breaking news
Karnataka Latest News
-
సమాచార శాఖాధికారికి సత్కారం
హొసపేటె: విలేకరులు, సమాచార, పౌర సంబంధాల శాఖ ఒకే నాణేనికి రెండు ముఖాలని విజయనగర జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ బి.ధనుంజయ తెలిపారు. కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన జర్నలిస్టులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విజయనగర జిల్లాలో జర్నలిస్టులు, సమాచార శాఖకు మధ్య మెరుగైన సంబంధాలున్నాయన్నారు. జిల్లాలోని జర్నలిస్టులు బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఇటీవల జర్నలిస్టుల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారన్నారు. అనంతరం అసోసియేషన్ తరఫున జిల్లా సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ధనుంజయను సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కే.లక్ష్మణ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు పూజారి వెంకోబ నాయక తదితరులు పాల్గొన్నారు. -
గదగ్ కలెక్టరేట్కు బాంబు బెదిరింపు
హుబ్లీ: గదగ్ జిల్లాధికారి కార్యాలయానికి బాంబు పెట్టినట్లు బెదిరిస్తూ ఈ–మెయిల్ రావడంతో పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. దీంతో గదగ్ జిల్లాధికారి కార్యాలయ యంత్రాంగంలో ఆందోళన నెలకొంది. పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఎలాంటి పేలుడు వస్తువులు కనిపించక పోవడంతో ఇదంతా ఒత్తిదే అని, వట్టి బెదిరింపులకు భయపడేది లేదని జిల్లాధికారి తేల్చి చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాధికారి అధికారిక ఈ–మెయిల్కు ఈ బెదిరింపు సందేశం వచ్చింది. అర్నా అశ్విన్ అనే పేరుతో పంపిన ఈ–మెయిల్తో జిల్లా యంత్రాంగ భవనంలోని 5 కీలక చోట్ల బాంబులు పెట్టామని నిందితుడు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న తక్షణమే పోలీసులు బాంబు నిష్క్రియ దళం, శ్వానదళంతో విచ్చేసి ఘటన స్థలాన్ని అణువణువున గాలించారు. అనుమానం ఉన్న వస్తువులను తొలగించారు. పరిశీలన కార్యాచరణలో డీఎస్పీ ముర్తుజా ఖాజీ, సీఐలు లాల్సాబ్, సిద్దరామేశ్, ఎస్ఐ పవార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. కాగా పోలీసులు ఈ బెదిరింపు మెయిల్ పంపిన వారి ఆచూకీని కనుగొనేందుకు సైబర్ దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి జిల్లాధికారి కార్యాలయంలో విధులన్నీ సామాన్యంగానే సాగుతున్నాయి. -
గాలిమరలు.. పక్షులకు మరణ శాసనాలు
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని ఆగ్రహార గ్రామ శివార్లకు పక్షులు గుంపులు గుంపులుగా వచ్చేవి. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన గాలిమరల నుంచి వచ్చే భారీ శబ్దానికి కొన్ని పక్షులు వేరే చోటికి తరలి వెళుతున్నాయి. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభం కావడంతో స్థానిక పక్షులు, దూర దేశాల నుంచి వలస పక్షులు విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని అంకసముద్ర చెరువుకు తరలి వస్తాయి. పక్షులు ఆహారం కోసం కూడ్లిగి తాలూకా వరకు ఎగిరి వస్తాయి. కానీ గాలిమరల ఫ్యాన్ల శబ్ధం వాటిని వేరే చోటికి వెళ్లేలా చేస్తోంది. ఇది పక్షుల ఉనికికి ముప్పు కల్గిస్తోంది. కూడ్లికి తాలూకాలోని అగ్రహార సరస్సు, అంకసముద్ర చెరువు వేలాది పక్షులకు స్వర్గధామంగా ఉండేది. కాని ప్రస్తుతం పొలాల్లో గాలిమరల ఏర్పాటు వల్ల దేశ, విదేశాల నుంచి వచ్చే వివిధ రకాల పక్షుల వలస తగ్గుముఖం పట్టింది. కూడ్లిగి తాలూకాలోని హొసహళ్లి, గుడేకోటె ఫిర్కాల్లో గాలిమరల ఫ్యాన్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఈ నేపథ్యంలో కొన్ని వలస పక్షులు ఈ చెరువు నుంచి దూరంగా వేరే చోటకు వెళ్లేందుకు ప్రశాంతమైన ప్రదేశాన్ని వెతుకుతున్నాయి. పక్షి నిపుణులు, పర్యావరణ వేత్తలు ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటానికి శక్తిహీనులుగా మారారని పక్షి వీక్షకులు, అభిమానులు తెలిపారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, సంఘ సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
కళాశాలకు వాటర్ ఫిల్టర్ వితరణ
కోలారు : తాలూకాలోని వేమగల్ పారిశ్రామికవాడలోని లైకో కంపెనీ సీఎస్ఆర్ నిధుల నుంచి నగరంలోని బాలుర ప్రభుత్వ కళాశాలకు రక్షిత తాగునీటి ఫిల్టర్ను అందించారు. కంపెనీ మేనేజర్ డీఎం మహదేవ్ మాట్లాడుతూ కంపెనీల నుంచి వచ్చే సీఎస్ఆర్ నిధులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉత్తమ విద్యాభ్యాసం చేయాలన్నారు. సీఎస్ఆర్ నిధులతో జిల్లాలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు. ప్రభుత్వ కళాశాలలు, విద్యా సంస్థల్లో మౌలిక సౌకర్యాలను కల్పించడానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ సీనియర్ మేనేజర్ శాలిని మయాంక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ లాంఛనాలతో శామనూరుకు వీడ్కోలు
సాక్షి బళ్లారి: దేశంలోనే అత్యంత పెద్ద వయస్సు కలిగిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అఖిల భారత వీరశైవ మహాసభ జాతీయ అధ్యక్షుడు శామనూరు శివశంకరప్ప(94) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన వయోభారం, సహజమైన ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులకు చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి లోక్సభ సభ్యుడుగా, మంత్రిగా, పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన శామనూరు మృతితో దావణగెరె ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వీరశైవ లింగాయత్ సమాజ పద్ధతిలో అంత్యక్రియలను నిర్వహించారు. ఉదయం నుంచి కుమారుడు మల్లికార్జున నివాసంలో పార్థీవ శరీరాన్ని ఉంచి అక్కడ నుంచి పలువురు మఠాధీశులు, రాజకీయ ప్రముఖులు, స్థానికులు పెద్ద సంఖ్యలో చేరారు. వీరశైవ విధివిధానాలతో అంత్యక్రియలు చివరి సారిగా శామనూరు పార్థివ దేహాన్ని దర్శించుకొన్న అనంతరం హైస్కూల్ మైదానంలో ఉంచిన తర్వాత వేలాది మంది సమక్షంలో శామనూరు భౌతికకాయాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి కల్లేశ్వర రైస్ మిల్లు ఆవరణలో సంప్రదాయబద్ధంగా వీరశైవ విధివిధానాలతో పూజలు నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు. శామనూరు శివశంకరప్ప తండ్రి, తల్లి, సోదరులు, ధర్మపత్ని పార్వతమ్మల సమాథుల పక్కనే శివశంకరప్పను సమాధి చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర తదితరులతో పాటు పలువురు మఠాధీశులు, పంచపీఠాలు, విరక్త మఠాల స్వామీజీలు పాల్గొని శ్రద్ధాంజలి అర్పించి సంతాపం ప్రకటించారు. తుమకూరు సిద్ధగంగ మఠం నుంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తీసుకువచ్చిన విభూతిని అంత్యక్రియలకు ఉపయోగించారు. అశ్రునయనాలతో శివశంకరప్ప అంతిమయాత్ర శోకసముద్రంలో దావణగెరె జిల్లా ప్రజలుఆయన జీవిత కాలంలో చేపట్టిన ఎన్నో సేవా కార్యక్రమాలు, సమాజాభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. దావణగెరెలో ప్రజలు ఎటు చూసిన శోకసముద్రంలో మునిగిపోయారు. 94 ఏళ్ల వయస్సులో కూడా ఆయన ఎంతో చురుకుగా ఎమ్మెల్యేగా పని చేసి అన్ని పార్టీల నాయకులకు స్పూర్తిదాయకంగా నిలిచిన అజాతశత్రువు అని కొనియాడారు. దావణగెరెలో బాపూజీ విద్యాసంస్థలతో పాటు పలు పరిశ్రమలు నెలకొల్పారని ప్రశంసించారు. శామనూరు మృతితో దావణగెరె జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించి సంతాపం ప్రకటించారు. ఒక రాజకీయ, వ్యాపార దిగ్గజుల్లో ఒక్కటై కానరాని లోకాలకు వెళ్లారని ఆయన సన్నిహితులు కన్నీరు పెట్టారు. దావణగెరెతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, కార్యకర్తలతో పాటు ప్రముఖులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి సంతాపం ప్రకటించి అంత్యక్రియల్లో పాల్గొని జై శివశంకరప్ప... జోహార్ శివశంకరప్ప అంటూ నినాదాలు చేశారు. సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం -
ఆయుర్వేదంతో ఆరోగ్య వృద్ధి
హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేద చికిత్సకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆయుర్వేద చికిత్స దోహదపడుతుందని ఎమ్మెల్యే హెచ్.ఆర్.గవియప్ప తెలిపారు. ఆయుష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని సాయిలీల కళ్యాణ మండపంలో నిర్వహించిన బోధవ్య–2025 విద్యాష్టికర్మ జాతీయ సదస్సును ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా ఆస్పత్రిలో ఆయుర్వేద చికిత్స కోసం 25 పడకలను కేటాయించే ప్రణాళిక ఉందన్నారు. దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆయుర్వేద చికిత్స గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు. జిల్లా ఆస్పత్రి కోసం రూ.40 కోట్ల విలువైన వైద్య పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఆస్పత్రులను సందర్శించి వైద్య పరికరాలను తనిఖీ చేశారన్నారు. అనంతరం ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ చంద్రకుమార్ దేశ్ముఖ్ విద్యాష్టికర్మ గురించి ప్రత్యేక సమాచారం ఇచ్చారు. విద్యాష్టికర్మ ద్వారా 50 మందికి పైగా రోగులకు తక్షణ ఉపశమనం లభించింది. హోటల్ వ్యాపారి అభిషేక్, రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ సిద్దనగౌడ పాటిల్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఫణీంద్ర, ఆయుష్ ఫెడరేషన్కు చెందిన డాక్టర్ బీవీ భట్, డాక్టర్ చేతన్, డాక్టర్ గురు మహంతేష్, డాక్టర్ కాశీలింగయ్య, డాక్టర్ దాసురావు, డాక్టర్ మోహన్ బిరాదార్, డాక్టర్ సోమశేఖర్ హుద్దార్, డాక్టర్ కుంబార్, డాక్టర్ సునీల్ హిరేమట్్ తదితరులు హాజరయ్యారు. -
బొగ్గు చోరీ బాధ్యులపై చర్యలు చేపట్టండి
రాయచూరు రూరల్: యరమరస్ థర్మల్ విద్యుత్ కేంద్రం(వైటీపీఎస్)లో బొగ్గు అక్రమంగా దొంగతనం అవుతోందని, అధికారులు, ఇంజినీర్లు భాగస్వాములని, అలాంటి అధికారులను సస్పెండ్ చేయాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మారుతి మాట్లాడారు. రాయచూరు నుంచి యరమరస్ వరకు రైల్వే లైన్ల గుండా వ్యాగన్లతో వెళ్లే రేకులను అన్లోడ్ చేసి మిగిలిన బొగ్గును యరమరాస్ రైల్వే స్టేషన్లో గంటసేపు రైలు నిలిపి బొగ్గును అక్రమంగా విక్రయాలు చేశారన్నారు. బొగ్గును వైటీపీఎస్ ఇంజినీర్లు హరీష్, చంద్రశేఖర్ సబ్ కాంట్రాక్ట్ పొందిన పవర్ మేక్ సూపర్వైజర్ హరికృష్ణ, మేనేజర్ సురేంద్రనాథ్, స్టేషన్ మాస్టర్ సర్కార్, వ్యాగన్ల క్లీనింగ్ సిబ్బంది, గురు రాఘవేంద్ర ఎంటర్ప్రైజస్ శేషగిరి కలిసి అక్రమంగా వైటీపీఎస్కు తరలాల్సిన బొగ్గును దొంగతనంగా ఇతర ప్రాంతాలకు తరలించిన అధికారులు, సబ్ కాంట్రాక్టర్, గురు రాఘవేంద్ర ఎంటర్ప్రైజస్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లాధికారి నితీష్కు వినతిపత్రం సమర్పించారు. -
డిమాండ్ల సాధన కోసం కరవే ధర్నా
మాలూరు : వివిధ డిమాండ్ల సాధన కోసం కరవే ప్రవీణ్ శెట్టి వర్గం కార్యకర్తలు సోమవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ ఎంవీ రూప ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ఉదయం పట్టణంలోని ప్రముఖ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆందోళనకారులు కార్యాలయం ముందు ధర్నా చేశారు. కరవే రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి మాట్లాడుతూ కోలారు జిల్లాకు అందిస్తున్న కేసీ వ్యాలీ నీటిని మూడు దశల్లో శుద్ధీకరించి అందించాలన్నారు. ఎత్తినహొళె పథకాన్ని త్వరగా పూర్తి చేసి జిల్లాకు సాగు, తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. కోలారు జిల్లాలో అంతర్జలాల స్థాయిని పెంచే ఉద్దేశంతో కేసీ వ్యాలీ పథకం ద్వారా జిల్లాలోని చెరువులకు అందిస్తున్న నీటిని మూడు దశల్లో శుద్ధీకరించాలన్నారు. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, నిరాసక్తి వల్ల జిల్లాకు ఎలాంటి అనుకూలం కలగడం లేదన్నారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు చొరవ చూపితే కృష్ణా నది నీటిని కోలారు జిల్లాకు తేవచ్చన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే రాబోయే రోజుల్లో జిల్లా కేంద్రంలో భారీ ధర్నా చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో కరవే ప్రవీణ్కుమార్ శెట్టి వర్గం జిల్లా అధ్యక్షుడు రాజేష్, తాలూకా అధ్యక్షుడు నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ భవన్ పనులకు భూమిపూజ
కోలారు : నగరంలోని స్వర్ణభవనం ఆవరణలో ఉన్న 8.20 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ స్మారక భవన పరిశోధన కేంద్రం, జ్ఞాన కేంద్రం నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే రూపా శశిధర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహా మానవతా వాది అంబేడ్కర్ కాలుమోపిన స్థలంలో మనం జీవిస్తుండడం మనందరి అదృష్టమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విశేష నిధుల నుంచి రూ.9 కోట్లు, ఇతర నిధులు కలిపి మొత్తం రూ.15 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే ఆదర్శంగా అంబేడ్కర్ స్మారక భవన్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ భవనం పోటీ పరీక్షలను రాసే విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. మాజీ నగరాభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు జయపాల్, మాజీ జెడ్పీ సభ్యుడు ఆము లక్ష్మీనారాయణ, నగరసభ మాజీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ దయాశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు చట్టపరిజ్ఞానం అవసరం
రాయచూరు రూరల్: సమాజంలో విద్యార్థులకు చట్టపరిజ్ఞానం అవసరమని మిషన్ శక్తి పథకం అధికారి బావాసలి అభిప్రాయ పడ్డారు. సోమవారం సిరవార తాలూకా నవలకల్ ఇందిరాగాంధీ వసతి పాఠశాలలో జిల్లా యంత్రాంగం, జెడ్పీ, జిల్లా న్యాయ సేవా ప్రాధికార, మహిళా శిశు సంక్షేమ, విద్యా, అటవీ, మహిళా సబలీకరణ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. లైంగిక దాడుల నుంచి మహిళల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సాంఘీక దురాచారాలైన బాల్య వివాహాలు, బాల కార్మిక పద్ధతి, దేవదాసి పద్ధతి వంటి వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో లింగరాజ్, నాగమ్మలున్నారు. స్కౌట్స్ గైడ్స్తో దేశభక్తి వృద్ధి రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థుల్లో స్కౌట్స్ గైడ్స్తో దేశాభిమానం, సౌభ్రాతృత్వం, మానవీయ విలువలు, క్రమశిక్షణ అలవడతాయని తహసీల్దార్ సురేష్ వర్మ అన్నారు. సోమవారం భారత్ స్కౌట్స్ గైడ్స్ ఆధ్వర్యంలో గీత గాయన పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకలోని ఏడు జిల్లాల స్కౌట్స్ గైడ్స్, కబ్స్, బుల్ బుల్, రేంజర్స్, రోవర్స్ విద్యార్థులు గీత గాయన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. రామచంద్రప్ప, రూప, అంబన్న, కిరణ్ కుమార్, సోమశేఖర్, బసవరాజ్, హన్మంతప్ప, శాంతమ్మ, నరసింహ, సిద్దలింగేష్, నాగప్ప, మల్లయ్య, శరణప్ప, విశ్వనాథ్లున్నారు. వైభవంగా వీరభద్రేశ్వర రథోత్సవం రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా హట్టిలో ఆదివారం సాయంత్రం వీరభద్రేశ్వర జాతర, రథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరిగాయి. పారిశ్రామిక కాలుష్యంపై గ్రామస్తుల పోరాటంరాయచూరు రూరల్: నేడు వింత రోగాలతో మానవుడు మరణిస్తుంటే ప్రభుత్వం పనికి రాని పరిశ్రమలను అంటగట్టి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, ప్రాణాంతక వ్యాధులు సోకేందుకు కారణమవుతున్న పరిశ్రమలు తమకు వద్దు అంటూ కొప్పళ జిల్లా ప్రజలు పోరాటానికి నడుం కట్టి ముక్త కంఠంతో ఆందోళనకు దిగారు. గత 46 రోజుల నుంచి కొప్పళ జిల్లా బచావో సమితి ఆధ్వర్యంలో బల్డోటా, కిర్లోస్కర్, కళ్యాణి స్టీల్, ముక్కుంది సిమి, ఏక్ష్ండియా వంటి పరిశ్రమల వల్ల 15 గ్రామాల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందన్నారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల తుంగభద్ర జలాశయం పూర్తిగా కలుషిత రసాయనాలతో మలినం అవుతోందన్నారు. జనవరి 24న కొత్త పార్టీ ఆవిర్భావం రాయచూరు రూరల్: కర్ణాటకలోని కలబుర్గిలో జనవరి 24న కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందని మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం వెల్లడించారు. ఆదివారం సాయంత్రం కలబుర్గిలోని మొఘల్ గార్డెన్స్లో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కన్నడ నాడు కోసం రాయచూరు, విజయపుర, బీదర్, యాదగిరి జిల్లాల్లో ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే అన్నారు. పేదలు, శ్రామికులు, కార్మికులు, రైతులకు మూడు శాతం వడ్డీతో రుణాలిస్తామన్నారు. దళితుల కోసం రూ.30 వేల కోట్ల నిధులను ఇతరత్రాలకు ఉపయోగించారని ఆరోపించారు. కార్యక్రమంలో కోడిహళ్లి చంద్రశేఖర్, మూర్తి, గోపినాథ్, మునియప్ప, మోహన్ రాజ్, వాసు తదితరులున్నారు. హెల్మెట్ లేని వారికి జరిమానాకోలారు : బేతమంగల పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాల్లో తిరుగుతున్న వారికి పోలీసులు జరిమానా విధించారు. ఈనెల 8వ తేదీ నుంచి కేజీఎఫ్ పోలీస్ జిల్లా పరిధిలో ద్విచక్రవాహనాల్లో తిరిగే వారికి హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని ఆదేశించారు. నియమాలను ఉల్లంఘించి హెల్మెట్ లేకుండా తిరుగుతున్న వారిని అడ్డగించి పోలీసులు జరిమానా విధించారు. ఎస్ఐ గురురాజ చింతకల్ నేతృత్వంలో పోలీసులు ద్విచక్రవాహనాలను అడ్డుకుని హెల్మెట్ లేని వారికి జరిమానా కొరడా ఝళిపించారు. -
లారీలోని 40 బైక్ల దగ్ధం
బళ్లారిఅర్బన్: నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనంతపురం రోడ్డులో బైక్ల లోడ్తో ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగి 40 బైక్లు దగ్ధం అయ్యాయి. చైన్నె నుంచి బళ్లారికి తీసుకొచ్చిన 40 బైక్లను షోరూమ్కి తరలించాల్సి ఉండగా రాత్రి అనంతపురం రోడ్డులో ఎంజీ సమీపంలోని యమహా షోరూమ్ వద్ద ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగి కాలి పోయాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేశారు. అప్పటికే లారీ సగం మేరకు కాలిపోయింది. కల్యాణ కర్ణాటకలో ఐదు రోజులు చలి పంజా రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటక(క–క)లో ఐదు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉండనుంది. ఈనేపథ్యంలో ప్రజలు నెల రోజులకు ముందే భోగి మంటలకు శ్రీకారం చుట్టారు. సోమవారం బీదర్ జిల్లాలో 6.5 డిగ్రీలు, విజయపురలో 7.5 డిగ్రీలు, రాయచూరులో 10 డిగ్రీలు, కలబుర్గిలో 11 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత రెండు రోజుల నుంచి చలి తీవ్రత అధికమైంది. ఉదయం 9 గంటలు దాటినా చలి వేస్తూనే ఉంది. లింగసూగూరు రోడ్డులో మంచు పూర్తిగా కమ్ముకుంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలిరాయచూరు రూరల్ : రాష్ట్రంలో ప్రభుత్వ కన్నడ ప్రాథమిక పాఠశాలలను సంరక్షించి బలపరచాలని ఏఐడీవైఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం రాయచూరు తాలూకా అరోలిలో సంతకాల సేకరణను ఏఐడీవైఓ సంచాలకులు కృష్ణా నాయక్ ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కర్ణాటక పబ్లిక్ పాఠశాలలను నెలకొల్పి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మూసివేత దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ సంతకాల సేకరణ చేపట్టారు. పది ఫలితాలు మెరుగు పరచాలి రాయచూరు రూరల్ : జిల్లాలో పదో తరగతి ఫలితాలను మెరుగు పరచాలని తాలూకా విద్యా శాఖాధికారి ఈరణ్ణ కోస్గి సూచించారు. సోమవారం గాణదాళలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ సబ్జెక్టులపై విద్యార్థులకు విద్యా బోధన చేయాలన్నారు. పాఠ్యాంశాల ఆధారంగా ఉపాధ్యాయులు ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు ముందుండాలన్నారు. విద్యార్థులకు పరీక్ష మండలి విడుదల చేసిన ప్రశ్నా పత్రికలను పరిచయం చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పరీక్ష వేళల సమయాలను వివరించి పరీక్షలకు సిద్ధం అయ్యేలా సమావేశాలు నిర్వహించాలన్నారు. మధ్యవర్తిత్వంతో ఆరు జంటలు ఏకంహొసపేటె: విడాకుల కోసం దాఖలు చేసిన ఆరు జంటలను జాతీయ లోక్ అదాలత్లో మధ్యవర్తిత్వం ద్వారా ఏకం చేశారు. కర్ణాటక రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఆదేశాల మేరకు తాలూకా న్యాయ సేవల కమిటీ హగరిబొమ్మనహళ్లి కోర్టులో జాతీయ లోక్ అదాలత్లో భాగంగా చెక్ బౌన్స్ కేసులు, విభజన దావాలు, ఇతర కేసుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పార్టీలు, న్యాయవాదుల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించారు. సీనియర్ సివిల్ జడ్జి డీకే.మధుసూదన్ తన కోర్టులో 1141 కేసుల్లో 90 కేసులు పరిష్కరించారు. మొత్తం రూ.3,58,37,779ల పరిహారం అందించారు. సివిల్ జడ్జి సయ్యద్ మొహిద్దీన్ కోర్టులో 1523 కేసులు గుర్తించగా, 460 కేసులు పరిష్కరించారు. అదనంగా 1229 ఫ్రీ లిటిగేషన్ కేసుల్లో 48 కేసులు పరిష్కరించి మొత్తం రూ.41,62,642 పరిహారం అందించారు. -
కార్పొరేటర్ల టికెట్లకు కాంగ్రెస్ దరఖాస్తులు
శివాజీనగర: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం తీవ్రంగా పోరాడుతున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఓట్ చోరీ ఆందోళన అవకాశమిచ్చింది. ఢిల్లీలో ఆదివారం ఈ ధర్నాలో సీఎం సిద్దరామయ్య, డీకే తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సిద్దరామయ్య ఆదివారమే బెంగళూరుకు తిరిగివచ్చారు. అయితే శివకుమార్ హస్తినలోనే మకాం వేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు విరాళాల కేసులో ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉండడమే కారణం. అదే సమయంలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను కలిసి చర్చలు జరిపారు. తన భేటీల సారాన్ని డీకే వెల్లడించలేదు. అయితే కుర్చీ మార్పిడి వ్యవహారంలో త్వరగా ఒక నిర్ణయం తీసుకుని సందిగ్ధానికి ముగింపు పలకాలని విన్నవించినట్లు సమాచారం. అందరితో మాట్లాడాను: డీకే ఢిల్లీలో డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే సహా అందరినీ కలిశాను, ఢిల్లీకి వస్తే హైకమాండ్ను కలవాలి కదా అన్నారు. హైకమాండ్ నేతలతో ఎప్పుడూ భేటీలు ఉంటాయి, మీరేమీ భయపడకండి అని విలేకరులతో చమత్కరించారు. మరికొన్ని ముఖ్యమైన సమావేశాలు జరగాల్సి ఉండగా, దావణగెరెలో ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మృతితో అంతరాయం కలిగింది. మల్లికార్జున ఖర్గే కలసి డీకే దావణగెరెకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. సోమవారం ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరు కాలేకపోవడంతో మరో గడువును కోరతానని డీకే తెలిపారు. తనకు ఇచ్చిన నోటీస్లో ఎఫ్ఐఆర్ కాపీనే పంపలేదని తెలిపారు. త్వరలో పరిష్కార ఫార్ములా రాష్ట్రంలో తారాస్థాయికి చేరిన సీటు రగడకు హైకమాండ్ త్వరలోనే ఔషధం ఇవ్వనుందని ప్రచారం సాగుతోంది. ఆదివారం ఢిల్లీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలను కలిశారు. కుర్చీ గొడవల వల్ల పార్టీకి, ప్రభుత్వ గౌరవానికి భంగం కలుగుతోంది. త్వరగా ఓ పరిష్కారం రూపొందించాలని విన్నవించగా, ఇందుకు సానుకూలంగా స్పందన వచ్చిందని తెలిసింది. ఢిల్లీలో పార్లమెంటు, బెళగావిలో అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సీఎం, డీసీఎంలను ఢిల్లీకి పిలిపించుకొని ఫార్ములాను రూపొందించనున్నారు. అందరూ కొంచెం ఓర్పుతో ఉండాలని, అన్నింటినీ పరిష్కరిస్తామని మల్లికార్జున ఖర్గే తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల తరువాత సీఎం, డీసీఎంతో హైకమాండ్ భేటీ! హామీ ఇచ్చిన పార్టీ పెద్దలు ఢిల్లీ పర్యటనలో కొత్త పరిణామాలు హస్తినలో డీకే శివ వరుస మంతనాలు శివాజీనగర: గ్రేటర్ బెంగళూరులో 5 పాలికెల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల నుంచి వార్డు కార్పొరేటర్ల టికెట్లకు దరఖాస్తులను ఆహ్వానించింది. 369 వార్డుల్లో పోటీ చేసేందుకు ఎవరెవరికి ఆసక్తి ఉందని తెలుసుకోవటానికి దరఖాస్తులు ఆహ్వానించినట్లు కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. దరఖాస్తుల విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును పార్టీ భవన నిధికి జమ చేస్తారు. దరఖాస్తుకు జనరల్ ఆశావహులు రూ. 50 వేలు, మహిళలు, ఎస్సీ సముదాయం వారికి రూ.25 వేలు చెల్లించాలని తెలిపారు. కాగా, ఇంత రేటా.. అని దరఖాస్తుల ధరను చూసి నాయకులే ఆశ్చర్యపోతున్నారు. -
మీడియానే నాకు దారి చూపింది
● ఎంపీ యదువీర్ మైసూరు: మైసూరు–కొడగు కూడా అభివృద్ధి చెందిన భారతదేశం లాగా.. అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మారాలి అని స్థానిక ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ అన్నారు. మానస గంగోత్రిలోని సైన్స్ భవన్లో మైసూర్ జిల్లా జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో జరిగిన పత్రికా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నేను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, నాకు అనుభవం లేదన్నారు. తరువాత, మీడియా ఇచ్చిన ఉపయోగకరమైన సలహాలు, మార్గదర్శకత్వం వల్ల ఏదైనా సాధించడం సాధ్యమైంది. మైసూర్–కొడగు హైవే, రైల్వే లైన్, యాదవగిరిలో కొత్త రైల్వే స్టేషన్, భారతీయ భాషా సంస్థ లో కన్నడ కోసం ప్రత్యేక అధ్యయన వ్యవస్థ, హుణసూరు,, పిరియాపట్టణం వంటి ప్రదేశాలలో రైతులకు పథకాల పంపిణీ మొదలైనవి సాధ్యమవుతున్నాయి అని చెప్పారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ అది మైసూరు వారసత్వం, ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి అన్నారు. శ్రీహరి ద్వారకానాథ్, పాత్రికేయులు శివానంద తగడూర్, హరిప్రసాద్, కె. దీపక్, రవి పాండవపుర, ధర్మపుర నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను ఎంపీ సన్మానించారు. -
అజాత శత్రువు శామనూరు
శివాజీనగర: దావణగెరె సీనియర్ ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప (94) సేవలను అసెంబ్లీ కొనియాడింది. శివశంకరప్ప ఆదివారం వృద్ధాప్యంతో కన్నుమూయడం తెలిసిందే. సోమవారం బెళగావిలో రెండురోజుల సెలవుల తరువాత అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో శామనూరుకు శ్రద్ధాంజలి ఘటించి నిమిషం పాటు మౌనం పాటించి, సభను మంగళవారానికి వాయిదా వేశారు. మొదట సభ ఆరంభంకాగానే విధానసభ స్పీకర్ యూ.టీ.ఖాదర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శామనూరు శివశంకరప్ప ప్రజాభిమానం పొందిన నాయకుడు, ఆయన ఓర్పు, ఆదర్శాలు మనందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు. ఎవరితోను శత్రుత్వం లేని అజాత శత్రువని చెప్పారు. సీఎం సిద్దరామయ్య ప్రసంగిస్తూ శామనూరుతో తనకున్న అనుబంధం, ఆయన గొప్పతనాన్ని వర్ణించారు. బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్తో పాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రసంగించారు. అసెంబ్లీని మరో వారం పొడిగించండి: అశోక్ బనశంకరి: బెళగావి శీతాకాల సమావేశాలను మరో వారంరోజుల పాటు పొడిగించాలని విధానసభలో బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ డిమాండ్ చేశారు. ఈ నెల 8 నుంచి 19 వరకు అసెంబ్లీ జరుగుతుంది, కానీ పలు కారణాలతో రెండురోజుల సమయం వృథా అయింది. దీంతో సమావేశాలు మరోవారం రోజులు పాటు విస్తరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యల గురించి చర్చించాల్సి ఉందన్నారు. సుత్తూరు స్వామి సంతాపం మైసూరు: శివశంకరప్ప మృతి విచారకరమని మైసూరు సుత్తూరు మఠాదిపతి శివరాత్రి దేశికేంద్రస్వామి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దావణగెరె జిల్లాలోని శ్యామనూర్ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బిఎస్సీ చదివి, బియ్యం వ్యాపారం ప్రారంభించి అందులో రాణించారు. దావణగెరె మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా, అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తరువాత వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆయన ప్రజాదరణకు నిదర్శనం అని పేర్కొన్నారు. దివంగత ఎమ్మెల్యేకు అసెంబ్లీలో ఘన నివాళి -
జైలా.. మొబైల్ షాపా?
దొడ్డబళ్లాపురం: కార్వార జైల్లో అశాంతి నెలకొంది. తరచూ గొడవలు, విధ్వంసాలు జరుగుతున్నాయి. తాజాగా ఖైదీల వద్ద భారీగా మొబైల్ఫోన్లు పట్టుబడ్డాయి. జైలు ప్రధానాధికారి కొణ్ణూరు మల్లికార్జున జైల్లో తనిఖీలు చేయగా 7 మొబైళ్లు, ఇంకా కొన్ని నిషేధిత వస్తువులు లభించాయి. ఈ చెరసాలలో వారం రోజుల్లో రెండు సార్లు ఖైదీలు పోట్లాటకు దిగారు. మత్తు పదార్థాలు రాకుండా అడ్డుకున్నారనే కోపంతో జైలు సిబ్బంది మీద దాడికి పాల్పడ్డారు. కంప్యూటర్, టీవీలను పగలగొట్టారు. ఈ నేపథ్యంలో సోదాలు నిర్వహించారు. కొట్లాటలకు కారణమైన మంగళూరుకు చెందిన నలుగురు ఖైదీలను బళ్లారి, బెళగావి జైళ్లకు తరలించారు. రెండు నెలల క్రితం మంగళూరు జైలు నుంచి వీరిని తీసుకురాగా అందరితో రగడ పడుతూ వీరంగం సృష్టించేవారు. గుడ్లకు మళ్లీ టెస్టులు బనశంకరి: కోడిగుడ్ల వల్ల హాని లేదు అని ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు చెప్పినప్పటికీ.. గుడ్లపై అనుమానాలు తగ్గలేదు. బెంగళూరులో దుకాణాల్లో విక్రయించే కోడిగుడ్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని చర్చ సాగుతున్న నేపథ్యంలో గుడ్లను సేకరించి క్యాన్సర్ కారకాలపై పరీక్షలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. దీంతో ఆరోగ్య, ఆహారశాఖ అధికారులు నగరవ్యాప్తంగా షాపులు, సూపర్ మార్కెట్లు తదితరాలలో గుడ్లను సేకరిస్తున్నారు. 50 చోట్లకు పైగా తీసుకుని ల్యాబ్కు పంపించే పనిలో ఉన్నారు. గతంలోనూ ఇదే అనుమానంతో పరీక్షలు చేపట్టగా హానికర అంశాలేవీ బయటపడలేదు. ఓ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న గుడ్లలో నిషేధిత నైట్రోఫురాన్ యాంటిబయాటిక్తో పాటు మరో రసాయనం ఉన్నట్లు తేలింది. ఇవి క్యాన్సర్ కారకమని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. విమానంలో చిక్కుకున్న ఎమ్మెల్యేలు శివాజీనగర: దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో సుమారు 4 గంటలకు పైగా కర్ణాటకకు చెందిన 21 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు చిక్కుకున్నారు. ఓట్ చోరీ ధర్నాలో పాల్గొనేందుకు అనేకమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. దావణగెరెకు రావాలని సోమవారం తెల్లవారుజామున 5:30 గంటలకు బెళగావికి వెళ్లే విమానం ఎక్కారు. కానీ పొగమంచు వల్ల టేకాఫ్ కాలేదు. ఉదయం 10 గంటలైనా కూడా విమానం ఎగరలేదు. చివరకు 11 గంటల తరువాత విమానం బయల్దేరింది. మంత్రులు లక్ష్మి హెబ్బాళ్కర్, జార్జ్ సహా ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. -
చలి ప్రతాపం.. జనం హాహాకారం
కళ్యాణ కర్ణాటకలో అతి శీతలం● ఆరెంజ్ అలర్ట్ జారీబొమ్మనహళ్లి: రాష్ట్రంలో శీతాకాలం ప్రతాపం చూపిస్తోంది. ఆదివారం హావేరి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 8.1 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. దీనికి తోడు చలి, గాలులు, పొగమంచు వల్ల పిల్లలు, వృద్ధులు, రోగులు సతమతం అవుతున్నారు. మధ్యాహ్నమైనా వణుకు పుడుతోంది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన జిల్లాల్లో హావేరి 9వ స్థానంలో ఉంది. బీదర్ మొదటి స్థానంలో, బెల్గాం రెండవ స్థానంలో, ధార్వాడ్ జిల్లా మూడవ స్థానంలో ఉన్నాయి. వాకింగ్ కష్టమే దాదాపు అన్ని జిల్లాల్లో ప్రతి నగరం, గ్రామంలో ఉదయం దట్టంగా పొగమంచు ఆవరిస్తోంది. దీని కారణంగా పార్కులు, రహదారుల్లో వాకింగ్కు వెళ్లేవారు భయపడి ఇళ్లలోనే ఉండిపోతున్నారు. పొలాలకు వెళ్లాలంటే రైతులు, కూలీలు అమ్మో అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు చలిని తట్టుకుంటూ పొలాల్లో పనులు చేస్తున్నారు. స్వెటర్లు, జెర్కిన్లు, కంబళ్లు వంటి మందపాటి బట్టలు ధరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం చలి మంట వేసుకోవడం పరిపాటైంది. ఇక టీషాపుల్లో టీలు, కాఫీలకు రద్దీ ఏర్పడింది. ఎక్కడ టీ అంగడి, హోటల్ ఉన్నా జనం గుమిగూడుతున్నారు. పలు జిల్లాల్లో తీవ్ర చలి, గాలులు అనారోగ్య సమస్యలు అత్యంత శీతల వాతావరణం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి అనారోగ్యం వస్తోంది. జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు వంటివి ఆరోగ్యంగా ఉన్నవారికీ వస్తున్నాయి. ఉదయం, సాయంత్రం బయట నడవడం మానుకోండి. ప్రయాణం తగ్గించుకోవాలి. వేడి నీటిని ఉపయోగించాలి అని వైద్యులు చెబుతున్నారు.శివాజీనగర: చలి తీవ్రతరమైన నేపథ్యంలో ఉత్తర కర్ణాటకలో 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. కళ్యాణ కర్ణాటకలో కల్బుర్గి, బీదర్, విజయపుర, బెళగావి, బాగలకోట, హావేరి, యాదగిరి, ధార్వాడ, కొప్పళ జిల్లాల్లో రాబోయే రెండు రోజుల పాటు తీవ్ర చలి, గాలులు ఉంటాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఇప్పటికే అధిక చలి ఉండగా, మరింత శీతల వాతావరణం అలముకోనుంది. విజయపుర జిల్లాల్లో కనీస ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, ప్రజలు చలికి గజగణ వణికిపోతున్నారు. గత పది సంవత్సరాల్లో రెండోసారి ఉష్ణోగ్రత కనీస స్థాయికి చేరింది. 2023లో విజయపురలో 6.5 డిగ్రీల అతి స్వల్ప తాపం నమోదైంది. ఉద్యాన నగరిలో బెంగళూరు నగరంలో కూడా తీవ్రమైన చలి ఉంటుండగా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు కమ్ముకొని చల్లగాలులు వీస్తున్నాయి. కనీస ఉష్ణోగ్రత 14 డిగ్రీలుగా ఉంటోంది. హెచ్ఏఎల్ పరిధిలో ఆదివారం 13 డిగ్రీలకు పడిపోయింది. వాకింగ్కు వెళ్లేందుకు కూడా ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. -
నమో నాగనాథ
చింతామణి: పట్టణంలోని పురాణ ప్రసిద్ధి గాంచిన నాగనాథేశ్వరస్వామి ఆలయంలో లింగాకారునికి సోమవారం ప్రత్యేక అలంకరణ, పూజలు జరిపారు. భక్తులు పెద్దఎత్తున వచ్చి దర్శించుకొన్నారు. అర్చకులు నాగేంద్ర ఉదయం నుంచి శివలింగానికి అభిషేకం, పూలు నిర్వహించారు.నడిరోడ్డుపై ఉన్మాద చేష్టలు దొడ్డబళ్లాపురం: ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆడవాళ్లని వెంటపడి వేధిస్తున్న కామాంధున్ని బెంగళూరు కామాక్షిపాళ్య పోలీసులు అరెస్టు చేశారు. హారోహళ్లిలోని మాదేశ్వరగనర నివాసి వినోద్ (27) నిందితుడు. సుమనహళ్లి జంక్షన్ వద్ద స్కూటీలో వెళ్తున్న మహిళను ఫాలో చేసిన వినోద్ ఆమెను అసభ్యంగా తిడుతూ గట్టిగా కౌగిలించుకుని పరారయ్యాడు. భీతిల్లిన బాధితురాలు 112కి కాల్ చేయగా హొయ్సళ పోలీసులు గాలించి పోకిరీని బంధించారు. వినోద్ తరచూ ఇదేవిధంగా ప్రవర్తిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. చీకటి పడితే రోడ్డెక్కి మహిళలను వెంటాడేవాడని తెలిపారు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని భావిస్తున్నారు.ప్రియురాలే గెలిచింది ● పెళ్లి మండపంలో మూడుముళ్లు రాయచూరు రూరల్: ప్రేమ, పెళ్లి పేరుతో యువత దారి తప్పుతున్న ఉదంతాల నేపథ్యంలో పెళ్లి వేడుకలో ప్రియురాలు రచ్చ చేసి ప్రియున్ని వివాహమాడిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈనెల 12న నగరంలో రిషభ్కు తల్లిదండ్రులు ఓ అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఇన్ స్టాలో చూసి తెలుసుకున్న ప్రేయసి నగరానికొచ్చి పెళ్లిని నిలిపేసింది. రిషభ్ బళ్లారిలో చదువుతున్న సమయంలో కొప్పళకు చెందిన యువతితో ప్రేమాయణం సాగించాడు. ఆమె గర్భం దాల్చగా అబార్షన్ చేయించి, మళ్లీ ఓ గుడిలో మూడుముళ్లు వేశాడు. తాజాగా ఆమెను దూరంగా ఉంచి తల్లిదండ్రులు చెప్పినట్లు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇంతలో కళ్యాణ మంటపానికి చేరుకున్న ప్రియురాలు పోలీసుల సహకారంతో పెళ్లిని నిలుపుదల చేసి, పెద్దల సమక్షంలో తానే వివాహం చేసుకుంది. ఈ తతంగంపై మరో అమ్మాయి తరఫు బంధువులు భగ్గుమన్నారు. ప్రేమ బాగోతాన్ని దాచిపెట్టి మరో పెళ్లి ఎలా చేసుకుంటావు అని నిలదీశారు. వృద్ధురాలిపై అఘాయిత్యం మాలూరు: ఎటుచూసినా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి అపరిచితుడు చొరబడి సుమారు 75 సంవత్సరాల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన తాలూకాలోరని ఓ గ్రామంలో జరిగింది. వివరాలు.. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో తలుపులు పగులగొట్టి చొరబడిన దుండగుడు ఆమె నోరు నొక్కిపెట్టి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వృద్ధురాలు పెనుగులాడడంతో చివరకు పరారు అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న మాలూరు పోలీసులు మృగాని కోసం గాలింపు చేపట్టారు. ప్రైవేటు బస్సు దగ్ధం దొడ్డబళ్లాపురం: ఓ ప్రైవేటు బస్సు నడిరోడ్డు మీదే కాలి బూడిదైన సంఘటన కొడగు జిల్లాలో జరిగింది. సోమవారం ఉదయం కేరళ రాష్ట్రానికి చెందిన ప్రైవేటు బస్సు మడికెరి సమీపంలోని మాకుట్ట ఆంజనేయస్వామి దేవాలయం వద్ద వెళ్తుండగా మంటలు చెలరేగాయి. బస్సులో డ్రైవర్, కండక్టర్ మాత్రమే ఉన్నారు. ఇద్దరూ కిందకు దిగి దూరంగా పరిగెత్తారు. ఫైర్ సిబ్బంది వచ్చి ఆర్పివేసేటప్పటికి బస్సు పూర్తిగా కాలిపోయింది. -
చురుగ్గా డ్యామ్పై కొత్తగేట్ల పనులు
హొసపేటె: కల్యాణ కర్ణాటక రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయంపై కొత్త గేట్లను అమర్చేందుకు బోర్డు అధికారులు ముహూర్తం నిర్ణయించారు. జలాశయం యొక్క పాత గేట్ల తొలగింపు ఇప్పటికే వేగం పుంజుకొంది. డిసెంబరు 20వ తేదీ తర్వాత కొత్త గేట్లను అమర్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. గుజరాత్ సంస్థకు పనుల అప్పగింత తుంగభద్ర జలాశయంపై కొత్త గేట్లను అమర్చే పనులకు టెండర్ను గుజరాత్కు చెందిన హార్డ్వేర్ టూల్ అండ్ మెషినరీ టూల్ కంపెనీ దక్కించుకుంది. రూ.52 కోట్లతో కొత్త గేట్లను అమర్చాల్సి ఉంటుంది. జలాశయం యొక్క 33 క్రస్ట్ గేట్లలో 15 గేట్లు ఇప్పటికే అమర్చారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇందుకోసం ఇప్పటికే రూ.20 కోట్లు, కర్ణాటక ప్రభుత్వం రూ.10 కోట్లు వెచ్చించనున్నాయి. ఈ నిధులతో కొత్త గేట్ల నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. పాత గేట్లు తొలగింపు... జలాశయంలోని పాత గేట్లు తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. 18, 20, 24వ గేట్లను నైపుణ్యం కలిగిన కార్మికులను ఉపయోగించి తొలగించారు. జలాశయం యొక్క 27వ క్రస్ట్ గేట్ తొలగించే పని ప్రారంభమైంది. ఒకవైపు జలాశయం పాతగేట్ల తొలగింపు పనులు చేపడుతూనే, కొత్త గేట్ల ఏర్పాటుకు కర్ణాటక సర్కారు ప్రణాళిక సిద్ధం చేసింది. జలాశయంలో నీటి మట్టం 1613 అడుగులకు పడిపోయిన వెంటనే కొత్త గేట్లను అమరుస్తారు. రాబోయే ఐదు నుంచి ఆరు రోజుల్లో జలాశయం నీటి మట్టం 1618.95 అడుగుల నుంచి 1613 అడుగులకు తగ్గుతుంది. ఇందుకోసం ఇప్పటినుంచే నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి పనులు ప్రారంభించి జూన్ 2026 నాటికి అన్ని గేట్లను ఏర్పాటు చేస్తామని తుంగభద్ర బోర్డు వర్గాలు తెలిపాయి. తుంగభద్ర జలాశయానికి 33 కొత్త క్రస్టు గేట్ల ఏర్పాటుకు ప్రణాళిక డిసెంబరు 20 తర్వాత పనులు చేపట్టేందుకు ముహూర్తం ఖరారు -
ఆదిమ సాంస్కృతిక కేంద్రంలో శిక్షణ
కోలారు: నగర సమీపంలోని ఆదిమ సాంస్కృతిక కేంద్రంలో కన్నడ సాహిత్యానికి సంబంధించి నెలపాఠ్యాల రచనా కమ్మటం పేరుతో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శనివారం రాత్రి ఆదిమ రంగభూమి శిక్షణా కేంద్రం పాలక మండలి అధ్యక్షుడు మునిరత్నప్ప, ఆదిమ కేంద్రం అధ్యక్షుడు మునిస్వామి ప్రారంభించారు. మునిరత్నప్ప మాట్లాడుతూ నెలపాఠ్యాలను రచించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కన్నడ సాహిత్యంలో నెలపాఠ్యాలను ఎవరు, ఎప్పుడు ఏ విధంగా పరిచయం చేశారనే విషయాన్ని తెలిపారు. అనంతరం డాక్టర్ సరోజా మాట్లాడారు సిండికేట్ పభ్యుడు ఆర్బాజ్పాషా, ఆదిమ అధ్యక్షుడు మునిస్వామి,నాయక్, అగ్రహార రమేష్ పాల్గొన్నారు. -
మూడు దుకాణాల్లో చోరీ
సాక్షి బళ్లారి: నగరంలో చోరీలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఇటీవల దొంగల భయం తగ్గిందని భావించిన జనం.. శనివారం మూడు చోట్ల చోరీలు జరగడంతో ఉలిక్కిపడ్డారు. దొంగలు తమ ఉనికిని చాటుకునే విధంగా నగరం లోని బ్రూస్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామరాజ్ కాటన్, ముకుంద కలెక్షన్, తదితర దుకాణాల్లో చొరబడి నగదు, వస్తు సామగ్రి చోరీ చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ యంత్రాన్ని దోచుకెళ్లారు. సీఐ మాంతేష్ తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ సంఘటనతో వ్యాపారులు, నగర వాసులు ఆందోళనకు గురయ్యారు. నైతిక విలువలు నశించాయిరాయచూరు రూరల్: సమాజంలో నైతిక విలువలు నశించిపోతున్నాయని రాయచూరు దక్షిణ విద్యా శాఖ అధికారి రావుత్రావ్ పేర్కొన్నారు. నగరంలోని పండిత సిద్ధరామ జంబలదిన్నె రంగ మందిరంలో స్టెప్పింగ్ స్టోన్ పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు మానవీయ విలువలను వివరించి వారిని సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. సంస్కృతి, ఆచారం, విచారం, సనాతన సంప్రదాయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సన్న వీరేష్, జితేంద్ర, లాలాజీ, గీత, సీఐ నింగప్ప, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు బహుమతులు అందజేతరాయచూరు రూరల్: విద్యార్థులు మానవీయ విలువలు కలిగి ఉండాలని మాన్వి శానన సభ్యుడు హంపయ్య నాయక్, నేత రవి పేర్కొన్నారు. తాలూకాలోని పోత్నాల్ స్నేహ జ్యోతి పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు మరచి ప్రజలంతా సామరస్య జీవనం సాగించాలన్నారు. తల్లి తండ్రి, గురువు దైవమనే భావాలను విద్యార్థులకు నేర్పాలన్నారు. ఆరోగ్యం, పరిసరాలు పుస్తకం విడుదలరాయచూరు రూరల్: సమాజ సేవకు యువతీ, యువకులు సంసిద్ధులు కావాలని భారత వైద్యకీయ సంఘం మాజీ అధ్యక్షుడు రవిరాజేశ్వర్ పిలుపునిచ్చారు. నగరంలోని భారత వైద్యకీయ సంఘం భవనంలో డా.అరవింద్పటేల్ రాసిన అరోగ్యం–పరిసరాల పుస్తకాన్ని ఆయన విడుదల చేసి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావి తరాల మనుగడకు తోడ్పడాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం విస్మరించరాదని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలేష్, రావు తరావ్, సురేష్ సగరద్, విజయ్ రాజేంద్ర, శివానంద, అరవింద పటేల్, ఇందిర, సుశ్రిత, తదితరులు పాల్గొన్నారు. విడాకులకు వెళ్లి.. జంటగా ఇంటికి సాక్షి, బళ్లారి: చిన్న విబేధాలతో విడాకులు కోరుకుని కోర్టును ఆశ్రయించిన మూడు జంటలకు.. న్యాయమూర్తులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఒక్కటై జంటగా కలిసి ఇంటికి వెళ్లారు. కొప్పళ కోర్టు ఆవరణలో జరిగిన లోక్ అదాలత్లో ఈ ఘటన వెలుగు చూసింది. కారటిగి తాలూకా జూరటిగి నివాసి దావణ్ణ హుసేనప్ప, లక్ష్మీ అలియాస్ ఈరమ్మ దంపతులు, గంగావతి తాలూకా గూగిబండే నివాసి హనుమంత జరకుంటి, హుసేనమ్మ దంపతులు, వడ్డెరహట్టి నివాసి కృష్ణపాణి వెంకటేశ్వరరావు,(లెక్చరర్)సంధ్య దంపతుల మధ్య గతంలో చిన్న విబేధాలు నెలకొన్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విడాకుల కోసం భార్యా, భర్తలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణ చేసిన తర్వాత వారి మధ్య సయోధ్య కుదిర్చేలా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎట్టకేలకు దంపతులు అంగీకరించి జంటగా కలిసి ఇంటికి వెళ్లడంతో మూడు కుటుంబాల్లో మళ్లీ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. -
విమానాశ్రయానికి భూములు ఇవ్వం
హోసూరు: హోసూరు ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు రైతుల సాగుభూములను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తామని రైతులు తెలిపారు. స్థానికంగా అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా హోసూరు, డెంకణీకోట, సూళగిరి తాలూకాల్లో ఐదు ప్రాంతాలను పరిశీలించి రెండు ప్రాంతాలు విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమానికి సిద్ధమైంది. ఆదివారం రైతు రక్షణ సంఘ అధ్యక్షులు గణేష్రెడ్డి, సంఘ నాయకులు, కార్యకర్తలు బాధిత రైతులు మాజీ మత్రి పి. బాలక్రిష్ణారెడ్డిని కలిశారు. ఇప్పటికే జాతీయ రహదారి, సిఫ్కాట్, ఎస్టిఆర్ఆర్ రింగ్రోడ్డు వంటి అభివృద్ది పనులకు రైతుల నుంచి 25 వేల ఎకరాల సాగుభూములను లాక్కొన్నారని, రైతుల నుంచి స్వాధీనపరుచుకొన్న భూములకు సరైన పరిహారం కూడా చెల్లించలేదని, ఈ నేపథ్యంలో మళ్లీ భూసేకరణకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. వివిధ పథకాలకు భూములు కోల్పోయిన రైతులు ఇప్పుడు కూలీలుగా పనులు చేస్తున్నారని, తమ జీవితం కూడా అంతే అవుతుందని వాపోయారు. భూములు తీసుకుంటే ఆందోళనలు చేపడతామని తెలిపారు. -
గీతా టాలెంట్ షోకు విశేష స్పందన
మైసూర్: అమెరికాతో పాటు పలు దేశాల్లో జరుగుతున్న ’గీతా టాలెంట్ షో’ ద్వారా భగవద్గీత భక్తుల ఇళ్లకు చేరుకుంటోందని మైసూర్లోని అవధూత ఆశ్రమ పీఠాధ్యక్షుడు శ్రీ గణపతి సచ్చిదానందస్వామీజీ అన్నారు. ఆశ్రమంలోని నాదమంటపంలో ఆదివారం నిర్వహించిన గీతా మైత్రి మిలన్ కర్ణాటక 2.0 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ గీతా పోటీలను అమెరికాలో పదేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. బాలలు ఎంతో ఆసక్తితో వచ్చి భగవద్గీతను పారాయణం చేస్తున్నారన్నారు. భగవద్గీతలోని అంశాలపై సంధించిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇస్తూ అబ్బురపరుస్తున్నారన్నారు. అమెరికా మాత్రమే కాకుండా యూరప్, దుబాయ్, కెనడా, వెస్టిండీస్ ప్రజలు కూడా ఎంతో భక్తితో పాల్గొంటున్నారన్నారు. వారి ఆంగ్ల శైలి అర్థం కాకపోయినా, భగవద్గీత నేర్చుకోవడంలో వారి భక్తి, అంకితభావం ప్రశంసనీయమని స్వామీజీ అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తన కుటుంబం యొక్క భక్తి కారణమని గోవింద్ గిరి జీ గుర్తుచేసుకున్నారు. -
ఉల్కలపై అవగాహన
రాయచూరు రూరల్: గ్రామీణ విద్యార్థులకు ఉల్కలు, వాటి నుంచి సంభవించే సమస్యలను తెలుసుకోవాలని అధ్యాపకుడు షంషుద్ధీన్ తెలిపారు. జేగర్కల్లో రోటరీ క్లబ్ భారత జ్ఙాన, విజ్ఙాన సమితి, గురుకృప ట్రస్టు ఆధ్వర్యంలో ఉల్కలు, వాటి పాత్రపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. షంషుద్ధీన్ మాట్లాడుడూ పగటి వేళల్లో అకాశాన్ని ఎలా చూస్తారో.. రాత్రి వేళల్లోనూ ఉల్కలను అలా చూసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. మానవుడు తన చుట్టూ జరిగే విషయాలపై అవలోకనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర, హఫీజుల్లా, ఉమేష్, జనార్దన, వేంకటేష్, మల్లమ్మ, ఫరీదా బేగం, అమరేష్, తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యత పాటించాలి
కోలారు: మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన బోజనం అందించాలని శిక్షణాధికారి తిమ్మరాయప్ప సూచించారు. ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తాలూకాలోని వేమగల్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో వేమగల్ ఫిర్కా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల వంట సిబ్బందికి ఆదివారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వంట సిబ్బంది విద్యార్థులను తమ సొంత పిల్లలుగా చూడాలన్నారు. వంట గదిలో శుచి శుభ్రత పాటించాలన్నారు. వంటగదిలోకి ఇతరులను అనుమతించవద్దని తెలిపారు. అక్షర దాసోహ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రమణి మాట్లాడుతూ వంట చేసే సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆరోగ్య శిక్షణాధికారి గీతా పాల్గొన్నారు. -
లిథియం వెలికితీతకు శ్రీకారం
రాయచూరు రూరల్: కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు, కొప్పళ్ జిల్లాలో బంగారం, లిథియం నిక్షేపాల వెలికితీతకు సర్కారు శ్రీకారం చుడుతోంది. జియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా ఇప్పటికే ఆ ప్రాంతాల్లో నిక్షేపాలు ఉన్నట్లు గుర్తిండచంతో కర్ణాటక సర్కారు అనుమతులు లభించగానే పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొప్పళ్ జిల్లా కుష్టిగి తాలుకా అమరాపుర బ్లాక్లో టన్ను మట్టికి 14 గ్రాముల బంగారం, రాయచూరు జిల్లా లింగసూగురు తాలుకా గురుగుంట అమరేశ్వరలో లిథియం నిక్షేపాలు లభించాయి. లిథియంను ఎలక్ట్రానిక్ ఉత్పాదకాలు, వాహనాల బ్యాటరీ తయారీకి ఉపయోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ అధికారులతో చర్చలు జరిపి రెండు విడతలుగా తవ్వకాలు జరపాలని నిర్ణయించింది. -
కంపించిన ఇళ్లు.. జనం పరుగులు
సాక్షి బళ్లారి: ఉన్నపాటుగా భయంకరమైన శబ్ధం... ఇళ్లు కంపిస్తూ.. వస్తువులు, సామగ్రి కదిలి కిందపడ్డాయి. దీంతో జనం భయంతో బయటికి పరుగు తీశారు. చిత్రదుర్గం– దావణగెరె జిల్లాల మధ్య గల పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈ పరిస్థితి తలెత్తింది. స్థానికుల వివరాల మేరకు.. శనివారం రాత్రి పొద్దుపోయాక జనం గాఢ నిద్రలో ఉన్నారు. దావణగెరె తాలూకా బాలరామాపురం, చిత్రదుర్గం జిల్లా మొల్కామూరు తాలూకా కోలంమ్మనహళ్లి, తదితర గ్రామాల్లో రాత్రి బాంబు పేలినట్లు భారీ శబ్ధం వినిపించింది. దీంతో ఆయా గ్రామాల్లో ఇళ్లల్లో వస్తువులు, సామాగ్రి కదిలి చిందర వందరగా పడ్డాయి. దీంతో జనం ఇళ్ల నుంచి పరుగు తీశారు. ఇది భూకంపమా.. లేదా బాంబు పేలుళ్లా తెలియక ఆందోళన చెందుతూ ఇళ్లల్లోకి వెళ్లకుండా రాత్రంతా బయటే జాగరణ చేశారు. జగళూరు తహసీల్దారు ఘటనా స్థలాన్ని సందర్శించి మాట్లాడుతూ విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కళ్లల్లి సమీపంలో శబ్ధం వినిపించిందని, అయితే జనం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపారు. తనిఖీచేసి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని అధికారులకు స్థానికులు విజ్ఙప్తి చేశారు. దావణగెరె – చిత్రదుర్గం జిల్లాలో పేలుడు శబ్ధం ఇళ్లల్లోని సామగ్రి, వస్తువులు కదలడంతో భయపడిన జనం -
సోమేశ్వరాలయంలో మహా కుంభాభిషేకం
కోలారు : తాలూకాలోని మదనహళ్లి గ్రామంలోని సోమేశ్వర స్వామి ఆలయంలో నవగ్రహ సమేత పార్వతీ దేవి, సోమేశ్వరస్వామి, బలమురి గణపతి, నూతన దేవాలయ స్థిరబింబ, అష్టభందన ప్రతిష్టాపనా, విమానగోపుర, మహా కుంభాభి షేక, పూజా కార్యక్రమాలు ప్రధాన అర్చకులు కుమార దీక్షిత్ నేతృత్వంలో ఘనంగా జరిగాయి. కోలారు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ అనిల్కుమార్, ఎంపీ మల్లేష్బాబు, ముళబాగిలు ఎమ్మెల్యే సమృధ్దిమంజునాథ్ పాల్గొన్నారు. మదనహళ్లి, గుట్టహళ్లి, కల్లూరు, తిమ్మాపుర, మూరాండహళ్లి, దొడ్డగానహళ్లి, కెందట్టి గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నదానం చేశారు. -
ఎన్నికలకు ముందే బీజేపీ నేతలు వస్తారు
సాక్షి,బళ్లారి: ఎన్నికలకు ఆరు నెలల ముందే బీజేపీ నాయకులు తమ పార్టీలో చేరుతారని బీజేపీ బహిషృత ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ పేర్కొన్నారు. బెళగావి జిల్లా అథణి నియోజక వర్గంలో మరాఠా సమాజం తరపున 45 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో యత్నాల్ పాల్గొని మాట్లాడారు. కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది శివాజీని ఆరాధిస్తారని గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా ఆనాటి శివాజీ పాలన రావాలన్నారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని మోసం సాక్షి,బళ్లారి: బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తక్కువ ధరకే బంగారం ఇస్తామని అమాయకులను కొందరు మోసం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే మళవళ్లి కందూరులో జరిగింది. ఓ వ్యక్తి నుంచి లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిన ఇద్దరు మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. శివమొగ్గ జిల్లాకు చెందిన పరుశురామ, న్యామతిదానిహళ్లి గ్రామానికి చెందిన మనోజ్ ఇద్దరు తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పారు. మండ్య జిల్లా మళవళ్లి కందూరు గ్రామానికి చెందిన మూర్తి వారి మాయమాటలు నమ్మి రూ.6 లక్షలు ఇచ్చారు. తొలుత నాణ్యమైన బంగారం ఇచ్చి.. తర్వాత నకిలీ బంగారం ఇవ్వడంతో బాధితుడు మోసపోయినట్లు గమనించాడు. దావణగెరె జిల్లా హోన్నళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. -
అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
హొసపేటె: రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వాహనంపై పోలీసులు దాడి చేసిన సంఘటన విజయనగర జిల్లా కొట్టూరు తాలూకా నాగేనహళ్లిలో ఆదివారం జరిగింది. కొట్టూరు నుంచి చిత్రదుర్గం జిల్లా చెళ్లికెర వైపునకు బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన విజయనగరం జిల్లా కొట్టూరు పీఎస్ఐ గీతాంజలిషిండే దాడులు నిర్వహించారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్న ఆటో, 760 కిలోల బియ్యం కలిగిన 21 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అక్రమ మద్యాన్ని అరికట్టాలని 17న ధర్నా
కోలారు: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆబ్కారి కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించాలని రైతు సంఘం పదాధికారులు తీర్మానం చేశారు. ఆదివారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద పదాధికారులు సమావేశమయ్యారు. సంఘం రాష్ట్ర సంచాలకుడు నారాయణగౌడ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటికి కరవు ఉన్నా మద్యానికి మాత్రం లోటు లేదనే విధంగా పరిస్థితి తయారైందన్నారు. గ్రామీణ ప్రదేశాల్లో, టీ బంకులు, చిల్లర దుకాణాలలో మద్యం లభిస్తోందన్నారు. యువత, కార్మికులు మద్యానికి బానిసలయ్యారని, దీంతో పేదల కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 17వ చీపుర్లు, మహిళల మెడలోని పుస్తెల సమేతంగా ప్రతిఘటన నిర్వహించాలని తీర్మానం చేశామన్నారు. జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్, బంగవాది నాగరాజగౌడ, తదితరులు ఉన్నారు. -
కొత్త ఏడాదికి గట్టి భద్రత
బనశంకరి: కొత్త ఏడాదికి మరో 15 రోజులే మిగిలి ఉండడంతో సంబరాల వాతావరణం నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెంగళూరు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలో కారు బాంబు పేలుడు, గోవా పబ్లో అగ్ని ప్రమాదం వంటివి ఇక్కడ జరగకుండా సోదాలు చేపట్టారు. పబ్లు, రెస్టారెంట్లకు వెళ్లి న్యూ ఇయర్ ఏర్పాట్ల గురించి సమాచారం సేకరించి సూచనలు చేస్తున్నారు. డ్రగ్స్, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు చోటివ్వరాదని హెచ్చరిస్తున్నారు. అలాగే జన రద్దీ నివారణ కు ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు అనేదానిపై దృష్టి పెట్టినట్లు ఉత్తర విభాగం డీపీపీ బీఎస్.నేమగౌడ తెలిపారు. ఎంజీ.రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, చర్చ్ స్ట్రీట్, కోరమంగల 80 ఫీట్రోడ్డు, ఇందిరానగర 100 ఫీట్రోడ్డు తో పాటు కొత్త ఏడాది వేడుకలు ఆర్భాటంగా జరిగే ప్రముఖ స్థలాల్లో తనిఖీలను చేపట్టారు. మహిళా హాస్టళ్లలో జాగ్రత్త పీజీ హాస్టళ్లలో నియంత్రణ పాటించాలని తెలిపారు. 31 రాత్రి నుంచి మహిళా పీజీల వద్దకు పురుషులను రానివ్వరాదని తెలిపారు. ఏవైనా అసాంఘిక ఘటనలు జరిగితే దానికి పీజీ యజమానులదే బాధ్యత అని పోలీసులు మార్గదర్శకాలలో హెచ్చరించారు. వేడుకలు జరిగే అన్నిచోట్లా సీసీ కెమెరాలను అమర్చాలని హోటళ్లు, పబ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్లకు సూచించారు. కస్టమర్ల బ్యాగు, లగేజీలను చెక్ చేయాలని, ఆయుధాలు, పేలుడు వస్తువులు, గంజాయి, డ్రగ్స్ లేవని ధ్రువీకరించుకోవాలని సూచించారు. బెంగళూరులో హోటళ్లు, పబ్లలో పోలీసుల తనిఖీలు -
16న మళవళ్లికి రాష్ట్రపతి రాక
● హెలికాప్టర్ రిహార్సల్స్ మండ్య: మండ్య జిల్లాలోని మళవళ్ళి పట్టణంలోని సుత్తూరు ఆదిజగద్గురు శ్రీ శివరాత్రి శివయోగి 1,066వ జయంతి మహోత్సవం డిసెంబర్ 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ వేడుకలకు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 16న వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి భద్రత దళ అధికారులు వచ్చి మారేహళ్లి సమీపంలో నిర్మించిన హెలిప్యాడ్ను పరిశీలించారు. హెలికాప్టర్తో ల్యాండింగ్, టేకాఫ్ నిర్వహించారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు ఎక్కడ, ఎలా జరగాలనేది స్థానిక అధికారులతో కలిసి చర్చించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చన్నబసవస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్, జడ్జి దివ్య, ఎస్పీ మల్లికార్జున బాలదండి తదితరులు పాల్గొన్నారు. కాగా ఉత్సవాలకు ప్రధాన వేదిక, ప్రదర్శన స్టాళ్లు, క్యాటరింగ్ వ్యవస్థ, లక్షలాది భక్తులకు సరిపడేలా వసతి, పార్కింగ్ తదితరాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. అంతటా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.ఏనుగు దాడిలో రైతన్న బలిశివాజీనగర: రామనగర జిల్లాలో అడవి ఏనుగు దాడిలో రైతు బలైన ఘటన హారోహళ్ళి తాలూకా దుమ్మసంద్ర గ్రామంలో జరిగింది. రైతు పుట్టెమాదేగౌడ (48) ఆదివారం ఉదయం పొలంలో నీరు పెట్టేందుకు వెళ్తుండగా ఏనుగు దాడి చేసింది. తొండంతో కొట్టి తొక్కేయడంతో ఆయన అక్కడే మరణించాడు. బన్నేరుఘట్ట అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఏనుగు రాత్రంతా రైతుల పొలాల్లో పంటలను ఆరగించి పాడుచేసింది. అటవీ అధికారులు పరిశీలించగా, వారికి విరుద్ధంగా గ్రామస్థులు ఆందోళన చేశారు. మృతుని కుటుంబానికి, పంటలకు తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పదేపదే ఏనుగుల దాడులు జరుగుతున్నాయి, అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గుడ్లతో ప్రమాదం లేదు: మంత్రి శివాజీనగర: ప్రజలు ఎంతో ఇష్టపడి ఆరగించే కోడి గుడ్డు గురించి కొన్నిరోజులుగా వ్యతిరేక ప్రచారం సాగుతోంది. గుడ్లలో ఏఓజెడ్ అనే క్యాన్సర్ కారకం బయటపడిందని ప్రచారం వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో నూ భారీ చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఆరోగ్య మంత్రి దినేశ్ స్పందించారు. కొన్ని నెలల క్రితం గుడ్లకు ల్యాబ్లో పరీక్షలు చేయించాం. వాటిలో హానికరమైన అంశాలు బయటపడలేదు. కేంద్రం నుంచి కూడా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు అని చెప్పారు. మెట్రో చార్జీల తగ్గింపు ఉండదు శివాజీనగర: కొన్ని నెలల కిందట మెట్రో రైలు చార్జీల ధరలను పెంచడం తెలిసిందే. చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి, తగ్గించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మెట్రో చార్జీల నిర్ధారణ కమిటీ తిరస్కరించింది. చార్జీల తగ్గింపునకు అవకాశం లేదని తెలిపింది. అంతేకాకుండా స్టూడెంట్ పాస్లను మంజూరు చేయలేమని తెలిపింది. విద్యార్థులకు పాస్లు ఇవ్వాలని విద్యా సంస్థల నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయని తెలిపింది. ఆర్టీసీ బస్సు కింద నలిగిన బాలిక బనశంకరి: బస్సు ఎక్కుతుండగా బాలిక అదుపుతప్పి కిందపడిపోగా కేఎస్ ఆర్టీసీ డ్రైవరు గమనించకుండా ముందుకెళ్లడంతో చక్రం కింద నలిగి చనిపోయింది. ఈ ఘటన హాసన్ జిల్లా అరసికెరె తాలూకా హొళళ్కరె గేట్ వద్ద జరిగింది. వివరాలు.. బాలిక భార్గవి (4)ను తీసుకుని తల్లి యమున ఆదివారం దొడ్డమేటికుర్కేలోని ఆసుపత్రికి బయలుదేరింది. హొళల్కెరె గేట్ వద్ద బస్ ఎక్కుతుండగా బాలిక అదుపుతప్పి కిందపడింది. ఈ సమయంలో బస్డ్రైవరు గమనించకుండా వెళ్లడంతో బాలిక దుర్మరణం చెందింది. కళ్లముందే కూతురి మరణంతో తల్లి శోకతప్తురాలైంది. వెంటనే ఘటనా స్థలానికి అరసికెరె రూరల్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. డ్రైవరుపై కేసు నమోదు చేసి బస్సును పోలీస్స్టేషన్కు తరలించారు. -
ఎస్ఐ కావాలనుకుని.. దొంగ అయ్యాడు
● నకిలీ పోలీసు ముఠా అరెస్టు బనశంకరి: పోలీసుల వేషంలో డబ్బు వసూళ్లకు పాల్పడిన నకిలీ ఎస్ఐ తో పాటు నలుగురిని ఆదివారం బెంగళూరు విద్యారణ్యపుర పోలీసులు అరెస్ట్చేశారు. మల్లికార్జున, ప్రమోద్, వినయ్, హృత్విక్ పట్టుబడినవారు. వివరాలు.. ఎస్ఐ కావాలని మల్లికార్జున రెండుసార్లు పరీక్ష రాసి విఫలమయ్యాడు. కానీ పరీక్ష పాసై ఎస్ఐ అయినట్లు సొంతూరు సిరుగుప్పలో చెప్పుకున్నాడు. ఎస్ఐ డ్రెస్సు ధరించి, లాఠీ పట్టుకుని ఫోటోషూట్ చేసి నేను బెంగళూరులో ఎస్ఐ అని బడాయిగా ప్రచారం చేసుకున్నాడు. విలాసవంతమైన జీవనం గడపాలని మల్లికార్జున కలలు కనేవాడు. ఇతనికి హృత్విక్ తోడయ్యాడు. తన స్నేహితుడు నవీన్ ఇంట్లో భారీగా డబ్బు, బంగారం ఉందని, చోరీ చేద్దామని హృత్విక్ చెప్పాడు. ఇలా పోలీస్ యూనిఫాం ధరించి నవీన్ ఇంటికి కారులో నలుగురు వెళ్లారు, మీరు గంజాయి విక్రయిస్తున్నారు, ఇంట్లో సోదాలు చేయాలని బెదిరించి నవీన్ను లాఠీ, ఇసుపరాడ్తో చితకబాదారు. అరెస్ట్ చేయరాదంటే డబ్బు ఇవ్వాలని నవీన్ అకౌంట్లో ఉన్న రూ.87 వేలనగదు, బీరువాలో ఉన్న రూ.55 వేలు తీసుకుని ఉడాయించారు. బాధితుడు విద్యారణ్యపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా గాలించి ఆదివారం కిలాడీలను పట్టుకున్నారు. రూ.45 వేల నగదు, కారును సీజ్ చేశారు.నయవంచకునిపై కేసుమండ్య: జిల్లాలోని కేఆర్ పేటె తాలూకాలోని అక్కిహెబ్బలు హొబలిలో పుర గ్రామానికి చెందిన యువతిని పక్కింటి యువకుడు ప్రేమపేరుతో లోబర్చుకుని గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు కె.ఆర్.పేట గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితునిపై కేసు నమోదైంది. వివరాలు.. కేఆర్ పేటె తాలూకాలోని పుర గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతి ఇంటి పక్కనే పృథ్వీ నాయక్ ఇల్లు ఉంది. ఇద్దరూ పరిచయమై ప్రేమించుకునేవరకూ వెళ్లింది. ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడని ఫిర్యాదులో తెలిపింది. సంవత్సరం పాటు అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. అనారోగ్యం రావడంతో అక్టోబర్ 17న ఆమె కె.ఆర్. నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, వైద్యులు పరీక్షించి గర్భవతి అని తెలిపారు. దీంతో యువతి తల్లిదండ్రులు పృథ్వీ తల్లికి చెప్పగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని కోరింది. కానీ పృథ్వీ కుటుంబం పెళ్లి అంటే తిరస్కరిస్తోంది, దీంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. పుట్టుకతోనే కుడి కాలి వైకల్యం ఉందని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది. అంతర్రాష్ట్ర చోరుడు అరెస్టు బొమ్మనహళ్లి: కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగని బెంగళూరు దక్షిణలోని జిగని పోలీసులు పట్టుకున్నారు, అతని నుంచి కొన్ని బైక్లు, బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. అనేక చోరీ కేసుల్లో ఇతడు వాంటెడ్గా ఉన్నాడు. పోలీసులకు కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. జిగనిలోని తన అక్క ఇంటికి వచ్చాడని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఇంటిని చుట్టుముట్టి దొంగను పట్టుకున్నారు. హత్య, దోపిడీలు, దొంగతనాలు సహా 60 కేసుల్లో నిందితుడైన ప్రమాదకరమైన నేరగాడు అని పోలీసులు తెలిపారు. -
అనప రుచుల సంభ్రమం
మైసూర్: మైసూరు నగరంలోని నంజరాజ బహదూర్ సత్రంలో సహజ సమృద్ధి, సహజ సీడ్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో రెండు రోజుల మాగీ మేళా కోలాహలంగా ఆరంభమైంది. అనపగింజలతో చేసిన రకరకాల వంటకాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. వక్తలు మాట్లాడుతూ ఆయా కాలాల్లో లభించే పప్పుధాన్యాలను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. హైబ్రిడ్ రకాల దినుసులను తగ్గించాలని తెలిపారు. నాటు శనగలు శీతాకాలంలో మాత్రమే లభిస్తాయి, హైబ్రిడ్ అనప ఏడాది పొడవునా లభిస్తుంది, కానీ ఆ అనపకు రుచి, వాసన ఉండదు. హైబ్రిడ్ పంటలు ఎక్కువ తెగుళ్లకు గురవుతాయి అని చెప్పారు. కొత్తగా పండించిన నాటు శనగలు, వేరుశనగలు, రకరకాల సిరి ధాన్యాలు, బంగాళాదుంపలు, బఠానీలు మొదలైనవి ఈ మేళాలో అమ్మకానికి వచ్చాయి. అనప కేసరిబాత్, జామూన్లు, బజ్జీలు, రొట్టెలు–కూరలు ఇలా అనేక వంటకాలను నోరూరిస్తాయి. అలాగే ఎప్పుడూ చూడనన్ని రకరకాల అనప జాతుల గింజలు ప్రదర్శిస్తున్నారు. మైసూరులో మాగీ మేళా దేశీయ ధాన్యాల ప్రదర్శన -
ఎట్టకేలకు రౌడీ చిరుత బందీ
మైసూరు: గత కొన్నిరోజులుగా గ్రామస్తులను సతాయిస్తున్న చిరుతపులి చివరకు బోనులోకి చిక్కింది. మైసూరు తాలూకాలోని దొడ్డమారెగౌడనహళ్ళిలో చాలా రోజులుగా చిరుతపులి సంచరిస్తూ మేకలు, గొర్రెలు, కుక్కలను ఎత్తుకుపోతోంది. దీంతో ప్రజలు సాయంత్రమైతే బయటకు రావాలంటే భయపడుతున్నారు. అటవీ సిబ్బంది ఓ తోటలో బోనును ఏర్పాటు చేశారు. 8 నుంచి 10 ఏళ్ల వయసుగల మగ చిరుత అందులో బందీ అయ్యింది. అటవీ సిబ్బంది దానిని బంధించి తరలించారు. ఆవును చంపిన పులి జిల్లాలోని హెచ్డి కోటే తాలూకాలో సరగూరు సమీపంలో చౌడహళ్లి గ్రామంలో ఆవును పెద్దపులి హతమార్చింది. పొలంలో కట్టేసిన ఆవుపై పులి దాడి చేసింది. ఆవు ఆర్తనాదాలు విని దగ్గరిలోని ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి కేకలు వేయడంతో పులి అక్కడి నుండి పారిపోయింది. ఇటీవలే తల్లి పులి, నాలుగు పిల్ల పులులను బంధించారని ఊపిరి పీల్చుకున్న ప్రజలు, మళ్లీ పులి క్రూరత్వాన్ని చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. -
ప్రజల కోసమే ఓట్ చోరీ ఆందోళన
శివాజీనగర: సీఎం కుర్చీ మార్పిడి గురించి తీవ్రంగా చర్చ జరుగుతున్న సందర్భంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో ఏఐసీసీ సీనియర్ నాయకులతో భేటీలు జరిపారు. ఆదివారం హస్తినలో రాహుల్గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఓట్ చోరీ ఆందోళనలో సీఎం సిద్దరామయ్య, డీకే, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రముఖులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భోజనం ఏర్పాటు చేశారు. సిద్దరామయ్య ఆలస్యంగా ఢిల్లీకి చేరుకొన్నారు. డీకే శనివారం సాయంత్రమే వెళ్లి రాజకీయ మంత్రాంగాన్ని ఆరంభించారు. కర్ణాటక భవన్లో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు డీ.కే తో చర్చలు జరిపారు. తరువాత ఖర్గే ఏర్పాటు చేసిన విందుకు వెళ్లారు. అక్కడ ఖర్గే తో పాటు రాహుల్గాంధీ, సోనియాగాంధీలను కలిసినట్లు సమాచారం. ఈ సమయంలో డీకే తన వాదనను హైకమాండ్కు వినిపించారు. అధికార మార్పిడి గొడవ మొదలయ్యాక డీకే తొలిసారిగా రాహుల్ను కలవడం గమనార్హం. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, అలాగే 2 బ్రేక్ఫాస్ట్ సమావేశాల వివరాలనూ డీకే వివరించినట్లు తెలుస్తోంది. సీఎం కుర్చీ మార్పిడి గురించి ఒకరోజు ప్రత్యేకంగా సమావేశం జరుపుదామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక సీఎం సిద్దరామయ్య ఢిల్లీలో హడావుడి లేకుండా ఉన్నారు. డీకే సన్నిహిత ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్.. డీకే జనవరి 6 గాని, 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని ఇటీవల ప్రకటించారు. ముఖ్యమంత్రి మార్పు లేదని సిద్దరామయ్య తనయుడు, ఎమ్మెల్సీ యతీంద్ర చెబుతున్నారు. దీంతో ఏం జరగబోతుందనేది గందరగోళంగా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో మంతనాలు ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటక భవన్లో బస చేశారు. డీసీఎం డీకే శివకుమార్తో పలువురు మంతనాలు జరిపారు. వారితో ఆయన అల్పాహారం సేవించారు. ఆర్.బీ.తిమ్మాపుర, మాంకాళ వైద్య, మాజీ మంత్రి తన్వీర్ సేఠ్, ఎమ్మెల్యేలు అల్లమప్రభు పాటిల్, ప్రదీప్ ఈశ్వర్, ఆనేకల్ శివణ్ణ, ఏసీ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు సలీమ్ అహమ్మద్, పుట్టణ్ణ, మంజునాథ్ భండారితో పాటుగా పలువురు డీకేతో విడివిడిగా కలిశారు. ఈ అల్పాహార విందు కుతూహలానికి కారణమైంది. డీకే శివకుమార్ అభిమానులు ఢిల్లీలో హల్చల్ చేశారు. కాబోయే సీఎం డీకే శివకుమార్కు జై అంటూ నినాదాలు చేశారు. ఓట్ చోరీ ఆందోళన జరుగుతున్న రాంలీలా మైదానంలో డీకే అభిమానులు జై జై నినాదాలు చేశారు. ఓట్చోరీ ఆందోళనకు సీఎం సిద్దు, డీసీఎం శివ హాజరు ఖర్గే విందు భేటీలో శివకుమార్ రాహుల్గాంధీతో రాష్ట్ర రాజకీయాలపై చర్చ దేశంలోని 140 కోట్ల మంది ఓటు హక్కును కాపాడేందుకు తాము ఓట్ చోరీకి విరుద్ధంగా పోరాటం చేస్తున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని డీసీఎం డీ.కే.శివకుమార్ అన్నారు. ఆదివారం ఢిల్లీలో కర్ణాటక భవన్లో శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో బెంగళూరు ఫ్రీడంపార్కులో తాము ఓట్ చోరీకి వ్యతిరేకంగా పోరాటం ఆరంభించామని, ఇప్పుడు ఢిల్లీలో జరుపుతున్నామని చెప్పారు. ఈ దేశంలో నిర్భయంగా, న్యాయసమ్మతంగా ఎన్నికలు జరపాలని సందేశం ఇస్తున్నామన్నారు. ఇప్పుడు దేశంలో ఎన్నికలు న్యాయసమ్మతంగా జరగలేదు. ఓట్ల చోరీ జరుగుతోంది. ఇందుకు వేలాది ఉదాహరణలు ఉన్నాయి. ఇంత జరిగినా కూడా ఎన్నికల కమిషన్ సరైన సమాధానం ఇవ్వడం లేదు. రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు రోడ్లపైకి వచ్చాం అని అన్నారు. కర్ణాటక నుంచి సుమారు 4 వేల మంది కార్యకర్తలు, నాయకులు సొంత ఖర్చులతో వచ్చారన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి, ఓటు హక్కును కాపాడాలని వచ్చారని తెలిపారు. ఢిల్లీకి వచ్చే వాహనాలను బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. తమ పోరాటాన్ని అడ్డగించడం సాధ్యం కాదని అన్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆయన సంతోషం కోసం ఏమైనా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాలకు నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. -
పెళ్లి వేడుకలో ప్రియురాలి రచ్చ
శివాజీనగర: పది సంవత్సరాల నుంచి ప్రేమించిన యువతికి చేయిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో మోసకారి ప్రియుడు. పెళ్లి మండపానికి ప్రియురాలు వచ్చి రభస చేసింది. పంచాయతీ చివరకు పోలీసు స్టేషన్కు చేరింది. ఈ ఘటన 13న చిక్కమగళూరులో ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. బాధితురాలు, పోలీసుల సమాచారం మేరకు.. స్థానికుడు శరత్ అనే యువకుడు, హాసన్ జిల్లా బేలూరు తాలూకాకు చెందిన యువతిని పదేళ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. త్వరలో పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. అతని కుటుంబం సైతం వివాహానికి అంగీకరించింది. దసరా సమయంలో పెళ్లి చర్చలు జరిగాయి. శరత్కు గతంలోనే పెళ్లయి, మూడేళ్లకు విడాకులు తీసుకున్నాడు. ఆ విషయాన్ని యువతికి చెప్పలేదు. అంతలోనే మరో వివాహం 13న మరో అమ్మాయితో ఫంక్షన్హాల్లో పెళ్లి జరిగింది. తాళి కట్టిన కొంతసేపటికి ప్రియురాలు చేరుకుని తానే ప్రియురాలిని, ఈ పెళ్లిని నిలిపివేసి తనను వివాహమాడాలని గొడవకు దిగింది. పోలీసులు వచ్చి ఆమెను, వరున్ని ఠాణాకు తీసుకెళ్లి బుద్ధిమాటలు చెప్పారు. ప్రియురాలినే పెళ్లాడాలని సూచించగా శరత్ అక్కడ సరేనని చెప్పి వచ్చేశాడు. బాధిత యువతిపై శరత్ బంధువులు దాడిచేసినట్లు తెలిసింది. గుట్టుగా మరో యువతికి మూడుముళ్లేసిన ప్రియుడు చిక్కమగళూరులో సంఘటన -
వైభవంగా దుర్గాదేవి దీపోత్సవం
హొసపేటె: హొసపేటెలోని తళవారకేరి రాంపూర్ దుర్గాదేవి దీపోత్సవం శుక్రవారం సాయంత్రం జరిగింది. జాతర, రథోత్సవాల్లో వందలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా దీపాలు వెలిగించి భక్తులు కోరికలు నెరవేర్చుకున్నారు. దేవికి పూలు, పండ్లు, గింజలు, కర్పూరం సమర్పించారు. హరికథ, భజనలు, పాటలు ఇతర కార్యక్రమాలను నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం హొసపేటె: ఐషర్ వాహనం, లారీ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం రాత్రి విజయనగర జిల్లాలోని కూడ్లిగి తాలూకా బణవికల్లు వద్ద జాతీయ రహదారి– 50పై చోటు చేసుకుంది. ఘటనలో గదగ్కు చెందిన రైతు రంగప్ప(35), డ్రైవర్ గణేష్(39) అక్కడికక్కడే మరణించారు. గదగ్లో పండించిన ఉల్లి పంటను యలహంక మార్కెట్కు ఐషర్లో వాహనంలో తరలిస్తుండగా ఐషర్ వాహనం టైర్ పగిలి పోయింది. దీంతో వాహనాన్ని ఆపి కిందకు దిగి చూస్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. కానాహొసహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంగీత కళకు పుట్టరాజ గవాయి సేవలు భేష్రాయచూరు రూరల్: నేటి రోజుల్లో నశించి పోతున్న సంగీత కళకు, కళాకారులకు పుట్టరాజ గవాయి అందించిన సేవలు అజరామరమని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. శనివారం సోమవారపేట మఠంలో పుట్టరాజ గవాయి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత సమ్మేళనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక యుగంలో సంగీత కళను భవిష్యత్లో యువతకు జ్ఞాపకం ఉండేలా చూడాలన్నారు. సాహిత్యం, సంగీతం మపిషికి మూలమన్నారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నులై ఆడుతూ, పాడుతూ పని చేస్తే అలసిన, సొలసిన మనస్సులు కుదుట పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కల్లయ్య అజ్జ, సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి, వీరసంగమేశ్వర శివాచార్య స్వామి, నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, పంపాపతి శాస్త్రి, చెన్నయ్య స్వామి, రవి, నరసింహులున్నారు. పురాతన బావి జీర్ణోద్ధరణకు శ్రీకారంరాయచూరు రూరల్: నగరంలో పురాతన బావి జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. రామమందిరం వెనుక భాగంలోని బావిని శుభ్రం చేయడానికి దారి దీప సంస్థ అధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో పూడిక, చెత్త, చెదారం, ఇతర పదార్థాలను తొలగించారు. నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, అమరేష్ల సహకారంతో బావి స్వచ్ఛతకు నడుం బిగించారు. రామమందిరం బావి నుంచి ముత్యాలమ్మ ఆలయంలో అభిషేకానికి ఈ బావి నీటిని వినియోగించేవారు. నేత్రపర్వంగా యల్లమ్మ దేవి రథోత్సవంరాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకాలోని జాలహళ్లిలో శుక్రవారం సాయంత్రం యల్లమ్మ దేవి జాతర, రథోత్సవాలు జరిగాయి. జాతర, రథోత్సవాల్లో వందలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. సిద్దరామేశ్వర శివాచార్య, సుల్తాన్పుర శంభు సోమనాథ శివాచార్య ఆధ్వర్యంలో రథోత్సవం చేపట్టారు. -
తెరచుకోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
హుబ్లీ: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఎక్కడో చెప్పండి బాబోయ్.! అని అంటున్నారు దావణగెరె జిల్లా రైతులు. వివరాలు.. వెన్నదోశెకు పేరొందిన నగరం దావణగెరె జిల్లాలో ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న విక్రయించే మార్గాల కోసం కన్నడ రైతన్న పడరాని పాట్లు పడుతున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. దావణగెరె జిల్లాలో మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభిస్తాం, ప్రతి ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున గరిష్టంగా 50 క్వింటాళ్ల వరకు కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం. ప్రతి క్వింటాల్కు రూ.2400ల మద్దతు ధర నిర్ణయించామని ఆ జిల్లాధికారి డాక్టర్ గంగాధర్ స్వామి ఆర్భాటంగా పత్రికా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే రైతులు తమ పేరు నమోదు కోసం మొత్తం ఏపీఎంసీ మార్కెట్ కలియ తిరిగినా ఒక్క చోటైనా కొనుగోలు కేంద్రం కనబడితే అదే పది వేలు అనుకున్న రైతన్నకు మొండి చేయి మిగిలింది. ఫలించని జిల్లాధికారి భరోసా జిల్లాధికారి కార్యాలయ మీటింగ్ హాల్లో మొక్కజొన్న కొనుగోలు గురించి జరిగిన సమావేశంలో డీసీ గంగాధర స్వామి పైమేరకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రబీ సీజన్లో రైతులు పండించిన మొక్కజొన్నలను కొనుగోలు చేస్తాం. డిస్టిలరీ యజమానులు మొక్కజొన్నల కొనుగోలు తేదీ నుంచి మూడు రోజుల్లో ఆ రైతులకు ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తామని డీసీ వివరించారు. అంతేగాకుండా సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 730 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. రైతులు ప్రయోజనం పొందాలని సూచించారు. సహకార శాఖ, ఏపీఎంసీ అధికారులు మొక్కజొన్నల కొనుగోలు గురించి సమాచారం ఉన్న కరత్రాలను ముద్రించి రైతులకు ఇవ్వాలి. ఎటువంటి గందరగోళం లేకుండా అధికారులు అన్నదాతకు అండగా నిలవాలని సూచించారు. పంట విక్రయానికి నానా పాట్లు అన్నదాతల్లో ఆనందం ఆవిరి -
నవలి రిజర్వాయర్ నిర్మాణం కలేనా?
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాం పాతబడడంతో నూతనంగా కొప్పళ జిల్లా గంగావతి తాలూకా నవలి వద్ద చేపట్టనున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కలేనా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి యడియూరప్ప నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చారు. రూ.15 వేల కోట్లతో చేపట్టనున్న నవలి రిజర్వాయర్ నిర్మాణం ఇక అటకెక్కినట్లేని ఆయకట్టు రైతులు భావిస్తున్నారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల అమరిక పనులు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నవలి రిజర్వాయర్ నిర్మాణానికి తిలోదకాలిచ్చినట్లేనని తెలుస్తోంది. రూ.15 వేల కోట్ల వ్యయంతో చేపట్టే దానికంటే డ్యాంకు క్రస్గేట్లు ఏర్పాటు చేస్తే మరో 50 ఏళ్ల వరకు రైతులకు సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన సర్కార్ నవలి వద్ద నిర్మించే రిజర్వాయర్కు వేసిన పునాది కేవలం పేరుకు మాత్రమే అనే చర్చ వినబడుతోంది. కొప్పళ, రాయచూరు జిల్లాల రైతులకు నవలి వద్ద రిజర్వాయర్ ఏర్పాటైతే ఆయకట్టు చివరి భూముల రైతులకు సక్రమంగా నీరందుతాయనే భావనకు ప్రభుత్వ ఉదాసీనత గొడ్డలి పెట్టుగా మారింది. దీంతో తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూముల రైతుల ఆశలు అడియాసలయ్యాయి. నేడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం రాయచూరు రూరల్: నగరంలోని టాగూర్ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు అలుమ్ని బ్యాచ్ సంచాలకులు వీరేంద్ర జాలదార్ వెల్లడించారు. శనివారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1975 నుంచి పాఠశాలలో విద్యనభ్యసించిన పాత విద్యార్థుల ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారన్నారు. దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు సుమారు 2500 మందికి పైగా కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారన్నారు. మహిళా కాంగ్రెస్కు నియామకం రాయచూరు రూరల్: రాష్ట్ర మహిళ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా వందనను నియమిస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆమె ఈమేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై స్పందించాలని కార్యకర్తలకు సూచించారు. త్వరలో జరగనున్న జిల్లా, తాలూకా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం జారీ చేసిన పంచ గ్యారెంటీ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. గంజాయికి అడ్డుకట్ట వేద్దాంమాలూరు: తాలూకాలో గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సీఐ రామప్ప సూచించారు. పట్టణంలోని పాత్రికేయుల సంఘం కార్యాలయంలో శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగర, గ్రామీణ ప్రాంతాలలో గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టపడాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. తాలూకాలో ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందితే తమకు సమాచారం అందించాలన్నారు. రాత్రి సమయాల్లో పోలీసు గస్తీని పెంచుతామన్నారు. సంఘం అధ్యక్షుడు విజయ్కుమార్, ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి పాల్గొన్నారు. యువత కౌశల్యాలను పెంచుకోవాలికోలారు: యువకులు సమయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కౌశల్యాలను పెంపొందించుకోవాలని కేజీఎఫ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నారాయణ్ సూచించారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ ధ్వజ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్కౌట్స్ ధ్వజాలను విడుదల చేసి మాట్లాడారు. యువకులు చదవడాన్ని అభ్యాసం చేసుకున్నప్పుడే ఇతిహాసాన్ని అధ్యయనం చేయడానికి సాధ్యమవుతుందన్నారు. స్కౌట్స్ బాబు, అంథోని సలీనా, వెంకటేష్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులకు అభినందనలుకోలారు: బెంగళూరు విశ్వ విద్యాలయం అంతర్ జిల్లా కొండగుట్టల పరుగు పందెం పోటీల్లో కోలారు మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారని కళాశాల క్రీడా సమితి సభ్యుడు సుబ్రమణి తెలిపారు. విశేష సాధన చేసిన విద్యార్థినులు తనుశ్రీ, జ్యోతి, శైలా, ఆశా, దివ్య, ఉమాశ్రీలను అభినందించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసగౌడ మాట్లాడుతూ కళాశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ చాటి పేరుప్రతిష్టఉ తేవడం కళాశాలకు గర్వకారణమన్నారు. -
బెంగళూరుకు 2 పెరిఫెరల్ రింగ్ రోడ్లు
బనశంకరి: బెంగళూరు శివారులో రూ.26 వేల కోట్ల వ్యయంతో 131 కిలోమీటర్ల పొడవుతో రెండు పెరిఫెరల్ రింగ్ రోడ్లను నిర్మిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. శనివారం విధానసౌధ బ్యాంక్వెట్ హాల్లో గ్రేటర్ బెంగళూరు ప్రాధికార పరిధిలోని 5 నగర పాలికెల్లో కర్ణాటక అపార్టుమెంట్ (యజమాన్య నిర్వహణ) బిల్లు– 2025 గురించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక పెరిఫెరల్ రింగ్రోడ్డు 67 కిలోమీటర్లు, మరో రోడ్డు 77 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్ల నిర్మాణానికి రూ. 26 వేల కోట్లు అవసరమని అంచనా. హడ్కో సంస్థ నుంచి రుణం తీసుకుని నిర్మాణం చేపట్టాలని తీర్మానించామని తెలిపారు. సొరంగ మార్గానికి త్వరలో టెండర్లు నగరంలో సొరంగ రోడ్డు మార్గాన్ని ఉత్తర– దక్షిణ, తూర్పు– పశ్చిమంగా చేపట్టాలని నిర్ణయించగా దీనిపై అనేక విమర్శలు వచ్చాయని, విమర్శలను పట్టించుకోమని, పనులు సాగిస్తామని, త్వరలో టెండర్లను పిలుస్తామని డీసీఎం చెప్పారు. దేశంలోనే మొదటిసారి 50 కిలోమీటర్ల పొడవుతో డబుల్ డెక్కర్ రోడ్డును, ఫ్లై ఓవర్ పై మెట్రోరైలు మార్గాన్ని నిర్మిస్తామని చెప్పారు. అలాగే 117 కిలోమీటర్ల పొడవుతో కొత్త ఫ్లై ఓవర్ను నిర్మించే యోచన ఉందన్నారు. బెంగళూరు వాతావరణం చాలా బాగుంటుందని అన్నారు. అందుకే ఉద్యోగాల కోసం బెంగళూరుకు వచ్చేవారు పెరిగారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు, విశ్రాంత జీవనానికి అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. శరవేగంగా విస్తరిస్తున్న బెంగళూరుకు సుపరిపాలన అందించడానికి గ్రేటర్ బెంగళూరు ప్రాధికారను ఏర్పాటు చేశామన్నారు. నగర జనాభా 1.4 కోట్లు ఉండగా, 1 కోటి వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని 1.34 కోట్ల వాహనాలు సంచరిస్తున్నాయని తెలిపారు. నేను బెంగళూరులోనే రాజకీయాల్లోకి చేరి ఈ స్థాయికి వచ్చాను, నగరం గురించి చాలా అవగాహన ఉంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించాలి, దీని కోసం అనే పథకాలను రూపొందించామని తెలిపారు. 131 కి.మీ పొడవునా నిర్మాణం ఖర్చు రూ.26 వేల కోట్లు: డీసీఎం శివ -
తేరహళ్లి కొండపై నీటి ఎద్దడి
తేరహళ్లి గ్రామంలోని బావిడ్రమ్ములో నీరు నిల్వ చేసుకున్న గ్రామస్థులు కోలారు: కొండరాజనహళ్లి పంచాయతీ పరిధిలోని తేరహళ్లి కొండపైన ఏడు గ్రామాలలో తాగునీరు, కనీస వసతులు కరవయ్యాయి. కొండపై తేరహళ్లి, కుప్పళ్లి, ఆదిమ (శివగంగ), పాపరాజనహళ్లి, కెంచగౌడనహళ్లి, బెట్టహొసహళ్లి, గ్రామాలు ఉన్నాయి. 500కు పైగా ఇళ్లలో జనం నివాసముంటున్నారు. నీటి సమస్యను అధిగమించడానికి ఇక్కడి జనం ఇంటి ఎదుట డ్రమ్ములు పెట్టుకొని వాటిలో నీరు నింపుకుంటున్నారు. ఏ గ్రామంలో చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ప్రస్తుతం గ్రామస్థులకు తాగడానికి ప్రభుత్వం తాగునీరు అందించలేని పరిస్థితి. కొండపై బోరు వేసేందుకు అవకాశం లేకపోవడంతో దూరంగా ఉన్న చెరువులు, బావుల నీటినే గ్రామస్థులు తాగుతున్నారు. కనీస వసతులైన మురుగు కాల్వలు, వీధి దీపాలు, ఆరోగ్య కేంద్రం సౌకర్యాలు కూడా లేవు. చిరుతలు సంచరిస్తున్నా.. భయం నీడన ఇక్కడ జనం జీవనం సాగించాల్సి వస్తోంది. కొండ కింద 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు నిర్మించాలని తలపెట్టినా నిధుల కొరతతో ఆగిపోయింది. సమస్యను పరిష్కరించి తాగునీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
మడికెరి హోంస్టేలో.. హనీట్రాప్
దొడ్డబళ్లాపురం: హనీ ట్రాప్లో పడ్డ యువకుడు యువతి వద్ద నుంచి భయాందోళనతో నగ్నంగా రోడ్డు మీదకు పరిగెత్తుకొచ్చాడు. ఈ వింత సంఘటన కొడగు జిల్లా మడికెరిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... మహేశ్ అనే యువకునికి ఫేస్బుక్లో యువతి పరిచయమైంది. తరువాత ఫోన్లో మాట్లాడుకోసాగారు. ఆమె పిలవడంతో అతడు మడికెరికి వచ్చి హోంస్టేలో బసచేశాడు. యువతి కూడా అక్కడే ఉంది. అయితే అతడు బట్టలు లేకుండా కేకలువేస్తూ బయటకు పరుగులు తీయడంతో జనం చూసి ఆశ్చర్యపోయారు. ఎవరో దొంగ అనుకుని జనం అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఫేస్బుక్లో పరిచయమైన యువతి తనను హనీట్రాప్ చేసినట్టు మహేశ్ తెలిపాడు. లోపల గదిలోకి వెళ్లాను, ఆమెతో పాటు కొందరు వ్యక్తులు ఉన్నారు, నన్ను నగ్నంగా చేసి డబ్బులు డిమాండు చేశారు. జేబులో ఉన్న నగదు, మొబైల్ లాక్కున్నారు. ఎలాగో తప్పించుకుని వచ్చాను అని చెప్పాడు. పోలీసులు యువతి, మిగతావారిపై కేసు నమోదు చేసుకున్నారు. నవ వివాహిత ఆత్మహత్య ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో జరిగింది. వివరాలు.. ఐశ్వర్య (22) 7 నెలల క్రితం పెద్దలను ఎదిరించి లక్ష్మినారాయణ అనే యువకున్ని ప్రేమ వివాహం చేసుకుంది. తన చెల్లెలి పుట్టినరోజు ఉంది, పుట్టింటికి వెళతానని భర్తను కోరింది. అయితే భర్త నిరాకరించడంతో ఆవేదన చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నగ్నంగా పరుగులు తీసిన యువకుడు యువతి, ముఠాపై కేసు -
బళ్లారిలో బంగారం పేరిట బురిడీ
సాక్షి,బళ్లారి: ఆయన బళ్లారి నగరంలో పేరొందిన బంగారు వ్యాపారి. అయితే ఉన్నఫళంగా బోర్డు తిప్పేశారు. నగరంలోని బెంగళూరు రోడ్డులో సాయి కమల్ జ్యువెలరీ యజమాని జగదీష్ గుప్తా ఐపీ పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. గత 15 రోజులుగా గుప్తా కనిపించకపోవడంతో గాంధీనగర్ పోలీసు స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో ఆయన నగరంలో ప్రత్యక్షమయ్యారు. కోట్లాది రూపాయల బంగారు వ్యాపారం చేస్తూ పేరు గడించిన ఈయన ఎంతో మంది వద్ద నెలవారీ చందాలు కూడా కట్టించుకుని బంగారు వ్యాపారం చేసేవారని తెలుస్తోంది. నెలనెలా డబ్బులు కంతుల వారీగా కడితే సంవత్సరం తర్వాత అందుకు సంబంధించిన బంగారం తరుగు తదితరాలు లేకుండా ఇస్తుండటంతో జనం పెద్ద ఎత్తున నెల వారి చందాలను కోట్లాది రూపాయల మేర చెల్లించారు. గుప్తా కూడా బెంగళూరులో ఓ వ్యవహారంలో పెద్ద ఎత్తున మోసపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వ్యాపారి ఐపీ పెట్టడంతో తమ డబ్బులకు ఇక దిక్కు ఎవరు? అని భయాందోళన చెందుతున్న తరుణంలో కంతుల ప్రకారం బంగారం కోసం చిన్న మొత్తాల్లో కట్టిన డబ్బులు ఆయన తిరిగి ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. అందరికీ పంగనామాలు అయితే పెద్ద మొత్తంలో చందాలు కట్టి బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారి నగదుకు ఆయన పంగనామాలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది బాధితులు బయటకు తెలిస్తే పరువు పోవడంతో పాటు ఐటీ అధికారులు అడుగుతారని మథనపడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తమ డబ్బులను ఎలా వెనక్కి తీసుకోవాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. గత 15 సంవత్సరాలుగా గుప్తా ఇలాంటి వ్యాపారం పెద్ద ఎత్తున చేస్తున్నట్లు తెలుస్తోంది. నెల నెలా కంతులు చెల్లించే వారి డబ్బులు కోట్లాది రూపాయలకు చేరుకుంది. ఆయన కులానికి చెందిన వారే ఎక్కువ మంది ఇలాంటి కంతులు చెల్లించి బంగారం కొనుగోలు చేసేవారని, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్ల మీద చాలా మంది కంతులు చెల్లిస్తున్నట్లు తెలిసింది. కొందరు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరికొందరు తామే పరిష్కరించుకుంటామని చెప్పడం గమనార్హం. పిల్లల పెళ్లిళ్లు, పొదుపు కోసం బంగారం కొనాలనుకున్న అనేకమంది మధ్యతరగతివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్యువెలరీ యజమాని దివాలా భయాందోళనలో డిపాజిట్దారులు బంగారం స్కీము ద్వారా కోట్లాది రూపాయల వసూలు చర్చనీయంగా మారిన బంగారు వ్యాపారి తీరు -
ఆర్టీసీ బస్సులకు స్పందన సేవలు
● రవాణా మంత్రి రామలింగారెడ్డి బనశంకరి: ఆర్టీసీ బస్సుల మరమ్మతులకు స్పందన వాహనాలు ఉపయోగిస్తామని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు. శాంతినగర కేఎస్ ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వద్ద స్పందన వాహనాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. బస్సులు మార్గమధ్యంలో యాంత్రిక సమస్యలతో మొరాయిస్తే, మొబైల్ వర్క్షాప్ తరహాలో స్పందన వాహనాలు పనిచేస్తాయన్నారు. ప్రమాద సమయంలోనూ సదరు స్థలాలకు వెళ్లి త్వరితగతిన బస్సుకు మరమ్మతులు చేయడానికి ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారన్నారు. బెంగళూరు, మైసూరు కేంద్ర స్థలాల్లో వాటిని అందుబాటులో ఉంచుతామని, తుమకూరు, కోలార్, చిక్కబళ్లాపుర, మైసూరు, మండ్య తదితర ప్రాంతాల్లో అవి సేవలందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భరమగౌడ, అలగౌడకాగే, అరుణ్ కుమార్, ఎంవై.పాటిల్, వీఎస్.ఆరాధ్య, మహమ్మద్ రిజ్వాన్, నవాజ్, తదితరులు పాల్గొన్నారు. చిన్నారిపై దుండగుల అఘాయిత్యందొడ్డబళ్లాపురం: బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు కామాంధుల ఉదంతమిది. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని ఒక గ్రామంలో 10 ఏళ్ల బాలికను బెదిరించి 40 ఏళ్లు, 24 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఎవరికై నా చెబితే నీ తల్లిని చంపేస్తామంటూ బాలికను బెదిరించారు. బాలిక పాఠశాలలో టీచర్కి ఈ దురాగతం గురించి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.ఇన్స్టా ప్రేమాయణం వివాహిత.. ఖాకీ పరార్ బనశంకరి: ఆన్లైన్ ప్రేమలు కాపురాలను చీలుస్తున్నాయి. రెండో భర్త ను వదిలిపెట్టి ఇన్స్టాలో పరిచయమైన కానిస్టేబుల్ తో మహిళ పారిపోయింది. బెంగళూరు చంద్రాలేఔట్ నివాసి మోనిక, హెచ్ఎస్ఆర్ లేఔట్లో నివసించే కానిస్టేబుల్ రాఘవేంద్రతో ప్రేమలో పడి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. వివాహమై, కుమారుడు ఉన్న రాఘవేంద్ర.. ఇన్స్టాలో మోనిక వీడియోలను చూసి మనసు పారేసుకున్నాడు. ఇద్దరూ ఇన్స్టాలో పరిచయం పెంచుకుని, బయట షికార్లు కూడా చేస్తున్నారు. మోనిక మొదటి భర్తను వదిలిపెట్టి రెండో భర్తతో ఉంటోంది. ఇక మోనిక, పోలీసు అనేక రీల్స్ కూడా చేయసాగారు. ఈ నేపథ్యంలో ఇరువురూ తమ కుటుంబాలను వదిలి పరారయ్యారు. ఇంట్లోని 160 గ్రాముల బంగారు నగలు, రూ.1.80 లక్షల నగదుతో మోనిక వెళ్లిపోయిందని భర్త చంద్రాలేఔట్ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వీరిద్దరి బాగోతం గురించి పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. ఈ నేపథ్యంలో రాఘవేంద్రను శనివారం సస్పెండ్ చేశారు. -
నాడు వైభవం.. నేడు దుర్భరం
మరమ్మతుకు నోచుకోని తుంగభద్ర తరగతి గది కిటికీ, తలుపులు దుస్థితిలో పాఠశాలలోని కృష్ణా తరగతి గది శిథిలావస్థకు చేరుకున్న హేమనాళలోని ప్రభుత్వ పాఠశాల భవనం రాయచూరు రూరల్: జిల్లాలో నాడు ఏళ్ల తరబడి ఎంతో మంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్ది వైభవంగా వెలిగిన పాఠశాలలు మరమ్మతులకు నోచుకోక నేడు దుర్భర స్థితికి చేరాయి. విద్యా రంగంలో వెనుక బడిన జిల్లాగా పేరొందిన రాయచూరు జిల్లాలో ఎన్నో ఏళ్లుగా సర్కార్ బడులు అభివృద్ధికి నోచుకోని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో బడులున్నా అత్యాధునిక వసతులతో కూడిన గదులు లేక ఉపాధ్యాయులకు చెట్ల కిందే విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి వస్తోంది. కళ్యాణ కర్ణాటకలో విద్యా రంగాభివృద్ధికి ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు ప్రకటిస్తున్న సర్కార్ మాటల గారడీతో ప్రజా ప్రతినిధులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో ప్రతి గ్రామంలో ఇలాంటి బడులు కనిపిస్తున్నాయి. పాఠశాల భవనాలు దాదాపుగా శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని పాఠశాలల మరమ్మతుకు కేటాయించిన నిధులను ఇతరత్ర పనులకు వాడుకోవడం వల్ల అవి దుస్థితిలో మిగిలి పోతున్నాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో 10 గదుల నిర్మాణానికి ఈ ఏడాది రూ.2.84 కోట్ల నిధులను మాత్రమే కేటాయించారు. ఆరు బయట చెట్ల నీడనే విద్యార్థులకు పాఠాల బోధన పాఠశాలలో విరిగిపోయిన బెంచీలు శిథిలావస్థలో హేమనాళ సర్కారు బడి ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచని వైనం -
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకం
కార్యక్రమానికి హాజరైన న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజలు కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డీఐజీ, న్యాయమూర్తులు, ఇతర అతిథులు సాక్షి,బళ్లారి: కేసుల పరిష్కారంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల(ప్రభుత్వ న్యాయవాదుల) పాత్ర కీలకమని బళ్లారి రేంజ్ డీఐజీ వర్తిక కటియార్ పేర్కొన్నారు. ఆమె నగరంలోని పాత జిల్లా కోర్టు ఆవరణలో శనివారం బళ్లారి, కొప్పళ, విజయనగర జిల్లాల నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్ విభాగ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యాలయం ద్వారా ప్రభుత్వం తరఫున కేసులను కోర్టుల్లో ఎలా ప్రతిపాదించాలి అన్న విషయంపై న్యాయవాదులకు అవగాహన కల్పించడానికి దోహదపడుతుందన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీ.ఎస్ పాటిల్ మాట్లాడుతూ పెండింగ్ కేసులు ఏ స్థితిలో ఉన్న ఉన్నాయో ఆ కేసుల్లో ఎలాంటి తీర్పులు వెల్లడించారో పూర్తి వివరాలు లభిస్తాయన్నారు. సీనియర్ లా ఆఫీసర్ బళ్లారి.కామ్ వెబ్సైట్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ శాఖ డైరెక్టర్ అంజలిదేవి ప్రారంభించగా, న్యాయజ్యోతి సంచికను వివిధ జిల్లాల ఎస్పీలు డాక్టర్ శోభారాణి, డాక్టర్ రామ్ అరసిద్ధి, జాహ్నవి ప్రారంభించారు. కేసులు నమోదు చేసుకున్న వారి కోసం జాగృతి అభియాన్ను జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. నగర మేయర్ గాదెప్ప, ప్రముఖులు ముండ్రిగి నాగరాజు, సుంకన్న, రామబ్రహ్మం పాల్గొన్నారు. -
ఉత్తర కర్ణాటక కేడీఎం కింగ్ మృతి
హుబ్లీ: పశువులను బెదిరించే పోటీల్లో 11 బైకులు, బంగారం, ఎద్దుల బండి, టీటీతో పాటు ఎన్నో పథకాలు, అవార్డులు, రివార్డులు తన గంభీరమైన పాదాలతో దర్శించుకుని పేరు మోసిన కేడీఎం కింగ్ గుండెపోటుతో మరణించింది. వివరాలు.. కేడీఎం కింగ్గా పేరుగాంచిన హావేరి జిల్లా బ్యాడిగి తాలూకా కదరమండలగి గ్రామ గాంభీర్య రోషవేషాల ప్రతికా వృషభం గుండెపోటుతో మృతి చెందింది. సుమారు 18 సంవత్సరాల వయస్సులో ఉన్న ఈ వృషభ రాజానికి శుక్రవారంతో నూకలు చెల్లాయి. అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. ఉత్తర కర్ణాటక ప్రసిద్ధ కొబ్బరి వృషభాల అనగా బలిసినా ఎద్దుల పోటీలలో అందరి కళ్లను తన వైపే ఆకర్షించిన ఈ వృషభం మృతికి అక్కడి గ్రామ వాసుల గుండెలు బరువెక్కాయి. దాని యజమాని కాంతేష్ రాయకర్ ఇంటి ముందు వృషభ రాజ్యం మృత కళేబరాన్ని తుది దర్శనం కోసం ఉంచారు. దీంతో పోటాపోటీగా విజేతగా నిలిచిన ఈ వృషభాన్ని కడసారి చూడటానికి రాష్ట్రం నుంచే కాక తమిళనాడు నుంచి కూడా అభిమానులు విచ్చేసి దానికి పూల దండలు, అగరబత్తీలు, అక్షింతలు వేసి పూజలు చేశారు. ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. అశ్రునయనాలతో అంతిమయాత్ర శుక్రవారం మధ్యాహ్నం ఆ గ్రామ ప్రముఖ వీధుల్లో అంతిమయాత్ర జరిపారు. యాత్రలో వివిధ జానపద బృందాలు పాల్గొన్నాయి. మా ఊరి రోషం, ఘనత, డాబు, దర్పాలకు ప్రతీకగా నిలిచిన వృషభరాజ్యం అంత్యక్రియలను తమ ఇంటి పెద్ద కుమారుడిలానే ఆ ఊరి ప్రజలు నెరవేర్చారు. ఏ పోటీల్లో చూసినా మన కేడీఎందే డాబు, దర్బారు. అవార్డులు కానీ, రివార్డులు కానీ, పథకాలు కానీ మన కేడీఎంకే సింహపాలు రావాల్సిందే. కేడీఎం కింగ్ 108 అంటే దానిని సాకగానే పక్కనే ఉన్న అంబులెన్స్ను సిద్ధం చేసుకొనే దానితో తలపడాలి. ఆ మేరకు మసణ దొరె, కిల్లింగ్స్టార్, వరుణనాడు ప్రజల ఆయువు కాంతేశుడు అనే బిరుదులతో పౌరుషానికి ప్రతీకగా నిలిచిన కేడీఎం కింగ్ తిరిగి రాని లోకాలకు బైబై చెప్పి వెళ్లిపోవడంతో స్థానికులు ఈ వృషభరాజం మృతిని జీర్ణించుకోవడానికి మరికొంత కాలం పట్టవచ్చు. అయితే సదరు యజమాని కుటుంబ సభ్యులు మాత్రం ఇలాంటి ఎద్దు దొరకడం అసాధ్యమని, అయితే జల్లికట్టు పోటీల కోసం మళ్లీ మరొక వృషభ రాజాన్ని సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. కన్నీరుమున్నీరైన అభిమానులు కడసారి చూపునకు భారీగా రాక -
బాబోయ్.. చలి భూతం
బనశంకరి: రాష్ట్రంలో గతంలో లేని విధంగా చలి వణికిస్తుండటంతో ప్రజలు హడలిపోతున్నారు. కరావళి మినహా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదవుతోంది. కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల కంటే తక్కువ ఉండగా చలి వణికిస్తోంది. కళ్యాణ కర్ణాటక ప్రాంత జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. చలిబారి నుంచి విముక్తి పొందడానికి స్వెట్టర్లు, చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. శీతల వాతావరణం: బెళగావిలో కనీస ఉష్ణోగ్రత 10.4 డిగ్రీలు, బీదర్ 7.8, విజయపుర 7, ధారవాడ 9, గదగ్ 10.2, కలబుర్గి 13, హావేరి 11.8, కొప్పళ 11.9, రాయచూరు 9.6, శివమొగ్గ జిల్లాలోని అగుంబె 10.6, బెంగళూరు 13.3, దేవనహళ్లి విమానాశ్రయం 14.7, చిత్రదుర్గ 14, దావణగెరె 10, హాసన్ 8, చింతామణి 8.4, మైసూరు 15.4, శివమొగ్గ 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 28 డిగ్రీల మధ్య ఉంది. చలి, పొగమంచు బెంగళూరులో కూడా చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్నిచోట్ల తెల్లవారుజామున దట్టంగా పొగమంచు ఆవరిస్తోంది. ముందున్న ఏవీ కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా చలి తగ్గడం లేదు. ఆరుబయట ఎండలో కూర్చుంటేనే ఊరటగా ఉంటుంది. వృద్ధులైతే రగ్గులు, కంబళ్లు కప్పుకుని కాలక్షేపం చేస్తుంటారు. సాయంత్రం 4, 5 గంటల నుంచే చలి ఎక్కువవుతోంది. దీంతో వేడి వేడి ఆహార పదార్థాల విక్రయాలు పెరిగాయి. గతంలో లేనంతగా శీతాకాల ప్రభావం కళ్యాణ కర్ణాటకలో మరీ అధికం -
హనుమ నామం.. మైసూరు కేసరిమయం
మైసూరు: వారసత్వ నగరిలో హనుమాన్ జయంతి కోలాహలం నెలకొంది. నగర హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం భారీస్థాయిలో ఊరేగింపు, కళాబృందాల ప్రదర్శన మధ్య జరిగింది. మొదట మైసూరు ప్యాలెస్ ఆవరణలో ఉన్న కోటె ఆంజనేయస్వామి ఆలయంలో హోమం హవనం, విశేష పూజలు జరిపారు. తులసి, మైసూర్ మల్లెలు, వివిధ పుష్పాల పూలదండలతో హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి హారతులు పట్టారు. ఎమ్మెల్యేలు జి.టి. దేవెగౌడ, జి.డి.హరీష్ గౌడ, మాజీ ఎంపీ ప్రతాప్ సింహా, మాజీ ఎమ్మెల్యే ఎల్. నాగేంద్ర తదితరులు పూలమాలలు సమర్పించి ఊరేగింపును ప్రారంభించారు. ప్రధాన విగ్రహం ఉన్న వాహనం వెనుక అనేక వాహనాలు, వేలాది భక్తులు, కళాబృందాల ప్రదర్శనల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. ప్రధాన కూడళ్ల గుండా వెళ్లి గన్హౌస్ వద్ద ముగిసింది. రోడ్లకు ఇరువైపులా జనసందోహం వీక్షించింది. నినాదాల హోరు రోబోటిక్ ఆంజనేయస్వామి విగ్రహాల కదలికలు భక్తులను అబ్బురపరిచాయి. రావణాసురునితో గదతో పోరాటం, జై శ్రీరామ్, ఓం అక్షరం, కాలభైరవ విగ్రహం ఆకట్టుకున్నాయి. కాషాయ శాలువాలు, టీ–షర్టులు ధరించి జెండాలు పట్టుకుని వేలాది యువకులు జై హనుమాన్ నినాదాలు చేస్తూ పాల్గొన్నారు. శివరాజ్కుమార్ నటించిన వజ్రకాయ చిత్రంలోని జై ఆంజనేయ పాటకు యువకులు నృత్యాలు చేశారు. విదేశీ పర్యాటకులు కూడా చిందులు వేశారు. భారీఎత్తున జయంతి ఉత్సవం -
కాంగ్రెస్కు న్యాయ వ్యవస్థపై గౌరవం లేదు
హుబ్లీ: కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, న్యాయవ్యవస్థను గౌరవించడం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగం, న్యాయాంగ వ్యవస్థలను కాంగ్రెస్ పార్టీ గౌరవించడం లేదన్నది మరోసారి తేటతెల్లమైందన్నారు. దేశం కాంగ్రెస్ లేని భారత్ అవుతోంది. అయినా కాంగ్రెస్ నేతల తీరు తెన్నుల్లో మార్పు లేదన్నారు. కోర్టుల్లో సానుకూల తీర్పులు వస్తే మాత్రమే జీర్ణించుకుంటారు. లేకపోతే న్యాయాంగ వ్యవస్థను దూషిస్తారన్నారు. ఇలాంటి నేతలకు తాము చెప్పినట్లుగా నడుచుకునే న్యాయమూర్తులు కావాలన్నారు. కుహనా రాజకీయ వాదం, బుజ్జగింపుల తీరుతెన్నులపై తమకు అనుకూలమైనట్లుగా తీర్పు రాలేదన్న అక్కసుతో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిపై చర్యలకు డిమాండ్ చే స్తున్నారన్నారు. తీర్పుపై అప్పీలు సహజం తీర్పుపై అప్పీలు చేసుకోవడం సహజమన్నారు. అయితే న్యాయమూర్తినే అభిశంసన చేయాలంటారా? అని ప్రశ్నించారు. న్యాయమూర్తి అవినీతికి పాల్పడి ఉంటే ఆ పదవిని దుర్వినియోగం చేసుకొని ఉంటే అలాంటి శిక్షను వేయవచ్చన్నారు. దేశ చరిత్రలోనే వారికి విరుద్ధంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అభిశంసన తీర్మానం చేయడానికి సంతకాల అభియాన్ చేపట్టారన్నారు. రేపు ఎన్నికల బాండ్ కేసులో కూడా వారికి విరుద్ధంగా తీర్పు వస్తే అప్పుడు కూడా న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారా? అని నిలదీశారు. సిద్ధరామయ్యకు విరుద్ధంగా తీర్పు వస్తే న్యాయమూర్తులను తొలగిస్తారా? ఇలా ప్రక్రియ కొనసాగిస్తుంటే న్యాయాంగ వ్యవస్థకు గౌరవం ఏం మిగులుతుందని జోషి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. కర్ణాటకను విభజించం ప్రత్యేక రాష్ట్ర విషయంపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ కర్ణాటకను విభజించరాదన్నారు. ఈ విషయంలో బీజేపీ ఏ కారణంగాను కర్ణాటకను విభజించబోదని తేల్చిచెప్పారు. ఆర్థిక అసమానతలు ఉంటే పరిహారం ఉంటుందన్నారు. రోడ్ల అభివృద్ధికి కర్ణాటక సర్కార్ నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. అపార్ట్మెంట్ యజమానిపై డీకే శివకుమార్ పెద్దగా నోరు పారేసుకోవడం ఆయన నడతకు నిదర్శనమన్నారు. డీకే శివకుమార్ ఎవరికి శిష్యుడో అందరికీ తెలిసిందేనన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి -
వ్యాపారుల మధ్య సఖ్యత అవసరం
రాయచూరురూరల్: జిల్లాలో వ్యాపారులు, వర్తకుల మధ్య సఖ్యత ఉండాలని బెంగళూరు పిపో అధికారి దనీషా మీనూ అన్నారు. కేఎస్ఎంసీ, జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నగరంలోని పరిశ్రమల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో దనీషా మీనూ మాట్లాడారు. జిల్లాలో వివిధ రకాల వాణిజ్య పంటలు పండిస్తున్న నేపథ్యంలో రైతులకు అందించే ప్రభుత్వం సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర సర్కారు జీఎస్టీ, ఇతర సుంకాలను తగ్గించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయచూరు జిల్లా వాణిజ్య ఉద్యమ సంఘం అధ్యక్షుడు కమల్కుమార్ జైన్, పురుషోత్తం, తిప్పణ్ణ, త్రివిక్రం జోషి, లక్ష్మిరెడ్డి, చిదానంద, సతీష్, గురురాజ్ కులకర్ణి, హేమన్న, మల్లికార్జున పాల్గొన్నారు. నగర అధ్యక్షుడిగా షహీన రాజా రాయచూరురూరల్: ఏఐఎం రాయచూరు నగర అధ్యక్షుడిగా షహీన రాజాను నియమించారు. నగరంలోని బెస్తవారిపేటలో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం నూతన పదాధికారులను ఎంపిక చేశారు. కార్యదర్శిగా ఫరూక్, సభ్యులుగా ఖాజా వలి, అపతాబ్హుసేన్, తన్వీర్ అహ్మద్ ఖాన్, షేఖ్ ఉస్మాన్, హలీం, అల్తాఫ్ ఉస్మాన్, సోహెయిల్ చౌదరి, ఇర్ఫాన్ఖాన్, వసీంలను నియమించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి రాయచూరు రూరల్: పీడీఓ లింగప్పపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు క్రిష్ణ డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్యోగులతో కలిసి శుక్రవారం అందోళన చేపట్టారు. క్రిష్ణ మాట్లాడుతూ దేవదుర్గ తాలుకా క్యాదిబర పంచాయితీ అధికారి లింగప్పపై అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ రాథోడ్ భార్య పంచాయతీ అధ్యక్షురాలు కావడంతో పీడీఓను నిందించడం తగదన్నారు. ఆమె భర్త రాజశేఖర్ రాథోడ్ తాను చెప్పిన వారికి ఉద్యోగాలివ్వాలని ఒత్తిడి చేయడమేగాక, పీడీఓపై దాడి చేయడం తగదని ఆరోపించారు. విధులకు ఆటంకం కలిగించిన రాథోడ్ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఎస్పీ పుట్టమాదయ్యకు వారు వినతిపత్రం సమర్పించారు. శంకర గౌడ, ఇతరులు పాల్గొన్నారు. బాలింతల మరణాల నియంత్రణకు కృషి రాయచూరు రూరల్: జిల్లాలో బాలింతల మరణాలను నియంత్రించడానికి వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈశ్వర్కుమార కాందూ సూచించారు. తల్లీ, బిడ్డల అస్పత్రిని శుక్రవారం పరిశీలించిన ఆయన వైద్యులతో మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎన్నో వసతులున్నాయని, ఉద్యోగులు, సిబ్బంది బాలింతలకు సరైన చికిత్స అందించాలని సూచించారు. బాలింతల మరణాల నియంత్రణలో భాగంగా రాష్ట్ర స్థాయిలో తొలి స్థానంలో నిలవాలన్నారు. అయన వెంట జిల్లా ఆరోగ్య శాఖ అధికారి సురేంద్ర బాబు, నందిత, ప్రజ్వలకుమార్, చంద్రశేఖర్పవార్, తదితరులు పాల్గొన్నారు. -
అది రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
కోలారు : కోలారు జిల్లాలో రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో జాయింట్ సర్వే నిర్వహించకుండానే అటవీ శాఖ అధికారులు మొక్కలను నాటే ప్రయత్నాలు చేస్తుండటం ద్వారా అటవీశాఖ అధికారులు రైతులను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రైతు హరటి ప్రకాష్ ఆరోపించారు. శుక్రవారం నగరంలోని పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో నిర్వహించిన కేడీపీ సమావేశంలో జిల్లా ఇంఛార్జి మంత్రి భైరతి సురేష్ ఆదేశాల ప్రకారం ఎట్టి పరిస్థితిలోను అటవీశాఖ రైతులకు ఇబ్బంది కలుగజేయరాదని తెలిపినా అకారణంగా రైతులకు అధికారులు ఇబ్బందులు కల్గిస్తున్నారని విమర్శించారు. రైతులను బెదిరించి వారి భూముల్లో మొక్కలు నాటడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. మంత్రి ఆదేశాల ప్రకారం రెవిన్యూ, అటవీశాఖ జాయింట్ సర్వే నిర్వహించాలన్నారు. బంగారుపేటె ఎమ్మెల్యే ఎస్ ఎన్ నారాయణస్వామి అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పరంగా చర్చలు జరిపారు. రాబోయే రోజులలో జాయింట్ సర్వే నిర్వహించకుంటే రైతుల తరఫున భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కొన్ని చోట్ల అటవీ శాఖే ప్రభుత్వ గోమాళం భూమిని ఆక్రమించుకుందని ఆరోపించారు. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందిపాలు అవుతున్నారన్నారు. ఆప్ జిల్లా అధ్యక్షుడు వెంకటాచలపతి, దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు దళిత నారాయణస్వామి, మంజునాథ్రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
కంది పప్పు ధర తగ్గుముఖం
జనవరి 3 నుంచి తెలుగు మహాసభలు● లెక్కపత్ర సాయి సమితి అధ్యక్షుడిగా హనుమంతప్ప సిలిండర్ పేలి ఏడుగురికి గాయాలు హొసపేటె: సిలిండర్ పేలి ఏడుగురికి గాయాలైన సంఘటన కోప్పళ జిల్లా గంగావతి తాలుకాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు హెబ్బాలకు చెందిన రాజేష్ నివాసంలో సిలెండర్ లీక్ కావడంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి గోడలు విరిగి పడడంతో అక్కడే ఉన్న రాజేష్, దురుగప్ప, సురేష్, టముసేనమ్మ, శ్రీకాంత్లకు స్వల్పగాయాలయ్యాయి. సురేష్, దుర్గేష్లకు తీవ్ర గాయాలవడంతో బళ్లారి అస్పత్రికి తరలించారు. జనన, మరణాల నమోదులో జాప్యం హొసపేటె: జిల్లాలో జనన మరణాల నమోదులో జాప్యం జరగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా అధికారి కవితా ఎస్.మన్నికెరి అదేశించారు. జిల్లా అధికారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పంట కోతల సమయంలో కూలి పనులకు వెళ్లిన వారి వివరాలు సేకరించాలని సూచించారు. వర్షాకాలంలో 3446, వేసవి కాలంలో 906 పంట కోత ప్రయోగాలు చేశారని తెలిపారు. నాలుగు నెలల్లో 7870 మంది జననం, 3563 మరణాలు నమోదు కావడం జరిగిందన్నారు. జనన మరణ ప్రమాణ పత్రాలు 24 గంటల్లో అందేలా చూడాలన్నారు. అనాథలకు మఠంలోనే ఆశ్రయం రాయచూరు రూరల్: అనాథలు, తల్లిదండ్రులు లేని పిల్లలకు మఠాలు ఆశ్రయం కల్పిస్తున్నాయని కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. కలబుర్గి జిల్లా యడ్రామి తాలూకా కడకోళ మడివాళ్లేవరలో జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో శాంతమల్ల శివాచార్య మాట్లాడుతూ చెడుమార్గం వైపు సమాజం పయనిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరికీ హిందూ సనాతన సంప్రదాయాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధరామ శివాచార్య, చంద్రశేఖర్, అభినవ మురుఘంద్ర, వీర మహంతశివాచార్య, రామలింగయ్య, సిద్ధలింగ, చెన్నమల్ల శంకర్లింగ స్వామిజీ, మడివాళయ్య, శివరాజ్ పాటిల్ పాల్గొన్నారు. మహిళలకు స్వయం ఉపాధి రాయచూరురూరల్: కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం సూర్యమని సాహు కోరారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, జీవన మిత్ర సమాజ సేవ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఏజీఎం జ్యోతి వెలిగించి మాట్లాడారు. మహిళలు అర్థికంగా అభివృద్ధి చెందాలంటే స్వయం ఉపాధి ద్వారా లబ్ధి పొందాలన్నారు. బ్యాంకు నుంచి రుణం పొంది జీవనోపాధి మార్గం ఎంచుకోవాలన్నారు. సైబర్ వంచనకు గురికాకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్సలర్ హనుమంతప్ప, నాబార్డు మేనేజర్ కళావతి, నటరాజ్, రాజ్కుమార్, సతీష్ కుమార్, క్రిష్ణప్ప, తిమ్మణ్ణ, సంతోష్, శంకరప్ప, మధుస్మిత, శ్రీరాంబాబు, జయప్రకాష్, అశోక్ పాల్గొన్నారు.రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటక పరిధిలో కంది పప్పు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజుల కిందట క్వింటా కంది పప్పు ధర రూ.7 వేలు పలుకగా.. తాజాగా రూ.6500 నుంచి రూ.6000కు తగ్గిపోయింది. జిల్లాలో దాల్ మిల్లులు, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడమే ఇందుకు కారణమని రైతులు చెబుతున్నారు. అయితే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని సర్కారు ప్రకటించడంతో రైతులు ఊపిరిపీల్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 3.20 లక్షల హెక్టార్లలో కంది పంట సాగుచేస్తారు. వర్షాధారిత పంట కంది దిగుబడులు జిల్లాలోనే లక్ష టన్నుల మేర ఉంటాయి. ఈ ఏడాది కలబుర్గి, సేడమ్, చిత్తాపూర్, గురుమిఠకల్లో అధికంగా కంది పంట సాగు చేశారు. నీటి వనరులున్న భూములలో ఎకరాకు 12 –15 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. తగిన సమయంలో వర్షాలకు కురిస్తే ఎకరాకు 25 క్వింటాళ్ల వరకూ దిగుబడులు వస్తాయి. కలబుర్గిలో మార్కెట్ గోదాములు, దాల్ మిల్లులు లేకపోవడంతో ఇక్కడ పండే కందులకు ప్రత్యేకత లేకుండా పోయింది. కందిపప్పు బ్రాండ్ పేరుతో దళారులు లాభం పొందుతున్నారు. ఇతర జిల్లాల్లో ధరలు పతనం కంది ధరలు పతమవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటాకు మద్దతు ధర రూ.8000 వుంది. ఉత్తర కర్నాటకలోని కలబుర్గి, రాయచూరు, బీదర్, కోప్పళ, బాగల్కోట, విజయపుర జిల్లాలో 3.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో కంది సాగు చేశారు. ప్రస్తుతం ఏపీఎంసీ మార్కెట్లో క్వింటా ధర ఇక్కడ రూ.7 వేలు ఉండగా, నేడు రూ.5 వేల నుంచి రూ.6500 వరకు పలుకుతోంది. కంది కోతలు తీసి రాశిగా పోస్తున్న సమయంలో ధర తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన మార్కెట్ కళ్యాణ కర్నాటక పరిధిలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, బీదర్, బళ్లారి జిల్లాలు వస్తాయి. కలబుర్గి, బీదర్ జిల్లాలకు అనుకుని ఉన్న రాయచూరు జిల్లా ఉండడం, మార్కెట్, దాల్ మిల్లులు ఉండడంతో కందిపప్పుకు ప్రధాన మార్కెట్గా రాయచూరు ఎదిగింది. అయితే కలబుర్గి, సేడమ్, చిత్తాపూర్, గురుమిఠకల్లో కందిపప్పు, దాల్ మిల్లులు లేవు. దీంతో కందులను పప్పుగా మార్చుకొని విక్రయించేలా రైతులు ఎదగాలని జిల్లా అధికార యంత్రాంగం సూచిస్తోంది. కలబుర్గి డివిజన్లో కందిపప్పును చేర్చే ప్రాధాన్యం వివరిస్తోంది. కందులకు పేటెంట్ హక్కు రావడంతో అధిక మొత్తంలో రైతులు కంది పంట సాగు చేస్తున్నారు. కలబుర్గిలోనూ దాల్ మిల్లులు, మార్కెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ మార్కెట్ విక్రయించేందుకు సిద్ధంగా కందులు పాలికె ప్రతిపక్ష నాయకుడిగా శ్రీనివాస్ సాక్షి బళ్లారి: బళ్లారి మహానగర పాలికె ప్రతిపక్ష నాయకుడిగా శ్రీనివాస్ మోత్కూర్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇది వరకూ ఆ స్థానంలో పనిచేసిన ఇబ్రహీంబాబు తప్పుకోవడంతో ఆయన స్ధానంలో మోత్కూర్ను బీజేపీ కార్పొరేటర్లు ఎంపిక చేశారు. మహానగర పాలికే కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకుల సమక్షంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో సమస్యలను పరిష్కరించేందుకు అధికార పార్టీ నిర్లక్ష్యం వహిస్తే గట్టిగా పోరాటం చేస్తామన్నారు. నగరంలో నీటి సమస్య, రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ, వీధి కుక్కల బెడద, మౌలిక సదుపాయాల కల్పన విషయం అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. నగర మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్రెడ్డి, తదితరులు మోత్కూర్ను అభినందించారు. అనంతరం మహానగర పాలికే లెక్క పత్ర సాయి సమితి అధ్యక్షుడిగా హనుమంతప్ప బాధ్యతలు తీసుకున్నారు. కార్యక్రమంలో కేఎస్ దివాకర్, మల్లన్నగౌడ్, తదితరులు పాల్గొన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలంశ్రీనివాసపురం: తాలూకాలోని దళసనూరు గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో తహసీల్దార్ సుధీంధ్ర శుక్రవారం ఆ గ్రామానికి వెళ్లి పరిశీలన జరిపారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న బావిని ఓ వ్యక్తి మూసివేసి కబ్జా చేసినట్లు స్థానికులు తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. స్థలాన్ని సర్వే చేసిన అనంతరం ఆక్రమణ తొలగిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. పీడీఓ మంగళ, ఎఎస్ఐ మునిగుర్రప్ప పాల్గొన్నారు. మద్దతు ధరతో కొంటామంటున్న సర్కారు బ్రాండ్ పేరుతో కందిని విక్రయిస్తున్న దళారులుమద్దతు ధరతో కోనుగోలు చేస్తామన్న హామీ ఏమైంది?జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కంది దిగుబడులను కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషి, వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ మద్దతు ధరతో కంది కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 9.67 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. తాజాగా కంది పంట కోతలు ప్రారంభమైనా ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మద్దతు ధరతో కొనుగోళ్లు ప్రారంభిస్తే తమకు కొంత లాభం చేకూరుతుందని రైతులు భావిస్తున్నారు. హోసూరు: గుంటూరులో జరిగే మూడో ప్రపంచ తెలుగు మహా సభలకు హోసూరు ప్రాంత భాషాభిమానులు తరలి రావాలని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సలహాదారు ఎంఎస్.రామస్వామిరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రమేవజయతే సంయుక్తంగా 2026, జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మహాసభలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. గుంటూరు బొమ్మిడాల నగర్లోని దివ్యశ్రీ నందమూరి తారకరామారావు వేదికపై జరిగే ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, సభా, పూర్ణకుంభ పురస్కారాల ప్రదానోత్సవం, ఆంధ్రశ్రీ ప్రతిభా పురస్కారాలు, సౌజన్య సేవా పురస్కారాలు, గ్రంథావిష్కరణ, ఆంధ్రమేవ జయతే సంచికావిష్కరణ జరుగనున్నాయని తెలిపారు. హోసూరు నుంచి ఇప్పటివరకూ 41 మంది పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. హోటళ్లలో బస చేసేందుకు 20 శాతం రాయితీ కల్పించామని, ఉచిత భోజన వసతి ఏర్పాట్లు చేసినట్లు హోసూరు తెలుగు భాషాభిమానులు, తెలుగు సంఘాల నాయకులు పేర్కొన్నారు. -
కుక్కలను పట్టి తరలిస్తాం
● రేబిస్, సంతాన హరణ చికిత్సకు షెడ్ నిర్మాణం ● నగరంలో స్థలాలను పరిశీలించిన జిల్లా అధికారులు సాక్షి బళ్లారి: నగరంలో కుక్కల బెడద ఉందని నగరవాసుల నుంచి ఫిర్యాదులు పెరిగిన నేపథ్యంలో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. బళ్లారి శివారున హాలదహళ్లి సమీపంలోని పది ఎకరాల్లో రూ.4 కోట్ల వ్యయంతో ప్రహరీ, కుక్కలకు వసతి, వాటి సంరక్షణకు సెక్యూరిటీ, నగర వాసులు దత్తత తీసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్, జిల్లా పంచాయతీ కార్యనిర్వాహణాధికారి మహమ్మద్ హారిస్, నగర కమిషనర్ మంజునాథ్, తదితరులు కుక్కల ఆశ్రయానికి అవసరమైన స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ వీధికుక్కలను కట్టడి చేసే పనులను రెండు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. పాఠశాలలు, దేవాలయాలు, రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద కుక్కలను పట్టి రేబిస్, సంతానహరణ ఇంజెక్షన్లు వేయిస్తున్నామన్నారు. నగరంలోని ప్రతి కాలనీలో వీధి కుక్కలను పట్టి నగరవాసులకు భయం పోగొట్టే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. రేబిస్ లక్షణాలు ఉన్న కుక్కలు కనిపిస్తే పట్టి షెడ్కు తరలిస్తామని తెలిపారు. ఎవరైనా ఆసక్తి ఉంటే కుక్కల ఆశ్రయం కలిగించే స్థలానికి వచ్చి ఆహారం అందించాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కుక్కలను ఒకచోటకు చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టామని తెలిపారు. వీధి కుక్కల నియంత్రించడానికి తాము రాజీ పడబోమని, నగర వాసులు కూడా పూర్తి సహకారం అందించాలన్నారు. -
దివ్యాంగ విద్యార్థులకు వైద్య శిబిరం
కెలమంగలం: సంయుక్త విద్యా పథకం కింద క్రిష్ణగిరి జిల్లా కెలమంగలంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల దివ్యాంగ విద్యార్థులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని యూనియన్ సూపర్ వైజర్ సేతు, జిల్లా అంగవైకల్య సంక్షేమ శాఖ అధికారి మురుగేషన్, విద్యాశాఖ అధికారులు మదన్ కుమార్, నరసింహన్, మహేంద్రన్, గణేష్ ప్రారంభించారు. వైద్య నిపుణులు విద్యార్థులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు జాతీయ గుర్తింపు కార్డు, ఉచిత బస్సు పాస్, తదితర సంక్షేమ పథకాలు అందించేందుకు వివరాలు సేకరించారు. -
నరాల సమస్యతో అంగవైకల్యం
కోలారు: నరాల సమస్య రాష్ట్రంలో మరణ, అంగవైకల్యానికి ప్రముఖ కారణం అవుతోందని బెంగళూరు మణిపాల్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఆర్.సా త్విక్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం రాష్ట్ర జనాభాలో 3.3 శాతం మంది మెదడు, నరాల వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. కోలారు జిల్లాలో ఇది మరింత ఎక్కువగా ఉందన్నారు. అయితే ప్రస్తుతం లభ్యం అవుతున్న అత్యాధునిక వైద్య సాంకేతికత పరిజ్ఞానంతో రోగులకు సమగ్ర ఆరోగ్య చికిత్సను అందిస్తున్నారన్నారు. ఇది దీర్ఘావధి ఫలితాలను కూడా అందిస్తోందన్నారు. డీప్ బ్రెయిన్ స్టిములైజేషన్ విధానం పార్కిన్సన్ వ్యాధి, ఎసెన్షియల్ ట్రైమర్, డిస్టోనియా వంటి సమస్యలు ఉన్న వారికి ఎలా సహాయకారి అవుతుందో వివరించారు. పార్కిన్సన్ వ్యాధి మనిషి చలన వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నారు. ఇది నర మండలాన్ని అవనతి దిశగా తీసుకెళుతుందన్నారు. డీబీఎస్ చికిత్సా విధానంలో పార్కిన్సన్ వ్యాధి వల్ల కలిగే నరాలు బిగుసుకు పోవడం, వణుకు, నిధానగతిని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. ఈ మెరుగైన చికిత్స రోగులకు అదనంగా 10–15 ఏళ్ల వరకు సంతృప్త జీవితం సాగించడానికి సహాయకారి అవుతుందన్నారు. పార్శవాయు మరణానికి మరో ప్రముఖ కారణం తక్షణం గుర్తించి చికిత్స పొందడం అవసరమన్నారు. మణిపాల్ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ వీణా తదితరులు పాల్గొన్నారు. -
కోటిగానహళ్లి రామయ్య సేవలు అపారం
కోలారు: నగర సమీపంలోని తేరహళ్లి కొండపై బుడ్డిదీపలో బుడ్డిదీప సంస్థాపకుడు కోటిగానహళ్లి రామయ్య ఏర్పాటు చేసిన అంబేడ్కర్ హార్న్ బిల్ గ్రంథాలయం, హల్గి కల్చర్ తమట శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోటిగానహళ్లి రామయ్య ఈ వయసులోనూ సాహిత్య రంగానికి అందిస్తున్న సేవలు శ్లాఘనీయమన్నారు. చిన్నారుల్లో ఉత్తమ సంస్కారం నింపే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అంబేడ్కర్ జీవిత చరిత్రను నాటకాల ద్వారా సమాజానికి పరిచయం చేస్తున్నారన్నారు. అనంతరం రామయ్య అనువాదం చేసిన రత్తు కండంతె అంబేడ్కర్ కొనెయ దినగళు పుస్తకాన్ని జేడీఎస్ నాయకుడు సిఎంఆర్ శ్రీనాథ్ ఆవిష్కరించారు. -
పోలియో ముక్త భారత్కు శ్రమించాలి
కోలారు: పోలియో ముక్త భారత్ కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని బీఈఓ గీతా పిలుపునిచ్చారు. తాలూకాలోని నరసాపుర గ్రామ పంచాయతీ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమ పూర్వసిద్దతా సమావేశంలో బీఈఓ పాల్గొని మాట్లాడారు. పొరుగు దేశాల్లో పోలియో కేసులు కనిపిస్తున్నాయని, అవి మన దేశంలో వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా పల్స్ పోలియో చుక్కల మందు వేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతగా ఈ నెల 21న పల్స్ పోలియో చుక్కల మందును 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు వేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయంతం చేద్దామని సూచించారు. పీడీఓ మునిరాజు, ఆరోగ్య అధికారి రాఘవేంద్ర పాల్గొన్నారు. దొంగ అరెస్ట్, బైక్లు స్వాధీనంకేజీఎఫ్: కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకాలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన సీడీ రమేష్(48) అనే దొంగను కామసముద్రం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్దనుంచి రూ. 5 లక్షల విలువైన ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. తాలూకాలోని కిరుమందె గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి తన దుకాణం ముందు బైక్ను నిలిపి ఉంచగా చోరీకి గురైంది. పోలీసులు గాలిస్తుండగా నిందితుడు రమేష్ పట్టుబడ్డాడు. -
మాజీ మంత్రి కారు ఢీకొని బైకిస్టు మృతి
దొడ్డబళ్లాపురం: మాజీ మంత్రికి చెందిన కారు ఢీకొని బైకిస్టు మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి మాగడి తాలూకా గుడేమారనహళ్లి వద్ద చోటుచేసుకుంది. బిళుగుంబ గ్రామ నివాసి రాజేశ్(24) గురువారం రాత్రి 11–45 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి బైక్పై వస్తుండగా మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫార్చునర్ కారు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాజేశ్ అక్కడికక్కడే మృతిచెందగా అతడి స్నేహితుడు గాయపడ్డాడు. అయితే కారు నిలపకుండా పరారవుతుండడంతో స్థానికులు 5 కి.మీ.వెంబడించి పట్టుకున్నారు. కారులో ఉన్న వ్యక్తి తాను మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ కుమారుడు శశాంక్ అంటూ బెదిరించాడు. కుదూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. రాజేశ్ మృతదేహాన్ని నెలమంగళ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. డీకే కోసం బీజేపీ ఆపరేషన్ ● యత్నాళ్ కొత్త బాంబు శివాజీనగర: తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినపుడు డీకే శివకుమార్ను బీజేపీలోకి చేర్చుకునే ప్రయత్నం జరిగిందని ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ కొత్త బాంబు పేల్చారు. బెళగావిలో శుక్రవారం మాట్లాడిన ఆయన, తనను సస్పెండ్ చేసిన సందర్భంలో ఢిల్లీలో డీకే శివకుమార్ను కోసం ఆపరేషన్ చేసే ప్రయత్నం జరిగింది. తాను పార్టీలో ఉంటే కాదనే ఉద్దేశ్యంతో తనను సస్పెండ్ చేసిన తరువాత ఆ ప్రయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయేంద్ర డీసీఎం కావటానికి ఢిల్లీలో డీకే శివకుమార్ను కలిసి చర్చలు జరిపారు. బీజేపీవారే ఈ విషయం తనకు చెప్పారు. ఆ తరువాత ప్రహ్లాద్ జోషి, అమిత్ షా సూచనల మేరకు తాము ఎవరినీ చేర్చుకోవటం లేదని చెప్పారు. అయితే నిజంగా డీకే శివకుమార్ను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందని అన్నారు. ఆస్పత్రి ఆవరణలో మనిషి పుర్రె ప్రత్యక్షం దొడ్డబళ్లాపురం: ఆస్పత్రి ఆవరణలో మనిషి పుర్రె కనిపించి రోగులను భయాందోళనకు గురి చేసిన సంఘటన నెలమంగలలో వెలుగు చూసింది. నెలమంగల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చెత్త వేసే చోట మనిషి పుర్రె కనిపించింది. పుర్రెను చూసిన జనం భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడకు పుర్రె ఎలా వచ్చింది, ఎవరు తెచ్చి వేసారో తెలియరాలేదు. ఆస్పత్రి వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి పుర్రెను పరిశీలించారు. అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇచ్చిన మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్ రూ.5 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి -
డీకే వర్గం రహస్య సమావేశం
డీకే శివకుమార్ మరింత బలాన్ని క్రోడీకరించుకునేందుకు తన అనుచరులతో రహస్య సమావేశం జరిపారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన అనుచరుల కోసం మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ సేఠ్, ఆసిఫ్ సేఠ్ రెండు రోజుల క్రితం విందు ఏర్పాటు చేశారు. ఇందుకు డీకే శివకుమార్, ఆయన వర్గం గైర్హాజరైంది. దీంతో డీకేశి కోసం శనివారం మరోసారి విందు ఏర్పాటు చేశారు. అలాగే గురువారం రాత్రి బెళగావి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దొడ్డణ్ణనవర్..డీకే శివకుమార్, ఆయన మద్దతుదారులకు విందు ఇచ్చారు. ఇందులో పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారని సమాచారం. ఈ ప్రత్యేక విందు సమావేశాలు కాంగ్రెస్లో గందరగోళ వాతావరణాన్ని సృష్టించాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలసికట్టుగా కూర్చోబెట్టి నాయకత్వ విషయంపై స్పష్టత ఇవ్వటానికి ఈ నెల 19న ఢిల్లీలో సమావేశం జరగనుందని తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో సమావేశం జరగనుంది. ఆరోజు నాయకత్వ మార్పునకు స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. బెళగావి సువర్ణ సౌధ -
చిలుక తెచ్చిన తంటా
● విద్యుదాఘాతంతో యువకుడి మృతి దొడ్డబళ్లాపురం: చిలుకను రక్షించబోయి యువకుడు విద్యుత్ షాక్కు గురై మృతిచెందిన సంఘటన బెంగళూరు గిరినగర్లోని ఒక అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది. అరుణ్కుమార్(32) అనే వ్యక్తి ఫారిన్ నుంచి రూ.2 లక్షల విలువైన చిలుకను కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. అది ఎగిరి వెళ్లి అపార్ట్మెంట్ లోపలి నుంచి వేయబడ్డ హైటెన్షన్ విద్యుత్ తంతిపై వాలింది. అరుణ్కుమార్ స్టీల్ పైప్కి కర్ర కట్టి అపార్ట్మెంట్ కాంపౌండ్ గోడ ఎక్కి చిలుకను రక్షిస్తుండగా విద్యుత్ షాక్కి గురై మృతిచెందాడు. గిరినగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
గృహలక్ష్మిపై కాకి లెక్కలు
బనశంకరి: సిద్దరామయ్య ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పంచ గ్యారంటీల్లో ఇంటి మహిళా యజమానికి ప్రతి నెల రూ.2 వేలు అందించే గృహలక్ష్మి పథకం ఒకటి. కానీ కొన్ని నెలలుగా మహిళల అకౌంట్లకు గృహలక్ష్మి డబ్బు జమ కాలేదు. దీనిపై శుక్రవారం బీజేపీ సభ్యుడు, ఎమ్మెల్యే మహేశ్ టెంగినకాయి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ విషయంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ తప్పుడు లెక్కలు ఇచ్చారనే ఆరోపణ వినబడుతోంది. గృహలక్ష్మి డబ్బు ఆగస్టు నెల వరకు అందించామని మంత్రి తెలిపారు. కానీ ఆగస్టు వరకు మహిళల అకౌంట్లలో నగదు జమ కాలేదని ఎమ్మెల్యే సభలో ప్రభుత్వ అధికారిక రికార్డులు విడుదల చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా డబ్బు జమ కాలేదని ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. అంతేగాక గృహలక్ష్మి పథకానికి సంబంధించిన రూ.5 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మహేష్ స్పీకర్ యూటీ.ఖాదర్కు లేఖ రాశారు. ఆగస్టు 2025 వరకు గృహలక్ష్మి డబ్బు విడుదల చేశామని మంత్రి చెప్పినా నిధులు విడుదల కాలేదని ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. మళ్లీ పరిశీలించాలని అడిగాం, కానీ ఫిబ్రవరి, మార్చి నెలలకు గృహలక్ష్మి నగదు విడుదల కాలేదన్నారు. సభకు మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఈ విషయంపై సభలో అత్యవసరంగా చర్చించటానికి అనుమతించాలని లేఖలో పేర్కొన్నారు. బాకీ ఉంటే జమ చేస్తాం–సీఎం స్పష్టీకరణ ఈ విషయంపై జీరోఅవర్లో విపక్షనేత ఆర్.అశోక్ చర్చకు లేవనెత్తగా దీనికి సీఎం సిద్దరామయ్య సమాధానమిస్తూ బాకీ ఉంటే జమ చేస్తామని, సోమవారం మంత్రి సమాధానమిస్తారని సంజాయిషీ ఇచ్చారు. -
అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చని కాంగ్రెస్
కేజీఎఫ్ : దేశంలో 75 సంవత్సరాల పాటు పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చలేదని, అలాంటి పార్టీకి అంబేడ్కర్ పేరును ప్రస్తావించే నైతిక హక్కు లేదని కేంద్ర మాజీ మంత్రి ఏ.నారాయణస్వామి అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని మున్సిపల్ మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన భీమనడె కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దళితుల సమస్యలను విస్మరించిందన్నారు. రాష్ట్రంలో ఎస్టీ సముదాయానికి చెందిన రూ.198 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని, దీనిని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారన్నారు. మైసూరు మాజీ ఎంపీ ప్రతాప్ సింహ మాట్లాడుతూ అంబేడ్కర్ ముంబై నుంచి పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓడించిందన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే అందరికీ రక్షణ కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మునిస్వామి, కేజీఎఫ్ మాజీ ఎమ్మెల్యే వై.సంపంగి, మాలూరు మాజీ ఎమ్మెల్యే మంజునాథ్గౌడ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఓం శక్తి చలపతి పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
రాయచూరు రూరల్: రాయచూరు, కలబుర్గి, యాదగిరి జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు మౌనం దాల్చారు. ఈ జిల్లాల్లో తుంగభద్ర, కృష్ణా, భీమా నదులున్నాయి. జిల్లాలోని మాన్వి, రాయచూరు, దేవదుర్గ, యాదగిరి జిల్లా సురపుర, యాదగిరి తాలూకాలో ఆయా నదీ తీరంలోని ప్రాంతాల్లో రోజుకు వందలాది టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జోళదడగి, కర్కిహళ్లి, పర్వతాపూర్లలో కాంట్రాక్టర్లు పీ.ఎల్.కాంబ్లె, పంచాక్షరి, శివప్ప బసప్ప, ఆనంద్ దొడ్డమని స్టాక్ యార్డులకు నది నుంచి ఇసుకను దొంగతనంగా తరలించి నిల్వ చేసుకుంటున్నారని సామాజిక కార్యకర్త హనుమంతు ఆరోపించారు. పట్టపగలే నదిలో జేసీబీలు, పొక్లెయిన్ల ద్వారా గుంతలు పడేలా ఇసుకను తవ్వుతున్నారు. రాయల్టీని రెండు వాహనాలకు పొంది మిగిలిన వాహనాలకు లేకుండా వందల కొద్దీ టన్నుల మేర సరఫరా చేస్తున్నారు. కొంత మంది కాంట్రాక్టర్లు నేరుగా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో రూ.కోట్లాది మేర కోత పడుతోంది. ఈ విషయంలో జిల్లాధికారి, ఎస్పీ, తహసీల్దార్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. శాసనసభ, లోక్సభ, జిల్లా పంచాయతీ సభ్యుల కుటుంబాలు ఇందులో కుమ్మక్కు కావడం వల్ల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా ఇసుక రవాణా సరఫరా వల్ల నదులు కనుమరుగు అవుతాయనే భయం ప్రజల్లో ఉంది. ఇటీవల దేవదుర్గ తాలూకా చప్పలికి గ్రామంలో ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులపై కాంట్రాక్టర్ దాడి చేశారు. ప్రభుత్వ రాబడికి భారీ ఎత్తున కోత నోరు మెదపని అధికారులు, పాలకులు -
వికటించిన రాత్రి భోజనం
రాయచూరు రూరల్: కలుషిత ఆహారం తిని 33 మంది విద్యార్థుఽలు అస్వస్థతకు గురైన ఘటన బుధవారం రాత్రి యాదగిరి జిల్లా గురుమఠకల్లో చోటు చేసుకుంది. గురుమఠకల్లోని వెనుక బడిన వర్గాల బాలికల సంక్షేమ హాస్టల్లో రాత్రి విద్యార్థులు చికెన్, చపాతి, అన్నం తిన్నారు. ఆ తర్వాత కొంతసేపటికి భోజనం చేసిన విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వీరిలో ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో యాదగిరి జిల్లాస్పత్రిలో చేర్పించారు. హాస్టల్లో మొత్తం 150 మంది విద్యార్థినులున్నారు. ఘటన విషయం తెలుసుకున్న యాదగిరి జిల్లాధికారి హర్షల్ బోయర్, జెడ్పీ సీఈఓ లవీశ్ ఒడెయర్, ఎస్పీ పృథ్వీశంకర్, ఇతర అధికారులు చేరుకుని పరిశీలించారు. హాస్టల్లో కలుషితమైన ఆహారం 33 మంది విద్యార్థుఽలకు అస్వస్థత యాదగిరి జిల్లా గురుమఠకల్లో ఘటన -
మహిళలపై దౌర్జన్యాలు అరికట్టాలి
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. గురువారం లింగసూగూరు తాలూకా హట్టి పైభవనం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు రమేష్ మాట్లాడారు. నేడు మహిళలు, పిల్లలపై వేధింపులు, చిత్రహింసలు అధికమయ్యాయన్నారు. అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, లైంగిక దౌర్జన్యాలు, వరకట్నం, కుటుంబ కలహాలు, భ్రూణ హత్యలు, లింగ తారతమ్యాలు, కుల, మత, వర్గ వైష్యమాలు పెరిగాయన్నారు. మహిళల హక్కుల ఉల్లంఘన, బేటీ పడావో, బేటీ బచావో పద్ధతి ప్రకటనలకే పరిమితమైందన్నారు. వీటన్నింటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. సమాజాభివృద్ధికి సహకరించాలి రాయచూరు రూరల్: మాదార సమాజం అభివృద్ధికి అందరూ సహకరించాలని మాదార చెన్నయ్య సమాజం కార్యాధ్యక్షుడు రవీంద్ర జాలదార్ పేర్కొన్నారు. ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మాదార చెన్నయ్య సేవా సమితి నూతన పదాధికారుల ప్రమాణ వచన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి ఆయన మాట్లాడారు. సమాజంలో కింది స్థాయిలో నివాసముంటూ కష్టపడి పని చేసే మనస్తత్వం కలవారన్నారు. నేటి పోటీ తత్వయుగంలో మన పిల్లలను సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా వారిని అభివృద్ధిలో ముందుకు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వీరేష్, భీమరాయ, మంచాల భీమన్న, భీమరాజ్, మౌనేష్, పరశప్ప, రమేష్లున్నారు. గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణంరాయచూరు రూరల్: గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన రాయచూరు తాలూకాలో చోటు చేసుకుంది. బిచ్చాలి గ్రామ పంచాయతీ పరిధిలోని బీ.యడ్లాపూర్కు చెందిన సంజీవ్(35) అనే వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. ప్రతి రోజు పొలానికి రైలు పట్టాలు దాటి వెళుతుంటాడు. రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా పట్టాలు దాటుతున్న సంజీవ్ను గూడ్స్ రైలు ఢీకొంది. వారిస్తున్నా వినకుండా సంజీవ్ అలాగే పట్టాలు దాటాడని సమాచారం. పంచనామా కోసం మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత తగదురాయచూరు రూరల్ : రాష్ట్రంలోని కన్నడ ప్రభుత్వ పాఠశాలను బంద్ చేసి కర్ణాటక పబ్లిక్ పాఠశాలలోకి విలీనం చేయడానికి ముందుకొచ్చిన సర్కార్ తీరుపై ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయబోమని ఆదేశాలు జారీ చేయాలని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప రాష్ట్రంలో కన్నడ భాష ప్రాథమిక పాఠశాలలను మూసేయడం లేదని చెప్పిన సమాధానానికి లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేయాలని ఒత్తిడి చేశారు. గంగమ్మకు మండల పూజ మాలూరు: తాలూకాలోని మాస్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ దేవి దేవాలయంలో గురువారం విమానగోపుర, కుంభాభిషేకం కార్యక్రమాలు, 48వ రోజు మండల పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి విశేష పూల అలంకరణ, ఆభరణాల అలంకరణ చేసి పూజలు నిర్వహించి మహామంగళారతి ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాద పంపిణీ, అన్న సంతర్పణ జరిగింది. -
కబ్జాదారుల భరతం పట్టాలని ధర్నా
కోలారు: కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ సమతా సైనిక దళ కార్యకర్తలు గురువారం నగరంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కేజీఎఫ్ తాలూకా బేతమంగల పబ్లిక్ శౌచాలయం స్థలాన్ని కొంతమంది ఆక్రమించి గదిని నిర్మించి బాడుగకు ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన అధికారులు ఆక్రమణదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. క్యాసంబళ్లి ఫిర్కా కాజిమిట్టహళ్లి ప్రభుత్వ గోమాళం భూమి 15 ఎకరాలలో అక్రమంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు. దీనిపై దాఖలాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ భరత్కు వినతి పత్రం సమర్పించారు. ప్రతిఘటనలో సమతా సైనికదళ పదాధికారులు భారతమ్మ, ముని వెంకటస్వామి, బాల సుబ్రమణి తదితరులు పాల్గొన్నారు. -
పడకలు జాస్తి.. వసతులు నాస్తి
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వాస్పత్రుల్లో ఒకటిగా పేరుగాంచిన, ఉత్తర కర్ణాటకలో ప్రముఖంగా రోగులకు వరంగా మారిన బీఎంసీఆర్సీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత రోగులకు శాపంగా మారింది. దాదాపు 50 సంవత్సరాల క్రితం విమ్స్ ఆస్పత్రిగా, ప్రారంభంలో 100 పడకల ఆస్పత్రిగా అవతరించిన ఈ విమ్స్ ఆస్పత్రిని క్రమేణా 1500 పడకల ఆస్పత్రిగా ఆప్గ్రేడ్ చేయడంతో పాటు ఆస్పత్రి పేరును కూడా బళ్లారి మెడికల్ కాలేజీ అండ్ రిసెర్చ్ సెంటర్(బీఎంసీఆర్సీ)గా రూపాంతరం చేస్తూ, ఇక్కడ పని చేసే వైద్యులు, సిబ్బందిని పక్కనే నూతనంగా నిర్మించిన ట్రామా కేర్ ఆస్పత్రికి కూడా ఇక్కడ వైద్యులు, సిబ్బందిని నియమించి వైద్య సేవలు అందిస్తున్నారు. ట్రామా కేర్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ఎముకలకు సంబంధించిన చికిత్సలు, కాళ్లు విరిగినా, మోకాళ్లకు సంబంధించిన వ్యాధులతో పాటు అన్ని రకాల చికిత్సలకు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఇటీవల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ప్రారంభించారు. తగినంత మంది వైద్య సిబ్బంది లేరు బెంగళూరు తరహాలో బళ్లారిలో కూడా వైద్య సేవలు అందించేందుకు వీలుగా రోగులకు అన్ని రకాల చికిత్సలు, పరీక్షలు చేసేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించారు కాని అక్కడ తగినంత మందిని వైద్యులను నియమించలేదు. బీఎంసీఆర్సీ, ట్రామా కేర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అనే మూడు ప్రధానమైన ఆస్పత్రుల్లో వసతుల మాట అటుంచితే కనీసం వైద్యులు, సిబ్బంది కొరత కూడా పెద్ద సమస్యగా మారింది. బీఎంసీఆర్సీలో వైద్య సేవల కోసం ఒక్క బళ్లారి జిల్లాకు చెందిన రోగులు మాత్రమే వస్తున్నారనుకుంటే పొరపాటు. ఇక్కడికి బళ్లారి జిల్లాతో పాటు చిత్రదుర్గ, విజయనగర, కొప్పళ, రాయచూరు తదితర జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని సరిహద్దు తాలూకాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చికిత్స చేయించుకుని వెళుతుంటారు. ప్రతి రోజు సుమారు 500 మందికి పైగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చికిత్సలు చేయించుకుని వెళుతుండటం సర్వసాధారణంగా మారింది. బీఎంసీఆర్సీలో వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత అందని మెరుగైన వైద్యం.. ఫలితంగా రోగులకు శాపం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిన వైనం కొరత ఉందని అమాత్యులే సెలవిచ్చారు ఆస్పత్రిలో 288 వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, 858 వివిధ విభాగాలకు చెందిన సిబ్బందితో పాటు 23 మంది దంత వైద్యుల కొరత ఉందని స్వయంగా అసెంబ్లీలో విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్ అడిగిన ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ చెప్పడం గమనార్హం. ఇంత పెద్ద సంఖ్యలో వైద్యుల కొరత వేధిస్తున్నప్పటికీ మాటల వరకే పరిమితం అవుతున్నారు కాని ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించడంలో తగిన చొరవ తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఉత్తర కర్ణాటకు చెందిన వ్యక్తే సంబంధిత వైద్య, ఆరోగ్య శాఖకు మంత్రిగా ఉన్నప్పటికీ తూతూమంత్రంగా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుండడంతో పాటు సమస్యలపై చర్చిస్తారే కాని వాటిని ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపై దృష్టి పెట్టకపోవడంతో బీఎంసీఆర్సీ ఆస్పత్రిలో ఇతర సమస్యలు కుప్పలు, తెప్పలుగా ఉన్నప్పటికీ కనీసం వైద్యులు, సిబ్బంది కొరతను కూడా తీర్చకపోతే రోగులకు ఎలా వైద్యం అందిస్తారు? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. సర్కార్కు చీమ కుట్టినట్లయినా లేదు ఇంతటి ఘనమైన ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నా పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడంతో పాటు అసెంబ్లీలో పలుమార్లు పాలక, ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రశ్నల వర్షం కురిపించి, సమస్యలపై గళం విప్పినప్పటికీ సంబంధింత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తగిన విధంగా స్పందించకపోవడంతో రోగులకు సరైన విధంగా వైద్యం అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. బీఎంసీఆర్సీ ఆస్పత్రిలో ఏటేటా పడకల సంఖ్య పెంచుతుండగా వైద్యులు తగినంత మంది పని చేస్తున్నారా? లేదా? అన్న విషయంపై కూడా ఇక్కడ పని చేసే అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బీఎంసీఆర్సీలో ఆర్థో, న్యూరో, హార్ట్, జనరల్ సర్జన్, చిన్న పిల్లల వైద్యులు, కంటి డాక్టర్లు, గైనకాలజిస్టులు తదితర విభాగాల్లో హెచ్ఓడీలతో పాటు దాదాపు 450 మంది వైద్యులను నియమించాల్సి ఉండగా, ప్రస్తుతం 162 మంది వైద్యులే పని చేస్తున్నారు. 1072 మంది ఇతర సిబ్బందిని నియమించాల్సి ఉండగా, కేవలం 213 మందిని మాత్రమే నియమించుకుని వారితోనే సేవలు చేస్తున్నారు. -
చెన్నబసవ స్వామీజీ మృతి
సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లా బసవనబాగేవాడి తాలూకా ఇంగళేశ్వర గ్రామానికి చెందిన వచన శిలామంటపను స్థాపించిన చెన్నబసవ స్వామీజీ (94) మృతి చెందారు. గురువారం స్వామీజీ మృతి చెందారని, శుక్రవారం స్వామీజీ అంత్యక్రియలు నిర్వహిస్తారని, ఇంగళేశ్వర గ్రామంలో పార్థివదేహాన్ని ఊరేగించిన అనంతరం క్రియా సమాధిని చేస్తారని స్థానికులు వెల్లడించారు. స్వామీజీ మృతి చెందడంపై విజయపుర జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులు ఆయన ఆధ్యాత్మిక మార్గంలో నడిచిన తీరును కొనియాడుతూ సంతాపం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థి ఆత్మహత్య సాక్షి,బళ్లారి: గదగ్ జిల్లా ముండరగి పట్టణంలోని మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉంటూ బీఏఎంఎస్ విద్యనభస్యసిస్తున్న ఈశ్వర్ (21) అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హాస్టల్లో ఉరి వేసుకుని మృతి చెందారని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ హాస్టల్ సిబ్బంది, యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో సంవత్సరంలో బీఏఎంఎస్ కోర్సు పూర్తి కావస్తున్న నేపథ్యంలో తమ కుమారుడు మృతి చెందడంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నీటికుంటలో ఇద్దరు యువకుల జలసమాధిసాక్షి,బళ్లారి: ప్రమాదశాత్తు నీటికుంట(ఫారంపాండ్)లో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చిత్రదుర్గ జిల్లా బీ.ఆర్. గ్రామ సమీపంలో గొర్రెలను మేపడానికి వెళ్లిన మారుతీ(19), విశ్వనాథ్(23) అనే ఇద్దరు యువకులు నీటికుంటలో గొర్రెలను శుభ్రం చేయాలని వాటిని పట్టుకుని దిగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై చిత్రదుర్గ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేంద్రమంత్రిని నిందిస్తారా?రాయచూరు రూరల్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏకవచనంతో నిందించడం సరికాదని రాయచూరు జిల్లా మహిళా బీజేపీ అధ్యక్షురాలు, నగరసభ మాజీ అధ్యక్షురాలు కుడుగోలు లలిత ఆరోపించారు. టిప్పుసుల్తాన్ ఉద్యాన వనం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. సిద్దరామయ్యకు భారతీయ సంప్రదాయాలు, మహిళలపై గౌరవం లేదన్నారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన సిద్దు మహిళలను అగౌరవ పరిచే విధంగా వ్యాఖ్యానించడం తగదన్నారు. గ్రామీణ భాషలో సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలను విమర్శించే హక్కు సిద్దరామయ్యకు ఉందా? అని ప్రశ్నించారు. సిద్దరామయ్యపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. మానవహక్కులతో శాంతియుత జీవనంశ్రీనివాసపురం: శాంతియుత జీవనంలో మానవ హక్కుల పాత్ర కీలకమని డీఎస్పీ మనీషా అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన విశ్వ మానవహక్కుల దినోత్సవంలో డీఎస్పీ పాల్గొని మాట్లాడారు. మానవ హక్కులకు భంగం కలగకుండా జాగ్రత్త వహించాలన్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. జాతీయ మానవ హక్కుల జాగృతి, అవినీతి నిర్మూలన సంస్థ జనసేవా ఫౌండేషన్ సంస్థాపక అధ్యక్షుడు శివకుమారగౌడ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ పుట్టినప్పటి నుంచి మరణించే వరకు హక్కులు ఉంటాయన్నారు. తహసీల్దార్ సుధీంద్ర, జిల్లా న్యాయ సేవల ప్రాధికార ఉప ప్రధాన అధికారి సతీష్ పాల్గొన్నారు. కంటి ఆస్పత్రి ప్రారంభంకృష్ణరాజపురం: కృష్ణరాజపురంలోని గృహ నిర్మాణ సహకార సంఘం నూతన భవనంలో ఏర్పాటు చేసిన నారాయణ కంటి ఆస్పత్రిని ఎమ్మెల్యే బీఏ బసవరాజు ప్రారంభించి లోకార్పణం చేశారు. ఆరోగ్య బీమా, యశస్విని కార్డు, వివిధ బీమాల ప్రాయోజకత్వంలో రోగులకు ఈ ఆస్పత్రి ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్టు హోసూరు: గంజాయి విక్రయిస్తూ ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి పోలీసులకు పట్టుబడ్డారు. కడలూరు జిల్లాకు చెందిన రోహిత్(19) స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. హోసూరు పారిశ్రామిక వాడ జూజువాడి చెక్పోస్టు వద్ద మద్య నిషేధ శాఖ పోలీసులు గస్తీ నిర్వహించగా.. రోహిత్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పోలీసులు అతడిని అదుపు లోకి తీసుకొని విచారించగా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసింది. అతడి వద్ద 510 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.మారుతీ(ఫైల్) విశ్వనాథ్(ఫైల్) -
అతి వేగం.. ముగ్గురి ప్రాణాలు బలి
దొడ్డబళ్లాపురం: అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొని ఎగిరిపడి పక్క రోడ్డులో వెళ్తున్న బస్సును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. బెంగళూరు రూరల్లో దేవనహళ్లి శివారులోని బెంగళూరు– హైదరాబాద్ హైవే లో బుధవారం రాత్రి 11:40 సమయంలో జరిగింది. సాదళ్లికి చెందిన మోహన్ కుమార్ (33), సుమన్ (28), సాగర్ (23) చనిపోయారు. కియా కారులో చిక్కబళ్లాపురం నుంచి దేవనహళ్లి వైపు అతివేగంగా వస్తున్నారు. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఎగిరి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఢీకొన్న రభసకు కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే తీవ్రగాయాలతో ప్రాణాలు విడిచారు. బస్సులో ఉన్న సుమారు 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డులోని ఆర్టీసీ బస్సుకు కారు ఢీ దేవనహళ్లి వద్ద విషాదం -
తీయని కళాఖండాలు
శివాజీనగర: అక్కడికి వెళ్లగానే వివిధ ఫ్లేవర్లతో కూడిన కళాఖండాలు నోరూరిస్తాయి. బెంగళూరులో ప్రతి ఏడాది క్రిస్మస్, కొత్త ఏడాది సందర్భంగా కనువిందుగా కేక్ షో నిర్వహించడం తెలిసిందే. ఈసారి కూడా కేక్ల జాతర ఆరంభమైంది. ఓ బేకరీ సంస్థ దీనిని నిర్వహిస్తోంది. ప్యాలెస్ గ్రౌండ్స్ త్రిపురవాసినిలో గురువారం ఆరంభం కాగా, జనవరి 4వ తేదీ వరకు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది. 90 రోజులు శ్రమించి నిర్మాణం ఈసారి లేజర్ కట్ పరిజ్ఞానంతో కేక్ల ఆకృతులను నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ కొలువైన 28 కేక్ కళాకృతులను 50 మంది కళాకారులు, చెఫ్లు గత 90 రోజుల పాటు శ్రమించి తయారు చేశారని తెలిపారు. 18 అడుగుల ఎత్తైన రాయల్ డ్రీమ్ కోట, 10 అడుగుల వేళాంగిణి మాత చర్చి, బోన్సాయ్ గార్డెన్, టర్బో రేసింగ్ కార్స్, చాకో వెడ్డింగ్ కేక్ తదితరాలు అలరిస్తున్నాయి. బెంగళూరు ప్యాలెస్ మైదానంలో కేక్ షో షురూ జనవరి 4 వరకు ప్రదర్శన -
వధువుల కోసం మలబార్ కలెక్షన్
సాక్షి, బెంగళూరు: పెళ్లిలో వధువుకు అత్యంత ఇష్టమైన ఆభరణాలను వినూత్న డిజైన్లలో అందించేందుకు ప్రతిష్టాత్మక బంగారు, వజ్రాభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిద్ధమైంది. 15వ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా సిరీస్ను మలబార్ ప్రారంభించింది. ప్రతి ఏడాది తరహాలోనే పెళ్లిళ్ల సీజన్కు కొత్త హంగులు అద్దడంతో పాటు కుటుంబాల్లో జరిగే వేడుకలకు సరికొత్త మెరుపులతో మెలుగు జిలుగులకు దోహదపడతాయని తెలిపింది. ఈ ప్రత్యేక 15వ సీజన్ సందర్భంగా తయారీ చార్జీలపై 30 శాతం రాయితీ, వజ్రాలపై 30 శాతం వరకు రాయితీని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు జనవరి 16 వరకు అందుబాటులో ఉంటాయి. సైబర్ నేరగాళ్ల వల.. విద్యార్థి ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: నగ్న ఫోటోలు వైరల్ చేస్తామని బెదిరించడంతో భయపడ్డ ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలోని శాంతినగరలో చోటుచేసుకుంది. కేరళకు చెందిన మోహన్ (25) మృతుడు. వివరాలు.. స్థానిక ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ రెండో ఏడాది చదువుతూ ఉండేవాడు. అయితే సైబర్ నేరగాళ్లు ఓ యువతి ద్వారా అతనికి వీడియో కాల్స్ చేస్తూ హనీ ట్రాప్లోకి లాగినట్లు సమాచారం. ఆమె తరచూ కాల్స్ చేసి డబ్బులు వసూలు చేసేది. రూ.25 వేలు పంపినట్లు తెలిసింది. మరింత డబ్బు పంపాలని, లేదంటే న్యూడ్ కాల్స్ను వైరల్ చేస్తామని బెదిరించడంతో భయపడిపోయాడు. బుధవారం సాయంత్రం డెత్నోట్ రాసి ఉరివేసుకున్నాడు. డెత్నోట్లో మూడు మొబైల్ నంబర్లు ఉన్నాయి. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరో 60 ఇండిగో విమానాల క్యాన్సిల్ దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో గురువారంనాడు కూడా 60 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. కేఐఏ నుంచి బయలుదేరాల్సిన 28 విమానాలు, ఇక్కడకు రావాల్సిన 32 విమానాలు క్యాన్సిల్ కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులకు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక బుధవారం 58 విమానాలు రద్దయ్యాయి. మాదప్పకు రూ.2.53 కోట్ల ఆర్జన మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలె మహదేశ్వర బెట్టలోని స్వామివారికి కనకవర్షం కొనసాగుతోంది. దేవస్థాన హుండీలను లెక్కించారు. ఈసారి 28 రోజుల్లో రూ.2.53 కోట్లు భక్తుల నుంచి కానుకల రూపంలో జమ అయ్యాయి. రూ.2.53 కోట్ల నగదు, 25 గ్రాముల బంగారం, 1,253 గ్రాముల వెండి సొత్తు హుండీలలో ఉన్నాయి. చలామణిలో లేని రూ.2 వేల నోట్లు 3, 16 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. ఆన్లైన్ హుండీ ద్వారా రూ.7 లక్షలు జమైంది. శాంత మల్లికార్జున స్వామి, అధికారులు రఘు, చంద్రశేఖర్, మరిస్వామి, గురుమల్లయ్య, పోలీసులు పాల్గొన్నారు. మాల్ నిర్మాణానికి రాజమాత బ్రేక్ మైసూరు: నగరంలోని వస్తు ప్రదర్శన ప్రాధికార ఆవరణలో యూనిటీ మాల్ నిర్మాణానికి వ్యతిరేకంగా మైసూరు రాజమాత ప్రమోదాదేవి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. 6.5 ఎకరాల్లో స్వదేశీ హస్త కళాకృతుల ఉత్పత్తుల విక్రయాల కోసం యూనిటీ మాల్ నిర్మాణానికి ఎంపీ యదువీర్ భూమిపూజ చేశారు. పీపీపీ నమూనాలో రూ.193 కోట్ల వ్యయంతో 36 స్టాళ్లతో ఏర్పాటవుతుంది. 2027 నాటికి పూర్తి కావాల్సింది. అయితే ఆ స్థలం మైసూరు ప్యాలెస్కు చెందినదని ఎంపీ యదువీర్ తల్లి, రాజమాత ప్రమోదాదేవి ఒడెయర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారణ చేపట్టిన హైకోర్టు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని, యథాతథ స్థితిని కాపాడాలని స్టే జారీచేసింది. దీంతో అన్ని పనులు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టర్ లక్ష్మికాంత్రెడ్డి మాట్లాడుతూ త్వరలో హైకోర్టుకు వెళ్లి ఆ స్టేను తొలగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
ముఖ్యమంత్రి మార్పు ఉండదు
శివాజీనగర: వాన నిలిచినా చినుకులు నిలవలేదన్నట్లుగా సీఎం కుర్చీ మార్పు గురించి ఎవరూ మాట్లాడరాదని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినా కూడా నాయకులు ఊరికే ఉండడం లేదు. సీఎం సిద్దరామయ్య తనయుడు, ఎమ్మెల్సీ యతీంద్ర ఇటీవల సీఎంగా మా తండ్రి పూర్తికాలం ఉంటారని ప్రకటించడం, దీంతో రభస రేగడం తెలిసిందే. సీఎం సిద్దు కుమారునికి బెళగావిలో గంటకు పైగా కూర్చోబెట్టుకుని ఇది తగదని సూచించారు. ఇది జరిగి రెండురోజులు కాకముందే యతీంద్ర గురువారం మళ్లీ పాత పాటే పాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు లేదని ఆయన అన్నారు. బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్పునకు హైకమాండ్ అంగీకరించలేదని చెప్పుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు లేదు. అలాగే అధికారం కోసం కీచులాటలు జరగడం లేదు అని అన్నారు. నేను ఇదివరకే మీకు చెప్పాను, అంతా స్పష్టంగా ఉంది, హైకమాండ్ సీఎంను మార్చడం లేదు అని ప్రకటించారు. ఈ ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. డీసీఎం డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు, నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. ఆగని భోజన విందులు భోజన విందులు బెళగావికి కూడా విస్తరించాయి. బుధవారం ఎమ్మెల్యే ఫిరోజ్ సేఠ్ ఇంటిలో సీఎం అనుకూల వర్గం విందు జరిగింది. ఇందులో సీఎం సిద్దరామయ్య, మంత్రులు జమీర్ అహ్మద్ ఖాన్, భైరతి సురేశ్, విధానసభ స్పీకర్ యూ.టీ.ఖాదర్, ఎమ్మెల్సీ సలీం అహ్మద్ పాల్గొన్నారు. ఇది రాజకీయం విందు భోజనం కాదు, ఫిరోజ్ ఆహ్వానంతో విందుకు పిలిస్తే వెళ్లారు అని మంత్రులు చెప్పారు. హైకమాండ్ బలహీనత: ఎమ్మెల్యే హుస్సేన్ యతీంద్ర మాటలపై రామనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మండిపడ్డారు. మేము మాట్లాడితే నోటీస్ ఇస్తారు, ఆయన మాట్లాడవచ్చా.., మా హైకమాండ్ బలహీనంగా ఉంది అని అన్నారు. అన్నింటినీ హైకమాండ్ తీర్మానం చేస్తుంది. యతీంద్ర వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో తెలియడం లేదు. పదే పదే అవే మాటలు చెబుతున్న ఆయననే అడగండి అని విలేకరులతో చెప్పారు. మేము నోరెత్తితే బలాత్కారం, ఆయన మాట్లాడితే చమత్కారమని దుయ్యబట్టారు. సీఎం తనయుడు యతీంద్ర మళ్లీ మాటల జోరు కాంగ్రెస్లో ప్రకంపనలు -
మేకెదాటు ప్రాజెక్టును చేపట్టండి
చెరసాలల్లో రాచమర్యాదలా? శివాజీనగర: కావేరి నదిపై మేకెదాటు నీటి ప్రాజెక్టును నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీలు, పాదయాత్రలు చేసి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఆ పథకాన్ని చేపట్టాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. గురువారం బెళగావి సువర్ణసౌధ అసెంబ్లీలో మేకెదాటుపై చర్చ సాగింది. బీజేపీ ఎమ్మెల్యే అరవింద బెల్లద్ విధానసభలో మాట్లాడుతూ మేకెదాటు ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ ఓట్లు పొందింది. సుప్రీంకోర్టు తమిళనాడు రిట్ పిటిషన్ను కొట్టివేసింది, ఇకనైనా మేకెదాటు ప్రాజెక్ట్ను ప్రారంభించాలని కోరాఉ. డిప్యూటీసీఎం డీకే శివకుమార్ జవాబిస్తూ బెల్లద్ సీనియర్ నాయకుడు, నేను ఆయన తండ్రితో కలసి ఎమ్మెల్యేగా పనిచేశాను. మేకెదాటు ప్రాజెక్ట్ పై ఆరునెలల లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది. మీ అందరినీ అత్యంత వినయంతో చేతులు జోడించి కోరుకొంటున్నా, మీరంతా కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పిస్తే మిమ్మల్ని పిలుచుకొని వెళ్లి ప్రాజెక్ట్కు భూమి పూజ చేస్తానని చేతులెత్తి మొక్కుతున్నాను అని చెప్పారు. ఇంత వినయమా? బీజేపీ సభ్యుడు వీ.సునీల్ కుమార్ స్పందిస్తూ ఇంత వినయ, విధేయతలతో అడుగుతున్నారు. ఇది నిజమైన డీ.కే.శివకుమార్ వారేనా? లేదా కొత్త రూపమా అని ప్రశ్నించారు. ఇంత వినయ, విధేయత ఎలా వచ్చిందని సునీల్కుమార్ అడిగారు. ఇమేజ్ కోసం కొన్ని సంస్థల సాయం తీసుకుంటారు, శివకుమార్ మెడలో టవల్ వేసుకోవటం కూడా ఇందులో భాగమేనా అని మరో ఎమ్మెల్యే సురేష్కుమార్ అడిగారు. సీఎం కావడం కోసమే ఈ వినయం అని ఎమ్మెల్యేలు చమత్కరించారు. కావేరి, మహదాయి, కృష్ణా, మేకెదాటు ప్రాజెక్టుల పనులు జరగాలంటే రూ. 1.5 లక్షల కోట్లు అవసరం, ఎక్కడి నుంచి తీసుకొస్తారని బెల్లద్ ప్రశ్నించారు. సీఎం గగనయాన ఖర్చు రూ.47 కోట్లు రెండున్నర ఏళ్లలో సీఎం సిద్దరామయ్య గగన విహారాలకు కోట్లాది రూపాయలు ఖర్చు అయ్యింది. 2023 నుంచి సీఎం సిద్దరామయ్య అధికారిక పర్యటనలకు హెలికాప్టర్, ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్నారు. ఇందుకోసం రూ.47.38 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. విమాన ప్రయాణాలకు ఖర్చు అధికమైంది. విధానపరిషత్లో సభ్యుడు ఎన్.రవికుమార్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. సీఎం జిల్లాల పర్యటనలకు వెళ్లేందుకు హెలికాప్టర్, విమానాలనే ఉపయోగిస్తున్నారు. విధానసభలో బీజేపీ డిమాండ్ డీసీఎం శివ వినయ, విధేయుడని వ్యాఖ్యలు సర్కారు మొద్దునిద్ర పోతోంది పరిషత్లో బీజేపీ ఎమ్మెల్సీ సర్జి శివాజీనగర: బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో కొందరు ఖైదీలకు రాజాతిథ్య సదుపాయాలు లభించడంపై విధానపరిషత్లో రగడ జరిగింది. జీరో అవర్లో సభ్యుడు ధనంజయ్ సర్జి ప్రస్తావించారు. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న దర్శన్కు కూడా రాచమర్యాదలు లభించాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో సామాజిక మాధ్యమాల్లో నవ్వులపాలైంది. జైలు సమస్యల పరిష్కార కమిటీ నివేదిక ఇచ్చి ఏళ్లు గడిచినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. 2017లో అదే సెంట్రల్ జైలులో తమిళునాడుకు చెందిన రాజకీయ నాయకులకు వీఐపీ వసతులు సమకూర్చారు. 2022లో అనుమానిత ఉగ్రవాదులు, ఖైదీలు మొబైల్ఫోన్లు వినియోగించారు. ఈ స్కాముల్లో అధికారుల బదిలీ మినహాయిస్తే ఎలాంటి మార్పులు జరగలేదు అని ఎమ్మెల్సీ దుయ్యబట్టారు. ఐజీపీ డాక్టర్ చంద్రగుప్త నేతృత్వంలో కమిటీ సుదీర్ఘ అధ్యయనంతో 4 నెలల క్రితం ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు, కానీ సిఫార్సుల అమలు చేయలేదు అని సర్కారును విమర్శించారు. కమిటీలపై కమిటీలను నియమించటం మాని ఇప్పటికే ఇచ్చిన నివేదికలను అమలుపరచాలని సర్జి డిమాండ్ చేశారు. -
కన్నడను ప్రోత్సహించాలి
రాయచూరు రూరల్: గడినాడు ప్రాంతంలో కన్నడ భాషను ప్రోత్సహిచాలని బెంగళూరు ఆకాశవాణి కళాకారుడు యోగ రవీశ బారత పిలుపు ఇచ్చారు. నగరంలోని క్రైస్ట్ అకాడమీ, ఐసీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన 70వ కన్నడ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఇతర భాషల నుంచి కన్నడ భాషకు గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. అన్య భాషలను గౌరవిస్తూ కన్నడకు పెద్ద పీట వేయాలన్నారు. 1980లో కన్నడ భాషకు బదులుగా అన్య భాషల ప్రభావం అధికంగా ఉందన్నారు. కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఆందోళన చేశారని గుర్తు చేశారు. థామస్, సెబాిస్టియన్లున్నారు. -
కొట్టూరేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
హొసపేటె: కలియుగ కామధేనువు, కల్పవృక్షంగా భక్తుల విశ్వాసాన్ని పొందిన కొట్టూరు శ్రీ గురు బసవేశ్వర స్వామి ఆలయాన్ని జిల్లాధికారిణి కవిత మన్నికేరి సందర్శించి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. ఆలయం చుట్టూ ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించిన తర్వాత ఆమె మాట్లాడుతూ రథోత్సవ సమయంలో వేలాది మంది భక్తులు కాలినడకన కొట్టూరుకు చేరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి, పరిశుభ్రత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. పాత పట్టణ పంచాయతీ పరిధిలోని ప్రాంతంలో మొదటి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రెండవ దశ పనులకు త్వరలో నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యనిర్వహక అధికారి మల్లప్ప, తహసీల్దార్ అమరేష్, పట్టణ పంచాయతీ ముఖ్య అధికారి ఏ.నసురుల్లా, ప్రధాన ధర్మకర్త శేఖరయ్య, బీడీసీసీ బ్యాంక్ జిల్లా గ్రామ ఉపాధ్యక్షుడు అడకి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర సమాచారంతో హాజరు కండి
హొసపేటె: అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరై పక్కా సమాచారాన్ని అందించాలని తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారి మార్కండేయ తెలిపారు. మంగళవారం కూడ్లిగి పట్ణణంలోని తాలూకా పంచాయతీ హాలులో జరిగిన కేడీపీ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. సంబంధిత శాఖ అధికారులు మాత్రమే సమావేశానికి హాజరు కావాలన్నారు. మీ దిగువ స్థాయి అధికారులను పంపవద్దు, వారి వద్ద శాఖ గురించి సమగ్ర సమాచారం ఉండదు. మీరు కూడా ముందుగా తమకు పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. సగం సగం సమాచారం ఇవ్వవద్దని ఆయన ఆదేశించారు. ప్రస్తుత నెలలో మీరు ఎన్ని బాల్య వివాహాలను నివారించారో, ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి అని సీడీపీఓని ప్రశ్నించారు. ఈ విషయంపై ఆయన బదులిస్తూ ఈ నెలలో 5 బాల్య వివాహాలను నివారించామని బదులిచ్చారు. ఒక బాలికకు 13 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్నందున ఆమెను హొసహళ్లి బీసీఎం హాస్టల్కు తరలించామన్నారు. కానీ అధికారులు ఆమెను హాస్టల్లో చేర్చుకోవడానికి వెనుకాడుతున్నారని అధికారి మాలంబీ బదులిచ్చారు. తాలూకాలో ఎక్కువ మంది కూలీ కార్మికులు ఉన్నారు. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు ఎంత మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోందా? అనే మార్కండేయ ప్రశ్నకు సీడీపీఓ సమాధానమిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇతర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. -
ప్రైవేటుకు దీటుగా.. ఆధునికత తోడుగా
అన్ని రకాల ప్రయోగాలతో ఏర్పాటు చేసిన ప్రయోగశాల పచ్చదనం పరిఢవిల్లుతున్న పాఠశాల ఆవరణ ఆధునిక వసతులతో విద్యార్థులకు పాఠాల బోధన హొసపేటె: ప్రైవేట్ పాఠశాలల జోరు మధ్య కూడా ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించడం కష్టతరమైన నేటి పోటీ యుగంలో విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని 76 వెంకటాపుర గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా దూసుకుపోతోంది. 1995లో ప్రారంభమైన తాలూకాలోని 76 వెంకటాపుర క్యాంప్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల కృషి, ఎస్డీఎంసీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాలో అగ్రగామి పాఠశాలగా రూపుదిద్దుకుంది. గత 17 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, గత 12 సంవత్సరాలుగా ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న పీజే నిరంజన్ ఈ పాఠశాల అభివృద్ధిలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రయోగశాల ఎయిర్ వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శాశ్వత సంస్థ సహకారంతో ఈ పాఠశాలలో మొత్తం రూ.16 లక్షల ఖర్చుతో ల్యాప్ లెర్నింగ్ లాబొరేటరీ, యాక్టివిటీ రూం నిర్మించారు. ఇలాంటి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు కావడం రాష్ట్రంలోనే ఇదే మొదటిది అని సమాచారం. ఈ ప్రయోగశాలలో కన్నడ, ఇంగ్లిష్, హిందీ, సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్తో సహా ప్రతి సబ్టెక్టుకు ప్రత్యేక విభాగం సృష్టించారు. ఇక్కడ అక్షరాస్యతతో పాటు సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ను ప్రదర్శనల ద్వారా బోధిస్తారు. 1వ తరగతి నుంచి కంప్యూటర్ విద్యను కూడా అందిస్తున్నారు. 76 వెంకటాపుర క్యాంప్లో అత్యాధునిక వసతులతో సర్కారు బడి అన్ని సబ్జెక్టులను మేళవించేలా ప్రయోగశాల ఏర్పాటు ఇలాంటి పాఠశాల ప్రారంభించడం రాష్ట్రంలోనే ప్రథమం -
ప్రభుత్వ స్కూళ్ల మూసివేత నిరసిస్తూ ధర్నా
రాయచూరు రూరల్ : రాష్ట్రంలోని కన్నడ ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేసి కర్ణాటక పబ్లిక్ స్కూళ్లలోకి విలీనం చేయడానికి సర్కార్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలను బంద్ చేయబోమని ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బెళగావి సువర్ణ విధాన సౌధ ముందు చేపట్టిన ఆందోళనలో సంచాలకులు బసవరాజ్ మాట్లాడారు. బెళగావి సువర్ణ విధాన సౌధలో శాసన సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప బదులిచ్చారు. రాష్ట్రంలో కన్నడ భాష ప్రాథమిక పాఠశాలలను మూసేయడం లేదని ప్రకటించారు. అలా లిఖితరూపంలో ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సువర్ణసౌధను ముట్టడించడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. -
ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్
హొసపేటె: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై సీఎం సిద్దరామయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరికి వినతిపత్రాన్ని అందజేశారు. బీజేపీ మహిళా నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలు యావత్ మహిళా లోకాన్ని అవమానించాయన్నారు. అందువల్ల సీఎం సిద్దరామయ్య వెంటనే నిర్మలా సీతారామన్తో సహా మొత్తం మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. బీజేపీ మహిళ విభాగం అధ్యక్షురాలు డాక్టర్. అరుంది సువర్ణ, రాష్ట్ర మహిళా మోర్ఛా కార్యదర్శి సుగుణ, కార్యనిర్వాహక సభ్యురాలు వాణిశ్రీ, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మీరా బాయి, వివిధ మహిళా విభాగాల నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నవ వివాహిత ఆత్మహత్యబొమ్మనహాళ్: కడుపునొప్పి తాళలేక ఇటీవలే పెళ్లయిన ఓ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన సరోజమ్మ, పెద్ద లింగన్న కుమారై జయలక్ష్మి (23) ని గత 3 నెలల క్రితం బొమ్మనహాళ్ మండలంలోని కురువల్లి కి చెందిన గోవిందప్ప కుమారుడు బోయ గురుస్వామికి ఇచ్చి పెళ్లి చేశారు. జయలక్ష్మి కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో వారం కిందట ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే బళ్లారి విమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. మృతురాలి తల్లి సరోజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అభివృద్ధికి మనమే విరోధులం రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల అభివృద్ధికి మనమే వ్యతిరేకులమని, అదే ఈ ప్రాంత వెనుకబాటుకు ప్రధాన కారణమని అంతర్జాతీయ బుకర్ అవార్డు విజేత దీపా బస్తీ అభిప్రాయ పడ్డారు. మంగళవారం సాయంత్రం కలబుర్గి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విప్లవ సాహిత్యం, హెచ్టీ పోతే రాసిన అంబేడ్కర్ జీవిత కథా పుస్తకాలను విడుదల చేసి మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలు కవులు, సాహితీ వేత్తలు, మూడు భాషల సాంగత్యం ఉందన్నారు. నైసర్గికంగా బలంగా ఉన్న సాహిత్యబలాన్ని ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థులు కళ్యాణ కర్ణాటక జిల్లాల అభివృద్ధికి ముందడుగు వేయాలన్నారు. భాష ద్వారా కూడా అభివృద్ధి అంశాలను ప్రస్తావించాలన్నారు. కన్నడ భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ ప్రామాణికంగా పని చేయాలన్నారు. సమావేశంలో విజయ శంకర్, శశికాంత్, రమేష్, సాగర్లున్నారు. పథకం లబ్ధి పొందండిరాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన స్వామిత్య పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ బీదర్ శాసన సభ్యుడు శ్రీశైలేంద్ర బిరాదార్ పేర్కొన్నారు. దక్షిణ బీదర్ తాలూకా రేకుళిగిలో జరిగిన సభలో మాట్లాడారు. గ్రామీణ భాగంలోని రైతులు ఇంటి, ఆస్తి పన్ను వివరాల రికార్డులను పొందడానికి హక్కు పత్రాలను డ్రోన్ యంత్రాల ద్వారా అందిస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 లో జాతీయ పంచాయత్రాజ్ దినోత్సవాన్ని ప్రారంభించి రికార్డులను భద్రపరుచుకోవడానికి అవకాశం కల్పించారన్నారు. కార్యక్రమంలో అధికారి మాణిక్ రావ్, మల్లికార్జున, సుదేశ్, నాగరాజ్, వీరణ్ణ, విద్యావతి, శిల్పా, రాజ్ కుమార్, నాగేశ్, మహేష్, ప్రకాష్లున్నారు. హెల్మెట్ ధారణ.. ప్రాణ రక్షణ రాయచూరు రూరల్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని పశ్చిమ పోలీస్ స్టేషన్ సీఐ మేకా నాగరాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ద్విచక్రవాహనదారులకు చైతన్యపరిచి ఆయన మాట్లాడారు. నానాటికీ ద్విచక్రవాహన ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. మరో వైపు మద్యం తాగి మొబైల్లో మాట్లాడుతూ నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. -
పోలీసుల తీరును ఖండిస్తూ నిరసన
హొసపేటె: ధార్వాడలో యువ ఉద్యమ నాయకులపై కొనసాగుతున్న పోలీసుల తీరును ఖండిస్తూ, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థి సంస్థ నిరసన ప్రదర్శన నిర్వహించింది. విజయనగర జిల్లా సమన్వయకర్త రవికిరణ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ విభాగాల్లో లక్షలాది ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ధార్వాడలో యువత నిరసన ప్రదర్శన నిర్వహించింది. పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన పోరాట కమిటీ నాయకులు, యువజన, రైతు విభాగాల నాయకులను అరెస్టు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అణచివేత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు చాలా సార్లు సమాచారం కోరినా, ఉద్యోగార్ధుల పోరాటానికి అనుమతి నిరాకరించారన్నారు. ఇప్పుడు యువత న్యాయమైన పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. జిల్లా సభ్యులు యూ.ఉమాదేవి విద్యార్థులు కే.చంద్ర, ఆకాష్, జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై బెళగావికి కదం
సాక్షి,బళ్లారి: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక పోవడంతో పాటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని బీజేపీ రైతు మోర్చా పదాధికారులు, రైతులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెళగావిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో బళ్లారి జిల్లా నుంచి జిల్లా బీజేపీ రైతు మోర్చా అధ్యక్షుడు గణపాల ఐనాధరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. క్వింటాల్కు రూ.2400ల ధర నిర్ణయించి రైతులను ఆదుకోవాలన్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తుంగభద్ర ఆయకట్టు కింద రెండో పంటకు నీరు ఇవ్వాలని లేకుంటే ప్రతి ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కారు. రైతుల సమస్యలపై తాము ఎన్నిసార్లు ఆందోళన చేసినా పట్టించుకోకపోవడంతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తుంగభద్ర ఆయకట్టులో రెండో పంటకు నీరివ్వాలి లేదా ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి అసెంబ్లీని ముట్టడించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు, రైతుల యత్నం కాంగ్రెస్ సర్కార్పై విపక్ష నేత బీ.వై.విజయేంద్ర మండిపాటు జిల్లా రైతు మోర్చా అధ్యక్షుడు గణపాల ఐనాధరెడ్డి వెల్లడి -
ధర్మస్థలలో ఏ అకృత్యాలూ జరగలేదు
బనశంకరి: ప్రపంచమంతటా పేరుపొందిన పుణ్య యాత్రాస్థలి ధర్మస్థలం మీద బురదజల్లాలని కొందరు కుట్రదారులు చేసిన ప్రయత్నం నిష్ఫలమైంది. అక్కడ ఎంతోమంది మహిళలు, యువతులపై అత్యాచారాలు, హత్యలు చేశారు, శవాలను నదిలో విసిరేయడంతో పాటు అనేకచోట్ల పూడ్చిపెట్టారని ఓ అపరిచితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి, చివరికి వట్టి కట్టుకథ అని నిర్ధారించారు. 3,923 పేజీల నివేదిక ఇదంతా డబ్బు, దుష్ప్రచారం కోసం కొందరు చేసిన కుట్ర అని, అక్కడ ఏమీ జరగలేదని నివేదికలో స్పష్టంచేశారు. ఈ మేరకు 3,923 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను బెళ్తంగడి కోర్టుకు సిట్ అధికారులు దాఖలు చేశారు. చిన్నయ్య అబద్ధపు ఫిర్యాదు చేశాడని తమ దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. చిన్నయ్య వాంగ్మూలంతో జూన్ ఆఖరు నుంచి 2 నెలలకు పైగా అనేక ప్రదేశాలలో జేసీబీలు, వందలాది మంది కూలీలు, క్లూస్ టీంలతో ముమ్మర గాలింపు సాగడం తెలిసిందే. కొన్నిచోట్ల ఏవో ఎముకలు తప్ప మృతదేహాల జాడలు లభించలేదు. క్రమంగా చిన్నయ్య, మిగతావారి పన్నాగం అని బయటపడింది. నివేదికలో ఏముందంటే... ధర్మస్థల కేసులో మాస్క్ మ్యాన్, మాజీ పారిశుధ్య కార్మికుడు చిన్నయ్య, స్థానిక సామాజిక కార్యకర్తలు మహేశ్శెట్టి తిమరోడి, గిరీశ్ మట్టణ్ణవర్, విఠల్గౌడ, జయంత్, సుజాత భట్ ఈ కుట్రలో భాగస్వాములయ్యారని నివేదికలో పేర్కొన్నారు. డబ్బుకు ఆశపడి చిన్నయ్య ఎక్కడి నుంచో ఓ పుర్రెను తీసుకొచ్చి ధర్మస్థల మారణకాండకు సాక్ష్యమని ప్రచారం చేశాడని తెలిపారు. చిన్నయ్యను ముందు పెట్టుకుని మిగతావారు కుట్రను అమలుచేశారన్నారు. వందలాది శవాలను పూడ్చి పెట్టినట్లు చిన్నయ్యతో జిల్లా ఎస్పీ, న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చేలా ప్రేరేపించారని చెప్పారు. లైంగిక దాడులు, హత్యలు అనేది అబద్ధమని స్పష్టంచేశారు. కుట్ర కేసులో ఇదివరకే చిన్నయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బెళ్తంగడి కోర్టులో సిట్ ప్రాథమిక నివేదిక చిన్నయ్య, ముఠా తప్పుడు ఫిర్యాదు ద్వారా కుట్ర నివేదికలో వెల్లడి కోర్టులో విచారణ సిట్ అధికారులు నవంబరు 21న దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి కోర్టులో నివేదిక అందజేశారు. బుధవారం ఈ కేసును కోర్టు విచారించింది. ధర్మస్థల మీద కుట్రకు పాల్పడిన వారిపై సాక్ష్యాధారాలు ఉన్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ కోరింది. చిన్నయ్యతో కుట్రలో భాగస్వాములైన మిగిలిన ఐదుగురి పేర్లను ప్రస్తావిస్తూ సిట్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నెల 26న ఆదేశాలిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. నివేదికతో ధర్మస్థల భక్తులు, హిందూసంఘాలలో సంతోషం నెలకొంది. -
ధర్మస్థలపై కుట్ర అని ఆరోజే చెప్పా
● డిప్యూటీ సీఎం డీకే బనశంకరి: ధర్మస్థల మీద వ్యతిరేకంగా కుట్ర జరిగిందని నేను ఆ రోజే ధైర్యంగా చెప్పానని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. అంతేకాక ఈ కుట్రకు కారణం ఏమిటి అనేది కూడా చెప్పానన్నారు. బుధవారం బెళగావిలో సర్క్యూట్ హౌస్లో డీకే శివకుమార్ను కేఎస్సీఏ నూతన అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడారు. సిట్ చార్జీషీట్లో ఫిర్యాదుదారులే కుట్రదారులు అని తెలిసిందని విలేకరులు ప్రస్తావించారు. నాకు ధర్మస్థల చరిత్ర గురించి తెలుసు, ఎవరూ ఇలాంటివి చేయరు అనేది తెలుసు. అందుకే ధైర్యంగా ఈ విషయం తెలిపానన్నారు. చార్జిషీట్లో ఏముంది అనేది చదవలేదు, ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి, అదే జరుగుతుంది. అంతిమంగా నిజం బయటపడింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య అనేక విభేదాలు ఉండడంతో ఈ కుట్ర జరిగిందని డీకే చెప్పారు. -
డ్రగ్స్ విక్రేతల అరెస్టు, రూ.4.20 కోట్ల సరుకు సీజ్
బనశంకరి: బెంగళూరులో డ్రగ్స్ పెడ్లింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు విదేశీయులు, కేరళవాసిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.4 కోట్ల 20 లక్షల విలువచేసే 1.12 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్స్, హైడ్రో గంజాయి, మొబైల్ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. నైజీరియా కు చెందిన ఒబైయ సిచిగోజీదవి, సనిసాదిక్, కేరళవాసి మహమ్మద్ ముస్తఫా అనే ముగ్గురు డ్రగ్స్పెడ్లర్లను బుధవారం బాగలూరు, అశోకనగర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 4.20 కోట్లు విలువచేసే డ్రగ్స్ ను వశపరచుకున్నట్లు తెలిపారు. ముస్తఫా హైడ్రోగంజాయిని తీసుకువచ్చి బెంగళూరులో అమ్ముతున్నాడు. ఇతని వద్ద నుంచి రూ.2 కోట్ల విలువచేసే సరుకును సీజ్ చేశారు. ఇటీవల ప్రముఖ డ్రగ్స్ వ్యాపారి, నైజీరియన్ ఎజికేనైగో ఓకాపార్ ను అరెస్ట్ చేసి రూ.23 కోట్ల విలువైన వివిధ రకాల డ్రగ్స్ను పట్టుకున్నారు. -
గోవధ నిషేధ చట్టానికి గండి కొట్టొద్దు
తుమకూరు: గోవులు, పశువుల వధను అడ్డుకునే చట్టానికి సవరణలు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వం నిర్ణయించడంపై విశ్వ హిందూ పరిషత్ గోరక్షా విభాగం కార్యకర్తలు , బీజేపీ నాయకులు బుధవారం నగరంలో ఆందోళన జరిపారు. జీజీఎస్ సర్కిల్లో గోవులతో నిరసన తెలిపారు. గోవధను అరికట్టేందుకు గత బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన చట్టాన్ని సవరించి గోవధకు సహకారం, ప్రోత్సాహం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనార్టీల ఓట్ల కోసం వారిని బుజ్జగించేందుకు గోవధ నిషేధ చట్టాన్ని నీరుగార్చడం సరికాదన్నారు. ఈ చట్టాన్ని యథాప్రకారం అమలు చేయాలన్నారు. గోవులకు కార్యకర్తలు పూజలు చేశారు. ఆన్లైన్ గేమ్తో రూ.40.71 లక్షల టోపీ మైసూరు: ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న స్నేహితుల మాటలను నమ్మిన ఓ వ్యక్తి డబ్బు పెట్టుబడి పెట్టి రూ.40.71 లక్షలను కోల్పోయిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. నగరంలోని అశోక రోడ్డు నివాసి రాజస్థాన్కు వెళ్లాడు. అక్కడ వారి స్నేహితులు ఆన్లైన్ గేమ్లో డబ్బు పెట్టుబడి పెడితే కోట్లాది రూపాయలను సంపాదించవచ్చని ఆశ పుట్టించారు. మైసూరుకు తిరిగివచ్చాక అతడు గూగుల్లో వెతికి ఫన్ ఇన్ మ్యాచ్ అనే యాప్ ద్వారా అక్కడి వ్యక్తిని సంప్రదించి డబ్బు పెట్టుబడి పెట్టారు. మొదట్లో కొద్దిగా లాభం వచ్చింది. దీంతో సంతోషపడిన ఆ వ్యక్తి సైబర్ మోసగాళ్లు చెప్పినట్లుగా దశల వారీగా రూ.40.71 లక్షలను పెట్టుబడి పెట్టగా రూపాయి కూడా తిరిగి రాలేదు. సైబర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దావణగెరెలో చోరీ.. మధ్యప్రదేశ్లో సొత్తు రికవరీ దొడ్డబళ్లాపురం: దావణగెరెలో పెళ్లిలో చోరీకి గురైన బంగారు ఆభరణాలను దావణగెరె గ్రామీణ పోలీసులు మధ్యప్రదేశ్లో సీజ్ చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన కరుడుగట్టిన దోపిడీ ముఠా అయిన బ్యాండ్ బాజా గ్యాంగ్ సభ్యులు ఈ చోరీకి పాల్పడ్డారు. వివరాలు.. గత నెల 14న అపూర్వ రెస్టారెంట్లో జరిగిన ఓ వివాహ వేడుకలోకి కరణ్ వర్మ, వినీత్ సిసోడి అనే దొంగలు చొరబడ్డారు. పెళ్లివారు ఓ బ్యాగులో ఉంచిన 535 గ్రాముల బంగారు నగలను దోచుకుని మధ్యప్రదేశ్కి పరారయ్యారు. పోలీసులు మధ్యప్రదేశ్లోని రాజగడ్ జిల్లా నరసింగలో కార్యాచరణ జరిపి దొంగలను గుర్తించారు. వారి ఇళ్లలో నుంచి రూ.51.49 లక్షల విలువైన బంగారు సొత్తును సీజ్ చేశారు. అయితే దొంగలు పట్టుబడలేదు. వారి కోసం శోధిస్తున్నారు. చనిపోయినా వదలడం లేదు ● రేణుకాస్వామి సమాధి ధ్వంసం దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పెద్ద సంచలనం సృష్టించిన కేసు చిత్రదుర్గంవాసి రేణుకాస్వామి హత్య. గతేడాది జూన్ 8న రాత్రి బెంగళూరులో కామాక్షిపాళ్య పీఎస్ పరిధిలో పట్టణగెరెలో ఓ షెడ్డులో అతనిని తీవ్రంగా చితకబాది హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా నటి పవిత్రగౌడ, నటుడు దర్శన్, మరికొందరు నిందితులు అప్పటి నుంచి పరప్పన జైలులో ఉండడం తెలిసిందే. అయితే రేణుకాస్వామి మరణించినా కూడా దాష్టీకాలు ఆగడం లేదు. రేణుకాస్వామి సమాధి ఫలకాన్ని ఎవరో దుండగులు ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. చిత్రదుర్గలో అతని సమాధి ఉండగా, పక్కనే లేఔట్ నిర్మిస్తున్న వారు ఈ పనికి పాల్పడ్డారా? లేక మరెవరైనా ధ్వంసం చేశారా? అనేది తెలియడం లేదు. రేణుకాస్వామి భార్య, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇక దర్శన్ నటించిన డెవిల్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. -
పేదల భోజ్యం.. దళారుల రాజ్యం
సాక్షి బళ్లారి: పేదల కడుపు నింపాలని ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే కాకుండా ఉత్తర కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, కలబుర్గి, బీదర్, యాదగిరి, విజయపుర తదితర జిల్లాల్లో రేషన్ షాపులకు ప్రతినెల సరఫరా చేస్తున్న ఉచితం బియ్యం కార్డు దారుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వైనం పరిపాటిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ప్రతి బీపీఎల్ రేషన్ కార్డుదారుకు ఉచితంగా బియ్యంను అందిస్తున్న నేపథ్యంలో ఆ బియ్యాన్ని డీలర్లు, దళారులు రంగప్రవేశం చేసి కార్డు దారుల నుంచి రూ.10లకే బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని పాలిష్ చేసి సోనామసూరి సన్న బియ్యం తరహాలో మార్చి కంపెనీ పేర్లు పెట్టి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు ఎక్కడో ఒక చోట దర్శనమిస్తుండటంతో పోలీసులు సంబంధిత అధికారులతో కలిసి వల పన్ని పట్టుకొంటున్నారు. 400 క్వింటాళ్ల బియ్యం పట్టివేత మంగళవారం ఉదయం బళ్లారి తాలూకాలోని బైపాస్ మార్గంలో ఎంహెచ్–26–బీ–9758 అనే నంబరుగల లారీలో కొప్పళ– హొసపేటె మార్గంలో బళ్లారి బైపాస్ వైపునకు తీసుకొస్తున్న దాదాపు 400 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు, పౌరసరఫరాల శాఖాధికారులు పట్టుకుని లారీతో సహా స్వాధీనం చేసుకొన్నారు. కొప్పళ– హొసపేటె మార్గం గుండా ఆంధ్రాకు తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకొని లారీ డ్రైవర్ను, బియ్యం తరలిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇలా ఈ ప్రాంతంలో ఏదో ఒక చోట రేషన్ బియ్యం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తక్కువ ధరకే బియ్యాన్ని తీసుకొని మెరుగులు దిద్ది ఎగుమతులు చేస్తున్న సంఘటనలు యాదగిరి జిల్లాలో పెద్ద ఎత్తున వెలుగులోకి రావడంతో అసెంబ్లీ కూడా పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. రేషన్ డీలర్ల కుమ్మక్కుతోనే.. పేదల కడుపు నింపే బియ్యాన్ని కార్డుదారులతో పాటు రేషన్ డీలర్లు వ్యాపారులకు అమ్మడానికి తోడ్పాటును అందిస్తుండటంతో ఈ అక్రమ రవాణా బియ్యం యథేచ్ఛగా కొనసాగుతుండటంతో ప్రభుత్వ లక్ష్యం పేదలకు చేరాలన్న సంకల్పం గాల్లో కలిసిపోతోంది. కార్డు దారులు కూడా నూటికి 50 శాతం పైగా వ్యాపారులకు అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. లక్షలాది కేజీల మేర బియ్యాన్ని పేదలకు ఉచితంగా అందజేస్తే వాటిలో సగం కూడా పేదల వద్దకు చేరకపోగా అక్రమంగా తరలించేందుకు రేషన్ బియ్యం వ్యాపారులకు, చేతినిండా పని కల్గిస్తూ అక్రమ సంపాదనకు రేషన్ బియ్యం వ్యాపారం దోహదం చేస్తోందని చెప్పవచ్చు. అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యంను పట్టుకొన్న పోలీసులు చౌక బియ్యంను తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడిన లారీ భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా, అమ్మకాలు కార్డు దారుల నుంచి తక్కువ ధరకే బియ్యం కొనుగోలు బియ్యాన్ని పాలిష్ చేసి అధిక ధరకు అమ్ముతున్న వైనం నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పట్టుబడుతున్న చౌక బియ్యం -
వాడీవేడిగా బడ్జెట్ ముందస్తు సమావేశం
సాక్షి బళ్లారి: నగరంలో సమస్యలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయని, ఓ వైపు మంచి నీటి సమస్య, మరో వైపు అస్థవ్యస్థమైన రోడ్లు, యూజీడీతో జనం సతమతం అవుతున్నారని ఆక్రమణలు చేసుకొని యథేచ్ఛగా భవనాల నిర్మాణం కొనసాగుతున్నా పాలికె చోద్యం చూస్తోందని పలువురు నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మహానగర పాలికె కార్యాలయంలో నూతన మేయర్ గాదెప్ప అధ్యక్షతన జరిగిన తొలి బడ్జెట్ ముందస్తు సమావేశంలో సమస్యలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. బడ్జెట్ కన్నా ముందు పలువురి సలహా సూచనలు తీసుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకొన్న నేపథ్యంలో నగరంలోని పలు సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నగరంలోని సమస్యలపై అవగాహాన ఉన్న ప్రముఖులు హాజరై నగరంలోని సమస్యలను పాలికె ముందు ఉంచారు. పాలికె ఆదాయాన్ని పెంచండి ఆంధ్రాళ సేవా సమితి అధ్యక్షుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త ఆర్.వెంకటరెడ్డి మాట్లాడుతూ నగరంలో పేరుకుపోయిన, రాజకీయ పలుకుబడి కలిగిన పెద్దల నుంచి ముందుగా పన్నులను ఎలాంటి మొహమాటం లేకుండా వసూలు చేయాలన్నారు. మరో సామాజిక కార్యకర్త మేకల ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ కొళగల్లులో మంచినీటి చెరువుకు 297 ఎకరాలను సేకరించిందన్నారు. అయితే పాలికె డంపు యార్డ్గా మార్చుకుందని మండిపడ్డారు. నగరంలోని పార్కులు అధ్వానంగా ఉన్నాయని, వాటిని సరిచేయాలన్నారు. అలాగే వేణుగోపాల్, సిద్ధేశ్ మాట్లాడుతూ నగర పాలికె పరిధిలో పలు సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేసి పరిష్కరించాలన్నారు. కర్ణాటక వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లాధ్యక్షుడు వీరభద్రగౌడ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇతర మహానగర పాలికెల పరిధిలో అమల్లో ఉన్న విలేకర్ల క్షేమాభివృద్ధి నిధులను బళ్లారిలో కూడా అమలు చేయాలన్నారు. ప్రైవేట్ స్కూళ్లపై పన్ను వేయండి నవ కర్ణాటక యువశక్తి సంఘం సీ.మంజునాథ్ మాట్లాడుతూ నగరంలో ఇళ్లల్లో నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలల నుంచి పన్నులు వసూలు చేయాలన్నారు. కర్ణాటక యువక సంఘం అధ్యక్షుడు బసవరాజు మాట్లాడుతూ పెద్ద మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్న ప్రతి ఒక్కరితో డబ్బులు వసూలు చేసి నగరాభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. సమస్యలను ఆలకించిన తర్వాత నూతన మేయర్ గాదెప్ప మాట్లాడుతూ నగరంలోని వివిధ సంఘ సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఇచ్చిన సలహాలను తూచ తప్పకుండా పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కరించేందుకు ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొత్తం మీద సమావేశంలో నగర సమస్యలపై పెద్ద ఎత్తున చర్చించడంతో అధికారులు, పాలక వర్గం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. సమస్యలపై గళం విప్పిన జనం పలు డిమాండ్లు వినిపించిన వైనం -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
హుబ్లీ: దివ్యాంగ బాలలు దేవుడి బిడ్డలుగా సమాజంలో అంతంత మాత్రమే ఆదరణకు నోచుకుంటున్నారు. అలాంటి ఈ పిల్లలకు మంగళూరులో వాట్సప్ గ్రూప్ ద్వారా సామాజిక స్పృహ కలిగిన ఓ బృందం పిక్నిక్ విహార యాత్ర ఏర్పాటు చేసి ఆ పిల్లల్లో కాసింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని నింపింది. మంగళూరుకు చెందిన పోస్టల్ ఫ్రెండ్స్ అనే బృందం ఈ మానవత కార్యక్రమాన్ని చేపట్టి అందరిలో వమాయమవుతున్న మానవత్వం పట్ల ప్రేరణ కలిగించింది. 2017లో ముగ్గురుతో ప్రారంభం అయిన ఈ వ్యాట్సప్ గ్రూప్ నమోదిత ట్రస్ట్గా సేవలు అందిస్తున్న ఈ సంస్థలో ప్రస్తుతం 80 మంది సభ్యులు ఉన్నారు. అబుదాబిలో నివసిస్తున్న పుత్తూరు పార్లడ్క నివాసి సిరాజ్ ఉద్దీన్ మదిలో చిగురించిన ఈ సంస్థకు షరీఫ్ అబ్బాస్ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా తెలివిగా మెలగాలని శిక్షణ కూడా ఇచ్చారు. ఈ వ్యాట్సప్ గ్రూప్లో ఉన్న వారు నియమాల ప్రకారం విసుగుతో మెసేజ్ డిలీట్ చేస్తే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా సొమ్ము రూ.10 వేలు దాటితే సమాజానికి దానంగా అందిస్తారు. ఈ సంస్థ సామాజిక, విద్య, ఆరోగ్య రంగాలపై అధిక ప్రాధాన్యతను ఇస్తూ రక్తదానం, మెడికల్ బెడ్, వీల్ చెయిర్ల పంపిణీ కార్యక్రమాన్ని విరివిగా చేపడుతోంది. మొత్తం మీద గ్రూప్ సమాజానికి భారంగా భావించే కొందరి వైఖరిని మేల్కొలిపేలా చేస్తున్న కృషి అభినందనీయం. దివ్యాంగ బాలలకు పిక్నిక్ -
మీటర్ రీడర్పై పాశవిక దాడి
మండ్య: మండ్య నగరంలోని గాంధీనగర్లోని ఏడవ క్రాస్లో సెస్కాం విద్యుత్ సంస్థ మీటర్ రీడర్ మీద ఓ కుటుంబం హత్యాయత్నానికి పాల్పడింది. మీటర్ పాతబడింది, కొత్త మీటర్ను అమర్చుకోవాలని చెప్పడమే అతను చేసిన పాపం. వివరాలు.. మండ్య సబ్–డివిజన్ సెస్కాంలో మీటర్ రీడర్ పి.సి.చన్నకేశవ (45) బాధితుడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ప్రకాష్, అతని కుమారుడు అర్జున, భార్య, తల్లి, మనవరాళ్ళు అతనిపై దాడి చేశారు. డిసెంబర్ 8న, చన్నకేశవ గాంధీనగర్లోని ఏడవ క్రాస్లోని ప్రకాష్ ఇంటికి మీటర్ రీడింగ్ కోసం వెళ్ళినప్పుడు, మీటర్ పాడైపోయిందని గమనించాడు. కొత్త మీటర్ను అమర్చుకోవాలని చెప్పడంతో మాకే చెప్పేంతవాడినా అని కోపం పట్టలేక దూషించి రంపం, కట్టెలు, రాళ్లు, ఇటుకలతో చావబాదారు. చన్నకేశవ వదిలేయాలని వారిని వేడుకున్నా వినకుండా కండలు ఊడి రక్తం పారేలా కొట్టసాగారు. బాధితుడు ఎలాగో తప్పించుకుని ఆస్పత్రిలో చేరాడు. దాడికి పాల్పడిన నిందితులపై వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హోటల్లో నగల మాయం మైసూరు: హోటల్ గదిలో ఓ మహిళ ఆభరణాల బ్యాగ్ మాయమైన ఘటన మైసూరు నగరంలో జరిగింది. వివరాలు.. బెంగళూరులోని టీ.దాసరహళ్లి నివాసి పల్లవి.. సోదరి వివాహ వేడుక కోసం కుటుంబ సభ్యులతో కలిసి మైసూరుకు వచ్చి ఓ హోటల్లో బస చేశారు. హెబ్బాళలోని లక్ష్మీకాంత దేవస్థానంలో జరిగిన వివాహంలో పాల్గొని హోటల్కు తిరిగి వచ్చారు. వేరొక హోటల్లో జరిగే రిసెప్షన్కు వెళ్లే ముందు రెండు గదులను ఖాళీ చేసి లగేజీని చూసుకోగా రూ.2 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ కనిపించలేదు. నజరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గీజర్ లీకై తల్లీ బిడ్డ మృతి దొడ్డబళ్లాపురం: వేడినీళ్ల గ్యాస్ గీజర్ లీక్ కావడంతో అస్వస్థతకు గురైన తల్లీ బిడ్డ చనిపోయిన సంఘటన బెంగళూరు గోవిందరాజనగరలోని పంచశీల నగరలో జరిగింది. తల్లి చాందిని (26), కుమార్తె యువి (4) మృతులు. చాందిని సోమవారం సాయంత్రం కుమార్తెకు స్నానం చేయించడానికి బాత్రూంలోకి వెళ్లగా అప్పటికే గ్యాస్ గీజర్లో నుంచి గ్యాస్ లీకై ఉంది. ఆ వాయువుని పీల్చిన ఇద్దరూ స్పృహ తప్పిపడిపోయారు. కొంతసేపటికి ఇరుగుపొరుగు ఇద్దరినీ విక్టోరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అన్నదాతల ఇబ్బందులు పట్టవా?● ఎప్పుడూ కుర్చీ గొడవలేనా? ● బెళగావిలో రైతులు, బీజేపీ నేతలచే అసెంబ్లీ ముట్టడి బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందంటూ రైతు సంఘాలతో కలిసి బీజేపీ నాయకులు బెళగావిలో అసెంబ్లీ ముట్టడిని నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై.విజయేంద్ర, ఆర్.అశోక్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతులు పాల్గొన్నారు. బెళగావి మాలిని మైదానంలో రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. తరువాత హైవే–4 గుండా అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. రైతులు మొక్కజొన్న , కందిని ప్రదర్శిస్తూ తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని, మద్దతు ధరలను ప్రకటించాలని పలు నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీ లేకుండా కేంద్ర ప్రభుత్వం పై అనవసర ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. బీవై.విజయేంద్ర మాట్లాడుతూ దేశంలో అత్యధికమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నది కర్ణాటకలోనే అన్నారు. రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి బదులుగా సీఎం, డిప్యూటీ సీఎం కుర్చీ కోసం పోరాటంలో నిమగ్నమయ్యారనిమారోపించారు. వెంటనే మొక్కజొన్న, కందిపంటల కొనుగోలు కేంద్రాలను తెరవాలని సర్కారును డిమాండ్ చేశారు. తుంగభద్ర ఆనకట్ట గేట్లు పాడై ఏడాదిన్నర గడించింది, ఇప్పటికీ బాగు చేయలేదని అన్నారు. -
4 ఏళ్లలో 52 వేల సైబర్ నేరాలు
బనశంకరి: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్ నేరగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. లక్షల రూపాయలను జనం నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్శాఖ చేపట్టిన కఠినచర్యలతో రాష్ట్రంలో సైబర్నేరాలు తగ్గుముఖం పట్టాయని హోంశాఖమంత్రి జీ.పరమేశ్వర్ చెప్పారు. బెళగావి సువర్ణసౌధ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుల ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత నాలుగేళ్లలో కర్ణాటకలో 52 వేల సైబర్ నేరాలు నమోదయ్యాయి. సైబర్ నేరాల నియంత్రణకు చట్టం మార్చాము, కానీ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఈ చట్టం మీద స్టే తీసుకువచ్చింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉంది అని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే సిమెంట్ మంజు మాట్లాడుతూ ఆన్లైన్ గేమ్లకు, జూదాలకు యువకులు బలి అవుతున్నారని, దీనికి అడ్డుకట్ట పడడం లేదన్నారు. నిందితులను అరెస్ట్ చేయడం లేదని, కర్ణాటకలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. సైబర్ మోసాల బాధితులు కేంద్ర ప్రభుత్వ సహాయవాణి కి ఫిర్యాదు చేసేలోగా నగదు కోల్పోతున్నారని, దీనిని అడ్డుకోవాలని కోరారు. గతేడాది 28 వేల కేసులు 2023లో 22,250 సైబర్ వంచన కేసులు నమోదు కాగా, 6,159 కేసుల ఆచూకీని పోలీసులు కనిపెట్టారని హోంమంత్రి తెలిపారు. సుమారు రూ.880 కోట్లు దోచేయగా ఇందులో రూ.177 కోట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 2024లో 28,478 కేసులు నమోదుకాగా, ఇందులో రూ. 2,562 కోట్లు వంచనకు గురికాగా, ఇందులో రూ.323 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 2025లో 13 వేల కేసులు రాగా, రూ.2,038 కోట్లు సైబర్కేటుగాళ్లు దోచేశారు. ఇందులో రూ.127 కోట్లు రికవరీ చేసుకున్నారని తెలిపారు. సైబర్ నేరాల సంఖ్య తగ్గిందని, నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 13 వేల కేసులు, రూ. 2వేల కోట్లకు పైగా లూటీ అసెంబ్లీలో హోంమంత్రి పరమేశ్వర్ -
భూబాధిత రైతులను ఆదుకోండి
సాక్షి బళ్లారి: కుడితినిలో ఎన్నో నెలలుగా ఆందోళన చేస్తున్న భూమి ఇచ్చిన రైతులను మానవతా దృక్పథంతో త్వరలో పరిష్కరించాలని విధాన పరిషత్ సభ్యుడు వైఎం.సతీష్ డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల రెండో రోజు బెళగావిలో జరిగిన విధాన పరిషత్తులో ఆయన గళం విప్పారు. కుడితిని పరిసరాల్లో పరిశ్రమలను నెలకొల్పేందుకు కుడితిని, వేణివీరాపురం, సిద్ధమ్మనహళ్లి, హరగినడోణి తదితర చుట్టు పక్కల గ్రామాల్లో రైతుల నుంచి కేఐఏడీబీ స్వాధీనం చేసుకొన్న భూమిలో పరిశ్రమలు నెలకొల్పకపోవడంతో భూమి ఇచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తక్కువ ధరతో భూమిని కొనుగోలు చేసి, భూమి ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొందన్నారు. అయితే అటు పరిశ్రమలను నెలకొల్పక, ఇటు ఉద్యోగాలు రాకపోవడంతో రైతుల కుటుంబాలు వీధినపడ్డాయన్నారు. 12 వేల ఎకరాలకు పైగా స్వాధీనం ఆర్సెలార్ మిట్టల్ ఇండియా లిమిటెడ్, ఉత్తమ్ గాల్వా ఫెరోస్ లిమిటెడ్, కర్ణాటక విజయనగర స్టీల్ తదితర కంపెనీలు ఈ ప్రాంతంలో సుమారు 12 వేల ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకొన్నాయన్నారు. అయితే పరిశ్రమలను నెలకొల్పకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులు కోర్టును ఆశ్రయించడంతో ఎకరాకు రూ.1.30 కోట్లు ఇవ్వాలని సూచించిందన్నారు. అయితే రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో కుడితినిలో ఎన్నో నెలలుగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఆ రైతులను మానవత దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 15 సంవత్సరాలుగా భూమి ఇచ్చిన రైతులు చేస్తున్న ఆందోళనపై మనవిని ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయన్నారు. పరిషత్లో ఎమ్మెల్సీ సతీష్ డిమాండ్ -
దశాబ్దాలు గడిచినా శుభ్రత మిథ్య
రాయచూరు రూరల్: నగరవాసులకు కలుషిత నీటిని విడుదల చేయడంతో వాటిని తాగి వాంతులు, విరేచనాలతో ిపిల్లలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. నిరంతర నీటి సరఫరాకు రూ.135 కోట్లు వ్యయం చేసి ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా చేయడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు విఫలం అయ్యారు. తుంగభద్ర ఎడమ కాలువ నుంచి రాంపుర జలాశయం ద్వారా నీటిని ట్యాంకులకు సరఫరా చేస్తారు. 25 ఏళ్ల క్రితం నిర్మించిన 35 ఓవర్ హెడ్ ట్యాంక్లు, 7 భూగర్భ ట్యాంకులలో ఒండు మట్టి మిశ్రితం కావడంతో ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంలో నగరసభ పాలక, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మరమ్మతుకు నోచుకోని ట్యాంకులు కొళాయిల్లో మంచినీరు రాని వైనం -
పెండింగ్ పనుల సత్వర పూర్తికి సూచన
హొసపేటె: జిల్లాలోని 8 స్థానిక సంస్థల పరిధిలోని వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లాధికారిణి కవితా ఎస్. మన్నికేరి అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన పట్టణ, స్థానిక సంస్థల వివిధ ప్రాజెక్టుల ప్రగతి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి, ప్రభుత్వ వివిధ పథకాల కింద చేపట్టిన రోడ్లు, మురుగు నీటి పారుదల, విద్యుత్ దీపాలు, వ్యర్థాల తొలగింపు, ఇతర అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. స్థానిక సంస్థల్లో మిగిలిన నిధులను ప్రాథమిక సౌకర్యాలు, అభివృద్ధి పనుల కోసం నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వ సహాయం, అర్హులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్లు వంటి వివిధ పథకాలను లబ్ధిదారులకు సమన్వయంతో పంపిణీ చేయాలన్నారు. జిల్లా పట్టణాభివృద్ధి సెల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, పట్టణ స్థానిక సంస్థల అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. -
మది నిండా.. బృహత్ జాతీయ జెండా
పతాకం ముందు సీఎం, డీసీఎం బనశంకరి: బెళగావిలో సువర్ణసౌధ పశ్చిమ ద్వారం వద్ద మంగళవారం అతి పెద్ద జాతీయ పతాకాన్ని సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ప్రారంభించారు. స్వరాజ్య ఉద్యమంలో జాతిపిత మహాత్మా గాంధీ బెళగావిలో కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన జ్ఞాపకార్థం దీనిని ఆవిష్కరించారు. 75 అడుగుల పొడవు, 55 అడుగుల వెడల్పుతో ఉంది. జెండా నిర్మాణానికి శ్రమించిన కలబుర్గివాసి వినోద్కుమార్ రేవప్ప బొమ్మణ్ణను సీఎం సన్మానించారు. ఇది ఖాదీ వస్త్రం కాదని, దేశానికి గర్వకారణమన్నారు. జాతీయ జెండా మనందరికీ గర్వకారణం, స్వాభిమానానికి సంకేతమన్నారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ స్పీకర్ యుటీ.ఖాదర్ చొరవతో వందేళ్ల చరిత్ర ను కాపాడేందుకు ఈ జాతీయ పతాకాన్ని రూపొందించారని తెలిపారు. దేశంలోని అందరి ఇళ్లుపై జాతీయ పతాకం ఎగరాలి, గుండెల్లో దేశభక్తి భావన ఉండాలని పిలుపునిచ్చారు. కిత్తూరు ఖాదీ కేంద్రం గరగలో మహిళా కార్మికులు ఈ జెండాను తీర్చిదిద్దారని తెలిపారు. ఇక్కడ శాసనసభ సమావేశాలు నిర్వహించే ప్రతిసారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించాలని నిర్ణయించారు. ప్రపంచంలో అతి పెద్ద జాతీయ పతాకాల్లో ఇది రెండవదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు జెండాను ఇలాగే ప్రదర్శిస్తారని తెలిసింది. బెళగావి అసెంబ్లీ ముందు ఆవిష్కారం -
చురుగ్గా డ్యాం పాత గేట్ల తొలగింపు పనులు
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 18వ గేట్కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి 18వ నంబరు పాత గేట్ను తొలగించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ గేట్ ఒక భాగం నీటి మట్టానికి 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. గేట్ ఒక భాగాన్ని కత్తిరించి తొలగించారు. డిసెంబర్ మూడో వారం నాటికి కొన్ని గేట్లను తొలగిస్తున్నట్లు తుంగభద్ర బోర్డు వర్గాలు తెలిపాయి. పాత గేట్ల తొలగింపు పనులు పూర్తి కాగానే కొత్త గేట్లను అమర్చే పనులు ప్రారంభిస్తామన్నారు. 33 గేట్ల నిర్మాణ పనుల టెండర్ను గుజరాత్కు చెందిన కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. సుమారు రూ.52 కోట్ల ఖర్చుతో గేట్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 17 నూతన గేట్ల నిర్మాణ పనులు పూర్తయినట్లు మండలి అధికార వర్గాలు తెలిపారు. మిగతా గేట్ల నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని, దశల వారీగా గేట్ల నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. -
కొప్పళ జాతరకు గవర్నర్కు ఆహ్వానం
రాయచూరు రూరల్: కొప్పళ గవి సిద్దేశ్వర స్వామి జాతరకు మేఘాలయ గవర్నర్ సీహెచ్ విజయ శంకర్కు ఆహ్వానం పలికారు. ఇటీవల కొప్పళ గవి సిద్దేశ్వర మఠాధిపతి అభినవ గవి సిద్దేశ్వర స్వామీజీ మేఘాలయలో రాష్ట్ర గవర్నర్ను ఆయన కార్యాలయంలో కలసి 2025 జనవరి 5న జరిగే కొప్పళ గవి సిద్దేశ్వర స్వామి మహారథోత్సవాన్ని ప్రారంభించడానికి రావాలని ఆహ్వానించారు. మేఘాలయ రాష్ట్ర గవర్నర్ సీ.హెచ్.విజయ శంకర్ కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా బిన్నాళకు చెందిన వారు కావడంతో స్వామీజీ రథోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. మానవతా విలువలు పెంచుకోవాలిరాయచూరు రూరల్: సమాజంలో ఉపాధ్యాయులు మానవతా విలువలను పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బడిగేర్ పిలుపునిచ్చారు. ప్రైవేట్ కళాశాలలో జిల్లా, తాలూకా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు బోధనతో పాటు బోధనేతర విషయాలు, సంస్కృ,తి సంప్రదాయాల గురించి వివరించాలన్నారు. ఉపాధ్యాయుల్లో ఉన్న కౌశల్యతను కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలు మరిచి సామరస్యంతో జీవించాలన్నారు. తాలూకా విద్యాశాఖ అధికారి ఈరణ్ణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, మొయిన్ ఉల్ హక్, మల్లేష్ నాయక్, యూనుస్ సాబ్, రామక్రిష్ణ, వీరేష్, రావుత్ రావ్, శివ కుమార్లున్నారు. బెళగావిని మూడు జిల్లాలుగా విభజించండిరాయచూరు రూరల్: 18 తాలూకాలతో కూడిన బెళగావి జిల్లాను మూడు భాగాలుగా విభజించాలని బెళగావి జిల్లా శాసన సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బెళగావి సువర్ణసౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వినతిపత్రం సమర్పించిన శాసన సభ్యుడు బాలచంద్ర జార్కిహోళి, ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. ప్రస్తుతం గోకాక్ లోక్సభ నియోజక వర్గంగా ఉందని, దానిని గోకాక్ జిల్లాగా, చిక్కోడి జిల్లాగా విభజించాలన్నారు. బెళగావి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించాలని స్వామీజీల నేతృత్వంలో కమిటీ తరఫున వినతిపత్రం అందించారు. వ్యవసాయ శాఖ కార్యాలయం బదిలీ తగదు రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సింధనూరుకు బదిలీ చేయడం తగదని లింగసూగూరు తాలూకా అభివృద్ధి పోరాట సమితి డిమాండ్ చేసింది. మంగళవారం తాలూకా వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో పదాధికారి రమేష్ మాట్లాడారు. తాలూకా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ఎలాంటి అనుమతి లేకుండా లింగసూగూరు నుంచి సింధనూరుకు తరలించడాన్ని తప్పు బట్టారు. నాటకరంగాన్ని పరిరక్షించాలికోలారు: నాటక రంగాన్ని పరిరక్షిస్తూ కళాకారులను ఆదరించాలని జిల్లా జాగృతి సమితి సభ్యుడు బెళమారనహళ్లి ఆనంద్ సూచించారు. నగరంలోని టీ చెన్నయ్య రంగమందిరంలో రాష్ట్ర స్థాయి కర్ణాటక నాటక అకాడమి అవార్డు గ్రహీత బ్యాడబెలె కె మురళి దర్శకత్వంలో సోమవారం రాత్రి నిర్వహించిన ముదుకన మదువె నాటకాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత మొబైల్, టీవీ, సినిమాలకు పరిమితమై నాటక, జానపదచ, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి కనపర్చడం లేదన్నారు.కళలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. కసాప మాజీ అధ్యక్షుడు నాగానంద కెంపరాజ్ మాట్లాడుతూ సంగీత, నాటక, జానపద తదితర కళల పరిరక్షణకు మురళి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కన్నడ సంస్కృతిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి, నాటక వ్యవస్థాపకుడు మురళి, మునిరాజు, రోటరీ అధ్యక్షుడు రామచంద్రప్ప, అంతరగంగ బుద్దిమాంద్య సంస్థ సంస్థాపకుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిభావాలు పెంచుకోవాలి
రాయచూరు రూరల్: మానవులు జీవితంలో భక్తిభావాలు పెంపొందించుకునేందుకు కృషి చేయాలని శ్రీశైల పీఠాధిపతి జగద్గురు ప్రసన్న చంద్రశేఖర శివాచార్య పిలుపు ఇచ్చారు. మంగళవారం సింధనూరు తాలూకా బంగారి క్యాంప్లో రౌడకుంద సిద్దాశ్రమలో ఆధ్యాత్మిక వేడుకలో ఆయన మాట్లాడారు. మానవుడు పని ఒత్తిళ్లతో ప్రతి నిత్యం ఎంతో మథనపడుతున్నాడన్నారు. రోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. దేశంలో ధర్మం, దేవాలయ రక్షణకు సమాజంలో భక్తులు చేస్తున్న సేవలు దోహదపడతాయన్నారు. సమావేశంలో స్వామీజీలు శాంత మల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, వీరసంగమేశ్వర స్వామీజీలున్నారు. -
అభివృద్ధి పనులను ప్రారంభించిన స్వామీజీ
కోలారు : తాలూకాలోని సూలూరు గ్రామ పంచాయతీ నుగ్గలాపుర నుంచి వీరభద్ర స్వామి ఆలయం వరకు రూ.80 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, దేవుడి జాతర జరిగే స్థలంలో ఫ్లాట్ నిర్మాణం పనులను నాగలాపుర మఠం తేజేశలింగశివమూర్తి స్వామీజీ మంగళవారం ప్రారంభించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ గత ఏడాది జాతర సందర్భంగా ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ ఇచ్చిన మాట ప్రకారం రూ. 80 లక్షల నిధులు విడుదల చేయించారన్నారు. సూలూరు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పెమ్మశెట్టిహళ్లి సురేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మైలాండహళ్లి మురళి, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రజలను మభ్య పెట్టడానికే టిప్పు జయంతి
హుబ్లీ: బెళగావి సువర్ణ సౌధ అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చకు మేం సిద్ధం అయితే మంత్రి కాశప్పకు రైతుల సమస్యలు పట్టడం లేదని, దీంతో ఆయన టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలను సాకుగా చూపుతూ వెనుకబడిన ఈ ప్రాంత ప్రజల చిత్తశుద్ధిని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే హెచ్ఆర్.విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఓ మతాంధుడు, మత మారణహోమానికి పాల్పడిన ఓ వ్యక్తి జయంతి ఆచరణకు ప్రభుత్వం నిలబడటం సిగ్గు చేటు అన్నారు. తీవ్ర సమస్యల గురించి మాట్లాడమని అంటే ఈ విషయాన్ని సాకుగా చెప్పి రైతన్న సమస్యలపై ఉదాసీనత చూపడం తగదన్నారు. బీజేపీ ఏనాటికీ మత సామరస్యానికి భంగం కలిగించదన్నారు. ఇలాంటి విషయాలలో చిచ్చు పెట్టేది కాంగ్రెస్ నేతలే అన్నారు. బెంగళూరులో మత్తు పదార్థాఽల విషయంపై మాట్లాడుతూ యథేచ్చగా సాగుతున్న వీటి విక్రయాలను అరికట్టడంలో సిద్దు సర్కారు పోలీస్ శాఖ వైఫల్యంపై ఆయన కఠిన పదజాలంతో దూషించారు. ఈ దేశ ప్రజలను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చితే ఈ దేశాన్ని పాడు చేసినట్లే అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పదార్థాలు ఆఫ్రికా, పాకిస్తాన్ నుంచి ఎక్కువగాను అందులోను జీపీఎస్ ద్వారా పంపిస్తున్నారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన హోం శాఖ అడ్డుకోవాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో వీటి విక్రయాలతో పాటు సైబర్ క్రైం నివారణకు సుమారు 3 లక్షల మంది కళాశాల విద్యార్థులకు చైతన్య కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు. -
యూటర్న్లో వరుస యాక్సిడెంట్లు
భాగ్యనగర్, (బాగేపల్లి): మలుపులో ఆగి ఉన్న ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొట్టగా ఆటోలో నుంచి వృద్ధుడు కిందపడిపోయాడు, అతని మీద నుంచి ఏపీఎస్ ఆర్టీసీ దూసుకెళ్లడంతో దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదాల్లో మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాగేపల్లి పట్టణ శివార్లలోని జాతీయ రహదారి–44 లో సాయిబాబా ఆలయం మలుపు వద్ద మంగళవారం ఈ సంఘటన జరిగింది. పొరుగున హిందూపురం తాలూకా లేపాక్షి మండలం చిలువెందుల వాసి ఆదిమూర్తి (80) మృతుడు. ఎలా జరిగింది బాగేపల్లి తాలూకాలోని సుంకులమ్మ దేవి ఆలయానికి కొందరు ఆటోలో వచ్చారు. హైవేలో మలుపు వద్ద యూ టర్న్ తీసుకోవడానికి ఆటోని ఆపారు. ఈ సందర్భంలో బైకిస్టును తప్పించే యత్నంలో ఓ లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొనింది. ఈ ధాటికి ఆటోలో నుంచి ఆదిమూర్తి పడిపోవడం, అతని మీద నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెళ్లిపోవడం క్షణాల్లో జరిగాయి. ఆటోలో ఉన్న మిగిలిన ప్రయాణికులకు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిని బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి చిక్కబళ్లాపుర జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసు అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఎస్పీకుశాల్ చౌక్సే మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు. ఈ నెల 12 నుంచి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని తెలిపారు. లారీ, బస్సు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగి ఉన్న ఆటోను లారీ ఢీ.. కిందపడిన వృద్ధునిపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు ఒకరు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు బాగేపల్లి వద్ద దుర్ఘటన -
బస్సు బోల్తా పడి కండక్టర్ దుర్మరణం
●35 మంది ప్రయాణికులకు గాయాలు ●రాయచూరు జిల్లా దేవదుర్గలో ఘటన రాయచూరు రూరల్: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడ్డ ఘటనలో కండక్టర్ దుర్మరణం చెందగా 35 మంది ప్రయాణికులకు గాయాలైన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం దేవదుర్గ తాలూకా అంజళ నుంచి దేవదుర్గకు వాపస్ వస్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ తప్పడంతో అంచెసూగూరు వద్ద కాలువ గట్టు వద్ద బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన కండక్టర్ బసవరాజ్(35) రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 40 మందిలో 38 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో దేవదుర్గ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. సమీపంలోని పొలంలో పనులు చేసుకుంటున్న రైతులు ఘటన స్థలానికి చేరుకొని కిటికీ అద్దాలను పగులగొట్టి క్షతగాత్రులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. దేవదుర్గ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల విలీనం వద్దు రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కన్నడ ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేసి కర్ణాటక పబ్లిక్ పాఠశాల(కేపీఎస్)ల్లోకి విలీనం చేయడానికి ముందుకొచ్చిన సర్కార్ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయబోమని ఆదేశాలు జారీ చేయాలని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. మంగళవారం రాయచూరు తాలూకా అన్వరిలో చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నందగోపాల్ మాట్లాడారు. సోమవారం బెళగావి విధానసభలో శాసన సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప మాట్లాడారు. రాష్ట్రంలో కన్నడ భాష ప్రాథమిక పాఠశాలను మూసేయడం లేదని చెప్పిన సమాధానానికి లిఖిత రూపంలో ఆదేశాలు జారీ చేయాలన్నారు. కేంద్ర మంత్రిని నిందించడం తగదురాయచూరు రూరల్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏకవచనంతో నిందించడం తగదని రాయచూరు జిల్లా మహిళా బీజేపీ అధ్యక్షురాలు, నగరసభ మాజీ అధ్యక్షురాలు లలిత కడుగోలు మంగళవారం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. సీఎంకు భారతీయ సంప్రదాయం, మహిళలపై గౌరవం లేదన్నారు. -
అప్పుల బాధకు మరో రైతు బలి
బళ్లారిఅర్బన్: అప్పుల బాధకు మరో రైతు బలైన ఘటన జిల్లాలోని కురుగోడు తాలూకా సోమసముద్రం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కోమారి(35) ఆత్మహత్య చేసుకున్న రైతు. కాగా ఈ యువ రైతన్నకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. సాగు పనుల కోసం సహకార రైత బ్యాంక్, ఇతర వ్యాపార వర్గాల నుంచి చేసిన అప్పులు తీర్చలేక పోయారు. పొలానికి పెట్టుబడి పెట్టి పండించిన పంటంతా నేలపాలైంది. దీంతో మనోవేదనకు గురై కోమారి పంటలకు కొట్టే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కురుగోడు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 13న విద్యుత్ ఉద్యోగుల సమ్మేళనంబళ్లారి రూరల్ : దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 13న కోల్కతాలో అఖిల భారత విద్యుత్ ఉద్యోగుల సమ్మేళనం జరుగనున్నట్లు ఏఐపీఎఫ్ అఖిల భారత అధ్యక్షుడు కే.సోమశేఖర్ తెలిపారు. సోమవారం పత్రికా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులపై దాడులు పెరగడం, ప్రైవేటీకరణ నేపథ్యంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా సమ్మేళనం జరుగుతోందన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్స్ ఉద్యోగులను పర్మనెంట్ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పాత పింఛను పద్ధతిలో కనీసం రూ.10 వేల పింఛను ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఈ దిశగా కోల్కతాలో జరుగనున్న సమ్మేళనానికి కర్ణాటక రాష్ట్రం నుంచి విద్యుత్ ఉద్యోగులు తరలి వెళ్లనున్నట్లు తెలిపారు. ఏఐపీఎఫ్ ప్రముఖుడు డాక్టర్ ప్రమోద్, ఏఐయూటీసీ జిల్లాధ్యక్షుడు కామ్రేడ్ ఏ.దేవదాస్, ప్రముఖులు సురేశ్, జి.కిరణ్కుమార్ పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లకు శిక్షణబళ్లారి రూరల్ : జిందాల్ ఓపీజే సెంటర్లోని తమన్నా దివ్యాంగుల పాఠశాలలో సోమవారం అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు శిక్షణ శిబిరం జరిగింది. కార్యక్రమాన్ని జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ దక్షిణ వలయ ప్రముఖుడు పెద్దన్న జ్యోతి వెలిగించి ప్రారంభించారు. దివ్యాంగ బాలలను ప్రారంభ దశలో ఎలా గుర్తించాలి? అనే విషయంపై అంగన్వాడీ టీచర్లకు, కార్యకర్తలకు తమన్నా పాఠశాల సిబ్బంది నాటకాల ద్వారా అవగాహన కల్గించారు. సండూరు, కృష్ణానగర్, తారానగర్, నాగలాపుర, బనహట్టి, తాళూరు, జోగ, బసాపుర, ఒడ్డు, కురేకుప్ప, దరోజీ, భుజంగనగర్, తోరణగల్లుకు చెందిన 130 మంది అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, తమన్నా పాఠశాల ప్రధానోపాధ్యాయిని సవిత, అంగన్వాడీ అధికారి చైతన్య పాల్గొన్నారు. అంబేడ్కర్కు ఘనంగా నివాళిరాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరులో అంబేడ్కర్ ప్రతిమ వద్ద అంజుం ఏ ముస్లిం నేతలు కొవ్వొత్తులతో ఘనంగా నివాళి అర్పించారు. ఆదివారం రాత్రి భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 68వ పరినిర్వాణ దినోత్సవంలో భాగంగా అంబేడ్కర్ ప్రతిమకు పూలమాల వేశారు. కమిటీ అధ్యక్షుడు హుసేన్ బాషా మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, బాధ్యతల గురించి ప్రజలకు ప్రచారం చేస్తామన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రామాణికంగా పని చేస్తామన్నారు. అన్సరుద్దీన్, ముస్తాఫా, అమీన్, ఖయ్యూం, హసన్, అబ్దుల్, సలీం, ఆరీఫ్లున్నారు. జీపీ సభ్యుడిపై కుక్కల దాడి హుబ్లీ: గ్రామ పంచాయతీ(జీపీ) సభ్యుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన జరిగింది. ఫలితంగా ఆయన రెండు వేళ్లు తెగిపోయాయి. విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా ఉచ్చంగిదుర్గ వద్ద హాలమ్మన తోపులో కుక్కలు గ్రామ పంచాయతీ సభ్యుడు మంజునాథ్పై తీవ్రంగా దాడి చేశాయి. ఆయన వాకింగ్కు వెళ్లిన వేళ ఈ దారుణ దురంతం చోటు చేసుకుంది. రెండు వేళ్లు కట్ అయిన స్థితిలో ఆయన్ను దావణగెరె జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. -
మైసూరులో వైద్యుని డిజిటల్ అరెస్టు
మైసూరు: ప్యాలెస్ సిటీ మైసూరులో తరచూ సైబర్ నేరగాళ్ల చేతిలో జనం మోసపోతూనే ఉన్నారు. తాజాగా ముంబై పోలీస్ అధికారి పేరుతో ఒక మోసగాడు మైసూరులోని ఒక వైద్యున్ని డిజిటల్ అరెస్టు చేసి రూ.82.10 లక్షలు వసూలు చేశాడు. మైసూరు విజయనగర నివాసి అయిన రాజీవ్ బాధితుడు. ఎలా జరిగిందంటే.. వివరాలు.. రాజీవ్కు కాల్ చేసిన వ్యక్తి తాను టెలికాం సంస్థ అధికారినని, మీ పేరుతో ఉన్న సిమ్ ద్వారా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగాయని, మనీలాండరింగ్ కోసం ఉపయోగించారని, అశ్లీల వీడియోలు రవాణా చేశారని పలు ఆరోపణలు చేశాడు. మీ ఖాతా నుంచి అక్రమంగా రూ. 2 కోట్లు బదిలీ చేయబడ్డాయి అని బెదిరించాడు. తరువాత మరో వ్యక్తి వాట్సాప్లో వీడియో కాల్ చేసి తాను ముంబై బాంద్రా ఠాణా పోలీసు అధికారినని చెప్పాడు. మోసగాడు, మిగతావారు పోలీసు దుస్తుల్లో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో మిమ్మల్ని, మీ భార్యను అరెస్టు చేస్తామని భయపెట్టారు. మీ ఆస్తుల వివరాలను చెప్పాలని, బ్యాంక్ ఖాతాల వివరాలను ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అలా వైద్యుని నుంచి రూ 82.10 లక్షలు బదిలీ చేయించుకుని ఫోన్లు స్విచాఫ్ చేశారు. బాధితుడు సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అక్రమాలకు పాల్పడ్డారంటూ రూ.82 లక్షల వసూలు -
రోడ్లలో గుంతలు పూడ్చండి
రాయచూరు రూరల్: జిల్లాలో గుంతలు పడ్డ రహదారి పనులను చేపట్టి సత్వరం గుంతలను పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని జిల్లాధికారి నితీష్ అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. గ్రామీణ, నగర ప్రాంతాల్లో రహదారుల్లోని గుంతలను పూడ్చాడాలన్నారు. ప్రజా పనుల శాఖ, పంచాయత్రాజ్, ఆర్అండ్బీ, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభల పరిధిలో పడ్డ గుంతలను మూసి వేయాలన్నారు. గుంతలు పడ్డ ప్రాంతాల్లో పలువురు గాయపడ్డారని గుర్తు చేశారు. రహదారి పక్కనే ఉన్న అంగళ్లు, దుకాణాలను తొలగించాలని సూచించారు. ద్వి చక్రవాహనంలో సంచరించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. సమావేశంలో ఇంజినీర్ వెంకటేష్, ఆర్టీఓ, పోలీస్, ఇతర శాఖల అధికారులున్నారు. -
తెరపైకి ఉ–క ప్రత్యేక రాష్ట్ర చిచ్చు
రాయచూరు రూరల్ : అఖండ కర్ణాటకను విభజించడంతో పాటు ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం తెరపైకి రానుంది. సోమవారం నుంచి బెళగావిలో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై గళం విప్పడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గతనెల 4న ఎమ్మెల్యే లేఖ రాసిన విషయం ప్రస్తావించడానికి ప్రజా ప్రతినిధులు సిద్ధమయ్యారు. ఉత్తర, కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, కలబుర్గి, కొప్పళ, బళ్లారి, విజయనగర, బీదర్, రాయచూరు, బాగల్కోటె, బెళగావి, ధార్వాడ, గదగ్, ఉత్తర కన్నడ, హావేరి, దావణగెరె జిల్లాల సమగ్ర అభివృద్ధిలో నిర్లక్ష్యం జరుగుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నెల రోజుల క్రితం కాగవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరమగౌడ లేఖ రాశారు. ప్రజల నుంచి ఎన్నికై న ప్రజా ప్రతినిధి ప్రజల సమస్యలపై ప్రస్తావించినా పనులు కావడం లేదని తమను ఎన్నుకున్న ప్రజలు నిలదీస్తున్న అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. దేశంలో ప్రత్యేక తెలంగాణ ఉద్భవించిన నేపథ్యంలో ఇప్పుడు ఉత్తర కళ్యాణ కర్ణాటక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర కర్ణాటకపై సవతి ప్రేమ దక్షిణ కర్ణాటక ప్రాంతాలపై ప్రభుత్వం ప్రేమ ఒలకబోస్తూ ఉత్తర కర్ణాటకపై సవతి తల్లి ప్రేమను ఒలక బోస్తోందని ఉత్తర, కర్ణాటక పోరాట సమితి, ఉత్తర కర్ణాటక వికాస్ వేదిక సంచాలకుడు భరమగౌడ లేఖ రాసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉత్తర, కళ్యాణ కర్ణాటకలో 15 జిల్లాల సమగ్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు. గతంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి ఉమేష్ కత్తి ఆందోళన జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. జనాభా పెరిగే కొద్దీ రాష్ట్రాలను విభజించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కర్ణాటకలో రెండు, ఉత్తర్ ప్రదేశ్లో ఐదు, మహారాష్ట్రలో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. దేశంలో కొత్తగా 50 రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్రం ముందడుగు వేయాల్సి ఉంది. బెళగావిలో జరుగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చ జరగకపోతే బెళగావి సువర్ణసౌధపై ప్రత్యేక రాష్ట్ర జెండాను ఎగురవేస్తామని ఎమ్మెల్యే భరమగౌడ వెల్లడించారు. బుధవారం నుంచి ఉత్తర, కళ్యాణ కర్ణాటకపై విధాన పరిషత్లో చర్చలు జరగడానికి అవకాశం కల్పిస్తున్నట్లు విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి వెల్లడించారు. సోమవారం బెళగావి సువర్ణసౌధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నుంచి బెళగావి సమావేశాల్లో చర్చకు చాన్స్ కర్ణాటకలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాసిన ఎమ్మెల్యే రాజుకాగె -
గోవధ నిషేధ చట్టం రద్దు తగదు
సాక్షి, బళ్లారి: ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసి పశువులను, గోవులను యథేచ్ఛగా వధించేందుకు అనుమతి ఇస్తున్న నేపథ్యంలో ఇది ఎంత మాత్రం సరైన చర్య కాదని విశ్వహిందూ పరిషత్, బీజేపీ, పలువురు స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని నారాయణరావ్ పార్కు నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి జిల్లాధికారి కార్యాలయం ద్వారా గవర్నర్కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం పంపించారు. గోవుల్లో సకల దేవతలు కొలువుదీరి ఉంటారని పురాణాలు, ఇతిహాసాలు ఘోషిస్తున్న నేపథ్యంలో కర్ణాటకలో 2020వ సంవత్సరంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు. పాలనలో ఈ సర్కారు విఫలం మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పాలనలో ఘోరంగా విఫలం అయ్యారని ఆరోపించారు. చివరికి గోవుల రక్షణకు చేసిన చట్టాన్ని కూడా రద్దు చేయాలని తలచడం హేయం అన్నారు. బెళగావిలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిర్ణయాన్ని ప్రతిపాదించి అమలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయంతో హిందూ సమాజానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే అక్రమంగా గోవులను తరలించి వధిస్తున్నారన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తే మరింతగా గోవధ జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచన చేయకుంటే భారీ ఆందోళన తప్పదన్నారు. కమ్మరచేడు కళ్యాణ స్వామీజీ, నాయకులు రామలింగప్ప, వెంకటరమణ, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు. గోవధ నిషేధ చట్టంలో మార్పులు చేయొద్దు రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోవధ నిషేధ చట్టంలో మార్పులు చేయడం తగదని హిందూ జన జాగరణ వేదిక డిమాండ్ చేసింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళనకారులనుద్దేశించి కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య మాట్లాడారు. గతంలో బీజేపీ సర్కార్ అమలు పరిచిన గోవధ నిషేధ చట్టాన్ని రద్దు చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గో సంరక్షణ చట్టంలో ఎలాంటి మార్పులు, చేర్పులకు పూనుకోరాదని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగరాజ్ భాల్కి, మునిరెడ్డి, విజయ కుమార్, బాళప్ప, శరణు తదితరులున్నారు. 2020 నాటి చట్టాన్ని కొనసాగించాలి విశ్వహిందూ పరిషత్ నేతల డిమాండ్ -
విపరీతంగా సిజేరియన్ కాన్పులు
బనశంకరి: ఇటీవల కన్నుమూసిన వృక్షమాత సాలుమరద తిమ్మక్క పేరుతో వచ్చే ఏడాది నుంచి పర్యావరణ పురస్కారం అందిస్తామని, సాహితీవేత్త ఎస్ఎల్.బైరప్ప గౌరవార్థం మైసూరులో స్మారకం నిర్మిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య బెళగావి సువర్ణసౌధలో ప్రకటించారు. సోమవారం నుంచి సువర్ణసౌధలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇటీవలి కాలంలో దివంగతులైన ప్రజాప్రతినిధులు, మాజీలు, ప్రముఖులకు సంతాపం ప్రకటించారు. సిద్దరామయ్య మాట్లాడుతూ ఇటీవల మరణించిన ఎమ్మెల్యే హెచ్వై మేటి తనకు అన్నివేళలా మంచి మిత్రుడని తెలిపారు. సాహితీవేత్త ఎస్ఎల్.బైరప్పతో తనకు సైద్ధాంతికపరమైన విభేదాలున్నా, ఆయన ప్రజాదరణపొందిన సాహితీవేత్త అన్నారు. బైరప్ప నిరాడంబరుడు, ఉత్తమ రచనలు చేశారని కొనియాడారు. వృక్షమాత సాలుమరద తిమ్మక్క పేరుతో బేలూరులో మ్యూజియం ఏర్పాటు చేస్తామని, వచ్చే ఏడాది నుంచి తిమ్మక్క పురస్కారం అందిస్తామని తెలిపారు. బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ మాట్లాడుతూ సాలుమరద తిమ్మక్క మన మధ్య లేకపోయినా, ఆమె పోషించిన వృక్షాలు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. సాహితీవేత్త ఎస్ఎల్.బైరప్ప కట్టె విరిచినట్లు సూటిగా మాట్లాడే వ్యక్తి, ఆయన సాహిత్యం సృజనశీలతకు పేరుపొందిందన్నారు. సమాజ ఆత్మ విమర్శకు స్ఫూర్తిగా ఉన్నారని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దివంగత ప్రముఖులతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. పరీక్షల ఫీజు తక్కువే: మంత్రి దొడ్డబళ్లాపురం: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి కేపీఎస్సీ ఆధ్వర్యంలో జరుపుతున్న పోటీ పరీక్షల రుసుము పక్క రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ అని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ అన్నారు. పరీక్షల రుసుమును తగ్గించాలని విధాన పరిషత్లో ఎమ్మెల్సీ నిరాణి హనుమంత్ రుద్రప్ప డిమాండు చేశారు. ఇందుకు మంత్రి సమాధానమిచ్చారు. తమిళనాడులో రూ.1000, ఆంధ్రప్రదేశ్లో రూ.1500 పరీక్షల రుసుము ఉంటే, మనరాష్ట్రంలో రూ.750 మాత్రమే వసూలు చేస్తున్నామన్నారు. విచ్చలవిడిగా రేషన్ బియ్యం మాఫియా● బీజేపీ ఎమ్మెల్సీ రవి దొడ్డబళ్లాపురం: వచ్చే జనవరి నుంచి రాష్ట్రంలో ఇందిరా రేషన్ కిట్లను పంపిణీ చేస్తామని మంత్రి కేహెచ్ మునియప్ప తెలిపారు. పరిషత్లో బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి మాట్లాడుతూ బీపీఎల్ రేషన్ బియ్యం పక్క రాష్ట్రాలకు, విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని, రాష్ట్రమంతటా ఈ దందా నడుస్తోందని ఆరోపించారు. దుబాయ్,సింగపూర్లలో ఇదే బియ్యాన్ని పాలిష్ చేసి విక్రయిస్తున్నారని, ఈ అక్రమాలకు అధికారులు కొమ్ముకాస్తున్నారని, సర్కారు బియ్యం లబ్ధిదారులకు అందడం లేదని విమర్శించారు. సిట్ను ఏర్పాటు చేసి విచారించాలని కోరారు. ఇందుకు సమాధానమిస్తూ మాట్లాడిన మంత్రి మునియప్ప రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టి కేసులు నమోదు చేశామన్నారు. ఈ సంవత్సరంలోనే 485 కేసులు నమోదు చేశామన్నారు. దాడుల్లో 29,603 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. జనవరి నుంచి 5 కేజీల బియ్యం బదులు ఇందిరా కిట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందిరా కిట్ ద్వారా అక్రమ బియ్యం రవాణా అరికట్టవచ్చని, సిట్ అవసరం లేదన్నారు.నాటుకోడి హాస్యరసం● సీఎం సిద్దు, అశోక్ మాటామంతీ శివాజీనగర: సీఎం సిద్దరామయ్య, బీజేపీ నేత ఆర్.అశోక్ మధ్య సువర్ణసౌధ లాంజ్లో నాటుకోడి విందు గురించి హాస్య చర్చలు జరిగాయి. అశోక్ను చూడగానే సీఎం పలకరించారు. ఏమయ్యా బాగున్నారా అశోక్? అని ప్రశ్నించారు. అందుకు అశోక్, లేదు సార్, మీలాగా నాటుకోడి తినటం లేదు, విడిచిపెట్టాను అని చెప్పారు. తిను ఏమీ కాదు. రా తిందామని సీఎం నవ్వుతో చమత్కారంగా మాట్లాడారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నాటుకోడి విందు జరపడం తెలిసిందే. అవిశ్వాసం పెడతారా? అంతకు ముందుగా స్పీకర్ గదితో సీఎం సిద్దరామయ్య, ఆర్.అశోక్, బీజేపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం ఏమైనా ప్రవేశపెడతారా అని సీఎం నవ్వుతూనే అడిగితే, జవాబు దాటవేశారు. ప్రజల సమస్యలు పట్టవా: విజయేంద్ర బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర మాట్లాడుతూ, కుర్చీని కాపాడుకునేందుకు సిద్దరామయ్య, కుర్చీ కోసం డీకే శివకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షంవారు ఏ ప్రశ్నలు అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం వైపు వేలెత్తి చూపుతున్నారు. అన్నింటినీ కేంద్రమే చేస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు? అని ప్రశ్నించారు.యశవంతపుర: ఒక్క విద్యార్థి ఉన్నా, ఆ పాఠశాలను కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. విధానపరిషత్లో సభ్యుడు చిదానంద గౌడ, ఉమాశ్రీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ఆ బడులను మూసివేస్తుందా, విద్యార్థులను వేరే పాఠశాలకు బదిలీ చేస్తుందా అని ప్రశ్నించారు. దీనికి మంత్రి పై విధంగా స్పందించారు. ఎక్కడా పాఠశాలలను మూయలేదు. కావాలంటే కొత్త పాఠశాలలను తెరవడానికి ప్రభుత్వం సిద్ధమని అన్నారు. కేబుల్ ఫీజులు పెంచేశారు రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో పరిష్కారిస్తామని ఇంధనశాఖ మంత్రి కేజీ జార్జ్ తెలిపారు. రాష్ట్రంలో 2,880 మంది కేబుల్ ఆపరేటర్లున్నారు. గతంలో కేబుళ్లను కరెంట్ స్తంభానికి కడితే మున్సిపాలిటీ అధికారులు రూ.40 చొప్పున ఫీజు వసూలు చేసేవారు, ఇప్పుడు రూ.150 కి పెంచారని కొందరు సభ్యులు తెలిపారు. ఫీజును 50 శాతం తగ్గిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జింకలకు అంటురోగం బెళగావి కిత్తూరు చెన్నమ్మ జూ లో 30 కృష్ణ జింకల మరణానికి అంటువ్యాధి కారణమని అటవీ మంత్రి ఈశ్వరఖండ్రె తెలిపారు. జింకలకు హెమరాజిక్ సెప్టిసెమియా అనే జబ్బు సోకి చనిపోయాయి, జూ సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదు అని చెప్పారు.పాఠశాలలను మూసివేయం సీఎం సిద్దరామయ్య ప్రకటన బెళగావిలో అసెంబ్లీ సమావేశాలు షురూ గతించిన ప్రముఖులకు ఘన నివాళులు హాజరు అంతంతే ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చించడానికి ఈ సమావేశాలు సువర్ణావకాశమని భావిస్తే, ఎమ్మెల్యేలు ఎవరూ కన్నెత్తి చూడలేదు. విధానసభలో హాజరు నాసిరకంగా ఉంది. 30 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లు కనిపించలేదు. ఎక్కడ చూసినా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వేళ్లమీద లెక్కబెట్టగలిగినంత మంది సభ్యులు మాత్రమే వచ్చారు. వారిలోనూ మంత్రులే ఎక్కువగా ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ శాసనసభ్యుల సంఖ్య కూడా తక్కువే కనిపించింది. -
ప్రభుత్వంతో విపక్షం తాడోపేడో
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ మంగళవారం బెళగావి సువర్ణ విధానసౌధ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనుంది. కష్టాల్లో ఉన్న చెరకు, మొక్కజొన్న పండించిన రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదు. అతివృష్టితో పంట నష్టం జరిగింది. పంట నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అందించలేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించిన బీజేపీ మంగళవారం బెళగావిలో మాలిని మైదానంలో రైతులతో భారీ సమావేశం నిర్వహించి, ఆ తరువాత సువర్ణసౌధను ముట్టడించనుంది. మంగళవారం రైతుల సమావేశం, సువర్ణ విధానసౌధ ముట్టడి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, ప్రతిపక్ష నాయకులు ఆర్.అశోక్, ఛలవాది నారాయణస్వామి నేతృత్వంలో జరుగనుంది. బీజేపీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు, రైతులు పాల్గొననున్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్–విజయేంద్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగం, నీటిపారుదల, చేనేతకారుల, రైతుల సమస్యలతో పాటు వేటినీ నెరవేర్చలేదు. అంతేకాకుండా ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయటంలోనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిమగ్నమయ్యారని విజయేంద్ర విమర్శించారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని అనే విషయాన్ని మరిచిపోయారు. వీటన్నిటిని ఖండిస్తూ మంగళవారం సువర్ణ విధానసౌధ ముట్టడించటం ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని సువర్ణ విధానసౌధ వద్ద విలేకరులకు తెలియజేశారు. ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చకు పెద్దపీట విధాన పరిషత్ కార్యకలాపాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలు, విషయాలపై చర్చకు పెద్దపీట వేస్తామని పరిషత్ సభాపతి బసవరాజ్ హొరట్టి తెలిపారు. సోమవారం బెళగావిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిషత్ సమావేశాల్లో గత సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలు, విషయాలపై ఎక్కువగా చర్చ జరగలేదు. అయితే ఈసారి సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలు, విషయాలపై చర్చకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. దక్షిణ కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు, ఉత్తర కర్ణాటక ప్రజల సమస్యలపై చర్చించేందుకు అవకాశం కల్పిస్తాం. ప్రతిరోజు ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత ఉత్తర కర్ణాటక సమస్యల గురించి చర్చిస్తామన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలపై ఉత్తర కర్ణాటక ఎమ్మెల్యేలు మాట్లాడలేదు. ఫోన్ చేసి అందరు ఎమ్మెల్యేలకు కూడా చెబుతున్నానన్నారు. సమావేశాల్లో పాల్గొనాలని ఇప్పటికే 38 మందితో మాట్లాడాను. మిగతావారితో కూడా మాట్లాడుతున్నాను. అందరూ కూడా సమావేశాల్లో పాల్గొని సభా గౌరవాన్ని కాపాడాలని హొరట్టి విన్నవించారు. పరిహారం చెల్లింపునకు సిద్ధం పరిహారం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం బాధ్యతా ఉంది కదా? ఇప్పటి వరకు కూడా బొమ్మై ఎందుకు పార్లమెంట్లో ఈ విషయం గురించి మాట్లాడలేదు? ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి ఎందుకు చర్చించలేదు? అని ప్రశ్నించారు. నీటిపారుదల సమస్య, పథకాలు అమలు కాకపోవటం గురించి అడిగినపుడు తమ హయాంలో నీటిపారుదల రంగానికి చేసినంత చరిత్రలో ఎవ్వరూ చేయలేదని చెబుతున్నారు. అయితే తాను కోరేది ఒక్కటే రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై బొమ్మై మాట్లాడాలి అని అన్నారు. సర్కారు రైతు వ్యతిరేక విధానంపై నిరసన నేడు సువర్ణ విధానసౌధ ముట్టడికి బీజేపీ సన్నద్ధం నియమావళి ప్రకారం నడుచుకుంటా: హొరట్టి సభాపతి స్థానం నుంచి తనను తొలగించే విషయంపై ఆయన మాట్లాడుతూ తాను గతంలో పరిషత్ సభాపతిని అయ్యాను. ఎన్ని సంవత్సరాలైనా కూడా మాజీ కానే కావాలి. విధాన పరిషత్ సభాపతి స్థానం గురించి తాను అంతగా విచారానికి గురికాను. ప్రభుత్వం, ఎమ్మెల్యేలు తీసుకునే తీర్మానానికి తాను కట్టుబడి ఉన్నానన్నారు. సభలో తనపై అవిశ్వాస నిర్ణయం ప్రవేశపెట్టే సమయం వస్తే నియమాల ప్రకారం నడచుకొంటానన్నారు. విధాన పరిషత్లో ఖాళీ ఉద్యోగాల నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరుగలేదు. 30 ఉద్యోగాలకు కర్ణాటక పరీక్ష ప్రాధికార (కేఈఏ) పరీక్ష జరిపి అధిక మార్కులు పొందినవారి జాబితా ఇచ్చింది. దానిని పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఉ–క సమస్యలకు కేంద్రమే బదులివ్వాలి– డీకే శివకుమార్ ఉత్తర కర్ణాటక సమస్యలకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. చెరకు, మొక్కజొన్న రైతుల విషయమై తాను, సీఎం సిద్దరామయ్యతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణమైన తీర్మానాన్ని తీసుకున్నట్లు డీసీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. సదాశివనగర నివాసం వద్ద మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ చెరకు, మొక్కజొన్న రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు నోరు మెదపలేదన్నారు. బీజేపీకి చెందిన ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యల గురించీ నోరు విప్పటం లేదన్నారు. బసవరాజ్ బొమ్మై రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెబుతున్నారు. అలాగైతే కేంద్ర ప్రభుత్వం వాటా ఏమిటి? దీనిని తీర్మానం చేసేవారు ఎవరు? ప్రతి ఒక్కదానికి ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. అయినా కూడా ఈ విషయంలో తీర్మానం చేయటం లేదు. -
జాతీయ కరాటే పోటీల్లో సత్తా
కేజీఎఫ్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో నిర్వహించిన జాతీయ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో నగరానికి చెందిన ఒకినావా కరాటే విద్యా సంస్థ విద్యార్థులు వరుసగా మూడో సారి చాంపియన్లుగా నిలిచారు. సోమవారం చాంపియన్లుగా తిరిగి వచ్చిన సంస్థ విద్యార్థులను అభినందించి కరాటే మాస్టర్ ఉలగనాథన్ మాట్లాడారు. తమ సంస్థ వరుసగా మూడోసారి కరాటే చాంపియన్షిప్ సాధించడం హర్షణీయమన్నారు. విద్యార్థుల సాధనను తాను అభినందిస్తున్నానన్నారు. ఆత్మరక్షణలో కరాటే ఒక భాగం అని, తల్లిదండ్రులు కరాటేను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. తమ పిల్లలకు కరాటే నేర్పించాలన్నారు. తమను తాము రక్షించుకోవడానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరూ కరాటే తప్పకుండా నేర్చుకోవాలన్నారు. ప్రతి నిత్యం ఒక గంట పాటు కరాటే అభ్యాసం చేయడం ద్వారా ఎంతో ఉపయోగం ఉందన్నారు. కరాటే ద్వారా శారీరక దారుఢ్యం కలిగి ఆరోగ్యం సుస్థితిలో ఉంటుందన్నారు. కరాటే నేర్చుకున్న విద్యార్థులు చదువులో ముందంజలో ఉండడాన్ని చూస్తున్నామన్నారు. తమ విద్యార్థులు చాంపియన్న్లుగా తిరిగి రావడం కేజీఎఫ్ నగరానికి గర్వకారణమన్నారు. -
చెరువులోకి కారు జంప్
శివమొగ్గ: జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం రిప్పన్పేట సమీపంలో మారుతి ఆల్టో కారు తావరెకెరె చెరువులోకి దూసుకెళ్లింది. హాసన్ జిల్లా నుంచి కొల్లూరు మూకాంబిక దేవాలయానికి వెళ్తున్న కుటుంబం ఈ ప్రమాదంలో చిక్కుకుంది. కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు చూసి వెంటనే చెరువులోకి దిగి ప్రయాణికులను రక్షించారు. రిప్పన్పేట పోలీసులు, ఫైర్ సిబ్బంది కారును నుంచి బయటకు తీశారు. కనువిందుగా తెప్పోత్సవం తుమకూరు: శిరా తాలూకాలోని మదలూరు చెరువుకు ఎమ్మెల్యే టి.బి. జయచంద్ర వాయనం సమర్పించారు, ఆపై నేత్రపర్వంగా చెరువులో తెప్పోత్సవం నిర్వహించారు. శిరా తాలూకాకు పెద్ద కంపెనీలు వస్తున్నాయి, వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. మదలూరు చెరువు కళకళలాడడానికి దివంగత ముఖ్యమంత్రి దేవరాజ్ అరసు ప్రధాన కారణమని, ఆయన పుణ్యం వల్లనే తుమకూరుకు హేమావతి నీరు లభిస్తోందని చెప్పారు. వలలో చిక్కి చిరుత మృతి శివమొగ్గ: శిరాలకొప్పలోని అడవికి అంచున జంతువులను పట్టుకోవడానికి వేటగాళ్లు ఏర్పాటు చేసిన వలలో చిక్కుకుని చిరుతపులి చనిపోయింది. చిరుత కళేబరం కుళ్ళిపోయి ఉంది, స్థానికులు చూసి వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. అటవీ అధికారి జావేద్, సిబ్బంది చేరుకుని చిరుత కళేబరాన్ని తరలించారు. ప్రియుని మోసానికి బలి దొడ్డబళ్లాపురం: ప్రేమ పేరుతో మోసపోయిన యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామనగర తాలూకా విభూతికెరె గ్రామంలో జరిగింది. వర్షిణి (22) మృతురాలు. ఈమె, అభి అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ మోసం చేశాడని డెత్నోట్లో రాసింది. రెండేళ్లు ప్రేమించినట్టు నటించి శారీరకంగా వాడుకుని గర్భవతిని చేశాడు. తరువాత బలవంతంగా అబార్షన్ చేయించాడు. నా నుంచి డబ్బు, బంగారం తీసుకుని బ్లాక్మెయిల్ కూడా చేశాడు. మోసపోయాననే బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు డెత్నోట్లో తెలిపింది. అభిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. రామనగర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫొటోషూట్ విషాదమయం ● టిప్పర్ ఢీకొని కాబోయే దంపతుల మృతి సాక్షి, బళ్లారి: కాబోయే వధూవరులపై విధి కన్నెర్రజేసింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. కొప్పళ తాలూకా గంగావతి సమీపంలో కొత్త జంట వెళ్తున్న బైక్ను లారీ ఢీకొంది. కొప్పళ తాలూకా హనుమనహట్టి కి చెందిన కరియప్ప మడివాళ (26), కారటిగి తాలూకావాసి కవిత మడివాళ (19) ఇద్దరూ దుర్మరణం చెందారు. ఇటీవల వీరి నిశ్చితార్థం ఘనంగా సాగింది. 21వ తేదీన పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త జంట గంగావతి, హంపీ పరిసరాల్లో పెళ్లి కి ముందు ఫోటో వేడుక చేసుకుని బయల్దేరారు. బెనకల్– గాళెమ్మన గుడి క్రాస్ సమీపంలో వేగంగా వస్తున్న టిప్పర్ బైక్ని ఢీకొని మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఫొటోషూట్లో తీసుకున్న చిత్రాలే జ్ఞాపకాలుగా మిగిలాయి. -
అడవుల్లో రిసార్టులు, సఫారీలను మూసేయాలి
మైసూరు: మైసూరు జిల్లా సహా పరిసర ప్రాంతాల్లోని నాగరహోళె, బండీపుర అడవుల్లో ఉన్న రిసార్ట్లు, హోమ్ స్టేలను వెంటనే ఖాళీ చేయాలి. సఫారీని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ప్రారంభించకూడదని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని జిల్లా విలేకరుల భవనంలో రైతు సంఘాల నేతలు మాట్లాడారు. ఇటీవలి కాలంలో ఏనుగులు, పులులు, అడవి పందులు వంటి జంతువులు రైతులు, ప్రజలపై దాడులు చేస్తున్నాయన్నారు. మైసూరు, చామరాజనగర జిల్లాల్లో పులుల దాడుల వల్ల ముగ్గురు రైతులు మరణించారు. అంతేకాకుండా, పులులు, చిరుతలు, ఏనుగుల సంచారం అధికమైంది, ఫలితంగా అటవీ ప్రాంతంలోని రైతులు భయానక వాతావరణంలో జీవిస్తున్నారని తెలిపారు. దీనికంతటికీ ప్రధాన కారణం అడవుల్లో పుట్టుకొచ్చిన అక్రమ రిసార్ట్లు, సఫారీలేనన్నారు. ఇటీవల ఆందోళనల తరువాత అటవీ శాఖ కొన్ని చర్యలు తీసుకుందన్నారు. ఎమ్మెల్యే నిర్వహిస్తున్న రిసార్ట్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. పర్యాటక రంగానికి దెబ్బ అనే సాకుతో సఫారీలను తిరిగి ప్రారంభించాలని హోటల్ వ్యాపారులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం సరికాదని తెలిపారు. అమూల్యమైన ప్రజల ప్రాణాలను రక్షించే లక్ష్యంతో సఫారీలను పూర్తిగా నిలిపివేయాలని కోరారు. మైసూరు జిల్లా రైతు నేతల డిమాండ్ వీటి వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు -
ఉసురు తీసిన అప్పులు
● తల్లీ, కూతురు, బాలుడు ఆత్మహత్య బనశంకరి: తీవ్ర రుణబాధల్లో చిక్కుకుని వృద్ధురాలు, ఆమె కూతురు, మనవడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన బెంగళూరు సుద్దగుంటెపాళ్య ఠాణా పరిధిలో సోమవారం జరిగింది. వివరాలు.. తావరకెరె రెండోక్రాస్లో మాదమ్మ (68), కుమార్తె సుధ (38), సుధ కొడుకు మోనీశ్ (14) నివాసం ఉంటున్నారు. మాదమ్మ, సుధ గతంలో జీవనోపాధి కోసం బిరియాని సెంటర్, చిప్స్ సెంటర్ నడిపారు. కానీ నష్టాలు రావడంతో చాలా అప్పులు చేశారు. చివరకు పాలు అమ్ముతూ, ఇళ్లలోనూ పనులు చేస్తున్నారు. విరక్తి చెంది ఉదయం 9 గంటల సమయంలో మోనీశ్ కు పురుగుల మందును తాగించారు, ఆపై వారు తాగడంతో ప్రాణాలు పోయాయి. ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను సెయింట్జాన్స్ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి డెత్నోట్ లభించలేదు. డీసీఎంపై రాజణ్ణ విసుర్లు దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరో ఒకరి వల్ల అధికారంలోకి రాలేదని, అందులోనూ సీఎం కావాలనుకుంటున్న కొందరి వల్ల అసలు కాదని హస్తం ఎమ్మెల్యే కేఎన్ రాజన్న అన్నారు. బెళగావిలోని సువర్ణసౌధలో మీడియాతో మాట్లాడిన ఆయన పరోక్షంగా డీసీఎం డీకే శివకుమార్పై మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సీఎం మార్పిడి లాంటివి ఏవీ ఉండవన్నారు. కాగా, సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామన్నారు. పాలికే ఖజానాపై భారం వద్దు బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార పరిధిలోని ఐదు పాలికేలకు చట్టానికి వ్యతిరేకంగా సీనియర్ అధికారులను నియమించారని, ఈ చర్యతో పాలికె ఖజానాకు భారం కానుందని, ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత ఎన్ఆర్.రమేశ్ డిమాండ్ చేశారు. దీనిపై సీఎం సిద్దరామయ్య, నగరాభివృద్ధి శాఖ కార్యదర్శి కి సోమవారం ఆయన లేఖ రాశారు. ఐదు నగర పాలికేల్లో అనవసరంగా 10 మంది అధికారులను నియమించారని, మున్సిపల్ చట్టాలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ఏటా కోట్లాది భారం పడుతుందని చెప్పారు. -
ప్రతిభాన్విత విద్యార్థులకు సన్మానం
హొసపేటె: కర్ణాటక ప్రతిభా అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని నగరంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. విజయనగర జిల్లాలో టెన్త్, పీయూసీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. జిల్లాలోని హొసపేటె, హగరిబొమ్మనహళ్లి, హువిన హడగలి, హరపనహళ్లి, కొట్టూరు, కూడ్లిగి తాలూకాల నుంచి ఒక్కొక్కరికి కలిపి 10 మంది చొప్పున ఆరు తాలూకాలకు చెందిన మొత్తం 60 మంది అర్హులైన, ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి సత్కరించారు. హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ, బీఈఓ శేఖర్ హొరపేటె, సోమశేఖర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్ను లారీ ఢీకొని డ్రైవర్ మృతి బళ్లారి రూరల్: ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన హగరి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. సంబంధీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అసుండికి చెందిన బసవరాజు (30) ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం సాగిస్తుండేవాడు. ఆదివారం రాత్రి హగరి వద్ద ట్రాక్టర్ నడుపుకొంటూ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో బసవరాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పీడీహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని బీఎంసీఆర్సీ మార్చురీకి తరలించారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
యాదగిరిలో బాలింత మృతి
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో బాలింత మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాదగిరి తాలూకా బలిచక్ర తాండాకు చెందిన నీలాబాయి(21) అనే గర్భిణి ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు కాన్పు అయింది. అధికంగా రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కడుపులో శిశువు మరణించడంతో జిల్లాస్పత్రిలో లోబీపీతో మరణించినట్లు డైరెక్టర్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 20 మంది బాలింతలు మరణించినట్లు సమాచారం. వడగేర, హుణసగి, సురపుర, శహాపుర, భీమరాయనగుడి తాలూకా ఆస్పత్రిలో సక్రమంగా వైద్య సౌకర్యాలు, చికిత్స లభించక మరణించారు. కాగా బాలింత, శిశువు మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. -
రైతులకు పరిహారం కోసం ధర్నా
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని రైతులకు పరిహారం అందించాలని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి సర్కార్ను డిమాండ్ చేశారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రైతులకు మద్దతు ధరలు ప్రకటించాలన్నారు. ఈ విషయంలో కళ్యాణ కర్ణాటకలోని శాసన సభ్యులు బెళగావిలో జరుగుతున్న అసెంబ్లీలో నోరు మెదపాలన్నారు. వరి, పత్తి, కంది, ఇతర పంటలు ఖరీఫ్లో కురిసిన వానలకు పూర్తిగా నష్టం సంభవించినట్లు ఆరోపించారు. రాయచూరులో మిరప మార్కెట్ను ప్రారంభించాలన్నారు. మద్దతు ధరతో మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శివశంకర్, నరసింహ నాయక్, లక్ష్మిపతి, రామకృష్ణ, జంబునాథ్, నాగరాజ గౌడ, అమరేష్ పాటిల్, నరసప్పలున్నారు. -
నేరాల నియంత్రణపై ప్రచారం
రాయచూరురూరల్: నేరాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం నడుంబిగించిందని ఎస్పీ పుట్టమాదయ్య అన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించేలా గోడలపై వివరాలు రాసే కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఅర్ఎస్ 112, 1930 సహాయవాణి అంశాలపై ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. సాంకేతిక రంగంలో మార్పులు వచ్చినా, నేరాలు తగ్గకపోవడంపై ప్రతి ఒక్కరూ అలోచించాలన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ను వినియోగించే వారంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. బెటాలియక్ కోసం సీఎంకు లేఖ రాయచూరురూరల్: కెఎస్ఆర్పీ బెటాలియన్ కేంద్రం రాయచూరులో ఏర్పాటు చేయాలని స్థానికులు సీఎం సిద్ధరామయ్య, హోంశాఖ మంత్రి పరమేశ్వర్లకు లేఖ రాశారు. కళ్యాణ కర్నాటక ప్రాంతంలోని కలబుర్గిలో ఉన్న కర్నాటక రాష్ట్ర రిజర్వ్డ్ పోలీస్ బెటాలియన్ను మహిళ రిజర్వుడ్ పోలీస్ బెటాలియన్ కేంద్రంగా మార్చారు. మరోవైపు మునిరాబాద్లో ఉన్న బెటాలియన్ను కలబుర్గికి రావాలంటూ ఆదేశాలిచ్చారు. దీంతో రాయచూరు ప్రాంతంలో బందోబస్తు కఠినం అవుతుందని, 13వ కేఎస్ఆర్పీ బెటాలియన్ను రాయచూరులో కొనసాగించాలని స్థానికులు లేఖరాశారు. కార్మికులకు కిట్లు పంపిణీ రాయచూరురూరల్: ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మాన్వి విధాన సభ సభ్యుడు హంపయ్యనాయక్ కోరారు. తాలుకాలోని బల్లటిగిలో పలువురు కార్మికులకు ఆయన కిట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు దైనందిన పనులతోపాటు.. తమ పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, వారిని విద్యారంగం వైపు మరల్చాలని సూచించారు. కార్మికుల పిల్లలకు వసతిగృహ సౌకర్యం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మల్లప్ప, శరణబసవ, పరశురామ్, పంపణ్ణ, సుదానంద, రమేష్, జాఫర్, అబ్రహాం, మారేష్, మౌనేష్ పాల్గొన్నారు. తరగతి గదుల నిర్మాణానికి శ్రీకారం రాయచూరురూరల్: నగరంలోని యాదవ సమాజం పాఠశాలలో రూ.80 లక్షలతో చేపట్టిన రెండు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మారెప్ప, హనుమంతప్ప, తమ్మప్ప, దానప్ప యాదవ్, మురళీ యాదవ్, లక్ష్మణ్, రాఘవేంద్ర, విష్ణు, అస్లాం పాషా, దరూరు బసవరాజ్, రజాక్ ఉస్తాద్, అబ్దుల్కరీం, తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ పాత్రికేయ అవార్డుకు విరాళం రాయచూరురూరల్: ఉత్తమ పాత్రికేయ పురస్కారాలు అందించేందుకు రూ.3 లక్షల చెక్కును అటవీశాఖ మంత్రి ఈశ్వర్ఖండ్రే అందజేశారు. బీదర్ భవనంలో జరిగిన రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, 2025–28 పదాధికారుల పద గ్రహణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీమణ్ణ ఖండ్రే పేరిట రూ.3 లక్షలతో దత్తనిధి ఏర్పాటు చేసి అవార్డులందించాలని రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శివానంద ప్రతిపాదించగా మంత్రి అంగీకరిస్తూ చెక్ అందజేశారు. అనంద దేవప్ప, అప్పారావ్, శివకుమార్ పాల్గొన్నారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య కోసిగి: కర్నూలు జిల్లా కోసిగి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి బీదర్ వెళ్లే రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని వద్ద ఆధార్ కార్డు ఆధారంగా రాయచూరు జిల్లా ఆరోలి గ్రామానికి చెందిన తిమ్మప్ప (45) అనే వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. అనారోగ్యంతో రాయచూరు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా, జబ్బు నయం కాక ఇక్కడకు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. -
ఏఐలో భాగస్వాములు అవుదాం
కెజీఎఫ్: ఆధునిక సాంకేతిక యుగంలో మార్పులకు అనుగుణంగా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్లో అందరూ భాగస్వాములు కావాలని ధారవాడ ఐఐటీ ప్రముఖుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని టి.తిమ్మయ్య ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుపాటు నిర్వహించిన ఏఐ సాంకేతికత మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ సంస్థలు సమాచార, సాంకేతికత వ్యవహార క్షేత్రంలో ఇప్పటికే బలపడ్డాయని అన్నారు. సమాచారం, పాలనా వ్యవస్థ, ప్రమాదాల నిర్వహణను బలపర్చడానికి ఏఐ సాంకేతికత అత్యంత అవశ్యమన్నారు. ఈ మేళాలో 30 ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. తిమ్మయ్య ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి 12 బృందాలు పాల్గొని 116 మంది విద్యార్థులు తమ కౌశల్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సయ్యద్ ఆరిఫ్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదంలో... ప్రజారోగ్యం
సాక్షి, బళ్లారి: ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని, వాతావరణంలో ప్రభావం చూపుతుందని తెలిసినా ప్రజలు వినియోగిస్తూనే ఉన్నారు. 50 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. దీనిని పక్కాగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పట్టణ వీధులు, మురుగు కాల్వలు ప్లాస్టిక్ కూపాలుగా మారుతున్నాయి. రోగాలు పెంచుతున్నాయి. జీవ మనుగడపై దుష్ప్రభావం కలిగించే ప్లాస్టిక్ నిషేధంతో నగర, పురపాలక సంస్థలు వైఫల్యం చెందుతున్నాయి. బళ్లారి జిల్లాతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలలోనూ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉంది. బళ్లారి పట్టణ జనాభా పెరుగుతుండడంతో టన్నుల కొద్దీ చెత్త సేకరించాల్సి వస్తోంది. ఇందులో ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ వినియోగిస్తే పురపాలక శాఖ అధికారులు దాడులు చేసి జరిమానా వేయవచ్చు. రూ.500 నుంచి రూ.5 వేల వరకు అపరాధ రుసుము విధించవచ్చని అధికారులే చెబుతున్నారు. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. మురుగు కాల్వల్లో వేయడంతో నాలాలకు అడ్డంపడి మురుగు రోడ్లపైకి చేరుతోంది. కల్వర్టులకు అడ్డంగా చేరి వర్షం వస్తే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. దుకాణదారులు డ్రైనేజీలపై బండలు వేయడంతో వాటి కింద ప్లాస్టిక్ ఇరుక్కుపోయి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బళ్లారిలోని ప్రతి అంగడి, హోటళ్లు, కూరగాయాల దుకాణాల్లో ఎటుచూసినా ప్లాస్టిక్ వాడకం పెరిగింది. హోటల్లో ఇడ్లీలు తయారు చేసే స్టాండ్లలనూ ప్లాస్టిక్ కవర్లు వేసి, అందులో ఇడ్లీ పిండి వేసి తయారుచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వేడి వేడి సాంబారు, అన్నం, పప్పు, దోసెలు, ఇతర వంటకాలన్నీ పార్శిళ్లలో తీసుకెళ్తున్నారు. పల్లె, పట్టణాల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం నిషేధం అమలులో ఉన్నా చోద్యం చూస్తున్న యంత్రాంగం హోటల్, బేకరీల్లో వేడి పదార్థాలన్నీ ప్లాస్టిక్ లోనే.. ప్లాస్టిక్ బ్యాగుల్లో ఆహారంతో ప్రమాదంప్టాస్టిక్ క్యారీ బ్యాగుల్లోని ఆహార పదార్థాలు తినడంతో ప్రమాదకరమైన ‘కార్సినోజన్లు’ శరీరంలో చేరి క్యాన్సర్కు దారితీస్తుందని, చర్య వ్యాధుల సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో మిగిలిన ఆహారం, కూరగాయల వ్యర్థాలు ఈ ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి చెత్త కుండీల్లో వేస్తున్నారు. మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ భూమి పొరలో చేరి భూగర్భ కాలుష్యం ఏర్పడుతోంది. ప్లాస్టిక్ కాల్చివేయడం వల్ల అందులోని రసాయనాలు వాతావరణంలో కలిసి మానవ, జీవ రాశుల మనుగడపై ప్రభావం చూపుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం
హొసపేటె: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని మాజీ మంత్రి బి.శ్రీరాములు పేర్కొన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన మండల స్థాయి నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం, బూత్ స్థాయి కార్యకర్తల వర్క్షాప్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులు రైతుల కష్టాలను వినడం లేదన్నారు. కుర్చీల కోసం పోరాడుతున్న పాలకులపై ప్రజలు కోపంగా ఉన్నారని, బీజేపీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను సామాన్యులకు తెలియజేసేలా కార్యకర్తలు పనిచేయాలని ఆయన వివరించారు. రాబోయే జీపీఎం, టీపీఎం, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను తెరపైకి తీసుకురావాలని కోరారు. విజయనగర నియోజకవర్గంలో బీజేపీ బలం, ప్రస్తుత ఎమ్మెల్యేల నిష్క్రియాత్మకత గుర్తించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత బూత్స్థాయి కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, చెన్నబాషా, వనగౌడపాటిల్, అయ్యాలి తిమ్మప్ప, సందీప్సింగ్, శంకర్మేటి, ఎన్.రూపేష్కుమార్, అశోక్ జీరే, తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డులకు బహుమతులు అందజేత
రాయచూరురూరల్: సమాజంలో శాంతి భద్రతలకు సహకరించడంతోపాటు హోంగార్డులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఎస్పీ పుట్టమాదయ్య పేర్కొన్నారు. స్థానిక పోలీస్ మైదానంలో జరిగిన క్రీడలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 24 గంటలపాటు విధులు నిర్వహిహిస్తూ మానసికంగా, శారీరకంగా, ధైర్యంగా ఉండేందుకు క్రీడలు సహకరిస్తాయని తెలిపారు. అనంతరం మొక్క నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్పీ పాటిల్, క్రీడాధికారి ఈరేష్ నాయక్, రాణోజి, మంజునాథ్ దేశాయ్, నింబనగౌడ, వరదరాజ్, చెన్నప్పగౌడ, చంద్రశేఖర్, శాంతప్ప, శివప్ప, బస్వంత్ సింహా, వీరభద్ర, సుభాష్ చంద్ర, జావెద్ పాల్గొన్నారు. మూఢ నమ్మకాలపై అవగాహన బళ్లారిటౌన్: సమాజంలో మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 11న ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆర్హెచ్ఎం.చెన్నబసయ్యస్వామి తెలిపారు. స్థానిక పత్రికా భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ వైజ్ఞానిక మనోభావాన్ని పెంపొందించే దిశగా కర్ణాటక రాష్ట్ర విజ్ఞాన తంతర్ జ్ఞానపరిషత్ ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని తెలిపారు. యాదగిరిలో ఈ నెల 28వతేదీ నుంచి మూడు రోజులపాటు ఐదో రాష్ట్ర స్థాయి విజ్ఞాన సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మూఢ నమ్మకాలను నియంత్రించేలా చట్టం తెచ్చినా.. ఇంకా సామాజిక మాధ్యమాలలో జోతిష్యం, చేతబడులపై ప్రకటనలు వస్తున్నాయన్నారు. పిల్లల్లో అవగాహన కల్పించేందుకు జ్ఞానామృత పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. గర్భంలోనే శిశువు మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమన్న కుటుంబ సభ్యులు హుబ్లీ: వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని గర్భిణి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరి తాలూకా బలిచక్ర తండా నివాసి నీలాబాయి ప్రసవ నొప్పులతో యాదగిరి ప్రభుత్వ మాతృ శిశు ఆస్పత్రికి వచ్చారు. నిండు గర్భిణికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆపరేషన్ చేసి వైద్యులు శిశువును బయటకు తీశారు. చికిత్స చేసిన వైద్యులు బిడ్డ మరణించిందని తెలుపడంతో నీలాబాయి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవ వేదనతో వచ్చిన మహిళకు సరైన చికిత్స అందించకపోవడం, బెడ్డు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతోనే శిశువు మరణించిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక శిశువు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హంపీలో ఫల పూజ హొసపేటె: దక్షణ కాశీగా పేరొందిన హంపీలో రాత్రి ఫలపూజ ఘనంగా నిర్వహించారు. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ, దేశం నల మూలల నుంచి భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం హంపీ విరుపాక్షవర విద్యారణ్య పీఠానికి చెందిన విద్యారణ్య భారతిశ్రీ సమక్షంలో వేలాది భక్తులు ఉత్సవ విగ్రహంతో విరుపాక్షేశ్వర ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. కోదండ రామస్వామి ఆలయంలో వేద మంత్రోచ్ఛరణ మధ్య విరూపాక్ష, పంపాంబికాదేవి నిశ్చితార్థం సంప్రదాయం ప్రకారం జరిపించారు. విజయనగర, బళ్లారి, బళ్లారి, కోప్పళ, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల భక్తులు తరలివచ్చారు. ఎస్పీ ఎస్.జాహ్నవి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న బైక్ ● ఇద్దరు దుర్మరణం చెళ్లకెరె రూరల్: తాలూకాలోని కాలువె హళ్లి గ్రామంలో విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వివరాల మేరకు.. శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రకాష్ (30), మధు (35) బైక్పై చెళ్లికెరె నగరానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో కాలువెహళ్లి వద్ద బైక్ అదుపు తప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో కిందపడ్డారు. ప్రకాష్, మధు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు. -
హనుమ రథోత్సవం
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరం బిబి రోడ్డులోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో హనుమజ్జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆదిచుంచనగిరి పీఠాద్యక్షుడు నిర్మలానందనాథస్వామీజి ఆధ్వర్యంలో రథోత్సవం, శనక్కాయల పరుసను నిర్వహించారు. పరిసర గ్రామాల రైతులు తాము పండించిన జొన్నలు, శనక్కాయలు తదితర పంటలను ఎద్దుల బండిలో నింపుకొని వచ్చి స్వామివారికి సమర్పించారు. ఉదయం నుంచి ఆంజనేయస్వామికి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. సాయంత్రం మేళాతాళాల మధ్య ఉత్సవమూర్తిని తేరులో ఉంచి ఊరేగించారు. ఇంటి నుంచే ఆదాయమంటూ.. రూ.34 లక్షల మస్కా మైసూరు: ఇంటిలో కూర్చొని లక్షల రూపాయలను సంపాదించాలని అనుకున్న వ్యాపారి భారీగా లాసయ్యాడు. వివరాలు.. మైసూరు సిటీలోని విజయనగర 3వ స్టేజ్కు చెందిన వ్యాపారికి టెలిగ్రామ్ యాప్లో ఓ మెసేజ్ వచ్చింది. ఇంటిలో నుంచే దండిగా సంపాదించాలని ఉంటే తమను సంప్రదించాలని అందులో ఉంది. లింక్ను నొక్కి అందులోని నంబరుకు కాల్ చేశాడు. తాము చెప్పినట్లు పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆగంతకులు తెలిపారు. వ్యాపారి పలుమార్లు 34.62 లక్షలను వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు. లాభం, అసలు వెనక్కు తీసుకుందామని ప్రయత్నించగా, మరింత పెట్టుబడి పెట్టాలని మోసగాళ్లు ఒత్తిడి చేశారు. చివరకు వారి ఫోన్లు స్విచాఫ్ చేసుకోవడంతో బాధితునికి మోసం అర్థమైంది. సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆకర్షణీయం.. క్రిస్మస్ ట్రీ కృష్ణరాజపురం: బెంగళూరులో క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. స్థానిక మాల్లో రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. నగరవాసులు ట్రీని సందర్శించి ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. నగరమంతటా పండుగ సంబరం కనిపిస్తోంది. బాధితురాలిపైనే పోలీసుల కేసు దొడ్డబళ్లాపురం: ఆనేకల్లో డయాగ్నసిస్ సెంటర్లో పరీక్షలకు వెళ్లిన ఓ మహిళను రేడియాలజిస్టు అసభ్యంగా తాకి వేధించిన కేసు గత నెలరోజులుగా చర్చనీయాంశమైంది. బాధితురాలు పదే పదే ఫిర్యాదు చేయడానికి పోలీస్స్టేషన్కు వెళ్లగా పోలీసులు తిరిగి ఆమైపెనే న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. రేడియాలజిస్టు జయకుమార్ అనే వ్యక్తి తనను వేధించినట్టు బాధితురాలు వీడియోలతో సహా పోలీసులకు నెల కిందటే ఫిర్యాదు చేసింది, కానీ నిందితున్ని పిలిపించి ఉత్తుత్తిగా మందలించి పంపించారు. సీఐ తిప్పేస్వామి.. జయకుమార్కు అండగా ఉన్నాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఆమె ఆరోపణలు అవాస్తవమని పోలీసులు చెబుతున్నారు. -
మత్తు భూతంపై కఠిన చర్యలు
ర్యాలీలో దూసుకుపోతున్న కారుఇప్పటికీ చెక్కు చెదరని అలనాటి కార్లు బనశంకరి: కర్ణాటకను డ్రగ్స్ వ్యసన రహితంగా తీర్చిదిద్దే దృష్టితో మాదకద్రవ్యాల విక్రేతలు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుని తమ లక్ష్యం సాధించే వరకు విశ్రమించేదిలేదని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరు సిటీపోలీస్, చారిత్రక వాహనాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విధానసౌధ ముందు డ్రగ్స్ వ్యతిరేక వింటేజ్ కారు ర్యాలీని ప్రారంభించారు. డ్రగ్స్తో కర్ణాటక మాత్రమే కాదు ప్రపంచం సతమతమవుతోంది. మత్తు భూతం భవిష్యత్తును, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని చెప్పారు. బడి పిల్లలకూ డ్రగ్స్ చాక్లెట్లు కర్ణాటక ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ఆశయమన్నారు. గత ఏడాదినుంచి రూ.300 కోట్ల విలువచేసే డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, వందలాదిమందిని అరెస్ట్ చేశారని మంత్రి చెప్పారు. పాఠశాలల బాలలకు కూడా డ్రగ్స్ చాక్లెట్లను అమ్ముతున్నారు, పిల్లలు వీటికి దాసోహం అవుతున్నారని వాపోయారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు, టెక్కీలు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి కోరారు. ఈ సందర్భంగా కార్లు, పాతకాలం బైక్ల ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. డీజీపీ ఎంఏ.సలీం, పోలీస్కమిషనర్ సీమంత్కుమార్సింగ్ పాల్గొన్నారు. హోంమంత్రి పరమేశ్వర్ ఉత్సాహంగా వింటేజ్ కార్ల జాగృతి ర్యాలీ -
టీబీ డ్యాం పనులు వేగవంతం
రాయచూరురూరల్: తుంగభద్ర జలాశయం వద్ద 33 క్రష్ గేట్ల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి ఆదేశించారు. మునీరాబాద్లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు బృందాలను ఏర్పాటు చేసి రాబోయే ఖరీఫ్ నాటికి గేట్లు అమర్చే పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. వేసవిలో ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. జలాశయంలో 23 టీఎంసీల నీటిని వినియోగించారని వివరించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ హార్డ్వేర్ టూల్స్, మిషనరీ ప్రాజెక్టు కంపెనీ ప్రతినిధుల సలహా మేరకు పశ్చిమబెంగాల్లోని పరాక్ బ్యారెజీకి 124 గేట్లను అమర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ లక్ష్మణ్ నాయక్, ఎస్ఈ సత్యనారాయణ, గిరీష్, విజయలక్ష్మి, శాంతారాజ్, గోడేకర్ పాల్గొన్నారు. మంత్రి శివరాజ్ తంగడిగి -
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు
కెజీఎఫ్: విద్యార్థులు చదవుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే రూపా శశిధర్ పేర్కొన్నారు. నగరంలోని టి.తిమ్మయ్య ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన అండర్–14, అండర్–17 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో ఏకాగ్రత పెరిగి విద్యార్థులు పట్టుదలతో ఉన్నత చదువులు అభ్యసించే అవకాశం కలుగుతుందని తెలిపారు. క్రీడలలో గెలుపు, ఓటములు సమానంగా తీసుకుని ప్రతి క్రీడాకారుడు క్రీడా స్పూర్తితో ఆడాలన్నారు. అనంతరం పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఆయన అభినందించారు. -
కులాంతర పెళ్లిళ్లు పెరగాలి
హుబ్లీ: ప్రతి జంట ఇద్దరు పిల్లలను తప్పకుండా కనాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. జిల్లాలోని నవళగుంద మోడల్ హైస్కూల్ ఆవరణలో ఆదివారం జరిగిన సామూహిక వివాహ వేడుకలో సీఎం సిద్దు, డీసీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ దేశ జనాభా పెరిగి పోయిందని, చైనాను భారత్ దాటిపోయిందని చెప్పారు. కులాంతర వివాహాలు పెరగాలి. కులం, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు నిర్మూలించబడాలన్నారు. డీకే మాట్లాడుతూ కొత్త వధూవరులు ఆదర్శ దంపతులుగా సమాజంలో జీవించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపకుండా మీరే ఉద్యోగదాతలుగా ఎదిగేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 75 జంటలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలోనే నవళగుంద ఎమ్మెల్యే ఎన్హెచ్.కోనరెడ్డి కుమారుడు నవీన్కుమార్– సహన రిసెప్షన్ జరిగింది. పలువురు మంత్రులు పాల్గొన్నారు. సీఎం సిద్దరామయ్య -
లారీని ఢీకొని కారు దగ్ధం
దొడ్డబళ్లాపురం: పాల ట్యాంకర్ లారీని ఢీకొని నడి రోడ్డుపై కారు కాలి బూడిదైన సంఘటన ఆదివారం ఉదయం బెంగళూరు–మైసూరు ఎక్స్ప్రెస్ వేలో జరిగింది. మైసూరు నుంచి బెంగళూరు వైపు వస్తున్న డస్టర్ కారు ముందు వెళ్తున్న పాల ట్యాంకర్ను ఢీకొంది. దీంతో ఇంజిన్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారంతా వ్యాపించి పూర్తిగా కాలిబూడిదైంది. కారులో ఉన్న వారు బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇద్దరు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. రామనగరలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రామనగర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. తగలబడిపోతున్న కారు -
కారు బోల్తా, ముగ్గురు మృతి
● మండ్య జిల్లాలో విషాదం మండ్య: వేగంగా వెళుతున్న కారు చిన్న వంతెనను ఢీకొని పల్టీలు కొట్టిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలో బెంగళూరు– మంగళూరు హైవేలో తిట్టనహొసహళ్లి–నాగతిహళ్ళి మధ్య జరిగింది. చిక్కమగళూరుకు చెందిన చంద్రేగౌడ (45), భార్య సరోజమ్మ (38), బంధువు సావిత్రమ్మ ఘటనాస్థలంలోనే మరణించారు. చిక్కమగళూరుకు కారులో వెళుతున్న సమయంలో అదుపుతప్పి చిన్నపాటి వంతెనను ఢీకొని ప్రమాదం జరిగింది. బిండిగనవిలె పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద దృశ్యం -
పెళ్లిలో తుపాకీతో చిందులు
సాక్షి, బళ్లారి: పెళ్లి ఊరేగింపులో ఓ రౌడీషీటర్ తుపాకీ పట్టుకుని గాల్లోకి కాల్పులు జరుపుతూ చిందులేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. యాదగిరి జిల్లా గురుమిఠకల్ తాలూకా సిద్దాపుర గ్రామంలో పెళ్లి మెరవణి జరిగింది. ముండరిగి గ్రామ పంచాయతీ సభ్యుడు, రౌడీషీటర్ చంద్రశేఖర్ గన్ పట్టుకుని గాల్లోకి కాల్పులు జరుపుతూ నృత్యం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్థానిక పోలీసలు అతనిని అరెస్టు చేసి తుపాకీని సీజ్ చేశారు. అది నాటు తుపాకీ అని సమాచారం. ఆర్సీబీ మ్యాచ్లన్నీ బెంగళూరులోనే: డీసీఎం శివాజీనగర: వచ్చే ఏడాదిలో ఐపీఎల్లో ఆర్సీబీకి చెందిన అన్ని పోటీలు బెంగళూరులోనే జరుగుతాయని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. నగరంలోని కేఎస్సీఏ ఎన్నికలలో ఓటు వేసిన తరువాత ఆయన మాట్లాడారు. ఆర్సీబీ మనకు గర్వకారణం, ఐపీఎల్ మ్యాచ్లను ఇక్కడి నుంచి తరలించేది లేదు. ఆర్సీబీ టీం అన్ని మ్యాచ్లూ బెంగళూరులోనే జరుగుతాయి. దీనిపై నేను వారితో మాట్లాడతాను అని చెప్పారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం నూతన అధ్యక్షుడు, పదాధికారుల ఎన్నికలు జరగ్గా, మాజీ క్రికెటర్లు అనిల్కుంబ్లే, రోజర్ బిన్ని, బ్రిజేశ్ పటేల్ తదితర ప్రముఖులు ఓటు వేశారు. వెంకటేశ్ ప్రసాద్ కూడా పోటీలో ఉన్నారు. డీకే ఆప్తునికి నోటీసులు యశవంతపుర: నేషనల్ హెరాల్డ్ నిధుల కేసులో డీసీఎం డీకే శివకుమార్ ఆప్తుడు, కాంగ్రెస్ నాయకుడు ఇనాయత్ అలీకి ఢిల్లీ పోలీసులు (ఆర్థిక వ్యవహారాల విభాగం) నోటీసులిచ్చారు. ఈడీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఇనాయత్ అలీపై కేసు నమోదు చేసి త్వరలో విచారణకు రావాలని ఇంటికి వచ్చి నోటీసులిచ్చారు. ఇప్పటికే డీసీఎం సోదరులకు కూడా నోటీసులు రావడం తెలిసిందే. గత ఏడాది కాలం నుంచి ఈడీ అధికారులు అలీని విచారణ చేస్తున్నారు. -
అసత్య ప్రచారం చేయవద్దు
కోలారు: కోలారు జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులివ్వడం లేదనే అసత్య ప్రచారం చేయవద్దని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ పేర్కొన్నారు. తాలూకాలోని దొడ్డహసాళ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోలారు నియోజవర్గంలో రూ.1041 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దొడ్డహసాళ, చిక్కహసాళ గ్రామాలలో రహదారుల అభివృద్ధికి రాబోయే బడ్జెట్ నుంచి రూ.60 లక్షలు ఇస్తామన్నారు. దొడ్డహసాళ పంచాయతీ భవిష్యత్తులో కోలారు నగరంలోకి చేరుతుందని, బంగారుపేటకు వెళుతున్న రహదారిని చతుష్పథ రహదారిగా మార్పు చేస్తామని ఆయన వెల్లడించారు. త్వరలో రింగ్ రోడ్డు పనులు ప్రారంభమవుతాయని వివరించారు. విధాన పరిషత్ సభ్యుడు ఇంచర గోవిందరాజులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమలు చేపట్టడం సంతోషించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంఎల్.అనిల్కుమార్, కోముల్ డైరెక్టర్ చంజిమలై రమేష్, గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు అంజమ్మ, చౌడప్ప, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ -
హామీలు ఏమయ్యాయి?
ప్లాస్టిక్ రహిత బళ్లారి జిల్లాగా మారుస్తామని ఏళ్ల తరబడి అధికారులు, పాలకులు చెబుతున్నా ఆచరణ పెట్టడంలేదు. ఆ దిశగా ఒక్క అడుగు పడకపోవడంతో సామాన్య, మధ్య తరగతి జనం ఆరోగ్యాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించే మాట అటుంచితే.. కనీసం హోటళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడంలోనూ మహా నగర పాలికె, పుడ్ సేఫ్టీ అధికారులు విఫలమవుతున్నారు. అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండడంతో తుతూమంత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారు. పలుమార్లు సమావేశాల్లో మేయర్ హామీలు గుప్పిస్తున్నారే గానీ ఆచరణ పెట్టడంలేదు. పాలికె అధికారులు వచ్చినపుడు మాముళ్లు ఇచ్చి అనంతరం వ్యాపారులు తమ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
చెత్త ఊడ్చే యంత్రాలకు అంత ఖర్చా?
గతంలో పాలికె ప్రారంభించిన చెత్త ఊడ్చే వాహనాలు (ఫైల్) బెంగళూరు నగరంలో చెత్త ఊడుస్తున్న యంత్రంబనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలోని ప్రధాన రోడ్లు, అనుబంధ రహదారుల్లో చెత్త ఊడ్చే యంత్రాలను అధికారులు అద్దెకు తీసుకోనున్నారు. అందుకుగాను రూ.613 కోట్లు చెల్లించనున్నారు. ఇంత ఖర్చు అవసరమా అని అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. నగరవాసులు చెల్లించే పన్నుల డబ్బును ఇష్టానుసారం ఖర్చుచేయడం సమంజసమా? అనే ప్రశ్న వినిపిస్తోంది. బెంగళూరులో ఎన్నికై న పాలకవర్గం లేకపోవడం అధికారులు చెప్పినట్లు ప్రభుత్వం తలూపుతోందనే ఆరోపణలున్నాయి. 45 యంత్రాలను తీసుకునే అవకాశముంది. ఏడేళ్లు చెత్త ఊడ్చడానికి పై మొత్తం చెల్లిస్తారు. చెత్త యంత్రాలకే ఇంత డబ్బు పోతే మిగతా అభివృద్ధి పనులు, ముఖ్యంగా గుంతల రోడ్ల మరమ్మతులకు నిధులు ఎలా అని మాజీ కార్పొరేటర్లు, నగరవాసులు సందేహం వ్యక్తంచేశారు. అంత అవసరం లేదు గ్రేటర్ బెంగళూరు పరిధిలో 12.87 లక్షల కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో ప్రధానమైన రోడ్ల పొడవు 1,682 కిలోమీటర్లు. ఇలాంటి రోడ్లలో మాత్రమే యంత్రాలను వినియోగించాలి. ఇందుకు పెద్దగా ఖర్చు కాదు, కానీ సందుల్లో కూడా యంత్రాలను వాడాలనుకోవడం అర్థం కావడం లేదని మాజీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో ఏడాదిలో 6 నెలలు వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో చెత్త ఊడ్చే అవసరం ఉండదు. 45 వాహనాలు.. 7 ఏళ్ల అద్దెకు రూ.613 కోట్లు గ్రేటర్ బెంగళూరు నిర్ణయంపై విస్మయంపూణె, పాట్నా కంటే తక్కువే ఇప్పటికే వేలాదిమంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ ఉంటే వారికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో ఊడ్చే యంత్రాలున్న వాహనాలతో పని సులభంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాత్రి వేళ కూడా శుభ్రం చేయవచ్చునని చెప్పారు. పూణె, పాట్నా వంటి నగరాలలోనూ ఈ పథకం ఉందని, అక్కడ కిలోమీటరుకు రూ.1290 వరకు ఖర్చు అవుతోందని, బెంగళూరులో కి.మీ.కు రూ.894 మాత్రమేనని చెప్పారు. -
కరాటేలో డేవిడ్కు స్వర్ణ పతకం
రాయచూరు రూరల్: కరాటే పోటీల్లో రాయచూరుకు చెందిన డేవిడ్ స్వర్ణ పతకం సాధించాడు. గతనెల 30వ తేదీన హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నగరానికి చెందిన డేవిడ్్ పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా ఎంఎస్.జావిద్ శాటోకన్ జాతీయ కరాటే అవార్డును గ్రాండ్మాస్టర్ షాహిద్, ప్రధాన కార్యదర్శి సుభాన్ చేతుల మీదుగా అందుకున్నాడు. తుంగభద్ర నదీ తీరంలో మొసలి ప్రత్యక్షం● భయాందోళనలో గ్రామ ప్రజలు రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా మద్లాపుర వద్ద శనివారం తుంగభద్ర నదీ తీరంలో మొసలి ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న తుంగభద్ర నదీ తీర ప్రాంతంలో మొసలి ప్రత్యక్షం కావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు వన్య జీవులు, జలచరాల నుంచి ప్రజలను రక్షించడానికి అటవీ శాఖాధికారులకు వెంటనే సమాచారం అందించాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో విద్యార్థులపై దాడిరాయచూరు రూరల్: ప్రభుత్వ సాంఘీక సంక్షేమ శాఖ హాస్టల్లోని విద్యార్థులపై అధికారులు దాడి చేశారు. శుక్రవారం రాత్రి తాలూకాలోని ఉడుంగల్ ఖానాపూర్లోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ హాస్టల్లో వార్డెన్, సిబ్బంది కలిసి విద్యార్థులపై దాడి చేయడంతో భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటున్నారు. చిన్న పిల్లలను ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో హింసకు గురి చేస్తున్నారు. 125 మంది విద్యార్థులకు గాను 80 మంది విద్యార్థులున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న పిల్లలను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. విద్యార్థులు అధికారులను పెన్సిల్, పెన్నులు, పుస్తకాలు అడిగితే వారిని చితకబాదినట్లు సమాచారం. విద్యార్థులకు యూనిఫాం, షూ, పుస్తకాలు, కిట్లు ఇవ్వకుండా, హాస్టల్లో సీసీ టీవీలు, మంచినీటి ప్లాంట్ చెడిపోయినా మరమ్మతు చేయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముక్తి రథం వాహనం పంపిణీరాయచూరు రూరల్: దళితుల శవ సంస్కారానికి వీలుగా ముక్తి రథం వాహనాన్ని శనివారం విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ పంపిణీ చేశారు. నగరంలోని హరిజనవాడల్లో మృతదేహాలను శ్మశాన వాటికకు తరలించడానికి వీలుగా రూ.20 లక్షలతో రెండు శవపేటికలు, ముక్తి రథం వాహనాన్ని ఆయన అందించారు. ఈ సందర్భంగా మాదార చెన్నయ్య గురు పీఠం అధ్యక్షుడు యమనూరప్ప, బసవరాజ, రామణ్ణ, సత్యనాథ్, వెంకటేష్, బాబు, తిమ్మప్ప, మాజీ నగరసభ సభ్యుడు యల్లప్ప, అస్లాంపాషా, మురళీ యాదవ్, మహ్మద్ హుసేన్, రజాక్ ఉస్తాద్లున్నారు. వాలంటీర్ల దినోత్సవంరాయచూరు రూరల్: మాదార చెన్నయ్య ఆడిటోరియంలో మ్యాజిక్ ఇండియా ఫౌండేషన్, నెస్లే ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత వాలంటీర్ల దినోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమంలో రాయచూరు గ్రీన్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, సమాజ అభివృద్ధి, నాయకత్వంపై యువతీ యువకులు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఈరణ్ణ, చంద్రశేఖర్, గూళప్ప, కాశీనాథ్, నరసప్ప, సురేష్లున్నారు. -
నవ వరుడు ఆత్మహత్య
యాడికి: ఏడడుగుల బంధంతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాల్సిన యువకుడికి ఏం కష్టమొచ్చిందో ఏమో పైళ్లెన 33 రోజులకే జీవితంపై విరక్తి చెంది శెనగ పంటకు వాడే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరు గ్రామానికి చెందిన జయరాం నాయుడుకు శరత్ కుమార్ నాయుడు(23), లోకేష్ కుమార్ నాయుడు అనే ఇద్దరు కుమారులు. శరత్ కుమార్ నాయుడు మరో వ్యక్తితో కలిసి కొంత కాలంగా బెంగళూరులో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు లోకేష్ కుమార్ నాయుడు నగరూరులో తమ వ్యవసాయ తోటల్లో తండ్రికి చోదోడు వాదోడుగా ఉంటున్నాడు. గత నెల 2, 3వ తేదీల్లో బళ్లారి జిల్లాలోని సుగ్గేనహళ్లి కొట్టాల గ్రామానికి చెందిన సుస్మితతో శరత్ కుమార్ నాయుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. 10 రోజుల క్రితం తన భార్య సుస్మితను నగరూరు గ్రామంలో తమ ఇంటి వద్ద ఉంచి శరత్కుమార్ బెంగళూరు వెళ్లాడు. ఈ నెల 3వ తేదీన సుస్మిత తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఏం కష్టం వచ్చిందో కానీ.. శుక్రవారం బెంగళూరు నుంచి వచ్చిన శరత్కుమార్ తాడిపత్రి మీదుగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న తన స్నేహితుడు హరీష్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీకి హరీష్ వెళ్లిన తర్వాత ఇంటిలో ఉన్న శరత్ కుమార్ నాయుడు తన సెల్ఫోన్లో భార్యతో సుమారు గంటసేపు మాట్లాడాడు. 9 గంటల తర్వాత తాను శెనగ గింజలకు వేసే క్రిమిసంహారక మాత్రలు మింగానని శరత్కుమార్ హరీష్కు ఫోన్ చేశాడు. వెంటనే గదికి వచ్చిన హరీష్ విలవిలలాడుతున్న శరత్కుమార్ నాయుడును ఓ వాహనంలో తాడిపత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. శరత్కుమార్ నాయుడిని పరీక్షించిన డాక్టర్లు ఇక లేడని తెలిపారు. అనంతపురానికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు మృతి చెందిన శరత్కుమార్ నాయుడిని చూసి కన్నీటి పర్యంత మయ్యారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న మృతుడి భార్య సుస్మిత తన తల్లిదండ్రులతో అనంతపురానికి వచ్చి ఆసుపత్రిలో విగత జీవిగా ఉన్న భర్తను చూసి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పైళ్లెన 33 రోజులకే మృత్యువాత శోకసంద్రంలో నగరూరు గ్రామం -
ఉపాధి హామీ పనుల తనిఖీ
శ్రీనివాసపురం: శ్రీనివాసపురం తాలూకాను అవినీతి రహితంగా చేయడమే లక్ష్యమని ఉప లోకాయుక్త బి.వీరప్ప అన్నారు. తాలూకాలోని జి.తిమ్మసంద్ర, అరికుంటె, దళసనూరు, మాస్తేనహళ్లి తదితర గ్రామ పంచాయతీలను ఆయన సందర్శించి ఉపాధి హామీ, తాగు నీటి పథకాల పనులను పరిశీలించారు. నైర్మల్య నిర్వహణ, పన్నుల వసూళ్లకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. పనుల అమలులో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బి.వీరప్ప మాట్లాడుతూ ప్రజలలో మార్పు రావాలని, అప్పుడే సమాజం మారుతుందని తెలిపారు. నిధులు దుర్వినియోగం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లోకాయుక్త న్యాయమూర్తి అరవింద్, జిల్లా లోకాయుక్త ఎస్పీ అంటనిజాన్, డీఎస్పీ మోనిషా, తహసీల్దార్ జీఎన్.సుధీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్కు నివాళి
కోలారు: అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని బంగారుపేట సర్కిల్లో అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదర్గాలకు అంబేడ్కర్ అందించిన సేవలు అపారమని, అన్ని సముదాయాల వారికి అనుకూలమయ్యే రాజ్యాంగాన్ని అందించిన ఘనత ఆయనదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంఎల్.అనిల్కుమార్, జిల్లా పంచాయతీ సీఈఓ డాక్టర్ ప్రవీణ్ పిబాగేవాడి, జిల్లా ఎస్పీ డాక్టర్ బి.నిఖిల్, తదితరులు పాల్గొన్నారు. దుకాణాల తనిఖీ శ్రీనివాసపురం: ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చాలనే సంకల్పంతో పుర సభ అధికారులు పట్టణంలోని బేకరి, పండ్లు, హోటల్, కూరగాయల దుకాణాలను దుకాణాలను శనివారం తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు వాడరాదని యజమానులను హెచ్చరించారు. ఎంజీ రోడ్డులోని ఫుట్పాత్ను తొలగించి, ముళబాగిలు సర్కిల్లో చెత్త వేసే స్థలంలో ముగ్గులు వేయించారు. అనంతరం 25 కిలోల ప్లాస్టిక్ స్వాధీనం చేసుకుని దుకాణదారులకు రూ.3 వేల జరిమానా విధించారు. పురసభ పరిసర సూపరింటెండెంట్ లక్ష్మీశ, హెల్త్ సూపర్వైజర్ టీవీ.సురేష్, సిబ్బంది సంతోష్, నాగేష్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
పశువుల ఆస్పత్రి మార్పు వద్దు
కేజీఎఫ్: బంగారు గనుల ప్రాంతంలో బ్రిటీష్ హయాంలో నిర్మించిన మైసూర్ మైన్స్ ప్రాథమిక పశువుల ఆస్పత్రిని మరో ప్రాంతానికి తరలించవద్దని గ్రామీణ ప్రాంతాల రైతులు హెచ్చరిస్తున్నారు. బంగారు గనుల ప్రాంతంలోని ఐదు వార్డులకు చెందిన మారికుప్పం, బళిగానహళ్లి, గిడ్డగౌడనహళ్లి, కేజీఎఫ్ ఎ బ్లాక్, సౌత్ బ్లాక్, హళ్లి కుడ్య, చిన్నకల్లు, నగర కమీషన్ లైన్, పర్పెంటర్ కాలనీ, ఛాంపియన్ రైల్వే స్టేషన్ కాలనీలలోని పలు కుటుంబాలు జెర్సీ ఆవులు, గొర్రెలు, మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వీరంతా తమ పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఈ ఆస్పత్రిలోనే టీకాలు వేయిస్తారు. ఈ ఆస్పత్రిలో సుమారు నెలకు 9 నుంచి 10 వేల మూగ ప్రాణులకు చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే సిఫారసు మేరకు ఇపుడు అకస్మాత్తుగా ఆస్పత్రిని బడమాకనహళ్లికి తరలించడం తగదని, అలాచేస్తే తాము చూస్తూ ఊరుకోమని ఆ గ్రామాల పాడి రైతులు హెచ్చరిస్తున్నారు. స్థలాంతరం చేయడం వల్ల పశువుల చికిత్సకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిని అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రిని ఇక్కడి నుంచి తరలించవద్దని కోరుతున్నారు. -
సీఐకి కన్నీటి వీడ్కోలు
హుబ్లీ: రోడ్డు ప్రమాదంలో ఓ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. వివరాలు.. హావేరిలో లోకాయుక్త సీఐగా పని చేస్తున్న పంచాక్షరి సాలిమఠ(54) స్వస్థలం బెళగావి జిల్లా మురగోడ కాగా తాను ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఫలితంగా కారు ఇంజిన్లో చెలరేగిన మంటల్లో చిక్కుకుని కాలిబూడిదయ్యారు. ఎముకలు కూడా దొరకని స్థితిలో సీఐ మృతదేహం కనిపించింది. తన విధులను ముగించుకుని భార్య, పిల్లలను చూడటానికి గదగ్ వైపు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకొంది. కాగా కాలిబూడిదైన ఆయన దేహం, కారు నంబరు, ధరించిన ఉంగరం ద్వారా సీఐ మృతదేహంగా గుర్తించారు. హుబ్లీ కిమ్స్లో ఆయన సహోద్యోగులు, సిబ్బంది చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. బంధువులు, స్నేహితులు, భార్య, పిల్లల రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు. హుబ్లీ–ధార్వాడ పోలీసు కమిషనర్ శశికుమార్ విలేకరులతో మాట్లాడుతూ సాలిమఠ తన విధులను ఎంతో చక్కగా నిర్వహించేవారని ప్రశంసించారు. ప్రజలతో పాటు పోలీసుల్లో కూడా మంచిపేరు తెచ్చుకున్నారన్నారు. ఆయన 2003వ బ్యాచ్కు చెందిన వారని, ప్రస్తుతం లోకాయుక్త సీఐగా పని చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి సమర్థ అధికారి ఇలా కారు ప్రమాదంలో ఘోరంగా మరణించడం తమను ఎంతో బాధిస్తోందన్నారు. అగ్నిప్రమాదంలో లోకాయుక్త సీఐ దుర్మరణంరాయచూరు రూరల్: కారులో వెళుతుండగా జరిగిన అగ్నిప్రమాదంలో లోకాయుక్త సీఐ పంచాక్షరి సాలిమఠ దుర్మరణం పాలైన ఘటన ధార్వాడ జిల్లా అణ్ణిగేరి వద్ద జరిగింది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని కారులో బయలుదేరారు. అయితే కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో గుంతలో పడ్డ కారు ఇంజిన్లో నుంచి మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. పంచాక్షరి సాలిమఠ గతంలో బైలహొంగల, గదగ్, హుబ్లీలలో విధులు నిర్వహించారు. -
బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్
సాక్షి, బళ్లారి: పేద కుటుంబంలో జన్మించి, కష్టపడి ఉన్నత విద్యనభ్యసించి, భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ అణగారిన, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం అంబేడ్కర్ పరినిర్వాణ దినోత్సవం(వర్ధంతి) సందర్భంగా నగరంలోని హొసపేటె రోడ్డులోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కాంస్య ప్రతిమకు కొప్పళ ఎమ్మెల్యే, రాబకొ చైర్మన్ రాఘవేంద్ర హిట్నాల్, బళ్లారి జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ శోభారాణి, ప్రముఖులు ముండ్రిగి నాగరాజ్, చిదానందప్ప తదితరులు పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ అంబేడ్కర్ ఒక వ్యక్తి కాదు, శక్తి అని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగానికి యావత్ ప్రపంచ దేశాలు కితాబునిచ్చాయన్నారు. భారత దేశంలో పేదరిక నిర్మూలన, కులవివక్షతను రూపుమాపేందుకు పునాదులు వేయడంతో దేశంలో అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో రాణించేందుకు వీలైందన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుస్తూ దేశాభివృద్ధికి బాటలు వేయాలన్నారు. అన్ని పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఖ్యాతి.. దశదిశలా వ్యాప్తి మహామానవతావాది డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ను బీజేపీ ఎంతో గౌరవించి ప్రపంచంలోనే ఆయన పేరును మరింత ఇనుమడింపజేసేలా కృషి చేసిందని నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, సీనియర్ న్యాయవాది దాసరి గోవిందు పేర్కొన్నారు. శనివారం డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ మహా పరినిర్వాణ దినోత్సవం సందర్భంగా నగరంలోని మోకా రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేడ్కర్కు ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. దేశంలో పంచతీర్థాలను బీజేపీ రూపొందించిందని, వాటిలో ఆయన పుట్టిన స్థలం మధ్యప్రదేశ్లోని మావ్, లండన్లో ఉన్నత విద్యాభాస్యం చేసిన ప్రాంతాన్ని విద్యాభూమిగా, నాగ్పూర్లో బుద్ధదీక్ష తీసుకున్నందుకు దీక్షాభూమిగా, అంబేడ్కర్ శరీరం వదిలిన ప్రాంతాన్ని మహాపరినిర్వాణ స్థలంగా, ఆయన సమాధి అయిన ప్రాంతాన్ని చైతన్యభూమిగా ఈ ఐదు పవిత్ర స్థలాలను గుర్తించి పంచతీర్థాలుగా మార్చి, మ్యూజియంలు ఏర్పాటు చేసి దేశశ ప్రజలకే కాకుండా, యావత్ ప్రపంచానికి ఆయన ఖ్యాతిని మోదీ ఇనుమడింపజేశారన్నారు. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుగా గుర్తించారన్నారు. ఈ మహత్తరమైన రోజు మోదీ ప్రభుత్వం వచ్చాక 2015లో అమల్లోకి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా అమలు చేసిందన్నారు. భారత దేశంలో అరుదైన, ఆణిముత్యంగా కీర్తి పొందిన అంబేడ్కర్ను ఎంతో గౌరవిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నట్లు తెలిపారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: నగరంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ పార్టీలకు చెందిన నేతలు, అధికారులు పూలమాలలు వేశారు. శనివారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 69వ పరినిర్వాణ దినంలో భాగంగా అంబేడ్కర్ ప్రతిమకు జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ పుట్టమాదయ్య, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ దద్దల్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, డీఎస్ఎస్ నేతలు రవీంద్రనాథ పట్టి, తిమ్మారెడ్డి, గురురాజ్, వెంకటేష్, జేడీఎస్ నేతలు విరుపాక్షి, మహంతేష్ పాటిల్, విశ్వనాథ్ పట్టి పాల్గొని పూలమాలలు వేశారు. రాయచూరులో అంబేడ్కర్ ప్రతిమకు నాయకుల పుష్పాంజలి బళ్లారిలో అంబేడ్కర్ ప్రతిమకు నేతల పుష్పాంజలి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి అంబేడ్కర్ పరినిర్వాణ దినోత్సవంలో వక్తలు -
అడుగు తడబడితే.. జారి పడాలంతే
కోలారు: ఎటు చూసినా మురుగు నీరు పేరుకుపోయి బురదమయం కావడంతో అడుగు తడబడినా జారి పడాల్సి వస్తోంది. నగర సమీపంలోని విజయనగర కాలనీలో కాల్వలు శుభ్రం చేయకపోవడంతో మురుగు పొంగి ప్రవహిస్తూ రహదారి పైకి చేరుతోంది. చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారంతా దుర్గంధం భరించలేకపోతున్నారు. దోమలు తీవ్రమై అనారోగ్యం పాలవుతున్నామని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని చెబుతున్నారు. కల్వర్టు నిర్మాణం నిలిపివేయడంతో ఈ పరిస్థితి కలిగిందని, ఆ దారిన వెళ్లాలంటే ముక్కు మూసుకుని నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మురుగు నీరు రహదారిపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
దేవుని ఫ్లెక్సీకి నిప్పు
సాక్షి,బళ్లారి: కార్తీక మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పరమశివుని ఫ్లెక్సీకి కొందరు దుండగులు నిప్పు పెట్టడంతో దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకాలో కలకలం రేగింది. శుక్రవారం రాత్రి హొన్నాళి తాలూకా సాసివెహళ్లి గ్రామంలో కల్లేశ్వర కార్తీక మహోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. కొందరు దుండగులు ఫ్లెక్సీకి నిప్పు పెట్టడంతో గ్రామంలో పెద్ద ఎత్తున జనం చేరి ఆందోళన చేశారు. మాజీ మంత్రి రేణుకాచార్య ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకు నాయకత్వం వహించారు. సాక్షాత్తు సృష్టి లయకర్త శివుడి కార్తీక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటే దుండగులు ఇలాంటి నీచకృత్యానికి పాల్పడ్డారని, దుండగులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న దుర్మార్గులపై పోలీసులు దృష్టి సారించి వెంటనే అరెస్ట్ చేయాలని ఒత్తిడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. నిరసన వ్యక్తం చేసిన సాసివెహళ్లి గ్రామస్తులు దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకాలో కలకలం -
గస్తీ పోలీసులకు దొంగల ముఠా బెదిరింపులు
సాక్షి,బళ్లారి: చేతిలో పిస్తోలు పట్టుకుని గస్తీ తిరుగుతున్న పోలీసులను బెదిరించి పారిపోయిన దొంగల ముఠా నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. బెళగావి జిల్లా నిప్పాణి పట్టణంలో శుక్రవారం రాత్రి పలు వీధుల్లో గస్తీ తిరుగుతున్న పోలీసులపై దొంగల ముఠా చొరబడి భయభ్రాంతులకు గురి చేసింది. చేతిలో పిస్తోలు పట్టుకుని తిరుగుతున్న పోలీసులను బెదిరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో కూడా నిక్షిప్తమయ్యాయి. గుర్తు పట్టలేని విధంగా మారువేషాల్లో వచ్చిన దొంగల ముఠా ఆయా కాలనీల్లో దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు గస్తీ తిరుగుతూ కనిపించడంతో బెదిరించారు. పోలీసులు కూడా ప్రతిఘటించడంతో దొంగల ముఠా పరారయ్యారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పంచమసాలిలపై లాఠీఛార్జి ఖండనీయం●అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ ఆందోళన చేస్తాం ● బసవజయ మృత్యుంజయ స్వామి వెల్లడి సాక్షి,బళ్లారి: పంచమసాలి సముదాయానికి 2ఏ రిజర్వేషన్ కల్పించాలని ఒత్తిడి చేస్తూ మళ్లీ పోరాటానికి సిద్ధం అవుతామని బసవజయ మృత్యుంజయ స్వామి పేర్కొన్నారు. బెళగావిలో ఈనెల 8వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మళ్లీ పెద్ద ఎత్తున జనంతో చేరి ఆందోళన చేస్తామన్నారు. డిసెంబర్ 10న మౌన ప్రతిఘటన చేస్తామన్నారు. పంచమసాలి సముదాయానికి 2ఏ రిజర్వేషన్ కల్పించాలని గత ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నామని గుర్తు చేశారు. పోరాటం చేసే వారిపై లాఠీఛార్జి, అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని తీవ్రంగా ఖండించారు. అక్రమంగా తరలిస్తున్న చౌక డిపో బియ్యం పట్టివేతరాయచూరు రూరల్: చౌకడిపోల ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యం అక్రమంగా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న సమయంలో వాటిని అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి యాదగిరి జిల్లా గురుమఠకల్లో అక్రమంగా లారీలో తరలిస్తున్న రూ.7 లక్షల విలువ చేసే 220 క్వింటాళ్ల బియ్యాన్ని ఆహార పౌర సరఫరాల శాఖ అధికారి అన్వర్ హుసేన్ ఆధ్వర్యంలో దాడి చేసి లారీతో సహా స్వాధీనం చేసుకున్నారు. వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య ● నిందితుని అరెస్టు సాక్షి,బళ్లారి: అన్యమతస్తుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళను తన మతంలోకి మారాలని ఒత్తిడికి గురి చేసి వేధించడంతో సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా గొణ్ణిగనూరు గ్రామంలో నాగవ్వ ఆనే మహిళ ఇతర మతానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగించడంతో ఆమెను తన మతంలోకి చేరాలని ఒత్తిడి చేసిన నేపథ్యంలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు, స్థానికులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు కారకుడైన ముక్తుంసాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ పరివర్తకాలు ఏర్పాటు చేయండిరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో రైతుల డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ పరివర్తకాల(ట్రాన్స్ఫార్మర్ల)ను ఏర్పాటు చేయాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేడీపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. తోటల పెంపకానికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ముందుండాలన్నారు. పీడీఓలు గ్రామాల్లో పర్యటించి సమస్యలపై స్పందించాలని సూచించారు. సమావేశంలో జిల్లాధికారి నితీష్, ఏసీ గజానన బళి, అధికారులున్నారు. లేబర్ కార్డుల పంపిణీ కోలారు: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సౌకర్యాలను అందిస్తోంది, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ షఫీ తెలిపారు. శనివారం నగరంలోని 22వ వార్డు కువెంపు నగర్లో ఆర్థిక సాక్షరతా కేంద్రం, జిల్లా మార్గదర్శి బ్యాంకు సహకారంతో లబ్ధిదారులకు లేబర్ కార్డులను అందజేశారు. కాంగ్రెస్ నేతలు రఫీ, ఖయ్యూం, పాషా, అలమీర్ జాన్, నదీం, ప్యారూ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా దొంగ అరెస్టు
కోలారు: దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా దొంగని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.10.7 లక్షల విలువ చేసే 88 గ్రాముల బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తాలూకాలోని భీమగానహళ్లి గ్రామానికి చెందిన మహిళ (35) నిందితురాలు. అక్టోబర్లో స్థానికుడు శ్రీనివాస్ ఇంటిలో బంగారు నగలు పోయినట్లు కామసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె ను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. డబ్బు మీద ఆశతో చోరీలు చేస్తున్నట్లు నిందితురాలు తెలిపింది. కాంగ్రెస్ నేత హత్య ● చిక్కమగళూరు జిల్లాలో ఘటన బనశంకరి: చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవలో గ్రామపంచాయతీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు గణేశ్గౌడ (38) హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి కల్కురుడేశ్వర వద్ద కారులో వెళ్తుండగా సంజయ్, మిథున్ అనే ఇద్దరు బైక్తో అడ్డుకుని కొడవలితో దాడిచేసి చంపారు. నిందితులు భజరంగదళ్ కార్యకర్తలని తెలిసింది. సఖరాయపట్టణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది. దుండగుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ విక్రమ్ ఆమ్టె తెలిపారు. ఇద్దరు నిందితులు కూడా ఆసుపత్రిలో చేరారని తెలిపారు. సంజయ్, భూషణ్, మిథున్తో పాటు ఐదుమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం: ఎమ్మెల్యే మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆనంద్ సందర్శించారు. ఎమ్మెల్యే ఆనంద్ బ్యానర్ తొలగింపు గురించి గొడవ జరిగి హత్యకు దారితీసిందని సమాచారం. కొద్దిరోజులుగా గణేశ్, మరో వర్గం మధ్య విభేదాలున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే హత్య జరిగేది కాదని ఎమ్మెల్యే ఆనంద్ ఆరోపించారు.అలరిస్తున్న గ్రామీణ మేళా బనశంకరి: రాజధానిలో రాజస్థాన్ గ్రామీణ మేళా నగరవాసులకు కనువిందు చేస్తోంది. బనశంకరి రెండో స్టేజ్ బనశంకరి మహిళా సమాజ భవనంలో మేళా సాగుతోంది. దేశంలో పేరుమోసిన చేనేత వస్త్రాలు, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్, గృహాలంకరణ సామగ్రి, ఆభరణాల వంటి అలంకరణ వస్తువులు ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ ప్రదర్శన 14వ తేదీ వరకు నిర్వహిస్తారు. పిల్ల పులి లభ్యంమైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా నాగరహొళె అభయారణ్యానికి ఆనుకుని ఉన్న గురుపుర టిబెటన్ కాలనీకి చెందిన జే.విలేజ్ వద్ద సుమారు 2– 3 ఏళ్ల వయస్సుగల ఆడ పులిపిల్లను అటవీ శాఖ సిబ్బంది పట్టుకుని కాపాడారు. పులి పిల్ల తిరుగుతోందని స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో వారు వచ్చి డ్రోన్ ద్వారా గాలించి పులిపిల్ల ఉన్న స్థలాన్ని కనుగొన్నారు. అటవీ శాఖ ఏసీఎఫ్ లక్ష్మీకాంత్, ఆర్ఎఫ్ఓ వినోద్గౌడ, డీఆర్ఎఫ్ఓ, అశోక్ శివకుమార్, వెంకటేష్ తదితరులు పులిపిల్లను క్షేమంగా పట్టుకున్నారు. దానిని అటవీ కార్యాలయానికి తరలించి పాలు, ఆహారం అందించారు. ఆ పిల్ల ఆరోగ్యంగా ఉంది. డ్రోన్ సహాయంతో తల్లి పులి కోసం గాలిస్తున్నట్లు ప్రాంత ఉప అటవీ సంరక్షణాధికారి తెలిపారు. -
కుర్చీ కలహం మరచి..
బనశంకరి: మహిళా రిజర్వేషన్ ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం ఎందుకు వాయిదా వేస్తోందని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. శనివారం హాసన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సమావేశం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కలిసి సిద్దరామయ్య పాల్గొన్నారు. ఇద్దరూ ఐక్యతను చాటుకునేలా అభివాదం చేశారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య ప్రసంగిస్తూ హాసన్కు తామేం చేశామో చెప్పాలని కేంద్రమంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. అసలు మండ్య జిల్లాకు కుమారస్వామి ఏమి చేశారో స్పష్టం చేయాలన్నారు. మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు తమ సర్కారు గ్యారంటీలతో పాటు అనేక పథకాలు అండగా మారాయని చెప్పారు. ప్రధాని మోదీ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ వసూళ్లలో నష్టం వస్తోంది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు తగ్గాయని విమర్శించారు. ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఎన్నికల సమయంలో 492 హామీలు ఇచ్చామని, ఇప్పటివరకు 242 హామీలను నెరవేర్చామని చెప్పారు. ఇప్పటివరకు 600 కోట్ల సార్లు మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. జిల్లాలో హేమావతి జలాశయం కింద 700 ఎకరాల స్థలం ఉంది, అక్కడ ఉద్యానవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బేలూరు– హళేబీడు, శ్రావణ బెళగొళలో ఉద్యానవనాల స్థాపనకు కృషి చేస్తామని తెలిపారు. అంబేడ్కర్తోనే సామాజిక న్యాయం డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ మహోన్నత వ్యక్తి. దేశం గర్వించదగ్గ ఒక అపురూప నేత. దళితులకు మాత్రమే కాకుండా అన్నివర్గాలకు గౌరవం తీసుకురావడంతో పాటు పీడనకు గురైనవారి కోసం పోరాడారని సీఎం సిద్దరామయ్య తెలిపారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం విధానసౌధ ఆవరణలోని ఆయన విగ్రహానికి సీఎం సిద్దు, ఏఐసీసీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. కుర్చీ కలహాలు అన్నీ మరిచిపోయినట్లు కనిపించారు. మనువాది కుమారస్వామి కేంద్రమంత్రి హెచ్డీ.కుమారస్వామిపై సీఎం సిద్దరామయ్య ధ్వజమెత్తారు. భగవద్గీత ను పాఠ్యాంశంలోకి చేర్చాలని కుమారస్వామి కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు లేఖ రాశారు, బీజేపీతో పొత్తు తరువాత ఆయన మనువాదిగా మారారు అని మండిపడ్డారు. వాచీ ధరిస్తే గొడవెందుకు? ● బీజేపీపై డిప్యూటీ సీఎం విసుర్లు రాష్ట్ర రాజకీయాల్లో గడియారాల గొడవ జోరందుకుంది. ఖరీదైన తన కార్టియర్ వాచ్ మీద బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడంపై డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మరోసారి మండిపడ్డారు. నగరంలో స్పందిస్తూ నాకు ఎన్ని వాచీలైనా ధరించే శక్తి ఉంది. నేను వెయ్యి రూపాయల వాచీ కడతా, రూ.10 లక్షల వాచీ ధరిస్తా, నా జీవితం ఏమిటనేది బీజేపీ నేతలకు తెలుసు అన్నారు. ఎవరు ప్యాంట్ వేసుకుంటారు, వాచీ ఎవరు కడతారు, ఎవరు కళ్లద్దాలు పెట్టుకుంటారు అనేది అవసరమా? అది వారి వ్యక్తిగత విషయం. కొందరు రూ.వెయ్యి షూ ధరిస్తారు. మరికొందరు రూ.లక్ష విలువైన షూ వేస్తారు అని చెప్పారు. మేకెదాటు ప్రాజెక్టు అమలైతే ప్రజలకు తాగునీరు అందుతుంది. మండ్య, మైసూరు ప్రాంత ప్రజలకు కష్టకాలంలో నీరు లభిస్తుందని చెప్పారు. దేవుడు వరమో, శాపమో ఇవ్వడు, కేవలం అవకాశం ఇస్తాడు, దానిని మనం ఎలా ఉపయోగించుకున్నాం అనేది ముఖ్యమని అన్నారు. కాగా, ఆయన కార్టియర్ వాచ్తోనే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హాసన్లో జరిగిన బహిరంగ సభలో సీఎం సిద్దు, డీసీఎం శివ అభివాదం బెంగళూరులో అంబేడ్కర్ వర్ధంతి సందర్శంగా ఖర్గేతో కలిసి నివాళులు సభలు, సమావేశాల్లో సీఎం సిద్దు, డీసీఎం శివ ఉమ్మడిగా హాజరు హాసన్లో భారీ సభ మహిళా రిజర్వేషన్ల కోసం కేంద్రానికి సీఎం డిమాండ్ -
రెండు మూడు నెలల కిందటే టికెట్ను బుక్ చేసుకున్నారు. చాలామందికి అత్యవసర పనులే. తీరా విమానాశ్రయానికి వచ్చాక ఫ్లైట్ క్యాన్సిల్ అనే జవాబు వినిపించింది. ఇక ప్రయాణికుల పాట్లు చెప్పనలవి కాదు.
నిలిచిపోయిన ఇండిగో విమానాలుఇతర విమానాలు, ప్రైవేటు బస్సుల్లో మోత దొడ్డబళ్లాపురం: సిలికాన్ సిటీలోని కెంపేగౌడ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. నిత్యం రచ్చ రచ్చ అవుతోంది. ఇండిగో విమానాల సంక్షోభమే దానికి కారణం. తాజాగా శనివారం కూడా 32కు పైగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు లబోదిబోమన్నారు. ఇళ్లకు తిరిగి వెళ్లలేక, అక్కడే ఉండలేక నరకయాతన పడ్డారు. బస్టాండు కంటే అధ్వానం ● ప్రయాణికులు భారీగా చిక్కుకుపోవడంతో అంతర్జాతీయ విమానాశ్రయం సాధారణ బస్టాండును తలపించింది. ప్రయాణికులు అలసిపోయి ఎక్కడబడితే అక్కడ పడుకుని సేదతీరుతున్న దృశ్యాలు కనిపించాయి. ● ఇండిగో కౌంటర్లలో సిబ్బంది ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తున్నారని ప్రయాణికులు ఆరోపించారు. కొందరు కోపం పట్టలేక కొట్లాటకు దిగారు. ఎటుచూసినా కోలాహలం కనిపిస్తోంది. ● వృద్ధ మహిళలు, పిల్లల తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, మంచినీటి వసతి లేదు, కొందామంటే వాటి ధరలు వేల రూపాయల్లో ఉంటున్నాయని చెప్పారు. ● పగవారికి కూడా ఇలాంటి బాధలు వద్దనేలా పరిస్థితి ఉంటోంది. అనేకమంది ప్రయాణికులు తమ గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకున్నారు. ● నా జీవితంలో ఇలాంటి దుస్థితిని చూడలేదని ఓ ప్రయాణికుడు చెప్పారు. పరీక్షలకు, ఇంటర్వ్యూలకు, అత్యవసర కుటుంబ పనుల మీద వెళ్లేవారు తీవ్ర ఆవేదన చెందారు. ● ఘర్షణలు జరగకుండా ఎయిర్పోర్టులో భద్రతను పెంచారు. ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ఇతర ఎయిర్లైన్స్ విమానాల టికెట్ల ధరలతో పాటు ప్రైవేటు బస్సుల చార్జీలు కూడా అమాంతం పెరిగాయి. బాధిత ప్రయాణికులు అనేకమంది బస్సుల్లో ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో బెంగళూరు నుంచి వెళ్లే ప్రైవేటు బస్సుల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉదాహరణకు బెంగళూరు నుంచి ముంబైకి బస్ టికెట్ ధర రూ.1500 నుంచి రూ.2,500 ఉండగా ఇప్పుడు రూ.4,500 నుంచి రూ.10వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇతర నగరాలకు కూడా ధరలు భగ్గుమంటున్నాయి. రెండు విధాలా దోపిడీకి గురవుతున్నట్లుప్రయాణికులు వాపోయారు. బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో తగ్గని గందరగోళం ఇష్టానుసారం ఇండిగో విమానాల క్యాన్సిల్ ప్రయాణికులకు తీవ్ర అవస్థలు -
ప్రాణం తీసిన పొగ మంచు
కనగానపల్లి: యువతిని పొగమంచు బలితీసుకుంది. ఈ విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో 44వ జాతీయ రహదారిలో జరిగింది. వివరాలు.. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్కు చెందిన రాళ్లపలి ధర్మరావు, కుష్మా దంపతుల కుమార్తె రాళ్లపల్లి వినీల (35) సైకాలజీలో పీహెచ్డీ పూర్తి చేసింది. బెంగళూరులో ఉద్యోగ అన్వేషణలో ఉంది. శనివారం తెల్లవారుజామున బెంగళూరులో బంధువుల ఇంటిలో ఉన్న స్కూటర్ను తీసుకొని హైదరాబాద్ కు బయల్దేరింది. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామ సమీపంలో పది మీటర్ల దూరంలో ఏముందనేది కూడా తెలియని విధంగా మంచు కప్పేసింది. ఈక్రమంలో రోడ్డు పక్కన ఉన్న ఇనుప కమ్మీలను ఆమె ఢీకొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో వినీల తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మరణించింది. కనగానపల్లి పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు స్కూటర్లో పయనం హైవే పక్కన ఇనుప కమ్మీలను ఢీకొని యువతి దుర్మరణం -
తేడా భర్త.. పరీక్షలకు వెళ్తే పరారీ
దొడ్డబళ్లాపురం: సంసారం చేయడం లేదు, అలాగే పురుషత్వ పరీక్షకు ఒప్పుకోకుండా పరారైన భర్త ఉదంతం నెలమంగలలో జరిగింది. బెంగళూరు హెసరఘట్ట నివాసి అయిన యువతి (26)కి, నెలమంగలకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అయిన వరునితో (30) గత జూన్ 9న వివాహం జరిగింది. మొటి రాత్రే భర్త అంటీముట్టనట్టుగా ప్రవర్తించినా, గొడవ కాకూడదని ఆమె అలాగే సంసారం నెట్టుకొస్తోంది. ఆరు నెలలు గడిచినా నెల తప్పలేదని అత్తమామలు ఆమెను వేధించడంతో ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంది. అన్ని రిపోర్టులు మామూలుగా వచ్చాయి, అయితే భర్త మాత్రం పురుషత్వ పరీక్ష అనగానే ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. భర్త చేత పురుషత్వ పరీక్ష చేయించాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంసారం చేయడం లేదని అడిగినందుకు అదనపు కట్నం పేరుతో భర్త, అత్తమామలు వేధిస్తున్నారని కూడా ఫిర్యాదులో తెలిపింది. పోలీసులకు భార్య ఫిర్యాదు -
వైభవంగా సిద్ధలింగేశ్వర జాతర
రాయచూరురూరల్: రాయచూరు తాలుకా మన్సలాపూర్లో సిద్ధలింగేశ్వర స్వామి జాతర వైభవంగా జరిగింది. వందలాది భక్తుల సమక్షంలో సిద్ధలింగేశ్వర స్వామిని రథంపై కొలువుంచారు. కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సుల్తాన్ పురశంభు సోమనాథ శివాచార్యుల పూజల అనంతరం రథం లాగారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వీరభద్రేశ్వర స్వామి జాతర రాయచూరురూరల్: నగరంలోని నేతాజీ నగర్లో వీరభద్రేశ్వర స్వామి జాతర, రథోత్సవం వైభవంగా జరిగాయి. వందలాది భక్తుల సమక్షంలో అభినవ రాచోటి శివాచార్యులు దేవాలయాల్లో విశేష పూజలు చేశారు. అనంతరం రథంపై స్వామిని కొలువుంచి లాగారు. కార్యక్రమంలో నగర సభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, రాచయ్యస్వామి, రవికుమార్, సావిత్రి పురుషోత్తం పాల్గొన్నారు. -
పకడ్బందీగా టెట్ పరీక్ష
హొసపేటె: ఉపాధ్యాయ అర్హత పరీక్ష పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు జిల్లా కలెక్టర్ ఇ.బాలకృష్ణ ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 7వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణ సన్నాహక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 7న తొలి సెషన్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఐదు పరీక్ష కేంద్రాలలో 2,128 మంది అభ్యర్థులు, రెండో సెషన్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు 19 పరీక్షా కేంద్రాలలో 6,570 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రంలో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పర్యవేక్షణ అధికారులు, సిబ్బంది సమయానికి హాజరుకావాలన్నారు. పర్యవేక్షకులు స్వయంగా కేంద్రాలను సందర్శించి లోపాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మూడు, నాలుగు కేంద్రాలకు రూట్ అధికారి ఉండాలని, ప్రతి కేంద్రంలో పోలీసులను మోహరించి అన్ని విధాలా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ జి.మంజునాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రామచంద్రప్ప, సిబ్బంది పాల్గొన్నారు.


