౌస్లను గుర్తించి దాడులు చేశారు. ●సర్వేయరు సోమలింగప్ప సిద్దనగౌడర్ ధార్వాడలోని మురగోడ్ నివాసం, భారతినగర నివాసం, ఏడీఎల్ఆర్ ఆఫీసులో గాలింపు జరిపారు. నలుగురు అధికారులపై లోకాయుక్త దాడులు -
అక్రమార్కుల గుండెల్లో లోకాయుక్త దడ
హుబ్లీ: లోకాయుక్త అధికారులు గురువారం రాష్ట్రంలోని ఇద్దరు ప్రభుత్వ అధికారులకు సంబంధించి పలు చోట్ల ఉన్న ఆస్తులపై ఏక కాలంలో దాడి చేశారు. లోకాయుక్త వర్గాల ప్రకారం ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించిన ఆరోపణల నేపథ్యంలో ధార్వాడ, దావణగెరెల్లో ఈ దాడులు చేశారు. ధార్వాడ సర్వే శాఖ సూపర్వైజర్ సోమలింగప్ప సిద్దనగౌడర్ నివాసం, ఆయన కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు దాడి చేశారు. లోకాయుక్త ఎస్పీ సిద్దలింగప్ప నేతృత్వంలో ధార్వాడ భారతీ నగర్ లే అవుట్లోని ఆయన నివాసంతో పాటు ఐస్గేట్ వద్ద ఉన్న సదరు కార్యాలయంలో అధికారులు క్షుణ్ణంగా సోదాలు చేసి రికార్డులను పరిశీలించారు. అంతేగాక బెళగావి జిల్లా మురగోడలోని సోమలింగప్ప నివాసంతో పాటు నాలుగు చోట్ల దాడులు చేయగా సోదాల తతంగం నడుస్తోంది. దావణగెరెలోనూ.. ఇక దావణగెరెలో జెస్కాం ఇంజనీర్ ఆర్ఎస్ అర్జున్ నివాసం, కార్యాలయాల్లో దాడి చేసి ఆస్తి పత్రాలను పరిశీలించారు. కాగా అర్జున్ సదరు జెస్కాం సివిల్ విభాగంలో సేవలు అందిస్తున్నారు. దావణగెరె లోకాయుక్త ఎస్పీ ఎంహెచ్ కౌలపురే నేతృత్వంలో అర్జున్ నివాసం ఉన్న దావణగెరెలోని నిట్టువళ్లిలోని అద్దె గది, కార్యాలయం, శివమొగ్గలోని విజయనగర ప్రాంతంలోను గోపాలగౌడ లే అవుట్లోని రెండు నివాసాలపై ఏకకాలంలో దాడి చేశారు. ఇటీవల విజయనగర ప్రజాపనుల శాఖ ఈఈ దేవదాస్, అలాగే ఆయన కార్యాలయం అకౌంటెంట్ మారుతీ అనే వ్యక్తి తన కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి ఓ లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారుల వలలో చిక్కిన సంగతి తెలిసిందే. -
ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన
హొసపేటె: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె నేపథ్యంలో నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు భాగంలో గురువారం సీఐటీయూ కార్యకర్తలు నిరసన తెలిపారు. సీఐటీయు, ప్రాంత రైతు సంఘ నాయకులు, అంగన్వాడీ, బీసీఎస్ ఉద్యోగులు, నిర్మాణ కార్మికులు, ఎల్ఐసీ తదితరులతో సహా వందలాది మంది కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ కేంద్రాల ప్రైవేటీకరణ తగదు రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రైవేటీకరణ చేయడం తగదని జెస్కాం ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు గోపి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విద్యుత్ బిల్లు–2026ను ప్రవేశ పెడితే ఉద్యోగులు, కార్మికులు వీధిన పడతారన్నారు. అలాంటి చట్టాలను వ్యతిరేకిస్తూ సమష్టిగా ఆందోళన చేపట్టాలన్నారు. అనంతరం విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. వేడుకగా సవారమ్మ జాతర రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా మమదాపురలో వెలసిన సవారమ్మ జాతర వేడుకగా జరిగింది. బుధవారం కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యుల ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. ఆలయం వద్ద కలశారోహణం చేశారు. కలశ కుంభాలతో అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. మహేష్, రమేష్, శివు యాదవ్, అప్పనగౌడ, సవారప్ప, శేఖర్రెడ్డి, లక్ష్మిపతిలున్నారు. ఆల్మట్టికి విశిష్ట అతిథుల రాక ● ఆహారం కోసం విదేశాల నుంచి తరలి వచ్చిన వలస పక్షులు రాయచూరు రూరల్: ఆల్మట్టి డ్యాం పోటు జలాల్లో విదేశీ వలస పక్షుల సందడి నెలకొంది. ఆహారం కోసం విదేశాల నుంచి ఈ వలస పక్షులు తరలి వచ్చాయి. రంగు రంగుల పక్షుల సందడి చూపరుల మది దోస్తోంది. పొడవైన కాళ్లు, గొంతు, వెడల్పైన రెక్కలతో నడిచే పక్షులను గ్రేటర్ ఫ్లెమింగోలుగా పిలుస్తారు. వందలాది పక్షులు వరుసగా నిలబడి ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. దేశ, విదేశాల నుంచి 34 రకాల పక్షులు ఇక్కడకు చేరాయి. మే నెలాఖరు వరకు అవి ఇక్కడే మకాం వేస్తాయి. ఆళంద దర్గాలో శివపూజలకు సూచనరాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా ఆళంద దర్గాలో శివరాత్రికి పూజలు నిర్వహిం చాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆళందలోని వివాదిత లాడ్లే మశాక్ దర్గాలో వెలసిన రాఘవ చైతన్య శివలింగానికి శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరపాలని తీర్పు చెప్పింది. ఫిబ్రవరి 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు పూజారి సిద్దరామయ్యకు అవకాశం కల్పిస్తూ కలబుర్గి హైకోర్టు పీఠం ఆదేశించింది. ప్రత్యేకంగా పూజలు జరపడానికి హిందూ పర సంఘాలు 15 మందికి అవకాశం కల్పించాలని కోరినా హైకోర్టు కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించింది. -
ద్వేషపూరిత రాజకీయాలు తగదు
హొసపేటె: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ద్వేషపూరిత రాజకీయాలు చేయడానికి అసెంబ్లీని వేదికగా చేసుకోవడం సరికాదని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలో ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ఉమ్మడి సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు అసెంబ్లీలో గవర్నర్ పట్ల అధికార పార్టీ చూపిన అగౌరవం ఖండనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కోసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థను బెదిరించే మార్గంలో పయనిస్తోందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ చట్టం(ఎన్ఆర్ఈజీఏ)లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి వీబీజీ రామ్ జీ పేరును జోడించడం ద్వారా మార్పులు చేశారన్నారు. కానీ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీని గురించి అపప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే, సంకీర్ణ వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటే, ఆ పార్టీని గద్దె దించే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించారు. నగరసభ అధ్యక్షులు రూపేష్ కుమార్, ఉపాధ్యక్షులు జీవరత్నం, బీజేపీ నేతలు బంగారు లక్ష్మణ్, అశోక్ జీర్, శంకర్ మేటి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గాలి జనార్ధన్రెడ్డి -
సీఎం సిద్దు.. హైకమాండ్ జపం
బనశంకరి: పార్టీ నాయకత్వం చెప్పినట్లు నడుచుకుంటానని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధ ఆవరణలో మాజీ సీఎం, దివంగత కెంగల్ హనుమంతయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించి సీఎం మాట్లాడారు. కెంగల్ హనుమంతయ్య రాష్ట్రంలో ప్రామాణిక ధీమంత రాజకీయనేత, అద్భుతమైన విధానసౌధను నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. కర్ణాటక ఏకీకరణకు పోరాడిన నేతగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా సేవలందించారని చెప్పారు. రాజ్యాంగ రచనా కమిటీలో విలువైన సలహాలు అందించారన్నారు. ఆయన ఆదర్శాలు, సిద్ధాంతాలు అందరికీ మార్గదర్శనం చేస్తాయన్నారు. తనను పిలవలేదు కాబట్టి ఢిల్లీకి వెళ్లడం లేదని తెలిపారు. -
రేపు శ్రీగురు కొట్టూరేశ్వర రథోత్సవం
సాక్షి బళ్లారి: సమాజంలో మూఢ నమ్మకాలు, అసమానతలు, తారతమ్యాలు పేట్రేగిపోతున్న నాటి రోజుల్లో ఎందరో మహానుభావులు సమసమాజ స్థాపన కోసం కృషి చేసి సమాజాన్ని ఉద్ధరించేందుకు కృషి చేశారు. 12వ శతాబ్ధంలో విశ్వగురు బసవణ్ణ సమసమాజ స్థాపన కోసం కృషి చేసి సమాజంలో మార్పుకోసం తన చివరి శ్వాస వరకు అహర్నిశలు కృషి చేసి ఖ్యాతిని గడించారు. అదే తరహాలో ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కొట్టూరులో సమాజ అభివృద్ధికి, అసమానతలను తొలగించేందుకు 16వ శతాబ్ధంలో మధ్య కర్ణాటక ప్రాంతంలోని హరపనహళ్లి, నాయకనహట్టి, అరసీకెరె, కూలహళ్లి, కొట్టూరులో ఐదుగురు మహానుభావులు జన్మించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి, ఆధ్యాత్మికతను పెంపొందించి భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తూ దైవాంశ సంభూతులుగా ఖ్యాతికెక్కారు. విజయనగర జిల్లా కొట్టూరులో వెలసిన శ్రీగురు కొట్టూరు బసవేశ్వర రథోత్సవం కర్ణాటకలోనే ఖ్యాతిని గడించింది. మూలా నక్షత్రంలో రథోత్సవం దేశ వ్యాప్తంగా ఆకట్టుకుంటున్న శ్రీగురు కొట్టూరేశ్వర రథోత్సవం ఫిబ్రవరి 12వ తేదీ గురువారం అంగరంగ వైభవంగా జరగనుంది. అన్ని కులాలు, మతాలకు చెందిన వారు ఆరాధ్యదైవంగా భావించే కొట్టూరేశ్వరస్వామిని ఆరాధించి భక్తులు పునీతులవుతుంటారు. పాదయాత్రతో భక్తులు తరలి రావడం విశేషం. మూఢ నమ్మకాలను తొలగించే కార్యక్రమంలో భాగంగా కొట్టూరేశ్వర రథోత్సవాన్ని అందరూ అశుభంగా భావించే మూల నక్షత్ర సమయంలో రథోత్సవాన్ని నిర్వహిస్తుండడం విశేషం. మాదిగ సముదాయానికి చెందిన అరళయ్య వంశస్తులు హారతి ఇచ్చిన తర్వాతే రథం లాగడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా రావడం గమనార్హం. బళ్లారి జిల్లా నుంచే కాకుండా గదగ్, ముండరగి, హరిహర, దావణగెరె, చిత్రదుర్గ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారు. మూఢనమ్మకాలను పారదోలిన మహనీయుడు కొట్టూరుకు తరలి వస్తున్న భక్తజన సందోహం భక్తులకు సోదరభావంతో ఆతిథ్యం రథోత్సవానికి వచ్చే భక్తులకు సోదరభావంతో ఆతిథ్యం ఇస్తుంటారు. పరిచయం లేని వ్యక్తులనైనా కొట్టూరులో జాతర సమయంలో అందరూ మనవాళ్లుగా భావించి వారికి వసతులు కల్పించి సేవలు చేయడం భక్తి పరాకాష్టకు నిదర్శనంగా చెప్పవచ్చు. కొట్టూరేశ్వర స్వామి మహిమలు మెచ్చి మొగల్ చక్రవర్తి ఇచ్చిన మణిమంచం ఇప్పటికీ మఠంలో దర్శనమిస్తోంది. కొట్టూరేశ్వరస్వామిని హిందూ, ముస్లిం ఇలా కుల మతాలకు అతీతంగా సేవించి తరిస్తుంటారు. వీరశైవ మత పురాణం, చెన్నబసవ పురాణం, గురురాజ చరిత్ర, శ్రీగురు కొట్టూరేశ్వర స్వామి తదితర కావ్యాలు, గ్రంథాలు, మహిమలను, జానపద గేయాల్లో కూడా పౌరాణిక విశేషాలు, మహిమలు ప్రస్తావించారు. ఎంతో మహిమాన్వితమైన శ్రీగురు కొట్టూరేశ్వరస్వామి జాతర, రథోత్సవాన్ని తిలకించడానికి కొట్టూరుకు జనజాతర తరలి వస్తోంది. ఈసందర్భంగా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. -
రాష్ట్రంలో ఈ ఏడాది విద్యుత్ కోతల్లేవు.!
రాయచూరు రూరల్: రాష్ట్రంలో 2025–26లో విద్యుత్ కోతలకు అవకాశం లేకుండా అధికంగా 1100 మె.వా.విదు్య్త్ ఉత్పత్తి కొనసాగుతుంది. గత ఏడాది అధిక భాగం వర్షాలు కురవడంతో ప్రధాన జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉన్నాయి. రాష్ట్రంలో ఉష్ణ, సోలార్, గాలిమరల విద్యుత్ ఉత్పత్తి అధికంగా కొనసాగుతోంది. ప్రతి నిత్యం 33 దశలక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. 2024లో తీవ్ర విద్యుత్ క్షామం నెలకొంది. 2024–25లో 29,634 మె.వా. విద్యుత్ ఉత్పత్తి, 2025–26లో 30,733 మె.వా.విద్యుత్ ఉత్పత్తి కాగా ప్రతి రోజు 15,715 మె.వా.విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ ఉంది. 2026 జూలై వరకు విద్యుత్ కోత సమస్య ఉండదని కేపీసీఎల్ అధికారులు తెలిపారు. రాయచూరు, యరమరస్, బళ్లారి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నుంచి ఉత్పత్తి కొనసాగుతోంది. 1100 మె.వా. విద్యుదుత్పత్తి అధికం -
అరణ్యంపై విమానం సర్వే!
దొడ్డబళ్లాపురం: చిక్కమగళూరు జిల్లాలోని కళస, ఎన్ఆర్ పుర తాలూకా పరిధిలో దట్టమైన అరణ్య ప్రదేశంపై తేలికపాటి విమానం చాలాసేపు తిరగడం స్థానికులను విస్మయపరిచింది. భద్రానది తీరం మొత్తం ఈ ఎయిర్ క్రాఫ్ట్ పలు రౌండ్లు కొట్టింది. ఇది చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్లింది. కళస ప్రాంతం నుంచి వచ్చిన విమానం బాళెహొన్నూరు పరిసరాల్లో పలు రౌండ్లు కొట్టి శివమొగ్గ వైపు వెళ్లిపోయింది. తమకేమీ తెలియదని అటవీ, పోలీసు అధికారులు చెప్పారు. భూగర్భ గనుల సర్వే కోసం వచ్చి ఉంటాదని భావిస్తున్నారు. ఎయిర్పోర్టు, వాయుసేన స్థావరంపై డ్రోన్ బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టుపై డ్రోన్ ఎగరేసిన యూట్యూబర్ నిర్వాకమిది. బెంగళూరుకు చెందిన వాంటర్లస్ట్ అనే యూట్యూబర్ 1వ టెర్మినల్ నుంచి యలహంక మీదుగా వాయుసేన స్థావరం వరకూ డ్రోన్ ఎగురవేసి వీడియో షూట్ చేశాడు. సుమారు 8 నిమిషాల వీడియోను తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసాడు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగరేసినందుకు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. ఎగురుతున్న విమానం చిక్కమగళూరు జిల్లాలో కలవరం -
మహనీయుల ఆదర్శాలు అనుసరణీయం
చెళ్లకెరె రూరల్: మహనీయుల మానవతా సందేశాలు, విలువలను యువత అలవరుచుకోవాలని తహసీల్దార్ రెహన్ పాషా తెలిపారు. ఆయన తాలూకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన దళిత వచనకారుల జయంతిలో పాల్గొని మాట్లాడారు. వచనకారులు తమ కాలఘట్టంలో అసమానత, అంటరానితనంపై ఆనాడే ప్రజలను చైతన్య పరిచారన్నారు. ప్రస్తుతం వచనకారుల వచనాల్లో వ్యక్తమైన శ్రమ, సంస్కృతి, సమానత, మానవీయత సందేశాలను యువత అర్థం చేసుకోవాలన్నారు. దళిత వచనకారులు మాదార చెన్నయ్య, డోహర కక్కయ్య, మాదార జూళయ్య వంటి మహనీయులు సమానత, మానవతా విలువల గురించి తమ వచనాల ద్వారా ప్రజలను చైతన్య పరిచారన్నారు. నగరసభ ముఖ్యాధికారి నాగవేణి, సీడీపీఓ రాజనాయక్, డీసీఎం అధికారి రమేష్కుమార్, వ్యవసాయ అధికారి రమేష్, దళిత నాయకులు విజయ్కుమార్, సమర్థరాయ్, వీరభద్రప్ప, తిప్పేస్వామి పాల్గొన్నారు. చిత్రలేఖన శిబిరం ప్రారంభం హొసపేటె: హంపీ ఉత్సవంలో భాగంగా ఎదురు బసవన్న వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన చిత్రలేఖన శిబిరాన్ని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి ఒక చిత్రాన్ని గీయడం ద్వారా ప్రారంభించారు. ఏడీసీ ఈ.బాలకృష్ణ, సబ్ డివిజనల్ ఆఫీసర్ పీ.వివేకానంద, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ అనుపమ, కన్నడ సంస్కృతి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దలింగేష్ రంగన్నవర్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు పాల్గొన్నారు. కాయక శరణులకు పుష్పాంజలిరాయచూరు రూరల్: నగరంలో కాయక శరణుల జయంతిని వేడుకగా ఆచరించారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్లో కాయక శరణులు మాదర చెన్నయ్య, డోహర కక్కయ్య, ఉరిలింగ పెద్ది, సర్వజ్ఞల చిత్రపటాలకు తహసీల్దార్ సురేష్వర్మ పుష్పాంజలి ఘటించారు. అనంతరం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జయంతిని ప్రారంభించారు. సమాజంలో అట్టడుగున ఉన్న కుమ్మర సమాజం ఆర్థికంగా, సాంఘీకంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. -
ప్రజల సహకారంతో స్వచ్ఛ భారత్
బళ్లారిటౌన్: స్వచ్ఛ భారత్కు నగర ప్రజల సహకారం అవసరమని మేయర్ పీ.గాదెప్ప పేర్కొన్నారు. నగరాభివృద్ధి శాఖ, మహానగర పాలికె ఆధ్వర్యంలో వాల్మీకి భవనంలో మంగళవారం చేపట్టిన స్వచ్ఛభారత్ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ యావత్ నగరాన్ని పాలికె నుంచి శుభ్రపరచడం సాధ్యం కాదన్నారు. నగరంలోని 39వ వార్డుల్లో ప్రజలు సహకరిస్తేనే పూర్తి స్థాయిలో స్వచ్ఛతను కాపాడవచ్చన్నారు. ఇంటిలోని చెత్తను సక్రమంగా వేరు చేసి చెత్త వాహనాలకు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పాలికె కమిషనర్ మంజునాథ్ మాట్లాడుతూ పిల్లలు బాల్య దశ నుంచే పరిశుభత్రపై అవగాహన పొందాలన్నారు. అందుకు తల్లిదండ్రులు కూడా వారికి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం స్వచ్ఛభారత్పై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. పోటీల్లో దాదాపు 76 పాఠశాలల నుంచి 300 మంది విద్యార్థులు, పాలికె సభ్యులు కుబేర, రాజేశ్వరి, జానకి, ఏఈఈ ముస్తఫా పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
మహానుభావుల సేవలు మరువలేనివి
సాక్షి బళ్లారి: మూఢ నమ్మకాలు, కుల వివక్ష, అసమాతలకు వ్యతిరేకంగా వచనాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి సమ సమాజ స్థాపన కోసం ఎందరో మహానుభావులు(శరణులు) పాటు పడ్డారని జిల్లా గ్యారంటీ పథకాల అమలు ప్రాధికార సంస్థ అధ్యక్షుడు కేఈ.చిదానందప్ప తెలిపారు. మంగళవారం జెడ్పీ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కాయక శరణుల జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 12వ శతాబ్దంలో కుల వివక్ష, అసమానతలు, పక్షపాత భావనలు విస్తృతంగా ఉన్న సమయంలో ఎందరో మహానుభావులు సమ సమాజ అభివృద్ధికి కృషి చేశారన్నారు. మాదార చెన్నయ్య, సమగార అరళయ్య, మాదార గూళయ్య, డోహర కక్కయ్య తదితర మహానుభావులు, కాయక నిబద్ధతను, సమానత్వ సిద్ధాంతాలను చాటి చెప్పారన్నారు. బసవాది శరణులు ఎందరో పాటు పడ్డారని గుర్తు చేశారు. కన్నడ సంస్కృతి శాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్యారంటీల అమలు సమితి జిల్లా అధ్యక్షుడు చిదానందప్ప -
సైబర్ కేటుగాళ్లకు అకౌంట్ల దళారీ
శివమొగ్గ: డబ్బు ఆశ చూపి ప్రజల బ్యాంకు ఖాతాలను సైబర్ వంచకులకు అందిస్తున్న శివమొగ్గకు చెందిన శరత్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గుండ శరత్ కుమార్ శివమొగ్గ నగరంలోని తుంగానగర నివాసి. డ్రైవర్గా పనిచేస్తాడు. సైబర్ నేరగాళ్లకు దళారీగా ఉన్నాడు, టీ అంగడి పెట్టుకున్న స్నేహితుడు అమిత్ బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నాడు. బదులుగా 15 రోజులకు ఒకసారి కమీషన్ ఇస్తానని ఆశపెట్టాడు. కొన్నాళ్లకు నీ బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయిందని చెప్పాడు. అమిత్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి తన ఖాతా గురించి విచారణ చేశాడు. నీ ఖాతాపై 51 సైబర్ నేరాలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఆందోళనకు గురైన అమిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.55 కోట్ల మోసాలు? దీంతో శివమొగ్గలోని సీఈఎన్ పోలీసులు శరత్కుమార్ను బంధించి అతని నుంచి వివిధ బ్యాంకుల 18 పాసు పుస్తకాలు, 25 ఏటీఎం కార్డులు, 7 చెక్బుక్కులు, 2 మొబైల్ఫోన్లను, 2 క్యూఆర్ కోడ్లను స్వాధీనపరచుకున్నారు. అతని వద్ద ఉన్న 19 అద్దె బ్యాంకు ఖాతాలపై దేశ వ్యాప్తంగా 96కు పైగా వంచన కేసులు నమోదయ్యాయి. ఈ ఖాతాల ద్వారా సుమారు రూ.55.43 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఈ 19 ఖాతాల నుంచి రూ.11.48 కోట్లు బదిలీ అయ్యింది. జిల్లా ఎస్పీ బీ.నిఖిల్ మార్గదర్శనంలో ఏఎస్పీలు కార్యప్ప, రమేష్, శివమొగ్గ సైబర్ క్రైం డీఎస్పీ కృష్ణమూర్తి, ఇన్స్పెక్టర్ మంజునాథ్ దర్యాప్తు చేపట్టారు. రూ.లక్షకు 5 వేలు ఖాతాలో పడే ప్రతి లక్ష రూపాయలకు రూ.5 వేల వరకు ఖాతాదారుకు కమీషన్ ఇస్తారని తెలిసింది. దీనినే ఒక లాభదాయక వృత్తిగా చేసుకుని సైబర్ నేరాల్లో పాల్పంచుకుంటున్నట్లు బట్టబయలైంది. అమాయకుల ఖాతాల్లోకి మోసాల డబ్బు శివమొగ్గలో బడా కేటుగాడు అరెస్టు -
హంపీ ఉత్సవాలకు వేళాయె
హొసపేటె: హంపీ ఉత్సవాలు ఈనెల 13న ప్రారంభం కానుండటంతో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. హంపీ ఉత్సవానికి ఐదు వేదికలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉత్సవం ప్రధాన వేదిక గాయత్రి పీఠం మైదానంలో ఏర్పాటు చేస్తున్న ఎంపీ ప్రకాష్ వేదికను రాయల కాలం నాటి స్మారకాలు, నమూనా పద్ధతిలో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానంగా ఈ వేదికపై శ్రీకృష్ణ దేవరాయల వైభవం దర్బార్ చిత్రాన్ని రూపొందించి వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ సారి వేదిక ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే శిల్పకళా శిబిరాన్ని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి ప్రారంభించారు. శిల్ప సురేష్ ఆచార్ నాయకత్వంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి శిల్పులు రాతితో కళను సృష్టించడానికి ముందుకు వచ్చారు. నేటి నుంచి శిల్పకళా శిబిరం ఈ శిబిరం ఫిబ్రవరి 11న ప్రారంభమవుతుంది. హంపీ ఉత్సవం సందర్భంగా సృష్టించిన రాతి విగ్రహాలను ప్రదర్శనలో ఉంచుతారు. హంపీలో ఉత్సవంలో ఆకర్షణగా ఉండటానికి మాతంగ పర్వతం వద్ద, రాత్రిపూట లైటింగ్లో చూసినప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది. హంపీ చుట్టూ ఉన్న రోడ్ల మరమ్మతులు చేపట్టారు. కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. పండుగకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. హొసపేటె– హంపీని కలిపే ప్రధాన రహదారులను శుభ్రపరుస్తున్నారు. రోడ్డు వెంట ఉన్న ముళ్లచెట్లను తొలగిస్తున్నారు. హంపీ వైపు వెళ్లే రహదారుల్లో స్వాగత తోరణాలు నిర్మిస్తున్నారు. హంపీ ఉత్సవాలపై అవగాహనకు బైక్ ర్యాలీ హంపీ ఉత్సవాలపై అవగాహన కల్పించడానికి వివిధ శాఖల సహకారంతో 150కి పైగా బైక్లతో మంగళవారం భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని విజయనగర జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నగరంలోని ప్రధాన వీధులా గుండా సాగి అనంతశయనగుడి, కొండనాయకనహళ్లి, మలపనగుడి, గాళెమ్మనగుడి, కడ్డిరాంపుర మీదుగా హంపీలోని విరుపాక్షేశ్వర ఆలయానికి చేరుకుంది. జిల్లా ఎస్పీ జాహ్నవి, జెడ్పీ సీఈఓ అక్రమ్ షా, అనేక మంది సీనియర్ అధికారులు పాల్గొని ర్యాలీకి మద్దతు ఇచ్చారు. నగరంలోని వివిధ సర్కిళ్లలో జరిగిన బైక్ ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించడమేగాక చారిత్రక హంపీ గత వైభవాన్ని మరింతగా ప్రచారం చేయడానికి దోహదపడింది. చురుగ్గా ప్రధాన వేదికల నిర్మాణ పనులు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం -
ముస్లిం దంపతుల ఔదార్యం
రాయచూరు రూరల్: ముస్లిం తల్లిదండ్రులు, తమ హిందూ దత్తపుత్రుని పెళ్లిని హిందూ సంప్రదాయ రీతిలో ఘనంగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. ఈ అపురూపమైన సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా బస్తవాడిలో జరిగింది. వివరాలు.. మెహబూబ్ హసన్ నాయికోడి, నూర్జహాన్ దంపతులు ఈ ఔదార్యాన్ని చాటుకున్నారు. లింగాయత్ వర్గానికి చెందిన శివానంద కాడయ్య దంపతులు అర్ధాంతరంగా చనిపోయారు. వారి కుమారులు సోమశేఖర్ (4), వసంత్ (2)లను మెహబూబ్ దంపతులు చిన్నప్పుడే దత్తత తీసుకుని పోషిస్తున్నారు. మెహబూబ్ ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి రిటైరయ్యారు. అప్పటికే వారికి ఇద్దరు చొప్పున మగపిల్లలు, ఆడపిల్లలు ఉన్నా భారంగా భావించకుండా చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేశారు. సోమశేఖర్ డిగ్రీ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తు పూనం అనే యువతిని ప్రేమించాడు. దీంతో కాడ సిద్ధేశ్వర మండపంలో ముస్లిం తల్లిదండ్రులు హిందూ సంప్రదాయ రీతిలో దత్త కుమారుని పెళ్లి వేడుకలను జరిపించారు. మత సమైక్యతకు ఈ సన్నివేశం అద్దం పట్టగా, మెహబూబ్, నూర్జహాన్లను గ్రామస్తులు అభినందించారు. హిందూ దత్తపుత్రునికి సంప్రదాయ రీతిలో పెళ్లి -
బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు దుర్మరణం
● 12 మందికి గాయాలు ● దేవదుర్గ తాలూకాలో ఘటన రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలు కాగా 12 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని దేవదుర్గ తాలూకా తింథిణి బ్రిడ్జి నుంచి దేవదుర్గకు వస్తుండగా మార్గమధ్యంలో కరేగుడ్డ వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. ఆటోను అతి వేగంగా ఓవర్టేక్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించగా, బస్సు ఆటోను ఢీకొట్టడంతో మల్లప్ప(60) అక్కడికక్కడే మృతి చెందారు. మోనమ్మ (65) విమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.ఆటోలో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలు కాగా వారిని దేవదుర్గ తాలూకా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హొసకెరప్ప వెల్లడించారు. టిప్పర్ దూసుకెళ్లి వ్యక్తి మృతిరాయచూరు రూరల్: టిప్పర్ దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాయచూరు జిల్లాలో మాన్వి ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది. మాన్వి తాలుకా మాడగిరికి చెందిన శరణప్ప గౌడ(55) మరణించారు. బ్యాంక్లో పని ముగించుకుని ద్వి చక్ర వాహనంపై వెళుతుండగా జారి పడడంతో టిప్పర్ వెనుక చక్రం కింద పడడంతో దేహం ఛిద్రంగా మారిందని పోలీసులు తెలిపారు. మాన్వి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్ కెంచరెడ్డి తెలిపారు. కర్తవ్య లోపంపై సీఐ సస్పెండ్రాయచూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ విధి నిర్వహణలో లోపానికి పాల్పడిన సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర వలయం ఐజీపీ చేతన్ సింగ్ రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు. బాగల్కోటె జిల్లా బనహట్టి పోలీస్ స్టేషన్ సీఐ హెచ్.ఆర్.పాటిల్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా సస్పెన్షన్కు గల కారణాలను గోప్యంగా ఉంచారు. కాగా తనను సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం తెలియదని సీఐ పాటిల్ తెలిపారు. ఎస్పీ, టీఎస్పీ నిధులు పెంచాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో ఎస్పీ, టీఎస్పీ నిధులను 24 శాతం పెంచాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. మంగళవారం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు హనుమంతప్ప మాట్లాడారు. గతంలో నిధులను పంచ గ్యారంటీలకు వినియోగించడాన్ని తప్పుబట్టారు. భూమి లేని వారికి మిగులు భూములు, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు వేతనాలు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాసిన వినతిపత్రాన్ని స్థానికాధికారికి సమర్పించారు. గ్రామీణ విలేకరులకు బస్సుపాస్ల పంపిణీరాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో గ్రామీణ ప్రాంతంలో సంచరించే పాత్రికేయులకు బస్సుపాస్లు పంపిణీ చేశారు. సోమవారం కలబుర్గి డివిజన్ వార్త శాఖాధికారి కార్యాలయంలో వార్త శాఖాధికారి జడియప్ప వీటిని పంపిణీ చేసి మాట్లాడారు. వార్తలు సేకరించడానికి బస్ పాస్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బస్సు పాస్లను దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో వారి పాస్లను రద్దు చేస్తామన్నారు. అధికారులు ఉమా శంకర్, రాజరత్నం, మహాదేవి, పాషాలున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులదే దర్బార్రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో గ్రామీణ ప్రాంతంలోని రైతులు భూములను రిజిస్టర్ చేసుకోవాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తే అవినీతి కూపంలో మునిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో అడుగు పెట్టగానే ప్రైవేట్ వ్యక్తుల దర్బార్ నడుస్తోంది. నగరంలోని కార్యాలయంలో అధికారుల కంటే మధ్యవర్తులు పెత్తందారీతనం చూపుతున్నారని తెలిపారు. కార్యాలయం ముందు భాగంలో టేబుళ్లు, బెంచీలు వేసుకొని రాజఠీవి ప్రదర్శిస్తూ ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బు లాగుతున్నారని, అధికారులకు వాటా ఉందని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
కాళ్లు పట్టుకున్నా.. కనికరించని కూతురు
బనశంకరి: బెంగళూరుతో సహా పలు జిల్లాలో మతాంతర ప్రేమ గొడవలు వెలుగులోకి వచ్చాయి. సయ్యద్ ఇంతియాజ్ అనే యువకుడు ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. బెంగళూరు బీటీఎంలే ఔట్ నివాసి ఇంతియాజ్.. సోషల్ మీడియలో కోల్కతాకు చెందిన హిందూ యువతిని పరిచయం చేసుకున్నాడు. ప్రేమపేరుతో మభ్యపెట్టాడు, ఆమెను మతం మార్చి జైనద్ అని పేరుపెట్టాడు. 2025 జూలై 18న బెంగళూరులో రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. తరువాత ఆమెకు ఆడపిల్ల పుట్టింది. తల్లీ బిడ్డను కోల్కతాలో వదిలేసిన ఇంతియాజ్ పరారయ్యాడు. బాధితురాలు ఇక్కడకు వచ్చి మైకో లేఔట్ ఠాణాలో భర్త మోసంపై ఫిర్యాదు చేసింది.యువతి పరారీయశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా సురత్కల్లో మొహమ్మద్ విద్లాజ్ అనే యువకునితో కలిసి వైశాలి (23) అనే యువతి పరారు అయ్యింది. కాసరగోడుకు చెందిన వైశాలి సురత్కల్లో ఓ కాలేజీలో చదువుతోంది. ఇద్దరూ ప్రేమలో పడి జనవరి 31న కేరళలోని వైనాడులో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఇది తెలిసి యువతి తల్లిదండ్రులు బీజేపీ నాయకులను సాయం కోరారు. వైశాలి తన పీజీ హాస్టల్ నుంచి ఫిబ్రవరి 9న వెళ్లిపోయింది. కూతురి కోసం కన్నవారు సురత్కల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.కాళ్లు పట్టుకున్నా.. కనికరించని కూతురుసాక్షి, బళ్లారి: కన్నవారు ప్రాధేయపడినా కూతురు మాత్రం ప్రేమికునితో వెళ్లిపోయింది. విజయపుర నగరంలో ఓ యువతి, మహ్మద్ సలీమ్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఈ నెల 2వ తేదీన తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి, సలీమ్ కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చేసుకొన్నామని పోలీసులతో చెప్పారు. తల్లిదండ్రులు కుమార్తెను బుజ్జగించారు, తమ వెంట రావాలని ఆమె కాళ్లమీద పడి ప్రాధేయపడినా ఆమె అవేమీ పట్టించుకోకుండా వెళ్లిపోవడం చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. ఇది లవ్ జిహాదేనని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపించారు. -
ఉత్సాహంగా ఉద్యోగుల క్రీడా పోటీలు
హొసపేటె: ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో క్రీడలు సహాయకారి అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున గౌడ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో మంగళవారం రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు పరుగు పందెం, కబడ్డీ, యోగాసనాలు, వాలీబాల్, త్రోబాల్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. యువజన సేవా, క్రీడా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేసీ, జిల్లా వ్యాయామ విద్యాధికారి శ్రీకాంత్, జిల్లా కోశాధికారి కే.మల్లేశప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మస్తకాభిషేకాలు
బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన హళేబీడులోని జైనరగుత్తి ప్రాంతంలో జైన తీర్థంకరులకు మస్తకాభిషేకాలు జరుగుతున్నాయి. గర్భగుడిలోని 24 మంది తీర్థంకరులు, పార్శ్వనాథ తీర్థంకర విగ్రహానికి పవిత్ర ద్రవ్యాలతో మస్తకాభిషేకం నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జైన ఆలయం మంత్రోచ్ఛారణలతో, మంగళవాయిద్యాలతో మార్మోగింది. వివిధ ప్రాంతాల నుంచి జైన మునులు పాల్గొన్నారు. గంధం, పాలు, అశ్వగంధం, కొబ్బరి నీళ్లు, పూలు తదితరాలతో విగ్రహాలను అభిషేకం చేశారు. తీర్థోద్ధారక వీర సాగర్ ముని మహారాజ్ జైన సమాజాన్ని ఏకం చేసి జైనరగుత్తి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని నిర్వాహకులు తెలిపారు. అనేక ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.వాలెంటైన్స్ డేకు హోసూరు గులాబీలు ● రోజూ 10 లక్షల ఎగుమతి హోసూరు: 14వ తేదీన ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమజంటలు వేడుకలకు సిద్ధమవుతున్నాయి. పూలు, కానుకలతో శుభాకాంక్షలు చెప్పుకుంటారు. దీంతో హోసూరు గులాకీగా గిరాకీ పెరిగింది. పెద్దమొత్తంలో రోజా పుష్పాలను ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. హోసూరు ప్రాంతంలో రైతులు పండించే గులాబీలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. క్రిష్ణగిరి జిల్లాలో పూల సాగుకు అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండడంతో హోసూరు, బాగలూరు, బేరికె, డెంకణీకోట, తళి, అంచెట్టి, కెలమంగలం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులు గ్రీన్ షెడ్లలో గులాబీ తోటలను సాగు చేస్తున్నారు. నాణ్యత బాగా ఉండడంతో ప్రపంచ మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ప్రతి సంవత్సరం దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలకే కాక ప్రేమికుల రోజుకు లక్షలాది పూలను ఎగుమతి అవుతాయి. వాలెంటైన్స్ డే కోసం గత కొన్నిరోజులుగా నిత్యం 10 లక్షల పూలను ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో గులాబీ రూ. 20 నుంచి 30 దాకా ధర పలుకుతోంది. మంచి రేటు వచ్చిందని పలువురు రైతులు, వ్యాపారులు తెలిపారు. మంత్రి చాంబర్లో నగలు, డబ్బు చోరీ, ఉద్యోగి అరెస్టు శివాజీనగర: రాష్ట్ర నగరాభివృద్ధి మంత్రి భైరతి సురేశ్ విధానసౌధలోని కార్యాలయంలో 300 గ్రాముల బంగారు నగలు, రూ.1.50 లక్షల డబ్బులున్న బ్యాగ్ దొంగతనం కావడం కలకలం రేపుతోంది. ఈ కేసులో డీ గ్రూప్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. నవీన్ అనే వ్యక్తి పని మీద మంత్రి సురేశ్ ఛాంబర్కు వస్తూ నగలు, డబ్బు బ్యాగుతో వచ్చారు. వెళ్లేటపుడు దానిని ఆ చాంబర్లోనే మరిచిపోయారు. మరుసటి రోజు వచ్చి చూస్తే బ్యాగు లేదు. విధానసౌధ ఠాణాలో ఫిర్యాదు చేయగా, పోలీసులు తనిఖీ ఆరంభించారు. కార్యాలయం సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా, డీపీఏఆర్ శాఖలో డీ గ్రూపు ఉద్యోగి అయిన ఒకరు బ్యాగ్ను తీసుకొని వెళ్లినట్లు తెలిసింది. ఆ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. భక్తులపై చిరుత దాడి, బాలునికి గాయాలు మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలె మహదేశ్వర బెట్ట ఆలయానికి నడిచి వెళ్తున్న భక్తులపై చిరుతపులి దాడి చేసింది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. చెన్నపట్టణ తాలూకా భువళ్లి గ్రామానికి చెందిన శ్రేయస్ (8) అనే బాలుడు ఈ దాడిలో గాయపడ్డాడు. మహాశివరాత్రి రాబోతుండగా, వేలాదిమంది భక్తులు మహదేశ్వర బెట్టకు పాదయాత్రగా వెళుతున్నారు. పొన్నాచి క్రాస్ నుంచి పాదయాత్రికుల మీద చిరుత పంజా విసిరింది. బాలుని చెవులకు గాయాలయ్యాయి. మహదేశ్వర బెట్ట ఠాణా సీఐ జగదీష్, అటవీ శాఖ సిబ్బంది చేరుకుని పరిశీలించారు. బాలున్ని బెట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. భక్తులు అటవీ మార్గంలో కాకుండా ప్రధాన రహదారిలో పాదయాత్రగా రావాలని అటవీ అధికారులు కోరారు. -
చిన్నపాప ఇక లేదు
● సోషల్ మీడియా సెలబ్రిటీ రేష్మా ఆత్మహత్య! యశవంతపుర: అనుమానాస్పదంగా సోషల్ మీడియా కార్యకర్త ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన ఘటన కేరళ– కర్ణాటక సరిహద్దుల్లోని కాసరగోడులో జరిగింది. చిన్న పాప అనే పేరుతో రేష్మా (24) సోషల్ మీడియా కార్యకర్తగా ప్రజాదరణ పొందింది. ఉళియత్తడ్కలో బాడుగ ఇంటిలో నివాసం ఉంటోంది. అదే ఇంటిలో మంగళవారం మధ్యాహ్నం ఆమె ఉరి వేసుకొన్న స్థితిలో ఉండగా, స్థానికులు చూసి కిందికి దించి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించింది. ప్రజుల్లా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేష్మాకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవలే విడాకులు అయితే తీవ్రమైన గొడవలు కావడంతో నెల కిందటే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె ఒక్కరే జీవిస్తోంది. కొడుకును కాసరగోడులో తల్లిదండ్రుల వద్ద ఉంచింది. రేష్మా ఇంటికి ఆమె ప్రేమికుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని తెలిసింది. రేష్మా ముబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. రేష్మా తల్లిదండ్రులు గంగాధరన్, శైలజ కాగా, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆమె తండ్రి జీపు డ్రైవరు. ఇన్స్టాలో రేష్మాకు 2 లక్షలకు పైగా ఫోలోయర్లు ఉన్నారు. డ్యాన్సులు, స్కిట్లు వంటి కార్యక్రమాలతో ఆదరణ పొందుతోంది. గ్రామీణ జీవితం, వంటకాల పోస్టులు చేసేది. చిన్నపాప మరణంతో సోషల్ మీడియాలో ఆవేదన, సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. కుటుంబ గొడవలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానాలున్నాయి. కారు దగ్ధం, ఐదుమంది క్షేమం యశవంతపుర: ఉడుపి జిల్లా కాపు తాలూకా శిర్వలో సోమవారం అర్ధరాత్రి కారులో మంటలు వ్యాపించాయి. ఐదుమంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంగళూరు నుంచి శిర్వకు వెళుతున్న కారు ఇంజిన్లో నుంచి దట్టమైన పొగ వచ్చింది. డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపాడు. ప్రయాణికులు దిగుతుండగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించి కారును చుట్టుముట్టాయి. కొంతసేపటికే కారు కాలిపోయింది. స్థానికులు నీళ్లు చల్లినా ఉపయోగం లేదు. పోలీసులు పరిశీలించారు. ముడా కేసులో తీవ్ర విచారణ మైసూరు: రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ఇళ్ల స్థలాల కుంభకోణం కేసులో సీఎం సిద్దరామయ్య కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతున్నదీ తెలిసిందే. ఇక సామాన్యలు పరిస్థితి కూడా మామూలుగా లేదు. అక్కడ స్థలాలను అమ్మిన, కొన్నవారు అవస్థల్లో ఉన్నారు. 50:50 నిష్పత్తి వ్యవహారంలో 134 కేసులు వచ్చాయి. సైట్లను పొందిన 40 మందికి పైగా లబ్ధిదారులకు లోకాయుక్త అధికారులు నోటీసులు జారీ చేశారు. 1055 సైట్లలో రూ.వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో లోకాయుక్త దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పుడు ముడా మాజీ కమిషనర్లు దినేష్, నటేష్తో సహా అధికారులు, స్థలాల యజమానులు విచారణకు వచ్చి సమాధానాలు ఇవ్వాలని లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ నోటీసులిచ్చారు. -
8 కేజీలకు పైగా బంగారమిచ్చినా కట్న వేధింపులే
రాయచూరు రూరల్: కేజీల కొద్దీ బంగారం, లక్షల రూపాయల డబ్బు తీసుకుని పెళ్లి చేసుకున్న తరువాత కూడా మరింత కట్నం తేవాలని వేధిస్తున్న ధనదాహపు భర్త, అత్తమామల ఉదంతమిది. నవ వివాహితను వేధిస్తున్న కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఈ విషయంపై సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరారెడ్డి వివరాలను వెల్లడించారు. కళ్లుచెదిరే కట్న కానుకలు.. జిల్లాలోని సింధనూరులోని రామ్ కిశోర్ కాలనీలో నివాసముంటున్న సూర్యబాబు కుమార్తెకు బళ్లారి జిల్లా కృష్ణా నగర క్యాంప్ నివాసి ఆలపాటి కృష్ణ చైతన్యతో గత ఏడాది జూన్ 7న వివాహమైంది. కృష్ణచైతన్య బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నాడు. పెళ్లి సమయంలో కృష్ణ చైతన్యకు అక్షరాలా 8.5 కేజీల బంగారం, 4.5 కేజీల వెండి, రూ.6 లక్షల నగదు, రూ.8 లక్షలు దుస్తులకు, రూ.15 లక్షలు విలువ చేసే కారు, వంట సామగ్రి కోసం రూ.3 లక్షలు, కుటుంబ సభ్యుల ఖర్చులకు రూ.15 లక్షలు ఇచ్చి అత్యంత ఆర్భాటంగా పెళ్లివేడుకను జరిపించారు. నవంబరు నుంచి నరకం అయితే నవంబర్ నెలలో మరింత కట్నం తేవాలని భర్త, అత్తమామలు, అతని అక్క, బావ, మరిది తదితరులు నవ వధువును చిత్రహింసలు పెట్టసాగారు. ఇది తట్టుకోలేక ఆమె పుట్టింటికి వచ్చేసి ఉంటోంది. పుట్టింటి నుంచి ఆస్తిలో సగ భాగం తెచ్చేవరకు ఇంటికి రావద్దంటూ భర్త హుకుం జారీ చేశాడని సీఐ తెలిపారు. వారి సతాయింపులను తట్టుకోలేక సూర్యబాబు, కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై గృహ హింస కేసు నమోదు చేశామన్నారు. భర్త కృష్ణచైతన్య, అత్త అనంతలక్ష్మి, మామ ఆలపాటి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు గీతాశ్రీ, వెంకటకృష్ణ, శ్రీకాంత్, కృష్ణవంశీలను అరెస్ట్ చేశామని తెలిపారు. భర్త, అత్తమామలపై నవ వివాహిత ఫిర్యాదు నిందితులకు కటకటాలు సింధనూరులో సంచలనం -
మాంసం విక్రయాల నిషేధానికి వినతి
హొసపేటె: నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల పవిత్ర పండుగ అయిన మహాశివరాత్రి సందర్భంగా మాంసాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కరునాడ కలిగళ క్రియాశీల సమితి ఆధ్వర్యంలో సోమవారం వివిధ సంస్థల ప్రతినిధులు జిల్లాధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం నేత వెంకటేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి అన్ని మతాలకు పవిత్రమైన పండుగ అన్నారు. దక్షిణ కాశీ హంపీలోని విరుపాక్షేశ్వరునికి ప్రత్యేక పూజలతో సహా నగరంలోని అన్ని శివాలయాల్లో పూజలు జరుగుతాయన్నారు. హిందువులందరి మనోభావాలను గౌరవిస్తూ ఆరోజురోజున మాంసం విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. పతంజలి యోగా సమితి, కర్ణాటక రాజ్య మడివాళ క్షేమాభివృద్ధి సంఘం, గుండి రమేష్ కళా వేదిక, జనతా మహాసభ, వీరశైవ లింగాయత్ మహాసభ, వీరశైవ లింగాయత్ సమాజ్, కస్తూరి కర్ణాటక జనపర వేదిక, విజయనగర సాహిత్య పరిషత్, కర్ణాటక రక్షణ వేదిక, కర్ణాటక నాగరిక హిత రక్షణసేవా ట్రస్ట్, రాష్ట్ర కార్మిక అసంఘటిత సంఘం, గౌళిగర సంఘం, జయ కర్ణాటక జనపర వేదిక, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఉద్యోగులకు ఆరోగ్యం
హొసపేటె: పని భారం నుంచి ఉపశమనం కల్గించి ఒత్తిళ్లను తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఉద్యోగుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో క్రీడా, సాంస్కృతిక పోటీలు సహాయపడతాయని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఎంతో అవసరమన్నారు. రెండు రోజుల క్రీడా పోటీల్లో ఉద్యోగులు చురుగ్గా పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేయాలన్నారు. విజయనగర జిల్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, యువజన సర్వీసులు, క్రీడా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేసీ, జిల్లా వ్యాయామ విద్యాధికారి శ్రీకాంత్, జిల్లా కోశాధికారి కే.మల్లేశప్ప తదితరులు పాల్గొన్నారు. -
వెట్టి పద్ధతిని నిర్మూలిద్దాం
చెళ్లకెరె రూరల్: ఇప్పటికీ అక్కడక్కడా కొనసాగుతోన్న వెట్టి(జీత) పద్ధతిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని సివిల్ న్యాయమూర్తి బీఆర్ పునీత్ పేర్కొన్నారు. ఆయన స్థానిక సీనియర్ కళాశాలలో న్యాయ సేవా సమితి, న్యాయవాదుల సంఘం, ధార్మిక శాఖ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జీత పద్ధతి నిర్మూలన దినాచరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జీత పద్ధతి నిర్మూలనకు విద్యార్థులకు జాగృతి అవసరం. ఈ పద్ధతి సామాజికంగానే కాకుండా చట్టపరంగా అపరాధం అన్నారు. జీత పద్ధతి కొనసాగిస్తున్న వారిపై న్యాయపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ విషయంపై జాగృతి కల్పించి జీత పద్ధతికి విముక్తి పలకాలన్నారు. న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షురాలు శ్యామల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జీత పద్ధతి విభిన్న రూపాల్లో వెలుగులోకి వచ్చిందని, దాన్ని అరికట్టడానికి చట్టపరంగా జాగృతి కార్యక్రమాలు నిరంతరంగా జరపాలన్నారు. తహసీల్దార్ రెహన్బాషా, తాలూకా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జీఆర్ అశ్వత్ నాయక్, తాలూకా విద్యాశాఖ అధికారి కేఎస్ సురేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
యూజీసీ నిబంధనలు అమలు చేయాలి
బళ్లారిఅర్బన్: విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థుల హక్కుల రక్షణకు యూజీసీ నిబంధనలను వెంటనే అమలు చేయాలని కర్ణాటక రాష్ట్ర దళిత సమితి డిమాండ్ చేసింది. విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఆధారిత వేధింపులు కొనసాగుతున్నాయని, దీని వల్ల అనేక మంది దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారని సమితి పేర్కొంది. రోహిత్ వేముల, పాయల్, దర్శన్ సోలంకి వంటి ఘటనలు సంస్థాగత వివక్షకు ఉదాహరణలని పేర్కొంది. యూజీసీ రూపొందించిన 2025–28 నిబంధనలపై సుప్రీంకోర్టు విధించిన స్టేను తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని సమితి కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోహిత్ వేముల చట్టంను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టి, జిల్లాధికారి ద్వారా ప్రధాని, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. -
ఎన్నో ప్రఖ్యాత క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఓ ఘోరం తరువాత అపఖ్యాతి పాలైంది. అక్కడ మ్యాచ్లను చూడాలనే క్రికెట్ అభిమానులు, నగర వాసుల ఆకాంక్ష ఎప్పుడు తీరేనా? అని ఎదురు చూస్తున్నారు. బుధవారం ఏదో ఒకటి నిర్ధారణ కానుంది.
సాక్షి బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో ఐపీఎల్ క్రికెట్ పోటీల నిర్వహణపై అనుమతి గురించి బుధవారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో ఆర్సీబీ విజయోత్సవాలలో చిన్నస్వామి క్రికెట్ మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడడంతో అప్పటినుంచి ఐపీఎల్ సహా అన్నిరకాల మ్యాచ్లను నిర్వహించడం లేదు. ఆ ఘోర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మైకేల్ కున్హా నేతృత్వంలో ఒక కమిటీతో విచారణ జరిపించింది. ఆ కమిటీ తనిఖీలు చేసి క్రికెట్ పోటీలు నిర్వహించాలంటే ఏమేమి భద్రతా చర్యలు తీసుకోవాలో పలు సిఫారసులు చేసింది. ఇందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) కూడా ఆమోదించింది. రేపు సీఎంతో భేటీలో తీర్మానం: హోంమంత్రి ఈ నేపథ్యంలో బుధవారం జరిగే ముఖ్య సమావేశంలో ఐపీఎల్ పోటీల నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తామని రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. బెంగళూరు సదాశివనగరలో మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం అధ్యక్షుడు వెంకటేశ్ప్రసాద్, అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ, ఆర్సీబీ ప్రతినిధి రాజేశ్ మీనన్ తనను కలసి మ్యాచ్ల నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు. బెంగళూరులో ఐపీఎల్ నిర్వహణకు అనుమతివ్వాలని కోరినట్లు, ఇదే సమయంలో ఈ ఏడాది ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నామో వివరించారన్నారు. తాను సీఎం సిద్ధరామయ్యతో ఈ విషయంపై చర్చించాల్సి ఉందని, అందుకే బుధవారం ఐపీఎల్ నిర్వహణపై తుది దఫా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజల భద్రత ప్రభుత్వం బాధ్యత అని, తొక్కిసలాటలు వంటివి పునరావృతం కాకూడదని, జీబీఏ కమిషనర్, నగర పోలీసు కమిషనర్, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలిపారు. గతంలో చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చిన్నస్వామిలో మళ్లీ మ్యాచ్ల కోసం నగరవాసుల నిరీక్షణ ఉంటాయా... ఉండవా? బుధవారం సీఎం, హోంమంత్రి భేటీలో నిర్ణయం హోంమంత్రితో కేఎస్సీఏ చీఫ్ వెంకటేశ్ ప్రసాద్ భేటీ పోటీల నిర్వహణకు వినతితీయని వార్త రావచ్చు: వెంకటేశ్ అభిమానులకు త్వరలోనే తీయని వార్త వస్తుందని ఆశిస్తున్నట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు. హోంమంత్రిని కలసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. వీలయినంత త్వరగా పోటీల నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం సూచించిన సిఫార్సులన్నింటినీ తమ అసోసియేషన్ పూర్తిగా పాటిస్తుందని చెప్పారు. -
సిద్ధారూఢ సన్నిధిలో సోనూ నిగం
హుబ్లీ: పహల్గాం దాడి జరిగింది కన్నడ వల్లే అని అర్థం వచ్చే రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ప్రముఖ గాయకుడు సోనునిగంపై కన్నడ సినీ రంగం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సోనూ నిగం హుబ్లీలోని ప్రముఖ సిద్ధారూఢ మఠం సన్నిధికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధారూఢ, గురునాథరూఢ స్వాముల సన్నిధిలను దర్శనం చేసుకున్న సోనూ నిగం అక్కడ కూర్చొని 10 నిమిషాల పాటు ధ్యానం కూడా చేశారు. అనంతరం మఠం ట్రస్ట్ ప్రముఖులు సిద్ధారూఢ విగ్రహాన్ని ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు. సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనూ నిగం ఆదివారం హుబ్లీకి రాగా సోమవారం ఉదయమే సిద్ధారూఢ మఠాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో అపవిత్రత.. దోషులను శిక్షించండిసాక్షి,బళ్లారి: ఇటీవల నగరంలోని నాగలకెరె ప్రాంతంలోని పురాతనమైన ఆంజనేయస్వామి దేవస్థానంలో కొందరు దుండగులు మాంసం ముక్కలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఆలయ ప్రాంగంలోకి విసిరిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. సోమవారం వీహెచ్వీ, భజరంగదళ్ ఆధ్వర్యంలో నిరసన, ర్యాలీ చేపట్టారు. అనంతరం సంఘాల నేతలు మాట్లాడుతూ పురాతన చరిత్ర కలిగిన దేవస్థానంలో ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు చేస్తూ హిందువుల ధార్మిక భావనలను దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. వీహెచ్వీ జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, ప్రముఖులు గోవర్ధన్, వినోద్, శంకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సేవకు పదవి ముఖ్యం కాదు రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయడానికి పదవులు ముఖ్యం కాదని రాష్ట్ర పాఠశాలల విద్యా శాఖ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు. దేవదుర్గ భవనంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ఆశయ సాధనకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. తనను ఎన్నుకున్న వారికి రుణపడి ఉంటామన్నారు. ఉద్యోగులకు కట్టబెట్టిన పదవికి న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో విద్యారత్న, సేవా భూషణ్ అవార్డులను అందించారు. కార్యక్రమంలో నాగేష్ గౌడ, ప్రేమలత రెడ్డి, చంద్రశేఖర్ పాటిల్, సురేష్, బోరేగౌడ, చరణ్రాజ్, విశ్వనాథ, బసవరాజ్లున్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలని మడ్డిపేటె ప్రాథమికోన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయిని రూపా పేర్కొన్నారు. నగరంలో గురువందన కార్యక్రమంలో అవార్డును అందుకొని ఆమె మాట్లాడారు. వి ద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర విషయాలను మననం చేసుకోవాలని కోరారు. జ్ఞాన సముపార్జనకు విద్య, సాహిత్యం చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. -
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో అక్రమ కట్టడాలు పెరిగి పోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా అక్రమ మసీదులకు అంతే లేదు. అధికారులు అనుమతి ఇవ్వకున్నా రాత్రికి రాత్రే చాందసులు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మసీదుల నిర్మాణం చేపడుతున్నారు. బాగల్కోటె నవనగర్లో ఆల్మట్టి డ్యాం నిర్వాసితుల పునరావాసం కోసం కేటాయించిన స్థలంలో అక్రమంగా మసీదు నిర్మాణం చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజు రోజుకు ఈ అక్రమణలు అధికమవుతున్న నేపథ్యంలో హిందువుల ఆలయాల నిర్మాణానికి కూడా తగిన న్యాయం చేయాలని నిరసన ప్రారంభించారు. ఆల్మట్టి డ్యాం కోసం సర్వం కోల్పోయిన వారి స్థలాలు అధిక ధరలకు విక్రయించి అక్కడ టిన్షెడ్లు వేసి మసీదులు కడుతున్నారు. ఈ విషయంలో బాగలకోటె నగరసభ అధికారులు విచారణ చేపట్టారు. హిందూ ఆలయాల నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరుతూ నగరసభ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. -
రన్వే మీద ప్రచార బెలూన్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో రన్వే పైకి ఓ ప్రైవేటు సంస్థ ప్రచార బెలూన్ ఎగురుకుంటూ రావడంతో కాసేపు కలకలం రేగింది. ఆ భారీ సైజు బెలూన్ రన్వే పైన పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో విమానాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. సెక్యూరిటీ సిబ్బంది బెలూన్ను తొలగించారు. ఓ రియాల్టీ సంస్థ బెలూన్గా తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరికి రూ.15 లక్షల సైబర్ మోసం మైసూరు: ప్యాలెస్ సిటీలో సైబర్ మోసగాళ్లు అమాయకులకు ఇట్టే బురిడి వేస్తున్నారు. వివరాలు.. యరగనహళ్లి నివాసికి వాట్సాప్ ద్వారా స్టాక్ మార్కెట్ గురించి ఓ మెసేజ్ వచ్చింది. దీంతో అతడు ఆ నంబరుకు కాల్చేసి మాట్లాడాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలంటూ అతన్ని మోసగాడు నమ్మించాడు. అలా రూ.3.50 లక్షలు బదిలీ చేసి మోసపోయాడు. సరస్వతిపురంలో ఓ రిటైర్డ్ అధికారిని ముంబై పోలీసులమని కాల్ చేసి బెదిరించారు. నీకు పలు నేరాలతో సంబంధం ఉందని భయపెట్టారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలు తీసుకుని రూ. 12 లక్షలను బదిలీ చేసుకున్నారు. రెండు కార్లు ఢీ, ఇద్దరు మృతి తుమకూరు: తాలూకాలోని బనవర గేట్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. మృతులను తుమకూరు నగరవాసులు సురేష్ (55), మురళి (60)గా గుర్తించారు. ఎదురెదురుగా వస్తున్న కారు, క్వాలిస్ వాహనం ఢీకొన్నాయి. కారులో పై ఇద్దరూ తీవ్ర గాయాలతో చనిపోయారు. క్వాలిస్లోని సైబర్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణప్ప, జేడీఎస్ నేత జయన్న, మంజునాథ్ తదితరులు గాయపడ్డారు. చైన్ స్నాచర్ల దాడి.. మహిళ దుర్మరణం దొడ్డబళ్లాపురం: కళ్లల్లో స్ప్రే కొట్టిన చైన్ స్నాచర్లు మహిళ మెడలోని బంగారు గొలుసు లాగడంతో కిందపడి గాయపడిన ఆమె ప్రాణాలు కోల్పోయింది. చైన్స్నాచర్ల దుష్కృత్యానికి ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. వివరాలు.. నెలమంగల తాలూకా హుస్కూరు గ్రామంలో జరిగింది. గ్రామ నివాసి జ్యోతి (45) సోమవారం ఉదయం ఇంటిముందు చెత్త ఊడుస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె కళ్లల్లో ఏదో స్ప్రే కొట్టారు. తరువాత మెడలోని గొలుసు తెంచుకుని పరారయ్యారు. గొలుసు లాగడంతో ఆమె కిందపడినప్పుడు తలకు గాయం తగిలి స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా కొంతసేపటికే చనిపోయింది. మాదనాయకనహళ్లి పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. భార్య తెలివికి.. భర్త జైలుకు ● అతనితో హత్య చేయించిన వైనం ● ఆపై ప్రియునితో జీవనం బొమ్మనహళ్లి: అక్రమ సంబంధాల మోజులో పడిన భార్య.. భర్తను వదిలించుకోవాలని షాకింగ్ పథకం వేసింది. అతన్ని హంతకున్ని చేయాలని కుట్ర చేసింది. ఈ సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో జరిగింది. భార్య కుట్ర ఫలితంగా భర్త జైలు పాలయ్యాడు. వివరాలు.. ఆనేకల్ తాలూకాలో ఆంథోనీ, రోజి భార్యాభర్తలు. రోజికి రాజేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఇది తెలిసి భర్త ఆమెను మందలించేవాడు. తమ సంతోషానికి భర్త అడ్డంకిగా ఉన్నాడు, తరచూ తాగి వచ్చి వేధిస్తున్నాడనే నెపంతో భార్య తన భర్తను పునరావాస కేంద్రంలో చేర్పించింది. 18 నెలల తర్వాత, భర్త ఆంథోనీ తిరిగి వచ్చాడు. భర్త లేని సమయంలో ఆమె ప్రియునితో సహజీవనం సాగించింది. భర్త రాగానే పథకాన్ని అమలు చేసింది. తమ బావ బాలరాజు మీద లేనిపోని మాటలు చెప్పి చంపేయాలని ప్రేరేపించింది. భార్య మాట విని ఆంథోనీ, తన అన్నయ్య బాలరాజ్ను కత్తితోపొడిచి హత్య చేశాడు. దీంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో ఆంథోనీపై కేసు నమోదైంది. అరెస్టు చేసి చెరసాలకు తరలించారు. రోజి మళ్లీ ప్రియునికి దగ్గరైంది. అయితే రోజినే అసలు నిందితురాలని తెలిసి కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
ట్రావెల్స్ యజమాని.. దొంగావతారం
బనశంకరి: రాత్రి వేళల్లో ఇళ్లలోకి దూరి చోరీల చేసే ఘరానా దొంగలను బెంగళూరు బైయప్పనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని నుంచి రూ.1.84 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దావణగెరె జిల్లా హరిహర తాలూకా నివాసి రాజు (43) పట్టుబడిన దొంగ. దావణగెరెలో ట్రావెల్స్ నిర్వహించే రాజు కరోనా సమయంలో తీవ్ర నష్టాలు రావడంతో దొంగగా మారాడు. మాస్కు ధరించి ఇంట్లోకి చొరబడి నగదు, నగలు కొట్టేసేవాడు. ఇప్పటివరకు 10 చోరీ కేసులు ఇతనిపై ఉన్నాయి. గత నెల 18వ తేదీన ఓ కుటుంబం ఊరికి వెళ్లగా రాజు తలుపు బద్దలుకొట్టి బీరువాలో ఉన్న 783 గ్రాముల బంగారం, రూ.8 లక్షల నగదు దోచుకుని ఉడాయించాడు. ఈ కేసులో బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి అబ్బిగెరెలో పట్టుకున్నారు. నగలను కమ్మగొండనహళ్లి, అబ్బిగెరె, హెచ్ఎంటీ లేఔట్లో జువెలరీ దుకాణాల్లో అమ్మినట్లు చెప్పాడు. జాలహళ్లి, గోవాలోనూ విక్రయించానని తెలిపాడు. దీంతో పోలీసులు ఆయా వ్యక్తుల నుంచి 1.2 కేజీల బంగారం నగలు, వెండి సొత్తు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. 24 మంది విక్రేతల అరెస్టు, రూ.2 కోట్ల డ్రగ్స్ జప్తు యశవంతపుర: సిలికాన్ సిటీలో పోలీసులు దాడులు చేసి 24 మంది డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేసి 2.08 కోట్ల విలువగల హైడ్రో గంజాయి, చరస్, ఎండిఎంఎ అనే మత్తు పదార్థాలను జప్తు చేశారు. ఐదుమంది అంతరాష్ట్ర నిందితులు కాగా, మిగిలిన 19 మంది బెంగళూరువాసులు. 1.23 కేజీల హైడ్రో గంజాయి, 36 కేజీల మామూలు గంజాయి, 11.6 కేజీల చరస్, 121 గ్రాముల ఎండిఎంఎ దొరికిందని పోలీసు కమిషనర్ సీమంతకుమార్ సింగ్ తెలిపారు. కుమారస్వామిలేఔట్, హెబ్బాళ, జేసీ నగర, బసవనగుడి, గోవిందరాజనగర, చామరాజపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఈ దాడులు జరిపారు. డ్రగ్స్ వ్యాపారులపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఇళ్లలో చోరీలపర్వం 1.2 కేజీల నగలు స్వాధీనం -
ఎంపీ చేతిలో ఖాళీ ట్రంకు పెట్టె.. లాక్కున్న పోలీసులు
సాక్షి, బెంగళూరు: మెట్రో చార్జీల వివాదంలో.. బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, జయనగర ఎమ్మెల్యే రామమూర్తి నగరంలోని ఆర్వీ రోడ్డు మెట్రో స్టేషన్లో ఖాళీ ట్రంక్ పెట్టెను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఖాళీ ప్రభుత్వం అని ఆ ట్రంక్ పెట్టైపె రాశారు. దానిపై సీఎం, డీసీఎంల చిత్రాలను అంటించారు. ముందే సమాచారం అందుకున్న పోలీసులు ఆర్వీ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఖాళీ ట్రంక్ పెట్టె పట్టుకుని తేజస్వీ సూర్య వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రతీక ఈ పెట్టె అంటూ, ప్రభుత్వం దివాళా తీసిందని ఆరోపణలు చేశారు. తాను ఎలాంటి ఆందోళన చేయడం లేదని, ఖాళీ ట్రంక్ పెట్టెను మాత్రం పట్టుకున్నానని, అడ్డుకోవద్దని ఆయన చెబుతున్నా, పోలీసులు అడ్డుకున్నారు. ట్రంకును పోలీసులు లాక్కుని, దానిపై బొమ్మలను తీసేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు ప్రతిరూపంగా ఖాళీ ట్రంక్ పెట్టె పట్టుకుని తాను ఢిల్లీకి వెళతానని చెప్పారు. తమ దగ్గర డబ్బులు లేవని, ప్రయాణికుల నుంచి వసూలు చేసుకోవాలని మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఆరోపించారు. మరోవైపు విధానసౌధ వద్ద కన్నడ నాయకుడు వాటాళ్ నాగరాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మెట్రో చార్జీలను పెంచరాదని నినాదాలు చేశారు. బెంగళూరులో మెట్రో స్టేషన్ వద్ద రభస రాష్ట్ర సర్కారు ఖజానా ఇదేనన్న ఎంపీ -
ముల్లంగి రైతు పొలానికి దారి
● సర్వే చేసి పరిష్కరించిన అధికారులు ● ఇటీవల ఆఫీసులో నిరసన తుమకూరు: పొలానికి దారి చూపాలని అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోకుండా, లంచం ఇవ్వాలని సతాయించడంతో రైతు ముల్లంగి పంటే లంచంగా ఇస్తానని తహసీల్దారు ఆఫీసులో ధర్నా చేయడం తెలిసిందే. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. మధుగిరి తాలూకా దొడ్డేరి వద్ద జక్కెనల్లికి చెందిన రైతు ప్రసన్న కుమార్ దుస్థితి తీరింది. ఫిబ్రవరి 4న సాక్షి వార్తాపత్రికలోనూ ప్రముఖంగా అతని ఆవేదన ముద్రితమైంది. ఈ నేపథ్యంలో మేలుకున్న రెవెన్యూ అధికారులు జయప్రకాష్, గ్రామ అకౌంటెంట్, శరణు, సర్వే అధికారులు ఒక్క రోజులోనే రైతు పొలాన్ని పరిశీలించారు. సర్వే నిర్వహించి దారిని ఏర్పాటు చేశారు. దీంతో రైతు అధికారులకు, విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు. తన నిరసనకు న్యాయం జరిగిందని అన్నాడు. వారంరోజుల్లో దారి చూపకుంటే తహసీల్దారు ఆఫీసులోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలిపాడు. జేసీబీతో పొలానికి దారి వేస్తున్న అధికారులు -
24న దుర్గమ్మ సిడిబండి రథోత్సవం
సాక్షి,బళ్లారి: నగర ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కనక దుర్గమ్మ సిడిబండి రథోత్సవాన్ని మైసూరు దసరా తరహాలో గత ఏడాది కంటే ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించే దిశగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి సూచించారు. ఈ నెల 24న జరగనున్న కనక దుర్గమ్మ సిడిబండి రథోత్సవాన్ని పురస్కరించుకుని, సంబంధిత ఏర్పాట్లు చేయడానికి నిర్వహించిన ముందస్తు సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన సోమవారం కనక దుర్గమ్మ ఆలయ యాత్రి నివాస్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సిడిబండిలో పాల్గొనే కార్యకర్తలకు పాస్లు మంజూరు చేయాలన్నారు. సిడిబండిని సంప్రదాయబద్ధంగా ఆలయం వద్దకు తీసుకొచ్చే ప్రక్రియ, ఆలయం వద్ద సిడిబండిని లాగడం తదితర దైవిక కార్యక్రమాలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు సదుపాయాలు కల్పిస్తాం మేయర్ గాదెప్ప మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ, అధికారులు, పోలీసులు చూసేలా ప్రయత్నిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య కలగకుండా, జనం రాకపోకలను మళ్లించాలన్నారు. ఆలయం వద్ద అన్నదానం, పానీయాలు సరఫరా చేసేవారికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో మంచినీటి వ్యవస్థ, ప్రసాదాలు పంపిణీలు చేయడంలో కూడా ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తుల తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ ఉంటుందన్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు, కార్యకర్తలను నియమించి ఆ దిశగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి, సిడిబండిని విజయవంతంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. సిటీ కమిషనర్ మంజునాథ్, డీఎస్పీ నందారెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మైసూరు దసరా తరహాలో ఆచరిద్దాం ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి దిశానిర్దేశం -
చురుగ్గా రోడ్డు మరమ్మతు పనులు
హొసపేటె: ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు జరగనున్న హంపీ ఉత్సవానికి ముందు జిల్లా యంత్రాంగం రోడ్డు మరమ్మతులను ప్రారంభించింది. చాలా రోజులుగా దెబ్బతిన్న శివశక్తి నగర్ అంతర్గత రోడ్ల మరమ్మతు పనులను జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు ప్రారంభించింది. అంతర్గత రోడ్ల మరమ్మతుల నేపథ్యంలో హంపీ నుంచి హొసపేటె నగరానికి వచ్చే వాహనాల రాకపోకలను కొండనాయకనహళ్లి గ్రామంలోని సాయిబాబా ఆలయం మీదుగా హెచ్ఎల్సీ కెనాల్ రోడ్డుపైకి మళ్లించారు. హంపీ రోడ్డులోని అనంతశయనగుడి సమీపంలో జరుగుతున్న రైల్వే ఓవర్ పాస్ పనుల కారణంగా హొసపేటె నుంచి హంపీకి వెళ్లే వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలోని రోడ్లు అధ్వానంగా మారాయి. ఈ ప్రాంత నివాసితులు ప్రతి రోజు వ్యాపించే దుమ్ము ధూళితో విసుగు చెంది మున్సిపల్ కౌన్సిల్, జిల్లా యంత్రాంగం రోడ్డును మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక సార్లు నిరసన తెలిపారు. చివరకు హంపీ ఉత్సవ్ పేరుతో రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. ఈ ప్రాంత నివాసితులు ఉపశమనంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. -
లఘు విమాన పతనంపై అనుమానాలెన్నో?
హుబ్లీ: పరిశీలన, ధ్రువీకరణ తర్వాత శిక్షణ విమానంలో ఇంధనం ఖాళీ ఎలా అయిందన్న ప్రశ్న తలెత్తింది. విజయపుర జిల్లా బబలేశ్వర తాలూకా మంగళూరు గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం పైలెట్ శిక్షణ కోసం తీసుకెళ్లిన లఘు విమానం పతనం అయింది. ఆ జిల్లా ఎస్పీ లక్ష్మన్ నింబరిగితో కూడిన పోలీస్ బృందం ఘటన స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే ఆ సంస్థ ముఖ్యస్థులు ఘటన స్థలానికి విచ్చేసి పతనం గురించి వివరాలను సేకరించారు. పైలెట్ కునాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంధనం ఖాళీ అయినందు వల్లే విమానం పతనం అయిందన్నారు. ఏ విమానం అయినా ఎగరడానికి ముందు ఇంధన స్థితి పరిమాణాన్ని పరిశీలిస్తారు. విమానం ఎగిరే స్థలం నుంచి ల్యాడింగ్ అయ్యే స్థలం ఎంత దూరంలో ఉంది. ఆ స్థలానికి చేరుకోవడానికి ఇంధనం ఎంత ప్రమాణంలో కావాలన్న దాన్ని పరిశీలించి విమానం టేకాఫ్కు అనుమతి ఇస్తారు. అయితే ఈ విమానం కలబుర్గి నుంచి బెళగావికి వెళ్లే దారిలో కూలిపోయింది. ఈ నేపథ్యంలో విమానం టేకాఫ్ కావడానికి ముందే పరిశీలించలేదా? అన్న ప్రశ్న తలెత్తింది. ఒక వేళ పరిశీలించిన తర్వాత నిర్ధిష్ట ప్రమాణంలో ఇంధనం ఉంటే విమానం కూలిపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. విమానం రైతుల పొలంలో పెను ప్రమాదం తప్పింది. ఒక వేళ జనవసతి ప్రాంతంపై కూలి పోయి ఉంటే మరణాలు సంభవించే అవకాశం ఉండేది. దీంతో ఇంధనం తక్కువైందన్న అనుమానాలు కనిపిస్తుండగా ఈ విషయంలో దర్యాప్తు తర్వాతే అసలు విషయం వెల్లడి కానుంది. -
వంతెనకు బైక్ ఢీ.. ముగ్గురు మృతి
రాయచూరు రూరల్: వంతెనకు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన బీదర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతులను హుమ్నాబాద్ తాలూకా హళ్లిఖేడాకు చెందిన వెంకట్(40), అతని భార్య శిల్ప(35), కుమార్తె రక్షిత(12)గా పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకొచ్చిన ద్విచక్రవాహనం వంతెనకు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని బిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ సారా తాగి ఇద్దరు దుర్మరణం రాయచూరు రూరల్: కల్తీ సారా తాగి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన కొప్పళ తాలూకా కూకనపల్లిలో ఆదివారం సాయంత్రం వెలుగు చూసింది. ఈనెల 4న నలుగురు మిత్రులతో కలసి సారా తాగడానికి వెళ్లగా మద్యం(స్పిరిట్) వికటించి అమరయ్య హిరేమఠ(35), రమేష్(25) మరణించారు. హెచ్.శరణప్ప(33), గురికార్ శరణప్ప(40) హుబ్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురు కలసి ట్యాంకర్ నుంచి స్పిరిట్ కలసిన మద్యం తాగారని పోలీసులు తెలిపారు. స్పిరిట్ కలసిన మద్యం అందించిన మారుతి, శరణప్పలపై చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్లు ఢీకొని ఇద్దరు మహిళల మృతి రాయచూరు రూరల్: బెళగావి జిల్లాలో చెరకు ట్రాక్టర్లు ఢీకొన్న ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆదివారం రాయబాగ తాలూకా హారోగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాను మీరా(29) అనే మహిళ ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది. భర్త అల్లావుద్దీన్, కుమారుడు శోయబ్లకు గాయాలయ్యాయి. మరో ఘటనలో ఘటప్రభ పోలీస్ స్టేషన్ పరిధిలో లొళసూరు బస్టాండ్ వద్ద చెరకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొని వడ్డరహట్టి అనిత(26) మరణించింది. అనిత భర్త ఎలక్ట్రిక్ వాహనంలో ఓవర్టేక్ చేయబోగా వెనుక నుంచి తగలడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై హోరోగేరి, ఘటప్రభ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు కార్లు ముఖాముఖీ ఢీ● మంటల్లో కాలిబూడిదైన కార్లు సాక్షి,బళ్లారి: రెండు కార్లు ముఖాముఖీ ఢీకొనడంతో పూర్తిగా కాలిపోయాయి. సోమవారం బీదర్ జిల్లా బసవ కళ్యాణ తాలూకా నారాయణపుర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కార్లు అదుపు తప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు త్రుటిలో తప్పించుకోగా, కొన్ని నిమిషాల్లో రెండు కార్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపు కార్లు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బసవ కళ్యాణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బొలెరో వాహనానికి మంటలు కాగా సోమవారం బళ్లారి నగరంలో మోతీ సర్కిల్ వద్ద బొలెరో వాహనంలో మంటలు వ్యాపించాయి. ఉన్నఫళంగా మంటలు రావడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. రోడ్డు పక్కనే నిలిపిన వాహనంలో మంటలు రావడంతో ఎందుకు వ్యాపించాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నాలెడ్జ్ కారిడార్ ఏర్పాటుపై 13న అభిప్రాయ సేకరణ హోసూరు: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న క్రిష్ణగిరి జిల్లాలో నాలెజ్డ్ కారిడార్ ఏర్పాటుపై ఈనెల 13న జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని దేవరాజ్ మహాల్లో అభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో గత ఐదేళ్ల పాలనలో క్రిష్ణగిరి జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఏదో ఒక పథకం ప్రతి కుటుంబానికి చేరుతోందన్నారు. జిల్లా వాసులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని అధికారులు కోరారు. -
మెట్రో చార్జీల పెంపును అడ్డుకున్నా
బనశంకరి: కర్ణాటక ప్రభుత్వమే మెట్రో చార్జీల పెంపును అడ్డుకునే నిర్ణయం తీసుకుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ జోక్యం లేదని డీసీఎం డీకే.శివకుమార్ అన్నారు. సోమవారం విధానసౌధలో ఆయన మాట్లాడుతూ మెట్రో సంస్థలో ఇంధన వ్యయం, నిర్వహణ, పాలనా వ్యయం తెలపాలని అధికారులను కోరానని, అంతవరకు టికెట్ రేట్ల పెంపును నిలిపివేయాలని సూచించానని తెలిపారు. మెట్రో టికెట్ రేట్లపై రాజకీయం అధికమైందన్నారు. సోమవారం జరగాల్సిన బీఎంఆర్సీఎల్ (మెట్రో) బోర్డు సమావేశం వాయిదాపడిందన్నారు. మెట్రో 50:50 నిధులతో కొనసాగే పథకమని, నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చార్జీల నిర్ణయ కమిటీ ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. గతంలోని కమిటీ రద్దయిందని, కొత్త కమిటీ ఏర్పాయ్యేవరకు చార్జీల్లో జోక్యం చేసుకోరాదని తనకు తెలిసిందని అన్నారు. బోర్డు సమావేశం రద్దు యశవంతపుర: మెట్రో చార్జీల పెంపు గురించి చర్చించడానికి బీఎంఆర్సీఎల్ బోర్డు భేటీ సోమవారం ఉండగా, ఆకస్మాత్తుగా రద్దయింది. శాంతినగరలోని హెడ్డాఫీసులో జరగాల్సి ఉంది. రద్దు కావడంపై అనేక ఊహాగానాలు వ్యాపించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఇటు నిలబడడంతో మెట్రో పెద్దలకు ఏమీ పాలుపోవడం లేదని సమాచారం. మెట్రో చార్జీలతో సంబంధం లేదు: సీఎం సాక్షి, బళ్లారి: మెట్రో రైలు చార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేదని, ఇది కేంద్రం నియమించిన మెట్రో అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయమని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఆయన దావణగెరెలో మాట్లాడుతూ మెట్రో చార్జీల గురించి చర్చించేందుకు డీసీఎం శివకుమార్ ఢిల్లీకి వెళుతున్నారనేది ఆయన్నే అడగాలన్నారు. వాల్మీకి సముదాయానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. దావణగెరె జిల్లా మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున రాజీనామా చేశారనడంలో నిజం లేదన్నారు. డీకేశి, మీరు కుర్చీని కాపాడుకునేందుకు పైరవీలు చేస్తున్నారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా, సీఎం మండిపడ్డారు. మెట్రో రైలు చార్జీల రగడ కేంద్ర, రాష్ట్రాల మధ్య యుద్ధంగా మారింది. పెంపునకు కారణం వారని, తగ్గించింది మాత్రం తామేనని అందరూ ప్రచారం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మెట్రో వార్ మరింత తీవ్రతరమైనా ఆశ్చర్యం లేదు. డీసీఎం డీకే శివకుమార్ -
పంచ గ్యారంటీలతో పేదలకు లబ్ధి
రాయచూరు రూరల్: కర్ణాటక రాష్ట్రం ప్రవేశపెట్టిన పంచ గ్యారంటీలతో పేదలకు లబ్ధి చేకూరుతోందని రాష్ట్ర పంచ గ్యారంటీల పథకం సమితి అధ్యక్షుడు హెచ్.యం.రేవణ్ణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాయచూరు జిల్లా ఏడెదొరె నాడు హబ్బను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కార్ నుంచి లభించే పథకాలను ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పంచ గ్యారంటీ పథకాల్లో శక్తి పథకం, యువ నిధి, గృహ జ్యోతి, గృహలక్ష్మి, అన్నభాగ్య పథకాలను సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, లోక్సభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు బసన గౌడ, హంపన గౌడ, బసన గౌడ, వసంత్ కుమార్, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున, ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్, పామయ్య, పవన్, డీసీ నితీష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ తదితరులు పాల్గొన్నారు. -
నెరవేరిన నవళగుంద రైతుల కల
హుబ్లీ: నవళగుంద తాలూకా, ఇతర రైతులు వరద సమస్యలతో ఇబ్బందులు పడకుండా రూ.200 కోట్ల నిధులతో శాశ్వత వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఆదివారం నవళగుంద బెన్నిహళ్ల వాగుపై వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. నవళగుంద ఎమ్మెల్యే కోనరెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రూ.200 కోట్ల నిధులతో శాశ్వత వంతెన నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇకపై రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకోవచ్చన్నారు. చాలా ఏళ్లుగా వరద ప్రవాహంతో అన్నదాతలు తాము పండించిన పంటలు చేతికి అందకుండా నీటి పాలయ్యేవి. ఇక బెన్నిహళ్ల వంతెన నిర్మాణ పనులకు శంఖుస్థాపన, నవళగుంద అసెంబ్లీ నియోజక వర్గంలో వివిధ అభివృద్ధి పనులను సీఎం సిద్దరామయ్య ప్రారంభించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంతోష్లాడ్, విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి, రెవెన్యూ మంత్రి కృష్ణబైరే గౌడ, మాజీ సీఎం, హావేరి ఎంపీ బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర మురికివాడల అభివృద్ధి మండలి అధ్యక్షుడు అబ్బయ్య ప్రసాద్, న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దారి తప్పిన హెలికాప్టర్ రాయచూరు రూరల్: ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. ఆదివారం లింగసూగురులో విధాన పరిషత్ సభ్యుడు శరణే గౌడ బయ్యాపూర్ కుమారుడి పెళ్లికి సీఎం సిద్దరామయ్య హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే అధికారులు సిద్ధం చేసిన మైదానం వదలి మరో చోటికి వెళ్లడంతో అయోమయెంలో పడ్డారు. పోలీసుల భద్రత వైఫల్యం వల్ల ఇలా జరిగిందని సమాచారం. అనంతరం మళ్లీ హెలికాప్టర్లో నిర్దేశించిన మైదానానికి చేరుకున్న సీఎం సిద్దరామయ్య.. వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్, మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, కొప్పళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అమరే గౌడ బయ్యపూర్ పాల్గొన్నారు. రూ.200 కోట్ల నిధులతో బెన్నిహళ్ల వాగుపై శాశ్వత వంతెన నిర్మాణం సీఎం సిద్దరామయ్య వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన -
రూ.110 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణం
హొసపేటె: బళ్లారి, కొప్పళ జిల్లాలోని గంగావతి–కంప్లిని కలుపుతూ తుంగభద్ర నదిపై నిర్మించునున్న కొత్త వంతెన ప్రాజెక్టు కోసం మట్టి పరీక్ష ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న వంతెన దాదాపు 60 సంవత్సరాల పురాతనమైనది. తుంగభద్ర జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు విడుదల చేసినప్పుడల్లా వంతెన మునిగి పోతుంది. ఫలితంగా గంగావతి–కంప్లి మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోతాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సుమారు రూ.110 కోట్ల అంచనా వ్యయంతో కొత్త వంతెన నిర్మాణం కోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు ప్రతిపాదన సమర్పించబడింది. వంతెన నిర్మాణం కోసం డీపీర్ (వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక) తయారీ ప్రక్రియలో భాగంగా నేల పరీక్ష, సర్వే పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో వంతెన మునిగిపోకుండా నిరంతర ట్రాఫిక్ను నిర్ధారించే పాత వంతెన కంటే దాదాపు 42 అడుగుల ఎత్తులో కొత్త వంతెన నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే జేఎన్.గణేష్ ఈ ప్రాజెక్టును ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావడంతో నియోజకవర్గ ప్రజల చిరకాల కల సాకారమైంది. -
కుర్చీ మార్పిడి లేనట్టే
రాయచూరు జిల్లాలో హట్టి స్వర్ణ గనుల్లో డీసీఎం శివాజీనగర: ముఖ్యమంత్రి పదవి కోసం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎంతగా ప్రయత్నాలు సాగిస్తుంటే, ఆయన సహచరులు అంతగా నిరుత్సాహపరుస్తున్నారు. ఆయనను నీరుగార్చేలా మాటల తూటాలను వదులుతున్నారు. సీఎం మార్పిడి గురించి పార్టీ హైకమాండ్ ఏ తీర్మానం తీసుకోకుండా మౌనంగా ఉందంటే, ఎలాంటి మార్పు లేదని అర్థమని హోం మంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. సీఎం స్థానం కోసం డీకే చెమటోడుస్తుండగా హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పరమేశ్వర్ ఆదివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లో ఇటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు దానిని హైకమాండ్ సమర్థవంతంగా పరిష్కరించిందని అన్నారు. ఎప్పుడు, ఎలా వ్యవహరించాలనేది వారికి బాగా తెలుసునని అన్నారు. సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర.. సీఎం కుర్చీ సంగతి ముగిసిపోయిన విషయమని చెప్పడం ఆయన వ్యక్తిగతమన్నారు. రెండున్నరేళ్ల తరువాత సీఎంను మార్చాలనే ఒప్పందం జరిగిందని డీకే శివకుమార్ చెబుతున్న విషయం తనకు తెలియదని పరమేశ్వర్ చెప్పడం గమనార్హం. దీని గురించి ఢిల్లీలో చర్చలు జరిగినప్పుడు తాము బయటే ఉన్నాము, సిద్దు, శివకుమార్లకు మాత్రమే కచ్చితంగా ఏమిటనేది తెలుసన్నారు. ఒప్పందం ఉందని హైకమాండ్ నాయకులు ఇప్పటి వరకు చెప్పలేదు. మాకు ఏమీ తెలియదు కాబట్టే హైకమాండ్ వైపు చూపిస్తామన్నారు. కాగా, మెట్రో రైలు చార్జీల పెంపు అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని చెప్పారు. మరోవైపు సీఎం సిద్దు, డీసీఎం శివ ఆదివారం ఉత్తర కర్ణాటక జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. హైకమాండ్ మౌనమే సాక్ష్యం హోంమంత్రి పరమేశ్వర్ ఘాటు వ్యాఖ్యలు దేవెగౌడ కుటుంబంపై సీఎం సిద్దరామయ్య కక్ష కేంద్రమంత్రి కుమారస్వామి మైసూరు: సీఎం సిద్ధరామయ్య తమ పార్టీని లక్ష్యం చేసుకున్నారని, ఎలాగైనా ముగించాలని చూస్తున్నారని జేడీఎస్ అగ్రనేత, కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. ఆదివారం ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. మా కుటుంబం మీద ఓ కేసు ద్వారా జేడీఎస్ అధినేత హెచ్.డి. దేవెగౌడను మానసికంగా కుంగదీసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేవెగౌడ సంరక్షణలో పెరిగిన సిద్ధరామయ్య ఇప్పుడు దేవెగౌడ కుటుంబాన్నే తుదముట్టించాలని చూస్తున్నారన్నారు. తాను కేంద్రమంత్రి కావడం వారికి అసూయ కలిగించిందన్నారు. ఎక్కువ బడ్జెట్లు సమర్పించానంటూ సిద్దరామయ్య గర్వంగా మాట్లాడుతున్నారన్నారు, కానీ పరిపాలన ఏమీ బాగాలేదన్నారు. మద్యం ముడుపులు అందుకున్న అబ్కారీ మంత్రి రాజీనామా చేయలేదన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే జి.టి.దేవెగౌడకు ఎక్కడా నిజాయతీ లేదని కుమార ఆరోపించారు. ఆయన ఇప్పుడు మనతో లేరని, ఇతర పార్టీలకు చెందిన గొప్ప నాయకులతో ఉన్నారని విమర్శించారు. జీటీ తనను చాలా చాలా బాధపెట్టారని పలు సంఘటనలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జేడీఎస్ నేతలు పాల్గొన్నారు. -
‘మీల్స్ ఆన్ వీల్స్’ ద్వారా ఉచిత భోజనం
రాయచూరు రూరల్: నగరంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా అభాగ్యుల వద్దకే భోజనం సరఫరా చేస్తున్నారు. రాయచూరు ప్రభుత్వ వైద్య కళాశాల బోధన ఆస్పత్రిలో రోగులు, వారి బంధువులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోజూ 500 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రారంభమైన మీల్స్ ఆన్ వీల్స్ 900 రోజలు పూర్తి చేసుకుందని సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మీల్స్ ఆన్ వీల్స్ సభ్యులు గోవింద రాజ్, నాగరాజ్, రాజేంద్ర కుమార, పురుషోత్తమ, తిప్పణ్ణ, వీరణ్ణ, రాము, హేమణ్ణ, బసవరాజ్, దినేష్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 11, 12 తేదీల్లో కంప్లి ఉత్సవాలు హొసపేటె: కంప్లి పట్టణంలోని మున్సిపల్ హాలులో ఉత్సవా లోగో విడుదల కార్యక్రమం జరిగింది. వివిధ వర్గాల ప్రజలు, కళాకారులు, నాయకులు సమావేశంలో పాల్గొని పండుగను ప్రజా పండుగా మార్చడంపై ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేఎన్.గణేష్ మాట్లాడుతూ.. ఈనెల 11, 12 తేదీల్లో (రెండు రోజులు) ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరాల కంటే భిన్నంగా, వైవిధ్యంగా కంప్లి ఉత్సవాలు నిర్వహించాలని తీర్మానించడం జరిగిందన్నారు. కంప్లి ఉత్సవ్–మన ఊరి పండుగను అన్ని వర్గాలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఈ పండుగకు శాశ్వత రూపం ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతాయన్నారు. కన్నడ భూమి, నీరు, సంస్కృతి, చరిత్రను తెలియజేసే ఉత్సవంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇస్తూ.. గ్రామీణ, జానపద కళలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మంజునాథ్, కన్నడ, సాంస్కృతిక శాఖ అధికారి నాగరాజ్, పురసభ అధికారి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. డి.కే.శివకుమార్ సీఎం కావడం ఖాయం రాయచూరు రూరల్: భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి డి.కే.శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని నోణవిన కెర కాడ సిద్ధేశ్వర స్వామి జోస్యం చెప్పారు. శనివారం రాత్రి నగరంలోని కిల్లే బ్రహన్మఠంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కల్మషం లేని రాజకీయ దురందరుడు అయిన డీకే శివకుమార్కు కొన్ని దుష్టశక్తులు అడ్డు పడుతున్నాయన్నారు. త్వరలో సమస్యలన్నీ తీరిపోయి డి.కే.శివకుమార్కు మంచి కాలం రానుందన్నారు. పోలీస్ కుటుంబానికి చెక్కు వితరణ హుబ్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఏఆర్ పోలీస్ యల్లప్ప మడివాళప్ప కుంబార కుటుంబానికి పోలీస్ శాలరీ ప్యాకేజ్ యోజన ద్వారా రూ.70 లక్షల చెక్కు అందజేశారు. జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య, హైర్ కామాండర్ రిటైర్డ్ చరణ్కుమార్ తినహా, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించాలి రాయచూరు రూరల్: రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉత్తమ వైద్య సేవలందించాలని జిల్లా ఆర్యోగ కుటుంబ అధికారి సురేంద్రబాబు సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం తాలుకాలోని మటమారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయుష్మాన్ భారత్, ముఖ్యమంత్రి ఆరోగ్య కార్డుల ద్వారా ప్రభుత్వాస్పత్రి, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
గజ దండయాత్రలు
బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలో గజరాజులు దండయాత్ర చేపట్టాయి. పలు ప్రాంతాలలో తిరుగుతూ దాడులకు తెగబడడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆనేకల్ తాలూకాలోని ఆనేకల్, తమిళనాడు సరిహద్దు గ్రామమైన బైలకెరెలో శనివారం సాయంత్రం అడవి ఏనుగు దాడి చేయడంతో పుట్టస్వామి అనే రైతు మరణించాడు. బైలకెరె నుంచి గుమ్మలాపురానికి నడుచుకుంటూ వెళ్తున్న పుట్టస్వామిని అడవి ఏనుగు తొక్కి చంపింది. ఆనేకల్ తాలూకాలోని సోలూర్లో ఒక గున్న, నాలుగు పెద్ద ఏనుగులు అరణ్యం వదిలి ఊళ్ల మీద పడ్డాయి. అటవీ సిబ్బంది పటాకులు కాల్చి తమిళనాడు వైపు తరిమికొట్టారు. కొన్ని వారాలుగా చుట్టుపక్కల గ్రామాలలో ఏనుగుల మందలు తిరుగుతున్నాయి. అటవీ అధికారులు శివరాజు, సిబ్బంది చిన్నస్వామి, నింగయ్య, బసవలింగప్ప తదితరులు కార్యాచరణలో పాల్గొన్నారు. వీడియోల కోసం పరుగులు ఏనుగులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని వ్యూస్, లైక్లు కొట్టేయాలని యువకులు నానాపాట్లు పడుతున్నారు. ఏనుగుల దగ్గరకు వెళ్తున్న యువకులను అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. గుంపులు గుంపులుగా ఏనుగుల వైపు వెళ్తూ ఉండడంతో అదుపు చేయడం కష్టమైంది. ప్రజల అరుపులకు భయపడి అడవి ఏనుగులు విపరీతంగా పరిగెత్తుతున్నాయి. ఈ సమయంలో ఓ గున్న గుంతలో పడిపోయింది. అయితే తల్లి ఏనుగు చాలాసేపు శ్రమించి దానికి బయటకు తీసుకొచ్చింది. బెంగళూరు పరిసరాల్లో కల్లోలం ఆనేకల్ వద్ద దాడిలో రైతు మృత్యువాత జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ ప్రచారం -
కనకపుర వద్ద భారీ గజ మంద
గజదాడిలో అన్నదాత మృతిదొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలో కనకపురలో అడవి ఏనుగులు భయాందోళన కలిగిస్తున్నాయి. తాలూకాలోని కాడుశివనహళ్లి గ్రామం చుట్టుపక్కల సంచరిస్తూ పంటలు తొక్కేస్తూ, చెట్లు విరిచేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. తమిళనాడు అడవుల నుంచి బన్నేరుఘట్ట అరణ్యంలోకి వచ్చిన ఏనుగులు శనివారం సాయంత్రం నుంచి కాడుశివనహళ్లి పరిసరాల్లో మకాం వేశాయి. ఆదివారం అటవీ సిబ్బంది ఏనుగులను కాస్త దూరంగా తరిమేశారు. పరిసరాల గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.మైసూరు: చామరాజనగర జిల్లాలో తమిళనాడును ఆనుకుని ఉండే కరల్వాడి గ్రామ శివార్లలో పొలంలో ఉన్న రైతుపై 9 అడవి ఏనుగులు దాడిచేసి చంపేశాయి. రైతు మహేష్ (26) పొలాన్ని కాపలా కాస్తున్నాడు. ఈ సమయంలో ఏనుగులు అతనిని చుట్టుముట్టి తొండంతో కొట్టి కాళ్లతో తొక్కాయి. గ్రామస్తులు ఎంత అరిచినా, ఏనుగుల గుంపు వదల్లేదు. ఏనుగులు వెళ్లిపోయాక చూస్తే రైతు చనిపోయి ఉన్నాడు. గత మూడు, నాలుగు నెలలుగా అడవి ఏనుగులు ఇక్కడ ఎక్కువగా తిరుగుతున్నట్లు జనం తెలిపారు. ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించి ధర్నా చేశారు. ఏనుగుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. సత్యమంగళ అభయారణ్యం అధికారులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
పొంచి ఉన్న పక్షి జ్వరం
శివాజీనగర: పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడులో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా టెన్షన్ మొదలైంది. పక్షి జ్వరం వ్యాపించి తమిళనాడులో 1,500లకు పైగా కాకులు చనిపోయినట్లు తెలిసింది. సరిహద్దు జిల్లాల్లో జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సూచించింది. ఏమిటీ లక్షణాలు? బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ పక్షుల్లో వచ్చే అంటువ్యాఽధి కాగా, ఆ పక్షులు వ్యర్థాల వల్ల ఇతర పక్షులకు, మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన 4 నుంచి 6 రోజుల తరువాత లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు, తల, ఒళ్లునొప్పులు, కళ్లు ఎర్రగా కావడం, న్యమోనియా వంటికి కనిపిస్తాయి. ఈ జబ్బు సోకిన పక్షులు హఠాత్తుగా చనిపోతాయి. ఎవరికి ప్రమాదం? బెంగళూరు కేసీ జనరల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సురేశ్ దీనిపై మాట్లాడుతూ కోళ్లఫారాలు, పశుపోషణ రంగాల్లో పని చేసేవారికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువని తెలిపారు. చికిత్స తీసుకోకపోతే చనిపోయే ప్రమాదం 50 శాతం ఉంటుందన్నారు. ఆ జబ్బు సోకిన కోడి మాంసం ద్వారా ఈ వైరస్ వచ్చే అవకాశముందన్నారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, రోగ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. తమిళనాడులో కాకుల హఠాన్మరణం అప్రమత్తంగా ఉండాలని సర్కారు ఆదేశాలు -
వైద్యనాథేశ్వర రథోత్సవం
భక్తజనం మధ్య తేరు ఉత్సవంమండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని వైద్యనాథపురలోని పురాణ ప్రసిద్ధ శ్రీ వైద్యనాథ స్వామి బ్రహ్మరథోత్సవాన్ని ఆదివారం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, వైద్యనాథస్వామి, ప్రసన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు జరిపి శుభ మీన లగ్నంలో తేరులో ప్రతిష్టించారు. తహశీల్దార్ పరశురామ్ సత్తిగేరి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో వందలాది భక్తులు శివనామ స్మరణతో తేరును లాగారు. -
మెట్రో హైడ్రామా
బనశంకరి/ శివాజీనగర: బెంగళూరు నమ్మ మెట్రో రైలు టికెట్ చార్జీల గందరగోళం ఆదివారం కూడా కొనసాగింది. బీఎంఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ చార్జీల పెంపును నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఉత్తర్వులు రాలేదని, కాబట్టి చార్జీల పెంపు సోమవారం నుంచి కొనసాగుతుందని చెప్పారు. ఒకవేళ అత్యవసర ఆదేశాలు వస్తే పాటిస్తామన్నారు. ధరల పెంపు వల్ల ధర్నాలు జరగవచ్చనే ఆలోచనలతో 9వ తేదీ నుంచి మెట్రో స్టేషన్లలో భద్రత కల్పించాలని అధికారులు నగర పోలీసులకు లేఖ రాశారు. మునుముందైనా బాదుడే ఆదివారం రాత్రి మళ్లీ చార్జీల పెంపును నిలిపివేసినట్లు మెట్రో అధికారులు తెలిపారు. సోమవారం పాత చార్జీలే కొనసాగుతాయని పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పుడు చార్జీలను పెంచకపోయినా, మార్చిలో గాని ఏప్రిల్లో మాత్రం బాదుడు తప్పదని తెలుస్తోంది. ఆ పెంపు 100 శాతం ఉన్నా ఆశ్చర్యం వద్దని మెట్రో వర్గాలు చెప్పడం విశేషం. ఎంపీ తేజస్వి హల్చల్ ముఖ్యమంత్రి గారూ, నాటకాలు ఆపండి (మెట్రో టికెట్ రేట్లు పెంచకండి) అని రాసిన టీషర్ట్ ధరించి బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్విసూర్య ఆదివారం నగరంలోని ఆర్వీ రోడ్డు మెట్రోస్టేషన్లో హల్చల్ చేశారు. ప్రయాణికులతో చర్చ జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే చార్జీలు పెరుగుతున్నాయన్నారు. 5 శాతం టికెట్ రేట్ల పెంపుతో ఒక్కో ప్రయాణికునిపై రూ.250 భారం పడుతుందన్నారు. తాము కేంద్ర మంత్రి మనోహర్లాల్ఖట్టర్కు వివరించగా, తాత్కాలికంగా నిలిపివేయాలని బీఎంఆర్సీఎల్ను ఆదేశించారని తెలిపారు. చార్జీల పెంపు కచ్చితమన్న ఎండీ నిలిపేసినట్లు మళ్లీ ప్రకటన నేడు పాత టికెట్ రేట్లే -
తెక్కలకోట కొండల్లో ప్రాచీన అిస్థి పంజరాలు
సాక్షి బళ్లారి: జిల్లాలోని బత్తదనాడు నియోజకవర్గ పరిధిలోని తెక్కలకోట కొండల్లో పురావస్తు శాఖ అధికారులు చేపట్టిన పరిశోధనల్లో దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటి అిస్థి పంజరాలు లభ్యం కావడం సంచలనం రేకెత్తిస్తోంది. అమెరికాకు చెందిన హార్ట్విక్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా.నమితా ఎస్.సుగంది ఆధ్వర్యంలో తెక్కలకోటలో ముందుకు సాగుతున్న పరిశోధన బృందానికి అలనాటి మట్టి పాత్రలు, మట్టి ముక్కలు, శిలాయుగం నాటి అవశేషాలు కనిపించడంతో అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. సూక్ష్మ శిలాయుగానికి చెందిన రాతి ఆయుధాలు, అవశేషాలు బయపడటంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 5.5 అడుగుల పొడవు కలిగిన రెండు మానవ అిస్థి పంజరాలను ఒకదాని పక్కన ఒకటి సమాధి చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇవి సాధారణమైన అిస్థి పంజరాలు కావని పరిశోధకులు భావిస్తున్నారు. మృతదేహాలపై మట్టి కాకుండా రాళ్లు ఉంచి, పాతి పెట్టారంటే అప్పట్లో గొప్ప వ్యక్తులు లేదా ఇతరత్రా చరిత్ర సాధకులకు సంబంధించినవి ఉండొచ్చనే కోణాల్లో పరిశీలన చేస్తున్నారు. తొలుత 1964లో పురావస్తు నిపుణుడు నాగరాజ రావు చేపట్టిన తవ్వకాల్లో తెక్కలకోట చరిత్రను పరిచయం చేశారు. ప్రొఫెసర్ డా.నమితా ఎస్.సుగంది 2019లో తెక్కల కోటకు విచ్చేసి ఈ ప్రాంత చరిత్రపై ఆసక్తి పెంచుకుని పరిశోధనలు చేస్తున్నారు. గ్రీస్ విశ్వవిద్యాలయానికి చెందిన జీవ సాంకేతిక నిపుణురాలు సుసేన్క్రిక్ ప్యాట్రిక్ స్మిత్ తదితరులు అవశేషాల సంరక్షణ, కాలనిర్ధారణపై సలహాలు అందిస్తున్నారు.లభ్యమైన అస్థి పంజరాలు -
హుండీ చోరీ
హొసపేటె: మునిరాబాద్ సమీపంలోని హోసలింగపుర గ్రామంలోని కరుమారియమ్మ దేవి ఆలయం, కాళికా దేవి ఆలయంలోని హుండీని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి చోరీ చేశారు. కాళికా దేవి దేవస్థానం ముందు ఉన్న గ్రిల్ తాళాన్ని దొంగలు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. అలాగే గ్రామంలోని 3వ వార్డులోని తుంగభద్ర ఎడమ ఒడ్డున ఉన్న ఆలయంలోని దేవత మెడలోని 6 గ్రాముల బంగారు తాళి గొలుసు, హుండీలోని ఉన్న నగదు, పూజా సామగ్రిని దొంగిలించి పరారయ్యారు. దొంగలు కిటికీ పగలగొట్టి ఆలయంలో ప్రవేశించారు. ఈ ఘటనపై మునీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జేడీఎస్ జిల్లా అధ్యక్షుడిగా తాయన్న బళ్లారి అర్బన్: జనతాదళ్ (సెక్యులర్) పార్టీ బళ్లారి జిల్లా అధ్యక్షుడిగా మీనళ్లి తాయన్నను మూడోసారి నియమించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి హెచ్డి. కుమార స్వామి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నిఖిల్ కుమార్ స్వామి తదితరులు నూతన జిల్లా అధ్యక్షుడు మీనళ్లి తాయన్నకు నియామక పత్రాన్ని అందజేశారు. బళ్లారి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు బండెప్ప కాశంపూర్, నాడగౌడ, మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ పాల్గొన్నారు. ‘నిన్న నెనపలి’ పుస్తకావిష్కరణ బళ్లారి అర్బన్: యువ జీవితంలోని ఉత్సాహం నిరంతరం కొనసాగాలని హ్యాలిస్ బ్లూస్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్షుడు కేఎం.శివమూర్తి అన్నారు. అఖండ బళ్లారి జిల్లా కన్నడ సాహిత్య పరిషత్, వివేక పుస్తక ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కన్నడ భవన్లో కవి ఎస్.ఆర్.శరణ్కుమార్ తొలి హనిగవన సంకలనం నిన్న నెనపలి పుస్తకావిష్కరణ జరిగింది. శాసన మండలి సభ్యుడు వై.ఎం.సతీష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బళ్లారి జిల్లా కసాప అధ్యక్షుడు డాక్టర్.నిష్టి రుద్రప్ప కృతిని పరిచయం చేస్తు నిన్ననెనపలి ద్వారా శరణ్ కుమార్ కన్నడ కవిత్వ ప్రపంచానికి తొలి కృతిని అందించడం ప్రశంసనీయమన్నారు. కృతిలోని హనిగవనాలు పాఠకుల మనోభావాలకు అనుగుణంగా యువ వయస్సు జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసి ఆనందం కలిగిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వివేక పుస్తక ప్రచురణ సంస్థ ప్రతినిధులు ఎస్.ఆర్.రాజేశ్వరి, ఎస్.ఆర్.సిద్ధరామన గౌడ, ఎస్.ఆర్. చంద్రశేఖర్ పాటిల్, మాజీ మేయర్ ఇబ్రహీం బాబు, బసవరాజ్ గడగిన్, కసాప గౌరవ కార్యదర్శి డాక్టర్.కే.శివలింగప్ప, ఎరేగౌడ, డాక్టర్ భ్రమరాంభ యాటి తదితరులు పాల్గొన్నారు. ఆలయంలోకి దూసుకెళ్లిన బస్సు రాయచూరు రూరల్: మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడపడంతో ఆలయంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శనివారం రాత్రి దేవదుర్గ తాలుకా తింథిణ మౌనేశ్వర ఆలయం వద్ద చోటుచేసుకుంది. దేవదుర్గ డిపోకు చెందిన డ్రైవర్ అంబరేష్ పూటుగా మద్యం సేవించి డ్యూటీకి వచ్చాడు. మద్యం మత్తులో స్టీరింగ్ను పక్కకు తిప్పడంతో బస్సు తింథిణ మౌనేశ్వర ఆలయంలోకి దూసుకెళ్లిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంలో శనగ పంట దగ్ధం హొసపేటె: కొప్పళ తాలూకా బాలగేరి గ్రామంలో రైతు రామప్ప హోంబలేకు చెందిన శనగ పంట, పొట్టు ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నష్ట పరిహారం చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. -
రథోత్సవం.. తరించిన భక్తజనం
వైభవంగా బసవలింగ జాతర సాక్షి బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మోకా మల్లేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు రావడంతో బళ్లారి తాలూకా మోకా గ్రామం భక్తజన సంద్రంగా మారింది. స్థానిక గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మల్లేశ్వర స్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు, అర్చనల అనంతరం కల్యాణం జరిపించారు. మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ లోక్సభ సభ్యుడు సన్న పక్కీరప్ప తదితరులు మోకా మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రథానికి పూజలు చేసి భక్తులతో కలసి లాగారు. అలాగే గ్రామీణ ఎమ్మెల్యే బి.నాగేంద్ర, పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు రథోత్సవాన్ని తిలకించి, ఆలయంలో పూజలు చేయించారు. మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి ఎదురు బసవణ్ణ ఆలయం వరకూ రథాన్ని లాగారు. మోకా గ్రామం ఆంధ్రప్రదేశ్ సరిహద్దున ఉండటంతో ఇటు కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మోకా గ్రామం భక్తులతో కిటకిటలాడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.మోకా మల్లేశ్వర స్వామి రథోత్సవానికి వచ్చిన అశేష జనవాహినిబసవలింగ జాతరలో పాల్గొన్న భక్తులు ఘనంగా మోకా మల్లేశ్వర స్వామి జాతర హాజరైన వేలాది మంది భక్తులు రాయచూరు రూరల్: లింగసూగురు తాలూకా పికళిహళ్లో ఉటకనూరు మరి బసవలింగ శివయోగి దేశికేంద్ర మహస్వాముల 32వ జాతర వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం వేలాది మంది భక్తుల సముక్షంలో రథోత్సవం నిర్వహించారు. రథోత్సవాన్ని వీక్షిచేందుకు రాయచూరు, లింగసూగురు, సింధనూరు, మాన్వి, బళ్లారి నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
ప్రేమికుల రోజున నందిహిల్స్ బంద్
దొడ్డబళ్లాపురం: రాబోయే ప్రేమికుల రోజున ప్రఖ్యాత నంది హిల్స్కు వెళ్లాలి అనుకునే ప్రేమజంటలు, యాత్రికులకు నిరాశే. సాధారణంగా నందికొండకు అత్యధికంగా వచ్చేది ప్రేమికులే. అయితే ఈ వాలెంటైన్స్డే కి నంది కొండపైకి టూరిస్టులను నిషేధిస్తూ జిల్లాధికారి ఆదేశాలిచ్చారు. వాలెంటైన్స్ డేకి నందికొండని మూసివేయడం చరిత్రలో ఇదే తొలిసారి. ప్రేమికుల రోజున నంది కొండపై నుంచి భగ్న ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. దీంతో పాటు గొడవలు జరుగుతాయనే అనుమానంతో ఆ రోజున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఎవరినీ కొండపైకి అనుమతించరని తెలిపారు. -
వీబీ–జీ రామ్జీ పథకంతో కూలీలకు ప్రయోజనం
హొసపేటె: ఉపాధి హామీ చట్టం కంటే మెరుగైన ఉపాధి, గ్రామీణాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని వికసిత్ భారత్–2047 విజన్లో భాగంగా వీబీ–జీ రామ్జీ పథకం రూపొందించబడిందని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బంగారు హనుమంతు అన్నారు. ఆదివారం సండూర్ మండలంలో వీబీ–జీ రామ్జీ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వీబీ–జీ రామ్జీ పథకం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ పథకం యొక్క ఉపయోగాలను గ్రామాల్లోని ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ నాయకులు, కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నకిలీ గాంధేయవాదులు ఈ పథకంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. నరేగా పథకం కింద కార్మికుల వేతనాలు నిర్ణీత సమయానికి అందడం లేదని మండిపడ్డారు. నరేగా పథకంలో నకిలీ జాబ్ కార్డుల సమస్య పెరిగిందని ఆరోపించారు. కొత్త పథకంలో అవినీతికి చోటు లేదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అనిల్ నాయుడు, మోకా, నాయకులు రామకృష్ణ, బప్పకన్ కుమార స్వామి, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
కొన్ని క్షణాల్లో పెళ్లి.. ఆపిన మొదటి భార్య
తుమకూరు: తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాలోని యడియూరులో ఆలయం సమీపంలోని ఎస్ఎల్ఎన్ కళ్యాణ మండపంలో పెద్ద రచ్చ జరిగింది. నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా? అని పెళ్లికొడుకును మొదటి భార్య నిలదీయడంతో సినిమాలో మాదిరిగా కోలాహలం నెలకొంది. వివరాలు.. ఆదివారం ఈ మండపంలో బెంగళూరులోని ఆర్ఆర్ నగర నివాసి హరీష్ ప్రసాద్కు, మండ్యకు చెందిన పుణ్యశ్రీ అనే యువతితో పెళ్లి జరుగుతోంది. సరిగ్గా తాళి కట్టే సమయంలో మొదటి భార్య లేపాక్షి, పోలీసులు, కుటుంబ సభ్యులతో వచ్చింది. తామిద్దరూ ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నామని, శృంగేరిలో కాపురం ఉంన్నామని లేపాక్షి తెలిపింది. తాను ప్రైవేటు టీచరునని, తరచూ వేధింపులకు పాల్పడడంతో పాటు గర్భస్రావం చేయించేవాడని ఆమె ఆరోపించింది. రూ.2 వేలు పంపి... మూడు రోజుల క్రితం భర్త నాకు ఫోన్ చేసి రెండు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్పేలో రూ.2 వేలు పంపాడని, పెళ్లి జరుగుతోందని తెలిసి అడ్డుకోవడానికి వచ్చానని లేపాక్షి వివరించింది. లేపాక్షి మాటలతో వధూవరులు షాక్కు గురయ్యారు. వధువు తల్లిదండ్రులు ఈ పెళ్లిని రద్దు చేసుకుని, వరున్ని దండించారు. వారు కూడా పోలీసుస్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఇదేం గొడవ అని అతిథులందరూ వెళ్లిపోయారు. పెళ్ళి విందు కోసం వండిన వంటకాలు అలాగే మిగిలిపోయాయి. ఫంక్షన్ హాల్లో రచ్చ రచ్చ నిలిచిపోయిన మూడుముళ్లు తుమకూరు జిల్లాలో విడ్డూరం -
సంస్థకు, సొంతూరికి మంచి పేరు తేవాలి
బళ్లారిఅర్బన్: సంస్థకు, సొంత ఊరికి మంచి పేరు తేవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక లాడ్స్ ఇండో అమెరికన్ పీయూ కళాశాల ఆధ్వర్యంలో ద్వితీయ పీయూ విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నెరవేర్చారు. ముఖ్య అతిథిగా సెయింట్జాన్స్ జూనియర్ కళాశాల అధ్యక్షుడు, ప్రిన్సిపాల్ శివరామ పాల్గొని మాట్లాడారు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఇండో అమెరికన్ విద్యా సంస్థలో చదవడం గొప్ప వరం అన్నారు. విద్యార్థులు తమ భావి జీవితానికి పునాది అయిన పీయూసీకి వీడ్కోలు చెప్పడం, ఉన్నత విద్యాభ్యాసం వైపు అడుగులు వేయడంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలన్నారు. కీలకమైన డిగ్రీ, పీజీ దశలను చేరుకుని కన్న తల్లిదండ్రులకు, సొంత ఊరితో పాటు విద్యా సంస్థకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ సందర్భంగా వక్తలు కృత్రిమ మేధతో పాటు సైబర్ క్రైం, ఇతర సమాజంలోని సాధక బాధకాలు, తదితర చైతన్య పరిచే అంశాల గురించి వివరించారు. ప్రముఖులు డ్యానియల్, ఎం.శ్రీశైల, పీహెచ్.నాయుడు, ప్రిన్సిపాల్ రాజేష్, షేక్ సలీం బాషా, సుధీర్కుమార్, ఉదయ్ భాస్కర్లతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, సంరక్షకులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
మృత్యురూపమైన లారీ
● ఇద్దరు దుర్మరణం మైసూరు: లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ ఢీకొనడంతో స్కూటర్పై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. నంజనగూడు తాలూకా హనుమనపుర గేట్ వద్ద శనివారం ఉదయం జరిగింది. మైసూరులోని జేపీ నగర నివాసి చంద్రు (38), మహిళ శీలా (35) మృతులు. చంద్రు, శీలా బైక్లో సంతేమరహళ్లి వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఎరువు లోడ్ లారీ ఢీకొంది. దీంతో అదుపు తప్పి కింద పడటంతో అదే వేగంలో లారీ వారిద్దరి తలలపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడే మరణించారు. విషయం తెలియగానే స్థలానికి డీఎస్పీ రఘు, సీఐ చంద్రశేఖర్, కవలందె పోలీసు స్టేషన్ ఎస్ఐ బసవరాజు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను నంజనగూడులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. అనుమానిత ఉగ్రవాది మృతి బనశంకరి: బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న అనుమానిత ఉగ్రవాది ఆస్పత్రిలో చనిపోయాడు. వివరాలు... నిందితుడు సాదిక్ పాషా (47)ని నగరంలో సుద్దగుంటెపాళ్యలో పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన కేసులో 2020లో పోలీసులు అరెస్టు చేసి సెంట్రల్ జైలులో ఉంచారు. అతనితో పాటు మరో 6 మంది అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు, ఎన్ఐఏ అధికారులు విచారించి రిమాండుకు తరలించారు. అప్పటినుంచి చెరసాలలోనే ఉంటున్నాడు. ఆరునెలలుగా లో బీపి, హై సుగర్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు జైలు సిబ్బంది తెలిపారు. దీంతో ఇటీవల విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి అతడు మరణించాడని చెప్పారు. బీఎంటీసీ బస్సు ఢీకొని మణిపూర్ యువతి బలి బనశంకరి: ఉపాధి కోసం మరో రాష్ట్రం నుంచి వలస వచ్చి జీవిస్తుంటే, కిల్లర్ బీఎంటీసీ బస్ డీకొని మణిపూర్ యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటన నగరంలో కృష్ణరాజపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. హెన్నా ఇనకా (20) అనే యువతి నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ మారతహళ్లిలో నివాసం ఉండేది. శుక్రవారం ఉదయం 9:30 సమయంలో ఆమె మరొకరితో కలిసి బైక్లో వెనుక కూర్చుని వెళ్తోంది. సిల్క్బోర్డు నుంచి టిన్ ఫ్యాక్టరీకి వెళుతున్న బీఎంటీసీ బ్యాటరీ బస్సు , కృష్ణరాజపురం రైల్వేస్టేషన్ రోడ్డులో వారికి తగిలింది, దీంతో బైక్ కిందపడగా, హెన్నాఇనకా తల మీద నుంచి ఆ బస్సు ముందు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొంతసేపటికి చనిపోయింది. కృష్ణరాజపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుబాయ్కి తీసుకెళ్లి.. రూ.1.80 కోట్ల వసూలు మైసూరు: కేరళకు చెందిన ఇద్దరు దుండగులు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మైసూరుకు చెందిన ఓ విద్యార్థి నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేసి మోసగించారు. వివరాలు.. మైసూరులోని కువెంపునగర నివాసి ప్రశాంత్ బాధితుడు. ఇతడు పీయూసీ చదువుతున్నప్పుడు కేరళకు చెందిన విశ్వనాథన్, స్నేహ మరియా అనే ఇద్దరితో పరిచయమైంది. వారు తాము చదువు ముగించి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నట్లు ప్రశాంత్ను నమ్మించారు. నీకూ విదేశంలో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. తర్వాత అతనిని బెంగళూరు మీదుగా హాంకాంగ్, దుబాయ్కు తీసుకెళ్లారు. ఇక్కడ మంచి ఉద్యోగం చేస్తున్నాడని అతని తల్లిదండ్రులకు చెప్పి నమ్మకం కలిగించారు. అతనిని దుబాయ్లో ఉంచి దశల వారీగా రూ.1.80 కోట్లను తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. డబ్బులు రాగానే దుబాయ్లో ప్రశాంత్ ను వదిలేసి ఎక్కడికో ఉడాయించారు. తర్వాత స్నేహితులు, బంధువుల సాయంతో ప్రశాంత్ దుబాయ్ నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు. కువెంపునగర పోలీసు స్టేషన్లో మోసగాళ్లపై ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. -
ప్రాణం మీదకొచ్చిన పంతుళ్ల దండన
గౌరిబిదనూరు: నగర శివారులో ఉన్న విద్యానిధి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సుశాంత్ అనే విద్యార్థిని ఉపాధ్యాయులు తీవ్రంగా దండించడంతో భయపడిపోయి సొమ్మసిల్లాడు. ఉపాధ్యాయుల నిర్వాకం వల్ల బాలుని తల్లిదండ్రులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. వివరాలు.. వివరాలు.. పక్క విద్యార్థి పుస్తకంలోని పేజీని చించాడని నాలుగైదు మంది ఉపాధ్యాయులు సుశాంత్ను ఓ గదిలోకి తీసుకెళ్లి నిలదీశారు. సుశాంత్ నేను పేజీ చించలేదని ఎంత చెప్పినా ఉపాధ్యాయులు వినలేదు. వారి అరుపులకు బాలుడు మూర్ఛపోయాడు. దీంతో హడావుడిగా పాఠశాల వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొంత తేరుకున్న తరువాత బాలుని తల్లిదండ్రులు అంబులెన్స్లో వారి గ్రామం కొడిగేనహళ్ళికు పిలుచుకొని వెళ్లినట్లు తెలిసింది. చర్యలు తీసుకుంటాం తాలూకా విద్యాశాఖ అధికారి గంగరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటన దురదృష్టకరం, ఉపాధ్యాయులు విద్యార్థులకు సున్నితంగా చెప్పాలే తప్ప దండించరాదు అని అన్నారు. తప్పు చేసిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలునికి తీవ్ర అస్వస్థత -
మిరప మేళా.. స్పందన భళా
హుబ్లీ: రైతులకు మంచి మార్కెట్, అలాగే వినియోగదారులకు కల్తీ లేని, నాణ్యతతో కూడిన ఎండుమిర్చి అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఎండుమిర్చి మేళా ఏర్పాటు చేయడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రాష్ట్ర సాంబారు పదార్థాల అభివృద్ధి మండలి శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ 14వ మిర్చి మేళాను స్థానిక మూరు సావిరమఠం మైదానంలో ఏర్పాటు చేశారు. ధార్వాడ జిల్లాతో పాటు గదగ, బళ్లారికి చెందిన రైతన్నలు తమ మిర్చి పంటతో పాల్గొన్నారు. మొత్తం మీద పొలం నుంచి నేరుగా వినియోగదారుడి ముంగిటకు చేర్చే మేళా కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 100 దుకాణాల్లో బ్యాడగి డబ్బి, గుంటూరు, కడ్డిరకం, మిర్చి ఆకర్షిస్తున్నాయి. ధరల హెచ్చుతగ్గులతో ఆసక్తికరం 100 స్టాళ్లలో మిరప ప్రదర్శనలు -
చేనేతలకు చేయూత ఏదీ?
రాయచూరు రూరల్: చేనేతలకు బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించాలని చేనేత సహకార సంఘం సంచాలకుడు సంగప్ప డిమాండ్ చేశారు. శనివారం బాగల్కోటె జిల్లాధికారి కార్యాలయం వద్ద వినితిపత్రం సమర్పించి మాట్లాడారు. రాష్ట్రంలో కట్టడ కార్మికుల మాదిరిగా గుర్తింపు కార్డులు, సహకార, జాతీయ బ్యాంకుల్లో రుణాలు మంజూరు చేసేలా చూడాలన్నారు. 55 ఏళ్లు పైబడిన చేనేతకారులకు నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ చెల్లించాలన్నారు. 55 మంది చేనేత కారులు రుణ బాధలతో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సమ్మాన్ పథకం కింద ఉన్న నిధిని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని కోరారు. చేనేత చట్టాన్ని జారీ చేయాలన్నారు. రైల్వే, విమానాశ్రయాల్లో చేనేత వస్త్రాల విక్రయాలకు అవకాశం కల్పించాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
రాష్ట్రాన్ని ఉడ్తా పంజాబ్ కానివ్వం
మైసూరు: కర్ణాటకను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉడ్తా పంజాబ్గా మాదిరిగా మత్తు పదార్థాల నిలయంగా మార్చనివ్వమని హోం మంత్రి జి.పరమేశ్వర్ అన్నారు. శనివారం మైసూరులో ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు శాఖలో చాలా సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. మాదకద్రవ్యాల సమస్యపై మేము చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాం, బెంగళూరులో ప్రతిరోజూ వందలాది కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. పంజాబ్లో ప్రతి ఇంట్లో డ్రగ్స్ దొరికాయని వార్తలు వస్తున్నాయని, అలా కర్ణాటకను కానివ్వబోమన్నారు. మైసూరులో డ్రగ్స్ ఫ్యాక్టరీలు లేవు మైసూరులో ఎటువంటి మాదకద్రవ్యాలు కనుగొనలేదని ఇటీవలి డ్రగ్స్ ఫ్యాక్టరీలు గుట్టురట్టయిన సంఘటనను హోంమంత్రి ప్రస్తావించారు. నార్కోటిక్స్ బ్యూరో దాడిలో ఫినాయిల్ కెమికల్ లభించిందని, అయితే బ్యూరోవారు రూ.10 కోట్ల మాదకద్రవ్యాలు దొరికాయని అబద్ధం చెప్పారని హోంమంత్రి ఆరోపించడం గమనార్హం. మైసూరులో మొదటిసారి సోదాల్లో డ్రగ్స్ లేవన్నారు, అంతలోనే మరో మీడియా ప్రకటనలో డ్రగ్స్ దొరికాయని చెప్పారని దుయ్యబట్టారు. తాను మైసూరు పోలీసు కమిషనర్ను ప్రశ్నించినప్పుడు, ఇక్కడ ఏమీ దొరకలేదని తెలిపారన్నారు. ఇలా పత్రికా ప్రకటన జారీ చేయాల్సిన అవసరం ఏమిటి? అని నార్కోటిక్స్ బ్యూరో మీద మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని రసాయన కర్మాగారాలను తనిఖీ చేయాలని నేను ఇప్పటికే పోలీసు అధికారులను ఆదేశించానని చెప్పారు. ఏ రసాయన కర్మాగారం కూడా పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోరాదన్నారు. 15 రోజులకు ఒకసారి తనిఖీలు చేయాలని, ముడి పదార్థాలను పరిశీలించాలని తెలిపారు. పోలీసులు ప్రజాస్నేహిగా ఉండాలి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలను నేరస్థులుగా చూడకూడదు. పోలీస్ స్టేషన్లు ప్రజలకు అనుకూలంగా ఉండాలని హోం మంత్రి తెలిపారు. సిద్ధార్థనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. పోలీసులు చురుగ్గా పనిచేయాలని, హుబ్లీలో ప్రేమోన్మాది చేతిలో యువతి హత్యకు గురైంది, పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే అలా జరిగి ఉండేది కాదన్నారు. మైసూరుకు మరింత బాగా పర్యాటకులు రావాలని, పోలీసులు, ప్రజలు టూరిస్టులకు అన్ని రకాల ఆతిథ్యం ఇవ్వాలని సూచించారు. మైసూరులోని చారిత్రక భవనాలను కాపాడుకుంటే మరింత కీర్తి వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీవత్స, ఐజిపి ఎం.బి. బోరలింగయ్య, పోలీసు కమిషనర్ సీమా లాట్కర్ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలను అరికడతాం హోంమంత్రి పరమేశ్వర్ -
అటవీ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
రాయచూరు రూరల్: అటవీ శాఖ ఉద్యోగి ఒకరు తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన బీదర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. మృతుడిని బీదర్ జిల్లా భాల్కి తాలూకా బోళగావ్కు చెందిన అంకుశ్ సుధామ(57)గా పోలీసులు గుర్తించారు. అటవీశాఖ అధికారుల వేధింపులతో విసిగి ఆత్మహత్య చేసుకున్నట్లు దళిత సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుతో భాల్కి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలానికి అటవీ శాఖ మంత్రి ఈఽశ్వర్ ఖండ్రె చేరుకుని మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రభుత్వ పరంగా లభించే సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎకై ్సజ్ మంత్రి రాజీనామా చేయాలి రాయచూరు రూరల్: అవినీతి, అక్రమాల్లో భాగస్వాముడైన రాష్ట్ర ఎకై ్సజ్ శాఖా మంత్రి ఆర్.బీ.తిమ్మాపూర్ రాజీనామా చేయాలని బీదర్ జిల్లా బీజేపీ డిమాండ్ చేసింది. శనివారం బీదర్ జిల్లాధికారి కార్యాలయం వద్ద వినితిపత్రం సమర్పించిన అనంతరం అధ్యక్షుడు సోమనాథ్ పాటిల్ మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రి ఆర్.బి.తిమ్మాపూర్ పుత్రులు మద్యం దుకాణాల లైసెన్సులకు రూ.6 వేలు లంచం తీసుకున ఆరోపణలు రుజువు కావడంతో మంత్రి తిమ్మాపూర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతూ ఎకై ్సజ్ శాఖ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదన వద్దు రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలు విరమించుకోవాలని ఆందోళనకారులు విన్నవించుకున్నారు. శనివారం కొప్పళ నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన ప్రాంతానికి రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌధరి విచ్చేసి మ హిళా ఆందోళనకారులతో చర్చించారు. ఈ ప్రాంతంలో విష పదార్థాలను వెదజల్లే పరిశ్రమలు స్థాపించి మనిషి జీవితాలను అనారోగ్యం పాలు చేయడం తగదని ఆందోళనకారులు వివరించారు. బల్డోటా, కిర్లోస్కర్, కళ్యాణి స్టీల్, ముక్కుంద సుమి, ఏక్రోస్ ఇండియా కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పితే తుంగభద్ర జలాలు కలుషితమై మనిషి ఆయుష్షు క్షీణించడం, 18 గ్రామాలు వాటి బారిన పడి వినాశనానికి దారి తీసే పరిశ్రమల ఏర్పాటుకు అంగీకరించకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందించారు. జ్యోతి మంజునాథ్, కావ్య ప్రసన్న శ్వేత, శశిరేఖ, పుష్పలతలున్నారు. పగిలిన మంచినీటి పైప్లైన్ ● పెద్ద ఎత్తున రోడ్డులో నీటి ప్రవాహం ● ఇళ్లలోకి నీరు, లోతట్టు జలమయం సాక్షి,బళ్లారి: నగరంలో రోడ్లలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు ప్రవహించి, ఇళ్లలోకి చేరింది. భారీ వర్షం వల్ల నీరు చేరిందని అనుకుంటే పొరపాటు. బళ్లారి నగరానికి మంచినీటిని సరఫరా చేసే పైప్లైన్ పగిలింది. శుక్రవారం రాత్రి అల్లీపుర రిజర్వాయర్ నుంచి నగరానికి మంచినీరు సరఫరా చేసే పెద్ద పైప్లైన్ పగిలిపోవడంతో పార్వతీ నగర్లోని రోడ్లలో పెద్ద ఎత్తున నీరు ప్రవహించడంతో ఆ కాలనీ వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైప్లైన్ పగిలినట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు. వెంటనే నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. నీటి సరఫరాను నిలిపివేయడంతో రోడ్లులో నీరు రావడం ఆగిపోయింది. -
వామపక్షాల చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మ
మండ్య: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించడం చేతకాదు. అది వామపక్షాల కబంధ హస్తాల్లో కొట్టుమిట్టాడుతోందని బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బి.ఎల్.సంతోష్ ఆరోపించారు. శనివారం మండ్య నగరంలోని అంబేడ్కర్ భవన్లో రచయిత డాక్టర్ సుధాకర్ హోసల్లి రాసిన నానూ కాఫిరా? పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడుతూ.. వామపక్షాలు మహాత్మా గాంధీజీని వక్రీకరించడమే కాకుండా సుభాష్ చంద్రబోస్, బుద్ధుడు, బసవన్న, అంబేడ్కర్ను అవమానిస్తున్నారని అన్నారు. కువెంపు, స్వామి వివేకానందను హిందూ సంస్కృతితో సంబంధం లేని వారిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. టిప్పు సుల్తాన్ లక్ష మందికి పైగా హిందువులు, 70 వేల మంది క్రైస్తవులను దారుణంగా ఊచకోత కోశాడన్నారు. అలాంటి మతోన్మాదిని స్వాతంత్య్ర సమరయోధుడు అని పిలవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. -
గోదాముల్లో అక్రమంగా యూరియా
సాక్షి,బళ్లారి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సబ్సిడీతో అందించే వేలాది బస్తాల యూరియాను అధికారులు పట్టుకున్నారు. ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతులు రోడ్లెక్కి ఆందోళన చేశారు. యూరియా లేక రైతులు ఎంతో ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే నగర శివార్లలోని గోదాముల్లో సుమారు నాలుగు వేల బస్తాల యూరియా అక్రమంగా నిల్వ ఉంచడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వేలాది బస్తాలు గోదాముల్లో నిల్వ ఉంచి, రైతులకు యూరియా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో అమ్ముతుండటంతో అక్రమంగా నిల్వ ఉంచిన యూరియా పట్టుబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్ మార్కెట్లో బస్తా రూ.800 పోలీసులు చేసిన మెరుపుదాడిలో అక్రమంగా యూరియా నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులకు యూరియా లేక ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు. బ్లాక్ మార్కెట్లో బస్తా రూ.800 వరకు పెట్టి కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వం సబ్సిడీలో రూ.266లకు బస్తా చొప్పున అమ్మాల్సిన యూరియాను ఎంతకు పడితే అంతకు అమ్మారన్నారు. గుట్టుచప్పుడు కాకుండా, స్టాక్ లేదని చూపించి, అక్రమంగా అమ్మారని మండిపడ్డారు. వేలాది బస్తాల యూరియా లభ్యం నిల్వలపై అధికారుల మెరుపుదాడి -
గర్భిణులకు పౌష్టికాహారం మేలు
రాయచూరు రూరల్: జిల్లాలో బాలింతలు మృతి చెందుతున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం సేవించాలని జాతీయ జిల్లా ఆరోగ్య అధికారిణి నందిత పేర్కొన్నారు. సింధనూరు తుర్విహాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుండాలో గర్భిణి బాలింతను పరీక్షించి వారికి సలహాలు ఇచ్చారు, బాలింతల మరణాలు సంభవిస్తున్న తరుణంలో గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. వైద్యులకు, అధికారులకు, ఆశా కార్యకర్తలకు, సిబ్బందికి వివరించారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించిందని గ్రామ పంచాయతీ అధికారులకు సూచనలు జారీ చేశారు. మద్దతు ధర ప్రకటించాలి రాయచూరు రూరల్: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. శనివారం యాదగిరి ఏపీఎంసీ కార్యాలయం వద్ద కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంత్ మాట్లాడారు. పత్తి, మిరప, వరి, వేరుశనగ, సజ్జ, జొన్న, కందులు, మినుము, పెసర పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ రాస్తారోకో చేపట్టారు. అధ్యయనంతో ఆత్మసంతృప్తి హొసపేటె: బహుత్వ దృక్పథం నుంచి అధ్యయనం చేయకుండా భారతదేశ ఆత్మను అర్థం చేసుకోవడం అసాధ్యం అని గదగ్ జిల్లా హులకోటి కేహెచ్.పాటిల్ ప్రభుత్వ ఫస్ట్గ్రేడ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ అప్పన్న హంజే అన్నారు. కన్నడ విశ్వవిద్యాలయంలోని త్రిపది ఆడిటోరియంలో శుక్రవారం అభయరాజ్ బల్డోటా జైన్ సంస్కృతి అధ్యయన చైర్మన్ నిర్వహించిన జైన బసది, శిల్పాల భావనలు అనే ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బౌద్ధమతం, జైన మతం, శైవమతం, వైష్ణవ మతం వంటి వివిధ మతాలు భారతదేశం వారసత్వం, సంస్కృతికి పునాదులు అని ఆయన అన్నారు. జైన, బసదిలు, శిల్పాలు కేవలం మతపరమైన భావనలు మాత్రమే కాదు. అవి మతం మేధో, భౌతిక సంస్కృతిని ప్రతిబింబించే ముఖ్యమైన చారిత్రక పత్రాలు. వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేయడం ద్వారా సమాజ విలువలు, ఆలోచనలు, జీవన విధానాన్ని అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. జైన మతం అనేక అంశాలతో కూడిందన్నారు. అన్ని జీవులపై గౌరవం, సహనం సందేశాన్ని తెలియజేస్తాయని ఆయన వివరించారు. కన్నడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్. డీవీ.పరమశివమూర్తి, అభయరాజ్ బల్డోటా జైన్ సంస్కృతి అధ్యయన చైర్ కన్వీనర్ డాక్టర్ రమేష్ నాయక్, పురావస్తు శాఖ ప్రొఫెసర్లు డాక్టర్ వాసుదేవ బడిగేర, డాక్టర్ ఎస్వై.సోమశేఖర్, డాక్టర్ మోహన్రావు బి.పంచల్, డాక్టర్.యర్రిస్వామి, పరిశోధకుడు నాగరాజ తదితరులు పాల్గొన్నారు. -
బెళగావి విభజనపై సీఎం నిర్ణయమే అంతిమం
హుబ్లీ: సువిశాలమైన బెళగావి జిల్లాను విభజించాలని కోరుతూ జిల్లా నేతలు ఎన్నో సార్లు సీఎంకు విజ్ఞప్తి చేశారని మంత్రి సతీష్ జార్కిహోళి తెలిపారు. బెళగావిలోని జిల్లా బాలభవనలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన ఇండోర్ బాక్స్ క్రికెట్ సదుపాయాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన ఈ విషయమై తనను కలిసిన నేతలతో చర్చించారు. జిల్లా విభజనకు సంబంధించి సీఎం సిద్దరామయ్య తీసుకొనే నిర్ణయమే అంతిమం అన్నారు. బెళగావి అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు కోసం వేచి చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే వివిధ శాఖల నుంచి అందుబాటులో ఉన్న నిధులను ప్రాధాన్యతాను సారంగా వినియోగించుకొని ప్రగతి పథంలో సాగవచ్చన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అశోక్ సర్కిల్, చెన్నమ్మ సర్కిల్, కొల్హాపూర్ సర్కిల్ తదితరాలను త్వరలోనే అభివృద్ధి పరుస్తామన్నారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వాడాలని మంత్రివర్గం తీర్మానించిందన్నారు. ఇది ఎంతో కీలకమైన నిర్ణయం అన్నారు. నవిలుతీర్థ జలాశయం నుంచి తాగునీటి సరఫరాపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ఎట్టి పరిస్థితిలోను తాగునీటి అవసరాలను నిరాకరించబోమన్నారు. హిప్పరిగి జలాశయంలో ప్రస్తుతం అవసరానికి తగినట్లుగా నీరు ఉందని అన్నారు. మహారాష్ట్ర నుంచి నీటిని తీసుకునే అవసరం ఏర్పడితే ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పార్టీలకు అతీతంగా కృషి చేస్తామన్నారు. మంత్రి సతీష్ జార్కిహోళి -
దేశంలోనే ఎక్కువ చార్జీలు
బనశంకరి: మెట్రో ప్రయాణికులకు కొంచెం ఉపశమనం. సోమవారం నుంచి అమల్లోకి రానున్న బెంగళూరు నమ్మమెట్రో రైలు టికెట్ రేట్ల పెంపును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతల ప్రయత్నాల నేపథ్యంలో ఈ ఊరట దక్కింది. దీంతో ప్రయాణికులకు కాస్త సొమ్ము ఆదా అవుతుంది. తెరవెనుక ఏం జరిగిందీ? ఇటీవల 5 శాతం మెట్రో టికెట్ చార్జీలను పెంచడంపై అన్ని వర్గాల ప్రయాణికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇందుకు కారణం మీరంటే మీరని ఆరోపణలు చేసుకుంటున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణం చేయాలా, వద్దా?, ఇదేమి బాదుడు అని సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెంపును కేంద్రం నిలుపుదల చేసినట్లు బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్విసూర్య తెలిపారు. టికెట్ చార్జీల పెంపుపై ఎంపీ తేజస్వి కొందరు కేంద్ర మంత్రులకు పరిస్థితిని వివరించారు. కేంద్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో మాట్లాడారు. దీంతో 9వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్న మెట్రో కొత్త టికెట్ రేట్లను నిలిపివేయాలని కేంద్రమంత్రి ఆదేశించారని ఎంపీ చెప్పారు. ఇప్పటికే అధిక రేట్లని కేంద్రానికి విజ్ఞప్తులు పెండింగ్లో పెట్టిన కేంద్రం దేశంలోని మెట్రో రైలు వ్యవస్థల్లో బెంగళూరు మెట్రో అత్యధిక చార్జీలను కలిగి ఉంది, చార్జీల పెంపు అసంబద్ధంగా ఉందని కేంద్రం దృష్టికి తీసుకువచ్చామని, మెట్రో టికెట్ ధరల పెంపుతో లక్షలాది మంది ప్రజలకు భారమవుతుంది, ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించడం కష్టతరమౌతుంది అని వినతిపత్రాలు ఇచ్చినట్లు ఎంపీ తేజస్వి చెప్పారు. దీంతో కేంద్రమంత్రి ఖట్టర్ చార్జీల పెంపును తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై బెంగళూరు మెట్రో ఉన్నతాధికారులు మాట్లాడుతూ మాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ సమాచారం అందలేదని అన్నారు. బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ.మోహన్ మాట్లాడుతూ నగర ఎంపీలు కేంద్ర మంత్రితో మాట్లాడామని, దీంతో పెంపు నిర్ణయం నిలిపివేతకు ఆదేశించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచాలని ఎక్కడా చెప్పలేదన్నారు. శనివారం రాత్రికి చార్జీల పెంపును పెండింగ్లో పెట్టినట్లు మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. -
డ్యాం గేట్ల పనులు జాప్యం చేస్తే ధర్నా
సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల పరిధిలో పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయానికి కొత్త క్రస్ట్గేట్లు అమర్చే పనులు వేగవంతంగా పూర్తి చేయకపోతే మార్చి 1 నుంచి ధర్నా చేస్తామని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన శనివారం తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. పాతబడిన తుంగభద్ర డ్యాంలోని 33 గేట్లు మార్చాలని నిపుణుల సూచన మేరకు గేట్లు మారుస్తుండటం శుభపరిణామమన్నారు. అయితే రబీ సీజన్కు క్రాప్ హాలీడే ప్రకటించి గేట్లు అమర్చుతున్న తరుణంలో వచ్చే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోపు అయినా గేట్లు మార్చడం సాధ్యం అవుతుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. డ్యాంకు ఉన్న 33 క్రస్ట్గేట్ల స్థానంలో కొత్త గేట్లు అన్నీ ఎప్పటిలోగా అమరుస్తారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మార్చి 1వ తేదీ లోపు కనీసం 20 శాతం పనులు పూర్తి కాకపోతే ధర్నా చేస్తామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందన్నారు. ఈవీఎంలు లేదా బ్యాలెట్ పద్ధతిలో ఎలా ఎన్నికలు నిర్వహించినా బీజేపీ గెలవడం ఖాయమన్నారు. కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రం ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకునేందుకు సీఎం సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి సీటు కోసం డీకేశి ఇద్దరూ తీవ్రంగా రాజకీయంగా పావులు, ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నందున ఈ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంటుందో ఎవరికీ అంతుపట్టడం లేదన్నారు. మొన్న కేంద్రంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశానికి ఎంతో మేలు చేకూరే బడ్జెట్ అని కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తమ బడ్జెట్ను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రానికి కూడా అన్ని విధాలుగా సహకారం అందించే విధంగా బడ్జెట్ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర బడ్జెట్పై విమర్శలు చేస్తోందన్నారు. నగర శివార్లలోని గోదాముల్లో 4 వేల బస్తాల యూరియా పట్టుబడటంపై సమగ్రంగా తనిఖీ చేయాలన్నారు. అసలే రైతులు యూరియా లేక ఎంతో ఇబ్బందులు పడ్డారని, వేలాదిగా యూరియా బస్తాలు ఎలా లభ్యం అయ్యాయో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో తనిఖీ చేయాలన్నారు. మాజీ బుడా అధ్యక్షుడు పాలన్న, బీజేపీ నాయకులు వీరశేఖర్రెడ్డి, కోనంకి తిలక్, హనుమంతప్ప, తిమ్మప్ప, కే.ఎస్.అశోక్ తదితరులు పాల్గొన్నారు. గోదాముల్లో యూరియా నిల్వలపై తనిఖీకి డిమాండ్ విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీరాములు -
ఆర్టీసి.. మొండికేసి..
రాయచూరు రూరల్: ప్రయాణికులను వేళకు సరిగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ మొరాయిస్తున్న ఘటనలు నిత్యకృత్యాలయ్యాయి. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి సర్కార్ భారీగా నిధులు విడుదల చేస్తున్నా కేకేఆర్డీబీ నుంచి బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడం తప్ప ఎక్కడా కొత్త బస్సులు రోడ్లపైకి వచ్చిన దాఖలాలు లేవు. కొత్తగా వచ్చిన బస్సులను లాంగ్ సర్వీసులకు వాడుతుండగా పాత బస్సులను గ్రామీణ ప్రాంతాలకు వాడుతుండగా అవి మధ్యలోనే చెడిపోయి నిలబడుతుండటంతో ప్రయాణికులు పడుతున్న బాధలు అంతింత కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏళ్ల తరబడి చెడిపోయిన బస్సులు ఆయా డిపోల్లోనే మగ్గుతున్నాయి. గుజరీకి వేయాల్సిన బస్సులకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. వేరే బస్సుల్లో తరలింపు ఆ బస్సులను రోడ్లపైకి వదిలితే రెండు మూడు రోజులు నడవక ముందే రోడ్లపై మొరాయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులను మధ్యలోనే దింపేసి మరో బస్సులో పంపుతున్నారు. డిపోలో టైర్లు లేక నిలిచిన బస్సులు, బ్యాటరీలు చెడిపోయి తుక్కు పట్టిపోతున్నాయి. 4 లక్షల కి.మీ.దూరం సంచరించి దశాబ్దం పాటు సేవలందించిన బస్సులు ఎక్కువగా మరమ్మతులకు గురవుతున్నాయి. ప్రతి డిపోలో 20కి పైగా బస్సులు గత ఐదేళ్ల నుంచి డిపోల్లోనే నిలిచి ఉన్నాయి. ఇలా కలబుర్గిలో 200, యాదగిరిలో 58, రాయచూరులో 75, కొప్పళలో 60, బళ్లారిలో 78, విజయ నగరలో 28, బీదర్లో 185 బస్సులు నిలిచి పోయాయి. పాత బడిన బస్సులు బ్రేక్లు ఫెయిల్ కావడంతో బోల్తా పడ్డ ఘటనలు కూడా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అయినా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుండటం శోచనీయం. మార్గంమధ్యలోనే నిలిచిన ఆర్టీసీ బస్సు టైర్ల కొరతతో డిపోలో నిలిచిన ఆర్టీసీ బస్సులు క–కలో మొరాయిస్తున్న బస్సులతో ప్రయాణికులకు వెతలు నిత్యకృత్యం ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతున్న వైనం -
ముండ్రిగి నాగరాజ్కు మంత్రి హోదా
సాక్షి,బళ్లారి: రాష్ట్ర ప్రభుత్వం పలు నిగమ, మండళ్ల అధ్యక్ష స్థానాలకు మార్పులు, చేర్పులు చేయడంతో పాటు పలువురికి నిగమ మండలి అధ్యక్షులుగా కూడా అవకాశం కల్పించింది. బళ్లారి జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, లిడ్కర్ అధ్యక్షుడుగా ఉన్న ముండ్రిగి నాగరాజుకు మంత్రి పదవి హోదా కల్పిస్తూ, అదే స్థానానికి అధ్యక్షుడుగా నియమించారు. దీంతో ముండ్రిగి నాగరాజు అభిమానులు, కార్యకర్తల్లో సంతోషం వెల్లివిరిసింది. తాను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి మళ్లీ తనను లిడ్కర్ అధ్యక్షుడుగా కొనసాగేలా అవకాశం కల్పించడంపై నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. అలాగే కంప్లి ఎమ్మెల్యే గణేష్ను కావేరి నిగమ మండలి అధ్యక్షుడుగా నియమించారు. లిడ్కర్ అధ్యక్షుడుగా కొనసాగింపు కావేరి నిగమ మండలి అధ్యక్షుడుగా గణేష్ -
కన్నవారి కాసుల కక్కుర్తి
● రూ.5 లక్షలకు మగశిశువు విక్రయం కోలారు: కన్నప్రేమ, మానవత్వం అనేవి లేకుండా పసిబిడ్డతోనే వ్యాపారం చేశారు. కోలారు జిల్లాలో శ్రీనివాసపురం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న నీతు, రాఘవేంద్ర అనే జంట తమకు జన్మించిన 7 రోజుల మగ బిడ్డను రూ.5 లక్షలకు అమ్మేశారు. వివరాలు.. నీతు, రాఘవేంద్రలకు గతంలో వేర్వేరుగా పెళ్లయి విడిపోయి సహజీవనం చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. నీతు మళ్లీ గర్భం దాల్చి ఓ ప్రైవేటు నర్శింగ్ హోంలో మగబిఢ్డకు జన్మనిచ్చింది. పేదరికం వల్ల సాకలేమంటూ తెలిసినవారికి చెప్పుకున్నారు. దీంతో బ్రోకర్ కొట్రగుళి నారాయణస్వామి.. చింతామణి తాలూకాలోని కృష్ణ– మంజుళ అనే దంపతులకు రూ. 5 లక్షలకు అమ్మేయించాడు. ఇది తెలిసి పోలీసులు అటు, ఇటు జంటలు, బ్రోకర్ను అరెస్టు చేసి చేశారు. శిశువును మళ్లీ తల్లిదండ్రుల వద్దే ఉంచారు. అపార్టుమెంటులో పిల్లి కేసు యశవంతపుర: బంగారు, డబ్బు, విలువైన వస్తువులు చోరీకీ గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయటం సహజం. అయితే బెంగళూరులో కడుపుతో ఉన్న పిల్లిని కిడ్నాప్ చేశారంటూ యజమాని ఫిర్యాదు చేయటంతో 9 మందిపై కేసు నమోదు చేశారు. హెచ్ఎఎల్ పోలీసుస్టేషన్ పరిధిలోని వ్యాన్సి సాలెటర్ అపార్ట్మెంట్లో ఈ విడ్డూరం జరిగింది. యజమాని సాకుతున్న పిల్లి గర్భం దాల్చింది. దీనిని గమనించి కొందరు పిల్లిని తీసుకెళ్లారు. కనిపించక పోవటంతో కంగారు పడి యజమాని హరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల చిత్రాల 9 మందిని పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిందితుల్లో అపార్ట్మెంట్ అధ్యక్షుడు శ్రీరామ్, సెక్యూరిటీ మేనేజర్ కూడా ఉండడం విశేషం. -
హంపీ ఉత్సవాలకు ముస్తాబు
హొసపేటె: ఈనెల 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు హంపీ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు సంబంధించిన సన్నాహక పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. హంపీ రోడ్డుతో సహా అన్ని ప్రధాన అనుసంవిధాన రహదారులు, జిల్లా ప్రధాన కార్యాలయం హొసపేటె నగరానికి అనుసంధానించే రహదారుల మరమ్మతులు చేపడుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న మొక్కలు, గుంటలను తొలగించే పనులు చేపట్టారు. హోస్పేట్ నగరాన్ని హంపీకి అనుసంధానించే రహదారి, నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. నగర శివారులోని జాతీయ రహదారి–50 సొరంగం దగ్గర ఆకర్షణీయమైన స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. కర్ణాటక మ్యాప్, రాతి రథ నమూనాను తయారు చేసి విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక జిల్లా అధికారి కార్యాలయ ఆవరణలో పాటు ఇతర ప్రముఖ ప్రదేశాల్లో ఉత్సవాల బెలూన్లను ఏర్పాటు చేశారు. -
శెనగ కొనుగోళ్ల ప్రారంభమెన్నడో?
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో కీలకమైన పంట పప్పుశెనగ. ధార్వాడ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రబీ సీజన్లో వర్షాధారిత పొలాల్లో లక్ష హెక్టార్లలో శెనగ సాగు చేస్తారు. ఈ ఏడాది జిల్లాలో 2.05 లక్షల హెక్టార్లలో శెనగ సాగు చేశారు. కేంద్రం ఈసారి రూ.5765 మద్దతు ధర ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు. కొనుగోళ్లు ఎప్పుడో తెలియక రైతులు దిగులు చెందుతున్నారు. ఇంతకు ముందు క్వింటాల్ శెనగ ధర రూ.5800 ఉండేది. ప్రస్తుతం రోజురోజుకు ధరలు తగ్గు ముఖం పడుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కోతల ప్రక్రియ షురూ ఇప్పటికే కోతల ప్రక్రియ కొనసాగుతోంది. కొందరు రైతులు శెనగ రాసులు పోసి విక్రయించేందుకు ఎదురు చూస్తున్నారు. మరి కొందరు రైతన్నలు సాగు కోసం అప్పోసప్పో చేసిన రైతులు డబ్బులు కట్టేందుకు ప్రైవేట్ ఏజెంట్లు, వ్యాపారులకు శెనగలు అమ్ముకుంటున్నారు. మొత్తానికి ఈ ప్రాంత అన్నదాతలను ప్రకృతి కరుణించి శెనగ దిగుబడి బాగానే వచ్చినా మార్కెట్లో ధర తగ్గిన నేపథ్యంలో రైతులు దిగులు చెందుతున్నారు. కేంద్రం క్వింటాల్ ధర రూ.5785 ప్రకటించినందున వేగంగా కొనుగోలు ప్రక్రియ కూడా ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. దిగుబడి ఘనం.. పడిపోయిన ధరలు ప్రారంభం కాని కొనుగోళ్లు దిక్కుతోచని స్థితిలో రైతులుపడిపోయిన దిగుబడి ఈ సారి దిగుబడి తగ్గింది. అతివృష్టి వల్ల త్వరగా సాగు చేసి పంట దెబ్బతింది. ఖరీఫ్లో అతిగా కురిసిన వానల వల్ల పెసర పంట పాడైంది. అయితే శెనగ ఎలాగైనా తమను రక్షిస్తుందని అనుకుని ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టాం. ఆ మేరకు ఎకరాకు 2–3 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దళారులు సిండికేట్గా ఏర్పడి మోసం చేస్తారనే భయం వేస్తోంది. – అప్పణ్ణ నదాఫ్, రైతు ఏప్రిల్ 18 వరకూ నమోదు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర యోజన ద్వారా నాణ్యత కలిగిన శెనగ ఉత్పత్తిని ప్రతి క్వింటాల్ రూ.5875 ధరతో కొనుగోలు చేయడానికి కేంద్రం తెరిచాం. రైతులు పేర్లు నమోదు చేసుకునేందుకు 80 రోజుల గడువు ఇచ్చాం. గత నెల 29 నుంచి ఏప్రిల్ 18 వరకు నమోదుకు అవకాశం కల్పించాం. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. నమోదు ప్రక్రియ ముగిశాక కొనుగోళ్లు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచిస్తాం. – భువనేష్ పాటిల్, ఇన్చార్జి జిల్లాధికారి గిట్టుబాటు ధర కల్పించాలి తక్షణమే గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తే రైతులకు అనుకూలంగా ఉంటుంది. వచ్చే ఏడాది ఇంకా ఎక్కువ మద్దతు ధర ప్రకటించాలి. కోతలు కోసి ధర వచ్చే దాకా పెట్టుకునేందుకు రైతులకు గోడౌన్లు కరువయ్యాయి. ఈ విషయంలో రైతన్నలను ప్రభుత్వమే ఆదుకోవాలి. – బసవరాజ్, రైతు, గుడేనకట్టి -
పొంచి ఉన్న విద్యుత్ షాక్
● నియంత్రణ కమిషన్కు ఎస్కాంల ప్రతిపాదన ● త్వరలో విద్యుచ్ఛక్తి చార్జీలు పెరిగే అవకాశం శివాజీనగర: నిత్యవసర వస్తువుల ధర పెరుగుదల రోజురోజుకు అధికమవుతున్న తరుణంలో ఆందోళన చెందుతున్న రాష్ట్ర ప్రజలకు మరో షాక్ ఎదురు కానుంది. త్వరలో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేసే అనేక కంపెనీలు నష్టాల్లో కొనసాగుతుండగా, ఆదాయాన్ని సరిచేయటానికి విద్యుత్ చార్జీలు పెంచాలని విద్యుచ్చక్తి నియంత్రణ కమిషన్కు బెస్కాం ప్రతిపాదన సమర్పించింది. ప్రతి యూనిట్కు రూ.1 చొప్పున విద్యుత్ చార్జీ పెంచాలని బెస్కాం విన్నవించింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. పరిశ్రమలు, వాణిజ్య, గృహోపయోగ కనెక్షన్లపై ప్రభావం చూపవచ్చు. కర్ణాటకలో విద్యుత్ సరఫరా కంపెనీ(ఎస్కాం)లు రూ.4,900 కోట్లకు పైగా ఆదాయ కొరతను సరిచేసేందుకు 2026 ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలను మళ్లీ పెంచే అవకాశం అధికంగా ఉంది. కర్ణాటక విద్యుత్ నియంత్రణ కమిషన్కు ఎస్కాంలు ప్రతిపాదనలు సమర్పించగా, ప్రజల విచారణ తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పెంపుదల ప్రతి యూనిట్కు 8–10 పైసల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. ఎస్కాంలు ఆదాయ కొరతను సరిచేసేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థకు విన్నవించారు. 2025 మార్చిలో కర్ణాటక విద్యుత్ నియంత్రణ కమిషన్ ప్రతి యూనిట్కు 36 పైసల వరకు విద్యుత్ ధరను పెంచింది. వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులపై విద్యుత్ చార్జీలను పెంచటం ద్వారా తమ రూ.4,620 కోట్ల ఆదాయ తారతమ్యాన్ని సరిచేయాలని విద్యుత్ సరఫరా మండలి కర్ణాటక విద్యుత్ నియంత్రణ కమిషన్ను కోరిందని తెలిసింది. గత సంవత్సరం మార్చిలో ధర పెంచినపుడు కేఈఆర్సీ వేసిన అంచనాల్లో ఖర్చు అధికం కాగా ఆదాయంలో కోత పడింది. మెట్రో ధరల పెంపుపై నిరసన బనశంకరి: నమ్మమెట్రో టికెట్ ధరల పెంపును ఖండిస్తూ ఉప్పు, పప్పు, బెల్లం, టూత్పేస్ట్ తదితర వాటితో కర్ణాటక రక్షణావేదిక కార్యకర్తలు, కన్నడపర సంఘాల కార్యకర్తలు శుక్రవారం వినూత్నరీతిలో ధర్నా చేపట్టారు. సోపు, టూత్పేస్ట్, టూత్బ్రష్, బియ్యం, కందిపప్పుతో శాంతినగర బీఎంఆర్సీఎల్ కార్యాలయానికి చేరుకున్నారు. మెట్రో టికెట్ కొనడానికి తమ వద్ద డబ్బు లేదని, అందుకే ఈ వస్తువులను తీసుకొని టికెట్ ఇవ్వాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. మెట్రో టికెట్ల ధర పెంపుతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రయాణికులపై పెను భారం పడుతుందన్నారు. తక్షణం మెట్రో టికెట్ ధర తగ్గించాలని, లేనిపక్షంలో పోరాటం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విమానాశ్రయంలో బంగారం చోరీ యశవంతపుర: బెంగళూరు దేవనహళ్లిలోని కెంపేగౌడ విమానాశ్రయంలో కొద్ది రోజుల క్రితం బంగారం, వజ్రాల చోరీకి గురైన విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా ప్రయాణికురాలు ఒకరి బ్యాగ్ నుంచి లక్షల విలువగల ఆభరణాలు మాయమయ్యాయి. బెంగళూరు దేవనహళ్లి విమానాశ్రయం నుంచి దుబైకి వెళుతున్న హుబ్లీకి చెందిన మహిళకు చెందిన 790 గ్రాముల బంగారం, రూ.8 లక్షల విలువగల వజ్రాలు మాయమైనట్లు తెలిసింది. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో ఆభరణాలున్నట్లు గుర్తించి సిబ్బంది తనిఖీ చేసి బ్యాగ్కు ట్యాగ్ వేశారు. దుబైకి వెళ్లి మహిళ చూసుకోగా బంగారం, వజ్రాలు మాయం అయ్యాయి. చోరీలో విమానాశ్రయం సిబ్బంది చేతివాటం ఉన్నట్లు మహిళ అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలు బెంగళూరు దేవనహళ్లి విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రెండు కార్ల ఢీ: ఒకరు మృతి
● నలుగురికి తీవ్ర గాయాలు సాక్షి బళ్లారి: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దావణగెర జిల్లా చెన్నగిరి తాలూకా ఉన్నేభాగి సమీపంలో చోటు చేసుకుంది. చెన్నగిరి తాలూకా నల్లూరు నుంచి వక్కల వ్యాపారం కోసం వెళ్తున్న వారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు దూరంగా పడిపోవడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడి వారిని చికిత్స నిమిత్తం దావణగెర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిరి ధాన్యాలతో ఆరోగ్యంరాయచూరు రూరల్: దేశంలో మిల్లెట్స్ (సిరి ధాన్యాల) వినియోగంతో అరోగ్యంగా ఉండవచ్చని వైద్యశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ తెలిపారు. గురువారం రాత్రి వ్యవసాయ విశ్వ విద్యాలయంలో వ్యవసాయ మేళా–2026 నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కళ్యాణ కర్నాటకలోని ఏడు జిల్లాల్లో జొన్న, కొర్ర, సజ్జ, మినుములు, నువ్యులు, రాగి, గోధుమ పంటలు పండించేందుకు వ్యవసాయ విశ్వ విద్యాలయానికి రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని తెలిపారు. శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ హనుమంతప్ప, సిండికేట్ సభ్యులు బసన గౌడ, మల్లేష, మధుసూదన రెడ్డి, డీసీ నీతిష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి మాదయ్య, దేశాయి, నాయక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 11, 12 తేదీల్లో ప్రార్థన కూడికలు సాక్షి బళ్లారి: సమాజంలో అనేక మందిని సన్మార్గంలో నడిపించిన పీ.సీ.పరమానంద జ్ఞాపకార్థం ఈనెల 11, 12 తేదీల్లో బళ్లారి పట్ణణంలో ప్రార్థన కూడికలు ఏర్పాట్లు చేస్తున్నట్లు విక్టర్ ఇమ్మానియేల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశ విదేశాల్లో దైవ వర్తమానాన్ని వినిపిస్తున్న ఇవాంజలిస్ట్ డాక్టర్ పీ.ఎస్.రాంబాబు పాల్గొని ‘డూనామిస్–దేవుని రాజ్యపు శక్తి’ కూటమి ఏర్పాటు చేస్తారన్నారు. బళ్లారి సీఎస్ఐ తెలుగు చర్చీ ఆవరణలో రెండు రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక సభల్లో అన్నిక రాంబాబు పాల్గొని దైవ వర్తమానాన్ని వినిపిస్తారని వెల్లడించారు. ఈ రెండు రోజుల్లో అద్భుతమైన ఆరాధన జరిపేందుకు బెంగళూరు నుంచి ప్రార్థన బృందం వస్తుందన్నారు. యువత కోసం 12న ప్రత్యేక దైవ వాక్య సందేశం, ప్రార్థనలు నిర్వహిస్తామన్నారు. ఆలయంలో మాంసపు సంచులు బళ్లారి అర్బన్: బళ్లారి నగరంలోని నాగలకెరె ప్రాంతంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో మాంసంతో కూడిన ప్లాస్టిక్ సంచులు లభ్యం కావడం కలకలం రేపింది. ఇటీవల ప్రారంభమైన పిస్తా హౌస్ రెస్టారెంట్ వెనుక భాగంలో ఉన్న ఆలయ పరిసరాల్లో సంచులు లభించాయి. ఉదయం పూజల కోసం వచ్చిన అర్చకుడు మహేష్.. దీనిని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మాంసపు సంచులను తొలగించి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన వెనుక కిడిగాళ్ల చర్య ఉందా? లేదా కుక్కలు తీసుకొచ్చాయా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. బళ్లారి వలయ ఐజీ డాక్టర్ హర్ష, ఏఎస్పీ రవికుమార్ ఆలయాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందన్నారు. వాస్తవాలు తేలిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా ఆలయాన్ని సందర్శించారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రైవేటు బస్సు
● మంటల్లో వాహనం దగ్ధం ● ప్రయాణికులు, కండక్టర్, డ్రైవర్ క్షేమం యశవంతపుర: విద్యుత్ స్తంభాన్ని బస్సు ఢీకొని మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన బెంగళూరు–తుమకూరు జాతీయ రహదారి –48లో శుక్రవారం జరిగింది. 40 మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్తో కలిసి బెంగళూరు నుంచి కలబుర్గికి బయల్దేరిన బస్సు నెలమంగల తాలూకా హనుమంతపుర గేట్ వద్దకు రాగానే రోడ్డు మరమ్మతుల వల్ల వాహనం స్లో అయ్యింది. అదే సమయంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో డ్రైవర్ బస్సును ఆపాడు. ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ కిందకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. అనంతరం మంటలు వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది. ప్రయాణికుల లగేజీ సైతం మంటల్లో కాలి బూడిదైంది. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
వీడియోతో మహిళకు బెదిరింపులు
హుబ్లీ/రాయచూరు రూరల్: విలేకరుల ముసుగులో మహిళా అధికారిణి బెడ్రూం వీడియో దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి వాటిని చూపి బ్లాక్మెయిల్ చేస్తున్న ముగ్గురిని బెళగావి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సదరు మహిళ ప్రైవేట్ దృశ్యాలు ఉన్న వీడియో చిత్రీకరించుకొని ఆ మహిళను విలేకరుల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన సమాచార హక్కు చట్టం కార్యకర్తతో పాటు ముగ్గురు నిందితులను బెళగావి పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. గోకాక్ జలాల్ గల్లి నివాసి సమీర్ నిస్సార్ అహ్మద్ షేక్ (32), గోకాక్ తాలూకా యోగికొళ్ల నివాసి అబ్దుల్ రఫీక్ నజీర్ అహ్మద్ మకాందార్(51), గోకాక్ తాలూకా ఘటప్రభ నివాసి మహమ్మద్ దిలావర్ బాళెకుంద్రి(43) అరెస్ట్ అయిన నిందితులు. ఆ మహిళ ఇంట్లో లేని సమయంలో ఇంటి తలుపునకు వేసిన తాళం చెవిని ఆ పక్కన పెట్టే విషయాన్ని పొరుగింటి వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు. డబ్బు కోసం బ్లాక్మెయిల్ ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ నిందితులు గోకాక్వాసులుబల్బు హోల్డర్లో సీసీ కెమెరా అమర్చి.. దుండగులు రహస్యంగా బల్బు హోల్డర్లో సీసీ కెమెరా అమర్చి ఆ మేరకు ఆమె ప్రైవేట్ దృశ్యాలను చిత్రీకరించుకొని బ్లాక్మెయిల్కు పాల్పడ్డారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాతో పాటు న్యూ చానల్లో వైరల్ చేస్తామంటూ బెదిరించారు. అలా వైరల్ చేయకూడదంటే రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళకు బ్లాక్ మెయిల్ చేసిన వారిపై బెళగావిలోని మాళమారుతి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 3 మొబైల్స్, 64 జీబీ పెన్డ్రైవ్, 6 హిడెన్ కెమెరా హోల్డర్లు, ఐక్యూ జెడ్ఎక్స్, రెండు ఓటీజీ, రెండు మెమరి కార్డులు, రీడర్లు, 128 జీబీ 8 మెమరి కార్డులు, ఒక టోయోటా ఇన్నోవా క్రిస్టా కారును పోలీసులు జప్తు చేసి సమగ్రంగా దర్యాప్తు చేపట్టారని బెళగావి నగర పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే మీడియాకు తెలిపారు. -
కొప్పళలో భారీ పరిశ్రమల ఏర్పాటు వద్దు
రాయచూరు రూరల్: కొప్పళలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దని కోరుతూ గురువారం కొప్పళ నగర సభ కార్యాలయం వద్ద పలువురు ఆందోళన చేపట్టారు. ఈ ప్రాంతంలో విష పదార్థాలను వెదజల్లే పరిశ్రమలు స్థాపించి మానవుల జీవితాలను నాశనం చేయొద్దని డిమాండ్ చేశారు. బల్దోట, కిర్లోస్కర్, కళ్యాణ స్టీల్, ముక్కుంది సుమి తదితర కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పితే తుంగభద్ర జలాలు కలుషితం అవుతాయని తెలిపారు. 18 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. విష పదార్థాలను వెదజల్లే పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా కేంద్రంపై బత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రికి లేఖలను రాయాలని అధికారులను కోరారు. కొప్పళలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం జరుగుతుందని జిల్లా అధికారి రాజశేఖర్, ఎస్పీ రామ్ అరసిద్ది ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంజునాథ్, మదరి, హన్మంతప్ప, మల్లికార్జున, గురునాథ్ గౌడ, విరుపణ్ణ, వీరభద్రప్ప, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ క్రీడలకు జేఎస్డబ్ల్యూ ప్రోత్సాహం
సాక్షి బళ్లారి: గాదిగనూరులో శ్రీగురు రేవణ్ణ సిద్ధేశ్వర జాతరను పురస్కరించుకుని గాదిగనూరు యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ మద్దతుతో నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్ల నుంచి సుమారు 120 మంది గ్రామీణ యువకులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఫైనల్ మ్యాచ్లో కేజీఎఫ్ బాయ్స్ గాదిగనూరు, జీఆర్సీసీ బాయ్స్ గాదిగనూరు జట్లు పోటీపడ్డాయి. కేజీఎఫ్ బాయ్స్ గాదిగనూరు జట్టు అత్యత్తమ ఆటతీరుతో ప్రథమ బహుమతి దక్కించుకుంది. జీఆర్సీసీ బాయ్స్ గాదిగనూరు జట్టు ద్వితీయ బహుమతి దక్కించుకుంది. జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ సమకూర్చిన ట్రోఫీలు, కప్లు, పతకాలను క్రీడాకారులకు అందజేశారు. గ్రామీణ ప్రాంత యువతకు క్రీడల్లో ఆసక్తిని పెంపొందించేందుకు క్రికెట్ టోర్నమెంట్లు దోహదపడుతాయని పలువురు తెలిపారు. కార్యక్రమంలో గాదిగనూరు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు శంకరప్ప నింగమ్మ, జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ క్రీడా అధికారి మహమ్మద్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.130 కోట్ల విలువైన స్థలం స్వాధీనం
బనశంకరి: కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని బీడీఏ స్వాధీనం చేసుకుంది. బెంగళూరు దక్షిణతాలూకా, ఉత్తరహళ్లి హోబళి జేపీ.నగర 9వ ఫేజ్ లేఔట్ ఆలహళ్లి గ్రామం సర్వేనంబర్ 20లోని మూడు ఎకరాల ప్రభుత్వ స్థలంలో కొంతమంది అక్రమంగా నిర్మాణాలను చేపట్టారు. దీంతో బెంగళూరు అభివృద్ధి ప్రాధికార(బీడీఏ) అధికారులు శుక్రవారం పోలీస్ భద్రత మధ్య జేసీబీ యంత్రాలతో వెళ్లి ఆక్రమణలు తొలగించి రూ.130 కోట్ల విలువచేసే భూమిని స్వాధీనం చేసుకున్నారు. బోనులో చిక్కిన చిరుత మైసూరు: మైసూరు జిల్లా సరగూరు తాలూకా ఎన్. బెల్తూర్ ఓల్డ్ గేట్ సమీపంలో గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో పడింది. కొన్ని నెలలుగా చిరుతపులి ఎన్. బెల్తూర్ ఓల్డ్ గేట్ సమీపంలోని పొలాల్లో సంచరిస్తూ 37 ఆవులను హతమార్చింది. దీంతో అటవీశాఖ అధికారులు 20 రోజుల క్రితం గ్రామానికి చెందిన యోగేష్ అనే రైతు పొలం సమీపంలో బోను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఆహారం కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కుకుంది. శుక్రవారం ఉదయం అటవీశాఖ అధికారులు వచ్చి పరిశీలించి మగచిరుతగా గుర్తించారు. మత్తుమందు ఇచ్చి బంధించి రేడియో కాలర్ అమర్చి అడవిలోకి వదిలేశారు. ఏసీఎఫ్ మధు, ఆర్ఎఫ్ఓ సిద్ధరాజు, చిరుత టాస్క్ఫోర్స్ సిబ్బంది, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. బంగ్లాదేశీయుల టెంట్లలో మంటలు యశవంతపుర: బంగ్లాదేశీయులు అక్రమంగా నివాసం ఉంటున్న షెడ్లలో మంటలు వ్యాపించిన ఘటన బెంగళూరు పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. కూడ్లు చెరువుకు సమీపంలో బంగ్లాదేశీయులు షెడ్లు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో షెడ్లలో మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న బంగ్లాదేశీయులు మేల్కొని బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. సమీపంలోని విద్యుత్ తీగ తెగి పడటంతో మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. పరప్పన అగ్రహరం పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మ్యూల్ అకౌంట్లతో వంచన: 13 మంది అరెస్ట్ బనశంకరి: రాష్ట్రంలో సైబర్ నేరాలు పెచ్చుమీరడాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐడీ అధికారులు మ్యూల్ అకౌంట్ల ద్వారా భారీ ప్రమాణంలో సైబర్వంచన దందాకు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. ఒకేసారి పలు చోట్ల దాడులు నిర్వహించిన సీఐడీ అధికారుల బృందాలు అక్రమంగా వాడుతున్న 40 వేలకు పైగా మ్యూల్ అకౌంట్ల ఆచూకీని కనిపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్లకుపైగా ఒకేసారి దాడులు నిర్వహించిన సీఐడీ బృందం దందాలో నిమగ్నమైన 13 మందిని అరెస్ట్ చేశారు. అమాయక ప్రజలు బ్యాంక్ అకౌంట్లు, ఏటీఎం కార్డులు, అకౌంట్ వివరాలను డబ్బుల కోసం సేకరించి సైబర్ వంచకులకు అందిస్తున్నట్లు సీఐడీ దర్యాప్తులో వెలుగు చూసింది. మ్యూల్ అకౌంట్ల ద్వారా ఆన్లైన్ వంచనకు పాల్పడి నగదు బదిలీ, ఏటీఎం ద్వారా నగదు విత్డ్రా చేశారు. అకౌంట్ వివరాలు ఇచ్చిన అమాయకులకు ఈ వంచన గురించి ఎలాంటి సమాచారం తెలియదు. దర్యాప్తు సమయంలో సుమారు 40 వేలకు పైగా మ్యూల్ అకౌంట్లు వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలి రోజుల్లో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో మ్యూల్ అకౌంట్లపై సీఐడీ బృందం తీవ్ర నిఘా పెట్టి దర్యాప్తు తీవ్రతరం చేశారు. -
ఉద్యోగాల కల్పనకు చర్యలు
రాయచూరు రూరల్: యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ వెల్లడించారు. శుక్రవారం వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జరిగిన ఉద్యోగ మేళాను జ్యోతి వెలిగించి మాట్లాడారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. లోక్సభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప, డీసీ నితీష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కూమార్ కాందూ, నగరనభ కమిషనర్ జుబీన్మెహ పాత్రో పాల్గొన్నారు. నిధుల విడుదలలో జాప్యం వద్దుబళ్లారి అర్బన్: రాష్ట్రంలోని సుమారు 6 వేల గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,175 కోట్ల నిధులు ఇంకా విడుదల కావాల్సి ఉందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల రాజ్యసభలో జీరో అవర్లో ఆయన మాట్లాడారు. నిధులను నిరంతరం నిలిపి వేయడం న్యాయ సమ్మతం కాదని.. ఇది గ్రామీణ పాలనకు తీవ్ర నష్టం కలిగిస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితి వల్ల స్వచ్ఛత కార్మికులు సహా అవసరమైన సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద రూ.1,066 కోట్లు, జలజీవన్ మిషన్ కింద రూ.6,976 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొనానరు. 15వ ఆర్థిక సంఘం సహా వివిధ పథకాల కింద కర్ణాటక గ్రామ పంచాయతీలకు బకాయిలుగా ఉన్న రూ.10,175 కోట్లు నిధులను తక్షణమే విడుదల చేయాలని సూచించారు. రూ.కోట్ల ఆస్తి వదిలేసి సన్యాసి దీక్ష స్వీకరణ సాక్షి బళ్లారి: దావణగెర నగరానికి చెందిన సివిల్ ఇంజినీరింగ్లో టాపర్గా నిలిచిన అంచల్ కుమారి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసింది. సంసార బంధనాలు వీడి సంప్రదాయబద్ధంగా సన్యాసి దీక్షను స్వీకరించారు. దావణగెర నగరంలోని చౌకి పేటకు చెందిన బంగారం వ్యాపారి ముఖేష్, సునీతకు ముగ్గురు కుమార్తెలు. ఇందులో ఇద్దరు కూతుళ్లకు పెళ్లి జరిగింది. చివరి కుమార్తె అంచెల్ను ఇంజి నీరింగ్ చదివించారు. అయితే తనకు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి, డబ్బు అవసరం లేదని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిన అంచల్ కుమారి.. సన్యాసి దీక్షను స్వీకరించారు. గుజరాత్ రాష్ట్రం సూరత్లో సాంప్రదాయబద్ధంగా దీక్షను స్వీకరించి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. -
సినీ ఫక్కీలో హైటెక్ దోపిడీ
హుబ్లీ: హావేరి సమీపంలోని జాతీయ రహదారి–48లో గూడ్స్ లారీలో తరలిస్తున్న రూ.లక్షలు విలువ చేసే వస్తువులను సినీ ఫక్కీలో దోపిడీ చేసిన ఘటన వెలుగు చూసింది. బెంగళూరు నుంచి ధార్వాడ జిల్లా కోలూరా గ్రామంలోని ఫ్లిప్కార్ట్ వేర్హౌస్కు లారీ వెళ్తుండగా ఈ దోపిడీ జరిగింది. సుమారు 6 పెద్ద బాక్సుల్లోని రూ.25 లక్షల విలువ చేసే వస్తువులను దోచుకున్నారు. హవేరి జిల్లా రాణిబెన్నురు తాలూకా కాకోళ గ్రామం నుంచి మోటెబెన్నురు చేరుకునే లోపే దొంగతనం పూర్తి చేశారు. సుమారు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘరానా దోపిడీ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి రాణెబెన్నురు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రహదారి–48 పొడవునా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గూడ్స్ లారీలో రూ.25 లక్షల విలువైన వస్తువులు చోరీ -
అలరించిన క్రీడా మేళా
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వ్యవసాయ విశ్వ విద్యాలయం క్రీడా మైదానంలో క్రీడా మేళాకు శ్రీకారం చుట్టారు. కుస్తీ, శ్వాన ప్రదర్శనలను చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ ప్రారంభించారు. 30 జాతులకు చెందిన వందకు పైగా శునకాలను ప్రదర్శించారు. మహిళల కుస్తీ పోటీలను జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కూమార్ కాందూ పారంభించారు. అనంతరం నిర్వహించిన యక్షగాన ప్రదర్శన ఆకట్టుకుంది. మహిళల దాస సాహిత్య వేదికలో దాసుల, మాద్యమ, ఇతర అంశాలపై చర్చ గోష్టులు నిర్వహించారు. రాక్షస సంహరం పాత్రలో యువకుడు ప్రేక్షకులను అలరించాడు. అనంతరం ఇసుక బస్తాల పోటీలు నిర్వహించారు. కసభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప, డీసీ నితీష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, నగర నభ కమిషనర్ జుబీన్మెహ పాత్రో, బడిగేర, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గురురాఘవునికి ప్రత్యేక పూజలు
బనశంకరి: జయనగర ఐదో బ్లాక్లోని గురు రాఘవేంద్రస్వామి మఠంలో పరమపూజ్య 1008 సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆదేశాల ప్రకారం మఠం సీనియర్ వ్యవస్థాపకుడు ఆర్కే.వాదీంద్రాచార్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు రాఘవేంద్ర స్వామి మఠంలో పంచామృత అభిషేకం, కనకాభిషేకం, ప్రత్యేక అలంకరణ, మహామంగళ హారతి చేపట్టి భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం రథోత్సవం, గజవాహనోత్సవం, అష్టావధానం, ఊయలపూజ, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బావనూపుర నృత్యశాల గురువిదుషీ మీనాక్షీ ప్రసాద్ విద్యార్థుల బృందంచే నృత్యప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుందని నందకిశోర్ ఆచార్ తెలిపారు. -
మంగళకిరణ్కు కృషి పండిత్ అవార్డు
హుబ్లీ: అత్యాధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా తోటి మహిళ రైతులు, అన్నదాతలకు స్ఫూర్తినిస్తూ ఆదర్శంగా నిలిచిన గదగ్ జిల్లా ముళగుంద మహిళ ప్రగతి రైతు మంగళకిరణ నీలగుందకు రాష్ట్ర ప్రభుత్వం కృషి పండిత్ అవార్డు ప్రదానం చేసింది. గురువారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య మేళా–2026 ఉత్పాదానోత్తర వ్యవసాయ–రైతుల సాధికారత కార్యక్రమం జరిగింది. మంగళకిరణ్తో పాటు పలువురు రైతులకు సీఎం సిద్దరామయ్య డీసీఎం డీకే.శివకుమార్ తదితర ప్రముఖులు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంగళకిరణ్ మాట్లాడుతూ.. తనకు అండగా నిలుస్తున్న భర్త కిరణ్ నీలగుంద సహకరాలు మరవలేనివని తెలిపారు. రైతులు స్ఫూర్తి పొంది మేలైన సాగు పద్ధతులు పాటించి తగిన దిగుబడులు సాగిస్తే సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. -
హంపీ ఉత్సవాలకు ఆహ్వానం
హొసపేటె: ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు జరగనున్న హంపీ ఉత్సవాలకు రావాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను విజయనగర జిల్లా అధికారి కవితా ఎస్.మన్నికేరి కోరారు. బెంగళూరులో డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు క్యాబినేట్ మంత్రులు హెచ్కే పాటిల్, శివరాజ్ తంగడిగి, జమీర్ అహమ్మద్తో పాటు తదితర మంత్రులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. మూడు రోజుల పాటు జరగనున్న హంపీ ఉత్సవాలకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. అభివృద్ధి పనులు ప్రారంభం బళ్లారి అర్బన్: బళ్లారి మహానగర పాలక సంస్థ పరిధిలోని 8వ వార్డులో ఉన్న శ్రీరామ ఆలయ అభివృద్ధి పనులు, అంగనవాడీ కేంద్రాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి భూమిపూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రామాంజనేయులు, కాంగ్రెస్ నాయకులు డి.సూరి పరశురాముడు, థియేటర్ శివు, స్థానిక నాయకులు, వెంకటేశులు, ఆంజనేయులు, ఫకీరప్ప, జికే.స్వామి, కేశవులు సనత కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ విఫలం: యువతి ఆత్మహత్యరాయచూరు రూరల్: ప్రేమ విఫలమైందనే కారణంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మాన్వి తాలుకా నీరమాన్వి మండలం సీకల్ తండాకు చెందిన సుమంగళ (21) సింధనూరులో డిగ్రీ చదువుతోంది. సింధనూరులో హాస్టల్ ఉంటూ ఇంటికి రాకపోకలు సాగించేంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు సింధనూరు–బెంగళూరు రైలు మార్గంలో పట్టాలపై సుమంగళ మృతదేహం లభించింది. ప్రేమ విఫలం కావడంతో సుమంగళ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రేమికుడు మోసం చేయడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుమంగళ ఒక ఆడియో మెసేజ్ను సోదరుడికి పంపినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. ఘనంగా ఆంజనేయ స్వామి వార్షికోత్సవం బళ్లారి టౌన్: నగరంలోని విద్యానగర్లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తొలుత ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మహిళలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సేవ ట్రస్ట్ అధ్యక్షుడు వై.భాస్కర్, ఉపాధ్యక్షుడు బోయపాటి విష్ణువర్దన్, పదాధికారులు కొండయ్య, ముత్యాల రాజు, కరణం గాలయ్య, రవిచంద్ర, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీదేవి, మల్లికార్జున, మోహన్దాస్, బసవరాజ్ స్వామి, సీతారామాంజనేయలు, సాయి బాబు తదితరులు పాల్గొన్నారు. శరవేగంగా కొత్త గేట్ల ఏర్పాటు హొసపేటె: తుంగభద్ర జలాశయానికి సంబంధించి కొత్త గేట్ల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఈ 10 క్రస్ట్ గేట్ల ఏర్పాటు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 18వ గేటుఏర్పాటు చేసి 20 రోజులు అయ్యింది. ప్రస్తుతం 1, 4, 11, 17, 19, 20, 24, 27, 28, 33 గేట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. గదగ్, టీబీ డ్యాం తుంగభద్ర ఎస్టేట్ కార్యాలయ ఆవరణంలో గేట్ల తయారీ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 21 గేట్ల నిర్మాణం పూర్తయింది. రెండు గేట్ల నిర్మాణం పురోగతిలో ఉంది. మరో నాలుగు గేట్ల నిర్మాణానికి సంబంధించిన సామగ్రి గదగ్కు చేరుకుందని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. -
స్ట్రాబెర్రీ సాగు.. లాభాలు బాగు
సాక్షి,బళ్లారి: ఒకప్పుడు మనదేశంలో మామిడి, జామ, బొప్పాయి, సపోటా, చీని తదితర పండ్లను సాగు చేసే రైతన్నలు ఇటీవల విదేశీ పండ్ల సాగుపై కూడా ఆసక్తి పెంచుకుని, ఆ దిశగా అడుగులు వేస్తూ సఫలీకృతం అవుతున్నారు. మారుతున్న కాలానుగుణంగా, ఆహారపు అలవాట్లు మారిపోవడంతో పాటు శారీరక శ్రమ లేకపోవడంతో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఇటీవల ఆరోగ్యాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తుండటంతో పాటు మళ్లీ ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు. మంచి ఆహారంతో పాటు వివిధ రకాల పండ్లను తినాలని వైద్యులు సూచిస్తున్న తరుణంలో పండ్లను తినేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కరోనా తర్వాత మన దేశంలో పండించే పండ్లే కాకుండా విదేశాల్లో పండించే పండ్లకు బాగా డిమాండ్ పెరిగింది. మన దేశంలో పండించే ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ పొరుగింటి పుల్లకూర భలే రుచి అన్నట్లుగా మన దేశంలో విదేశీ పండ్లకు భలే డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు మాల్స్, సూపర్ మార్కెట్లలో మాత్రమే దొరికే విదేశీ పండ్లు ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో రోడ్ల పక్కన కూడా అమ్ముతున్నారంటే వాటికి ఏమేరకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. టమాటా పంట తరహాలో స్ట్రాబెర్రీ సాగు టమాటా పంట తరహాలో స్ట్రాబెర్రీ నారు నాటిన రెండు నెలలకే పండ్ల దిగుబడి ప్రారంభం అవుతుంది. ఈసందర్భంగా రైతు వైజనాథ్ సాక్షితో మాట్లాడుతూ విదేశాల్లో పండించే స్ట్రాబెర్రీ తమ ప్రాంతంలో ఎందుకు పండించకూడదనే ఉద్దేశ్యంతో ప్రయత్నం చేశానన్నారు. తన రెండు ఎకరాల పొలంలో స్ట్రాబెర్రీ సాగుపై దృష్టి సారించానన్నారు. మహారాష్ట్రలోని మహాబళేశ్వర ప్రాంతంలో పండిస్తున్న స్ట్రాబెర్రీని మన ప్రాంతంలో పండించాలని ఆలోచన చేసి, అక్కడికి వెళ్లి పరిశీలించి పండ్ల తోటల పెంపకంలో మెళకువలు నేర్చుకున్నట్లు తెలిపారు. మహాబళేశ్వర నుంచే స్ట్రాబెర్రీ నారు మొక్కలు తీసుకుని వచ్చి నాటానన్నారు. అక్టోబర్ నెలలో స్ట్రాబెర్రీ మొక్కలను ఒక్కో నారు ధర రూ.10 నుంచి రూ.13 వరకు పలికిందన్నారు. ఒక ఎకరంలో వేలాది మొక్కలు అవసరం అవుతాయన్నారు. నారుతో పాటు మొత్తం పెట్టుబడి ఖర్చు ఒక ఎకరాకు రూ.5 లక్షలు అవుతుందన్నారు. టమాటా పంటను ఏవిధంగా పండిస్తామో అదే తరహాలో చేనులో ముందుగా దుక్కి దున్ని అన్ని విధాలుగా సిద్ధం చేసుకున్న తర్వాత, బోదెలు తీసి, భూమిపై మల్చింగ్ షీటు పరచాలన్నారు. 45 రోజుల నుంచి పండ్ల దిగుబడి షురూ అనంతరం డ్రిప్ సిస్టంతో స్ట్రాబెర్రీ మొక్కలు నాటిన తర్వాత 45 రోజుల నుంచి పండ్ల దిగుబడి రావడం ప్రారంభం అవుతుందన్నారు. రెండో నెల నుంచి పండ్లు కోసి, అమ్మడానికి వీలవుతుందన్నారు. పొలాల్లోనే ప్యాకింగ్ చేసి అమ్ముతామన్నారు. తమ వద్దే ఒక్కో ప్యాకెట్ ధర రూ.20ల వరకు తీసుకెళతారన్నారు. ఈ పంట 8 నెలలు పాటు ఉంటుందన్నారు. పెట్టుబడి పోను ఒక్కో ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. వర్షాకాలంలో ఈ పండ్ల తోటలు సాగు చేస్తే కొంత నష్టం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. వర్షాలు వచ్చినప్పుడు పండ్లు దెబ్బ తింటాయన్నారు. దీంతో స్ట్రాబెర్రీ సాగు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ప్రారంభిస్తే మంచి లాభాలు పొందవచ్చన్నారు. ఈ పంటకు ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉండాలన్నారు. అయితే పంట నష్టపోతే ఎలాంటి బీమా సౌకర్యం లేదన్నారు. ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించి స్ట్రాబెర్రీ పండ్ల తోటల యజమానులకు సహకారం అందిస్తే, ఈ ప్రాంత రైతులు కూడా మరింతగా స్ట్రాబెర్రీ పండించేందుకు వీలవుతుందన్నారు. బీదర్ జిల్లాలో రైతు వైజనాథ్ సాగు చేసిన స్ట్రాబెర్రీ పంట ప్యాకెట్లలో నింపి విక్రయానికి సిద్ధం చేసిన స్ట్రాబెర్రీ పండ్లు విదేశీ పండ్ల పెంపకంపై భారతీయ రైతుల ఆసక్తి బీదర్లో స్ట్రాబెర్రీ సాగుతో లాభాలు గడిస్తున్న రైతు ఉత్తర కర్ణాటకలో ప్రయోగాత్మకంగా పంట సాగు విదేశీ పండ్లలో పోషకాలు మెండు విదేశీ పండ్లలో మంచి పోషకాలు ఉన్నాయని ప్రచారం కూడా ఉండటంతో వాటికి ఎంత ధర అయినా చెల్లించి కొనుగోలు చేస్తుండటంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మన దేశంలో విదేశీ పండ్లకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులు కూడా వాటిని పండించేందుకు సిద్ధం అవుతూ విజయం సాధిస్తున్నారు. విదేశాల నుంచి పండ్ల దిగుమతి కూడా ఏటేటా పెరుగుతోందని లెక్కలు ఉన్నాయి. దీంతో అనువైన భూముల్లో స్థానికంగా రైతులే పండిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. న్యూజీలాండ్, ఇటలీ తదితర దేశాల్లో పండించే కివీ పండ్లకు భలే డిమాండ్ ఉండగా, ఽథాయిలాండ్, వియత్నాం దేశాల్లో పండించే డ్రాగన్ ఫ్రూట్ను మనదేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం స్ట్రాబెర్రీ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తర కర్ణాటక పరిధిలో మొట్టమొదటిసారిగా స్ట్రాబెర్రీ సాగు చేసి ఓ రైతు సక్సెస్ అయ్యారు. బీదర్ జిల్లా కమఠాణ గ్రామానికి చెందిన వైజనాథ్ అనే రైతు రెండు ఎకరాల పొలంలో స్ట్రాబెర్రీ సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. -
నా ముల్లంగి పంటే మీకు లంచం
తుమకూరు: పొలానికి దారి చూపాలని దరఖాస్తు చేసుకున్న రైతు, లంచం ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో తాను పండించిన ముల్లంగి పంటను ఇవ్వడానికి వచ్చాడు. రైతుల దురవస్థకు అద్దం పట్టే ఈ సంఘటన తుమకూరు జిల్లా మధుగిరి తాలూకాఫీసులో జరిగింది. జక్కెనహళ్లి కి చెందిన రైతు ప్రసన్నకుమార్ గురువారం ముల్లంగిలను తీసుకువచ్చి మైక్ పట్టుకుని హల్చల్ చేశాడు. ‘లంచం ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు, బదులుగా, నేను పండించిన ముల్లంగిని ఇస్తాను, రండి, రండి‘ అని గొంతెత్తడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటీ కేసు... రైతు పొలానికి దారి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. లోకాయుక్త కోర్టును ఆశ్రయించగా, నెలలోపు దారి చూపాలని కోర్టు ఆదేశించింది. ఈ పనులు చేయాలంటే తమకు లంచం ఇవ్వాలని కొందరు అధికారులు ఆ రైతును ఒత్తిడి చేశారు. తన వద్ద డబ్బు లేదని, తాను పండించిన ముల్లంగిని నాకు ఇస్తానని హంగామా చేశాడు. వారంలోపు సమస్య పరిష్కారం కాకపోతే, తహశీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటాను అని కేకలు వేశాడు. దారి చూపుతాం దీనిపై రెవెన్యూ అధికారి గోలూరు శివప్ప మాట్లాడుతూ మా అధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాము. అన్నీ సరిగా ఉంటే వారంలోపు దారి చూపుతాం, రైతు ఈ దేశానికి ఆస్తి, అతను చనిపోవడం గురించి మాట్లాడకూడదు అని అన్నారు. మధుగిరి తాలూకాఫీసులో రైతు ఆవేదన పొలానికి దారి చూపాలని వేడుకోలు -
యాక్సిడెంట్లతో పెను ముప్పు
బనశంకరి: బెంగళూరుతో పాటు రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాల సంచారం పెరిగిపోవడంతో, కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో డ్రగ్స్పై జాగృతం చేయనున్నట్లు హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. గురువారం రవాణా, పోలీస్శాఖలు ప్యాలెస్ మైదానంలో నిర్వహించిన జాతీయ రోడ్డు సురక్షతా మాసం ముగింపు కార్యక్రమంలో రవాణా మంత్రి రామలింగారెడ్డి, పరమేశ్వర్ పాల్గొన్నారు. దేశంలో 4.70 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, కర్ణాటకలో 43 వేల ప్రమాదాలు జరిగాయని, వేలాది మంది చనితున్నారని చెప్పారు. మైసూరు–బెంగళూరు ఎక్స్ప్రెస్వేని ప్రారంభించిన రెండు నెలలకే అక్కడ 120 మంది మృత్యువాతపడటం విచారకరమన్నారు. అధికారులు చాలా బ్లాక్స్పాట్లను సరిదిద్దారన్నారు. బెంగళూరులోనూ యాక్సిడెంట్లకు వేలాది మంది బలవుతున్నారు, కుటుంబ పోషకుడు మరణిస్తే వారి గతి ఏం కావాలని ప్రశ్నించారు. బెంగళూరు నగరంలో 500 జంక్షన్లలో 10 వేలకు పైగా ఏఐతో పనిచేసే కెమెరాలను అమర్చామని, కమాండ్ సెంటర్ నుంచి ఏ జంక్షన్లో ఏమి జరుగుతుంది అనేది తనిఖీ చేయవచ్చని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడేవారికి జరిమానా వేయడంతో ఉల్లంఘనలు తగ్గాయన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ బస్సుల్లో మత్తు పదార్థాల ముప్పుపై జాగృతం చేయాలని పరమేశ్వర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దినేశ్గుండూరావ్, డీజీపీ ఎంఏ. సలీం, కమిషనర్ సీమంత్కుమార్సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాక్సిడెంట్లకు గురైన వాహనాలను పరిశీలించారు. హోంమంత్రి పరమేశ్వర్ ఆర్టీసీ బస్సుల్లో డ్రగ్స్పై జాగృతి -
సమాజాభివృద్ధికి విద్య ప్రధానం
రాయచూరు రూరల్ : గురువుల మార్గదర్శనంలో సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధానమని బోవి సమాజం అభివృద్ధి మండలి అధ్యక్షుడు, మాజీ మంత్రి బాబురావు చించనసూరు పేర్కొన్నారు. గురువారం యాదగిరి జిల్లా గురుమఠకల్లో అంబిగర చౌడయ్య విగ్రహావిష్కరణ, అంబిగర చౌడయ్య జయంతి ఉత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజం ఐకమత్యంగా ఉంటే సమస్యలను పరిష్కరించేందుకు సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో యాదగిరి నగరసభ అధ్యక్షురాలు లలిత అనపూరే, అధికారులు, సమాజం నేతలున్నారు. అనుచిత వ్యాఖ్యలు తగదు రాయచూరు రూరల్: విధాన పరిషత్లో సభ్యురాలు ఉమాశ్రీని అవమానించే విధంగా స్పీకర్ బసవరాజ్ హొరట్టి వ్యాఖ్యలు చేయడం ఖండనీయమని చేనేత సహకార సంఘం సంచాలకుడు విజయ్ కుమార్ బాప్రీ ఖండించారు. గురువారం సభా సమయంలో ప్రశ్న అడిగినందుకు లేచి నిలబడి మాట్లాడితే మీరు చలన చిత్రాల్లో మాదిరిగా మాట్లాడడం మానాలని, ఇది వేదిక కాదు, సభా గౌరవాన్ని కాపాడాలని అసభ్యంగా, అవమాన పరిచే విధంగా వ్యాఖ్యానిస్తూ మహిళా సభ్యురాలిని అవమానించిన స్పీకర్ బసవరాజ్ హొరట్టి వెంటనే ఉమాశ్రీకి క్షమాపణ చెప్పాలన్నారు. వ్యక్తిపై పోక్సో కేసు నమోదుహుబ్లీ: మైనర్ బాలిక వ్యక్తిగత చిత్రాన్ని ఇన్స్టాలో వైరల్ చేయడమే కాకుండా లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తిపై నవనగర ఏపీఎంసీ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు.. బాలిక కుటుంబ సభ్యులు ఉపాధి కోసం గోవాకు వెళ్లారు. అక్కడే ఉన్న పొరుగింటి వ్యక్తి గోవాకు చెందిన సద్దాం హుస్సేన్ బాలిక ప్రైవేటు వీడియో తీసుకుని బ్లాక్ మెయిల్ చేసి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మైనర్ బాలికను పదేపదే లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. బాలిక ఫోటోను ఇన్స్టాలో అప్లోడ్ చేయడం కూడా వెలుగు చూసింది. దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. వైభవంగా బసవేశ్వర రథోత్సవంరాయచూరు రూరల్: కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకాలోని పట్టిలజంతిలో బసవేశ్వర జాతర వైభవంగా జరిగింది. బుధవారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిగింది. దేవాలయం వద్ద బసవేశ్వరుడికి కలశారోహణం చేశారు. దేవాలయం వద్ద కలశ కుంభాలతో దేవుడిని పల్లకీలో ఊరేగించారు. లోకాయుక్త వలలో అంగన్వాడీ ఉద్యోగినులురాయచూరు రూరల్: లోకాయుక్త వలలో అంగన్వాడీ ఉద్యోగినులు చిక్కుకున్న ఘటన జరిగింది. కలబుర్గిలోని స్టేషన్ బజార్ అంగన్వాడీ కార్యకర్త హీనా, సూపర్వైజర్ పింకు బాయి గాయక్వాడ్ గత మూడు నెలల నుంచి అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్ల నిధుల చెల్లింపులో రూ.14,490 డిపాజిట్ చేశారు. అయితే రెండు నెలలకు రూ.6 వేల చొప్పున ఇద్దరికి రూ.12 వేలు లంచం ఇవ్వాలని కోడిగుడ్ల సరఫరాదారును డిమాండ్ చేశారు. దీంతో అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త ఎస్పీ సిద్దరాజు దాడి చేసి లంచం తీసుకుంటుండగా వారిద్దరినీ పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. లారీకి బైక్ ఢీ.. ఇద్దరి మృతి కెలమంగలం: నిలిపి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. డెంకణీకోట సమీపంలోని తోగేరి గ్రామానికి చెందిన రామాచారి (36) మిత్రుడు బేళగొండపల్లికి చెందిన మునిరజ్ (37) ఒకే పరిశ్రమలో పని చేస్తున్నారు. బుధవారం రాత్రి సొంత పనిపై ద్విచక్ర వాహనంలో డెంకణీకోటకు వెళ్లారు పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. డెంకణీకోట–తళి రోడ్డులోని హోజూర్ అగ్రహారం వద్ద రోడ్డుపై నిలిపిన లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు.కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
వేమగల్–బెంగళూరు బస్సు సర్వీస్ ప్రారంభం
కోలారు: తాలూకాలోని వేమగల్ ఫిర్కా కేంద్రం నుంచి బెంగళూరుకు బస్సు సర్వీసును గురువారం మాజీ విధాన పరిషత్ సభాపతి వి.ఆర్.సుదర్శన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా కేఎస్ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. మార్చి నెల అనంతరం ఆవశ్యకత ఉన్న ప్రాంతాలకు బస్సులు నడపాలని సూచించారు. రాబోయే రోజుల్లో వేమగల్ నుంచి విజయపుర, యలహంక అంతర్జాతీయ విమానాశ్రయం, విధానసౌధ మార్గంగా బెంగళూరుకు కొత్త బస్సు సర్వీసును ప్రారంభించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తాలూకా గ్యారెంటీ సమితి అధ్యక్షుడు వీ.ఎం.మునియప్ప, వేమగల్ నరసాపుర ప్రాధికార అధ్యక్షుడు ఉరటి అగ్రహార చౌడరెడ్డి, వేమగల్ కురుగల్ పట్టణ పంచాయతీ సభ్యురాలు దీపా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి మృతి హోసూరు: సరుకు తరలిస్తున్న వాహనాన్ని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాయకోట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా ఉళ్లుగురికి గ్రామానికి చెందిన అశోక్ (25) తన మిత్రుడు నల్లరాళ్లపల్లికి చెందిన దిలీప్తో కలిసి బుధవారం ద్విచక్ర వాహనంలో రాయకోట వైపు వెళ్తున్నారు. తిమ్మనహళ్లి వద్ద ముందు వెళ్తున్న సరుకు వాహనాన్ని వీరు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దిలీప్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అశోక్ను స్థానికులు చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాయకోట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గంజాయి స్వాధీనం మాలూరు: గంజాయిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న కేసులో రాష్ట్ర ధ్వని యూట్యూబ్ చానల్ విలేకరి నారాయణ స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.50 వేలు విలువ చేసే 520 గ్రాముల గంజాయి, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాలూకా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు గస్తీ చేపట్టారు. ఆ సమయంలో హొసకోటె నుంచి బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేశారు. వాహనం నడుపుతున్న నిందితుడు వేణుగోపాల్, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో గంజాయిని మడివాళ గ్రామానికి చెందిన యూట్యూబ్ చానల్ విలేకరి నారాయణస్వామి తీసుకుని బొలెరో వాహనంలో తరలిస్తున్నట్లు తెలిసింది. దీంతో యూట్యూబ్ చానల్ విలేకరి నారాయణ స్వామిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీధి కుక్కల దాడిలో పలువురికి గాయాలు మాలూరు: నగరంతో పాటు తాలూకాలోని వివిధ గ్రామాల్లో ఒకే రోజు కుక్కల దాడిలో ఆరుగురు గాయపడ్డారు. ఒకే కుక్క నాలుగు గ్రామాల్లో 5 మందిని కరిచింది. గ్రామస్తులు కుక్కను వెంటాడి చంపేశారు. మాస్తి ఫిర్కా దొడ్డకల్లహళ్లి గ్రామంలో పిచ్చికుక్క కెంపమ్మ, ప్రభాస్లను కరిచి తీవ్రంగా గాయపరిచింది. వీరికి మాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కోలారు ఆర్.ఎల్.జాలప్ప ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా దొడ్డ ఇగ్గలూరు గ్రామంలో కదిరప్ప అనే వ్యక్తిపై కుక్క దాడి చేసి గాయపరిచింది. నెల్లహళ్లి గ్రామంలో ఇంద్రమ్మ, మణిశెట్టిహళ్లి గ్రామంలో దయానంద్ కుక్క దాడిలో గాయపడ్డారు. వీరికి మాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అలానే నగరంలో కూడా ఓ వ్యక్తిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. విరగబూసిన మామిడి పూత హోసూరు: ఈ ఏడాది మామిడి పూత విరగబూసింది. మామిడి సాగులో క్రిష్ణగిరి జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి రైతులు పండించే మామిడి ఉత్పత్తులను దేశవిదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. క్రిష్ణగిరి జిల్లాలో వేలాది హెక్టార్లలో పెద్ద ఎత్తున రైతులు మామిడి సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకపోతే కాపు బాగుంటుందని రైతులు చెబుతున్నారు. గత ఏడాదిగా నష్టపోయిన మామిడి రైతులకు రెండు రోజుల క్రితం క్రిష్ణగిరి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఇన్చార్జ్ మంత్రి పరిహారం అందజేశారు. -
సంబరంగా రాయచూరు హబ్బ
ఊరేగింపులో నరసింహ స్వామి వేషధారణలో కళాకారులు తలపాగాలతో ఊరేగింపులో పాల్గొన్న మహిళలు ఊరేగింపులో పాల్గొన్న పగటివేషధారణ కళాకారులు రాయచూరు రూరల్: నగరంలో మూడు రోజుల పాటు జరుగనున్న రాయచూరు జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పిలుపునిచ్చారు. గురువారం కర్ణాటక సంఘం కార్యాలయం వద్ద ఉత్సవాలకు శ్రీకారం చుట్టి ఆయన మాట్లాడారు. ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాలను ఇంటింటి పండుగలా జరపాలన్నారు. రెండు దశాబ్దాల అనంతరం ఉత్సవాలు నిర్వహిస్తుండడం విశేషమన్నారు. రాయచూరు జిల్లాలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార విచారాలు, విభిన్న సంస్కృతి, కళలకు నిలయంగా మారిన జిల్లా తుంగభద్ర, కృష్ణా నదుల సంగమమని అన్నారు. మహిళా సమాజ్లో కవిగోష్టులు నిర్వహించారు. ఉత్సవాల్లో శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ అరుణాంగ్షు గిరి, నగరసభ కమిషనర్ జుబిన్ మహపాత్రో, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణలున్నారు. వ్యవసాయ మేళా అదుర్స్ గురువారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మేళా– 2026 చూపరులను ఆకట్టుకుంది. జిల్లా ఇన్చార్జి, రాష్ట్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ ప్రారంభించారు. వ్యవసాయ మేళా తోరణం, జొన్నలు, కొర్రలు, సజ్జలు, మినుములు, నువ్వులు, రాగులు, గోధుమ గింజలతో దేశ పటం, వాటర్ షెడ్ నమూనా, మత్స్య మేళా, ఇంటి గార్డెన్ మొక్కలు, ఆవులు, ఇతర ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ దద్దల్, ఆర్డీఏ అధ్యక్షుడు రామస్వామి, పామయ్య మురారి, పవన్ తదితరులున్నారు. జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలి జిల్లా ఇన్చార్జి మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ -
చెరసాలల్లో బదిలీల ప్రయోగం
బనశంకరి: రాష్ట్ర జైళ్లలో ఖైదీలకు అక్రమంగా అందిస్తున్న సౌలభ్యాలు, అవకతవకలను అరికట్టడానికి సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన సిబ్బందిని బదిలీ చేయాలని ఆ శాఖ చీఫ్ అలోక్కుమార్ నిర్ణయించారు. రాష్ట్రంలోని సెంట్రల్, జిల్లా జైళ్లలో, ప్రత్యేకించి పరప్పన అగ్రహార జైలులో కొన్నేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న సిబ్బందిని స్థానభ్రంశం చేయాలని సిద్ధమయ్యారు. అక్కడి జైళ్లు సిబ్బంది డబ్బు తీసుకుని ఖైదీలకు రాచ మర్యాదలు చేస్తున్నారని, మొబైల్ఫోన్లు, మద్యం, గంజాయి వంటివి సరఫరా అవుతున్నాయని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. వీడియోలతో తలనొప్పి ఈ నెల 9 నుంచి కేంద్ర జైళ్ల శాఖ కార్యాలయంలో సిబ్బందికి కౌన్సిలింగ్ చేపట్టి బదిలీలు చేయాలని ముహూర్తం కుదిరింది. పరప్పన జైలులో ఖైదీలు కేక్ కటింగ్లు, మద్యంతో విందులు చేసుకునే వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హత్య కేసు నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ కూడా ఆరుబయట కాఫీ తాగుతూ ఖుషీ చేయడం మీద విమర్శలు వచ్చాయి. ఇతర జైళ్ల నుంచి ఇక్కడకు తాత్కాలికంగా వచ్చిన సిబ్బందితో పాటు స్థానికంగా ఏళ్ల తరబడి ఉండి ఖైదీ ముఠాలకు సహకరిస్తున్న ఉద్యోగులను దూరప్రాంత జైళ్లకు తరలించాలని నిశ్చయమైంది. తద్వారా కారాగారంలో క్రమశిక్షణ కాపాడవచ్చునని అలోక్కుమార్ భావిస్తున్నారు. అవకతవకల కట్టడికి ఆ శాఖ చీఫ్ అలోక్కుమార్ వ్యూహం త్వరలో సిబ్బందికి ట్రాన్స్ఫర్లు -
బడ్జెట్ కూర్పుపై సీఎం చర్చలు
బనశంకరి: శాసనసభ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య రాష్ట్ర బడ్జెట్ తయారీపై కసరత్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి మార్పు గందరగోళం కొంచెం సద్దుమణగగా, సీఎం గురువారం నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. రేస్కోర్సు రోడ్డులోని శక్తిభవన్లో వివిధ శాఖల అధికారులతో సిద్దరామయ్య చర్చించారు. పర్యాటక, ఉద్యానవనశాఖ, గనులు భూవిజ్ఙాన, కార్మికశాఖ, కన్నడ సంస్కృతి, బీసీ సంక్షేమశాఖ, ఉన్నతవిద్యా శాఖ మంత్రులు, అధికారులతో ఆయా శాఖలకు అవసరమైన నిధులు, గతేడాది కేటాయించిన నిధుల వ్యయం తదితరాల గురించి చర్చించారు. నూతన పథకాల గురించి మాట్లాడారు. మార్చి మొదటివారంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. చిరుద్యోగికి రూ.52 లక్షలకు పైగా టోపీ శివమొగ్గ: పూజా గౌడ పేరుతో సోషల్ మీడియా ద్వారా నగర సేల్స్మ్యాన్ను వలలో వేసుకున్న ఆన్లైన్ మోసగాళ్లు రూ.52,93,646 ను వసూలు చేశారు. వివరాలు.. ఓ షాపులో పనిచేసే వ్యక్తికి పూజా గౌడ పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఓ లింక్ను పంపించారు. మోసగాళ్ల మాటలను నమ్మిన వ్యక్తి లింక్ నొక్కి ఆన్లైన్ స్టోర్లో సభ్యుడు అయ్యాడు. వస్తువులను ఆర్డర్ చేసేకొద్దీ అధిక లాభాలు ఇస్తామని అతనికి చెప్పారు. మొదట్లో కొన్ని ఆర్డర్లు చేయించి లాభం వచ్చినట్లు చూపించారు. తరువాత నువ్వే పెట్టుబడి పెడితే దండిగా సంపాదించవచ్చని నమ్మించారు. అలా పలు వారాలలో రూ.52.93 లక్షలను దుండగుల ఖాతాలకు బదిలీ చేశాడు. కొన్నాళ్లకు డబ్బును విత్డ్రా చేసుకోవాలని యత్నించగా, ఏవో కారణాలను చూపుతూ దానిని బ్లాక్ చేశారు. పన్ను, జరిమానా పేరుతో మరింత డబ్బును డిమాండ్ చేశారు. కానీ రూపాయి కూడా తిరిగి రాకపోవడంతో ముంచేశారని ఆలస్యంగా గ్రహించాడు. ఆ సేల్స్మ్యాన్ శివమొగ్గలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మద్యం స్కాంలో మంత్రి దిగిపోవాలి శివమొగ్గ: ఎకై ్సజ్ శాఖలో లంచం, బదిలీల కుంభకోణం, భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ జేడీఎస్, బీజేపీ కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. ఎకై ్సజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపుర రాజీనామా చేయాలని గురువారం శివమొగ్గలోని శివప్ప నాయక సర్కిల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఎస్ఎన్ చన్నబసప్ప పాల్గొన్నారు. అవినీతిని నిరూపించడానికి డాక్యుమెంట్లు కావాలా?, గతంలో మంత్రి ఈశ్వరప్పపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేశారు, అప్పుడు ఆయన ఆధారాలు అడిగారా? ఇప్పుడు మా వంతు వచ్చింది అని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు గుణపాఠం నేర్పుతారని అన్నారు. కాన్సులేట్లకు బాంబు బెదిరింపుయశవంతపుర: బెంగళూరులో పలు విదేశీ కార్యాలయాలకు బాంబు బెదిరింపు వచ్చింది. హలసూరులోని ఇటలీ, జపాన్ కాన్సులేట్లకు బాంబులు పెట్టామని ఈ మెయిళ్లు వచ్చాయి. దీంతో హడావుడిగా తనిఖీలు చేయగా ఏమీ దొరకలేదు. ఆఫీసుల సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మెట్రో రైలులో చార్జీల బాదుడు
బనశంకరి: బెంగళూరు మెట్రో రైళ్ల టికెట్ రేట్లను 5 శాతం పెంచుతూ బీఎంఆర్సీఎల్ గురువారం ఆదేశాలు జారీచేసింది. 9వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి. గత ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన 101.5 శాతం చార్జీలను పెంచడంతో అన్నివర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో వెంటనే 71.5 శాతానికి తగ్గించింది. మెట్రో ధరల నిర్ణాయక కమిటీ సిఫార్సుల ప్రకారం ఇప్పుడు మళ్లీ 5 శాతం చార్జీలను బాదుతూ అధికారిక ఉత్తర్వులు ఇవ్వడంతో రోజువారీ ప్రయాణికులు, నగరవాసులు హడలిపోయారు. మెట్రో చార్జీలు కనీసం రూ.1 నుంచి గరిష్టంగా రూ.5 వరకు పెరిగాయి. 2023–24తో పోలిస్తే 2024–25లో మెట్రో సంస్థ నిర్వహణ వ్యయం 10.20 శాతం పెరిగిట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇది చాలా ఎక్కువేనని, కానీ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా టికెట్ ధర పెంపును 5 శాతానికి పరిమితం చేసినట్లు బీఎంఆర్సీఎల్ చెప్పడం గమనార్హం. 2017లో పెంపు తరువాత గత ఏడాది మెట్రో టికెట్ ధరలను భారీగా విస్తరించారు. అది ఒకేసారి 100 శాతం కావడంతో ప్రజలతో పాటు అన్ని పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెంపునకు మీరంటే మీరు కారణమని కాంగ్రెస్, బీజేపీ నాయకులు మెట్రో స్టేషన్ల వద్ద ధర్నాలు చేయడం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఆందోళనలకు సిద్ధమైనట్లు తెలిసింది. చార్జీలను సవరిస్తే మెట్రో స్టేషన్ వద్ద బైఠాయిస్తానని ఇటీవల నగర బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రకటించడం తెలిసిందే. చార్జీల పెంపుతో మాకు సంబంధం లేదని రాష్ట్ర సీఎం, డీసీఎంలు గతంలో ప్రకటించారు. చివరకు ప్రజల నెత్తిన మాత్రం భారం పడుతోంది. సోషల్ మీడియాలో చార్జీల బాదుడుపై తీవ్ర ఆక్రోశం వ్యక్తమౌతోంది. అనుకున్నట్లే 5 శాతం పెంపు ఈ నెల 9 నుంచి అమల్లోకి నిర్వహణా వ్యయం నెపం ప్రయాణికులపై మరింత భారం పెంచాక ఇలా... 2 కిలోమీటర్ల కంటే తక్కువ దూరమైతే రూ.10 ఉన్న చార్జీ రూ.11 అవుతుంది. 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరమైతే రూ.90 ఉన్న టికెట్ ధర రూ.95 కానుంది. చార్జీల పెంపు వన్ డే, త్రీ డే, ఐదు రోజుల పాస్లతో పాటు ప్రవాసీ కార్డులు, గ్రూప్ టికెట్లకు వర్తిస్తుందని బీఎంఆర్సీఎల్ తెలిపింది. కొన్ని కార్డులకు ఉన్న రాయితీలు కొనసాగుతాయని పేర్కొంది. తక్కువే పెంచారట.. గతంలో 100 శాతం బాది.. -
సావిత్రిబాయి పూలే సేవలు ఆదర్శం
కోలారు: సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు నిబద్ధతతో విధులు నిర్వహించి విద్యాశాఖకు మంచి పేరు తీసుకు రావాలని జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు జీ.సురేష్ బాబు సూచించారు. గురువారం నగరంలోని కేఈబీ సముదాయ భవనంలో 70 మంది ఉపాధ్యాయులకు సావిత్రిబాయి పూలే అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అన్ని స్థానాల కంటే ఉపాధ్యాయ వృత్తికి ప్రాధాన్యత ఉందన్నారు. ఉపాధ్యాయ గెళెయర బళగ అధ్యక్షుడు నారాయణస్వామి మాట్లాడుతూ.. ఈ మధ్య బాల్య వివాహాలు అధికంగా జరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. చదువుకునే వయస్సులో పిల్లలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. చదివే పిల్లలను బడికి పంపి వారిని ప్రోత్సహించాలని సూచించారు. బాల్య వివాహాల విషయంలో పోషకులు, ఉపాధ్యాయులు జాగృతులై ఉండాలన్నారు. -
అన్నదాత ఆత్మహత్య
● ఫైనాన్స్ వేధింపులే కారణం యశవంతపుర: ఫైనాన్స్లో తీసుకున్న అప్పు కట్టనందుకు ఇంటిని సీజ్ చేస్తామని బెదిరించడంతో రైతన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన హాసన్ జిల్లా శ్రవణ బెళగోళ తాలూకా కొత్తనఘట్ట గ్రామంలో జరిగింది. వివరాలు.. రైతు యోగేశ్ (50) చన్నరాయపట్టణలోని ఫైనాన్స్ సంస్థలో రూ.7 లక్షల రుణం తీసుకున్నాడు. నెల నెలా తప్పక కంతు కడుతుండేవాడు, అయితే ఇబ్బందులు రావడంతో 2 నెలలుగా చెల్లించలేకపోయాడు. 4న యోగేశ్ ఇంటికి వెళ్లిన ఇద్దరు ఫైనాన్స్ ఉద్యోగులు.. అప్పు కట్టలేదని కాబట్టి నీ ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. అవమాన భారం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనాన్స్ల ఆగడాలపై కుటుంబీకులు, గ్రామస్థులు అక్రోశం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
వీడిన వాసవీ స్వగృహ హోంనీడ్స్ మిస్టరీ
బళ్లారి అర్బన్: బళ్లారి నగరంలోని బ్రూస్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భారీ మోసం కేసు మిస్టరీని పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం రూ.162 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 2025 ఏప్రిల్ 2న బ్రూస్పేట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా 2025 ఏప్రిల్ 3న నిందితుల నుంచి రూ.19.38 లక్షల నగదును, అనంతరం 2025 ఏప్రిల్ 11న మరోసారి రూ.95 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాల పరిశీలనలో రూ.5 లక్షల నగదును ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన డీ పన్నేకర్ మార్గదర్శకత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీలు రవికుమార్, ఎస్.నవీన్ కుమార్, నగర ఉపవిభాగ డీఎస్పీ చంద్రకాంత్ నందారెడ్డి నేతృత్వంలో బ్రూస్పేట పోలీసు స్టేషన్ పీఐ మహంతేష్ సహా పోలీసు సిబ్బంది గాలింపు చేపట్టారు. ఒంగోలులో నిందితుల పట్టివేత పరారీలో ఉన్న టి.విశ్వనాథ్, అతని భార్య విశాలాక్షి, కుమారుడు విష్ణువర్ధన్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నట్లు సమాచారం అందడంతో గత నెల 26న మధ్యాహ్నం ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం జనవరి 27న కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని జుడీషియల్ కస్టడీకి తరలించారు. తదుపరి విచారణలో ప్రధాన నిందితుడు టి. విశ్వనాథ్ నుంచి గతనెల 29న రూ.37.39 లక్షల నగదు, 531.15 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం రూ.162 కోట్లకు పైగా నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని సంబంధిత కోర్టుకు నివేదిక సమర్పించినట్లు పోలీసు శాఖ వెల్లడించింది. ప్రధాన నిందితుడిని తదుపరి చర్యల కోసం మళ్లీ జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపింది. కుటుంబ సభ్యులతో సహా ప్రధాన నిందితుడు విశ్వనాథ్ అరెస్టు రూ.162 కోట్లకు పైగా నగదు, బంగారం స్వాధీనం -
నేటి నుంచి జిల్లా ఉత్సవాలు
రాయచూరు రూరల్: జిల్లా కేంద్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు రాయచూరు జిల్లా ఉత్సవాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శ్రీకారం చుడతారని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాల జ్యోతియాత్ర, రథయాత్రలు సాయంత్రం కర్ణాటక సంఘం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. వ్యవసాయ వర్సిటీలో వేదికలపై ఉత్సవాలకు శ్రీకారం చుడతారన్నారు. జిల్లాలోని లింగసూగూరు, దేవదుర్గ, మాన్వి, సింధనూరు, ముదగల్, మస్కి, సిరవార, కవితాళ, హట్టి ప్రాంతాల నుంచి లక్ష మంది పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, బోసురాజ్, శాసన సభ్యులు పాల్గొంటారని తెలిపారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణలున్నారు. జిల్లా ఉత్సవాలకు గట్టి పోలీస్ బందోబస్తు గురువారం నుంచి మూడు రోజుల పాటు రాయచూరు జిల్లా ఉత్సవాలకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అరుణాంగ్షు గిరి తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాలు వ్యవసాయ విశ్వ విద్యాలయంలో వేదిక వద్ద ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. 150సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారన్నారు. 8 మంది సీఐలు, 16 మంది ఎస్ఐలు, మూడు కేఆర్పీఎస్ బెటాలియన్, 500 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డులను నియమించారు. మూడు రోజుల పాటు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. శ్రీకారం చుట్టనున్న డీసీఎం -
రోడ్డుపై చెత్త పారేస్తే ఖబడ్దార్.!
సాక్షి,బళ్లారి: నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తోడు నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో డబ్బులు గుంజడంపై పలు ఆస్పత్రి యాజమాన్యాలు దృష్టి సారిస్తున్నారే కాని స్వచ్ఛత గురించి పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి ముందే చెత్తా చెదారం వేస్తూ నగర స్వచ్ఛతకు తీవ్ర అడ్డంకి కలిగిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై పాలికె తగిన బుద్ధి చెప్పింది. ప్రతి రోజు ఆస్పత్రి ముందు చెత్త వేస్తూ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో పాలికె సిబ్బంది వాహనాల్లో చెత్త తీసుకొచ్చి వారి ఆస్పత్రుల ముందు మరింత చెత్త వేసి ఆస్పత్రి తీరును ఎండగట్టారు. నగరంలోని పార్వతీ నగర్లోని పద్మావతి కిడ్నీ కేర్ ఆస్పత్రి, బసవేశ్వరనగర్ రోడ్డులోని శాంతాసీతారాం ద్వారకా ఆస్పత్రి సిబ్బంది ప్రతి రోజు వారి ఆస్పత్రుల ఎదుట రోడ్డులో ఎక్కడబడితే అక్కడ చెత్తను పారవేసి చేతులు దులుపుకుంటుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అపరిశుభ్రతపై నగరవాసుల బేజారు ఇది స్టీల్ సిటీనా లేక చెత్త సిటీనా అన్న విధంగా నగర వాసులు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. పాలికె సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో బుధవారం మహానగర పాలికె మేయర్ గాదెప్ప, పాలికె కమిషనర్ మంజునాథ్ దిశానిర్దేశంతో పాలికె సిబ్బంది ఆయా ఆస్పత్రులు ముందు చెత్తాచెదారం వేసి ఆస్పత్రి యాజమాన్యానికి కళ్లు తెరిపించారు. నగరంలో ఏ ఆస్పత్రి అయినా, ఇళ్ల ముందు అయినా పదే పదే రోడ్డులో చెత్తా చెదారం వేస్తే పాలికె నుంచి పెద్ద పెద్ద వాహనాల్లో వారి ఇళ్లు, ఆస్పత్రులు ముందు తామే చెత్తాచెదారం వేస్తామని, అప్పుడు వారికి ఆ బాధ తెలిసి వస్తుందన్నారు. నగర స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే స్వచ్ఛత కాపాడుకునేందుకు వీలవుతుందన్నారు. ఎవరికి వారు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తే స్వచ్ఛత కాపాడేందుకు వీలుకాదన్నారు. పరిశుభ్రతను పట్టించుకోని ఆస్పత్రుల ముందు చెత్త పారేసిన వైనం నగర స్వచ్ఛతకు సహకరించాలని పాలికె యంత్రాంగం మనవి -
టూరిస్టు బస్సు బోల్తా
హొసపేటె: పొరుగున ఉన్న కేరళ రాష్ట్రం విద్యార్థులు బస్సులో హంపీ వీక్షణకు వస్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన బుధవారం విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో జాతీయ రహదారిపై జరిగింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లా గురువాయూర్లోని శ్రీకృష్ణ కళాశాలకు చెందిన ఒక ప్రొఫెసర్, 10 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, విద్యార్థినులతో కలిసి హంపీ, దాండేలి, గోకర్ణకు విహారయాత్రకు వెళ్లారు. వారు మంగళవారం ఉదయం 10 గంటలకు గురువాయూర్ నుంచి రైలులో బయలుదేరి మంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు బస్సులో హంపీకి బయలుదేరారు. డ్రైవర్ అదుపు తప్పి బస్సు ఉదయం 5 గంటల ప్రాంతంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో ప్రొఫెసర్ లక్ష్మి కాలుకు తీవ్ర గాయమైంది. అతుల్య, అవని, అతుల్, అజయ్రాజ్, అనుగ్రహ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారికి కూడ్లిగి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బళ్లారిలోని బీఎంసీఆర్సీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఐదుగురికి తీవ్ర గాయాలు త్రుటిలో తప్పిన ప్రమాదం -
వికటించిన మధ్యాహ్న భోజనం
రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా జమలాపూర్లో చోటు చేసుకుంది. సమాచారం అందగానే బీదర్ జిల్లాధికారి శిల్పాశర్మ హుటా హుటిన ఆస్పత్రిలో చేరిన విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులు వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో అధికారులపై మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు అధికంగా తాలూకాలో జరిగాయని ఔరాద్ శాసన సభ్యుడు ప్రభు చౌహాన్ ఆరోపించారు. జిల్లా, తాలూకా విద్యాశాఖాధికారులు, అక్షర దాసోహ అధికారులు విధి నిర్వహణలో చేస్తున్న అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల క్షేమ సమాచారాన్ని విచారించారు. వారి వెంట జెడ్పీ అధికారి గిరీష్ బదోలె, తహసీల్దార్ మహేష్ పాటిల్, ఆరోగ్య అధికారిణి గాయత్రిలున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత -
నేత్రపర్వంగా కార్ణికోత్సవం
సాక్షి,బళ్లారి: సాక్షాత్తు శివుడు స్వయంభువుగా వెలసిన ప్రతీతి కలిగిన ఏళుకోటి మైలార లింగేశ్వర జాతర, కార్ణిక మహోత్సవం కన్నుల పండువగా జరిగాయి. గత నెల 26వ తేదీన మాఘ సప్తమి రోజున ప్రారంభమైన మైలార లింగేశ్వర జాతర బుధవారం డెంకనమరడిలో మైలార లింగేశ్వర కార్ణికోత్సవంతో ముగిసింది. 11 రోజుల పాటు కఠిన ఉపవాసాలతో దీక్షను ఆచరించిన మైలార లింగేశ్వర స్వామి భక్తుడు, గొరవయ్య ‘సంపాయితలె పరాక్’ అని దైవ వాక్కు వినిపించారు. ఈ దైవ వాక్కును వినడానికి లక్షలాది మంది భక్తులు విచ్చేశారు. ప్రతి ఏటా మాదిరిగా మాఘ పౌర్ణమి అనంతరం రెండు రోజులకు ఆనవాయితీగా ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హూవినహడగలి తాలూకా మైలారలో వెలసిన ఏళుకోటి మైలార లింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ప్రతి ఏటా మాదిరిగా కార్ణిక మహోత్సవం నిర్వహించారు. జాతర మహోత్సవంలో భాగంగా ప్రముఖ ఘట్టమైన కార్ణికోత్సవానికి గొరవయ్య ఉపవాసం ఉండి దైవ వాక్కు వినిపించారు. కార్ణికం అంటే భవిష్య వాణి కార్ణికం అంటే భవిష్యత్తులో జరిగే సంఘటనలు సాక్షాత్తు శివుడే తెలుపుతారని భక్తుల్లో నమ్మకం ఉంది. కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మైలార లింగేశ్వర స్వామి భక్తుడు గొరవయ్య ఎంతో నిష్టతో దాదాపు వారం రోజులకు పైగా ఉపవాసం ఉండి ఓ విల్లుపైకి ఎక్కి దైవవాణి వినిపించారు. ఈ కార్ణిక మహోత్సవాన్ని లక్షలాది మంది భక్తులు తిలకించారు. ఎటు చూసినా జనసంద్రమే గొరవయ్య భవిష్యవాణిని వినడానికి ప్రజాప్రతినిధులు, జిల్లాధికారి, ఎస్పీతో పాటు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలతో ఎటుచూసినా మైలారలోని డెంకణమరడి జనసంద్రంగా కనిపించింది. సాక్షాత్తు పరమేశ్వరుడు మైలారలో మైలార లింగేశ్వర స్వామిగా అవతరించి భక్తులకు దర్శనం ఇస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు మైలారకు తరలివచ్చారు. మైలారలో భక్తులందరూ ఏళుకోటి మైలార లింగేశ్వర అంటూ నామస్మరణ చేశారు. డెంకనమరడిలో కార్ణికం వినడానికి ముందు పక్కనే మైలారలో ఏళుకోటి మైలారలింగేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోకి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని గట్టి బందోబస్తు నిర్వహించారు. గొరవయ్య దైవవాణి సంపాయితలె పరాక్ డెంకనమరడిలో కిక్కిరిసిన భక్తజన సందోహం ఏళుకోటి మైలార లింగేశ్వర అని నినదించిన భక్తులు -
బెంగళూరులో కుంగిన రోడ్డు
సాక్షి బెంగళూరు: బెంగళూరు ప్రధాన రహదారుల్లో ఒకటైన బెంగళూరు–హోసూరు జాతీయ రహదారిలో నేల కుంగిపోయింది. ఆ ప్రదేశంలో వాహనాలు లేకపోవడంతో ప్రాణహాని తప్పింది, అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బుధవారం రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగా పాత చందాపుర వద్ద సుమారు 20 అడుగుల లోతుకు భూమి కుంగిపోయింది. దీంతో వాహనదారులు భయపడిపోయారు. చందాపుర నుంచి తమిళనాడు సరిహద్దు అత్తిబెలె వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పాత చందాపుర వద్ద హైవే అథారిటీ ద్వారా అండర్ పాస్ పనులు జరుగుతున్నాయి. సమీప కాలనీల నుంచి వస్తున్న మురుగునీరు అడుగు భాగంలోకి వచ్చి చేరడంతో మట్టి మెత్తబడి ఇలా జరిగిందని చెబుతున్నారు. నాసిరకంగా పనులు చేయడమే కారణమని వాహనదారులు ఆరోపించారు. భారీగా ట్రాఫిక్ జాం -
27 నుంచి ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు
కదిరి టౌన్: కోరి కొలిచిన భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న ఖాద్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలు మార్చి 13వ తేదీ మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి బ్రహ్మోత్సవాల వివరాలను బుధవారం విలేకరులకు తెలిపారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఈనెల 27వ తేదీ (శుక్రవారం) రాత్రి ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 28వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి శ్రీవారి కల్యాణోత్సవం ఉంటుంది. మార్చి 1వ తేదీ హంస వాహనం, 2న సింహ వాహన సేవలు, 3న హనుమంతవాహనం, 4న బ్రహ్మగరుడసేవ, 5న శేష వాహనం, 6వ తేదీ ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ. 7న మోహినీఉత్సవం. 8న ప్రజాగరుడసేవ, 9న గజవాహనం, 10వ తేదీన కీలకమైన బ్రహ్మరథోత్సవం, 11న అలుకోత్సవం, అశ్వవాహన సేవ, 12వ తేదీన తీర్థవాది. 13వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. భక్తులు అందరూ పాల్గొని శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు. -
వైభవంగా హిందూ సమాజోత్సవం
కేజీఎఫ్ : ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తాలూకాలోని క్యాసంబళ్లిలో హిందూ సమాజోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు గ్రామంలో శోభాయాత్రను జరిపారు. వేదికపై కార్యక్రమాన్ని ప్రారంభించి శివాచార్య మహాస్వామి మాట్లాడుతూ దేశంపై అనేక దాడులు జరిగినా ఇంతవరకు హిందూ ధర్మం చెక్కు చెదరకుండా, దేశం ఇంకా సదృఢంగా ఉందన్నారు. దేశంలో అధికమైన చొరబాట్లను అడ్డుకోవడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కుల వ్యవస్థ వల్ల ధర్మానికి భంగం వాటిల్లక ముందే అందరం జాగృతమై సంఘటితం కావాలన్నారు. స్వదేశీ జాగరణ మంచ్ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ క్షత్రియ సంఘటకుడు కె జగదీష్ మాట్లాడుతూ భారతీయులు దేశ అభివృద్ధి, పంచ పరివర్తన అంశాలైన సంరక్షణ, సామాజిక సామరస్యం, పరిసర నాగరిక క్రమశిక్షణ, స్వదేశీ చింతనలు అలవర్చుకోవాలన్నారు. మాజీ ఎంపీ ఎస్ మునిస్వామి, మాజీ ఎమ్మెల్యే వై సంపంగి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు ఉద్యోగం దండగ.. ఎగ్రైస్ అమ్ముకోవడం మేలు
రాయచూరు రూరల్: ఒక్కరోజు కూడా సెలవు దొరకదు, ఈ ఉద్యోగం చేయడం కంటే ఎక్కడైనా ఎగ్రైస్ బండి పెట్టుకొని బతకడం మంచిది.. అని వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడో పోలీసు. దీంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా రచ్చకు కారణమైంది. కొప్పళ జిల్లా కుష్టిగి తాలుకా హనుమ సాగర్ పోలీస్స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ బ్రహ్మానంద వ్యవహారం చర్చ రేకెత్తిస్తోంది. పోలీసుగా సంవత్సరంలో 365 రోజూ పనిచేయాలి. సెలవు అనేదే ఉండదు, తీవ్రమైన పని ఒత్తిడి.. అని స్టేటస్లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ స్టేటస్ను చూసిన కొందరు స్క్రీన్షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మంగళవారం నుంచి వైరల్ అయ్యింది. దీంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు బ్రహ్మానందపై గరం అయ్యారు. డీజీపీ ప్రకటనను ప్రస్తావిస్తూ.. బ్రహ్మానంద అంతటితో ఊరుకోలేదు. త్వరలో రాష్ట్రంలో 8,300 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేస్తామని డీజీపీ ఎంఏ సలీం చేసిన ప్రకటనను కూడా ప్రస్తావించాడు. యువతీ యువకుల్లారా.. పోలీసైతే మీ బతుకూ ఇంతేనన్నట్లు స్పందించాడు. వీలైతే మరో ఉద్యోగం చూసుకోండి అని సలహా ఇచ్చాడు. అతనితో మాట్లాడా: జిల్లా ఎస్పీ ఈ నేపథ్యంలో బ్రహ్మానందపై జిల్లా ఎస్పీ ఎల్.రాం అరసిద్ది విచారణకు ఆదేశించారు. నేను అతనితో మాట్లాడాను, ఉద్యోగంలో ఉంటూ ఇటువంటి పోస్టులు పెట్టరాదని తెలిపాను, అతనిని వేధించారా?, ఒత్తిళ్లకు గురిచేశారా? అని అక్కడి ఎస్ఐను కూడా ప్రశ్నించానని ఎస్పీ తెలిపారు. 365 రోజులూ చాకిరీ చేయాలి కొప్పళ జిల్లాలో ఓ కానిస్టేబుల్ పోస్టులు -
కుంగిపోయా.. క్షమించండి
● డెత్నోట్లో రాసిన సీజే రాయ్? బనశంకరి: కాన్ఫిడెంట్ గ్రూప్ అధినేత, రియల్టర్ సీజే.రాయ్ ఆత్మహత్యకు ముందు 12 పేజీల డెత్నోట్ రాసినట్లు తెలిసింది. కంపెనీ ఉద్యోగులను తొలగించరాదని అందులో కుటుంబసభ్యులను కోరడం విశేషం. వ్యక్తిగతంగా, మానసికంగా కుంగిపోయానని, దీంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నానని, క్షమించాలని లేఖలో ప్రస్తావించారు. తమ కంపెనీల్లో ఎవరెవరు ఏ బాధ్యతల్లో ఉండాలనేది రాశారు. ఎవరి నుంచి ఎంత డబ్బు రావాలి అనేది కూడా తెలిపారు. సుదీర్ఘమైన లేఖను బట్టి ఆయన ఐటీ అధికారుల విచారణ విరామంలో కాకుండా, కొన్నిరోజుల ముందే రాసిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఐటీ అధికారుల వాంగ్మూలం నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఎలాంటి డెత్నోట్ లభించలేదని చెప్పారు. సిట్ దర్యాప్తు చేస్తుందని, నివేదిక వచ్చాక సీజే.రాయ్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణం తెలుస్తుందని అన్నారు. ఐటీ అధికారులను సిట్ విచారించి వాంగ్మూలం నమోదు చేసుకుందని తెలిపారు. పెంపుడు కుక్కలను కట్టడి చేయలేరా?: హైకోర్టు దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో కుక్కలను పెంచుకుంటున్న వారు తమ కుక్కలను కట్టడి చేయలేకపోవడం వల్ల జనంపై దాడులు ఎక్కువయ్యాయని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బెంగళూరులో ఒక వ్యక్తి పెంపుడు కుక్కను తీసుకువచ్చి మరో ఇంటి ముందు మలమూత్ర విసర్జన చేయించడంతో ఆ ఇంటివారు గొడవ చేశారు. ఇరువర్గాలూ అమృతహళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నాయి. దీనిపై కుక్క యజమాని హైకోర్టును ఆశ్రయించాడు. విచారించిన కోర్టు.. యజమానిపై కేసు వద్దని స్టే విధించింది. ఇలాంటి రభస ఎక్కువ అవుతోందని జడ్జి నాగప్రసన్న అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరు – పూణె హైస్పీడ్ రైలు యోచన యశవంతపుర: కేంద్రం నుంచి కర్ణాటకకు మరి కొన్ని హైస్పీడ్ రైలు కారిడార్ను తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి చెప్పారు. బెంగళూరు– పూణె నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా సమ్మతించారన్నారు. -
పెట్టుబడులంటూ రూ.61 లక్షల మస్కా
శివమొగ్గ: నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్లో వచ్చిన ప్రకటనను నమ్మి రూ.61 లక్షలను పోగొట్టుకున్నాడు. వివరాలు.. బాధితుడు ఫేస్బుక్ను చూస్తుండగా ఎల్ఎఫ్ వర్క్ కంపెనీ అనే ప్రకటన వచ్చింది. అందులో బంగారు, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు ఇస్తామని నమ్మబలికారు. ఆ ప్రలోభానికి లొంగిన బాధితుడు వంచకులు ఇచ్చిన లింక్ ద్వారా ఓ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాడు. వెంటనే అతడు ఎల్జీ (ఎల్ఎఫ్– వర్క్) 4988 అఫిషియల్ గ్రూప్ అనే వాట్సప్ గ్రూప్లోకి జతయ్యాడు. యాప్లో అడిగిన పేరు, చిరునామా, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలను భర్తీ చేసిన తర్వాత వంచకులు అతనికి పలు యూపీఐ ఐడీలను ఇచ్చి నగదు బదిలీ చేయాలని కోరారు. అలా దశల వారీగా రూ.61 లక్షలను బాధితుడి వద్ద నుంచి బదిలీ చేయించుకుని బ్లాక్ చేయడంతో మోసపోయానని శివమొగ్గ సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. మహిళలకు రూ.12.80 లక్షల వంచన మైసూరు: దుస్తుల డిజైనింగ్లో శిక్షణ ఇస్తామని ప్రలోభపెట్టి 8 మంది మహిళలకు రూ.12.80 లక్షలు టోపీ వేశారు. కువెంపునగర పరిధిలోని దేవాంశ్ బోటిక్, రెంటల్ సంస్థ యజమాని సునందమాల, బాలబొమ్మలపై కేసు నమోదైంది. వీరిద్దరూ కలిసి నవ్య, జ్యోతి, రక్షిత, శ్యామల, శృతి, మల్లేశ్వరి, ఉషా అనేవారిని మోసగించారు. డిజైనింగ్ బోటిక్ శిక్షణ ఇస్తామని రూ.12.80 లక్షలను వసూలు చేసి ముఖం చాటేశారు. ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని, డబ్బు ఇప్పించాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివమొగ్గలో సైబర్ నేరం -
పోస్టర్ విడుదల
హుబ్లీ: నిరాశ్రయులకు ముఖ్యంగా నానా రోగాలు, ఎన్నో సమస్యలతో వీధి పాలైన నిర్భాగ్యులకు పట్టెడన్నం పెట్టి సేద తీర్చే కరియప్ప శిరహట్టి, సునంద దంపతులు నగరంలో మరింతగా తమ సేవలను విస్తరించడానికి కృషి చేస్తున్నారు. తాజాగా గదగ్ జిల్లా లక్ష్మేశ్వరలో కూడా శివాజీ అన్న జోళిగె పేరుతో నిర్భాగ్యులకు, ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టడానికి ఓ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం ప్రముఖులు, దాతలు తదితరుల సహాయాన్ని ఈ దంపతులు అర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని చంద్రనాథ్నగర్లో స్థానిక ప్రముఖులు రాఘవేంద్ర బోగి పరివార్ నుంచి పోస్టర్ను ఆవిష్కరింపచేశారు. కరియప్ప మాట్లాడుతూ తమ స్వగ్రామం లక్ష్మేశ్వరలో నిరంతరంగా పేదలకు క్షుద్బాధ తీర్చాలన్న సత్సంకల్పంతో శ్రీశివాజీ అన్నజోళిగె అనే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడతామన్నారు. కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య రాయచూరు రూరల్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని సింధనూరులో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడిని తాలూకాలోని ఏళురాగి క్యాంప్ నివాసి దూద్ పాషా (25)గా గుర్తించారు. దూద్ పాషా సింధనూరులోని మహబూబియా కాలనీలో అద్దె ఇంట్లో ఉండేవాడని, అతని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. ఘటనపై సింధనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగానికి పెద్దపీటరాయచూరు రూరల్: జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించి, ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, వీర సంగమేశ్వర శివాచార్య, ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత అభిప్రాయపడ్డారు. బుధవారం మహాత్మగాంధీ క్రీడా మైదానంలో హెలికాప్టర్ రైడ్ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ అరుణాంగ్షుగిరి, ఏడీసీ శివానంద, ఏసీ హంపన్న, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, డీడీపీఐ బడిగేర్, ఈరణ్ణ, తహ సీల్దార్ సురేష్ వర్మ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, చంద్ర శేఖర్రెడ్డి, రవిలున్నారు. అవి రాజకీయ ఉత్సవాలా?రాయచూరు రూరల్: జిల్లాలో మూడు రోజుల పాటు రాయచూరు జిల్లా ఉత్సవాలను రాజకీయ ఉత్సవాలుగా చిత్రీకరించడం తగదని కాంగ్రెస్ పార్టీ వెనుక బడిన వర్గాల ప్రధాన కార్యదర్శి టీ.మారెప్ప అభిప్రాయపడ్డారు. బుధవారం రాయచూరులో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాల జ్యోతియాత్ర, రథయాత్ర, పిల్లల పండుగ, మావినకెరె చెరువు వద్ద విజ్ఞాన ప్రదర్శనలకు కొడగు జిల్లా ఇంచార్జి మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్ పుత్రుడు రవి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అధికారులు మద్ద తు పలకడం చూస్తే రాజకీయ ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లుగా ఉందని ఆరోపించారు. ప్లాస్టిక్ రహిత జీపీకి సహకరించండిమాలూరు: సొసగెరె జీపీ సమీపంలోని ఆర్ కార్గో ముందు నిర్మించిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్, నూతన స్వచ్ఛ సంకీర్ణాన్ని ఎమ్మెల్యే కేవై నంజేగౌడ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. నగరసభ వ్యాప్తికి సుమారు రూ.5.50 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో కూడిన వ్యర్థాల నిర్వహణ విభాగం, నూతన స్వచ్ఛ సంకీర్ణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీపీ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షురాలు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రధ్ధలతో పెద్దపల్లి గంగమ్మ జాతర కేజీఎఫ్ : పురాతన ప్రసిద్ధ పెద్దపల్లి గంగమ్మ జాతర మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి రథోత్సవాన్ని జరిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. రథోత్సవం ప్రారంభం కాగానే భక్తులు రథంపైకి పూలు, పండ్లు విసిరి తమ మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మ రథోత్సవం సందర్భంగా అమ్మవారికి గొర్రెలు, మేకలను బలి ఇచ్చారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. -
రథంలో ఊరేగిన మల్లికార్జునుడు
మైసూరు: జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా బెట్టదపురలో చరిత్ర ప్రసిద్ధ భ్రమరాంబ సమేత సిడిలు మల్లికార్జునస్వామి, బెళ్లి బసప్ప, విఘ్నేశ్వరుల బ్రహ్మరథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. భక్తులు ఉఘే మల్లయ్య, ఉఘే గిరిజమ్మ, ఉఘే బెళ్లి బసప్ప అంటూ నినాదాలు చేస్తూ తేరును లాగారు. నవదంపతులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు రథంపైకి పండ్లు, పసుపు విసిరి మొక్కుకున్నారు. భక్తులు తెల్లవారుజాము నుంచే కొండపైకి 3300 మెట్లను ఎక్కి దైవదర్శనం చేసుకున్నారు. త్వరలో మెట్రో రైలు చార్జీల పెంపు? శివాజీనగర: నగర మెట్రో ప్రయాణికులకు మళ్లీ చార్జీల షాక్ తగిలే అవకాశముంది. ఈ నెలలోనే కనీసం 5 శాతం పెంచాలని బెంగళూరు మెట్రో అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. మెట్రో నిబంధనల ప్రకారం ప్రతి ఏటా చార్జీలను పెంచుకోవచ్చు. గతేడాది చార్జీలను భారీగా పెంచడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కొన్ని మార్గాల్లో 70 శాతం పెంచడంతో అన్ని పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పటికే సామాన్య ప్రజలు మెట్రో చార్జీలంటే భయపడుతున్నారు. మళ్లీ బాదితే తట్టుకోలేరనే ఆందోళన వ్యక్తమవుతోంది. బీఎండబ్ల్యూ కారు బీభత్సం ● నిలిపి ఉన్న కారును ఢీ ● భార్య మృతి, భర్తకు గాయాలు శివమొగ్గ: జిల్లాలోని తీర్థహళ్లి తాలూకా మేగరవళ్లి సమీపంలో జాతీయ రహదారి–169ఏలో విలాసవంత బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించగా ఒక మహిళ మరణించగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారును అతి వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టడమే ప్రమాదానికి కారణం. వివరాలు.. మేగరవళ్లిలోని శ్రీదుర్గా పరమేశ్వరి దేవస్థానం అర్చకుడు అశోక్ జోగి తన భార్య మల్లిక (42)తో కలిసి కారులో వెళుతూ రోడ్డు పక్కన నిలిపాడు. ఆ సమయంలో తీర్థహళ్లి వైపు నుంచి వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి నిలిచి ఉన్న కారును ఢీకొంది. ఈ తీవ్రతకు నిలిపి ఉన్న కారులో ఉన్న దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు మణిపాల్ ఆస్పత్రికి తరలిస్తుండగా, దారిలో మల్లిక చనిపోయింది. భర్త చికిత్స పొందుతున్నారు. బీఎండబ్ల్యూ కారు డ్రైవరు కూడా గాయపడ్డాడు, అతనిపై ఆగుంబె పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ బంగారమిచ్చారు మైసూరు: చామరాజనగర జిల్లా కొళ్లెగాలలోని ప్రైవేటు గోల్డ్ ఫైనాన్స్లో ఓ వ్యక్తి బంగారాన్ని కుదవపెట్టి డబ్బు తీసుకున్నాడు, అప్పు తీర్చాక నకిలీ బంగారాన్ని అంటగట్టారని లబోదిబోమన్నాడు. వివరాలు.. కొళ్లెగాల తాలూకా సిద్దయ్యనపుర గ్రామానికి చెందిన ఆనంద్ శంకర్ లమాణి ఇచ్చిన ఫిర్యాదులో.. 2023 మార్చి 11న తన బంగారు ఉంగరాన్ని రూ.15 వేల నగదుకు తాకట్టు పెట్టినట్లు తెలిపారు. ఫిబ్రవరి 2న రూ.30 వేలను చెల్లించి ఉంగరాన్ని పొందానని తెలిపారు. అయితే ఉంగరాన్ని చూసిన తర్వాత అనుమానం రావడంతో నగల షాపులో పరీక్షించగా నకిలీ బంగారం అని తెలిసింది. దీంతో న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.60 లక్షల లంచం.. అబ్కారీ డీసీపై వేటు మండ్య: లంచం డిమాండ్ చేయడంతో అబ్కారీ అధికారి సస్పెండ్ అయ్యారు. మండ్య జిల్లాలో సుందర్ అనే వ్యక్తికి మద్యం షాపు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని మంజూరు చేసేందుకు జిల్లా అబ్కారీ ఉప కమిషనర్ (డీసీ) ఆర్.నాగశయన ఏకంగా రూ. 60 లక్షలను డిమాండ్ చేశారు. ఈ ఆడియోలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. ఆర్.నాగశయనకు అబ్కారీ కమిషనర్ కార్యాలయం వివరణ కోరింది. చివరికి లంచం డిమాండ్ చేసినట్లు నిరూపితం కావడంతో సస్పెండ్ చేస్తూ అబ్కారీ ముఖ్య కార్యదర్శి అజయ్ ఎస్.కోరడ ఆదేశాలిచ్చారు. సస్పెన్షన్ కాలంలో బెళగావిలో ఉండాలని సూచించారు. -
విద్యార్థులకు కిట్ల పంపిణీ
రాయచూరు రూరల్ : తాలూకాలోని ఉడుంగల్ ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలోని ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు బుధవారం నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగ్, షూ, సాక్సులు, డైరీ కిట్లను పంపిణీ చేశారు. మార్చి నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యా శాఖాధికారి దండెప్ప బిరాదార్ సూచించారు. విజన్– 625ను లక్ష్యంగా పెట్టుకొని విద్యార్థులు మనోబలాన్ని పెంచుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఉపాధ్యాయులు జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాండు రంగ దేశాయి, సావిత్రి, వీణ, సరస్వతి, అనిత, నీలకంఠ, సునీతలున్నారు. మడివాళ మాచిదేవకు పుష్పాంజలిహొసపేటె: 12వ శతాబ్దపు శివశరణ మడివాళ మాచిదేవ కేవలం మురికి బట్టలు ఉతకలేదు, తన ప్రతిజ్ఞల ద్వారా ప్రజల మనస్సులోని మురికిని కడిగిన గొప్ప వ్యక్తి అని కూడ్లిగి ఎమ్మెల్యే ఎన్టీ.శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం కూడ్లిగి తాలూకా గుడేకోటె గ్రామంలో మడివాళ మాచిదేవ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మాట్లాడారు. మాచిదేవ బసవన్న అనుచరుడు. ఆయన తన జీవితంలో కాయకవే కై లాస సూత్రాన్ని స్వీకరించారు. డజన్ల కొద్ది వచనాలు రాయడం ద్వారా శరణ సాహిత్యానికి ఆయన దోహదపడ్డారు అని అన్నారు. సీనియర్ నాయకుడు శివప్రసాద్ గౌడ్రు, మాజీ జీపీ అధ్యక్షుడు ఎన్.కృష్ణ, ప్రిన్సిపాల్ గిరీష్, మడివాళర నాగరాజ్, శేఖరప్ప, తిప్పేస్వామి, రవి, అనేక మంది నాయకులు పాల్గొన్నారు. ఇస్పేట్ అడ్డాపై పోలీసు దాడులు రాయచూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ విధినిర్వహణలో రక్షణ కల్పించాల్సిన రక్షక భటులు భక్షక భటులుగా మారిన ఉదంతం యాదగిరిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. యాదగిరి తాలూకా హొసళ్లిలో ప్రైవేట్ స్థలంలో 11 మంది ఇస్పేట్ ఆడుతూ కూర్చున్నారు. ఈ విషయం పసిగట్టిన యాదగిరి గ్రామీణ సబ్ ఇన్స్పెక్టర్ హనుమంతు దాడి జరపడంతో ఆడుకుంటున్న పేకాటరాయుళ్లు పరారయ్యారు. పేకాటలో రూ.లక్షల్లో ఆటలు ఆడుతుండగా పోలీసులు మెరుపు దాడి చేశారు.ఆ ప్రాంతంలో రూ.లక్షల్లో డబ్బులు దొరికినా ఎస్ఐ కేవలం రూ.35 వేలు దొరికినట్లు కేసు నమోదు చేయడం విడ్డూరమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ పృథ్వీశంకర్ను అభ్యర్థించారు. ద్విచక్ర వాహనాలను విడిపించడానికి రూ.10 వేలు చొప్పున వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. టిప్పర్ ఢీకొని బైకిస్టు దుర్మరణం రాయచూరు రూరల్: టిప్పర్, ద్విచక్ర వాహనాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మంగళవారం సాయంత్రం జిల్లాలోని సిరవార తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కవితాళ నగరానికి సమీపంలో చడకల్ నివాసి బసవరాజ్(32)గా కవితాళ పోలీసులు గుర్తించారు. బసవరాజ కవితాళ నుంచి పామన కల్లూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. లింగసూగూరు నుంచి రాయచూరు వైపు వస్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ వేగంగా వచ్చి ఢీకొనడంతో బసవరాజ్ అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. కవితాళ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ తెలిపారు. 6 నుంచి మిర్చి మేళాహుబ్లీ: నగరంలో ఈ నెల 6 నుంచి 8 వరకు 14వ మిర్చి మేళాను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 14వ సారి ఘనంగా నిర్వహిస్తున్న ఈ మేళాను విజయవంతం చేయాలని కోరారు. హావేరి జిల్లాలో బ్యాడిగి మిర్చి చాలా ప్రముఖమైందని, వీటితో పాటు వివిధ రకాల మిర్చిని మేళాలో ప్రదర్శిస్తారని తెలిపారు. ఏపీలోని గుంటూరు, పంజాబ్, హరియాణ, ఢిల్లీ తదితర రైతులు కూడా ఈ మేళాలో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. -
నిండా ముంచిన మిరప
రాయచూరు రూరల్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెతకు భిన్నంగా ప్రకృతి వైపరీత్యాలు వెంటాడటంతో గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతుల ముఖాల్లో కళ కరువైంది. ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, కొప్పళ, యాదగిరి, కలబుర్గి, బీదర్, బాగలకోటె, విజయపుర జిల్లాల్లో కృష్ణా, తుంగభద్రా నదులున్నా నారాయణపుర కుడి కాలువ, తుంగభద్ర ఎడమ కాలువల ఆయకట్టులో నీరు అందక రైతులు తమ పొలాల్లో వేసుకున్న మిరప పంట అనుకున్న మేర దిగుబడి రాలేదు. పొలంలో బోరుబావుల కింద పంటలు పండించాలన్నా భూగర్భ జలాలు అడుగంటాయి. మరో వైపు విద్యుత్ కోతలు కూడా అధికమయ్యాయి. రాయచూరు జిల్లాలో రైతులు 50 వేల ఎకరాలు, బాగల్కోటె జిల్లాలో 11 వేల ఎకరాలు, యాదగిరి జిల్లాలో 8 వేల ఎకరాలు, కలబుర్గి జిలా్ోల్ల 5 వేల ఎకరాల్లో మిరప పంటను సాగు చేశారు. దిక్కు తోచని స్థితిలో రైతన్నలు కాలువల చివరి ఆయకట్టుకు నీరందక, వానలు కురవక భూములు బీళ్లుగా మారాయి. తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణ పుర కుడి కాలువల కింద ఆయకట్టు చివరి భూముల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మిరప పంట చేతికందదనే ఆందోళనతో చివరకు అక్కడక్కడా బిందెలతో నీటిని మోసి పంటకు పోశారు. గుంటూరు మిర్చి గతంలో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రాగా నేడు కేవలం 3 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు వాపోతున్నారు. గత ఏడాది బ్యాడగి మిరపకాయలు క్వింటాల్ ధర రూ.65 వేలు ఉండగా, నేడు రూ.40 వేలు, గుంటూరు మిర్చి క్వింటాల్ ధర రూ.22 వేలు ఉండేది, నేడు రూ.15 వేలు మాత్రమే ధర పలుకుతోంది. నారాయణ పుర కుడి, ఎడమ కాలువల కింద యాదగిరి, రాయచూరు జిల్లాల్లో సుమారు రూ.400 కోట్ల విలువ చేసే మిరప పంటకు నీరు లేక ఎండిపోయే దశలో ఉంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు 6 టీఎంసీల నీరు వదిలేందుకు మంత్రులు శరణ బసప్ప దర్శనాపుర, శరణ ప్రకాష్ పాటిల్ చొరవ చూపాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు. ఆయకట్టు పరిధిలో నీరు లేక పొలంలోనే ఎండుతున్న మిరప పంట రైతులు ఆరబోసిన ఎండు మిరపను గ్రేడింగ్ చేస్తున్న మహిళా కూలీలు రైతులకు శాపంగా ప్రకృతి వైపరీత్యాలు తగ్గిన పంట దిగుబడి, ధర కూడా పతనం -
కార్మిక చట్టాలు విరమించుకోవాలి
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట సంచాలకుడు మీనాక్షి సుందరం డిమాండ్ చేిశారు. మంగళవారం లింగసూగూరు తాలూకా హట్టి సీఐటీయూ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ రైతు, వ్యవసాయ, ఏపీఎంసీ, విద్యుత్ కార్మిక చట్టాలను జారీ చేయడం వల్ల రైతు, కార్మిక, వ్యవసాయ కూలీలకు అన్ని విధాలుగా నష్ట పోతారని ఆరోపించారు. ప్రైవేట్ పెట్టుబడిదారులకు మద్దతు పలుకుతూ ఎర్ర తివాచీ పరచడాన్ని తప్పుబట్టారు. మనరేగలో తొలగించి వికసిత భారత మిషన్ రోజ్గార్ పేరును నమోదు చేయడం తగదని ఆరోపించారు. మనరేగ పథకం నేడు వలసలు వెళుతున్న కూలీలు, కార్మికులకు భవిష్యత్ అంధకారమైందన్నారు. సమావేశంలో రాఘవేంద్ర కుష్టిగి, మహ్మద్ అమీర్, సంగయ్య స్వామి, షఫీ, మహంతేష్, నరసణ్ణ, జమదగ్ని, గిరియప్ప, గుండప్ప, సోమన్న, వెంకటేష్, బసవరాజ్లున్నారు. పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోలారు: తాలూకాలోని వక్కలేరి ఫిర్కా ముదువత్తి గ్రామంలో మంగళవారం జరిగిన అశ్వర్థ కట్ట ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ ఎంఎల్ అనిల్కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం తనకెంతో మానసిక సంతృప్తిని కలుగజేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుండడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ఒక్కలిగుల సంఘం మాజీ డైరెక్టర్ రాము పాల్గొన్నారు. నగరసభ అధికారిపై దాడి కోలారు: నగరసభ అధికారిపై దుకాణ యజమాని దాడి చేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి నగరసభ అధికారులు మంగళవారం కేఎస్ ఆర్టీసీ బస్టాండులోని శ్రీనివాస బేకరీలో తనిఖీలు చేయగా ప్లాస్టిక్ కవర్లు వెలుగు చూశాయి. వాటిని స్వాధీనం చేసుకుంటున్న సమయంలో యజమాని గోవింద నగరసభ హెల్త్ ఇన్స్పెక్టర్ మంజునాథ్పై దాడి చేశాడు. ప్లాస్టిక్ కవర్లను లాక్కున్నాడు. ఘటనపై హెల్త్ ఇన్స్పెక్టర్ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాఠశాలకు డెస్కుల వితరణకోలారు : ఎయిర్బ్యాక్ కంపెనీ దాతృత్వం చాటింది. అరాభికొత్తనూరు పాఠశాలకు రూ.1.80 లక్షల విలువ చేసే డెస్కులను మంగళవారం విరాళంగా అందజేసింది. సంస్థ ప్రతినిధి మోనిష్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కంపెనీ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పశు ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ నితిన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తాహేరా నుస్రత్ పాల్గొన్నారు. కరెంటు స్తంభాన్ని ఢీకొన్న పోలీసు జీపు శ్రీనివాసపురం: పోలీస్ వాహనం ఢీకొని విద్యుత్ స్తంభం కూలి మహిళ గాయపడింది. కోలారు నుంచి శ్రీనివాసపురం వస్తున్న పోలీసు జీపు ఎంజీ రోడ్డులో అదుపు తప్పి డివైడర్ పైకెక్కి స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం కూలి అదే రోడ్డులో బైక్పై వెళ్తున్న మహిళపై పడింది. తలకు గాయాలు కావడంతో ఆమెను కోలారు ఆస్పత్రికి తరలించారు. ఆస్తి వివాదం.. వ్యక్తిపై దాయాదుల దాడి దొడ్డబళ్లాపురం: ఆస్తి వివాదం నేపథ్యంలో వ్యక్తిపై దాయాదులు దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటన దేవనహళ్లి తాలూకా రామనాథపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మదన్(35)అనే వ్యక్తికి బంధువులతో భూ వివాదం ఉంది. కోర్టు విచారణలో ఆ భూమి మదన్కు చెందినది అంటూ తీర్పు వచ్చింది. కోట్ల విలువ చేసే భూమి చేజారిపోవడంతో మదన్ చిన్నాన్న కెంపన్న, పిన్ని అక్కయ్యమ్మ, వారి పిల్లలు బాబు, పునీత్లు సోమవారం రాత్రి మదన్ ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. మదన్ తప్పించుకుని పారిపోయి విశ్వనాథపుర పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా వెనక్కు పంపించారని మదన్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం మదన్ దొడ్డబళ్లాపుర తాలూకా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
జ్యోతిష్యుడు, ప్రియురాలికి కటకటాలు
యశవంతపుర: జ్యోతిషునితో మహిళ ఆక్రమ సంబంధం ఒకరి హత్యకు దారి తీసింది. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపురలో ఈ సంఘటన జరిగింది. శివమొగ్గకు చెందిన జోతిష్యుడు కమలాకర భట్ గురూజీ, అతని ప్రియురాలు, మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. గురూజీ వద్ద సుచిత్ర అనే మహిళ పనిచేస్తూ ఇద్దరికీ అక్రమ సంబంధం ఏర్పడింది. సిద్ధాపుర తాలూకా అవరగుప్పవాసి మహేశ్ నాయక్ భార్య ఈమె. సుచిత్ర ఇద్దరు కూతుళ్లతో కలిసి శివమొగ్గలోనే గురూజీ వద్ద ఉంటోంది. తల్లి తీరు నచ్చక ఓ కూతురు సిద్ధాపురలోని తమ గ్రామానికి వెళ్లి తండ్రి మహేశ్ నాయక, చిన్నాన్న వసంత నాయక (41)కు విషయం చెప్పింది. సోమవారం మధ్యాహ్నం కూతురిని వెతుక్కుంటూ సుచిత్ర కారులో కొందరు యువకులను తీసుకుని వచ్చింది. ఈ సమయంలో సుచిత్రా, భర్త మహేశ్ల మధ్య వాదులాట జరిగింది. ఇరువర్గాల దాడులు చేసుకున్నాయి. మహేశ్, వసంత్ నాయక, కుమార్ని సుచిత్ర అనుచరులు కత్తితో పొడిచారు. గాయాలైన వసంత్ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. మిగతా ఇద్దరూ శివమొగ్గ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హతుని భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదుతో గురూజీ, సుచిత్ర, ఐదుమంది యువకులపై సిద్ధాపుర పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఘటనా స్థలిని ఎస్పీ దీపన్ పరిశీలించారు. వీరి ముఠా చేతిలో ఒకరి హత్య ఉత్తర కన్నడ జిల్లాలో ఘటన -
అమ్మవారి నెక్లెస్ ఈఓ జేబులోకి
బనశంకరి: బెంగళూరు నగరంలోని ప్రఖ్యాత ధర్మరాయస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు సమయంలో 120 గ్రాముల బంగారు కంఠాభరణాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) నాగరాజ్ కాజేశారని ఆలయ మాజీ అధ్యక్షుడు సతీశ్ ఆరోపించారు. మంగళవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. హుండీ లెక్కింపులో 120 గ్రాముల నెక్లెస్ లభ్యమైంది. ఈఓ నాగరాజ్ జేబులో వేసుకుని వెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నాగరాజ్ కూడా తప్పు ఒప్పుకున్నారని, నెక్లెస్ని వెనక్కి ఇచ్చారని తెలిపారు. కానీ అది 63 గ్రాములే ఉందని, సగం బంగారం మాయం చేశాడని ఆరోపించారు. ఈవోతో పాటు ముఖ్యమైన అధికారులు ఈ దందాకు పాల్పడ్డారని, వారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయంలో పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. ఎయిర్పోర్టులో కుక్కల గోల దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టును కూడా వీధికుక్కల సమస్య వదలడం లేదు. గతంలో ప్రయాణికులు కూర్చునే కుర్చీలలో వీధికుక్కలు దర్జాగా సేదతీరుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. రన్వేపై కూడా కుక్కలు షికార్లు చేసిన ఉదంతాలు ఉన్నాయి. మరోసారి రన్వేపై వీధికుక్కలు తిరుగుతూ కనిపించడం ఆందోళన కలిగించింది. వాటిని పారద్రోలడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు. ఆ సమయంలో విమానాలు ల్యాండ్ కాకపోవడంతో పెద్ద సమస్య తప్పింది.చీటీలంటూ చీటింగ్ కోలారు: చిట్ఫండ్ లేదా చీటీ.. ఏదైనా గానీ పేరులోనే ఉంది చీటింగ్ అని. అయినా జనం అమాయకంగా చీటీలు కట్టి ఆపై మోసపోయి లబోదిబోమనడం పరిపాటిగా మారింది. కోలారులో ఇలాంటి ఉదంతమే నడుస్తోంది. దీపావళి, వరమహాలక్ష్మీ , ఉగాది పండుగలకు కానుకలు ఇస్తామని జనంతో చీటీలు కట్టించుకుని పరారైన మోసగాన్ని అరెస్టు చేసి తమ సొమ్ము ఇప్పించాలని భాదిత మహిళలు మంగళవారం నగర పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. శాంతి నగర్కు చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి మోసం చేశాడని తెలిపారు. తానే చాలా మంది మహిళల నుంచి దాదాపుగా 52 లక్షల రూపాయల వరకు కట్టించానని, వారంతా తన ఇంటి వద్దకు తనను నిలదీస్తున్నారని లక్ష్మమ్మ అనే మహిళ వాపోయారు. పోలీసులు వెంకటస్వామిని స్టేషన్కు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. -
అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్
రాయచూరు రూరల్: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దోపీడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దోపిడీ ఇరానీ ముఠాను కలబుర్గి పోలీసులు అరెస్ట్ చేశా రు. సోమవారం కలబుర్గి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు అధికారి శరణప్ప పాత్రికేయులకు వివరాలు వెల్లడించారు. నిందితులను మహారాష్ట్రలోని బీడ్ జిల్లా శివాజీ నగర్కు చెందిన అలీమీర్జా, జహీర్ అబ్బాస్ అలీ, రజాక్ బేగ్, థానే జిల్లా జాఫర్ అలీ అంబొవిలి, ఇందిరా నగర్ నివాసులు జాఫర్ ఆజమ్ సయ్యద్, లాల్ సమీర్ షేక్, మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన ఖాసీం జోజో జాఫ్రీలుగా గుర్తించారన్నారు. జనవరి 23న తావరగేర క్రాస్ వద్ద ముఖానికి ముసుగులు ధరించి అనుమానాస్పదంగా కలియ తిరుగుతూ వాహనదారులను భయపెట్టి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు దోచుకున్న సమయంలో వారిని బంధించినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.27.30 లక్షల విలువ చేసే 90 గ్రాముల బంగారం, టాటా ఫార్చునర్ కారు, హోండా మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకల్లో పోలీసులుగా విధులు నిర్వహిస్తున్నట్లు నటిస్తూ దోపిడీలకు పాల్పడినట్లు ఆయన వివరించారు. ఏడుగురు నిందితుల పట్టివేత రూ.27.30 లక్షల సొత్తు స్వాధీనం -
చిక్కబళ్లాపురంలో బంగారం అన్వేషణ
● హెలికాప్టర్తో ముమ్మర సర్వే చిక్కబళ్లాపురం: బెంగళూరుకు అతి సమీపంలో ఉన్న చిక్కబళ్లాపురం జిల్లాలో బంగారం, ఇతర విలువైన ఖనిజాలు ఏమైనా భూగర్భంలో ఉన్నాయా? అని పరిశోధన జరుగుతోంది. భారతీయ భూవైజ్ఞానిక సర్వేక్షణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గుడిబండ తాలూకా బీచగానహళ్లి క్రాస్ పరిసరాల్లో హెలికాప్టర్ ద్వారా సర్వే సాగుతోంది. భూగర్భంలో బంగారు నిక్షేపాలు, ఇతర అరుదైన ఖనిజ సంపదను గుర్తించడమే ఈ సర్వే లక్ష్యం. బాగేపల్లి తాలూకా, గుడిబండ తాలూకా పరిధిలో బంగారం ఉండొచ్చని గతంలో ప్రచారం సాగింది. భూవైజ్ఞానిక నిపుణుల సూచనలతో సమీక్ష సాగుతోంది. ఓ హెలికాప్టర్కు తీగ కట్టి దానికి రాడార్ ఉపకరణాన్ని అమర్చి రౌండ్లు కొడుతున్నారు. హెలికాప్టర్ పదే పదే ఆ ప్రాంతంలో తిరుగుతూ ప్రకంపనల సహాయంతో కనుగొనే పని జరుగుతోంది. హెలికాప్టర్ను చూసి జనం సంభ్రమానికి గురవుతున్నారు. పొరుగున ఉన్న కదిరి ప్రాంతంలోనూ సర్వే నిర్వహిస్తున్నారు. స్వర్ణం ఉండొచ్చా.. కోలారు జిల్లాలోని కేజీఎఫ్ ప్రాంతం మాదిరి మట్టి ఇక్కడ ఉందని, బంగారం దొరికే చాన్సు 80 శాతం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఈ ప్రాంతం చిత్రం సంపూర్ణంగా మారిపోతుందనే ఆశాభావం నెలకొంది. ఇక్కడ భూమిలో 50 మీటర్ల లోపు నుంచి బంగారం ఖనిజం ఉండవచ్చని, వెయ్యి హెక్టార్ల భూమిని బంగారు గనుల కోసం కేటాయించవచ్చని సమాచారం. మే 31వ తేదీ వరకు సర్వే జరుగుతుంది, హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది, ప్రజలు ఎవరూ భయపడవద్దు అని జిల్లా కలెక్టర్ జి ప్రభు తెలిపారు. -
మాతృభాష వృద్ధిలో తల్లుల పాత్ర కీలకం
బళ్లారిఅర్బన్: మాతృభాష అభివృద్ధిలో ప్రతి తల్లి పాత్ర కీలకమని డాక్టర్ మైమూదా బేగం అన్నారు. అఖండ బళ్లారి జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో బాలికల ప్రభుత్వ పీయూ కళాశాలలో నిర్వహించిన వ్యాకరణ తీర్థ చంద్రశేఖర శాస్త్రి దత్తి కార్యక్రమాన్ని ఆమె మొక్కకు నీరు పోసి ప్రారంభించి మాట్లాడారు. ఇల్లు తొలి పాఠశాల, తల్లి తొలి గురువు అని కువెంపు చెప్పినట్లుగా మాతృభాష పరిరక్షణలో మహిళలు ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. మేధా డిగ్రీ కళాశాల ఉపన్యాసకురాలు డాక్టర్ వై.సుమ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. తల్లి ఒడిలో వినిపించే తొలి మాటే పిల్లల మాతృభాషగా మారుతుందన్నారు. బాలికల ప్రభుత్వ పీయూ కళాశాల ప్రిన్సిపాల్ బీ.సులేఖ మాట్లాడుతూ విద్యార్థినులకు ఉపయోగపడే కార్యక్రమాలకు తమ కళాశాల ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఇస్తుందన్నారు. కసాప దత్తి కార్యక్రమాలు సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ భాషను జాగృతం చేస్తున్నాయని దత్తి దాత డాక్టర్ వీఎస్.ప్రభయ్య అన్నారు. వీరశైవ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ భ్రమరాంభను సన్మానించారు. కోశాధ్యక్షుడు బసవరాజ్ గదగిన్ ప్రాస్తావిక జ్యోతి స్వాగతం, చాంద్ పాషా నిర్వహణ, డాక్టర్ ఏఎన్.సిద్దేశ్వరి వందన సమర్పణ చేశారు. కసాప జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నిష్టి రుద్రప్ప, హెచ్.సురేష్, కాత్యాయిని, చంద్రశేఖర్ ఆచార్, మెహతాబ్, కాశీనాథ్, మంజునాథ్ రెడ్డి, రాఘవేంద్ర, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
హంపీ ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
హొసపేటె: విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని ప్రదర్శించే ప్రపంచ ప్రసిద్ధ హంపీ ఉత్సవాలను వైభవంగా జరపడానికి జిల్లా యంత్రాంగం విస్తృతమైన సన్నాహాలు చేస్తోంది. ఈ సారి జిల్లా కేంద్రం హొసపేటె పట్టణం నుంచి హంపీ వరకు గ్రాండ్ విద్యుత్ దీపాల అలంకరణ ప్రధాన ఆకర్షణగా మారింది. పర్యాటకులను అబ్బురపరిచేందుకు జిల్లా యంత్రాంగం 50 కిలో మీటర్ల పొడవున విద్యుత్ దీపాలను ప్రారంభించింది. ఈ సారి హొసపేటె ప్రధాన రహదారులు కూడా విద్యుత్ దీపాలు వెలుగుల్లో, జిల్లాధికారి కార్యాలయం నుంచి హంపీలోని విరుపాక్షేశ్వర ఆలయం వరకు ఉన్న రహదారి వెంట దీపాలను ఏర్పాటు చేశారు. బెంగళూరు రోడ్డు నుంచి సాయిబాబా సర్కిల్ వరకు ఉన్న రహదారిపై రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చారు. రైల్వేస్టేషన్ రోడ్డు, సెంట్రల్ బస్టాండ్ రోడ్డు, బళ్లారి రోడ్డు వరకు లైట్లను ఏర్పరిచారు. అంబేడ్కర్ సర్కిల్, వాల్మీకి సర్కిల్, కనక సర్కిల్తో సహా కంప్లి రోడ్డు, కమలాపుర చెరువు పరిసరాల్ల విద్యుత్ దీపాలు ఎంతో ఆకర్షణగా ఉన్నాయి. ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ దీపాల అమరిక -
అబ్కారీశాఖలో అవినీతి పొంగు
● మంత్రి తిమ్మాపుర తప్పుకోవాలి ● విధానసభలో ప్రతిపక్షాల పట్టు శివాజీనగర: ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ పేరుతో సిద్దరామయ్య సర్కారు ఈ అసెంబ్లీ సమావేశాలను జరుపుతుండగా చివరకు ఆ అంశం మీద తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వ వీబీ జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, గతంలో అమల్లో ఉన్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయాన్ని ప్రకటించింది. మంగళవారం విధానసభలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ నిర్ణయాన్ని ప్రవేశపెట్టి, గ్రామీణ పేదల పాలిట సంజీవనిగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడాన్ని ఈ సభ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వీబీ జీ రామ్జీ చట్టం సమాఖ్య వ్యవస్థ ఆశయాలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఇంత ఖర్చును ఎలా భరించాలి జీ రామ్జీలో రాష్ట్రాలు ఏకాఎకి 40 శాతం నిధులను భరించాలని నియమం ఉంది, దీంతో 125 రోజుల పని కల్పిస్తామని కొత్త చట్టంలో చెప్పినా కూడా, వాస్తవంగా 50 రోజుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇది సమాఖ్య నియమాలకు విరుద్ధం అని సిద్దరామయ్య ఆరోపించారు. దేశంలో కర్ణాటక అత్యధికంగా పన్ను చెల్లించే రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉంది. గ్రామ పంచాయతీలు అత్యధిక పన్నుల సేకరణలో దేశంలో తొలి స్థానంలో ఉన్నాయని తెలిపారు. కర్ణాటకకు ఆర్థిక సంఘాల నిధుల్లో ఏటేటా అతి తక్కువగా కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. కొత్త చట్టం ద్వారా రాష్ట్రంపై భారం వేస్తోంది, రాష్ట్ర ఆర్థిక భద్రతను, అభివృద్దిని ప్రమాదానికి గురిచేసే కుట్ర అని ఆరోపించారు. బీజేపీ సభ్యులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇది కాంగ్రెస్ తీర్మానమని, అసెంబ్లీ నిర్ణయం కాదని నినాదాలు చేశారు. మంగళవారం విధానసభలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆవేశంగా మాట్లాడుతున్న సీఎం సిద్దరామయ్యప్రధానినే అలా అంటారా? పరిషత్లో ప్రతిపక్షాల రభస మెట్టు దిగిన ఎమ్మెల్సీ నజీర్ శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి దేశద్రోహి అని నిందించడం గురించి విధానపరిషత్లో రభస కొనసాగింది. ఈ మాటలు అన్న కాంగ్రెస్ సభ్యుడు నజీర్ అహమ్మద్ క్షమాపణ చెప్పాలని బీజేపీ, జేడీఎస్ పట్టుబట్టాయి. దీంతో నజీర్ అహమ్మద్ తన వ్యాఖ్యల మీద విచారం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల గురించి సోమవారం రాత్రి నుంచి ఎగువసభలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. మంగళవారం పోడియం వద్దకు వచ్చి ధర్నా కొనసాగించారు. నజీర్ అహమ్మద్తో క్షమాపణ చెప్పించండి, లేకపోతే బయటికి పంపాలని డిమాండ్ చేశారు. సభాపతి బసవరాజ్ హొరట్టి స్పందిస్తూ రాజ్యాంగ వ్యతిరేకమైన పదాలను ఉపయోగించడం అపరాధమని, అందరిదీ ఇదే అభిప్రాయమని చెప్పారు. దేశ ప్రధాని గురించి ఇలాంటి మాటలను మాట్లాడడం సరైంది కాదన్నారు. ప్రతిపక్ష సభ్యులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు, ముందు వారు క్షమాపణ చెప్పాలి, ఆ తరువాత ఆలోచిస్తానని నజీర్ అహమ్మద్ తెలిపారు. దీనికి ఒప్పుకోని ప్రతిపక్ష సభ్యులు ఒకే వాక్యంలో క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. నజీర్కు పాకిస్తాన్ నాలుక ఉండాలి, అందుకే ఇలా మాట్లాడారు అని విమర్శించిన సీటీ రవి క్షమాపణ చెప్పాలని నజీర్ కోరారు. ఇందుకు రవి విచారం వ్యక్తంచేయగా, ఆ తరువాత నజీర్ కూడా తన వ్యాఖ్యలపై విచారం వెలిబుచ్చారు. అయినా కొంతసేపు రచ్చ కొనసాగింది. సమాఖ్య స్ఫూర్తికి జీ రామ్జీ విరుద్ధం రాష్ట్రాలపై భారం వేయడం సరికాదు అసెంబ్లీలో సిద్దు సర్కారు తీర్మానం శివాజీనగర: ఎకై ్సజ్ శాఖలో అవినీతి పొంగిపొర్లుతోందని మంగళవారం విధానసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం, ఆరోప–ప్రత్యారోపణలు జరిగాయి. ఎకై ్సజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపుర రాజీనామా చేయాలని బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేశాయి. ఎక్సైజ్ శాఖలో భారీ అవినీతి జరిగింది, అందులో మంత్రి ప్రమేయముంది. ఆయన పదవి నుంచి తప్పుకోవాలని కోరాయి. మొదట సభ ఆరంభం కాగానే ఆర్.అశోక్ ఎకై ్సజ్ శాఖలో అధికారులు, మంత్రి కలసి అవినీతికి పాల్పడుతున్నారని పలు ఆధారాలను ప్రదర్శించి, లంచానికి డిమాండ్ పెట్టిన అధికారుల ఆడియోను వినిపించారు. దీనికంటే సాక్ష్యం ఇంక అవసరం లేదు. తక్షణమే ఎకై ్సజ్ మంత్రి రాజీనామా చేయాలని కోరారు. లోకాయుక్తకు చిక్కిన ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగరాజు మంత్రి పేరును ప్రస్తావించారని చెప్పారు. అంతేకాకుండా ఆ శాఖ అధికారులు కులాల పేరుతో పనులు చక్కబెట్టేందుకు దిగారు, కుల సంఘం నాయకులతో కలిసి సీఎం సిద్దరామయ్యను కలిస్తే పనైపోతుందని ఓ కాంట్రాక్టర్కు అధికారి చెప్పిన ఆడియోను వినిపించారు. సీఎం సిద్దరామయ్య తనయుడు యతీంద్రను భేటీ చేసి, అక్కడి నుంచి ఫోన్ చేయించాలని కూడా సలహా ఇచ్చారన్నారు. ఇలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నారు. ముందే చర్చ వీబీ జీ రామ్జీ చట్టంపై ముందుగా చర్చ జరగాల్సింది, అయినా కూడా ప్రతిపక్షాల డిమాండ్ మేరకు స్పీకర్ ఖాదర్ ఎకై ్సజ్ శాఖ ఆరోపణలపై చర్చకు అవకాశం కల్పించారు. ఈ గొడవ వల్ల సుమారు గంటన్నర సభ ఆలస్యంగా మొదలైంది. -
ఉచితాలతో ఆర్థిక సంక్షోభంలో సర్కారు
హొసపేటె: ఉచిత, హామీ పథకాల కారణంగా ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, డిపాజిట్లను మెరుగుపరచడానికి నియంత్రణ లేకుండా మద్యం అమ్మకాల్లో పాల్గొంటోందని నీలగుంద విరక్తిమఠానికి చెందిన చెన్నబసవ శివయోగి స్వామీజీ తెలిపారు. మంగళవారం విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా హిరేమేగళగెరె గ్రామంలోని నాగలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో శివ పంచాక్షరి జపం, సహస్ర బిల్వార్చన, మతపరమైన సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. మద్యపాన వ్యసనం కారణంగా చాలా మంది మరణించారు. అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. నియంత్రణ విధించాల్సిన ప్రభుత్వం, గ్రామాలకు విస్తరించడం ద్వారా సమాజాన్ని మరింత దిగజార్చడానికి ప్రయత్నిస్తోందన్నారు. అయితే ధర్మస్థల సంక్షేమ అభివృద్ధి సంఘం తమ మద్యవర్జన శిబిరాల ద్వారా, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది సంఘంలో చేరి స్వయం ఉపాధి పొంది వారి కుటుంబాలకు ఆసరాగా మారారని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు ప్రతిభా పరశు రామప్ప, అంగడి ప్రకాష్, కే.పరశురామప్ప, సహకార సంఘం అధ్యక్షుడు హరీష్గౌడ, నాగలింగేశ్వర ఆలయ ట్రస్ట్ వెంకటరావు, సుజాతమ్మ, రాజప్ప ఇట్టగుడి, అశోక్, అంజినప్ప, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నైరుతీ రైల్వేకు రూ.7,748 కోట్లు
సాక్షి,బళ్లారి: ప్రస్తుత బడ్జెట్లో నైరుతి రైల్వేకు రూ.7,748 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం వర్చువల్ విధానం ద్వారా విలేకరులతో మాట్లాడారు. 2009–2014 మధ్య కాలంతో పోలిస్తే నైరుతీ రైల్వేకు తొమ్మిది రెట్లు నిధులు పెంచామని అన్నారు. అప్పట్లో నైరుతీ రైల్వేకు కేవలం రూ.835 కోట్ల నిధులు కేటాయిస్తే, 2025–26 బడ్జెట్లో రూ.7,564 కోట్లు కేటాయించామన్నారు. బడ్జెట్లో కేటాయించిన విధంగా బెంగళూరు–చైన్నె, బెంగళూరు–హైదరాబాద్ బుల్లెట్ రైల్ కారిడార్లతో బెంగళూరు ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయన్నారు. నైరుతీ రైల్వే ఏజీఎం పీ.అనంత్ మాట్లాడుతూ 2026–27కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రానికి రైల్వేలో మౌలిక సదుపాయాలు, రాకపోకలు సంబంధించి పలు మార్పులు, చేర్పులు జరిగాయన్నారు. గతంలో పోల్చితే కర్ణాటకకు ఎంతో మేలు గతంతో పోలిస్తే బడ్జెట్లో కర్ణాటకకు ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రస్తుతం రూ.7,748 కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో రైళ్ల రాకపోకలకు, అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుందన్నారు. అమృత్ పథకం కింద ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవం, ఆధునికత తదితరాల కోసం దాదాపు రూ.2,110 కోట్లతో 61 స్టేషన్లను పూర్తిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బాగల్కోటె, ధార్వాడ, గదగ్, గోకాక్, మునిరాబాద్ తదితర రైల్వే స్టేషన్ల పనులు పూర్తి చేశారన్నారు. బాదామి, కొప్పళ, అళ్నావర తదితర స్టేషన్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 12 వందేమాతరం ఎక్స్ప్రెస్ రైళ్లు, మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. నైరుతీ రైల్వే పరిధిలో కర్ణాటక ప్రాంత ప్రజలకే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలకు ఎంతో మేలు చేకూరనుందన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ -
స్థలం తిరిగి ఇవ్వాలని యజమాని హుకుం
రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చిన స్థలం తిరిగి తనకు అప్పగించాలంటూ విద్యాశాఖ అధికారులకు యజమాని హుకుం జారీ చేసిన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వడగేర తాలూకా హలగేరిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సౌకర్యాల నుంచి వంచనకు గురయ్యారు. 30 ఏళ్ల క్రితం విద్యార్థుల విద్యాభ్యాసానికి పాఠశాల నిర్మాణానికి మల్లమ్మ 23 సెంట్ల భూమిని దానం చేసింది. దీంతో సువ్యవస్థతో కూడిన పాఠశాలను నిర్మించారు. అయితే పట్టాదారు పుస్తకంలో రాష్ట్ర గవర్నర్ పేరు మీద చేయించుకోలేక పోయారు. విద్యా శాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల స్థల వివాదం చెలరేగింది. మల్లమ్మ మరణించడంతో సమీప బంధువు తమ్మణ్ణ తన పేరు మీద మార్చుకున్నారు. భూమిఽ ధరలు పెరగడంతో పాఠశాల స్థలం తన పేరు మీద ఉందని, పాఠశాలను అభివృద్ధి పరచకుండా ఖాళీ చేయాలని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం 23 సెంట్ల స్థల దానం ప్రస్తుతం ధరలు పెరగడంతో భూమి వాపసు కోసం పట్టు -
వసంత వల్లభుని రథ సంభ్రమం
బనశంకరి: తిరుమల వెంకటేశ్వరస్వామితో సమానమైన సిలికాన్ సిటీలోని వసంతపుర వసంతవల్లభరాయస్వామి దేవస్థానం బ్రహ్మ రథోత్సవం భక్తజనవాహిని మధ్య గోవింద నామస్మరణతో ఆనందోత్సాహాలతో జరిగింది. వల్లభరాయస్వామి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అర్చకులు వీఆర్.రఘురామబట్టర్ బృందం మూలవిరాట్ ప్రత్యేక అభిషేకం, అర్చనలు, విశేష అలంకరణ చేపట్టి పూజలు నిర్వహించారు. మేళతాళాలతో స్వామివారి కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి తేరులో ప్రతిష్టించారు. వసంత వల్లభుని ఉత్సవమూర్తులను పల్లకీలో మంగళవాయిద్యాలతో ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప , ఆలయ ఈవో లక్ష్మీ, ఆలయ ప్రముఖులు కే.కుమార్, ఎన్.శ్యామణ్ణ, ఎం.నాగరత్న, బీ.సుజాత,ఎం.చేతన్, శ్రీనివాస్, కేసీ.సోమశేఖర్ తదితరులు తేరులో ఆసీనుల్ని చేశారు. రథోత్సవం రథ చక్రాలకు టెంకాయలు, గుమ్మడికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. గోవిందా, వేంకటరమణా అంటూ భక్తజనం తేరును లాగగానే రథం మీదకు అరటిపండ్లు, దవనం విసిరారు. బెంగళూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, ఏపీ, తమిళనాడు నుంచి భక్తజనం రావడంతో కిక్కిరిసింది. జానపద కళాబృందాల ప్రదర్శనలు అలరించాయి. స్థానికులు శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం, పానీయాలను పంపిణీ చేశారు. వైభవంగా తేరు ఉత్సవం తరలివచ్చిన భక్త సాగరం -
భక్తులకు రుద్రాక్షలు, విభూతి పంపిణీ
బళ్లారిఅర్బన్: బళ్లారిలోని చారిత్రక కోటె మల్లేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 1, 2 తేదీల్లో నగరంలో రథోత్సవానికి తరలి వచ్చిన సుమారు 10 వేల మంది భక్తులకు ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఆధ్వర్యంలో రుద్రాక్షలు, విభూతిని పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం సాధారణంగా మహాశివరాత్రి సందర్భంగా రుద్రాక్షలు, విభూతి పంపిణీ జరుగుతుండగా, గత రెండేళ్లుగా కోటె మల్లేశ్వర స్వామి రథోత్సవంలో లడ్డు ప్రసాదం, నీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ ఏడాది రథోత్సవంలో పాల్గొన్న భక్తులకు రుద్రాక్షలు, విభూతి పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. చిన్నారిపై వీధి కుక్క దాడిహుబ్లీ: ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల మగబిడ్డను కుక్క కరిచి గాయపరిచిన ఘటన ధార్వాడ తాలూకా లకమాపుర గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పృథ్విక్ మూలెమని బాధిత బాలుడు. ఉదయం ఇంటి ముందు ఆటలాడుతుండగా వీధి కుక్క దాడి చేయడంతో బిడ్డ అరుపులు విన్న తల్లిదండ్రులు తక్షణమే బయటకు వచ్చి కుక్కను తరిమి కొట్టారు. అయితే ఆలోపే కుక్క బాలుడి చెవి, తలపై కరిచి గాయపరిచింది. చెవిలో ఓ భాగం బాగా కొరకడంతో జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా గత వారంలో ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న లేఅవుట్లో ఓ పిచ్చికుక్క 9 మందిని కరిచిన సంగతి తెలిసిందే. వైభవంగా యల్లమ్మ పల్లకీ రథోత్సవంరాయచూరు రూరల్: నగరంలోని జ్యోతి కాలనీలో వెలసిన ఉత్తిన యల్లమ్మ దేవి జాతర, రథోత్సవం వైభవంగా జరిగాయి. దేవి విగ్రహానికి కిల్లె బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్య, సోమవారపేట అభినవ రాచోటి శివాచార్య, ఉడుంగల్ మఠాధిపతి వీర సంగమేశ్వర శివాచార్య ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సోమవారం రాత్రి ఆలయం వద్ద అధ్యక్షురాలు రాజేశ్వరి వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నెరవేర్చారు. అనంతరం పల్లకీలో దేవి విగ్రహాలను ఊరేగించారు. అంగన్వాడీ కార్యకర్తల నిరసన రాయచూరు రూరల్: అంగన్వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం నగరంలోని టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ సీ్త్ర శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తూ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్మినెంట్ చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ దిిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆందోళనలో శరణ బసవ, గోకారమ్మ, వరలక్ష్మి, శ్యామల, ఇందిర, శరణమ్మ, శాంతమ్మ, మల్లికలున్నారు. ఏపీఎంసీ ముట్టడిరాయచూరు రూరల్: ఏపీఎంసీలో రైతులు పండించిన పంటలను, తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ రైతులు ఏపీఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు. మంగళవారం రైతు సంఘం అధ్యక్షుడు సురేష్ మాట్లాడారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు తెచ్చిన ఉల్లిగడ్డలను ఏపీఎంసీ అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు చేయక పోవడంతో రైతులు సొమ్మసిల్లారు. ఏపీఎంసీ అధికారులు ఉల్లిగడ్డల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
తండ్రి దెబ్బలకు కుమార్తె బలి
యశవంతపుర: కుటుంబ, ఆస్తి కలహాలతో కూతురిని తండ్రి హతమార్చిన హృదయ విదారక ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లో కాసరగోడు జిల్లా మంజేశ్వర తుమినాడిలో జరిగింది. జుమైలా (18)ని ఆమె తండ్రి ఫారూక్ హత్య చేశాడు. ఫారూక్ గతంలో దుబాయ్లో పనిచేసి ఇంటికి తిరిగివచ్చాడు. భార్య తాహెరా మధ్య ఆస్తి గొడవలున్నాయి, మంగళవారం ఉదయం కూడా రగడ పడ్డారు. ఫారూక్ భార్యను చితకబాదగా కుమార్తె జుమైలా గొడవను విడిపించడానికి వెళ్లింది. ఫారూక్ చేతిలోని కట్టెతో జుమైలా తల మీద బాదడంతో ఆమె గాయాలతో కుప్పకూలి చనిపోయింది. పోలీసులు ఫారూక్ను అరెస్ట్ చేశారు.


