breaking news
Karnataka Latest News
-
తల్లీబిడ్డల మరణాలు నియంత్రించాలి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో తల్లీబిడ్డల మరణాల రేటు నియంత్రించాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఈశ్వర్ కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. నవోదయ దంత వైద్యకీయ, ఏఏంఈఎస్ దంత కళాశాలతో ఒప్పందాలు కుదర్చుకోవడం జరిగిందన్నారు. తల్లీబిడ్డల మరణాల రేటు నేడు 15 శాతం అయిందని పేర్కొన్నారు. ఏడుగురు వైద్యులను ఇతర చోటికి బదిలీ చేయాలని ఆదేశాలు వచ్చినా.. పనుల నిమిత్తం వారిని విధుల్లో కొనసాగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఆర్సీహెచ్ అధికారిణి నందిత, విజయ్ శంకర్, ప్రవీణ్ కుమార్, ఆరతి, శివ మానప్ప, అనిల్, గణేష్, శివకుమార్, శాకీర్, ఈశ్వర్, బసయ్య పాల్గొన్నారు. -
ఇలలో వైకుంఠ వైభవం
బనశంకరి: రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ దేవస్థానాలు మంగళవారం గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేంకటేశ్వర స్వామి ఆలయాలను వివిధ పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణ చేపట్టడంతో ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే దేవస్థానాల్లో ఆలయ అర్చకులు వేంకటేశ్వరుడి మూలవిరాట్లకు ప్రత్యేక అలంకరణ చేపట్టి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామి దర్శనం కోసం బారులు తీరారు. బెంగళూరు వయ్యాలికావల్ టీటీడీ దేవస్థానంలో రాత్రి 1:30 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించారు. మంగళవారం రాత్రి 12 గంటల వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కోలాహలం భక్తులు భారీ ఎత్తున స్వామి దర్శనానికి తరలిరావడంతో కోలాహలం నెలకొంది. రాజాజీనగరలోని వేంకటేశ్వర దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. 5వ బ్లాక్లోని కై లాస వైకుంఠ మహాక్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజాజీ నగర ఇస్కాన్ దేవస్థానంలో వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక భజనలు చేశారు. తెల్లవారు జామున శ్రీనివాస గోవింద, మహాభిషేకం, రాధాకృష్ణ పల్లకీ దర్శనం, వైకుంఠ ద్వారపూజ, కళ్యాణోత్సవం, వివిధ పూజా కార్యక్రమాలు చేపట్టారు. కామాజీపాళ్య వృషభావతి లక్ష్మీవేంకటేశ్వర దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్ధరాత్రి నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మీలేఔట్ శ్రీనివాస దేవస్థానానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని వైకుంఠ ద్వారంలో ప్రవేశించారు. ఇస్కాన్ ఆలయంలో వైకుంఠ ద్వారంలో ప్రవేశిస్తున్న భక్తులు మార్మోగిన గోవింద నామస్మరణ ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకఆలయాల్లో ప్రత్యేక పూజలు చామరాజపేటె కోటె వేంకటరమణ స్వామి దేవస్థానం, మాగడి రోడ్డు ఎంజీ రైల్వే కాలనీ వినాయక వేంకటేశ్వరస్వామి దేవస్థానం, జేపీ నగర తిరుమలగిరి లక్ష్మీవేంకటేశ్వర స్వామి, పద్మనాభనగర దేవగిరి వరప్రసాద వేంకటేశ్వర దేవస్థానాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని వైకుంఠ ద్వారంలో ప్రవేశించి మొక్కులు చెల్లించుకున్నారు. నెలమంగలలో సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి రంగనాథ దేవస్థానంలో ఉత్తర ద్వారం, వైకుంఠ ద్వారం గుండా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర దేవస్థానాలు భక్తులతో సందడిగా మారాయి. అర్ధరాత్రి నుంచి దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. వివిధ దేవస్థానాల వద్ద భక్తులకు తీర్థప్రసాదాలు, లడ్డూ వితరణ చేశారు. -
భక్తిశ్రద్ధలతో గంధం ఊరేగింపు
రాయచూరు రూరల్: యరగేర బడేసాబ్ దర్గా ఉరుసులో భాగంగా సోమవారం రాత్రి భక్తిశ్రద్ధలతో గంధం ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాను ప్రత్యేకంగా అలంకరించారు. నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో హరిశ్చంద్ర రెడ్డి, జనార్దన రెడ్డి, వెంకటరామిరెడ్డి, విద్యానంద రెడ్డి, రాకేష్ రెడ్డి, మోహబూబ్ పటేల్, ఫారూక్, జాముద్దీన్, హఫీజూల్లా, క్రిష్ణాజి, నాగరాజు నాయక్, మహదేవ్, వెంకటేష్, రాము, హరి, మలంగ్ పాల్గొన్నారు. ఘనంగా సువర్ణ వాహిని వార్షికోత్సవం బళ్లారి టౌన్: స్థానిక పత్రికా భవనంలో మంగళవారం సువర్ణ వాహిని స్థానిక దినపత్రిక నాలుగో వార్షికోత్సవం సంపాదకుడు రవి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా న్యాయమూర్తి రాజేష్ హొసమని మాట్లాడుతూ.. వార్తలను నిష్పక్షపాతంగా రాసి ప్రజల విశ్వాసాన్ని పొందాలని విలేకరులకు సూచించారు. కార్యక్రమంలో బీహెచ్ఓ యల్లా రమేష్ బాబు, జిల్లా సర్జన్ బసిరెడ్డి, సమాచార శాఖ గురురాజ్, నిష్టి రుద్రప్ప, బసప్ప పాల్గొన్నారు. ఏళ్ల సమస్యకు పరిష్కారంబళ్లారి అర్బన్: వీణివీరాపుర గ్రామం మహాయోగి వేమన పీఠం వద్ద ప్రజల కోరిక మేరకు ఏర్పాటు చేసిన బస్టాప్ బోర్డును మంగళవారం బళ్లారి ఆర్టీసీ డివిజన్ ట్రాఫిక్ అధికారి బి.చామరాజ ప్రారంభించారు. వేమన పీఠం గౌరవ అధ్యక్షుడు గణపాల్ ఐనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఇందుకు సహకరించిన సంబంధిత ఆర్టీసీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. బస్సులు ఇక్కడ ఆపడం వల్ల విద్యార్థులు, యోగి వేమ పీఠాన్ని సందర్శించే రెడ్డి తదితరులకు చాలా అనుకూలమన్నారు. గణపాల్ గోవింద రెడ్డి జ్ఞాపకార్థం బస్ సెంటర్ నిర్మిస్తామన్నారు. కర్ణాటక రెడ్డి జన సంఘం బెంగళూరు వారు రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో శివప్రసాద్, సంజీవ్ రెడ్డి, శేషరెడ్డి, హనుమంత రెడ్డి, బసవరాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వద్దుకోలారు: పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సౌకర్యాలను అందించాలని జిల్లాధికారి ఎం.ఆర్ రవి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ భవనంలో ప్రధాని 15 అంశాల కార్యక్రమాలపై ప్రగతి పరిశీలన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మైనారిటీల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. -
రక్తమోడిన రహదారులు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. మంగళవారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందడంతో ఆయా కుటుంబాలను విషాదం కమ్మేసింది. సిమెంటు లారీ బోల్తాపడి చిన్నారి... బెళగావి జిల్లా రాయభాగ తాలూకా హలశిరగూరు గ్రామం వద్ద చిన్నారులు స్కూల్కు కాలి నడకన వెళ్తుండగా కుడచి నుంచి హారోగేరి వైపు వెళ్తున్న సిమెంటు లారీ మలుపులో అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. అమిత్ కాంబళె(11) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా అంజలి కాంబళె(15), అవినాశ్ కాంబళె(14) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు కలిసి కార్యాచరణ జరిపి క్రేన్ సాయంతో లారీని పైకి తీశారు. లారీ చక్రాల కింద చిక్కుకుని ఇద్దరు... ధారవాడ శివారులోని జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ధారవాడ పట్టణ నివాసులైన కిషన్(30), కిరణ్(32) అనే వ్యక్తులు మృతి చెందారు. వీరిద్దరూ బైక్పై వెళ్తుండగా యరికొప్ప గ్రామం వద్ద లారీ ఢీకొంది. దీంతో ఇద్దరూ లారీ చక్రాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందారు. ధారవాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చెట్టును ఢీకొన్న బస్సు–చిన్నారి మృతి శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకా హులికల్ ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడాదిన్నర వయసున్న చిన్నారి మృతి చెందింది. మంగళవారం తె ల్లవారుజామున దావణగెరె నుంచి మంగళూరు బయల్దేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హులికల్ ఘాట్ వద్దకు రాగానే అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో ఒకటిన్నర ఏడాది వయసున్న చిన్నారి మృతిచెందగా 10మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో శరీఫాబి, ఇమామ్ సాబ్, శబానాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం ధ్వంసమైంది. మూడు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి మృతుల్లో ఇద్దరు చిన్నారులు -
బైకిస్టు అనుమానాస్పద మృతి
మైసూరు: బైకిస్టు అనుమానాస్పద స్థితిలో సజీవదహనమయ్యాడు. ఈఘటన మైసూరు జిల్లా నంజనగూడులో జరిగింది. నంజనగూడు తాలూకా రాంపూర్ నివాసి ఆదిత్య (24) మంగళవారం తన ఇంటినుంచి బైక్లో బయల్దేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కాని కోరహుండి వెళ్లే మార్గంలో హుల్లహళ్లి కాలువ సమీపంలో సజీవదహనమయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో నంజనగూడు పోలీసులు వచ్చి పరిశీలించారు. ఆదిత్య మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇంజిన్లో మంటలు చెలరేగి ఆదిత్య మృతి చెందినట్లు కొందరు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదంటున్నారు. మంటలు చెలరేగి ఉంటే తప్పించుకొని వెళ్లేవాడని చెబుతున్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హత్య చేసి ఉండవచ్చని, ఆ కోణంలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రూ.2 వేలు జమ
యశవంతపుర: గ్యారంటీ పథకంలో భాగంగా ప్రభుత్వం అమలు చేసే గృహలక్ష్మి యోజన కింద ప్రతినెల మహిళలకు అందించే రూ.2వేల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. కొంతకాలంగా మహిళలకు నిధులు జమ కావడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో 24వ కంతు రూ.2వేలను మహిళల ఖాతాలకు జమ చేశారు. పీజీలో పేలుడు.. టెక్కీ మృతిబనశంకరి: పీజీ వంటగదిలో సిలిండర్ పేలి టెక్కీ మృతిచెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కుందలహళ్లి కాలనీ బ్రూక్ఫీల్డ్ రోడ్డులో సెవెన్హిల్స్ శ్రీసాయి పీజీ ఉంది. ఇక్కడ 52 మంది నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి వంటగదిలో గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. దీంతో పీజీలో ఉన్న యువకులు బయటకు పరుగులు తీశారు.పేలుడుధాటికి పీజీ కట్టడం గోడలు బీటలుబారాయి. ప్రమాదంలో బళ్లారికి చెందిన అరవింద్(23) అనే టెక్కీ మృతి చెందగా వెంకటేశ్, విశాల్వర్మ, సీవీ.గోయల్ అనేవారు గాయపడ్డారు. హెచ్ఏఎల్ పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడు అరవింద్ క్యాప్జెమినీలో సీనియర్ అనలిస్ట్గా పని చేస్తున్నాడు. ఎమ్మెల్యే వీరేంద్ర పప్పికి బెయిల్బనశంకరి: అక్రమనగదు బదిలీ కేసులో జైలుపాలైన చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్రపప్పికి బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్రమనగదు బదిలీకేసులో వీరేంద్రపప్పిని ఈడీ అధికారులు ఈ ఏడాది ఆగస్టు 23న సిక్కింలో అరెస్ట్చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా మంగళవారం విచారణ జరిగింది. వాదప్రతివాదనలను ఆలకించిన కోర్టు ఎమ్మెల్యే వీరేంద్రపప్పికి బెయిల్ మంజూరు చేసింది. లోకాయుక్తకు చిక్కిన పీపీ దొడ్డబళ్లాపురం: రూ.25వేలు లంచం తీసుకుంటూ ప్రభుత్వ న్యాయవాది(పబ్లిక్ ప్రాసిక్యూటర్)లోకాయుక్తకు చిక్కిన సంఘటన కలబుర్గిలో చోటుచేసుకుంది. కలబుర్గి పట్టణంలోని రెండవ పీడీజే కోర్టులో ప్రభుత్వ పీపీగా రాజమహేంద్ర విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కందనులి గ్రామానికి చెందిన నవీన్ అనంతయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన కుల నింద కేసును రాజమహేంద్ర వాదిస్తున్నారు. కేసు గెలిచేలా వాదించడానికి రాజమహేంద్ర రూ.50 వేలు లంచం అడిగాడు. తొలుత రూ.20 వేలు ఇచ్చిన నవీన్.. ఆ తర్వాత లోకాయుక్తను ఆశ్రయించాడు. పథకం ప్రకారం నవీన్ రూ.25వేలు అందజేస్తుండగా లోకాయుక్త డీఎస్పీ శీలవంత ఆధ్వర్యంలో అధికారులు దాడి చేశారు. పీపీ రాజమహేంద్రను అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. వేకువ జాము వరకు మెట్రో సంచారం యశవంతపుర: కొత్త సంవత్సరంలో భాగంగా బెంగళూరు నగరంలో బీఎంఆర్సీఎల్, బీఎంటీసీ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీ బుధవారం అర్ధరాత్రి నుంచి జనవరి 1న తెల్లవారు జామున 3:10 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. సొరంగం, గ్రీన్ మార్గాల్లో రైలు సంచారాన్ని విస్తరించారు. బుధవారం రాత్రి సామాన్య ట్రిప్పులు ముగిసిన తరువాత ఈ సేవలను విస్తరించినట్లు బీఎంఆర్సీఎల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వైట్ఫీల్డ్ నుంచి చల్లఘట్ట వరకు రాత్రి 1:45 గంటల వరకు, చల్లఘట్ట నుంచి వైట్ఫీల్డ్ వరకు రాత్రి 2 గంటల వరకు, ఆర్వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు జనవరి 1న తెల్లవారు జామున 3:10 గంటల వరకు మెట్రో రైళ్ల సంచారం ఉంటుంది. బొమ్మసంద్ర నుంచి ఆర్వీ రోడ్డు వరకు రాత్రి 1:30 గంటల వరకు మాత్రమే మెట్రో సంచారం ఉంటుంది. గ్రీన్, సొరంగ మార్గంలో ప్రతి 8 నిమిషాలకు ఒక రైలు సంచరించనుంది. ఎంజీ రోడ్డు మార్గంలో భారీ జనసంచారం ఉండే అవకాశం ఉన్నందున బుధవారం రాత్రి 10 గంటలకు ఎంజీ రోడ్డు మెట్రో స్టేషన్ను మూసివేయనున్నట్లు బీఎంఆర్సీఎల్ తెలిపింది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
హుబ్లీ: హుబ్లీ కార్వార రోడ్డు అంచటగేరి వద్ద మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో తండ్రి, బిడ్డ మృతి చెందారు. వివరాలు.. తడస నివాసి మెహబూబ్ ఖాన్ తన కుమార్తెలు అయిన అస్ల్మెన్, అజీజాతో కలసి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. హుబ్లీ నుంచి తడసకు వెళ్తున్న క్రమంలో మెహబూబ్ ముందు వెళ్తున్న బస్సును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే అకస్మాత్తుగా బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో మెహబూబ్ ఖాన్ (36) అస్ల్మెన్ (2) అక్కడికక్కడే మృతి చెందారు. అజీజా తీవ్రంగా గాయపడటంతో కేఎంసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పిల్లల వార్డు విభాగం హెచ్ఓడీ విలేకరులకు తెలిపారు. 2 నుంచి అంబామఠ ఉత్సవాలు రాయచూరు రూరల్: సింధనూరు తాలూకా అంబామఠంలో జనవరి 2 నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సింధనూరు శాసన సభ్యుడు హంపన గౌడ బాదర్లి వెల్లడించారు. మంగళవారం సింధనూరు పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 3వ తేదీన ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్ వస్తున్నట్లు తెలిపారు. సింధనూరులో రూ.400 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారని వెల్లడించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన అంబాదేవి ఉత్సవాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. జానపద జాతర, నృత్యం, హాస్య సంజె, దేవి పల్లకీ సేవ, నాటకాలు, కుంభోత్సవం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ అరుణ్ దేశాయి, టీపీఈఓ చంద్రశేఖర్, ఖాజీ, మాలిక్ పాల్గొన్నారు. -
ముక్కోటి ఏకాదశి శోభ
సాక్షి బళ్లారి: నగర వ్యాప్తంగా మంగళవారం ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. సంగం సర్కిల్, కూల్కార్నర్ సమీపంలో, రామేశ్వర కాలనీ, రూపనగుడిలోని వేంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా దేవాలయాలు వద్ద ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు బారులుదీరి స్వామిని దర్శించుకున్నారు. ఆలయాలు శ్రీనివాస గోవిందా.. శ్రీ వెంకటేశా గోవిందా, భక్తవత్సల గోవిందా నామస్మరణతో మార్మోగిపోయాయి. ఆలయాల వద్ద భక్తులకు ప్రసాదం అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. రాయచూరు రూరల్: నగరంలోని నవోదయ కాలనీలో వెలసిన వేంకటేశ్వర ఆలయంలో కల్యాణ, పుష్పయాగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ వేంకటేశ్వరాలయంలో నారాయణపేట మాజీ శాసన సభ్యుడు రాజేంద్ర రెడ్డి దంపతులు పూజలు చేయించారు. అలాగే ఉప్పార వాడిలో వెలసిన వేంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. సాయంత్రం విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించిన అనంతరం రథోత్సవం నిర్వహించారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠంలో వైకుంఠ ఏకాదశి కోలాహలం నెలకొంది. మఠాధిపతి సుబుదేంద్ర తీర్థ ఊంజల సేవలు, మంగళ హరతి తదితర పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలసి రథోత్సవం నిర్వహించారు. క్రిష్ణగిరి కాలనీలో ఇస్కాన్ మందిరంలో వేంకటేశ్వరుడికి రాదేశ్యాం పూజలు చేపట్టారు. పెరిగిన భక్తుల రద్దీ.. హొసపేటె: అమరావతిలో వెలసిన వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుని తరించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయ అర్చకులు స్వామికి పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు చేపట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ శెట్టి మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి భక్తుల రద్దీ పెరిగిందని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జాహ్నవి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులకు పంచేందుకు 13 వేల లడ్డూలు తయారు చేశామన్నారు. భక్తుల సందడి.. హుబ్లీ: దావణగెరెలో మూడు కిలోమీటర్ల మేర భక్తులు బారులుదీరి లక్ష్మీ వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఎంసీసీ బీ బ్లాక్లోని లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం భక్త సమూహంతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకుడు మురారీ ఆచార్య మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువును పూజించే సంప్రదాయం ఉందన్నారు. వైకుంఠ ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఆలయాల్లో మార్మోగిన వేంకటేశ్వరుడి నామస్మరణ స్వామి దర్శనానికి బారులు దీరిన భక్తులు ఆలయాల వద్ద అన్నదానం -
జ్ఞాన సముపార్జనకు ప్రతిభా కారంజీలు శ్రేష్టం
రాయచూరు రూరల్: విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు ప్రతిభా కారంజీలు శ్రేష్టమని సీనియర్ కవయిత్రి శీలాదాస్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ప్రైవేట్ పాఠశాల్లో దక్షిణ డివిజన్ ప్రతిభా కారంజీ 2025–26 ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థిలను ఉద్దేశించి మాట్లాడారు. నేటి పోటీ యుగంలో చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలన్నారు. జ్ఞానం పొంది విద్యను అభ్యసించాలని సూచించారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఉందని తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభలను వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు అవసరమని వెల్లడించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రావుత్ రావ్, సుగుణ, బసవరాజ్, హీరాలాల్, విజయ లక్ష్మి, యశోద, శ్రీదేవి, బిందు, వైశాలి, మారెప్ప, అనసూయ, దేవేంద్రప్ప, చెన్నమ్మ పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో అలసత్వం తగదు
రాయచూరు రూరల్: అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహించడం తగదని దమనిత సేవా సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. దమనిత సేవా సమితి అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ.. రాయచూరు నగరంలోని పర్యాటక శాఖ అధికారులు విధులకు గైర్హాజరు అవుతున్నారని తెలిపారు. ఇష్టమొచ్చినప్పుడు విధులకు వస్తూ పని చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సువర్ణ, నరసింహులు, శివ శంకర్, సుశీల్, పరశురాం, అశోక్, జావిద్ రాజు తదితరులు పాల్గొన్నారు. కన్నడ భాషకు కువెంపు సేవలు భేష్ రాయచూరు రూరల్: జాతీయ కవి కువెంపు కన్నడ భాషకు చేసిన సేవలు ఎనలేనివని అని కన్నడ జిల్లా సాహిత్య పరిషత్ కార్యదర్శి దండెప్ప బిరాదార్ కొనియాడారు. సోమవారం రాయచూరు తాలూకా ఉడుమ్గల్ ఖానాపూర్ ప్రభుత్వ హైస్కూల్లో కువెంపు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలసి కువెంపు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కువెంపు కన్నడలో చేసిన రచనలతో కన్నడ భాషకు జ్ఞానపీఠ అవార్డు రావడానికి ప్రధాన కారకుడని వివరించారు. కార్యక్రమంలో వీణ, శివలీల, పద్మావతి, సావిత్రి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కట్టడాల తొలగింపునకు శ్రీకారం రాయచూరు రూరల్: నగరంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించుకున్న కట్టడాల తొలగింపునకు నగర సభ అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం మావిన చెరువు వద్ద ఉన్న అక్రమ కట్టడాలలను జేసీబీతో ధ్వంసం చేశారు. గతంలో 80 అడుగులు ఉన్న రహదారిలో 30 అడుగులు ఆక్రమించి నిర్మించుకున్న కట్టడాలు, దుకాణాలు, ఇళ్లను తొలగించనున్నారు. అక్రమంగా భవనాలు నిర్మించుకున్న వారికి 15 రోజుల ముందుగానే నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ జుబీన్ మహాపాత్రో వెల్లడించారు. అయ్యప్ప భక్తులకు భోజన వసతిరాయచూరు రూరల్: సిరవార తాలూకా కవితాళలో కరీంసాబ్ తన నివాసంలో అయ్యప్ప మాలధారులకు భోజన వసతి కల్పించారు. మైనార్టీలు అయ్యప్ప స్వామి భక్తులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడంపై స్థానికులు అభినందించారు. హిందూ, ముస్లింలు అనే తేడా చూపకుండా మనుషులంతా ఒక్కటే అని కరీంసాబ్ నిరూపించారు. వైద్య కళాశాల ఏర్పాటు చేయాలిరాయచూరు రూరల్: విజయపురలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కార్యకర్త లలిత డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రజలతో కలసి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య కళాశాల ఏర్పాటు విషయంలో జిల్లాలోని మంత్రులు, శాసన సభ్యులు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్ ఆధ్వర్యంలో వైద్య కళాశాలల నిర్వహణకు మంత్రి ఎంబీ.పాటిల్, శాసన సభ్యుడు బసన గౌడ పాటిల్యత్నాల్ ముందుకు రావడం సరికాదన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల విషయంలో జిల్లాలోని మంత్రులు, శాసన సభ్యులు పదవులకు రాజీనామాలు చేసి ఆందోళనకు మద్దతు పలకాలని సూచించారు. -
కేఎంసీ ఆస్పత్రిపై లోకాయుక్త దాడి
హుబ్లీ: స్థానిక కేఎంసీ పరిశోధన కేంద్రం ఆస్పత్రిపై లోక్తాయుక్త పోలీసులు మంగళవారం దాడి చేసి రికార్డులను క్షుణంగా పరిశీలించారు. ఆస్పత్రిలో ఔషధాలను బయటకు రాసి ఇస్తున్నారన్న ఆరోపణలతో పాటు ఓ వ్యక్తి ఇంజక్షన్ కోసం అవస్థలు పడిన వీడియో ఇటీవల సామాజిక మాద్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని ఉప లోకాయుక్త న్యాయమూర్తి ఫణీంద్ర ఆదేశించారు. దీంతో ధార్వాడ జిల్లా లోక్తాయుక్త ఎస్పీ సిద్దలింగ నేతృత్వంలో అధికారులు కేఎంసీ పరిశోధన కేంద్రం ఆస్పత్రిపై దాడి చేశారు. ఆయా విభాగాల్లోని రికార్డులను క్షుణంగా పరిశీలించారు. లోక్తాయుక్త ఎస్పీ మాట్లాడుతూ.. 12 బృందాలుగా ఏర్పడి 40 మంది సిబ్బందితో రోగుల నుంచి వివరాలు సేకరించి స్వచ్ఛంధ కేసు దాఖలు చేసుకున్నామన్నారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ హొసమని మాట్లాడుతూ.. రాష్ట్ర డిప్యూటీ లోక్తాయుక్త ఆదేశాల మేరకు జిల్లా లోకయుక్త అధికారులు ఆస్పత్రి వివిధ విభాగాల్లో రికార్డులు పరిశీలించారని తెలిపారు. వారికి అవసరమైన వివరాలు ఇవ్వడానికి సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. అధికారుల దర్యాప్తునకు అన్ని విధాలా సహకరిస్తామని వెల్లడించారు. -
బంగ్లాదేశీయులను తరిమేస్తాం
సాక్షి బళ్లారి: నగరంలోని కౌల్బజార్ ప్రాంతంలో అక్రమంగా వచ్చి నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరులను తరిమేస్తామని మాజీ మంత్రి శ్రీరాములు తెలిపారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నగరంలో ఎస్పీ సర్కిల్ వద్ద వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గతంలో వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, వాల్మీకి సర్కిల్గా నామకరణం చేశామని తెలిపారు. ప్రస్తుతం దాని పక్కనే మరో విగ్రహం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కనకదాసు, అంబేడ్కర్, బసవణ్ణ విగ్రహాలు కూడా ఉన్నాయని.. వాటి పక్కనే మళ్లీ విగ్రహాలు ఏర్పాటు చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్నారు. నగరంలోని పలు కళాశాలల్లో గంజాయి విక్రయాలను అరికట్టడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హోంమంత్రి పరమేశ్వర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఉమ్మడి బళ్లారి జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. యలహంక సమీపంలోని కోగిల కాలనీలో సంబంధించిన స్థలం విచారణపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా 140 అసెంబ్లీ రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విసిగిపోయారన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్, కార్పొరేటర్ ఇబ్రహీం బాబు, కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు గోవిందరాజులు, హనుమంతప్ప, కల్పన వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటక వర్సెస్ కేరళ
సాక్షి బెంగళూరు: ప్రస్తుతం బెంగళూరులో కోగిలు ఘటన కర్ణాటక, కేరళ రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. ఈ ఘటనను ఖండిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ట్వీట్ చేయడంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు కేరళ సీఎం స్పందనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కర్ణాటకలో బుల్డోజర్ విధానం అమలవుతోందని పినరై ఆరోపించారు. ఈ కోగిలు క్రాస్ ఘటనలో ప్రస్తుతం కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయంగా పెనుదుమారం రేగుతోంది. అంతేకాకుండా పినరై సూచనల మేరకు సీపీఐ (ఎం) ఎంపీ ఏఏ రహీం, ఎల్డీఎఫ్ కూటమి ఎమ్మెల్యే కేటీ జలీల్ ఫకీర్ లేఔట్కు చేరుకుని బాధితులతో మాట్లాడి వారికి న్యాయం చేయిస్తామని హామీనిచ్చారు. అయితే కర్ణాటక ప్రభుత్వం తరపు నుంచి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర మంత్రులు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. 180 ఇళ్లు కూల్చివేత.. బెంగళూరు యలహంక సమీపంలోని కోగిలు లేఔట్ ఫకీర్ కాలనీలో గ్రేటర్ బెంగళూరు ప్రాధికార సంస్థ అధికారులు సుమారు 180 ఇళ్లను జేసీబీల సాయంతో నేలకూల్చారు. దీంతో సుమారు 2,500 మందికి పైగా ప్రజలు నివాసాలు కోల్పోయి వీధి పాలయ్యారు. కోగిలు గ్రామ సర్వే నంబర్– 99 ప్రభుత్వానికి చెందిన స్థలంలో 25 ఏళ్లుగా జీవిస్తున్న పేదవారు ప్రస్తుతం నిర్వాసితులై పోయారు. సుమారు 14 ఎకరాల 36 గుంటల విస్తీర్ణంలోని ప్రభుత్వ స్థలంలో 180 ఇళ్లను అక్రమంగా నిర్మించుకుని నివాసం చేస్తున్నారని అధికారులు ఆరోపించారు. సీపీఎం ఎంట్రీకి కారణం ఏంటి? బెంగళూరు కోగిలు క్రాస్ ఫకీర్ లేఔట్లో జరిగిన ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం, సీపీఎం పార్టీ ఎందుకంత ఆసక్తి చూపుతున్నాయనే ప్రశ్నలు ప్రస్తుతం వస్తున్నాయి. కోగిలు క్రాస్లో ఇల్లు కోల్పోయిన వారిలో చాలా మంది ముస్లింలు, దళితులు ఉన్నారు. కేరళలో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేరళ ఎన్నికల్లో సీపీఎం పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. అంతేకాకుండా కేరళలో కొన్ని ముస్లిం సంఘాలను అడ్డుపెట్టుకుని వారి ఓటు బ్యాంకు కోసం సీపీఎం పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. కేరళలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు, ప్రభుత్వ తీర్మానాలు రాజకీయంగా ముస్లింలను కమ్యూనిస్టు పార్టీకి దూరం చేసేలా ఉన్నట్లు తెలిసింది. ముస్లిం ఓటు బ్యాంకు కోసమే.. ఇందుకు కౌంటర్గా ముస్లింలకు తాము అండగా ఉంటామని చెప్పుకునేందుకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ముస్లిం సముదాయం ఎక్కువగా ఉన్న కోగిలు ఫకీర్ లేఔట్లో బుల్డోజర్ ప్రయోగాన్ని సీపీఎం ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలని భావించినట్లు తెలిసింది. అంతేకాకుండా కోగిలు ఫకీర్ లేఔట్లో అక్రమంగా నివాసాలు ఏర్పరుచుకుని జీవిస్తున్న వారిలో చాలా మంది కేరళ నుంచి వలస వచ్చిన వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తమ కేరళ రాష్ట్ర వాసుల కోసం, ముస్లింల కోసం ముఖ్యమంత్రి పినరై అండగా ఉంటారని తెలిసేలా ఈ ఘటనలో భాగం అయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం సిద్ధు కేరళ టూర్ కోగిలు క్రాస్ ఘటన తీవ్రతరం అవ్వడంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. కొన్నేళ్లుగా కోగిలు లేఔట్ ఫకీర్ కాలనీ, వసీం లేఔట్లో ముస్లింలు అనధికారికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ఈ స్థలం నివాసయోగ్యం కాదని, ఈ ప్రభుత్వ స్థలం ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఉద్ధేశించినదని తెలిపారు. గతంలో కూడా ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చామని, అయినా స్థలాన్ని ఖాళీ చేయలేదని తెలిపారు. ప్రస్తుతం ఇల్లు కోల్పోయిన వారికి రాజీవ్గాంధీ వసతి యోజన కింద ఒక స్థలాన్ని గుర్తించి ఇల్లు నిర్మించి ఇస్తామని, ఆ దిశగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం సిద్ధరామయ్య సమస్యను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కోగిలు క్రాస్ ఘటన నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేరళకు వెళుతున్నారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో సీఎం సిద్ధరామయ్య కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆహ్వానం మేరకు కేరళలోని శివగిరిలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 93వ శివగిరి తీర్థోద్బవ సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని నారాయణ ధర్మ సంఘం నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో సీఎం టూర్ ఆసక్తిని కలిగిస్తోంది. ఇదే డిసెంబర్ 3న మంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్ ఒకే వేదికను పంచుకున్నారు. ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కలుసుకున్నారు. అనంతరం ముచ్చటగా మూడో సారి కేరళలో భేటీ కానున్నారు. వచ్చే ఏడాది కాంగ్రెస్ పార్టీని కేరళలో అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న కేసీ వేణుగోపాల్కు అహింద ఓటు బ్యాంకు ఎంతో కీలకంగా మారింది. ఈ క్రమంలోనే అహింద ఓటును తమ వైపునకు తిప్పుకునేందుకు సీఎం సిద్ధరామయ్యను కేరళకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరోవైపు అసలే కోగిలు క్రాస్ ఘటన నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని కేరళ సీఎం పినరై విజయన్ ప్రయత్నించడంతో వచ్చే ఎన్నికల్లో ఇది సమస్య కాకూడదనే నేపథ్యంలో దీన్ని త్వరగా పరిష్కరించాలని ఇప్పటికే సీఎం సిద్ధరామయ్యకు కేసీ వేణుగోపాల్ సూచించినట్లు తెలిసింది. కాగా కర్ణాటక ప్రభుత్వ వ్యవహారాల్లో కేసీ వేణుగోపాల్ జోక్యం ఎక్కువవుతోందని ఇక్కడి విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కోగిలు అక్రమ నివాసాల కూల్చివేతలపై ప్రచ్ఛన్న యుద్ధం కూల్చివేతలను తప్పు పట్టిన కేరళ సీఎం పినరై విజయన్ తమ చర్యను సమర్థించుకున్న కర్ణాటక సర్కార్ -
ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేశాం
హొసపేటె: అన్నభాగ్య ద్వారా ప్రతి ఇంటికీ ఉచిత బియ్యం పంపిణీ చేసి మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేశాం. రాష్ట్రంలో ప్రాథమిక అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. అన్ని రంగాలకు గ్రాంట్లు అందిస్తున్నట్లు పట్టణాభివృద్ధి, పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి భైరతి సురేష్ స్పష్టం చేశారు. మంగళవారం విజయనగర జిల్లా హరపనహళ్లి పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన అమృత్ 2.0 ప్రాజెక్ట్ కింద హరపనహళ్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండున్నర సంవత్సరాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో విజయనగర జిల్లాకు పట్టణాభివృద్ధి శాఖ నుంచి రూ.360 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పంచ గ్యారెంటీ పథకాలకు రూ.60,000 కోట్లు కేటాయించి సామాన్య ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి గృహిణికి నెలకు రూ.2000, శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లత మల్లికార్జున, తగ్గిన మఠం స్వామి, జిల్లాధికారి కవితా ఎస్.మన్నికేరి తదితరులు పాల్గొన్నారు. -
కన్నడ భాషే సార్వభౌమ
శివాజీనగర: కర్ణాటకలో కన్నడ వాతావరణాన్ని పెంపొందించడం మనందరి బాధ్యత. రాష్ట్రంలో కన్నడనే సార్వభౌమ అని సీఎం సిద్దరామయ్య అన్నారు. ప్రసిద్ధ కవి కువెంపు జయంతి సందర్భంగా సోమవారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఏర్పాటైన జన రాజ్యోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కన్నడనాట ఏ భాష నేర్చినా కన్నడిగులగానే ఉండాలన్నారు. కన్నడ భాష, భూమి, నీరు, సరిహద్దు గురించి పోరాటం చేసే ప్రవృత్తిని పెంచుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో కూడా కన్నడ పాఠశాల ఉండాలన్నారు. ఇటీవల ఆంగ్లభాషా వ్యామోహం అధికమైంది. తల్లిదండ్రుల సహాయం లేకపోతే కన్నడ పాఠశాలలు ఉండటం, వృద్ధి చెందటం కష్టమని వాపోయారు. కేంద్రం సవతి తల్లి ప్రేమ రాష్ట్ర ప్రభుత్వం హిందీని వ్యతిరేకించటం లేదు. అయితే హిందీ దేశ భాష కాదని సీఎం అన్నారు. మహదాయి ప్రాజెక్ట్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు చేపడతామన్నారు. కృష్ణా మూడో దశ ప్రాజెక్ట్కు కేంద్రం గెజెట్ విడుదల చేయడం లేదన్నారు. కేంద్రం సవతి తల్లి ధోరణిని కన్నడగులు ఖండించాలని తెలిపారు. కన్నడిగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడంపై కేబినెట్లో చర్చిస్తామని చెప్పారు. కర్ణాటకలో కన్నడిగులకే ఉద్యోగాలు లభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నడ సంఘాల నాయకులు రచయితలు పాల్గొన్నారు. కాగా బెంగళూరుతో సహా రాష్ట్రమంతటా కువెంపు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హిందీ దేశ భాష కాదు సీఎం సిద్దరామయ్య -
ఆరుగురు కుట్రదారులు
బనశంకరి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్రసంచలనం రేకెత్తించిన ధర్మస్థలలో మృతదేహాలను పూడ్చిపెట్టారనే కేసులో విచారణ జరిపిన సిట్ అధికారులు బెళ్తంగడి జేఎంఎప్సీ కోర్టుకు ప్రాథమిక నివేదికను అందజేశారు. మృతదేహాలకు సాక్ష్యమంటూ మాస్కుమ్యాన్ చిన్నయ్య తీసుకొచ్చిన పుర్రె కుట్రలో గిరీశ్ మట్టణ్ణవర్, కే.జయంత్, సుజాతా భట్ సహా మొత్తం 6 మంది ఉన్నారని వెలుగులోకి వచ్చింది. పుర్రె తెచ్చాక పీడకలలు ధర్మస్థలలో శవాలను పూడ్చివేశారంటూ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయగా గిరీశ్, కే.జయంత్, సుజాతాభట్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ హోటల్లో బస చేశారు. జయంత్ వెంట పుర్రె ఉంది, రాత్రి మంచం కింద పెట్టి నిద్రపోయినప్పుడు జయంత్కు పీడ కలలు రావడంతో పుర్రె వద్దని గొడవ చేశాడని నివేదికలో పేర్కొన్నారు. గిరీశ్ అతనిని సముదాయించి ఓ పెట్టెలో పెట్టి సుజాతాభట్కు ఇచ్చారు. ఇందులో ఏముందని ఆమె అడగగా పాతపైపులు ఉన్నాయని చెప్పారు. రెండురోజుల తరువాత జయంత్ ధైర్యం చేసి పుర్రెను తీసుకుని మంగళూరు కు వెళ్లాడు. అక్కడ మహేశ్శెట్టి తిమరోడి ఇంటికి వెళ్లాడు. ఈ పుర్రె ను ధర్మస్థలలోని బంగ్లా గుడ్డ నుంచి సౌజన్య మామ విఠలగౌడ సేకరించాడు. వీరందరూ కలిసి పథకం ప్రకారం ధర్మస్థల మీద దుష్ప్రచారం చేశారని సిట్ పేర్కొంది. అక్కడ ఎలాంటి అత్యాచారాలు, హత్యలు జరిగిన దాఖలాలు లేవని పేర్కొంది. ధర్మస్థలపై దుష్ప్రచారం వెనుక చిన్నయ్య, ముఠా బెళ్తంగడి కోర్టులో సిట్ నివేదిక -
త్రినేత్రాయ నమః
చింతామణి: పట్టణంలోని పురాతన నాగనాథేశ్వరస్వామి ఆలయంలో స్వామికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అలంకరణ, పూజలు జరిపారు. ఉదయం అర్చకులు శివలింగాన్ని అభిషేకించి, పూలు పండ్లతో అలంకరించి పూజలు జరిపారు. పెద్దసంఖ్యలో భక్తులు త్రినేత్రున్ని దర్శనం చేసుకున్నారు. బెంగళూరులో ఆగని డ్రగ్స్ దందా ● మరో రూ.2.5 కోట్ల మత్తు పదార్థాల సీజ్ ● నైజీరియన్, డెలివరీ బాయ్ అరెస్టు బనశంకరి: సిలికాన్ రాజధానిలో మత్తు పదార్థాలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. పోలీసులు ఓ విదేశీ పౌరుడు, డెలివరీ బాయ్ని సోమవారం అరెస్ట్చేశారు. వీరి నుంచి రూ.2.5 కోట్ల విలువచేసే డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. కేసు వివరాలను ఆయన వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఒకే క్రిస్టొఫర్, తమిళనాడువాసి నవీన్రాజ్ అనే ఇద్దరు డ్రగ్స్పెడ్లర్లు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.2 లక్షల నగదుతో పాటు రూ.2 కోట్ల 50 లక్షల విలువచేసే 1 కిలోకు పైగా ఎండీఎంఏ క్రిస్టల్, 60 ఎక్స్టసీ పిల్స్, 2 మొబైల్స్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. సూలదేవనహళ్లి పోలీసులు వీరిని పట్టుకున్నారు. నైజీరియన్ నిందితుడు గత ఏడాది బిజినెస్ వీసా తో భారత్ కు చేరుకుని ఢిల్లీ, ముంబైలో నివాసం ఉండే విదేశీయుల నుంచి చవగ్గా ఎండీఎంఏను కొనుగోలు చేసి వ్యాపారం సాగించేవాడు. హెచ్ఎస్ఆర్లేఔట్ బండేపాళ్యలో తమిళనాడు కు చెందిన నవీన్రాజ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ డ్రగ్స్ వ్యాపారం సాగిస్తున్నాడు. ఇతని వద్ద నుంచి రూ.25 లక్షల విలువచేసే 100 ఎల్ఎస్డీ స్ట్రిప్స్, 5 గ్రాములు కొకై న్, మొబైల్ ను స్వాదీనం చేసుకున్నారు. దావణగెరెలో.. దొడ్డబళ్లాపురం: ఇటీవల దావణగెరె పట్టణంలో 290 గ్రాముల డ్రగ్స్ పట్టుబడ్డ కేసులో అక్కడి విద్యానగర పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసారు. దీంతో చిక్కినవారి సంఖ్య 8కి చేరింది. కాంగ్రెస్ నేత వేదమూర్తి (53)తో పాటు నలుగురు రాజస్థాన్వాసులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఎండీఎంఏ, సింథటిక్ డ్రగ్స్ను సీజ్ చేశారు. వీరు డ్రగ్స్ సేవించడంతో పాటు విక్రయించేవారని పోలీసులు తెలిపారు. -
వరిని కొనుగోలు చేయరా?
మండ్య: జిల్లావ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం బీజేపీ రైతు మోర్చా కార్యకర్తలు నిరసన తెలిపారు. ప్రభుత్వం దళారులతో కుమ్మకై ్క వారి జేబులు నింపుతోందని, వరి కొనుగోలు కేంద్రాలను తెరవకుండా రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. మండ్య జిల్లాలో రైతులు అత్యధికంగా వరి పండించారు, కోతలు కూడా సాగుతున్నాయని తెలిపారు. కేంద్రం రూ. 2386 మద్దతు ధర ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవడం లేదన్నారు. రైతులు వరిని నిల్వ చేసుకోలేక, అయినకాడికి.. అంటే క్వింటా రూ. 1800 – 2000 కంటే తక్కువకు దళారులకు అమ్ముతున్నారని తెలిపారు. వ్యవసాయ మంత్రి మండ్య జిల్లా వారైనా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.వచ్చే బడ్జెట్ సిద్దుదే: మంత్రి సతీశ్ రాయచూరు రూరల్: రాష్ట్ర బడ్జెట్ను 2026 మార్చిలో సీఎం సిద్దరామయ్య ప్రవేశపెడతారని ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి చెప్పారు. సోమవారం యాదగిరిలో విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ తరువాత అధికార మార్పిడి ఉంటుందా, లేదా అనే చర్చ అనవసరమన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారన్నారు. ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదన్నారు. రెండు మూడు నెలల్లో జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలు వస్తాయని చెప్పారు. రాబోయే బడ్జెట్ను సిద్దరామయ్యే సమర్పిస్తారని అన్నారు. లారీ సడన్ బ్రేక్.. ఇద్దరు యువకులు మృత్యువాత దొడ్డబళ్లాపురం: సిమెంటు ట్యాంకర్ లారీని వెనుక నుంచి బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. దొడ్డ తాలూకా నాయకరండనహళ్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని పరిగి ప్రాంతానికి చెందిన పవన్కుమార్ (22), అశోక్ (24) సోమవారం ఉదయం బైక్పై ఏపీ నుంచి బెంగళూరుకు వెళుతున్నారు. హిందూపురం– బెంగళూరు మార్గంలోని నాయకరండహళ్లి వద్ద ముందు వెళ్తున్న సిమెంటు లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకనే వస్తున్న యువకులు బైక్ను అదుపు చేయలేక లారీని ఢీకొన్నారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో చనిపోయారు. సిమెంటు లారీ డ్రైవర్ వాహనంతో పాటు పరారయ్యాడు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బస్సు ఢీకొని ఇద్దరు.. యశవంతపుర: కేఎస్ ఆర్టీసీ బస్సు బైకును ఢీకొనగా ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన హాసన్ జిల్లా చన్నరాయపట్టణ వద్ద జరిగింది. దడదరహళ్లివాసులు సునీల్ (20), శృంగార్ (18) మృతులు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నడపడమే ఘోరానికి కారణమని స్థానికులు ఆరోపించారు. ముందు వెళుతున్న బైకును బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టిందని తెలిపారు. చన్నరాయపట్టణ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు చేశారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పనులు, పథకాలపై సీఎం సమీక్ష శివాజీనగర: మౌలిక సౌకర్యాల పనుల నాణ్యతలో ఎలాంటి రాజీపడరాదు. జిల్లా ఇన్చార్జి మంత్రులు అన్ని పనుల ప్రగతి పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. కృష్ణా నివాసంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం, రైల్వే పథకాల భూ స్వాధీనం గురించి మంత్రులు, అధికారులతో చర్చించారు. ప్రతి నియోజకవర్గానికి రూ. రూ.25 కోట్ల విడుదలకు అనుమతించినట్లు తెలిపారు. నిర్దేశించిన పనులను సకాలంలో పూర్తిచేసి బిల్లులు చేసుకోవాలన్నారు. పనుల నాణ్యతను జిల్లా ఇన్చార్జి మంత్రులు అన్ని పనులను పరిశీలించాలన్నారు. రైల్వే పనులకు పెండింగ్లో ఉన్న భూస్వాధీన ప్రక్రియలను ప్రాధాన్యత మేరకు పూర్తిచేయాలి. కుడచి–బాగలకోట, తుమకూరు–దావణగెరె, బేలూరు–హాసన్, శివమొగ్గ–రాణిబెన్నూరు, ధారవాడ–బెళగావి రైల్వే మార్గాల నిర్మాణ పనులు శీఘ్రగతిన జరగాలన్నారు. పవన్ కుమార్, అశోక్ (అశోక్) -
మన బంగారం మంచిదే
బంగారు ఆభరణాలు, వెండి సామగ్రి సొత్తును వారసు దారులకు అందిస్తున్న పోలీసులు కోలారు: కోలారు జిల్లాలో గత కొద్ది నెలలుగా జరిగిన దొంగతనాలు, దోపిడీల కేసులలో దొంగలు ఎత్తుకెళ్లిన సొత్తు మళ్లీ యజమానులకు చేరడంతో ఆనందభరితులయ్యారు. జిల్లా పరిధిలో జరిగిన మొత్తం 533 కేసులలో దొంగలను అరెస్టు చేసి బంగారు, వెండి సొత్తును రికవరీ చేశారు. వీటి విలువ సుమారు 2.57 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇందులో బంగారం 1,813 గ్రాములు, వెండి 3,143 గ్రాములు, నగదు 7.62 లక్షలు, శ్రీగంధం చెక్కలు 1,460 కేజీలు, వాహనాలు 25, మొబైల్ ఫోన్లు 461 ఉన్నాయి. సోమవారం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పోలీసు ఉన్నతాధికారులు సొంతదారులకు అందజేశారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 30 కేసుల్లో గంజాయి, ఎండిఎంఎ తదితర మాదక ద్రవ్యాలను సీజ్చేసినట్లు తెలిపారు. చోరీ సొత్తు మళ్లీ యజమానుల సొంతం కోలారు పోలీసుల కార్యాచరణ -
ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే అరెస్టే: కమిషనర్
బనశంకరి: నూతన ఏడాది సంబరాలలో అసాంఘిక ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య పోలీస్ అధికారులకు ఆదేశించారు. సోమవారం సీఎం నివాస కార్యాలయంలో హోంమంత్రి పరమేశ్వర్, డీజీపీ ఎంఏ.సలీం, పోలీసు కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తదితరులతో ఆయన సమావేశం జరిపారు. మహిళల సురక్షత కు అన్ని చర్యలూ తీసుకోవాలని, ఎలాంటి రభస జరగకుండా చూసుకోవాలన్నారు. న్యూ ఇయర్ సంబరాల తరువాత ప్రజలు ఇళ్లకు వెళ్లడానికి అనుకూలమయ్యేలా 31న అర్ధరాత్రి తరువాత ఎక్కువ సంఖ్యలో బీఎంటీసీ బస్సులను నడపాలన్నారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, చర్చ్స్ట్రీట్, కోరమంగల, ఇందిరానగర తో పాటు సామూహిక సంబరాలు జరిగే ప్రముఖ స్థలాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, గొడవలేవీ జరగకుండా చూడాలన్నారు. 20 వేల మంది పోలీసులను నియమించామని, ఇతర జిల్లాల నుంచి ఎక్కువమంది మహిళా పోలీసులను పిలిపించినట్లు అధికారులు చెప్పారు. 4 కంట్రోల్ రూమ్లు, 78 వాచ్ టవర్లు, 164 మహిళా సహాయ డెస్క్లు, 55 అంబులెన్సులు అందుబాటులో ఉంటాయన్నారు. గత మూడురోజుల్లో 3,500 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు, కట్టడి చేస్తున్నట్లు తెలిపారు. 31న రాత్రి నుంచి నగరంలోని 50 ఫ్లై ఓవర్లపై ద్విచక్రవాహనాల సంచారం నిలిపివేయాలని, పోకిరీ బైకిస్టులపై కఠినచర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ కార్యకలాపాలపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని సిద్దరామయ్య తెలిపారు. ఇక్కడ పార్కింగ్ వసతి ప్రజల కోసం శివాజీనగర బీఎంటీసీ షాపింగ్ కాంప్లెక్స్ మొదటి అంతస్తు, యుబీ.సిటీ, గరుడామాల్, కబ్బన్రోడ్డు జంక్షన్ నుంచి కమర్షియల్ స్ట్రీట్ జంక్షన్ వరకు వాహనాలను నిలుపుకోవచ్చు. సోమవారం రాత్రి బెంగళూరు బ్రిగేడ్ రోడ్డులో న్యూ ఇయర్ లైట్ల శోభ హద్దులు లేని ఆనందం.. బెంగళూరులో ఓ ప్రైవేటు పార్టీ (ఫైల్) వేడుకలు జరిగే చోట భారీ భద్రత అవాంఛనీయాలు జరగకుండా చర్యలు పోలీసులకు సీఎం ఆదేశం సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు 31 తేదీ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజున తెల్లవారుజామున 2 గంటల వరకు బెంగళూరులో తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు తో పాటు పలుప్రాంతాల్లో వాహనాల సంచారం, పార్కింగ్పై నిషేధం ఉంటుంది. అనేక కూడళ్లను మూసివేస్తారు. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొని ప్రయాణించాలి. ముమ్మరంగా ట్రాఫిక్ డైవర్షన్ను చేపట్టారు.బెంగళూరులో న్యూ ఇయర్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. 31వ తేదీ సాయంత్రం నుంచే ఎంజీ, బ్రిగేడ్ రోడ్డు, కమర్షియల్ వీధి తదితరాలలో యువత చేరి చిందులు మొదలెడతారు. తెల్లవారుజామువరకూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుగుతాయి. న్యూ ఇయర్ సంబరాల సమయంలో ఇతరులకు ఇబ్బంది కలిగించేవారిని దయాదాక్షిణ్యాలు లేకుండా అరెస్ట్ చేస్తామని పోలీస్కమిషనర్ సీమంత్కుమార్సింగ్ హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త ఏడాది ఉత్సవాలను సంతోషంగా జరుపుకోండి. ఇతరులకు కూడా అవకాశం ఇవ్వండి. కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల సురక్షత, రద్దీ నియంత్రణ తమకు మొదటి ప్రాధాన్యత అన్నారు. బైక్ వీలర్లపై కఠిన చర్యలు తప్పవన్నారు. వేడుకల తరువాత ఇళ్లకు వెళ్లేవారి కోసం మొదటిసారిగా బస్లు, టెంపో ట్రావెలర్ వాహనాలను కల్పించామని తెలిపారు. అల్లరిమూకలపై మ్యాజిక్ బాక్స్తో నిరంతరం సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు. -
తారు పేరుతో రూ.31 లక్షల మోసం
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో సైబర్ నేరాలు పెరిగాయి. భద్రావతికి చెందిన డాంబరు (తారు) వ్యాపారిని హైవేస్ అథారిటీలో నమోదు సాకుతో రూ.31,06,300 మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాధితునికి హనీ సింగ్ సబర్వాల్ అనే వ్యక్తి ఆన్లైన్లో పరిచయం అయ్యాడు. తాను ఒక కంపెనీ ఎండీగా పరిచయం చేసుకున్నాడు. కర్ణాటకలో హైవే పనులు చేయబోతున్నానని, తారు సరఫరా చేయాలని చెప్పాడు. ఇందుకోసం మీరు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మీ పేరును నమోదు చేసుకోవాలని చెప్పాడు. తరువాత, రిజిస్ట్రేషన్, ఇతరత్రా ఫీజులు చెల్లించాలని చెప్పారు, ఇలా వ్యాపారి సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 22 మధ్య మోసగాళ్ల కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాకు మొత్తం రూ.31,06,300 బదిలీ చేశాడు. మరింత డబ్బు చెల్లించాలని వేధించసాగారు. చివరకు మోసపోయినట్లు గ్రహించి శివమొగ్గలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరొకరికి రూ.6 లక్షలు భద్రావతికి చెందిన ఒక వ్యక్తి సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.6.23 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలు.. టెలిగ్రాం యాప్లో వచ్చిన ఓ లింక్ను క్లిక్ చేయగా ‘టాటా క్లిక్ ఫ్యాషన్ అనే టెలిగ్రాం గ్రూప్లో చేరాడు. ఫ్యాషన్ దుస్తుల అమ్మకం గురించి అందులో చర్చించారు. మీ ద్వారా ఫ్యాషన్ ఉత్పత్తులను కొంటామని బాధితునికి ఓ వ్యక్తి కాల్ చేశాడు. కంపెనీ ఇచ్చిన పనులు పూర్తి చేస్తే అధిక లాభాలు వస్తాయని హామీ ఇచ్చాడు. దీనిని నమ్మిన ఫిర్యాదుదారుడు డిసెంబర్ 18 నుంచి 25 మధ్య రూ.6,23,155 బదిలీ చేశాడు. మోసపోయినట్లు తెలిసి సీఈఎన్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. శివమొగ్గ జిల్లాలో సైబర్ క్రైం -
పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి
రాయచూరు రూరల్: సమాజానికి పాత్రికేయులు వారధిలాంటి వారు అని రాష్ట్ర చిన్న నీటి పారుదల, సైన్స్ సాంకేతిక, విద్యాశాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. ఆదివారం పాత్రికేయుల భనవంలో ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత పాత్రికేయ రంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. సమాజంలో పేరుకుపోయిన సమస్యలపై స్పందించాలని సూచించారు. సోషల్ మీడియా ప్రభావం అధికమైందన్నారు. అనంతరం రఘునాథ్ రెడ్డికి జీవమాన సాధక అవార్డు, చంద్ర కాంత్ మసాని, అబ్దుల్ ఖాదర్, శ్రీనివాస్, రాజుకు నగర స్థాయి అవార్డులు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ, విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్, నగర సభ అధ్యక్షురాలు నరసమ్మ, సమాచార కమిషనర్ వెంకట సింగ్, జిల్లాధికారి నితీష్, అదనపు ఎస్పీ కుమార స్వామి, డి.కె.కిషన్ రావ్, జగన్నాథ్ దేశాయి, రిపోర్టర్ గిల్డ్ అధ్యక్షుడు విజయ జాగటగల్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, సత్యనారాయణ, చెన్న బసవ, ఖాన్సాబ్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి అంతర్జాతీయ వ్యవసాయ సమ్మేళనం
రాయచూరు రూరల్: రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ వ్యవసాయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హన్మంతప్ప వెల్లడించారు. ఆదివారం ఇందుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. 29 నుండి 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భారత వ్యవసాయ సాంస్కృతిక పరంపర, సాంప్రదాయక వ్యవసాయం ఇతర అంశాలపై చర్చాగోష్టి ఉంటుందని పేర్కొన్నారు. సమ్మేళనంలో న్యూఢిల్లీలోని జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ డైరక్టర్ శ్రీనివాస్ రావు, సురేష్, జగదీష్, వీరణ్ణ, పాటిల్, విష్ణువర్దన్, ఖమర్ పొల్గొంటారని తెలిపారు. రాయచూరు రూరల్: యాదగిరిలో రాష్ట్ర స్థాయి విజ్ఞాన సమ్మేళనాన్ని సోమవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు విజ్ఞాన సమ్మేళనం సంచాలకుడు, రవి పాటిల్ పౌండేషన్ అధ్యక్షుడు రవి పాటిల్ వెల్లడించారు. ఆదివారం యాదగిరి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. 29 నుంచి 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విజ్ఞానం ఇతర అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. సమ్మేళనానికి శరణు సంత సూపీ సంచాలకుడు సత్యంపేట, నిజగుణానంద స్వామి, హులికల్ నటరాజ్ హాజరవుతారన్నారు. ఆరు సాహిత్య గ్రంథాలను ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి విడుదల చేస్తారన్నారు. -
నాటక రంగాన్ని కాపాడుకుందాం
హొసపేటె: ఆధునిక యుగంలో నాటక రంగాన్ని కాపాడుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే డాక్టర్.ఎన్.టి శ్రీనివాస్ అన్నారు. శనివారం రాత్రి సులదహళ్లిలోని కందగల్లు హనుమంతరాయ కళా సంఘం, కూడ్లిగి తాలూకా బలగ ఆధ్వర్యంలో రక్తరాత్రి పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో జాతరలు, పండుగలు సహా వివిధ సందర్భాల్లో పౌరాణిక, జానపద నాటకాలను తరచుగా ప్రదర్శించే వారని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం అధికం కావడంతో కళలు కనుమరుగు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వినోదాన్ని అందించే నాటకాలను అందరూ ఆదరించాలని సూచించారు. అనంతరం సీనియర్ రంగస్థల కళాకారులు ఎస్.అంజినమ్మ, కే.నాగరత్న, బి.గంగమ్మ తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ తాపా అధ్యక్షుడు బెన్నె కోట్రేష్, ఖానవలి కొట్రేశప్ప సూలదహళ్లి రాఘవేంద్ర, తిప్పేస్వామి తదితరులు కళాకారులు పాల్గొన్నారు. టీబీ డ్యామ్ గేట్ల ఏర్పాటు పనుల పరిశీలనహొసపేటె: తుంగభద్ర జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారి, తుంగభద్ర బోర్డు సభ్యుడు నరసింహ మూర్తి ఆదివారం సందర్శించారు. కొత్త గేట్ల ఏర్పాటు పనులను పరిశీలించారు. డిసెంబర్ 24 నుంచి ప్రారంభమైన కొత్త గేట్ల ఏర్పాటు పనులపై ఆరా తీశారు. 18 క్రస్ట్ గేట్ను 12 భాగాలుగా ఏర్పాటు చేస్తుండగా.. ఈ జలాశయం 33 క్రస్ట్ గేట్లను భర్తీ చేయడానికి నిపుణులు నివేదిక ఇచ్చారు. గేట్ల భర్తీ పని గుజరాత్లో జరుగుతోంది. గేట్ల భర్తీ పనిని అసలు హార్డ్వేర్ టూల్స్, మెషినరీ ప్రాజెక్ట్ కంపెనీకి ఇచ్చారు. ఈ సంస్థ ఇప్పటికే 15 కొత్త గేట్లను నిర్మించింది. తుంగభద్ర బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజినీర్ నారాయణ నాయక్, ఈఈ చంద్రశేఖర్ ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు కొత్త గేట్ నిర్మాణం పురోగతిని వివరించారు. డాక్టర్ మునిస్వామికి గౌరవ డాక్టరేట్బళ్లారి అర్బన్: బళ్లారి తాలూకా కప్పగల్ గ్రామానికి చెందిన కన్నడ రక్షణ యువ వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి.మునిస్వామికి ఢిల్లీ నేషనల్ యూనివర్సిటిలో రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గౌరవ డాక్టరేట్ అందజేశారు. మునిస్వామి 2007 నుంచి ఇప్పటి వరకు సుమారు 1,600 జంటలకు ఉచిత వివాహాలు చేయించారు. గతంలో ప్రతి మౌలిక సదుపాయాలు, రోడ్ల మరమ్మతుల కోసం కన్నడ రక్షణ యువ వేదిక నుంచి వినతిపత్రాలు అందించి పోరాటాలు చేశారు. 20 ఏళ్లుగా ఆరోగ్య ఉచిత శిబిరాలు, రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ తదితర సేవలు కొనసాగిస్తున్నారు. సమాజ సేవను గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం సంతోషంగా ఉందని మునిస్వామి తెలిపారు. కార్మికుల సమస్యలపై అధ్యయనంకోలారు: కార్మికుల సమస్యలను అధ్యయనం చేయడానికి కోలార్ జిల్లా పర్యటనకు వచ్చినట్లు రాష్ట్ర కనిష్ట వేతన మండలి అధ్యక్షుడు టీఎం.షాహిల్ టెక్కిల్ తెలిపారు. నగరంలోని పాత్రికేయుల భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం, వారి హక్కుల రక్షణకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. సీఎం సిద్ధ రామయ్య, కార్మికశాఖ మంత్రి అనిల్లా కార్మికుల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మూడు కోట్ల మంది కార్మికులు వివిధ రంగాలలో పనిచేస్తున్నారని, నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడి హితవును కాపాడడానికి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. -
ముస్తాబవుతున్న రెడ్డి భవన్
సాక్షి బళ్లారి: బళ్లారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖుల నిధులతో బళ్లారి జిల్లాకే కాకుండా ఉత్తర కర్ణాటకకే తలమానికంగా ఉండేలా రెడ్డి భవన్ను నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. రాజకీయంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన వారితో పాటు అదే వర్గానికి చెందిన వారి నుంచి మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి భవన్ కోసం విరాళాలు సేకరించారు. నగరం నడిబొడ్డున అనంతపురం రోడ్డులోని శ్రీశాంతి నికేతన్ స్కూల్ ఆవరణలో రెడ్డి సంఘానికి చెందిన విశాలమైన స్థలంలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ రెడ్డి భవన్ కల్యాణ మండపంలో వేలాది మంది కూర్చొనేందుకు ఇబ్బందులు లేకుండా, భోజన వసతి శాల, అద్భుతమైన వివాహ వేదికకు సంబంధించిన ఫంక్షన్ హాల్, వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఇలా బళ్లారిలోనే అన్ని కల్యాణ మండపాలకు ఽ దీటుగా ఏడాదిలో భవనాన్ని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రెడ్డి సంఘం ఏర్పడి మరో ఏడాదిలో 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రెడ్డి భవన్ను అదే రోజు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్డి సమాజిక వర్గంలో ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో రెడ్డి భవన్ ఎదురుగా మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో ఇప్పటికే అల్లం భవన్, అంబేడ్కర్ భవన్, రాఘవ కళామందిర్, బసవ భవన్, కమ్మ భవన్, పద్మశాలీ కల్యాణ మండపం, గ్రాండ్ ఫంక్షన్ హాల్, క్లాసిక్ ఏసీ ఫంక్షన్ హాల్, కేఎస్ఆర్, కేఈబీ ఫంక్షన్ హాల్స్, తదితర కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. పెళ్లి వేడుకలు, ఇతర ప్రముఖ ఫంక్షన్లు, రాజకీయ సమావేశాలు, నిర్వహించుకునేందుకు అనువుగా ఉండటంతో బళ్లారి ప్రాంత వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు జిల్లాలకు చెందిన వారు ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయంగా, వ్యాపార రంగాల్లో అత్యున్నత పదవులు పొందిన రెడ్డి సామాజిక వర్గం బళ్లారిలో రెడ్డి భవన్ నిర్మించేందుకు ముందుకొచ్చింది. జోరుగా జరుగుతున్న రెడ్డి భవన్ నిర్మాణ పనులుపెరుగుతున్న జనాభా రూ.15 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్మాణం బళ్లారికే తలమానికంగా మారబోతున్న కల్యాణ మండపం ఏడాదిలో పూర్తికానున్న పనులు వివాహాలు, ఇతర కార్యక్రమాలకు వినియోగించుకునేందకు రూపకల్పనచారిత్మకంగా గుర్తింపు పొందిన బళ్లారి జిల్లాలో రోజు రోజుకు జనాభా పెరుగుతోంది. వివిధ రకాలుగా వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందుతోంది. దేశంలోనే పేరుగాంచిన, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జిందాల్ స్టీల్ ఇండస్ట్రీ, స్పాంజ్ ఐరన్ కంపెనీలు, లక్షలాది ఎకరాలకు నీరందించే తుంగభద్ర డ్యామ్, స్పాంజ్ ఐరన్ కంపెనీలు ఇలా చెప్పుకుంటూ పోతే పత్తి వ్యాపారం, వేరుశనగ, తదితర వ్యాపార కేంద్రాలకు బళ్లారి కేంద్ర బిందువుగా మారింది. -
స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ సేవలు అనన్యం
రాయచూరు రూరల్: దేశానికి స్వాతంత్య్రం తేవడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు అనన్యమని విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 141వ కాంగ్రెస్ పార్టీ సంస్థాపనా దినోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల నుంచి భరత మాత సంకెళ్లను తొలగించిన పార్టీగా కాంగ్రెస్ను అభివర్ణించారు. భారతీయుల్లో ఐక్యత లేకపోవడంతో ఆంగ్లేయులు 400 ఏళ్ల పాటు దేశాన్ని పాలించి సంపదను కొల్లగొట్టారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకమై పోరాటం చేయడంతో మన దేశానికి స్వాతంత్య్రం లభించిందని గుర్తు చేశారు. భారత ప్రధానమంత్రిగా నెహ్రూ చేసిన సేవలను కొనియాడారు. పంచశీల సూత్రాలతో దేశానికి పేరు తెచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, శాలం, అస్లాంపాషా, రజాక్ ఉస్తాద్, నిర్మల బెణ్ణే, దరూరు బసవరాజ్, రామకృష్ణ నాయక్, మురళి యాదవ్, మర్రిస్వామి, ఈశప్ప, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న సిల్క్, చేనేత వస్త్రాలు
సాక్షి బళ్లారి: స్థానిక అనంతపురం రోడ్డులోని సెంటనరీ హాల్లో ఈనెల 26వ తేదీన ప్రారంభమైన ది గ్యాడ్ ఎగ్జిబిషన్ కమ్ సెల్కు స్పందన లభిస్తోంది. హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్, హ్యాడ్క్లప్, చీరలు, వివిధ రకాలు దుస్తులు, షాదీ బట్టలు, గృహ అలంకరణ వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో గ్రామీణ కళాకారులు తయారు చేసిన కాటన్, సిల్క్, చేనేత వస్త్రాలు, తదితర వాటిని ప్రదర్శనలో ఉంచారు. రాజస్తాన్లో చేతితో తయారు చేసిన తివాచీలు, మోజారిలు/జుటిస్, మార్బుల్ క్రాఫ్ట్స్, ఐవరీ, ఒడిశా పట్టచిత్ర పెయింటింగ్, మధుబని పెయింటింగ్స్, బంధానిబంధేజ్ వంటి రంగురంగుల వస్త్రాలు, ఒరిస్సా సంస్కృతిని చిత్రీకరించే అందమైన రూపాలు, వీవల్స్ హ్యాండ్లూమ్లో రంగురంగుల చేనేత ఉత్పత్తులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నగర వాసులు విశేషంగా భారీగా తరలివచ్చి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. -
వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తాం
సాక్షి బళ్లారి: రైతులు ఒకే పంటపై ఆధారపడి నష్టపోతూ అప్పుల పాలవుతున్నారు. వివిధ రకాల పంటలు, పండ్ల తోటలు వేసుకుని అధిక లాభాలు పొందాలని జిందాల్ సంస్థ సౌత్ జోనల్ ప్రముఖుడు పెద్దన్న బిడాళ సూచించారు. ఆదివారం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని సండూరు తాలూకా తాళూరు గ్రామంలో రైతులతో కార్యక్రమం నిర్వహించారు. హగరి వ్యవసాయ విజ్ఞాన కేంద్ర ప్రముఖులు పాలయ్య, డాక్టర్ రవి, ఇఫ్కో బళ్లారి మేనేజర్ హనుమంతప్ప, తదితరులు రైతులతో చర్చావేదిక ఏర్పాటు చేశారు. పంట పొలాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాళూరు చుట్టపక్కల గ్రామాల్లో 300 మందికిపైగా రైతులను జిందాల్ సంస్థ ఎంపిక చేసిందన్నారు. ఆయా రైతులకు జిందాల్ సంస్థ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. భూమికి అనుగుణంగా పంటలను వేసేందుకు సహకారం అందిస్తామని వెల్లడించారు. వ్యవసాయంతో పాటు గిరిరాజ కోళ్లు, మేకల పెంపకాన్ని సహకారం అందిస్తామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో దశల వారీగా సమగ్ర వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిందాల్ సంస్థ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రసాయనిక మందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అనుసరించి అధిక లాభాలు పొందాలని రైతులకు సూచించారు. -
పాత్రికేయుల సంక్షేమానికి కృషి
కోలారు: పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ తెలిపారు. ఆదివారం నగరంలోని పాత్రికేయుల భవనంలో జిల్లా పాత్రికేయుల సంఘం నూతన పదాధికారుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లో ఎదగి రావడానికి కారణం పాత్రికేయులే అన్నారు. జిల్లా పాత్రికేయుల సంఘం సంక్షేమ నిధి ఏర్పాటు ఉత్తమ ఆలోచన అని.. ఇందుకోసం రూ. 21 లక్షలు విరాళంగా అందిస్తామని హామీ ఇచ్చారు. పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు శివానంద తగడూరు మాట్లాడుతూ.. కోలారు పాత్రికేయుల సంఘం ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన అనంత రాము పనితీరును కొనియాడారు. పాత్రికేయులు దురహంకారాన్ని వీడి ప్రామాణికంగా విధులు నిర్వహించాలన్నారు. మన రాతల ద్వారా సమాజంలో మార్పులు తీసుకు వచ్చే ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు ఎస్.కె చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.మునిరాజు, సంఘం అధ్యక్షుడు బి.వి.గోపినాథ్, రాష్ట్ర సంఘం కోశాధికారి వాసుదేవహొళ్ల తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకుల కోలాహలం
ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, దక్షిణ కాశీగా పేరొందిన హంపీకి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. వరసగా సెలవులు రావడంతో హంపీ వీధులు కిటకిటలాడుతున్నాయి. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాయల కాలం నాటి లోటస్ మహాల్, ఎలిఫెంట్ హౌస్, ఏకశిలా రథం, సరిగమలు స్వప్త స్వరాల మందిరం, హాజరామ మందిరం, మహానవమి దిబ్బ, విజయ విఠల దేవస్థానం, ఉగ్రనరసింహ, రాణిస్థాన మందిరం, జైన్ మందిరం, కోదండ రామ మందిరాన్ని వీక్షించారు. విరుపాక్ష స్వామిని దర్శించుకున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎస్పీ జాన్హవి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు మాల్యవంత పర్వతం వద్ద సూర్యోదయ అందాలు వీక్షించేందుకు ఉదయం పెద్ద ఎత్తున దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు తరలివచ్చారు.– హొసపేటె: -
తగ్గిన మిర్చి దిగుబడి..రైతన్న కంటతడి
రాయచూరు రూరల్: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతన్నలకు కాలం కలసి రావడం లేదు. అప్పులు చేసి మరి పంటలు సాగు చేస్తున్నారు. అయితే సకాలంలో వర్షాలు కురవక పోవడం, కాలువల ద్వారా పంటకు నీరు అందకపోవడంతో ఆశించిన దిగుబడులు రావడం లేదు. జిల్లాలో క్రిష్ణా నది ఉన్నా.. నారాయణపుర కుడి కాలువ నుంచి పంటల సాగుకు నీరు అందడం లేదు. రాయచూరు జిల్లాలో 50 వేల ఎకరాలు, బాగలకోట జిల్లాలో 11 వేల ఎకరాలు, యాదగిరి జిల్లాలో 8 వేల ఏకరాలు, కలబుర్గి జిల్లాలో 5 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. కాలువకు నీరందక, వర్షాలు సకాలంలో కురువక భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణ పుర కుడి కాలువల ఆయుకట్టు చివరి భూములకు నీరు అందలేదు. పొలాల్లో బోర్లు వేయించుకుని పంటలు పండించాలన్న భూగర్భ జలమట్టం తగ్గింది. దీనికి తోడు విద్యుత్ కోతలు అధికమయ్యాయి. మిరప పంటను కాపాడుకునేందుకు రైతులు కడవలతో నీరు పోశారు. గుంటూరు మిర్చి గతంలో 10 క్వింటాళ్ల దిగుబడి రాగా.. నేడు కేవలం 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని రైతులు లబోదిబోమంటున్నారు. గత ఏడాది బ్యాడిగి మిర్చి క్వింటా ధర రూ.65 వేలు పలకగా.. నేడు రూ.40 వేలకు పడిపోయింది. గతంలో క్వింటా గుంటూరు మిర్చి ధర రూ.22 పలికింది. ప్రసుత్తం క్వింటా రూ.15 వేలు మాత్రమే ధర పలుకుతోంది. నారాయణపుర కుడి, ఎడమ కాలువల కింద యాదగిరి, రాయచూరు జిల్లాలో రూ.400 కోట్లు విలువ చేసే మిరప పంటకు నీరు లేక ఎండిపోయే దశలో ఉంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు 6 టీఎంసీల నీరు వదిలేందుకు మంత్రులు శరణ బసప్ప దర్శానపూర్, శరణ ప్రకాష్ పాటిల్ చొరవ చూపాలని రైతు ప్రభాకర్ పాటిల్ కోరుతున్నారు. సకాలంలో పంటకు అందని నీరు పడిపోయిన దిగుబడులు లాభాలు అంతంతమాత్రమే -
నగల షాపు.. దొంగలు.. కాల్పులు
దోపిడీ తరువాత ఖాళీగా కనిపిస్తున్న షోకేసులు నగల షాపులో సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు మైసూరు: పర్యాటక రాజధానిగా పేరుపొందిన మైసూరులో విచ్చలవిడిగా సైబర్ నేరాలు, తరచూ చోరీలు, విస్ఫోటాలు జరుగుతున్నాయి. ఇంతలో పట్టపగలు ముసుగు దొంగల బృందం సినిమా స్టైల్లో నగల షాపును దోచుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని హుణసూరు పట్టణంలో జరిగింది. కనీసం రూ.5 కోట్ల నగలను ఎత్తుకెళ్లారు. ఎలా జరిగిందంటే.. ● ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హుణసూరు బస్టాండ్ వెనుక ఉన్న స్కై గోల్డ్ డైమండ్ షాపులో ఈ లూటీ జరిగింది. ● రెండు బైక్లలో ఐదుమంది దుండగులు ముఖానికి ముసుగులు ధరించి చొరబడ్డారు. రాగానే పిస్టళ్లు తీసి సిబ్బందిని బెదిరించారు. అక్కడ ఉన్న కస్టమర్లు, సిబ్బంది, మేనేజర్పై తుపాకులను గురిపెట్టి, గాల్లోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేశారు. తర్వాత అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ● షోకేసుల నుంచి వజ్రాలు, బంగారు ఆభరణాలను తీసి సంచుల్లోకి భర్తీ చేయాలని చెప్పారు. సిబ్బంది సంకోచించగా, పిస్టల్తో గాల్లోకి కాల్పుల జరిపారు. ● ప్రతిఘటించిన స్టోర్ మేనేజర్ అజ్గర్ పై కాల్పులు జరపడంతో గాయపడ్డాడు. ● రూ. 5 కోట్ల విలువచేసే బంగారం, వజ్రాల ఆభరణాలను సంచుల్లో నింపుకొని దొంగలు బైక్ల పై పారిపోయారు. ఓ దొంగ హెల్మెట్ను అక్కడే వదిలేశాడు. ● కొందరు ప్రజలు దొంగలను వెంబడించడానికి ప్రయత్నించారు, కానీ వారిని పట్టుకోలేకపోయారు. కాల్పుల్లో గాయపడిన మేనేజర్ ను ఆసుపత్రిలో చేర్చారు. రూ.5 కోట్ల బంగారం, వజ్రాభరణాల లూటీ మైసూరు జిల్లా హుణసూరులో పట్టపగలు కల్లోలం పోలీసుల విచారణ స్థానిక రూరల్, టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రల కోసం గాలించారు. జిల్లా ఎస్పీ ఎన్. విష్ణువర్ధన్, ఎఎస్పీ ఎల్.నాగేష్ అంగడిని తనిఖీ చేశారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా దొంగలను గుర్తించే పనిలో ఉన్నారు. పట్టపగలు జరిగిన ఈ దోపిడీ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. -
లారీని బస్సు ఢీ, 21 మందికి గాయాలు
యశవంతపుర: ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్, 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హాసన్ జిల్లా చన్నరాయపట్టణ తాలూకా బైపాస్ రోడ్డులో జరిగింది. శనివారం రాత్రి ప్రైవేట్ బస్సు 40 మంది ప్రయాణికులతో వెళుతుండగా ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బస్సు ఢీకొంది. 7 మంది ప్రయాణికులకు ఓ మోస్తరుగా, 13 మంది ప్రయాణికులకు బలమైన గాయాలు కావడంతో వారిని జిల్లా ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జుయింది. బస్సు డ్రైవర్ పరిస్థితి అందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫోన్ రీచార్జి గొడవలో హత్య, 4 ఏళ్ల జైలుశిక్ష శివమొగ్గ: ఘర్షణలో ఒకరిని హత్య చేసిన కేసులో నిందితునికి జిల్లాలోని సాగర్ 5వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. వివరాలు.. స్థానిక మురల్లి గ్రామవాసి సిద్దప్ప (38) దోషి. 2022 డిసెంబరులో తిమ్మప్ప (52), అతని భార్యతో మొబైల్ఫోన్ రీచార్జి గురించి సిద్దప్ప గొడవపడ్డాడు. అతను వారి ఇంటికి వెళ్లి టీవీ డిష్ బుట్టను కట్టెతో కొట్టాడు. తరువాత తిమ్మప్ప తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తిమ్మప్పను ఉడిపి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా మరణించాడు. కార్గల్ పోలీస్ స్టేషన్లో సిద్ధప్పపై హత్య కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ను దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి ఆర్ రవీంద్ర ఈ తీర్పు ఇచ్చారు. అలాగే రూ.14 వేల జరిమానా కూడా విధించారు. ప్రభుత్వం తరపున వకీలు అన్నప్ప నాయక్ వాదించారు. ప్రేమ పేరుతో సర్వం లూటీ ● బెంగళూరులో బడా కిలాడీ దొడ్డబళ్లాపురం: ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను నమ్మించి సర్వం దోచుకుని మోసగిస్తున్న నయ వంచకుని ఉదంతమిది. చివరకు బాధితులు ఫిర్యాదు చేయడంతో బెంగళూరు బాగలగుంట పోలీసులు గాలించి అరెస్టు చేశారు. హరియానాకు చెందిన శుభాంశు శుక్లా (27) ఆ కిలాడీ. ఇతడు గత నాలుగేళ్లుగా బెంగళూరులోని టీ దాసరహళ్లిలో నివసిస్తున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పుకుని ఫేస్బుక్, ఇన్స్టా తదితరాల ద్వారా నిందితుడు స్థానిక యువతులను ట్రాప్ చేయడం ప్రారంభించాడు. ముందు పరిచయం చేసుకుని, ఆపై తీయని మాటలతో ప్రేమ వల విసరడం, వారి నుంచి భారీ మొత్తాల్లో డబ్బు తీసుకోవడం, ఇతరత్ర మోసగించడం ఇతని నైజం. ఓ యువతితో ఇలాగే ప్రేమాయణం నడుపుతున్నాడు. ఆమె ద్వారా ఆమె మైనర్ చెల్లెలిని కూడా మభ్యపెట్టి లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. వారి నుంచి రూ.34 లక్షలు వసూలు చేశాడు. ఇది తెలిసి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో అతని మోసాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. -
కబ్జాల తొలగింపు.. కేరళ కయ్యం
బనశంకరి: బెంగళూరులో యలహంకలో కోగిలు లేఔట్లో వలస కూలీల ఇళ్లను గ్రేటర్ బెంగళూరు అధికారులు కూల్చివేయడంపై కేరళ సర్కారు ఆగ్రహంతో ఉంది. ఆ ప్రదేశాన్ని ఆదివారం కేరళ ఎంపీ, ఎమ్మెల్యేలు సందర్శించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కేరళ దర్బార్ ఏమిటి, పదేపదే కర్ణాటకలోకి ఎందుకు జోక్యం చేసుకుంటోంది అనే విమర్శలు వెల్లువెత్తాయి. కేరళ ఎన్నికలలో లబ్ధిని పొందేందుకు కర్ణాటకను వాడుకుంటున్నారనే ప్రచారం ఉంది. కోగిలు లేఔట్లో కేరళ నుంచి వలసవచ్చిన కూలీలు, జనం అక్రమంగా స్థలాలను ఆక్రమించి ఇళ్లు, షెడ్లు కట్టుకున్నట్లు కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు ఇళ్లను తొలగించారు. కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపణలతో గొడవ మొదలైంది. ఇంతలో కేరళకు చెందిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ జోక్యం చేసుకున్నారు. సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే.శివకుమార్తో మాట్లాడి మానవతా దృక్పథం ఆధారంగా ఆశ్రయం కల్పించాలని సూచించారు. పార్టీలో ఆయన సీనియర్ కావడంతో సీఎం, డీసీఎంకు కూడా ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడూ ఇంతేనా మలయాళీలు తమ రాజకీయాల కోసం పదేపదే కర్ణాటక ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారని విమర్శలున్నాయి. మానవతా దృక్పథం పేరుతో కర్ణాటక నుంచి తరచూ సాయాన్ని పొందుతోంది. వరదలు, అడవి జంతువుల దాడులకు సహాయం పొందింది. బండీపుర అడవిలో రాత్రివేళ కేరళ వాహనాల ప్రయాణానికి ఒత్తిడి చేస్తోంది. దీనిని జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేరళ ఎంపీ ఏఏ.రహీం కోగిలు లేఔట్లో పరిశీలించారు. ఆదివారం కేరళ మాజీ మంత్రి ఎమ్మెల్యే జలీల్ పరిశీలించారు. ఆయన వెంట మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం ఉన్నారు. అర్హులైన వారికి పునరావాసం: డీసీఎం కోగిలు లేఔట్ చెత్త తరలింపు ప్రదేశంలో ఆక్రమణల తొలగింపుతో నిరాశ్రయుల్లో అర్హులు, స్థానికులకు పునరావాసం కల్పిస్తామని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. ఆదివారం నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోగిలు లేఔట్ బాధితులకు రాజీవ్గాంధీ వసతి పథకం కింద ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఈ విషయంలో కేసీ వేణుగోపాల్ ట్వీట్ పై బీజేపీ విమర్శలు చేశారనగా, తమ పాలనలో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. వేణుగోపాల్ మా పార్టీ ప్రధాన కార్యదర్శిగా సలహాలు ఇవ్వడానికి అధికారం ఉంది, బీజేపీ జాతీయ నేతలు వచ్చి రాష్ట్ర నేతలకు సలహాలు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. అక్కడ అక్రమంగా షెడ్లు వేసుకున్న వారు ఏ మతంవారు ఎంతమంది ఉన్నారు అనే సమాచారం సేకరించామన్నారు, చట్టం అందరికీ ఒక్కటే. అక్కడ నేను కూడా పరిశీలించానని, ఓ వ్యక్తి వారి నుంచి డబ్బు తీసుకుని ప్రభుత్వ స్థలంలో షెడ్లు వేసుకోవాలని చెప్పాడన్నారు. బెంగళూరు కోగిలులో చెత్త యార్డు స్థలంలో గుడిసెలు, షెడ్ల కూల్చివేతలు మలయాళీల తీవ్ర అభ్యంతరాలు -
దేశ ప్రగతికి కాంగ్రెస్ సహకారం
శివాజీనగర: దేశాన్ని, సమాజాన్ని విడగొట్టడమే బీజేపీ సాధన అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధ్వజమెత్తారు. ఆదివారం బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాపక దినాచరణ లో పాల్గొని మాట్లాడిన ఆయన, ఈ దేశానికి బీజేపీ సేవలు ఏమీ లేవని, దేశం, సమాజాన్ని విడగొట్టడమే వీరి సాధన, పని అని ఆరోపించారు. బీజేపీ మూలమైన ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నడూ పాల్గొనలేదు. పైగా బ్రిటిష్వారితో జత కలిశారు, క్విట్ ఇండియా పోరాటంలో వారి పాత్ర లేదు, కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్వారు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు అని విమర్శించారు. ఆర్ఎస్ఎస్వారు ముందునుంచి కూడా మహాత్మా గాంధీని ద్వేషిస్తున్నారని, వారి కార్యకర్త గాడ్సే.. గాంధీజీని హత్యచేశాడని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీజీ పేరును తొలగించింది బీజేపీనే అన్నారు. ఆధునికి భారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ, దేశానికి జైజవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చినవారు లాల్ బహుదూర్ శాస్త్రి, సామాజిక న్యాయం కోసం కట్టుబడిన ఇందిరాగాంధీ గరీబీ హఠావో అన్నారని కొనియాడారు. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకొచ్చినవారు రాజీవ్గాంధీ అని చెప్పారు. ఏ సర్కారు వచ్చినా గ్యారెంటీలు: డీసీఎం పంచ గ్యారెంటీలను ఏ ప్రభుత్వం వచ్చినా నిలుపుదల చేయడం సాధ్యం కాదు, ఈ పథకాలు దేశానికే ఆదర్శమని డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ చెప్పారు. ప్రతి పంచాయితీలో గ్యారెంటీ సంబరాలు జరపాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలో తాలూకా, జిల్లా పంచాయితీ ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో బూత్ స్థాయిలో పని చేసేవారికి టికెట్ ఇస్తామన్నారు. నాయకుల వెనుక తిరిగేవారికి టికెట్ ఉండదని తెలిపారు. తాలూకా, జిల్లా పంచాయితీ ఎన్నికల టికెట్లకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. జనరల్ వర్గంవారు రూ.50 వేలు, మిగత వర్గాలు రూ. 25 వేల డీడీని దరఖాస్తుతో సహా అందజేయాలని తెలిపారు. ఈ నిధి కాంగ్రెస్ పార్టీ భవనాల నిర్మాణం కోసమే అని చెప్పారు. ఈ సందర్భంలో కొందరు మహిళా కార్యకర్తలు దరఖాస్తు సొమ్మును తగ్గించాలని కోరగా, శివకుమార్ తిరస్కరించారు. చివరకు సీఎం సిద్దరామయ్య చెప్పడంతో మహిళలకు రూ.25 వేలే టికెట్ దరఖాస్తు ఫీజు అని తగ్గింపును డీకే ప్రకటించారు. ఉపాధి పథకం నుంచి గాంధీజీ పేరును తీసేయడాన్ని ఖండిస్తూ జనవరి 5 నుంచి కాంగ్రెస్ నిరసనలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిందేమీ లేదు కాంగ్రెస్ దినోత్సవంలో సీఎం సిద్దు -
దేశం కోసం యువత పాటుపడాలి
రాయచూరు రూరల్: నేటి యువత సైన్యంలో చేరి దేశం కోసం శ్రమించాలని మేజర్ భరత్ భూషణ్ పిలుపునిచ్చారు. వేదాంత కశాశాలలో తాలూక కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాభ్యాసం ముగిసిన వెంటనే వివిధ రకాలె పోటీ పరీక్షలను ఎదుర్కొన్న మాదిరిగా సైన్యంలో చేరడానికి ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతుందన్నారు. సైన్యంలో చేరితే క్రమశిక్షణ, ధైర్యం, శారీరకంగా, మానసికంగా సైనిక అస్త్రం లాంటిదన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రత్యేక ఉపన్యాసం చేశారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా నుంచి సైన్యంలో చేరడానికి వెనుకడుగు వేయడాన్ని ఖండించారు. దేశ సరిహద్దుల్లోనే కాకుండా రాష్ట్ర సరిహదుదల్లో కూడా అంతర్గత భద్రత, ఉగ్రవాదం, సంఘటిత నేరాలు, సైబర్ కేసులు, సమస్యల గురించి కూడా ఆయన వివరించారు. కసాప అధ్యక్షుడు విజయ్ రాజేంద్ర, రాకేష్ రాజలబండి, వెంకటేశ్వర్లు, అమరేష్, దేవేంద్రమ్మలున్నారు. గంజాయి విక్రేతల అరెస్ట్ రాయచూరు రూరల్: గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను బళగానూరు పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకాలో జరిగింది. శనివారం బళగానూరు పోలీసులు తెలిపిన సమాచారం మేరకు దాడి చేయగా మాన్వి తాలూకాలోని తడకల్కు చెందిన అంబణ్ణ(28) సింధనూరు తాలూకా బాలయ్య క్యాంపునకు చెందిన దిద్దిగి మౌనేష్(38), సిద్దప్ప(29)ను అరెస్ట్ చేశామని బళగానూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ యర్రియప్ప తెలిపారు. 174 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రైతుకు పరిహారం ఇవ్వాలిరాయచూరు రూరల్: పత్తిని అమ్మిన డబ్బులు బ్యాంక్లో వేసిన మరుక్షణంలో మాయం అయ్యాయని, ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని అఖిల కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ సర్కార్ను డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాన్వి తాలూకా మాచనూరుకు చెందిన మహిళా రైతు జ్యోతి పత్తి మార్కెట్లో విక్రయించగా, వచ్చిన సొమ్ము రూ.6,70,222 లను మాన్విలోని కెనరా బ్యాంక్ శాఖలో డిపాజిట్ చేశారన్నారు. అయితే 24 గంటల్లోనే బ్యాంక్ నుంచి డబ్బులు పూర్తిగా మాయం అయిందన్నారు. బ్యాంక్ అధికారులు, పోలీసులు సరైన సమాచారం అందించడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు విచారణను త్వరిత గతిన చేపట్టాలని ఒత్తిడి చేశారు. విలేఖర్ల సమావేశంలో జ్యోతి, శరణ బసవ, గోవింద, మల్లణ్ణలున్నారు. ఆభరణాల చోరీ.. బాలుడి అరెస్ట్● రూ.3.12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం హుబ్లీ: ధార్వాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దరామ కాలనీలోని ఓ ఇంట్లో బంగారు, వెండి నగలు చోరీ చేసి పరారైన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొల్లర కాలనీ నివాసి షాహిల్ జాఫర్ గోకాక్ అనే బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 22న సచిన్ హూగార్ అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగలగొట్టి ఆభరణాలను చోరీ చేసినట్లు కేసు దాఖలైంది. గోపనకొప్ప రోడ్డులో బాలుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 22 గ్రాముల బంగారు, 88 గ్రాముల వెండితో కలిపి రూ.3,12,558 విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. కేసు దర్యాప్తులో చొరవ చూపిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. రోడ్డు భద్రత మాసాచరణకు అన్ని ఏర్పాట్లు చేయండి● న్యాయమూర్తి కేఎం రాజశేఖర్ హొసపేటె: జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి జనవరి 1 నుంచి 30 వరకు రోడ్డు భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాల నిర్వహణకు సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కేఎం.రాజశేఖర్ అన్నారు. శుక్రవారం నగరంలో ప్రధాన జిల్లా సెషన్స్ కోర్టు ప్రాంగణంలో ప్రాంతీయ రవాణా శాఖ నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాస సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. రోడ్డు నియమాలు, ప్రమాదాల నివారణ, సురక్షితమైన రోడ్డు ట్రాఫిక్ గురించి అవగాహన కల్పించడానికి అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన ర్యాలీలు, వీధి నాటకాలు నిర్వహించాలన్నారు. అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కుమారస్వామి, తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సుబ్రమణ్య, ఆర్టీఓ కే.దామోదర్, బీఈఓ శేఖర్ హొరపేటె పాల్గొన్నారు. జ్ఞాన సముపార్జన అవసరం రాయచూరు రూరల్: విద్యార్థులు జ్ఞాన సముపార్జన కోసం విద్యనభ్యసించాలే తప్ప అధిక మార్కుల కోసం కాదని మ్యాక్స్వెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు వెల్లడించారు. శనివారం మ్యాక్స్వెల్ కళాశాలలో జరిగిన విజ్ఙాన మేళాలో పాల్గొని విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. నేటి పోటీ యుగంలో చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకొని జ్ఞానం పొందాలన్నారు. మార్కులు సాధించాలని పోతే జీవితాలకు అపాయం కలుగుతుందన్నారు. కన్నడ భాష, నీరు, భూమిపై గౌరవం ప్రదర్శించి రక్షించాలన్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన విజ్ఞాన వస్తు నమూనాలను పరిశీలించారు. -
కొత్త సంవత్సర క్యాలెండర్ల విడుదల
సాక్షి బళ్లారి: జిల్లా బీజేపీ రైతు మోర్చా అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త గణపాల్ ఐనాథ్రెడ్డి కొత్త సంవత్సర క్యాలెండర్లను విడుదల చేశారు. శనివారం ఆయన తన నేతృత్వంలో నిర్వహిస్తున్న హేమ, వేమరెడ్డి సౌహార్ధ సహకార సంఘం, శ్రీకృష్ణ ట్రేడింగ్ కంపెనీ, గణపాల్ ట్రేడింగ్ కంపెనీ, విజయనగర ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విజయనగర శైక్షణిక సేవా ట్రస్ట్, గోవిందరెడ్డి వేర్హౌసింగ్ కంపెనీ, చైత్ర కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీల పేర్లతో రూపొందించిన క్యాలెండర్లను తమ కుటుంబ సభ్యులు, కంపెనీ సిబ్బంది సమక్షంలో విడుదల చేశారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర–2026 క్యాలెండర్ను అందజేశారు. టీటీడీ నుంచి పురంధరోత్సవ అవార్డు రాయచూరు రూరల్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)వారు 2025–26వ సంవత్సరానికి కర్ణాటకలోని గడినాడు ప్రాంతం రాయచూరు జిల్లాకు చెందిన సీనియర్ కవయిత్రి, అధ్యాపకురాలు డాక్టర్ జయలక్ష్మి మంగళ మూర్తికి పురంధరోత్సవ అవార్డు ప్రకటించారు. ఆమె దాస సాహిత్య పరిషత్ విద్వాంసురాలు కావడం విశేషం. జనవరి 17న తిరుమలలో జరుగనున్న పురంధర దాసుల ఆరాధన కార్యక్రమంలో అవార్డును అందచేయనున్నట్లు దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి వేదమూర్తి పండిత్ ఆనంద్ తీర్థాచారి పగడాల వెల్లడించారు. నరేగ పథకం పేరు మార్పు తగదురాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేగ పథకం పేరును మార్చడం తగదని, ఎన్డీఏ అంటే నేమ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని కళ్యాణ కర్ణాటక బోర్డు అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆరోపించారు. శనివారం కేకేఆర్డీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(నరేగ) పథకం పేరును మార్చి కేంద్ర ప్రభుత్వం పేదల కడుపు కొట్టిందన్నారు. గతంలో కేంద్రం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులతో ఈ పథకం కింద కూలికార్మికులతో ఉపాధి పనులు చేయిస్తుండగా నేడు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో పనులు కల్పించేలా కొత్త చట్టం తెచ్చారని ఎద్దేవా చేశారు. నరేగ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరూరాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, విజయ నగర, బళ్లారి, కలబుర్గి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో శనగ పంటను పండించినందున శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కర్ణాటక రైతు సంఘం నేత ఆనందప్ప రుద్రప్ప డిమాండ్ చేశారు. శనివారం కొప్పళ జిల్లా కుకనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జొన్న, వేరుశనగ, పత్తి, మిరప, ఇతర వాణిజ్య పంటలు భారీ వర్షాలకు నష్టపోయాయన్నారు. ఈ విషయాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల మద్దతు ధరను ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వినతిపత్రం సమర్పించారు. చెట్టుకు బైక్ ఢీ.. ఇద్దరు దుర్మరణంరాయచూరు రూరల్: బైక్ చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకాలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి గాంధీనగర్, గొరేబాళ గ్రామాల మధ్య మూడలగిరి క్యాంప్లో ఈ ఘటన సంభవించింది. సింధనూరు తాలూకాలోని గాంధీనగర్కు చెందిన సంతోష్(22), హన్మంతరాయ(22) అనే ఇద్దరు మరణించినట్లు సింధనూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ వినాయక్, ఎస్ఐ మౌనేష్ తెలిపారు. రాత్రి 12 గంటల సమయంలో మద్యం తాగి అతి వేగంగా వాహనం నడపడంతో అదుపు తప్పి చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మరణించారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి
సాక్షి బళ్లారి: మనిషి దేహంలో నేత్రాలు ఎంతో ప్రధానమైనవని, కళ్లు లేకపోతే ఈ ప్రపంచాన్ని చూసేందుకు వీలుండదని, ప్రతి ఒక్కరూ నేత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని దేవీనగర్ 5వ క్రాస్ యల్లమ్మగుడి సమీపంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అమ్మ సేవా ట్రస్ట్కు చెందిన లక్ష్మీదేవి శ్రీనివాసులు(డిష్ శీనా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్ష శిబిరంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడితో జీవిస్తుంటారన్నారు. కళ్ల సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించకూడదన్నారు. కంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఎంతో మంది చనిపోయిన తర్వాత నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వస్తున్నారని కొనియాడారు. కంటి చూపులేని వారు ఎందరో ఇబ్బందులు పడుతుంటారన్నారు. అలాంటి వారిని గుర్తించి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉచిత నేత్ర పరీక్ష శిబిరాల ద్వారా పేదలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కంటి సమస్యలను గుర్తించి వాటికి తరుణోపాయం చేసేందుకు వీలవుతుందన్నారు. కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు మోత్కర్ శ్రీనివాస్రెడ్డి, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. నేత్ర పరీక్ష శిబిరాల నిర్వహణ భేష్ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి -
సొంత ఖర్చుతో విద్యార్థులకు విమానయానం
● విద్యాయాత్ర ఖర్చు భరించిన హెచ్ఎం హొసపేటె: కొప్పళ జిల్లా బహదూర్బండి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీరప్ప అంగడి శనివారం తన సొంత ఖర్చుతో 24 మంది విద్యార్థులు, ఇద్దరు ఎస్డీఎంసీ సభ్యులు, తన పాఠశాలలోని 12 మంది ఉపాధ్యాయులను విమానంలో బెంగళూరుకు విద్యా యాత్రకు తీసుకెళ్లారు. బళ్లారి జిల్లా తోరణగల్లులోని జిందాల్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరిన పిల్లలు విమానంలో వారి ఫోటోలను క్లిక్ చేసి సందడి చేశారు. హెచ్ఎం బీరప్ప విద్యార్థుల విమాన ప్రయాణం, ఆహారం, వసతి ఖర్చులను చెల్లించారు. విమానంలో యాత్రకు వెళ్లే విద్యార్థులను ఎంపిక చేయడానికి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 5 నుంచి 8వ తరగతి వరకు ప్రతి తరగతి నుంచి ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసి విద్యాయాత్రకు తీసుకెళ్లారు. -
దెయ్యం పట్టిందంటూ మహిళ హత్య
రాయచూరు రూరల్: ఓ మహిళకు దెయ్యం పట్టిందని, దానిని విడిపించాలనే సాకుతో వేప కట్టెతో కొట్టి ఆమెను హత్య చేసిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలిని ఆళంద వేంకటేశ్వర కాలనీకి చెందిన ముక్తాబాయి(26)గా గుర్తించారు. ముక్తాబాయికి ఆరేళ్ల క్రితం మహారాష్ట్రలోని మురుమ్కు చెందిన గిడ్డప్పతో పెళ్లి అయింది. వీరికి ఐదేళ్ల వయస్సుగల కుమారుడు ఉన్నాడు. భార్యకు దెయ్యం పట్టిందనే అనుమానంతో భర్త గిడ్డప్ప వేప కట్టెతో కొట్టడంతో మూర్ఛతో పడి పోయింది. తన కూతురికి దెయ్యం పట్టలేదని అనవసరంగా వేప కట్టెతో కొట్టవద్దని ముక్తాబాయి తల్లి తిప్పవ్వ విన్నవించినా ఫలితం లేకపోయింది. కన్న కొడుకు ముందే వేపకట్టెతో శుక్రవారం కొట్టి చిత్రహింసలు పెట్టడంతో తలకు, దేహానికి భారీ గాయాలయ్యాయి. ఆమెను గాణగాపుర సంగమం వద్ద నదిలో స్నానం చేయించి దత్తాత్రేయ దర్శనం చేయించారు. అక్కడ నుంచి యాదగిరి జిల్లా గురుమటకల్లో ఆలయానికి తీసుకెళుతుండగా మూర్ఛకు గురైంది. చివరికి ఆమెను చికిత్స కోసం కలబుర్గి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా శనివారం మరణించింది. తన అక్కకు ఎలాంటి దెయ్యం పట్టలేదని, ఆమెను భర్త గిడ్డప్ప అకారణంగా కొట్టి చంపేశాడని ముక్తాబాయి చెల్లెలు శ్రీదేవి ఆరోపించారు. కలబుర్గి బ్రహ్మాపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని మహారాష్ట్రలోని మురుమ్ పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేశారు. కలబుర్గి జిల్లాలో ఘటన వెలుగులోకి -
మహిమాన్వితం.. పురాతన ఆలయం
సాక్షి బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, లక్షలాది మంది భక్తులు ఆరాధించి, పూజించి కొలుస్తున్న రూపనగుడి శ్రీలక్ష్మీవెంకటరమణస్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా భాసిల్లుతోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో బళ్లారి గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని రూపనగుడి గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీవెంకటరమణస్వామి ఆలయం ఎంతో పురాతనమైనది. 1207 సంవత్సరంలో ఈప్రాంతాన్ని పాలించిన రూపణ్ణ నాయక్ అనే పాలెగాడు ఆధ్వర్యంలో ఛాయాపతి, శామాచార్ అనే బ్రాహ్మణ ఆయుర్వేద వైద్యులు ఎంతో శ్రమించి ఆలయాన్ని నిర్మించారు. వారు నిర్మించడానికి ముందే ఆలయంలో చిన్నగుడిలో చెన్నకేశవ స్వామి, శ్రీఆంజనేయస్వామి విగ్రహాలను ఉంచి భక్తులు ఎన్నో వందల ఏళ్ల నుంచి పూజిస్తూ తమ కోర్కెలను తీర్చుకునేవారు. 17వ తరపు ఆలయ పూజారిగా జనార్థనాచార్యులు ఆ తర్వాత ఇదే ఆలయ పరిసరాల్లో దాదాపు ఒక ఎకరానికి పైగా విస్తీర్ణంలో తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ తరహాలో ఆలయాన్ని నిర్మించారు. 800 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీలక్ష్మీవెంకటరమణస్వామి ఆలయంలో ఒకే కుటుంబానికి చెందిన వారు పూజారులుగా కొనసాగుతూ ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తుండటం విశేషం. ప్రస్తుతం 17వ తరానికి చెందిన జనార్ధనాచార్యులు పూజారిగా కొనసాగుతున్నారు. ఆలయంలో కొంత భాగం దెబ్బతినడంతో బళ్లారికి చెందిన మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టారు. నాలుగేళ్ల క్రితం ఆలయంలో వినూత్న తరహాలో గోపురానికి రంగులు, గర్భగుడికి మరమ్మతులతో పాటు మొత్తం ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడంతో ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆలయం ఆవరణలోకి ప్రవేశించిన వెంటనే ఎత్తైన ధ్వజస్తంభాన్ని, ఆలయంలో శ్రీలక్ష్మీవెంకటరమణ స్వామి విగ్రహం, అమృతవల్లి రూపంలో ప్రతిష్టించిన లక్ష్మీదేవి విగ్రహం, నవగ్రహాల విగ్రహాలు, శ్రీచెన్నకేశవస్వామి, శ్రీఆంజనేయస్వామి విగ్రహాలను దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు ఈనెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ పూజారి జనార్ధనాచార్యులు సాక్షికి తెలిపారు. ఆలయంలో ప్రతి రోజు పూజలు నిర్వహిస్తున్నామన్నారు. వైకుంఠ ఏకాదశి, వైశాఖ శుద్ధపౌర్ణమి రోజున రథోత్సవం, శనివారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో పురాతనమైన ఆలయాల్లో మొదటిది రూపనగుడిలోని శ్రీక్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటరమణ స్వామి దేవాలయం కావడం విశేషం. కాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని సంగం సర్కిల్ సమీపంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, హొసపేటె రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, సత్యనారాయణపేటెలోని శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. రూపనగుడిలోని పురాతన లక్ష్మీవెంకట రమణస్వామి ఆలయ ముఖ ద్వారం ఆలయ ధ్వజ స్తంభం రూపనగుడిలోని శ్రీలక్ష్మీవెంకట రమణ స్వామి దేవాలయం ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి భారీ ఎత్తున ఏర్పాట్లు -
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మండల పూజ
బళ్లారి అర్బన్: నగరంలోని అనంతపురం రోడ్డులో తారానాథ ఆస్పత్రి ఎదురుగా రాఘవేంద్ర కాలనీలో వెలసిన శబరి అయ్యప్ప దేవస్థానంలో 43వ వార్షిక మండల పూజను దేవస్థాన ట్రస్ట్ అధ్యక్షుడు జయప్రకాష్ జే గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. ధ్వజారోహణం, గణహోమం, నవగ్రహ హోమం, అయ్యప్ప స్వామి హోమం, విశేష అష్ట్రదవ్యాభిషేకం, మహామంగళ హారతి, మాలధారి అయ్యప్పలతో లక్ష అర్చన, అయ్యప్ప స్వామి నామ స్మరణతో భజన భక్తి గీతాలను పాడారు. పూర్ణాహుతి అనంతరం మహా మంగళ హారతి జరిపారు. సాయంత్రం శ్రీరంగ స్వామి వేణు బృందంచే అయ్యప్ప భక్తిగీతాలను ఆలపించి 18వ పడిపూజను చేశారు. పూజల్లో వందలాది మంది అయ్యప్ప స్వాములతో పాటు వేలాదిగా నగర భక్తాదులు పాల్గొన్నారు. హొసపేటె: మండల పూజలో భాగంగా శుక్రవారం ఆలయంలోని అయ్యప్ప స్వామి విగ్రహానికి అష్టాభిషేకం చేసి, ప్రత్యేక అలంకరణలతో అలకరించి పూజలు చేశారు. ప్రధాన పూజారి గణేష్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత నవగ్రహ, దుర్గ, సుదర్శన హోమం, క్షిప్ర కార్యసిద్ధార్థ గణపతి హోమం జరిపారు. అయ్యప్ప మాలధారులు సహా వేలాది మంది భక్తులు ఉదయం నుంచి అయ్యప్ప ఆలయానికి చేరుకుని దేవుడిని దర్శనం చేసుకున్నారు. -
తాలూకా అభివృద్ధికి చర్యలు చేపట్టండి
రాయచూరు రూరల్: కొత్త తాలూకా అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు సూచించారు. శనివారం నగరంలోని శాఖ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాన్వి నుంచి నూతనంగా సిరవార తాలూకాను ప్రకటించడంతో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. పట్టణానికి తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీససుకొని పైపులైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్దశ కల్పించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. క్రీడా మైదానం, అగ్నిమాపక కేంద్రం, గ్రంథాలయం, హాస్టల్ వంటివి ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే హంపయ్య నాయక్, తహసీల్దార్ అశోక్, టీపీ ఈఓ శశిధర్, ఇంజినీర్లు విజయలక్ష్మి, వీరేష్ నాయక్లున్నారు. -
ముగిసిన రత్నమ్మవ్వ అంత్యక్రియలు
బళ్లారి టౌన్: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో గత రెండు రోజులుగా ఎర్రితాత మఠం ధర్మకర్త, అధ్యక్షురాలు రత్నమ్మవ్వ మృతి చెందడంతో అంత్యక్రియలు చేయడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే శనివారం ఉదయం ఎర్రితాత మఠం ఆవరణలో కాకుండా మఠం ముందు భాగంలోని స్థలంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో బీజేపీకి చెందిన మాజీ మంత్రి బీ.శ్రీరాములు, మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప పాల్గొని ముందుండి జరిపించారు. అంతకు ముందు మఠంలోని రత్నమ్మవ్వ ఇంటి వద్ద ఆమె భౌతికకాయాన్ని ఊరేగింపు ద్వారా భారీగా ప్రజలు తరలివచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా బందోబస్తులో బళ్లారికి చెందిన పోలీసు బలగాలు కూడా భారీగా మోహరించారు. -
ఒక్క అనప.. వంద రుచులు
● బెంగళూరులో మేళా బనశంకరి: బసవనగుడి నేషనల్ కాలేజీ మైదానంలో అనపకాయల మేళా ను శనివారం డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ప్రారంభించారు. అనపగింజలతో చేసిన వివిధ రకాల వంటకాలు నగరవాసులను నోరూరిస్తున్నాయి. అనపకాయల ఓలిగ, వడ, దోసె, ఇడ్లీ, సాంబారు, పాయసం, జిలేబీ, మైసూరు పాక్ ఇంకా అనేక తీపి, కారం వంటకాలు లభిస్తున్నాయి. జనవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. టీవీ నటి భవ్య గౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనప వంటకాలను రుచిచూశారు.దర్శన్ భార్యపై సుదీప్ గుస్సా దొడ్డబళ్లాపురం: చెంపమీద కొడితే కొట్టించుకునేంత మంచివాన్ని కాదని, ప్రేమతో తల్లి కొడితే అది వేరే విషయమని, అదే పక్కింటి వాడు కొడితే చూస్తూ ఊరుకోనని ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ అన్నారు. కొన్నిరోజులుగా సుదీప్, దర్శన్ భార్య, ఫ్యాన్స్తో ఆయనకు మాటల యుద్ధం జరగడం తెలిసిందే. ఇంతలో కొందరు సోషల్ మీడియాలో దర్శన్ భార్య విజయలక్ష్మి పై అశ్లీల కామెంట్లు పోస్టు చేశారు. వీటిని ఆమె స్క్రీన్ షాట్ తీసి క్లాస్ ఫ్యాన్స్ అని సుదీప్ను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. మామూలుగా సుదీప్ అభిమానులను ఇలానే పిలుస్తారు. దీంతో సుదీప్ ఆగ్రహానికి గురయ్యారు. చెంపమీద కొడితే చూస్తూ ఊరుకోమని అభిమానులకు మద్దతుగా నిలిచారు. తాను గొడవలు పెట్టుకోవడానికి రాలేదన్నారు.బంగ్లాదేశ్ హిందువులను కాపాడండి కోలారు: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలు, హత్యలను ఖండిస్తూ శనివారం హిందూ సంఘాల కార్యకర్తలు నగరంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. సంఘాల నేతలు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో రోజురోజుకూ హిందువులపై దౌర్జన్యాలు అధికం అవుతున్నాయని, దీపు దాస్ అనే హిందువును దారుణంగా హత్య చేశారు. హత్యకు ముందు చెట్టుకు ఉరివేసి చిత్ర హింసలకు గురిచేశారన్నారు. బంగ్లాదేశ్లో హిందువులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీపుదాస్ హంతకులను కఠినంగా శిక్షించాలన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై నరమేధానికి పాల్పడడం అత్యంత హేయ కృత్యమని, తక్షణం అల్లరి మూకలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రమాదాల కట్టడికి కేంద్రానికి లేఖ దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసింది. ఇకపై రాత్రివేళ బస్సులు నడిపే డ్రైవర్లు కనీసం రెండు గంటలు విశ్రాంతి తీసుకునేలా నిబంధనలు విధించాలని కోరింది. రాత్రి 12 నుంచి తెల్లవారుజాము 4గంటలలోపు డ్రైవర్ రెండు గంటలపాటు విశ్రాంతి తీసుకుకోవాలనే నిబంధన ఉన్నా ఎవరూ పాటించడం లేదు. ఇకపై జీపీఎస్ టెక్నాలజీ ద్వారా విశ్రాంతిని నిర్ధారించే అధికారం రవాణాశాఖకు ఇవ్వాలనేది డిమాండు ఉంది. అలాగే డ్రైవరు నిద్రమత్తులోకి జారుకుంటే అలర్ట్ చేసే సాంకేతికతను డ్రైవర్ క్యాబిన్లో అమర్చాలి. డ్రైవర్ నిద్రమత్తుకు గురైతే వెంటనే అలారం మోగుతుంది. చిరుత బందీ మండ్య: మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని హరదనహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బొమ్మనహళ్లి గ్రామవాసులకు ఇబ్బందిగా మారిన చిరుత పులి బోనులోకి చిక్కింది. కొన్నివారాలుగా చిరుతపులి ఇక్కడ తిరుగుతూ కుక్కలను ఎత్తుకెళ్తోంది. చిరుతను చూసిన గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వారి ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు చిరుత కోసం గాలించి అక్కడక్కడ బోనులు ఉంచారు. శనివారం తెల్లవారుజామున ఓ బోనులోకి చిరుత చిక్కింది. దానిని అక్కడి నుంచి తరలించారు. -
కంటైనర్ను వెనుక నుంచి కారు ఢీ
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని గెజ్జలగెరె మన్మూల్ కేంద్రం సమీపంలో బెంగళూరు–మైసూరు ఎక్స్ప్రెస్వే సర్వీస్ రోడ్డుపై శుక్రవారం రాత్రి కారు, గూడ్స్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్, మండ్య నగరంలోని హాలెటౌన్వాసి గోవిందరాజు (33), యట్టగడహళ్లికి చెందిన అశోక్ (35) మరణించారు. మరొకరు దినేష్ జోసెఫ్ (33) తీవ్రంగా గాయపడ్డారు. అతనిని మైసూరులోని నారాయణ హృదయాలయలో చేర్చారు, పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ చన్నపట్టణ తాలూకాలోని ముదిగెరె సమీపంలోని ఎంపైర్ హోటల్లో క్రిస్మస్ విందును ముగించుకుని కారులో తిరిగి వస్తున్నారు. ఘటనాస్థలిలో సర్వీస్ రోడ్డులో రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు వెనుక నుండి ఢీకొట్టింది. మలవళ్లి డీఎస్పీ యశ్వంత్ కుమార్, సీఐ నవీన్, ట్రాఫిక్ ఎస్ఐ రామస్వామి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కారును పక్కకు తొలగించారు.అశోక్ గోవిందరాజు (ఫైల్) ఇద్దరు మృతి, మరొకరికి విషమం మండ్య జిల్లాలో ప్రమాదం -
మైసూరు ప్యాలెస్లో భద్రతా లోపాలు
మైసూరు: ప్యాలెస్ సిటీలో 25న రాత్రి అంబా విలాస్ ప్యాలెస్ ముందు హీలియం బెలూన్ల విక్రేత సిలిండర్ పేలిపోయిన ఘటనలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ దుర్ఘటనలో విక్రేత సలీం, ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా ఐదారుమంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నారు. ప్యాలెస్ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే విషయం బయటపడింది. సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాల ఫుటేజ్లను తీసుకోవడానికి వెళ్లిన పోలీసు అధికారులకు ప్యాలెస్ భద్రతా లోపాలు నివ్వెరపరిచాయి. ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో ఎలాంటి చిత్రాలు నమోదు కాకపోవడం ఆశ్చర్యకరం. ఇది 360– డిగ్రీల కెమెరా అని, కానీ అది చూసే కోణం పూర్తి తప్పుగా ఉందని తేలింది. జిల్లా, ప్యాలెస్ అధికారులు రూ.కోట్ల ఖర్చు చేసి కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఉపయోగం లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. పేలుడు దృశ్యాలు దర్యాప్తులో సహాయపడతాయి. కానీ ఫుటేజీ లేకపోతే ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. తగ్గిన జన రద్దీ శీతాకాల మాగీ ఫెస్టివల్ను చూడడానికి రోజూ వేలాది మంది దేశ విదేశీ పర్యాటకులు వస్తున్నారు. అలాగే, క్రిస్మస్ సెలవులు కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో విస్ఫోటం జరగడంతో అందరూ భయాందోళనకు లోనయ్యారు. శనివారం ప్యాలెస్ ఆవరణలో ఓ మోస్తరుగా జనం కనిపించారు. పేలుడు స్థలం వద్ద ఉత్తుత్తి సీసీ కెమెరా పోలీసులకు ఫుటేజీ లభించని వైనం -
వైకుంఠ ఏకాదశి దర్శనాలకు ఏర్పాట్లు
బనశంకరి: పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 30న బెంగళూరులోని వయ్యాలికావల్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి (టీటీడీ) ఆలయంలో విశేష దర్శనాలు కల్పిస్తారు. ఏర్పాట్ల వివరాలను శనివారం తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్ ఉంటుందన్నారు. రూ.200 టికెట్ తీసుకుంటే త్వరగా దర్శనం లభిస్తుందని తెలిపారు. క్యూలైను చౌడయ్య స్మారక భవనం 2వ మెయిన్రోడ్డు నుంచి ప్రారంభమౌతుందన్నారు. 80 వేల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు. ఆ రోజంతా కళాకారులతో భజనలు, భక్తగాన కచేరీలు జరుగుతాయన్నారు. టీటీడీ ప్రముఖులు కే.వీరాంజనేయులు, ఎస్.నరేశ్కుమార్, అధికారిణి జయంతి పాల్గొన్నారు. పులి దాడి.. జనం ధర్నా మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా గురుపుర చెరువు వద్ద పులి దాడిలో ఒక ఎద్దు మరణించింది. మున్నా అనే వ్యక్తికి చెందిన ఎద్దును చెరువు సమీపంలో మేత కోసం కట్టి ఉంచగా పులి దాడి చేసి చంపి రక్తం తాగింది. పదేపదే పులి దాడి చేస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఎద్దు కళేబరాన్ని గ్రామస్తులు ట్రాక్టర్లో తీసుకుని గురుపురలో హెచ్డీకోటె–హుణసూరు ప్రధాన రహదారిలో కొంతసేపు పెట్టి రాస్తారోకో చేశారు. అటవీ శాఖ అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే పులిని పట్టుకోవాలని, గ్రామం చుట్టుపక్కల పహారా పెంచాలని, ఎద్దు యజమానికి పరిహారం అందించాలని కోరారు. బీదర్లో తీవ్ర చలి దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గడం లేదు. బీదర్లో శుక్రవారంనాడు 6.3 డిగ్రీల సెల్సియస్ శీతల వాతావరణం నమోదైంది. పగలూ రాత్రి తేడా లేకుండా చలి తీవ్ర కొనసాగుతోంది. పైగా పొగమంచు కూడా వ్యాపిస్తోంది. దీంతో జనం నానా తంటాలు పడుతున్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో రాత్రి వేళ 10 సెల్సియస్ల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దక్షిణ లోతట్టు జిల్లాల్లో కనిష్టంగా 12, 14 డిగ్రీలుగా ఉంటోంది. బెంగళూరులో కనిష్ట ఉష్ణోగ్రత 12.5 నమోదవుతోంది. కోస్తాతీర ప్రాంతాలు, మిగతా జిల్లాల్లో సరాసరి 27, 29 డిగ్రీలుగా ఉంటోందని వాతావరణ శాఖ తెలిపింది. అర్ధరాత్రి పోకిరీల వేధింపులు కృష్ణరాజపురం: ఒకే బైకులో వెళుతున్న ముగ్గురు ఆకతాయిలు రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని వేధించారు. ఈనెల 25వ తేదీన అర్ధరాత్రి బీటీఎం లేఔట్లో ఈ కీచకపర్వం జరిగింది. స్కూటర్లో హెల్మెట్ ధరించి వెళుతున్న యువతిని బైక్లో హెల్మెట్ ధరించకుండా అడ్డదిడ్డంగా నడుపుతున్న యువకులు వెంటాడారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర యువతిని ఫాలో చేస్తూ పదే పదే అడ్డు వస్తూ వేధింపులకు గురి చేశారు. దీనిని ఓ కారులో వస్తున్న వ్యక్తి వీడియో తీసి పోలీసులకు ట్యాగ్ చేశాడు. బైక్ నంబరు, యజమాని వివరాలను కనుగొన్నామని, ముగ్గురు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని సుద్దగుంటెపాళ్య పోలీసులు ఎక్స్లో స్పందించారు. నేడు కార్వారకు రాష్ట్రపతి రాక బనశంకరి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఆదివారం కార్వార నగరంలో అరేబియా సముద్ర తీరంలోని కదంబ నౌకా స్థావరం సీ బర్డ్ని సందర్శిస్తారు. ఉదయం చేరుకుని, నౌకాదళ జలాంతర్గామిలో ప్రయాణిస్తారు. రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కార్వారకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కార్వార పరిసరాలలో, సముద్ర తీరంలోను భారీ భద్రత ఏర్పాటైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3.30 వరకు కార్వార తీరంలో చేపల వేటను నిషేధించినట్లు మత్స్యకారులకు తెలిపారు. -
కల్యాణం.. కడు విషాదం
యశవంతపుర: కల్యాణం.. కమనీయం అన్నారు. కానీ ఘోర విషాదంగా పరిణమించింది. పట్టుమని 2 నెలలు కూడా కాపురం చేయని నవ వధూవరులు ఆత్మహత్యలతో పరలోకానికి చేరారు. ఈ ఘోరం బెంగళూరులోనే జరిగింది. నవవివాహిత గానవి (26) ఆత్మహత్యాయత్నం, మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. భార్యను వేధించాడని, నపుంసకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త సూరజ్ మహారాష్ట్ర నాగపూర్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది తెలిసి సూరజ్ తల్లి జయంతి కూడా ఆత్మహత్యకు యత్నించిన్నట్లు పోలీసులు తెలిపారు. అట్టహాసంగా పెళ్లయితే.. గానవి, సూరజ్ (30)లకు అక్టోబర్ 29న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో అట్టహాసంగా వివాహమైంది. 12 రోజుల కిందట శ్రీలంకకు హనీమూన్కు వెళ్లారు. కానీ అక్కడ ఇద్దరి మధ్య పోట్లాటలు జరిగి మధ్యలోనే ముగించుకొని బెంగళూరుకు వచ్చేశారు. మీ కూతురిని తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులకు సూరజ్ ఫోన్ చేసి చెప్పాడు. ఈ గొడవలతో 24న గానవి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రిలో 26న చనిపోయింది. నాగపూర్కు వెళ్లిపోయి.. గానవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సూరజ్ కుటుంబంపై పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యాయత్నం అభియోగాలతో రామమూర్తినగర పోలీసులు కేసును నమోదు చేశారు. అరెస్టు భయంతో సూరజ్, తల్లి జయంతి, సోదరుడు సంజయ్ నాగపూర్కు పరారయ్యారు. శనివారం అక్కడే ఓ విల్లాలో సూరజ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి జయంతి కూడా ఆస్పతిర్లో చికిత్స పొందుతోంది. ఈ మేరకు స్థానిక సోనేగావ్ పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారమిచ్చారు. భర్త సూరజ్, భార్య గానవి (ఫైల్) 2 నెలల క్రితం మూడుముళ్ల సంబరం ఇటీవల భార్య ఆత్మహత్య ఇంతలోనే భర్త బలవన్మరణం గానవి తల్లి ఏమన్నారు? సూరజ్ ఆత్మహత్యకు అతని తప్పుడు భావనలే కారణమని గానవి తల్లి ఆరోపించింది. నెలన్నర పాటు సూరజ్ సంసారం చేయలేదు, భార్య పక్కన కూర్చుని భోజనం కూడా చేసేవాడు కాదు. భర్త, అత్తల ప్రేమ కోసం గానవి ఎంతో ప్రయత్నించింది, పుట్టింటికీ వెళ్లను ఇక్కడ ఉండి బతుకుతా, నాకు ప్రేమను పంచండి అని గానవి భర్త, అత్తతో మొరపెట్టుకుంది. కానీ పుట్టింటికి వెళ్లిపో అని ఒత్తిడి చేశారు. తప్పుడు ఆలోచనలు, గానవి శాపమే సూరజ్ ఆత్మహత్యకు కారణం అని దుయ్యబట్టారు. -
పోస్టాఫీసులో రూ.2 కోట్ల స్వాహా
గౌరిబిదనూరు: తాలూకా ఆలగానహళ్ళిలో ఇడగూరుకు చెందిన రమ్య అనే మహిళ పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తూ ప్రజల డబ్బులను భారీ మొత్తంలో స్వాహా చేసింది. ఇప్పుడు తమ డబ్బులు లేకపోవడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. బాధితులు తెలిపిన మేరకు.. రమ్య 2013 ఆలగానహళ్లి పోస్టాఫీసులో ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఇందులో సుమారు 1200 మంది ఖాతాదారులు వివిధ పథకాల కింద డబ్బులు జమచేస్తున్నారు. అయితే వారు జమ చేసిన డబ్బు ఖాతాలలోకి జమ కాలేదని, దివ్యాంగులు, వితంతు, వృద్దుల పెన్షన్ సైతం చాలామందికి అందలేదని గ్రామప్రజలు ఆరోపించారు. సుమారు రూ.2 కోట్లకు పైబడిన సొమ్ము రమ్య పాలైనట్లు వాపోయారు. పోస్టల్ అధికారుల నిర్బంధం శుక్రవారం సాయంకాలం విచారణకు వచ్చిన పోస్టల్ అధికారులను లోపల ఉంచి గ్రామస్థులు తాళం వేశారు. కొంత సేపటికి రూరల్ పోలీసులు వచ్చి వారిని విలిపించి, బాధితులు స్టేషనులో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. శనివారం గ్రామప్రజలు మళ్లీ ఆందోళనకు దిగారు. పై అధికారులు వచ్చి లెక్కలు తేల్చాల్సి వుంది. రమ్య రూరల్ పోలీసు స్టేషనుకు వచ్చింది. ఖాతాదారుల డబ్బు ఎక్కడికీ పోదని, పోస్టాఫీసువారు చెల్లిస్తారని పోస్టల్ ఇన్స్పెక్టర్ హనుమంతప్ప చెప్పారు. మహిళా ఉద్యోగిని బాగోతం ఖాతాదారుల ఆందోళన -
మిత్రపక్షాల మధ్య పొత్తు రచ్చ
దొడ్డబళ్లాపురం: అధికార పార్టీలో అలా ఉండగా, ప్రతిపక్షాల్లోనూ లుకలుకలు బయటపడ్డాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జేడీఎస్తో పొత్తుకు తమ హైకమాండ్ ఆదేశిస్తే సిద్ధమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. పంచాయతీ ఎన్నికలలో బీజేపీతో తాము కలవబోమని దేవెగౌడ చెప్పడం తెలిసిందే, అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి మెజారిటీ సాధించాలని విజయేంద్ర చెప్పగా, ఆయన యంగ్స్టార్లా మాట్లాడుతున్నారని దళపతి చమత్కరించడం తెలిసిందే. దీంతో రెండుపార్టీలకు కేంద్ర స్థాయిలో పొత్తులు, రాష్ట్రంలో వైషమ్యాలు అనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో విజయేంద్ర బెంగళూరులో శనివారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తన వ్యాఖ్యలను దేవేగౌడనే తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను తొలగించడానికి జేడీఎస్ పెద్దలు దేవేగౌడ, కుమారస్వామి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా శిరసావహిస్తామన్నారు. ప్రతిసారీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమకు అధికారానికి 5, 10 సీట్లు తక్కువ వచ్చేవని, అందువల్ల తాను కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పూర్తి మెజారిటీ సంపాదించాలని చెప్పానన్నారు. తన మాటల్లో కానీ, దేవేగౌడ మాటల్లో కానీ తప్పులు వెతకవద్దని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జేడీఎస్తో పొత్తు ఉండదని మా పార్టీ వాళ్లు ఎవరూ చెప్పలేదన్నారు. బీజేపీతో పొత్తు ఉండదని మాజీ ప్రధాని చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. తమ అధిష్టానం ఇలాంటి వివాదాలను పరిష్కరిస్తుందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ గెలిచింది, బీజేపీ అధికారంలోకి రావాలనేది ప్రజల ఆకాంక్ష అని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఉండదన్న దళపతి ఉంటుందన్న బీజేపీ నేత విజయేంద్ర -
మార్మోగిన ప్రభువు నామ జపం
సాక్షి,బళ్లారి: పవిత్రమైన ఏసుక్రీస్తు జన్మించిన రోజున క్రైస్తవ సోదరులు ఏసునామాన్ని జపించి పునీతులయ్యారు. నగరానికే తలమానికంగా ఉన్న, పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న ఆరోగ్యమాత చర్చి క్రైస్తవ సోదరులతో నిండిపోయింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆరోగ్యమాత చర్చికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్త దుస్తులు ధరించి, కుటుంబ సభ్యులతో చర్చికి వచ్చి, కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. చర్చి ఫాదర్లు కూడా ఆరోగ్యమాత చర్చిలో ఉండి చర్చికి వచ్చిన వారితో ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. నగరంలోని సీఏస్ఐ తెలుగు, సీఎస్ఐ కన్నడ, సీఎస్ఐ ఇంగ్లిష్, క్యాథలిక్ తదితర చర్చిల్లో ఎక్కడ చూసినా క్రీస్తు నామాన్ని జపిస్తూ ఆరాధించారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చిలన్ని క్రైస్తవ సోదరులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా బళ్లారి కేంద్రంగా వివిధ జిల్లాలకు ధర్మగురువుగా పేరుగాంచిన బిషప్ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుని ప్రార్థనలు కూడా చేశారు. ఆయా చర్చిల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘనంగా క్రిస్మస్ వేడుకలు రాయచూరు రూరల్: ఏసు క్రీస్తు జన్మదినోత్సవం సందర్భంగా గురువారం క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా ఆచరించారు. క్రైస్తవ సోదరులు నగరంలోని అగాపె, మెథడిస్ట్, క్యాథలిక్, కాన్వెంట్ స్కూలు చర్చిల్లో ప్రార్థనలు జరిపారు. మెథడిస్ట్ చర్చిలో ఫాదర్ సోదరులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ శాంతి, సౌభ్రాతృత్వం, సోదరత్వం, ఆత్మీయతను కల్గి ఉండాలని కోరారు. రైల్వేస్టేషన్ సర్కిల్లో రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. పలు చర్చిల్లో ప్రభు ఏసు క్రీస్తును వివిధ రూపాల్లో అలంకరించడంతో పాటు సందేశాలిచ్చే సాంకేతిక విషయాలను కూడా పొందుపర్చారు. చర్చిలో ఫాదర్లు వరప్రసాద్, బి.జాన్, అబ్రహాం జాన్, సమ్సోన్ జేమ్స్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ప్రార్థనల్లో జయన్న, రమేష్, రాజేష్, తిమ్మారెడ్డి, దానప్ప యాదవ్, రవి పాల్గొన్నారు. విజయనగరలో క్రిస్మస్ సందడి హొసపేటె: క్రిస్మస్ పర్వదిన వేడుకలను గురువారం విజయనగర జిల్లాలోని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పలు చర్చిల్లో క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మొదలయ్యాయి. ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని పండుగ వాతావరణంతో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నగరంలోని తెలుగు సీఎస్ఐ చర్చితో ఆయా చర్చిలలో క్రైస్తవులు ప్రార్థనా గీతాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. చర్చి ప్రాంగణాలు ఆధ్యాత్మిక సందేశాలతో మార్మోగాయి. శాంతి, ప్రేమ, సోదరభావం అనే సందేశాలను పాస్టర్లు ఉపదేశించారు. చర్చి ప్రాంగణాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. చర్చిల ప్రధాన ద్వారాలు విద్యుత్ కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, చర్చిల ప్రాంగణాలు శోభాయమానంగా మారాయి. క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. జిల్లా వ్యాప్తంగా చర్చిలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించగా, ప్రత్యేక ప్రార్థనలతో సందడి నెలకొంది. పేదలకు అన్నసంతర్పణ, అవసరమైన వారికి ఆర్థిక సహాయం వంటి సేవా కార్యక్రమాలను కూడా చర్చిల ఆధ్వర్యంలో చేపట్టారు. బళ్లారి బిషప్కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితరులు హొసపేటెలోని చర్చిలో ప్రార్థనలు చేస్తున్న దృశ్యం భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ ఆచరణ వేడుకలు చర్చిల్లో కులమతాలకతీతంగా ప్రార్థనలు అంబరం.. క్రిస్మస్ సంబరం బళ్లారి రూరల్ : క్రిస్మస్ పండుగలో భాగంగా గురువారం నగరంలోని ప్రధాన మేరీమాత చర్చిలో విశేష ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచే క్రైస్తవ సోదరులు ఏసుప్రభువును దర్శించుకొన్నారు. చర్చిలో ఫాదర్లు భక్తులను దీవించారు. కుల మత భేదాలు లేకుండా క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు చర్చికి వచ్చి కరుణామయుడి కటాక్షం కోసం కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థించారు. మేరీమాత చర్చి ప్రాంగణమంతా జనసందోహంతో నిండిపోయింది. అదేవిధంగా బత్రి రోడ్డులోని ఎఫ్బీఏబీ చర్చిలో కూడా ప్రార్థనలు నిర్వహించారు. విద్యారులు యేసయ్య భక్తి కీర్తనలతో నృత్యాలు చేశారు. -
ఐసీయూలో నవవధువు
బనశంకరి: అంగరంగ వైభవంగా పెళ్లి, విదేశంలో హనీమూన్.. అంతలోనే నవ వధువు ఆనందం మూణ్నాళ్ల ముచ్చటైంది. రెండునెలలు గడవకముందే ఆత్మహత్యకు ప్రయత్నించింది. బెంగళూరు రామమూర్తినగరలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. అక్టోబరు 29 తేదీన సూరజ్, గానవి (26)కు ప్యాలెస్ మైదానంలో వైభవోపేతంగా వివాహం జరిగింది. గత 10 రోజుల క్రితం శ్రీలంక కు హనీమూన్ కు వెళ్లారు. కానీ మధ్యలోనే తిరిగి వచ్చారు. మీ కుమార్తెను తీసుకెళ్లండి అని భర్త సూరజ్ అత్తమామలకు తెలిపాడు. దీంతో ఆవేదన చెందిన బుధవారం మధ్యాహ్నం భర్త ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వారు గమనించి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. పెళ్లయిన రోజు నుంచి వేధింపులే వివాహమైన రోజు నుంచి భర్త సూరజ్, అత్త జయంతి, మరిది సంజయ్ మరింత కట్నం , బంగారం తేవాలని గానవిని పీడిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. వారిపై రామమూర్తినగర ఠాణాలో ఫిర్యాదు చేశారు. కట్నం వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణతో కేసు నమోదైంది. భర్త ఇంట వేధింపులతో ఆత్మహత్యాయత్నం బెంగళూరులో సంఘటన -
ఘనంగా జాతీయ రైతు దినోత్సవం
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా బుడదిన్నిలో గురువారం జాతీయ రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రామంలో భవిష్య భారత్, వీఎస్టీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శశికాంత్ మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం జారీ చేసిన పథకాలను అధికారులు ప్రామాణికంగా, జవాబుదారితనంతో వారికి అందేలా విధులు నిర్వహించాలన్నారు. పంటల రక్షణ, లాభ నష్టాలను గురించి వివరించారు. వ్యవసాయ అభివృద్ధి విషయంలో రైతులు, అధికారుల సహకారం ప్రధానమన్నారు. కార్యక్రమంలో అధికారులు వినయ్ రెడ్డి, వనితలున్నారు. అటల్ బిహారి వాజ్పేయి జన్మదిన వేడుక రాయచూరు రూరల్: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి జన్మదినం సందర్భంగా గురువారం అటల్జీ చిత్రపటానికి శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పూలమాల వేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో సమావేశాన్నుద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగాలని కన్న కలలు సాకారం కావాలన్నారు. కార్యక్రమంలో నగర బీజేపీ అధ్యక్షుడు రాఘవేంద్ర, గోవిందు, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, నేతలు రవీంద్ర, చంద్రశేఖర్, నాగరాజ్లున్నారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. గ్రామీణ నియోజకవర్గంలో నిర్వహించిన సుశాసన దినోత్సవంలో మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
దైవకుమారుడా.. జయము జయము
బసిలికా ఆవరణలో బాలఏసు మందిరం గురువారం ఉదయం బెంగళూరులోని సెయింట్ మేరీస్ బసిలికాలో భక్తుల ప్రార్థనలు బసిలికా చర్చి లోపల విశేష ప్రార్థనలు బనశంకరి: ఏసు ప్రభువు పరలోకమును విడిచి సకల మానవాళి మేలు కోసం భువిపై వెలసిన పవిత్ర దినమే క్రిస్మస్ అని మతగురువులు పేర్కొన్నారు. గురువారం బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా క్రిస్మస్ పండుగ రోజును క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. బుధవారం రాత్రి నుంచి అన్ని చర్చిలను సుందరంగా అలంకరించి ప్రార్థనలు చేపట్టారు. బెంగళూరులోని శివాజీనగర సెయింట్ మేరీస్ బసిలికా చర్చిలో బుధవారం అర్ధరాత్రి మతగురువుల ఆధ్వర్యంలో విశేష ప్రార్థనలు జరిగాయి. వేలాదిగా క్రైస్తవులు పాల్గొన్నారు. పులకేశినగరలోని హోలి ఘోస్ట్ చర్చి, ఎంజీ.రోడ్డులోని సెయింట్మార్క్ కెథెడ్రల్, హడ్సన్ మెమోరియల్ చర్చ్, వివేకనగరలోని ఇన్ప్యాంట్ జీసస్ చర్చ్లో ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రార్థనలు జరిగాయి. భక్తులు కొవ్వొత్తులు వెలిగించి బాల ఏసును, మేరి మాతను కొలిచారు. భక్తిపూర్వకంగా గానాలాపనలు జరిగాయి. మైసూరులోని సెయింట్ ఫిలోమినా చర్చ్లో ప్రార్థనల్లో వేలాదిగా పాల్గొన్నారు. అందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుని కేకులు పంచుకున్నారు.బుధవారం అర్ధరాత్రి సాగిన ప్రత్యేక ప్రార్థనలు రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు చర్చిలలో క్రైస్తవుల విశేష ప్రార్థనలు -
చందన స్వర్ణమందిర్ ప్రారంభం
సాక్షి,బళ్లారి: నగరంలోని బెంగళూరు రోడ్డులో చందన స్వర్ణమందిర్ను వినూత్న రీతిలో ప్రారంభించారు. గురువారం చందన స్వర్ణమందిర్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రారంభించిన గోల్డ్షాప్కు మంచి స్పందన లభించింది. నగర వాసులు పెద్ద సంఖ్యలో చేరడంతో మూడు అంతస్తుల్లో ప్రదర్శించిన బంగారు ఆభరణాల కొనుగోలుకు కిటకిటలాడారు. నూతన షాపు ప్రారంభం సందర్భంగా ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటించారు. ఒక గ్రాము బంగారం కొనుగోలు చేసిన వారికి రెండు గ్రాముల వెండి ఉచితంగా ఇవ్వడంతో పాటు వెండితో తయారు చేసిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి 50 శాతం రాయితీ ఇచ్చారు. రూ.లక్ష విలువ చేసే వెండితో తయారు చేసిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే రూ.50 వేలు మాత్రమే కట్టించుకున్నామని చందన బ్రదర్స్ డైరెక్టర్లు సంతోష్ రామమోహన్, వెంకట్ గణేష్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ లోక్సభ సభ్యుడు సన్న పక్కీరప్ప, కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ మావూరీ శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్ వాసు తదితరులు పాల్గొన్నారు. బెంగళూరు రోడ్డులో వినూత్న రీతిలో వెలసిన బంగారు ఆభరణాల దుకాణం -
సహకార సంఘాలు ప్రజా సేవ చేయాలి
రాయచూరు రూరల్: సహకార సంఘాలు ప్రజలకు ఉత్తమ రీతిలో సేవలు అందించాలని రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షుడు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం జేసీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు ప్రామాణికంగా, జవాబుదారితనంతో విధులు నిర్వహించాలన్నారు. సహకార ఎన్నికల్లో పోటీకి సభ్యులు ఆస్తుల వివరాలను ప్రకటించి, సహకార రంగంలో రైతులకు రుణాలు ఇవ్వడం వంటి పనులు చేపట్టి వారికి చేదోడు వాదోడుగా పని చేయాలని సూచించారు. సంఘం అభివృద్ధికి రైతులు, అధికారుల సహకారం ప్రధానమన్నారు. అధికారులు శేఖ్ హసన్, లియాఖత్, కల్లయ్య స్వామి, శశిధర్ పాటిల్, శరణ్, విద్యాసాగర్, గాయత్రి, అశ్విని, మల్లికార్జునలున్నారు. ఇంటింటికీ గ్రంథాలయం అవసరంరాయచూరు రూరల్: నేడు ఇంటింటికీ గ్రంథాలయం అవసరమని కన్నడ పుస్తక ప్రాధికార అధ్యక్షురాలు డాక్టర్ మానస పేర్కొన్నారు. బుధవారం కన్నడ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లక్ష గ్రంథాలయాల పథకం అమలుతో రాష్ట్రంలోని నాలుగు రెవిన్యూ డివిజన్ల పరిధిలో విద్వాంసులను గుర్తించి ప్ర త్యేక అవార్డులను అందజేస్తామన్నారు. గ్రంథాలయాలను అభివృద్ధి పరచడంలో వారు చేసిన సేవలను గుర్తించి అవార్డులను అందిస్తామన్నారు. కార్యక్రమంలో వీర హనుమాన్, రావుత్ రావ్, భగత్ రాజ్ నిజాంకరి, తాయప్ప, బాబు భండారిగల్, రంగణ్ణ పాటిల్, రేఖ, ప్రతిభ, విజయ్ సంతోష్లున్నారు. పాత్రికేయుల సమస్యలపై స్పందిస్తాంరాయచూరు రూరల్: రాష్ట్రంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తామని రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శివానంద తగడూరు, ప్రధాన కార్యదర్శి లోకేష్ పేర్కొన్నారు. గురువారం కలబుర్గిలో అనారోగ్యంతో బాధపడుతున్న ిసీనియర్ పాత్రికేయుడు ఎస్బీ జోషిని పరామర్శించి వారు మాట్లాడారు. కరోనా సమయంలో తీసుకున్న నిర్ణయాలను ఉల్లేఖిస్తూ అందరికీ న్యాయం చేస్తామన్నారు. ఆయన వెంట కలబుర్గి వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లాధ్యక్షుడు యడ్రామి, భవాని సింగ్ ఠాకూర్, దేవేంద్రప్పలున్నారు. క్రీడల మానసికోల్లాసం వృద్ధిరాయచూరు రూరల్: మనిషికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో రిపోర్టర్స్ గిల్డ్, అధికారుల సంఘం ఆధ్వర్యంలో సౌహార్ద క్రికెట్ టోర్నీ ఆధ్వర్యంలో పోటీలను ప్రారంభించి మాట్లాడారు. పాత్రికేయులు, జెస్కాం, న్యాయ శాఖలు పోటీల్లో పాల్గొనడం విశేషమన్నారు. పోటీల్లో గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో ప్రొబేషనరీ అధికారి గురురాజ్ సింగ్ సోలంకి, అదనపు ఎస్పీ కుమారస్వామి, సమాచార హక్కు కమిషనర్ వెంకట సింగ్, అధ్యక్షుడు విజయ్ జాగటగల్, కార్యదర్శి వెంకటేష్, అంబన్న, చెన్నబసవన్నలున్నారు. క్యాంటర్ వాహనం ఢీకొని ఒకరు మృతికోలారు: క్యాంటర్ వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన మేడిహాళ గేట్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. తాలూకాలోని శెట్టిహళ్లి గ్రామానికి చెందిన ఎస్ఎం.శ్రీనివాసగౌడ మార్కెట్కు ఉల్లిపాయలు తీసుకు వెళ్తున్నారు. రోడ్డు దాటుతున్న సమయంలో వేమగల్ వైపు నుంచి వచ్చిన క్యాంటర్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాసగౌడను ఆస్పత్రికి తరలించినా చికిత్స ఫలించక మృతిచెందాడు. క్యాంటర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. వేమగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఇంటికి నిప్పంటుకొని ఒకరు మృతి
కెలమంగలం: ఇంట్లో కొవ్వొత్తి వెలిగించి మద్యం మత్తులో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా ఇంటికి నిప్పంటుకొని ఒకరు మృతి చెందారు. వివరాల మేరకు.. డెంకణీకోట సంతవీధికి చెందిన పెరియస్వామి(55), మిత్రుడు బెట్టముగిళాలం ప్రాంతానికి చెందిన మాదప్ప(60). పెరియస్వామి సంత వీధిలో సిమెంట్ షీట్లు, అట్ట బాక్సులతో ఇల్లు నిర్మించుకున్నారు. బస్తాలు మోసే కూలీలుగా పనిచేస్తున్న వీరు బుధవారం రాత్రి మద్యం తాగారు. ఇంట్లో వెలుతురు కోసం కొవ్వొత్తి వెలిగించారు. మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఇంటికి నిప్పంటుకొంది. ఈ ఘటనలో మాదప్ప ఘటనా స్థలంలోనే అగ్నికి ఆహుతయ్యాడు. పెరియస్వామి గాయాలతో డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
చిత్రదుర్గం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
గడ్డకట్టే చలి మధ్యలో ట్రావెల్స్ బస్సు దూసుకెళ్తోంది. కొన్ని గంటల తరువాత గోకర్ణలో బీచ్ ఒడ్డున హ్యాపీగా ఉంటామని ప్రయాణికులు ఊహించుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. ఇంతలోనే ఏదో పేలుడు వంటి శబ్ధం. కళ్ల ముందు ఇంతెత్తున మంటలు. ఎటుచూసినా హాహాకారాలు. ఓ ఘోర ప్రమాదం ఎన్నో జీవితాల్లో విషాదాన్ని చిమ్మింది.సాక్షి బళ్లారి/ తుమకూరు/ బనశంకరి: చిత్రదుర్గంజిల్లా హిరియూరు గ్రామీణ పోలీస్స్టేషన్ పరిధిలోని జవనగొండనహళ్లి వద్ద గురువారం తెల్లవారుజామున హైవే – 48లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎదురుగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టడంతో దారుణం సంభవించింది. బస్సు మంటల్లో చిక్కుకోగా నలుగురు యువతులు, ఓ చిన్నారి బాలిక, అలాగే లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యారు. ఎలా జరిగిందంటే.. ● బెంగళూరు నుంచి గోకర్ణకు సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ (కేఏ01 ఏఈ5217) స్లీపర్ బస్సు బయల్దేరింది. ● వరుస సెలవులు రావడంతో ఎక్కువమంది టెక్కీలు, ప్రైవేటు ఉద్యోగులు టూర్ కోసం బయల్దేరారు. నిద్రమత్తులోకి జారుకున్న కంటైనర్ లారీ డ్రైవర్ అదుపు కోల్పోయాడు, లారీ డివైడర్ మీద నుంచి దూసుకొని వచ్చి ప్రైవేటు బస్సును ఢీకొనింది. డీజిల్ ట్యాంకు పేలి మంటలు క్షణాల్లో బస్సును ఆవహించాయి. ● బస్సులో బిందు, ఈమె కుమార్తె గ్రేయ (5), మానస, నవ్య, రశ్మి అనేవారు మంటల్లో చిక్కి చనిపోయారు. మృతదేహాలు మసిబొగ్గులుగా మారాయి. బాలిక తప్ప మిగతా నలుగురు యువతులు బెంగళూరులో టెక్కీలని తెలిసింది. ● లారీని కూడా మంటలు చుట్టుముట్టి డ్రైవరు మరణించాడు. ● బస్సులోని మరో 25 మంది గాయాల పాలయ్యారు. ముగ్గురి జాడ దొరకడం లేదు. ● భారీ శబ్ధాలు రావడంతో స్థానిక గ్రామస్తులు వచ్చి రక్షించే యత్నం చేశారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేశారు. గాయపడినవారు వీరే.. మంజునాథ్, సంధ్య, శశాంక్, దిలీప్, ప్రతీశ్వరన్, కవిత, అనిరుధ్, అమృత, ఇషా, సూరజ్, మిలన్, విజయ్, అభిషేక్, కిరణ్పాల్, కీర్తన, నందిత, దేవిక, మేఘరాజ్, హేమరాజ్ కుమార్, కల్పన ప్రజాపతి, రక్షిత, గగనశ్రీ, మహమ్మద్ సాదిక్, ఆదిత్య, వరుణ్ అనేవారు గాయపడినట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు. శిర, హిరియూరు, తుమకూరు, బెంగళూరు ఆస్పత్రుల్లో బాధితులను చేర్చారు. ఓ మృతురాలి లాకెట్ను చూసి తండ్రి కన్నీరు పెట్టారు. కూతురిని కడసారి చూద్దామంటే కనీస ఆనవాళ్లు లేవు. చిత్రదుర్గ ఆస్పత్రిలో గాయపడిన వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. మృతులపై కొంత సందిగ్ధం నెలకొంది. నలుగురు మహిళా టెక్కీలు, చిన్నారి సజీవ దహనం లారీ డ్రైవర్ కూడా మృత్యువాత మరో 25 మందికి గాయాలు బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు -
వాజ్పేయి జయంతి
కోలారు: భారత దేశం అత్యంత పటిష్ట దేశమని ప్రపంచానికి చాటిన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఓం శక్తిచలపతి అన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా నగరంలోని డూం లైట్ సర్కిల్ వద్ద గురువారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శక్తిచలపతి మాట్లాడుతూ ప్రపంచానికి తెలియకుండా అణ్వస్త్ర పరీక్ష నిర్వహించి భేష్ అనిపించారని తెలిపారు. దేశం సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే తగిన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారన్నారు. జేడీఎస్ నాయకుడు సీఎంఆర్.శ్రీనాథ్ మాట్లాడుతూ దివంగత ప్రధాని వాజపేయి అత్యంత దూరదృష్టిని కలిగి ఉండేవారని, ఆయన పాలనా వైఖరిని పాలనలో చూడవచ్చని తెలిపారు. ఈసందర్భంగా మాగేరి నారాయణస్వామి, ఎస్బీ.మునివెంకటప్ప, రాకేష్గౌడ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా వాల్మీకి విగ్రహ ఊరేగింపు
బళ్లారిఅర్బన్: నగరంలోని ఎస్పీ సర్కిల్ అభివృద్ధిలో భాగంగా జనవరి 3న మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు కోట ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి వాల్మీకి మహర్షి వాల్మీకి విగ్రహాన్ని 1008 కలశాలు, బ్యాండు వాయిద్యాలు, కళా బృందాల నృత్యాలతో పూర్ణకుంభ కలశాలతో అంగరంగ వైభవంగా బసవనకుంట రోడ్డు మీదుగా ఎస్పీ సర్కిల్ వరకు వేలాది మంది వాల్మీకులు, స్థానికుల సమక్షంలో ఊరేగింపు నిర్వహించారు. నగర కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, కాంగ్రెస్ ప్రముఖులు రాంప్రసాద్, సిద్దమ్మనహళ్లి తిమ్మనగౌడ, బోయపాటి విష్ణు, చానాళ్ శేఖర్, హగరి జగన్నాథ్, యర్రగుడి ముదిమల్లయ్య, సంగనకల్లు విజయ్కుమార్, బీజేపీ మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప, వీకే బసప్ప, వాల్మీకి బాంధవులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జనవరి 3న జరగనున్న వాల్మీకి విగ్రహ కుంభాభిషేకానికి రాజనహళ్లి వాల్మీకి పీఠాధిపతి ప్రసన్నానందపురి, మంత్రులు సతీష్ జార్కిహోళి, జమీర్ అహ్మద్ ఖాన్, మాజీ మంత్రులు బీ.నాగేంద్ర, కేఎం.రాజన్నలతో పాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సయ్యద్ నాసీర్ హుస్సేన్, కంప్లి ఎమ్మెల్యే గణేష్ తదితరులు పాల్గొంటున్నట్లు తెలిపారు. -
నకిలీ నోట్ల చెలామణి.. ఐదుగురి అరెస్ట్
నరేంద్ర ప్రసాద్ హొసపేటె: జాతరకు వచ్చి నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్న ఘటన విజయనగర జిల్లా హరపనహళ్లిలో జరిగింది. హరపనహళ్లి తాలూకాలోని అరసీకెరె దుర్గమ్మ జాతరలో నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న అరసీకెరెకు చెందిన కే.మహ్మద్ అఖిల్, నరేంద్ర ప్రసాద్, మహమ్మద్ రియాజ్, కూడ్లిగికి చెందిన బి.బాబు, మొళకాల్మూరుకు చెందిన కుమారస్వామితో పాటు మొత్తం ఐదుగురిని అరసీకెరె పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 మొబైల్ ఫోన్లు, రూ.500ల ముఖ విలువ కలిగిన రూ.80 వేల నకిలీ కరెన్సీ నోట్లు, ఒక గూడ్స్ వాహనం, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సంతలో నకిలీ రూ.500 నోట్లను చెలామణి చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జాహ్నవి తెలిపారు. -
టీబీ డ్యాంకు కొత్త క్రస్ట్గేట్ల పనులు షురూ
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు జిల్లాల రైతులకు, ప్రజలకు సాగు, తాగు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్గేట్లను ఏర్పాటు పనులకు మండలి అధికారులు నడుం బిగించారు. చాలా రోజులుగా వాయిదా పడిన తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్లను ఏర్పాటు చేసే పనులను ఎట్టకేలకు తుంగభద్ర బోర్డు అధికారులు ప్రారంభించారు. కొత్తగేట్లకు పూజ చేయడం ద్వారా అధికారికంగా పనులకు శ్రీకారం చుట్టారు. డ్యాం మొదటి గేటు, 18వ గేట్ ఏర్పాటుకు పనులు ప్రారంభం అయ్యాయి. భారీ క్రేన్ను ఉపయోగించి గేట్లను లోతునకు దించే పనిని నిర్వహిస్తున్నారు. ఒక గేట్ ఏర్పాటుకు సుమారు 8 నుంచి 10 రోజుల సమయం పడుతుందని మండలి ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. తుంగభద్ర డివిజన్ కార్యదర్శి ఓఆర్కే రెడ్డి, ఈఈ చంద్రశేఖర్, ఎస్ఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సారూ.. తాగారా?
యశవంతపుర: మద్యం తాగి వాహనాలను నడిపేవారిని బెంగళూరు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గత మూడురోజుల నుంచి ముమ్మరం చేశారు. దీంతో మత్తులో డ్రైవింగ్ చేస్తున్న 507 వాహనదారులను గుర్తించి కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలో కొత్త ఏడాది సందర్భంగా కై పులో నడిపి ప్రమాదాలు జరపకుండా సిటీలో ప్రముఖ కూడళ్లలో తనిఖీలు సాగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ అధికం చేశారు. 33,375 వాహనాలను తనిఖీ చేయగా 507 వాహనదారులు తాగినట్లు రుజువైంది. దీంతో వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. బెంగళూరులో భారీగా నకిలీ ఓట్లు: విజయేంద్ర దొడ్డబళ్లాపురం: బెంగళూరు పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల నుంచి 15 వేల వరకూ నకిలీ ఓట్లు చేర్చారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. వాజ్పేయి జయంతి సందర్భంగా మహాలక్ష్మిలేఔట్ ఎమ్మెల్యే ఆఫీసులో వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఓటర్ల లిస్టులో నకిలీ పేర్లను నమోదు చేయించిందన్నారు. బెంగళూరు పరిధిలోని 28 అసెంబ్లీ క్షేత్రాల్లో ఈ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఎన్నికల కమిషన్ సమగ్రంగా తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వరుస ఓటములతో మతి భ్రమించి కాంగ్రెస్ ఓటు చోరీ అంటూ గగ్గోలు పెడతోందన్నారు. నవ వివాహిత అనుమానాస్పద మృతి దొడ్డబళ్లాపురం: నవ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన బెంగళూరు పరిధిలోని నెలమంగలలో జరిగింది. ఐశ్వర్య (26) మృతురాలు. ఈమెకు నెల క్రితం లిఖిత్ అనే యువకునితో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే వారం రోజులకే లిఖిత్ ఐశ్వర్యను వేధించడం ప్రారంభించాడని బంధువులు చెబుతున్నారు. ఇరు వైపులా పెద్దలు పంచాయితీ చేసి రాజీ చేశారు. అయినా లిఖిత్ ప్రవర్తనలో మార్పు రాలేదు. బుధవారం సాయంత్రం లిఖిత్ ఐశ్వర్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఐశ్వర్య ఇంట్లో ఓ గదిలో ఉరివేసుకున్న స్థితిలో శవమైంది. బాగలగుంట పోలీసులు కేసు నమోదు చేసి లిఖిత్ను అదుపులోకి తీసుకున్నారు. సర్ఫరాజ్ వద్ద భారీగా ఆస్తులు యశవంతపుర: ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ఖాన్ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్), కేఏఎస్ అధికారి సర్పరాజ్ఖాన్ వద్ద రూ.14.38 కోట్ల విలువగల ఆస్తులు ఉన్నట్లు లోకాయుక్త గుర్తించింది. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం మాత్రమే. మార్కెట్ విలువ ప్రకారమైతే అంతకు ఏడెనిమి రెట్లు ఎక్కువగా ఉంటాయని సమాచారం. ఆయన గతంలో సహకార సంఘాల లెక్క పరిశోధనా విభాగం డైరక్టర్గాను, బీబీఎంపీ పని చేశారు. త్వరలో రిటైరు కానున్నారు, ఈ సమయంలో లోకాయుక్త కొరడా ఝులిపించడంతో భారీ మొత్తంలో ఆస్తులు బయట పడ్డాయి. శాంతలింగ శివాచార్య స్వామీజీ అరెస్టు దొడ్డబళ్లాపురం: గాల్లోకి కాల్పులు జరిపిన కలబుర్గి జిల్లా ఉడచణ గ్రామం హీరేమఠంలోని శివాచార్యస్వామి మఠం స్వామీజీ శాంతలింగ శివాచార్య స్వామీజీని కలబుర్గి పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజులక్రితం స్వామీజీ మద్యం తాగివచ్చి మఠంలో హల్చల్ చేశాడు. దీంతో గ్రామస్తులు ఆయనను బయటకు పంపించేశారు. కొత్త మఠాధిపతిని నియమించేందుకు గ్రామస్తులు ప్రయత్నాలు చేస్తుండగా స్వామీజీ మఠం ఆవరణలోనే తుపాకితో గాల్లోకి కాలులు జరిపి వీడియోలకు ఫోజులిచ్చాడు. ఇది వైరల్ కావడంతో సంఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు స్వామీజీని అరెస్టు చేశారు. -
ఏసయ్య ఉదయం.. భక్తజన సంబరం
బుధవారం రాత్రి శివాజీనగర సెయింట్ మేరీస్ చర్చిలో పండుగ శోభకల్వరి చర్చిలో కేక్ కటింగ్ వేడుక శివాజీనగర: మానవాళి పాప విమోచనార్థం, లోక కళ్యాణార్థమై భువికి ఏతెంచిన ఏసుక్రీస్తును స్మరిస్తూ క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో క్రిస్మస్కు సంసిద్ధమయ్యారు. గురువారం పండుగ కాగా, బుధవారం సాయంత్రం నుంచే అన్ని చర్చిలలో ప్రార్థనలు మొదలయ్యాయి. రంగురంగుల విద్యుద్దీప తోరణాలతో రమణీయంగా చర్చిలు అలరారుతున్నాయి. బాల ఏసు జన్మవృత్తాంత పందిర్లు వెలిశాయి. బెంగళూరు శివాజీనగరలోని ప్రసిద్ధ సెయింట్ మేరీస్ బసిలికా చర్చిలో మత గురువుల ఆధ్వర్యంలో విశేష ప్రార్థనలు జరిగాయి. అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. కల్వరి చర్చిలో సంబరాలు మరియమ్మనహళ్ళి కర్ణాటక కల్వరి చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. చర్చీ పాస్టర్ రెవరెండ్ ఎం.జక్కయ్య ఏసుక్రీస్తు జన్మ విశేషాలను పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆధారంగా భక్తులకు ఉద్బోధించారు. అంధకారంలో మగ్గుతున్న మానవులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు దైవకుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువులవారు జన్మించారని తెలిపారు. ఈ సందర్భంగా భక్తి గీతాలాపన, నృత్య వేడుకలు, కేక్ కటింగ్ నిర్వహించారు. క్రిస్మస్కు సంసిద్ధమైన చర్చిలు సాయంత్రం నుంచి విశేష ప్రార్థనలు -
సుభిక్ష దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం
బళ్లారిటౌన్: విద్య అనేది ఒక నిరంతర యాత్ర, అమూల్యమైన సంపద అని, విద్యార్థులు, యువత జ్ఞానాన్ని పెంపొందించుకొని సుభిక్ష దేశ నిర్మాణానికి ముందడుగు వేయాలని రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ పేర్కొన్నారు. బుధవారం బళ్లారిలోని సిరుగుప్ప రోడ్డులో మౌంట్ యూ క్యాంపస్ కిష్కింధ యూనివర్సిటీలో చేపట్టిన ప్రథమ ఘటికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకొని ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకోవాలన్నారు. విద్య కేవలం పదవి కోసం పరిమితం కారాదని, ఒక జ్ఞాన సంపద కావాలన్నారు. నేర్చుకున్న విద్యను దేశ అభివృద్ధి కోసం వినియోగించాలన్నారు. భౌతికంగా పెరగడం కాదు. జీవితంలో మానవతా విలువలను కూడా అలవరుచుకోవాలన్నారు. భారతీయ పరంపర, సంస్కృతి, సాంప్రదాయాలను విడవరాదన్నారు. సవాల్గా మారిన విద్యా సంస్థల స్థాపన కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ మంత్రి ఎంసీ సుధాకర్ పాల్గొని మాట్లాడుతూ కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో విద్యా సంస్థలను స్థాపించడం సవాల్గా మారిందన్నారు. ఇలాంటి సమయంలో యూనివర్సిటీని ప్రారంభించి రెండేళ్లలో ఘటికోత్సవం ప్రారంభించడం శ్లాఘనీయం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29 ప్రైవేట్ యూనివర్సిటీలు పని చేస్తున్నాయన్నారు. యూనివర్సిటీలు కేవలం విద్యార్థుల దాఖలాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా నాణ్యమైన విద్యను ఇవ్వాలన్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వెలికి తీయాలని హితవు పలికారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతం చాలా వెనుకబడి ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే కలబుర్గిలో ఓ ప్రైవేట్ యూనివర్సిటీ ఉండగా రెండోది బళ్లారి జిల్లాలో స్థాపించడం అభినందనీయమన్నారు. మంచి విద్యాభ్యాసానికి అనుకూలం ఈ యూనివర్సిటీ వల్ల ఈ ప్రాంతంలోని విద్యార్థులకు మంచి విద్యను పొందేందుకు అనుకూలం అయిందన్నారు. కార్యక్రమంలో బళ్లారి సువర్ణగిరి విరక్తమఠం సిద్ధలింగ మహాస్వామికి డాక్టరేట్ పదవి అందించి గౌరవించారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రమాణ పత్రాలు అందజేశారు. బెళగావి ఎంపీ జగదీశ్ శెట్టర్, సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం.నాగరాజు, సింధనూరు ఎమ్మెల్యే హంపనగౌడ, టీఈహెచ్ఆర్డీ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్జేవీ.మహిపాల్, కిష్కింధ యూనివర్సిటీ కులాధిపతి యశ్వంత్ భూపాల్, సహాయక కులాధిపతి వై.జే.పృథ్వీరాజ్, వైస్ ఛాన్సలర్ నాగభూషణ్, యూ.ఈరణ్ణ, నేతలు రాజు, అమరేశయ్య తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ -
అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ సేవలు
రాయచూరు రూరల్: కార్మికులకు తోడు అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ సేవలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర కార్మిక, ఉద్యోగ శాఖ మంత్రి శోభ కరంద్లాజె వెల్లడించారు. కలబుర్గి ఈఎస్ఐ ఆడిటోరియంలో జరిగిన కార్య క్రమంలో ఆమె మాట్లాడుతూ కలబుర్గిలో 560 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ఉందని, ఐపీసీజీ, జీహెచ్ఎస్ పథకాలు విస్తరించామన్నారు. దేశంలో పది ఈఎస్సీ కళాశాలలు ఉన్నాయని, 27 చట్టాలను రద్దుచేసి నాలుగు కార్మిక చట్టాలను రూపొందించామని వివరించారు. సభలో డీన్ క్షీరసాగర్, కలబుర్గి గ్రామీణ శాసనసభ్యుడు బసవరాజ్, విధాన పరిషత్ సభ్యుడు బిజి.పాటిల్, అమర్నాథ్ పాటిల్, దత్తాత్రేయ పాటిల్, అధికారులు కడ్డిమట్, పద్మ పద్మజ, యువరాజ్, సుబ్రహ్మణ్యం, శివరాజ్పాటిల్, మహదేవ్ పాల్గొన్నారు. -
వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకు భారీ ఏర్పాట్లు
బళ్లారి అర్బన్: ఎస్పీ సర్కిల్లో వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి సారధ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. పలువురు వాల్మీకి ప్రముఖులు మాట్లాడుతూ ఈ నెల 25న బళ్లారి నగరానికి కొత్త వాల్మీకి విగ్రహం విచ్చేయనుందన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు కోటె ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి వాల్మీకి సర్కిల్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విగ్రహానికి వైభవంగా అలంకరణ, వివిధ వాయిద్య, సంగీత, కళా బృందాలతో పూర్ణ కుంభ కలశాలతో 1008 మంది ముత్తైదువులతో భారీగా పూజలు నెరవేర్చనున్నారు. వేలాది మంది పాల్గొనే అవకాశం ఉన్నందున బుధవారం నుంచే సర్కిల్లో హోమ, హవన కార్యక్రమాలను జరిపారు. కాగా రాజనహళ్లి వాల్మీకి పీఠాధిపతి ప్రసన్నానందపురి దివ్య సాన్నిధ్యంలో కార్యక్రమం నెరవేరనుంది. కార్యక్రమంలో మంత్రులు సతీష్ జార్కిహోళి, జమీర్ అహ్మద్, మాజీ మంత్రులు బీ.నాగేంద్ర, కేఎం.రాజన్నలతో పాటు ప్రముఖులు డాక్టర్ సయ్యద్ హుసేన్, కంప్లి ఎమ్మెల్యే గణేష్ పాల్గొననున్నారు. గత మూడు రోజులుగా ఎమ్మెల్యే వాల్మీకి సర్కిల్లో అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
పావురాన్ని పట్టుకోబోయి బాలుడికి తీవ్ర గాయాలు
హుబ్లీ: పావురాన్ని పట్టుకొనేందుకు ప్రయత్నించిన బాలుడు అదుపు తప్పి కింద పడటంతో తీవ్రంగా గాయపడిన ఘటన కొప్పళలోని హమాలీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. ఆ బాలుడిని అబ్బాస్ అలీ కుమారుడు అహ్మద్ హ్యారీస్(6)గా గుర్తించారు. తొలి అంతస్తులో బాలుడు ఆడుకుంటుండేవాడు. అయితే అక్కడికి వచ్చిన ఓ పావురాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించి తొలి అంతస్తు గ్రిల్ వద్ద నిలబడిన క్రమంలో అదుపు తప్పి ఆకస్మికంగా కింద పడ్డాడు. తక్షణమే తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడు భవనం పైనుంచి కిందకు పడే దృశ్యం సీసీ టీవీ కెమెరాలో నమోదైంది. తలకు తీవ్ర గాయం కావడంతో కొప్పళలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బాలుడికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు తల్లిదండ్రులు వివరించారు. విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతిహొసపేటె: నగరంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఒక యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. నగరంలోని 100 పడకల ఆస్పత్రికి వెళ్లే మార్గంలో స్థానిక కొత్త హరిప్రియ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో భవనంలో వెల్డింగ్ పనులు చేస్తున్న 18వ వార్డు చప్పరదహళ్లి నివాసి రిజ్వాన్(18) అనే యువకుడు వెల్డింగ్ చేస్తుండగా, అతని చేతిలో ఉన్న ఇనుప పైపు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను తాకడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయమై ఎక్స్టెన్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు తదుపరి చర్యలు తీసుకున్నారు. హుడా ఛైర్మన్ హెచ్ఎన్ఎఫ్ ఇమాం మహ్మద్ నియాజీ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అన్ని కార్యాలయాల్లో కన్నడ భాషను వాడాలిబళ్లారిటౌన్: జిల్లాలోని అన్ని శాఖలు, సంఘ సంస్థలు, వాణిజ్య, నిగమ, మండళ్లలో తప్పనిసరిగా కన్నడ భాషలోనే వ్యవహరించాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ అధికారులకు సూచించారు. మంగళవారం నూతన జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కన్నడ జాగృతి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కన్నడ భాష అమలుపై జాగృతి సమితి చురుగ్గా పని చేయాలన్నారు. ఎప్పటికప్పుడు తమకు అధికారిక నివేదిక ఇవ్వాలని సూచించారు. నియమాలను ఉల్లంఘించిన సంస్థలు, ఆయా శాఖలపై చర్యలు తీసుకుంటామన్నారు. మహానగర పాలికె పరిధిలోని వివిధ స్థలాల్లో ప్రకటనలు, బ్యానర్లను కన్నడలోనే ఏర్పాటు చేయాలన్నారు. 60 శాతానికి పైగా కన్నడలో స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఉండాలని సూచించారు. పాలికె కమిషనర్ మంజునాథ్, కన్నడ సంస్కృతి శాఖ ఏడీ నాగరాజు, నిష్టిరుద్రప్ప, కన్నడ సంఘాల నాయకులు పాల్గొన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంరాయచూరు రూరల్: విద్యార్థులకు టెన్నిస్ క్రీడ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని రాయచూరు క్రీడా యువజన సేవా అధికారి వీరేష్ నాయక్ వెల్లడించారు. మంగళవారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన టెన్నిస్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు బోధనకు తోడు బోధనేతర అంశాలపై దృష్టి సారించాలన్నారు. బాలుర విభాగంలో వ్యవసాయ కళాశాల, ఎన్ఈటీ ఫార్మసీ కళాశాల మొదటి స్థానం పొందగా, బాలికల విభాగంలో వ్యవసాయ కళాశాల, పూర్ణిమ కళాశాలలు రెండో స్థానం గెలుచుకున్నాయి. కళాశాల అధ్యాపకుడు నవీన్ లక్ష్మీనారాయణ, బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, వంశీ, వీరణ్ణలతో పాటు 150 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. కన్నడ సేవలు అపారంరాయచూరు రూరల్: రాష్ట్రంలో కన్నడ భాషకు గడినాడులో చేస్తున్న సేవలు అపారమని ప్రధాన అధ్యాపకుడు రమేష్ అరోలి అభిప్రాయ పడ్డారు. బుధవారం ఆకాశవాణి భవనంలో కవిగోష్టిని ప్రారంభించి మాట్లాడారు. కన్నడ భాష సంరక్షణకు కవితల ద్వారా ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు సాగాలన్నారు. గొరవర్, అమరేష్, వెంకటేష్లున్నారు. -
చెరువుల్లో చెత్త.. యంత్రంతో తొలగింపు
మడివాళ చెరువులో శుద్ధీకరణ యంత్రంబనశంకరి: బెంగళూరు చెరువుల నగరంగా పేరుపొందింది. అయితే అనేక చెరువులు నేడు కబ్జాల వల్ల అదృశ్యమయ్యాయి. ఉన్న చెరువులేమో వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మడివాళ చెరువులో గుర్రపుడెక్క, నాచు తొలగించి శుద్ధీకరణ చేసే యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇతర చెరువుల్లో కూడా ఉపయోగిస్తామని జీబీఏ కమిషనర్ మహేశ్వర్రావ్ తెలిపారు. బుధవారం మడివాళ చెరువులో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నగర చెరువులకు జలకళ తీసుకురావాలనే కొత్తగా ఈ అత్యాధునిక యంత్రాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. దీని ఖరీదు రూ.1.28 కోట్లని, రోజుకు 5 టన్నులు వరకు చెత్తను తొలగిస్తుందని చెప్పారు. జీపీఎస్ వ్యవస్థ ద్వారా నిర్దేశిత ప్రాంతంలో పనిచేయించవచ్చని చెప్పారు. మడివాళ చెరువు ను రూ.15 కోట్లతో సుందరీకరిస్తామని తెలిపారు. నడక దారి, కాలువలు, పిల్లల పార్కు, పడవ విహారం, ఆటవస్తువులు తదితరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెరువుల్లోకి చెత్త వేయరాదని నగరవాసులను కోరారు. బెంగళూరులో స్వచ్ఛతకు నాంది -
మంచు కప్పేసి.. మృత్యువు కాటేసి
చలిగాలులతో కూడిన మంచు ప్రమాదకరంగా మారుతోంది. జాతీయ రహదారిపై పొగమంచు కమ్మేయడంతో వాహన ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత 23 రోజుల్లో దాదాపు 75 మంది ప్రమాదాలకు గురికాగా 33 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గాయపడిన వారు మరెందరో ఉన్నారు. ఈ ఏడాది అత్యధికంగా మంచు కురుస్తోంది. హైదరాబాద్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలు, పెద్ద వాహనాలు అధికంగా రాకపోకలు సాగిస్తున్నాయి. మంచు కప్పేయడంతో డ్రైవర్లు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. – చిక్కబళ్లాపురం -
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ మృత్యువాత
మండ్య: బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మరణించారు. ఈ ఘటన మద్దూరు తాలూకా యరగనహళ్లి గ్రామంలో జరిగింది. మండ్య తాలూకా కొత్తత్తి హోబళి హుల్కెరె గ్రామానికి చెందిన మంచేగౌడ కుమారుడు శంకర్ (43), జోగయ్య కుమారుడు వీరేంద్ర (46)లు తోరెశెట్టి గ్రామంలో బంధువు అంత్యక్రియలకు హాజరయ్యారు. తిరిగి బైక్పై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. రక్తస్రావంతో ఇద్దరు అక్కడిక్కడే పడి మరణించారు. కేసు దర్యాప్తులో ఉంది.మృతులు వీరే -
కళాత్మకంగా ప్రముఖ చర్చిలు
బనశంకరి: క్రిస్మస్ ఆచరణకు చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తిగీతాలతో చర్చిల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. కాగా క్రిస్మస్ ప్రార్థనలకు రాష్ట్రంలోని అనేక చారిత్రాత్మకమైన చర్చిలు ఖ్యాతిఘడించాయి. బెంగళూరు, మైసూరు, మంగళూరు, ఉడుపిలో వందల సంవత్సరాల నాటి ప్రముఖ చర్చిలు వాస్తుశిల్పి, ధార్మిక మహత్యంతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. బెంగళూరు నగరంలో బెంగళూరు నగరంలో క్రిస్మస్ వేడుకలను అత్యంత వైభవంగా ఆచరిస్తారు. ఇక్కడ చర్చిలను విభిన్నరకాల దీపాలతో అలంకరిస్తారు. సెయింట్మేరీస్ బసిలికా చర్చి శివాజీనగరలో ఉంది. గోదిక్ శైలి వాస్తుశిల్పానికి పేరుగాంచింది. బెంగళూరు వివేకనగరలోని ఇన్ఫ్యాంట్ జీసస్ చర్చి క్రైస్తవులకు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రాస్థలాల్లో ఒకటి. బెంగళూరు ఎంజీ రోడ్డులోని సెయింట్ మార్క్ కెదడ్రల్చర్చ్ ఇంగ్లాండ్లోని సెయింట్పాల్స్ కెదడ్రల్ చర్చి తరహాలో ఉంటుంది. బెంగళూరుసిటీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్న హడ్సన్మెమోరియల్చర్చ్ అద్భుతమైన వాస్తుశిల్పితో ఆకట్టుకుంటుంది. మైసూరులో... సంతపిలోమినా చర్చ్. ఇది మైసూరులో అత్యంత ప్రముఖ చర్చి మాత్రమే కాకుండా భారత్లో అతి ఎతైన చర్చిల్లో ఒకటిగా ఉంది. దీనిని నవ–గోదిక్ శైలిలో నిర్మించారు. మంగళూరు, ఉడుపిలో మంగళూరులో సంతఅలోసియస్చాపెల్ చర్చి గోడలపై అద్భుత చిత్రకళ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చర్చి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. హంపనకట్టిలో మిలాగ్రెస్ చర్చ్ ఇది అత్యంత పురాతన చర్చిల్లో ఒకటి. ఉడుపి జిల్లా కార్కళ వద్ద సంతలారెన్స్శ్రైన్ చర్చ్ ఉంది. ఇది వార్షిక జాతరకు పేరుగాంచింది. చెక్కు చెదరని వందల ఏళ్లనాటి చర్చిలు క్రిస్మస్కు ప్రత్యేక ప్రార్థనలతో గుర్తింపుశెట్టిహళ్లి రోసరి చర్చి హసనలోని శెట్టిహళ్లి రోసరిచర్చ్ను నీటమునిగిపోయే చర్చి అని కూడా పిలుస్తారు. ఇది వర్షాకాలంలో మునిగిపోతుంది. వేసవిలో మాత్రం శెట్టిహళ్లిచర్చిని చూడటం సాధ్యమవుతుంది. ముడిపు, పనేర్లోని చర్చిలు చాలా ప్రసిద్ధి చెందాయి. -
చెరువులోకి కారు బోల్తా, ఒకరు మృతి
శివమొగ్గ: కారు చెరువులోకి బోల్తా పడటంతో ఒకరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. బుధవారం ఉదయం జిల్లాలోని శికారిపుర తాలూకా ఆనవట్టి సమీపంలో కనెకొప్ప హొసూరు వద్ద జరిగింది. వివరాలు.. మృతుడిని శికారిపుర తాలూకా పునేదహళ్లి నివాసి నవీన్ (21)గా గుర్తించారు. తెల్లవారుజామున 3.20 గంటలకు శికారిపుర నుంచి ఆనవట్టి వైపునకు ఇకో కారులో నలుగురు బయలుదేరగా కనెకొప్ప హొసూరు రోడ్డు మలుపు వద్ద చెరువులోకి పల్టీలు కొట్టింది. నవీన్ గాయాలతో చనిపోగా, రామచంద్ర అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని కోసం గాలింపు జరుగుతోంది. రుద్రేశ్, మంజునాథ్ అనే ఇద్దరు క్షేమంగా తప్పించుకున్నారు. బాల్య వివాహానికి బ్రేక్ మైసూరు: నగరంలోని షబ్బీర్నగర 2వ అంగన్వాడీ కేంద్రం పరిధిలోని ఏఎం ఫంక్షన్ హాల్లో జరుగుతున్న మైనర్ బాలిక వివాహాన్ని బుధవారం మహిళా శిశు సంక్షేమ, పోలీసు అధికారులు అడ్డుకున్నారు. అక్కడ బాలికకు పెళ్లి చేస్తున్నారని అధికారులకు 1098 సహాయవాణి ద్వారా సమాచారం అందింది. వెంటనే అధికారులు వెళ్లి నిలుపుదల చేశారు. ప్రస్తుతం బాలిక వయస్సు 17 ఏళ్లు కాగా పెళ్లికి 18 ఏళ్లు నిండి ఉండాలి అని ఇరువర్గాలకు వివరించారు. 18 ఏళ్లు నిండేవరకు పెళ్లి చేయబోమని తల్లిదండ్రుల నుంచి హామీపత్రం రాయించుకున్నారు. అధికారులు కే.సోమయ్య, ఎస్జీ హరీష్, జయశ్రీ అంగడి, ఎస్ఐ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళపై పెట్రోలు పోసి నిప్పు దొడ్డబళ్లాపురం: కుమార్తెతో వివాహం జరిపించలేదనే అక్కసుతో ఆమె తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేశాడో కిరాతకుడు. ఈ సంఘటన బెంగళూరు బసవేశ్వరనగరలోని భోవి కాలనీలో జరిగింది. ముత్తు అనే యువకుడు గీత అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేశాడు. బాధితురాలు గీత స్థానికంగా కిరాణా అంగడిని నడుపుతోంది. పక్కనే ముత్తు కూడా టీస్టాల్ పెట్టుకున్నాడు. ఈక్రమంలో గీత కుమార్తైపె కన్నేసిన ముత్తు.. తనకిచ్చి వివాహం చేయాలని పలుమార్లు కోరాడు. అయితే గీత నిరాకరించింది. కక్ష పెంచుకున్న ముత్తు గీత మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడ్డ గీతను స్థానికులు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ముత్తు పరారీలో ఉన్నాడు. బసవేశ్వరనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమించలేదని యువతిపై దాడి బనశంకరి: ఆన్లైన్లో పరిచయమైన యువకుడు ప్రేమించాలని వేధిస్తూ యువతిపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవీన్కుమార్ అనే నిందితున్ని బుధవారం అరెస్ట్ చేశామని జ్ఞానభారతి పోలీసులు తెలిపారు. వివరాలు.. టెలికాలర్గా పనిచేస్తున్న యువతికి 2024లో ఇన్స్టా ద్వారా నవీన్కుమార్ పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు కాల్స్, మెసేజ్ చేస్తున్న నవీన్కుమార్ ప్రేమించాలని ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అతన్ని తిరస్కరించింది. యువతి గత సోమవారం మధ్యాహ్నం పీజీ హాస్టల్ వద్ద నిలబడి ఉండగా కారులో వచ్చిన నవీన్కుమార్ గొడవపడి దాడి చేసి, యువతి బ్యాగ్ను లాక్కుని ఉడాయించాడు. దాడి దృశ్యాలు పీజీ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. 2 లగ్జరీ కార్లు దగ్ధం దొడ్డబళ్లాపురం: ఇంటి ముందు నిలిపిన లగ్జరీ కార్లు కాలిపోయిన సంఘటన బెంగళూరు జేపీ నగరలో జరిగింది. వడ్డరపాళ్యలో ప్రైవేటు స్కూలు యజమాని మంజునాథ్ రోజూలాగే ఇంటి ముందు బీఎండబ్ల్యూ కారు, మరో ఖరీదైన కారును నిలిపాడు. బుధవారం తెల్లవారుజామున కార్లలో మంటలు చెలరేగి కాలిపోయాయి. అగ్నికీలలు వ్యాపించి అక్కడే నిల్వ ఉంచిన టేక్ వుడ్ కూడా భారీ మొత్తంలో బూడిదైంది. ఫైర్ సిబ్బంది సమాచారం తెలుసుకుని వచ్చేసరికి అన్నీ ఆహుతయ్యాయి. కార్లలోనే మంటలు పుట్టాయా, లేక ఆకతాయిల పనా? అనేది తేలాల్సి ఉంది. కోణనకుంట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
29న జిల్లా వార్షిక రైతు సమావేశం
హొసపేటె: రైతుల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 29న ఉదయం 10.30 గంటలకు విజయనగర జిల్లా 3వ వార్షిక రైతు సమావేశం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతుందని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సీఏ.గాళెప్ప తెలిపారు. ఆయన స్థానిక ప్రెస్హౌస్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సమావేశంలో కొట్టూరు స్వామి సంస్థాన మఠానికి చెందిన జగద్గురు కొట్టూరు బసవలింగ మహాస్వామి, ఒప్పత్తేశ్వర మఠానికి చెందిన నిరంజన్ ప్రభుదేశిక మహాస్వామి పాల్గొంటారన్నారు. ఈ సమావేశాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ప్రారంభిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ మేటి ఊరేగింపును జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. -
దైవదర్శనానికి వెళ్లొస్తుండగా..
సాక్షి, బళ్లారి: జిల్లాలోని సిరుగుప్ప తాలూకా తెక్కలకోట సమీపంలోని దేవినగర్ వద్ద జాతీయ రహదారి–150ఏలో దట్టమైన పొగమంచు ఆవహించటంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వంతెన గోడను బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. సిరుగుప్పలో నివాసం ఉంటున్న తాలూకాలోని నిట్టూరు గ్రామ పంచాయతీ సభ్యుడు ప్రసాదరావు కుటుంబ సభ్యులతో కలిసి కారులో తమిళనాడులోని దేవాలయానికి దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రసాదరావు(75), విజయ(70), సంధ్య(35) అనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పద్మ(70), బ్రహ్మేశ్వరరావు(45)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమాచారం తెలిసిన వెంటనే తెక్కలకోట పోలీసులు హుటాహుటిన చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను కారులో నుంచి వెలికి తీశారు. గాయపడిన వారిని బళ్లారి ట్రామాకేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఘటనపై తెక్కలకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వంతెనకు కారు ఢీకొని ముగ్గురు మృతి సిరుగుప్ప తాలూకాలో ఘోరం మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు -
కెంపేగౌడ ఒక్కలిగర సంఘం ఆందోళన..
చింతామణి: పట్టణంలోని అశ్విని లే అవుట్లో ఇళ్లు కట్టుకుంటున్న తమను కొందరు బెదిరిస్తున్నారని, విచారించి న్యాయం చేయాలని యజమాని జయరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెంపేగౌడ ఒక్కలిగర సంఘం నాయకులు, తదితరులతో కలిసి జయరామిరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించారు. జయరామిరెడ్డి మాట్లాడుతూ సర్వే నెం:146/1, 146/2, 146/3లో 12 గుంటల భూమిని కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకుంటున్నామని తెలిపారు. లావణ్య, శ్రీరామ నుంచి చట్ట ప్రకారం తాము భూమి కొనుగోలు చేశామన్నారు. అయితే వెంకటగిరికోట ప్రాంతానికి చెందిన వెంకటరమణప్ప, నరసింహ, మునెయ్య చిక్కనరసింహ, శ్రీనివాస్, మరో పదిమందితో వచ్చి భూమిలో ఇల్లు కట్టవద్దంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని సీఐ విజయకుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథరెడ్డి, రాజారెడ్డి, స్కూల్ సుబ్బారెడ్డి, ఊలవాడిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
ఆటో వీలింగ్.. ఒకరి అరెస్ట్
దొడ్డబళ్లాపురం: ఆటోలో వీలింగ్ చేస్తున్న కేఆర్ పురం నివాసి ఉదయ్ విక్రమ్(28) అనే వ్యక్తిని కేఆర్ పుర ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ప్రమాదకంగా ఫీట్లు చేస్తూ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో అతడ్ని గుర్తించి అరెస్టు చేశారు. అసోం మహిళ అదృశ్యం శివమొగ్గ: అసోంకు చెందిన మహిళ అదృశ్యమైనట్లు భద్రావతిలోని హళేనగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందింది. అసోం నివాసి సమీరున్నీసా(28) హొళెహొన్నూరు రోడ్డులోని అమీర్జాన్ కాలనీలోని హైదర్ అలీ అనే వ్యక్తి ఔట్హౌస్లో ఉంటూ పాచి పని చేస్తుండేది. అయితే ఆమె ఈనెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈమె ఆచూకీ తెలిసిన వారు భద్రావతి హళేనగర పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసు శాఖ ఓ ప్రకటనలో కోరింది. శాంటాక్లాజ్ వేషధారణ బనశంకరి: సిలికాన్సిటీ బెంగళూరులో క్రిస్మస్ సందడి జోరందుకుంది. అంజనానగరలో బ్రిటన్ ఇంటర్నేషనల్ స్కూల్లో బుధవారం చిన్నారులు శాంటాక్లాజ్ వేషధారణతో సందడి చేశారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకొని ఆనందంగా గడిపారు. దర్శన్ భార్యకు అశ్లీల సందేశాలు యశవంతపుర: నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మికి అశ్లీల సందేశాలు రావటంతో ఆమె బెంగళూరు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల సుదీప్–దర్శన్ అభిమానుల మధ్య వార్ నడుస్తుంది. అయితే వివాదాలకు తెర పడుతున్న తరుణంలో విజయలక్ష్మికి కొంతమంది అశ్లీల సందేశాలు పంపారు. దీంతో ఆమె బెంగళూరు నగర పోలీసు కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. తన ఖాతాకు వచ్చిన సందేశాలను అందజేశారు. కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. అశ్లీల సందేశాలు పెట్టేవారికి తగిన గుణపాఠం నేర్పుతానంటూ విజయలక్ష్మి తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు.డ్రగ్స్ దందా.. నలుగురి అరెస్టు దొడ్డబళ్లాపురం: డ్రగ్స్ దందాపై దావణగెరెలోని విద్యానగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలోని జేహెచ్ పటేల్ కాలనీలోని పార్క్లో గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో దాడి చేశారు. రాజస్థాన్కు చెందిన రామ్ స్వరూప్(33), ధోలారామ్(36), దేవ్ కిషన్(35), దావణగెరె తాలూకా శామనూరు గ్రామం నివాసి వేదమూర్తి(53)ని అరెస్ట్ చేశారు. వేదమూర్తి స్థానిక కాంగ్రెస్ నేత కావడం గమనార్హం. నిందితులనుంచి రూ.10 లక్షల విలువైన 90గ్రాముల ఎండీఎం, 200 గ్రాముల ఓపీఎం డ్రగ్స్, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. పొలాల్లోనే సేంద్రియ ఎరువు తయారీ గౌరిబిదనూరు: నగరసభ అందించే పొడి చెత్తతో రైతులు తమ పొలాల్లోనే ఎరువులను తయారు చేసుకోవచ్చని నగరసభ పరిసర ఇంజనీర్ శివశంకర్ తెలిపారు. పొడిచెత్త నిర్వహణపై తాలూకాలోని హోసూరు హోబళీ కదిరేనహళ్లిలో నగరసభ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరసభ సేకరించిన చెత్తను పొలాల్లో తవ్విన గుంతల్లో వేస్తారన్నారు. దానిని మట్టితో కప్పి పెడతారన్నారు. మూడు నెలల అనంతరం అది సేంద్రియ ఎరువుగా రూపాంతరం చెందుతుందన్నారు. దీనివల్ల రైతులకు ఎరువుల ఖర్చు పూర్తిగా తగ్గుతుందన్నారు. అధికారులు పొలాల వద్దకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. హెల్త్ ఇన్స్పెక్టర్ నవీన్, సణ్ణమీర్ రైతులు పాల్గొన్నారు. -
లంచగొండి అధికారి మాకొద్దు
పావగడ: ప్రతి పనికి లంచం కావాలని డిమాండ్ చేస్తూ కింది స్థాయి ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించే స్థానిక తాలూకా పంచాయతీ సమితి ఈఓ బీకే ఉత్తమ కుమార్ ఏమంత ఉత్తముడు కాదని, వెంటనే అతన్ని బదిలీ చేయాలని స్థానిక గ్రామ పంచాయతీల పిడిఓలు, కార్యదర్శులు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్ను కలిసి తమ బాధలను ఏకరువు పెట్టారు. ప్రతి నెలా చెప్పినంత ముడుపులను ఉత్తమకుమార్కు అందించాలని, లేకుంటే అభివృద్ధి పనుల్లో తగాదాలు సృష్టించి నోటీసులు అందిస్తానని బెదిరిస్తాడని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుంటే అభివృద్ధి పనులకు అడ్డుపడతాడని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు చన్నగిరి లో పనిచేసి, అవినీతి ఆరోపణల శిక్షతో బదిలీ పై పావగడ కు వచ్చాడని తెలిపారు. తక్షణమే అతడిని బదిలీ చేయాలని కోరారు. -
వైద్యాధికారులపై చర్యలేవీ?
రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్) వైద్యాధికారులు, డీహెచ్ఓలపై చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్త అంబాజీ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిమ్స్ వైద్యాధికారులు, డీహెచ్ఓ, కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వాహనం డ్రైవర్ అబ్దుల్ మతిన్తో కలిసి శవాలను తరలించడానికి రూ. 5 వేల దాకా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రద్ధాంజలి వాహనం డ్రైవర్ అబ్దుల్ మతిన్ కాంట్రాక్ట్ పద్ధతి నాలుగు నెలల క్రితం ముగిసినా అతనిని అలాగే విధుల్లో కొనసాగిస్తున్నారని, అతనిని విధుల నుంచి తొలగించాలన్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. బంగ్లాదేశ్లో హిందువుల హత్యాకాండకు నిరసనరాయచూరు రూరల్: బంగ్లాదేశ్లో హిందువులను హత్య చేయడం తగదని విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్ తీవ్రంగా ఖండించాయి. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు రవికృష్ణ మాట్లాడారు. బంగ్లాదేశ్లో గతంలో హిందువులను సామూహికంగా బహిష్కరణ చేయడంతో పాటు నరమేధానికి పాల్పడ్డారన్నారు. యువకుడిని చెట్టుకు కట్టేసి ఉరి వేసి హత్య చేసి ప్రజల ముందు దహనం చేయడం హేయమైన కృత్యమన్నారు. రెండు నిమిషాల పాటు మౌనం వహించి సంతాపం వ్యక్తం చేశారు. మంత్రాలయంలో నటుడు రిషబ్ శెట్టి సందడి రాయచూరు రూరల్ : మంత్రాలయాన్ని బుధవారం కన్నడ సినీ నటుడు రిషబ్ శెట్టి సందర్శించారు. రాఘవేంద్ర స్వామి మఠంలో రిషబ్ శెట్టి దంపతులు రాఘవేంద్ర స్వామి మూల విరాట్కు ఊంజల్ సేవ చేశారు. అనంతరం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ వారిద్దరిని సన్మానించారు. కాగా భక్తుల సందడి మధ్య మంత్రాలయంలో గజ వాహన రథోత్సవం నిర్వహించారు. ఘనంగా రైతు దినోత్సవం హొసపేటె: నగరంలోని గాంధీ చౌక్ సమీపంలో ప్రొఫెసర్ నంజుండప్ప వర్గం రైతు దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని రైతులు మండిపడ్డారు. చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని, పంటలకు మద్దతు ధర ప్రకటించాలని తదితర డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారు. రైతు సంఘం నేత జడియప్ప తదితరులు పాల్గొన్నారు. జిల్లాధికారి ఆకస్మిక తనిఖీ రాయచూరు రూరల్: జిల్లాధికారి నితీష్ రాయచూరులో ఆకిస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరం లోని దత్తు స్వీకార కేంద్రం, బాల, బాలికల మందిరాలు(రిమాండ్ హోం), ఆశాదీప మూగ, బధిర పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. సకాలంలో పౌష్టికాహారం, వైద్య సౌకర్యాలకు తోడు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. కుమార్, శ్రీదేవి, కిరిలింగప్ప, రమేష్ పాల్గొన్నారు. 28న విశ్వ పాత్రికేయుల దినోత్సవంరాయచూరు రూరల్: ఈ నెల 28న ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం ఏర్పాటు చేసినట్లు రిపోర్టర్స్ గిల్డ్ అధ్యక్షుడు విజయ్జాగటకల్ పేర్కొన్నారు. స్థానిక పాత్రికేయుల భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, రాయచూరు లోక్సభ, శాసనసభ, విధానపరిషత్ సభ్యులు, జిల్లా అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, ఎస్పీ పాల్గొంటారని తెలిపారు. రఘునాథరెడ్డికి జీవమాన సాధన అవార్డు, నలుగురికి సామాన్య అవార్డులు అందజేయనున్నారు. వందేమాతర గీతాలాపన రాయచూరు రూరల్: వందేమాతర గీతానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా బుధవారం దేవదుర్గలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముక్తకంఠంతో వందేమాతర గీతాన్ని పాడారు. ఉప తహసీల్దార్ భీమరావ్, సిద్ధయ్య స్వామి, బసవరాజ్, హంపయ్య, సుభాష్ చంద్ర, అమీర్, బందే నవాజ్, గంగమ్మ, లక్ష్మణ్, రాజశేఖర్, నరసింగరావ్లున్నారు. -
క్రిస్మస్కు చర్చిలు ముస్తాబు
సాక్షి బళ్లారి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పూజించి, ఆరాధించే ఏసుక్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకొని పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకకు నగరంలోని చర్చిలన్ని సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. నేడు గురువారం క్రిస్మస్ పర్వదిన వేడుక నేపథ్యంలో నగరంలోని సీఎస్ఐ, క్యాథలిక్ చర్చిలన్నింటినీ ముస్తాబు చేశారు. సీఎస్ఐ తెలుగు చర్చి, సీఎస్ఐ కన్నడ చర్చి, సీఎస్ఐ ఇంగ్లిష్ చర్చిలతో పాటు సెయింట్ ఆంథోని చర్చి, క్రైస్తవుల కింగ్, అలాగే స్వతంత్రంగా సుమారు 100 దాకా ఉన్న వివిధ చర్చిలన్ని క్రిస్మస్ వేడుకకు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలతో పాటు వివిధ రకాలుగా ముస్తాబు చేసి నగర వాసులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా బళ్లారికే తలమానికంగా ఉన్న విద్యానగర్లోని ఆరోగ్యమాత చర్చిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ చర్చికి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం, చరిత్ర కూడా ఉంది. సర్వాంగ సుందరంగా చర్చి పరిసరాలు క్రిస్మస్ పర్వదినం రోజునే కాకుండా ప్రతి రోజు కూడా ఈ చర్చికి పెద్ద సంఖ్యలో వచ్చి ప్రార్థనలు చేస్తారు. సువిశాలంగా, సర్వాంగ సుందరంగా నిర్మించిన ఆరోగ్యమాత చర్చిలో కాలు పెట్టిన వెంటనే అదో రకమైన పుణ్యక్షేత్రంగా ప్రతి ఒక్కరినీ కట్టిపడేసి ఆకట్టుకుంటుంది. ఏసుక్రీస్తు జననం నుంచి ఆయన పెరిగిన విధానం, శిలువ వేసిన దృశ్యాలు ఒక్కొక్క దానికి ఒక్కో ఆలయం తరహాలో అద్దాల మేడలో అద్భుతంగా విగ్రహాలు ఏర్పాటు చేసి వాటి కింద ఏసుక్రీస్తు ప్రస్థానానికి సంబంధించిన ఆధార లిఖితాలను పొందుపరచడంతో క్రిస్మస్ పర్వదినం నాడు ఆరోగ్యమాత చర్చి క్రైస్తవులకే కాక అన్ని కుల మతాల వారికి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. దీంతో ఈ చర్చికి క్రిస్మస్ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుండటంతో ఫాదర్లు భక్తులతో ప్రార్థనలు చేయించేందుకు అక్కడే ఉంటూ భక్తిపారవశ్యంతో చర్చిలో క్రిస్మస్ వేడుకలను జరపనున్నారు. బళ్లారి నగరానికే తలమానికం ఆరోగ్య మాత చర్చి నగరంలోని తెలుగు, కన్నడ, ఇంగ్లిష్ చర్చిలన్ని అలంకరణలతో కళకళ క్రిస్మస్కు మేరీమాత చర్చి సిద్ధం బళ్లారి రూరల్: క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్కు రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాలకు పెద్ద చర్చిగా పేరుగాంచిన బళ్లారి మేరీమాత చర్చిలో బుధవారం అలంకరణలు దాదాపు పూర్తయ్యాయి. బళ్లారి పరిసర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు క్రిస్మస్కు చర్చికి వచ్చి కరుణామయుడిని దర్శించుకొని ప్రార్థనలు నిర్వహించడం అనాదిగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున చర్చి పెద్దలు ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రాంగణంలోని యేసయ్య జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలతో కటౌట్లను ఏర్పాటు చేశారు. చర్చి ముందు బొమ్మలతో కూడిన బాల క్రీస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా నగరంలోని కోట ప్రాంతంలో తెలుగు చర్చిల్లో క్రిస్మస్ పర్వదిన ఆచరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. -
సిద్దుకు మద్దతుగా మైసూరులో సభ
యాత్రా ఫలం ఏమిటో అని అంతటా ఉత్కంఠ శివాజీనగర: ఎడతెగని టీవీ సీరియల్ మాదిరిగా ముఖ్యమంత్రి మార్పిడి తతంగం కొనసాగుతోంది. హైకమాండ్ నేతలు ఒకమాట, సీఎం సిద్దరామయ్య మరో మాట చెబుతూ ఉంటే, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారనే చెప్పాలి. సీఎం మార్పిడి ఏదీ లేదనేలా సిద్దరామయ్య, హైకమాండ్ ప్రకటనలు ఉంటున్నాయి. మాట్లాడాలని వెళితే.. ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. హైకమాండ్ నాయకులు కన్నడ రాజకీయంలో జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రముఖ నాయకులు శివకుమార్ భేటీకి సమయాన్ని ఇవ్వకపోవడం పెద్ద చర్చకు కారణమైంది. మంగళవారం నుంచి హస్తినాపురిలో ఉంటున్న శివకుమార్ సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ఇతర హైకమాండ్ నాయకులను కలవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఎవరూ అందుబాటులోకి రావడం లేదని సమాచారం. ఎందుకు ఇవ్వడం లేదు? రాష్ట్రంలో సిద్దరామయ్య వర్గం ఏర్పాటు చేస్తున్న అహింద బహిరంగ సభకు అడ్డుకట్ట వేయాలని డీకే నిశ్చయంతో ఉన్నారు. మంగళవారం కేంద్ర మంత్రులతో రాష్ట్ర ప్రాజెక్టుల గురించి చర్చలు జరిపారు. బుధవారం పార్టీ సీనియర్లను కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చకు చెమటోడుస్తున్నారు. అయితే పెద్దల దర్శనాలు దొరకడం లేదు. భేటీకి ఎవరూ సమయాన్నే ఇవ్వలేదని తెలిసింది. ఇది డీకే శివకుమార్ వర్గాన్ని కలచివేస్తోంది. గత నెల డీకే ఢిల్లీకి వెళ్తే, రాహుల్గాంధీతో అపాయింట్మెంట్ దొరకలేదు. ఆపై అధికార మార్పిడి ఒప్పందం అమలుకు డీకే పట్టుబట్టారు. ఇది పార్టీలో గందరగోళం కల్పించింది. మల్లికార్జున ఖర్గేని పలుసార్లు భేటీ చేసి ఒత్తిడి చేయడం కూడా ఢిల్లీ నాయకులకు తలనొప్పిగా పరిణమించింది. అందుచేతనే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం సీటు రగడ భగ్గుమనే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.27వ తేదీపైనే ఆశలు సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా మాజీ మంత్రి కే.ఎన్.రాజణ్ణ రాహుల్గాంధీకి లేఖ రాసి వేడి పుట్టించారు. ఈ నెల 27న కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. అందులో పాల్గొనేందుకు డీకే శివకుమార్ వెళ్తారు, తాను వెళ్లనని సిద్దరామయ్య మొన్ననే చెప్పారు. ఆ సమావేశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని డీకే పట్టుదలతో ఉన్నారు. ఇందులో ఫైనల్ రౌండ్ చర్చలకు శ్రీకారం చుట్టనున్నారు. దర్శనం ఇవ్వని హైకమాండ్ నేతలు? డిప్యూటీ సీఎం విశ్వ ప్రయత్నాలు సీఎం కుర్చీ చుట్టూ తీవ్ర రాజకీయం కురీ ఆటలో సీఎం సిద్దరామయ్య తన అహింద కార్డును తీశారు. గతంలో ఆయన దళిత, బీసీ, మైనారిటీల కోసమని అహింద అనే సంస్థను నెలకొల్పడం తెలిసిందే. మైసూరులోని వస్తు ప్రదర్శన మైదానంలో త్వరలోనే భారీ సభ జరపాలని అహింద నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సిద్దరామయ్యకు మద్దతుగా ఈ సభ జరుగుతుంది. సిద్దరామయ్యనే కొనసాగించాలనేది సభ ముఖ్య ఉద్దేశం. కనీసం 20 వేల మందితో సభ జరపనున్నారు. కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనేలా రంగం సిద్ధమవుతోంది. సిద్దరామయ్య అండతోనే సభ జరుగుతోందని సమాచారం. సాహితీవేత్తలు, మేధావులను ఆహ్వానించాం, సిద్దరామయ్యను పిలవలేదు, ఆయన తరఫున మేము సభ జరపబోతున్నాం అని నాయకుడు శివరాం తెలిపారు. జనవరి ఆఖరులో సభ ఉంటుంది. -
ముని మనవనిపై అవ్వ కసి?
శిశువు మృతదేహం బాగేపల్లి: 40 రోజుల పసికందును సొంత అవ్వ హత్య చేసిందని శిశువు తల్లి చేళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాలూకాలోని చేళూరువాసి ఆసిఫా, రాజేశ్ ఒకే కాలేజీలో చదువుతూ మతాంతర ప్రేమపెళ్లిని చేసుకున్నారు. నవంబర్ 12న ఆసిఫాకు మగబిడ్డ పుట్టాడు. దీంతో ఆమె చేళూరు పట్టణం గుంత మోరి వద్ద ఉండే బిరియానీ హోటల్లో పనికి చేరి అక్కడే అమ్మమ్మతో ఉంటోంది. 21వ తేదీన.. డిసెంబర్ 21న తాను హోటల్లో ఉండగా తన చెల్లి ఫోన్ చేసి పసిబిడ్డ చనిపోయాడని చెప్పిందన్నారు. అదే రోజు సాయంత్రం హోటల్ వెనుక భాగంలో శిశువును పూడ్చిపెట్టినట్లు తెలిపింది. కానీ తాను ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని అవ్వ.. శిశువుకు ఊపిరి ఆడకుండా చేసి చంపి ఉండొచ్చని ఫిర్యాదులో తెలిపింది. ఈ క్రమంలో పాతిపెట్టిన శిశువు మృతదేహాన్ని తహశీల్దార్ బీకే శ్వేత సమక్షంలో బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. మనవరాలు మతాంతర ప్రేమ వివాహం చేసుకుందని శిశువు హత్య -
విద్యుత్ సాంకేతిక శిక్షణ ప్రారంభం
బళ్లారిఅర్బన్: సండూరు తాలూకా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిందాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త విద్యుత్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. నైపుణ్య అభివృద్ధే ధ్యేయంగా 120 మంది యువకులకు విద్యుత్ వైరింగ్, భద్రతా చర్యలు, పరికరాల వాడకంపై అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను బోధిస్తారు. శిక్షణ తర్వాత ఉద్యోగ కల్పనకు కూడా అన్ని అండదండలను జిందాల్ సంస్థ అందించనుంది. ఎంపీ తుకారాం మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తాను ఎంతో పాటు పడ్డానన్నారు. తాను చేసిన విజ్ఞప్తి మేరకు జిందాల్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంగీత నేతృత్వంలో పనులు జరిగాయన్నారు. ఐటీఐ, డిగ్రీ కళాశాల బోధనలను గ్రామీణ విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ప్రముఖులు పెద్దన్న బీదల, మనిభూషన్ సింగ్, శ్రీకాంత్ హెగ్డే, నాగనగౌడలతో పాటు శ్రేష్ట, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్బాబు, ఇతర సిబ్బందితో పాటు గ్రామ వికాస సొసైటీ డైరెక్టర్ సచిన్, 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. -
పని కల్పించలేదు.. అప్పు ఇవ్వలేదంటూ హత్య
మైసూరు: తనకు అప్పు ఇవ్వలేదు, పైగా చేసేందుకు పని కల్పించలేదనే అక్కసుతో ఒక వ్యక్తిపై యువకుడు దాడి చేసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పిరియాపట్టణ తాలూకా భోగనహళ్లి గ్రామంలో జరిగింది. భోగనహళ్లి గ్రామానికి చెందిన బీటీ స్వామి గౌడ (56)వద్దకు అదే గ్రామానికి చెందిన గోవింద అనే యువకుడు వచ్చి అప్పు అడిగాడు. అయితే తన వద్ద డబ్బు లేదని బీటీ స్వామిగౌడ చెప్పాడు. ఏదైనా పని ఇస్తే చేస్తానని గోవింద చెప్పాడు. ఇతరులకు పని ఇచ్చే స్థోమత తనకు లేదని గౌడ చెప్పాడంతో గోవింద ఆగ్రహానికి గురై బీటీస్వామిగౌడపై దాడి చేశాడు. ఘటనలో స్వామిగౌడ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పిరియూ పట్టణ పోలీసులు వచ్చి పరిశీలించారు. మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు. హతుడి అక్క కుమారుడు బీకే ప్రతాప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు గోవిందను అరెస్టు చేశారు. టెక్కీకి తేనె వల వేసి దోపిడీ ● ఇద్దరు మహాళలు సహా ఐదుగురి అరెస్ట్ యశవంతపుర: టెక్కీకి తేనె వల వేసి డబ్బుదోచుకొని దాడికి పాల్పడిన ఘటన ఇద్దరు మహిళలతోసహా ఐదుగురిని బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. సుమలతా అలియాస్ అంజలి, అన్నపూర్ణేశ్వరినగరకు చెందిన హర్షిణి అలియాస్ స్వీటీ, జగదీశ్, లోకేశ్, మంజునాథ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 10న టెలిగ్రాం ద్వారా టెక్కికీ ఒక అమ్మాయి పరిచయమైంది. ఇంటివద్దకు పిలిపించి రూ.20 వేలు లాక్కుంది. అనంతరం తన స్నేహితురాలిని పిలిపించి ఆమె ద్వారా మళ్లీ రూ.20 వేలు లాక్కుంది. మరో రూ.40వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా టెక్కీ నిరాకరించాడు. దీంతో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేసి సెల్ఫోన్, నగదు లాక్కున్నారు. బాధితుడు తప్పించుకొని 112కు ఫోన్ చేశాడు. హొయ్సళ పోలీసులు వచ్చి మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ అరెస్ట్ విషయాన్ని బుధవారం ప్రకటించారు. ప్రియుని మోజులో పడి కన్నబిడ్డ విక్రయం దొడ్డబళ్లాపురం: ప్రియుని మోజులో పడిపోయిన మహిళ తమ ఆనందానికి అడ్డు వస్తోందని భావించి కన్నబిడ్డను విక్రయించింది. ఈ సంఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణంలో చోటుచేసుకుంది. ఐశ్వర్య అనే మహిళ తన భర్తతో విడిపోయి చంద్రప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆమెకు అప్పటికే రెండేళ్ల కుమార్తె ఉంది. తమ ఆనందానికి కుమార్తె అడ్డుగా ఉందని భావించిన ఐశ్వర్య...కొప్పళకు చెందిన ఒకరికి బ్రోకర్ ద్వారా చిన్నారిని రూ.50 వేలకు విక్రయించింది. మూడు రోజులుగా ఐశ్వర్య కుమార్తె కనిపించకపోవడం, ఆమె ప్రవర్తనలో తేడా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఐశ్వర్యను విచారణ చేపట్టగా అసలు విషయం చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐశ్వర్యను అరె స్ట్ చేశారు. పరారీలో ఉన్న చంద్రప్ప, బ్రోకర్ల కోసం గాలిస్తున్నారు. అధికారులు చిన్నారిని రక్షించే పనిలో పడ్డారు. అక్రమంగా కబేళా.. ఇద్దరి అరెస్ట్ మైసూరు: తాలూకాలోని హుల్లహళ్లి జేఎస్ఎస్ కాలేజీ వెనుక ఓ షెడ్లో అక్రమంగా కబేళా నిర్వహిస్తూ గొడ్డు మాంసం విక్రయిస్తుండగా హుల్లహళ్లి ఎస్ఐ చేతన్ కుమార్ బుధవారం దాడి చేశారు. మహ్మద్, అయూబ్ఖాన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి 34 కేజీల గొడ్డు మాంసం, ఇనుప కొక్కెం, కత్తి, సతార్, తక్కెడను స్వాధీనపరచుకున్నారు. హెలిరైడ్తో కార్వార అందాల వీక్షణ యశవంతపుర: కరావళి ఉత్సవంలో భాగంగా పర్యటకశాఖ తంబి ఏవియేషన్ సంస్థచే హెలికాఫ్టర్ రైడ్ను బుధవారం ప్రారంభించింది. కార్వార లండన్ వంతెన సమీపంలోని మైదానంలో హెలి రైడ్ను ఎమ్మెల్యే సతీశ సైల్ ప్రారంభించారు. తొలుత ఆశానికేతన పాఠశాలకు చెందిన చెవుడు, మూగ చిన్నారులను హెలికాప్టర్లో ఎక్కించి విహారం చేయించారు. కాగా ప్రతి రైడ్ 7 నిముషాలపాటు కొనసాగుతుంది. కార్వార నగరం చుట్టుపక్కల అందాలను వీక్షించే ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ లక్ష్మీప్రియా, జెడ్పీ సీఇఓ దిలీష్శశిలు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే సతీశసైల్ నృత్యాలు చేస్తూ గాయకుడిలా పాటలు పాడి అందరిని అశ్చర్య పరిచారు. బెయిల్ కోసం హైకోర్టుకు భైరతి బనశంకరి: రౌడీషీటర్ బిక్లు శివ హత్య కేసులో పరారీలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే భైరతి బసవరాజ్ ముందస్తు బెయిలు పిటీషన్ను ప్రజా ప్రతినిధి కోర్టు తిరస్కరించడం తెలిసిందే. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం బుధవారం మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. హత్య కేసులో ఇప్పటికే సీఐడీ పోలీసులు 18 మందిని విచారించి 4236 పేజీల చార్జిషీట్ను దాఖలు చేశారు. ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్ మైసూరు: మైసూరు జిల్లా కేఆర్నగర పట్టణంలోని చీరహళ్లి మెయిన్ రోడ్డులో కారులో గంజాయి ఉంచి విక్రయిస్తున్నారనే సమాచారంతో కేఆర్నగర వలయ ఎకై ్సజ్ సీఐ వైఎస్ లోకేష్, ఎస్ఐ సీవీ రాఘవేంద్ర, ఎకై ్సజ్ బీఈ శివకుమార్ దాడి చేశారు. కొడగు జిల్లా మక్కందూరు పోస్ట్ రాజరాజేశ్వరినగర నివాసి వీ.మహమ్మద్ మిర్షద్(23), కుశాలనగర ఖలందర్ క్యాంప్ నివాసి ఎల్.పద్మనాభ(23)ను అరెస్ట్ చేసి 974 గ్రాముల విత్తన మిశ్రిత ఎండు గంజాయి, కారును స్వాధీనపరచుకున్నారు. -
వ్యక్తి హత్య కేసులో నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: తన భార్య, తన తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న కోపంతో తండ్రీకొడుకులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఆరు నెలల అనంతరం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన పూర్వాపరాలు.. విజయపుర జిల్లా సింధగి తాలూకా బెన్నట్టి గ్రామంలో మహదేవప్ప(35) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన భూస్వామి సిద్దనగౌడ భార్య మల్లమ్మ(40)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సిద్దనగౌడ(50), అతని కుమారుడు అప్పుగౌడ(25) కలిసి మహదేవప్పను మట్టు పెట్టి తమకేమీ తెలియనట్లుగా వ్యవహరించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టిన విజయపుర పోలీసులు ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత నిందితులైన తండ్రీకొడుకులను అరెస్ట్ చేసినట్లు ఆ జిల్లా ఎస్పీ తెలిపారు. -
సర్కారీ ఇంజనీరు వద్ద ఆస్తుల గుట్ట
బనశంకరి: ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల ఇళ్లు, ఆఫీసులలో లోకాయుక్త దాడులు నిర్వహించింది. బాగల్కోటే, విజయపుర, ఉత్తరకన్నడ, రాయచూరు తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపట్టింది. భారీగా డబ్బులు, బంగారు నగలు, విలువైన సొత్తు, పొలాలు, స్థలాల పత్రాలను కనుగొన్నారు. ఎక్కడెక్కడ అంటే.. ● బాగల్కోటే జిల్లా పంచాయతీ ప్లానింగ్ డైరెక్టర్ శ్యామ్సుందర్ కాంబ్లేకు చెందిన బాగల్కోటే, గదగ జిల్లా నరగుంద ఇళ్లలో, ఆఫీసులో తనిఖీలు చేపట్టారు. ● ఇదే జిల్లాలో బాగేవాడి వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లప్ప ఇంటిపై దాడి చేశారు. ● ఉత్తర కన్నడ జిల్లా సిద్దాపురలో పంచాయతీ అధికారి మారుతి యశవంత మాళవి నివాసంలో సోదాలు జరిపారు. ఏఈఈ లక్ష్మీ నివాసం రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు ఉప విభాగం గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ఏఈఈ డీ.విజయలక్ష్మీ నివాసం, ఆఫీసు లపై దాడి కలకలం సృష్టించింది. రాయచూరులో ఐడీఎస్ంటీ లేఔట్లో నాలుగు అంతస్తుల ఇల్లు, పక్కన ఉన్న మరో ఇంట్లో ఫైళ్లను పరిశీస్తున్నారు. చెల్లెలి ఇంటిపైనా దాడి జరిగింది. యాదగిరిలో 30 ఎకరాల భూమి, అక్కడే లేఔట్లు, చంద్రబండ వద్ద 25 ఎకరాల భూమిని గుర్తించారు. రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాల్లో అపారమైన ఆస్తులను కనుగొన్నారు. ఆమెకు ఇంకా ఏడాదిన్నర సర్వీసు ఉంది. సుమారు 49 చోట్ల తనిఖీలు చేపట్టడం గమనార్హం. ఆమె హుబ్లీ పర్యటనలో ఉండడంతో వెంటనే రాయచూరుకు తిరిగి రావాలని లోకాయుక్త అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో లోకాయుక్త మెరుపు దాడులు పలువురు అధికారుల ఇళ్లలో సోదాలు -
సిద్దుకు మద్దతుగా, డీకేకి ముళ్లుగా..
శివాజీనగర: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎన్ రాజణ్ణ, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీకి మరో లేఖ రాశారు. ఓట్ చోరీ అభియానపై తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలతోనే ఆయనను గతంలో మంత్రి పదవి నుంచి తీసేయడం తెలిసిందే. ఇప్పటికే నాలుగు లేఖలను రాసిన రాజణ్ణ, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలతో పార్టీకి నష్టం జరుగుతోందని తాజా లేఖలో పేర్కొన్నారు. సిద్దరామయ్యను సీఎం స్థానం నుంచి తొలగిస్తే మరింత నష్టం జరుగుతుందని ఆయనకు మద్దతుగా నిలబడడం గమనార్హం. ఓటర్ల జాబితా విషయంలో కేపీసీసి నియమించిన బీఎల్ఏలు సక్రమంగా పనిచేయలేదంటూ కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్పైనా విమర్శలు గుప్పించారు. లేఖలో డీకేకి వ్యతిరేకంగా పలు అంశాలను రాశారు. వివరంగా చర్చించేందుకు భేటీకి సమయం ఇవ్వాలని రాహుల్ను కోరారు. రాహుల్గాంధీకి రాజణ్ణ మరో లేఖ -
షాపులో 140 కేజీల వెండి చోరీ
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరం బిబి రోడ్డులో ఉన్న ఎయు జువెలరీస్లో సోమవారం రాత్రి దొంగలు పడి 140 కేజీల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం షాపును తెరవడానికి వచ్చిన ఉద్యోగులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్పీ కుశాల్ చౌక్సె, పోలీసులు, శునకాలతో వచ్చి ఆధారాలను సేకరించారు. అర్ధరాత్రి సమయంలో దోపిడీ జరిగి ఉండవచ్చని ఎస్పీ అన్నారు. బాగా ఆరితేరినవారే కట్టర్తో ఇనుప గేట్ కు వేసిన తాళాలను కట్ చేసి లోపలకు చొరబడ్డారు, షోకేస్ల లో ఉంచిన వెండి సామగ్రిని దొంగిలించారు. బంగారు ఆభరణాలు మొత్తం లాకర్లో ఉన్నందున వాటిని తీయలేకపోయారు. మొత్తం రూ. 3 కోట్ల సొత్తు దొంగల పాలైంది అని ఎస్పీ తెలిపారు. ఆ షాపులోని సిసి కెమెరాల డివిఆర్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. పక్కనున్న షాపుల కెమెరాల ఆధారంగా క్లూస్ని అన్వేషిస్తున్నారు. లెక్చరర్.. పెళ్లిళ్లలో చోరీల దిట్ట యశవంతపుర: లెక్చరర్ గా పనిచేస్తూ, పెళ్లిళ్లలో చోరీలకు పాల్పడుతున్న రేవతి అనే మహిళను బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. శివమొగ్గకు చెందిన రేవతి బెంగళూరు కేఆర్ పురలో నివాసం ఉంటుంది. బెళ్లందూరు సమీపంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కన్నడ లెక్చరర్గా పనిచేస్తుంది. ఆదివారమైతే చాలు.. ఎక్కడ పెళ్లి జరిగినా బంధువునే అంటూ వెళ్తుంది. అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ ఆప్యాయత కురిపిస్తుంది. విందు భోజనం ఆరగించి, బంగారు నగలను కొట్టేసి బయటపడుతుంది. శనివారం రాత్రి నుంచే ఫంక్షన్ హాళ్లకు వెళ్లి ఎక్కడ పెళ్లి ఉంటుందో తెలుసుకోవడం ఆమె ప్రత్యేకత. బసవనగుడి ఠాణా పరిధిలో మూడు చోరీలు చేసింది. రేవతి నుంచి రూ.32 లక్షల విలువగల 262 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సిలిండర్లపై దొంగల కన్ను దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఇటీవల గ్యాస్ సిలిండర్ల చోరీలు ఎక్కువయ్యాయి. దీంతో గృహిణులకు తంటా వచ్చి పడింది. సాధారణంగా చాలామంది ఇళ్లల్లో ఒక నిండు సిలిండర్ అదనంగా ఉంటుంది. దానిని వరండాలోనో, కాంపౌండ్ లోపలో పెట్టి ఉంటారు. దొంగలు వాటిని మాయం చేస్తున్నారు. రాజాజినగర్లోని ఒక ఇంట్లో 2 సిలిండర్లను తీసుకున్న రోజే చోరీ అయ్యాయి. ఇంటి బేస్మెంట్లో పెట్టగా మళ్లీ కనబడలేదు. దొంగలు ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దొంగలు సిలిండర్ డెలివరీ వాహనాన్ని ఫాలో చేస్తూ గమనించి తరువాత చోరీలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. పోలీసులు వెతుకులాట చేపట్టారు. జైల్లో స్నేహం.. కలిసి దొంగతనాలు దొడ్డబళ్లాపురం: జైల్లో పరిచయమై స్నేహితులుగా మారి బయటకు వచ్చి చోరీలు చేస్తున్న ముగ్గురు చోరులను విద్యారణ్యపుర పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.38.17 లక్షల విలువైన 257 గ్రాముల బంగారు నగలను సీజ్ చేశారు. తిలక్ నగర నివాసి బాలరాజు (45), ఆడుగోడి గౌరవ్ (23), ప్రవీణ్ (26) పట్టుబడ్డ దొంగలు. పాత దొంగ అయిన బాలరాజుకు జైల్లో గౌరవ్, ప్రవీణ్ పరిచయమయ్యారు. బయటకు వచ్చాక కలిసి చోరీలు చేస్తున్నారు. భైరసంద్రలో జరిగిన ఒక చోరీ కేసులో దొరికారు. గజదొంగకు సంకెళ్లు దొడ్డబళ్లాపురం: ఇళ్లల్లో చోరీ చేసిన బంగారు నగలను కరిగించి విక్రయిస్తున్న ఆంధ్రప్రదేశ్కి చెందిన ఘరానా దొంగని జేపీ నగర పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.4.60 లక్షల నగదు, రూ.65 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మెహబూబ్ ఖాన్ పఠాన్, బెంగళూరు నాగవారలో నివసిస్తున్నాడు. ఇతనిపై ఏపీ, కర్ణాటక, తమిళనాడులో సుమారు 32 చోరీలు, దోపిడీల కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జేపీ నగరలోని 20వ మెయిన్ రోడ్డులో ఒక ఇంట్లో దంపతులు బయటకు వెళ్తూ ఇంటి తాళాలను చెప్పుల స్టాండ్లోని ఒక షూలో ఉంచి వెళ్లారు. ఇంతలో పఠాన్ ఆ తాళం సాయంతో చొరబడి బంగారం దోచుకున్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి నగదు,నగలు రికవరీ చేసుకున్నారు. బెంగళూరులోని పలు చోరీలు ఇతని పనేనని గుర్తించారు. -
బెంగళూరుకు సాయం చేయాలి
బనశంకరి: బెంగళూరులో మెట్రో రైలు పథకం మూడో స్టేజ్ కు ఆమోదం, ఆర్ఆర్టీఎస్ పథకానికి సాయం, మిట్టగానహళ్లి చెరువు వద్ద చెత్త యార్డుకు అనుమతి తో పాటు బెంగళూరు అభివృద్ధికి సాయం చేయాలని కేంద్ర నగరాభివృద్ధి మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను డీసీఎం శివకుమార్ కోరారు. ఢిల్లీలో ఆయనతో సమావేశమయ్యారు. దేశంలో బెంగళూరు మహా నగరమని, మీ వద్ద పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలను పరిష్కరించాలని డీకే కోరారు. మెట్రో రైలు రెండో దశ పథకం ఖర్చు రూ.26,405 కోట్ల నుంచి రూ.40,425 కోట్లకు పెరిగిందని, ప్రతిపాదనలను మీకు పంపించామని, ఆమోదించాలని తెలిపారు. మెట్రో మూడో స్టేజ్ పథకం సర్జాపుర నుంచి హెబ్బాళ వరకు 36.59 కిలోమీటర్లు, 28 స్టేషన్లతో ఉంటుంది, ఇందుకు రూ.28,405 కోట్ల ఖర్చును అంచనా వేసి కేంద్రం ఆమోదానికి పంపించామని, త్వరగా ఆమోదం తెలియజేయాలని కోరారు. కేంద్రమంత్రి ఖట్టర్కు డీసీఎం వినతి -
ప్రభువా.. దీనజన బాంధవా
శివాజీనగర: సకల మానవాళిని పునీతుల్ని చేయడానికి ఇలపై ఏసుప్రభువు వెలసిన రోజే పవిత్ర క్రిస్మస్. ప్రపంచం మొత్తం ఎంతో ఉత్సాహంగా క్రిస్మస్ పండుగ కోసం వేచి చూస్తోంది. కర్ణాటకలో అందునా బెంగళూరులో పండుగ కోలాహలం ఉట్టిపడుతోంది. అన్ని షాపింగ్ మాల్స్, దుకాణాలు, హోటళ్లు కలర్ఫుల్గా మారాయి. ఎటు చూసినా క్రిస్మస్, నూతన సంవత్సరం వాతావరణం అలరిస్తోంది. స్టార్ లైట్లు, అలంకారాలతో అన్ని చర్చిలు ధగధగ మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా బ్రిగేడ్ రోడ్డులోని సెయింట్ పాట్రిక్ చర్చ్, శివాజీనగరలోని సెయింట్ మేరీ బసిలికా చర్చ్, ఎంజీ రోడ్డులోని ఈస్ట్ పరేడ్ చర్చీ, రిచర్డ్ టౌన్లోని మిస్పా తెలుగు చర్చి, మార్తహళ్ళి అమాన చర్చీతో పాటుగా అన్ని నగరాలు, పట్టణాలలో క్రైస్తవ ప్రార్థనాలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. మరియమ్మనహళ్ళి కర్ణాటక కల్వరి చర్చీ సుందరంగా ముస్తాబైంది. క్రైస్తవులు, క్రైస్తవేతరులు అనే తేడా లేకుండా ఏటా క్రిస్మస్ పర్వదినాన్ని ఆచరిస్తామని ఆ చర్చీ పాస్టర్ రెవరెండ్ ఎం.జక్కయ్య తెలిపారు. ఏటా మాదిరిగానే గత నెల రోజులుగా క్యారెల్స్ వేడుకలను అన్ని చర్చ్లు ఉత్సాహభరితంగా నిర్వహిస్తున్నాయి. రాత్రివేళ ప్రార్థనా గీతాలు ఆలపిస్తూ సంఘ సభ్యుల ఇళ్లకు వెళ్లి క్రిస్మస్ ఆనందాన్ని పంచుతున్నారు. కొన్ని చర్చ్లు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే మహిళా క్రిస్మస్, పిల్లల క్రిస్మస్ వేడుకలు జరిపారు. అర్ధరాత్రి ఆరాధనలు 24వ తేదీ రాత్రి నుంచి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ఆరంభమవుతాయి. అర్ధరాత్రి విశేష ఆరాధన చేస్తారు. మంగళవారం ఉదయం నుంచే బెంగళూరులోని ప్రఖ్యాత చరిత్ర కలిగిన సెయింట్ మేరీస్ బసిలికా చర్చికి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి ఆరాధనలు చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి చర్చీలో బాల ఏసు ప్రతిమను ఊయలలో ఉంచి పూజిస్తారు. పండుగ సందర్భంగా అలంకరణ సామగ్రి, స్టార్ దీపాలు, కేక్ల వ్యాపారం జోరందుకుంది. క్రిస్మస్ చెట్టు, శాంటాక్లాజ్ దుస్తులకు గిరాకీ ఉంది. అంతటా క్రిస్మస్ సందోహం ముస్తాబైన చర్చిలు మార్కెట్లలో పండుగ కోలాహలం -
ఒడ్డుకు చేరిన కన్నయ్య
యశవంతపుర: ఉడుపి జిల్లా మల్పె వద్ద సముద్రంలో నుంచి శ్రీకృష్ణుని విగ్రహం ఒడ్డుకు చేరింది. ఇది దైవమాయ అని భక్తులు సంతోషపడుతున్నారు. వివరాలు.. ఆదివారం ఉడుపి కృష్ణ మఠంలో ఇస్కాన్ భక్తులు ఓ వేడుకను నిర్వహించి, అక్కడి నుంచి సాయంత్రం మల్పె సముద్ర తీరానికి వెళ్లారు. ఈ సమయంలో తేలుతూ విగ్రహం ఒడ్డుకు చేరింది. దీనిని గమనించిన భక్తులు విగ్రహాన్ని తీసుకువచ్చి పూజలు చేశారు. బస్సు డ్రైవర్ దాష్టీకం.. తల్లయిన టెన్త్ బాలిక దొడ్డబళ్లాపురం: ప్రైవేటు పాఠశాలకు బస్సులో వెళ్లే బాలికను ఆ బస్సు డ్రైవర్ మభ్యపెట్టి లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఫలితంగా గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అమానుషమైన సంఘటన హాసన్ జిల్లాలో జరిగింది. బాలిక చెన్నరాయపట్టణలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. స్కూల్ బస్సు డ్రైవర్ రంజిత్ 8 నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. బాలిక గర్భం దాల్చి మగ బిడ్డకు జన్మనిచ్చింది. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బ్రెడ్డులో కొకై న్ యశవంతపుర: బ్రెడ్లో మత్తు పదార్థం కొకై న్ను దాచి తరలిస్తుండగా బెంగళూరు సీసీబీ పోలీసులు నైజీరియా మహిళ ఓ.ఎస్తేర్ (29) ను అరెస్ట్ చేసి రూ.1.20 కోట్ల విలువైన కొకై న్ను పట్టుకున్నారు. వివరాలు.. ఆమె 2024లో ఢిల్లీ వర్శిటీలో చదువు కోసం వచ్చింది. కానీ ముంబైలో మకాం వేసి తెలిసినవారి ద్వారా డ్రగ్స్ వ్యాపారం సాగిస్తోంది. ముంబై నుంచి బెంగళూరుకు ప్రైవేట్ బస్సులో వస్తోంది. పోలీసులు అనుమానంతో ఆమెను తనిఖీ చేయగా బ్యాగులో బ్రెడ్డు లోపల కొకై న్ దొరికింది. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చిన్నస్వామిలో మ్యాచ్ రద్దు శివాజీనగర: నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరగాల్సిన ఢిల్లీ– ఆంధ్రప్రదేశ్ మధ్య విజయ్ హజారె క్రికెట్ టోర్నీ మ్యాచ్కు పోలీసులు అనుమతివ్వలేదు. సోమవారం బెంగళూరు కమిషనర్ సీమంత్ కుమార్, గ్రేటర్ బెంగళూరు అధికారులు మైదానాన్ని పరిశీలించారు. మ్యాచ్కు వీలు లేదని సర్కారుకు నివేదిక ఇచ్చారు. ఈ ఏడాది జూన్లో ఆర్సీబీ విజయోత్సవాలలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడం తెలిసిందే. అప్పటినుంచి ఇందులో మ్యాచ్లను జరపడం లేదు. గేట్ల విస్తరణ జరపలేదు, రద్దీకి తగిన ఏర్పాట్లు లేవని నివేదికలో పేర్కొన్నారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఢిల్లీ టీం నుంచి ఆడాల్సి ఉంది. రిటైర్డు కెప్టెన్ ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: మానసిక రోగంతో బాధపడుతున్న రిటైర్డు సైనికాధికారి రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా ఘట్టదహళ్లిలో జరిగింది. జీకే మల్లేశ్ (60) సైన్యంలో కెప్టెన్గా పనిచేసి రిటైరయ్యారు. మల్లేశ్ గత కొన్నాళ్లుగా మానసిక జబ్బుతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. ఇంట్లో సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనకు ముందు సకలేశపుర పోలీస్స్టేషన్కి ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పాడు. వెంటనే వారు హళేబీడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లేటప్పటికి శవమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తల్లీకూతుళ్ల అదృశ్యం శివమొగ్గ: శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటి నుంచి వెళ్లిన తల్లీకూతుళ్లు 20 రోజుల నుంచి జాడ లేరు, ఈ ఘటన శివమొగ్గ గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని హరిగె సమీపంలోని చిలకాద్రిలో జరిగింది. వివరాలు.. అవినాష్ భార్య వీణ(32), కుమార్తె చైతన్య (7)ను తీసుకుని ఈ నెల 3వ తేదీన బంధువుల ఇంట నిశ్చితార్థంకి వెళ్లి ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. ఆచూకీ తెలిస్తే శివమొగ్గ గ్రామీణ పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. -
బొగ్గు చోరీ బాధ్యులపై క్రిమినల్ కేసు వేయాలి
రాయచూరు రూరల్: యరమరస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(వైటీపీఎస్)లో బొగ్గు అక్రమంగా చౌర్యం అవుతోందని, అధికారులు, ఇంజినీర్లు భాగస్వాములని, అలాంటి అధికారులపై క్రిమినల్ కేసు వేయాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. మంగళవారం వైటీపీఎస్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నరసింహలు మాట్లాడారు. రాయచూరు, యరమరస్ వరకు రైల్వే లైన్లలో వ్యాగన్లతో వెళ్లే రేకులను అన్ లోడ్ చేసి కొద్ది మేర ఉంచుకొన్న బొగ్గును రైల్వే స్టేషన్లో నిలిపి అక్రమంగా విక్రయాలు చేస్తున్నారన్నారు. బొగ్గును వైటీపీఎస్ ఇంజినీర్లు, సబ్ కాంట్రాక్టర్, మేనేజర్, స్టేషన్ మాస్టర్, వ్యాగన్ల క్లీనింగ్ సిబ్బంది, గురు రాఘవేంద్ర ఎంటర్ప్రెజెస్లు ఏకమై అక్రమంగా వైటీపీఎస్కు తరలాల్సిన బొగ్గును దొంగతనంగా ఇతర ప్రాంతాలకు తరలించిన వారిపై చర్యలు చేపట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఒత్తిడి చేశారు. లాభాల ఆశ చూపి లక్షల్లో టోకరాహుబ్లీ: దావణగెరె వినాయక లేఅవుట్కు చెందిన ఓ వ్యక్తిని సైబర్ వంచకులు నిట్టనిలువునా దోచుకున్నారు. సుమారు రూ.76.48 లక్షలు ఎగనామం పెట్టారు. వివరాలు.. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే బాగా లాభాలు వస్తాయంటూ ఆశ చూపించిన వంచకులు ఫేస్బుక్లో పరిచయం అయిన సదరు వ్యక్తి నుంచి ఆ మేరకు ఆన్లైన్ ద్వారా డబ్బులు దోచుకున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ డిసెంబర్ వరకు సుమారు విడతల వారీగా వివిధ బ్యాంకుల నుంచి డబ్బులను తమ ఖాతాల్లోకి వేయించుకొని వంచించారని బాధితుడు నగర సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం రాయచూరు రూరల్: ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని దేవదుర్గ తాలూకా నగరగుండ వద్ద జరిగింది. సోమవారం రాత్రి రాయచూరు తాలూకా అరిషిణిగికి చెందిన రంజాన్ అలీ(30), దేవదుర్గ తాలూకా బెళకల్లో ఉన్న హసీనా(25) కాన్పు కోసం బెళకల్ నుంచి దేవదుర్గకు వెళుతుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి ఢీకొట్టడంతో హసీనా అక్కడికక్కడే మరణించింది. రంజాన్ అలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ధ్యానంతో ఆరోగ్య భాగ్యంరాయచూరు రూరల్: మానవుడికి ధ్యానంతోనే ఆరోగ్య భాగ్యమని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత అన్నారు. నగరంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయ భవనంలో ఏర్పాటు చేసిన విశ్వ ధ్యాన దినోత్సవ సభను జ్యోతి వెలిగించి ప్రసంగించారు. యోగా, ధ్యానం వల్ల ప్రపంచానికి భారత్కు గురువు స్థానం లభించిందన్నారు. అందరికీ శాంతి, ప్రపంచ సద్భావన ఆధారంగా మనిషి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో శారద, వనజాక్షి, అసిస్టెంట్ కమిషనర్ గజానన బళి, అరుణ, బసన గౌడ, ప్రభణ్ణ గౌడ, వెంకట సింగ్, ప్రేమ కలాల్లున్నారు. స్లం వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి రాయచూరు రూరల్: మురికి వాడల కాలనీల్లో నివాసమున్న వాసులకు ఇళ్ల పట్టాలను అందించాలని మురికి వాడల కాలనీ వాసులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడారు. 1991–92లో సర్వే నంబర్–572, 573, 574ల్లో నివాసముంటున్న వారికి నేటికీ పట్టాలు ఇవ్వకుండా నగరసభ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మురికి కాలువల నిర్మాణాలు చేపట్టలేదన్నారు. 600 కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందించాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు. -
లబ్ధిదారులకు హక్కు పత్రాల పంపిణీ
హొసపేటె: నగరంలోని తాండా, హాడి, ఇతర మురికివాడలలో దశాబ్దాలుగా నివసిస్తున్న పత్రాలు లేని 351 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇంటి హక్కు పత్రాలను అందించడం ద్వారా చట్టబద్ధమైన యాజమాన్య హక్కును కల్పించిందని ఎమ్మెల్యే హెచ్ఆర్.గవియప్ప అన్నారు. బళ్లారిలోని కర్ణాటక మురికివాడల అభివృద్ధి బోర్డు సబ్–డివిజన్, నగరంలోని జిల్లా ఇండోర్ స్టేడియంలో వసతి శాఖ నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు టైటిల్ డీడ్లను పంపిణీ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. నిరాశ్రయులైన నివాసులకు అధికారిక యాజమాన్య హక్కును అందించడానికి ప్రభుత్వం సాహసోపేతమైన చర్యలు తీసుకుందన్నారు. ఈ పత్రాలు యజమానులకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సబ్సిడీ పొందడానికి సహాయపడతాయన్నారు. హుడా చైర్మన్ హెచ్ఎన్ఎఫ్ ఇమాం నియాజీ, మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ రూపేష్కుమార్, అసిస్టెంట్ కమిషనర్ పీ.వివేకానంద, తహసీల్దార్ ఎం.శృతి, ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, మున్సిపల్ కమిషనర్ శివకుమార్, స్లం డెవలప్మెంట్ బోర్డు ఏఈఈ వి.తిమ్మన్న పాల్గొన్నారు. -
మరిన్ని బస్సులను నడపండి
హొసపేటె: మహిళలు, పిల్లల ప్రయోజనాల దృష్ట్యా తాలూకాలోని మరియమ్మనహళ్లి, గరగ, యశ్వంత్ నగర్ మధ్య సరైన బస్సు సర్వీసులను అందించాలని డిమాండ్ చేశారు. మంగళవారం సండూరు తాలూకాలోని యశ్వంత్నగర్, గరగ, బలకుంది, నాగలాపుర, తాండా, గొల్లరహళ్లి, డణాయకనకెరె, దేవలాపుర, మరియమ్మనహళ్లి, హొసపేటె మధ్య ఒకే ఒక బస్సు నడుస్తోంది. దీంతో మరియమ్మనహళ్లి పట్టణం, హొసపేటె నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆస్పత్రులకు వెళ్లే పిల్లలు, మహిళలు, గర్భిణీ సీ్త్రలు, వృద్ధులు ప్రతి రోజూ ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో ఈ గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తగినన్ని బస్సు సర్వీసులను అందించాలని ఈ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మార్గంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.10 గంటల వరకు గరగ నుంచి మరియమ్మనహళ్లికి ప్రత్యక్ష బస్సు సర్వీసు లేదు. పాఠశాల పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వచ్చే బస్సు కోసం తలుపు వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా వారి రోజు వారీ పనుల కోసం ప్రయాణించే ప్రజలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. సకాలంలో బస్సు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
సమస్యల సుడిలో సాయంత్రం కళాశాల
సాక్షి బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా విద్య ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటిలో తమ పిల్లలను మంచి విద్యా వంతులుగా మార్చాలనే తపన ప్రతి ఒక్కరికీ రోజు రోజుకు పెరుగుతోంది. విద్య ఉపాధికి మార్గం కావడంతో విద్యపై ఆసక్తి పెరిగి, తప్పనిసరిగా కూడా మారింది. అష్టకష్టాలతో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావడానికి పోటీ పడుతున్నారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదివేందుకు నేటి తరం విద్యార్థులు పరుగులు తీస్తున్నారు. పోటీ ప్రపంచంలో విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఆరాట పడుతున్నవారు కోకొల్లలు. ఒకటో తరగతి నుంచి పీయూసీ వరకు ఏదో రకంగా కష్టపడి చదివే వారు. కొందరికి డిగ్రీ పట్టా పొందేందుకు వివిధ రకాల సమస్యలు ఎదురవడంతో అర్థంతరంగా చదువులు మానేసేవారు. మౌలిక సదుపాయాలు కరువు అయితే నేటి పోటీ ప్రపంచంలో ప్రతి చిన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగానికి ఏదో ఒక డిగ్రీ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాల్సిన నిబంధనలు ఉన్నాయి. అర్ధంతరంగా చదువును మధ్యలోనే ఆపేసిన వారికి డిగ్రీ పట్టా పొందేందుకు ప్రభుత్వం వివిధ జిల్లాల్లో సాయంత్రం కళాశాలను ప్రారంభించిందే కానీ అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో అర్ధంతరంగా చదువును మానేసి సాయంత్రం కళాశాలలో చేరి డిగ్రీ పట్టాను పొందాలనుకునేవారి ఆశలు అడియాసలవుతున్నాయి. పేదరికమో, పరిస్థితుల కారణమో ఉదయం పూట కళాశాలలకు వెళ్లని వారికి సాయంత్రం కాలేజీకి వెళ్లి డిగ్రీ పట్టాను తీసుకోవాలనే ఆశతో ఉన్నవారికి సరైన సదుపాయాలు లేక వెనుకడుగు వేస్తున్నారు. బళ్లారి నగరంలోని సతీష్చంద్ర సరళాదేవి కళాశాలలో 2021–22వ విద్యా సంవత్సరంలో ఈ సాయంత్రం కళాశాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఏటా పెరగని విద్యార్థుల సంఖ్య నాలుగేళ్లుగా కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఎంత మాత్రం పెరగడం లేదు. కళాశాలల్లో బీకాం, బీసీఏకి ప్రవేశాలు పొందేందుకు చర్యలు తీసుకొన్నారు. ఒక్కొక్క తరగతికి కనీసం 15 మంది విద్యార్థుల అవసరం ఉంటుంది. నాలుగేళ్లుగా ఇప్పటి వరకు బీకాం కోర్సులకు 35 మందిలోపు, బీసీఏ కోర్సులకు 25 మంది మాత్రమే కళాశాలల్లో ప్రవేశం పొందారు. ఇంట్లో పేదరికం, కుటుంబాల బాధ్యత, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అనివార్య కారణాల వల్ల తరగతి గదులకు హాజరు కాని వారికి సాయంత్రం కళాశాలకు సంబంధించి 2021లో సంధ్యాశక్తి పథకం కింద డిగ్రీ పట్టా పొందేందుకు ప్రారంభమైన సాయంత్రం కళాశాల మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా నడుస్తోంది. ప్రారంభంలో కోర్సులకు జాయిన్ కావడానికి ఆసక్తి చూపినప్పటికీ కళాశాలల్లో బోధన సిబ్బంది సరిగా లేకపోవడంతో విద్యార్థులు చేరడానికి వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో ఏకై క సాయంత్రం కాలేజీ జిల్లాలో ఉన్న ఏకై క సాయంత్రపు కళాశాల సరళాదేవి కళాశాల ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతున్నా జనంలో అవగాహన, తగినంత ప్రచారం లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోవడంతో పాటు బోధన సిబ్బంది కూడా అంతంత మాత్రమే ఉండటం వల్ల విద్యార్థుల సంఖ్య పెరగడం లేదనే ఆరోపణలున్నాయి. సాయంత్రం కళాశాలల్లో కఠినమైన బీసీఏ, బీకాం కోర్సులను ప్రారంభించారే కానీ బీఏ కోర్సును ప్రారంభించకపోవడం కూడా విద్యార్థుల సంఖ్య పెరగకపోవడానికి కారణంగా భావిస్తున్నారు. తగిన కోర్సులు ప్రవేశ పెట్టక పోవడంతో సాయంత్రం కళాశాల కాస్త రాత్రి మబ్బుమయంగా మారిపోయింది. బీఏ కోర్సును ఏర్పాటు చేయడంతో పాటు వృత్తి విద్యా కోర్సులు, బోధన సిబ్బందిని నియమించి తగినంత ప్రచారం నిర్వహించి కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రతి పేద విద్యార్థులకు ఉదయం పూట కళాశాలకు వెళ్లలేని వారికి ఓ డిగ్రీ పట్టా తీసుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత విద్యార్థులు, అవిద్యావంతులు కోరుతున్నారు. సరళాదేవి సతీష్చంద్ర అగర్వాల్ కళాశాల ప్రవేశ ద్వారం సరళాదేవి సతీష్చంద్ర అగర్వాల్ కళాశాల భవనం నాలుగేళ్లలో 65 మంది విద్యార్థులకే ప్రవేశం వేధిస్తున్న బోధకులు, తగిన కోర్సుల కొరత సరళాదేవి కాలేజీలో 2021–22వ విద్యా సంవత్సరంలో ప్రారంభం -
విద్యార్థుల్లో సానుకూల దృక్పథం అవసరం
హొసపేటె: విద్యార్థులు తమ మనస్సుల నుంచి ప్రతికూల అంశాలను తొలగించి, సానుకూల అంశాలతో నింపుకోవాలని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీవీ.పరమ శివమూర్తి అన్నారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో నుంచి భవనంలో 2025–26వ మొదటి సంవత్సరం విద్యార్థుల స్వాగత వేడుకను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. కన్నడ విశ్వవిద్యాలయంలో అధ్యయనాలకు చాలా బహిరంగ వాతావరణం ఉందని అన్నారు. 5 లక్షలకు పైగా పుస్తకాలతో లైబ్రరీ వ్యవస్థ ఉందన్నారు. విద్యార్థులు తమ చదువులో 100 శాతం కృషి చేయాలి, మీ సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేయాలని అన్నారు. ముఖ్య భాషా నికాయ డీన్ డాక్టర్ మాధవ్ పెరాజె, కన్నడ సాహిత్య అధ్యయన విభాగాధిపతి డాక్టర్ వెంకటగిరి దళవాయి, విద్యార్థులు పాల్గొన్నారు. మనిషికి మానసిక స్థైర్యం కరాటే రాయచూరు రూరల్ : మనిషి మానసిక బలానికి, ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందని కేపీసీఎల్ ఏఈఈ మహేష్ పేర్కొన్నారు. సోమవారం శక్తినగర్ బసవ కళ్యాణ మంటపంలో జిల్లా ఫేం కాక్ సిలాట్ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యోతి వెలిగించి మాట్లాడారు. దేశఽంలో కరాటేకు ఉన్న ప్రాధాన్యతను వివరించడానికి ఫేం కాక్ సిలాట్ సంస్థ చేస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రకృతి దేహానికి సంబంధించిన క్రీడగా భావించాలన్నారు. ఫేం కాక్ సిలాట్ క్రీడలు ఇండోనేషియా, మలేసియాలో దీనికున్న ప్రాధాన్యతను వివరించారు. ఆత్మరక్షణ, శారీరక మానసిక, సాంస్కృతికతను నేర్పిస్తుందన్నారు. గుండెపోటు నివారణకు మానవుడు ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో జిల్లా ఫేం కాక్ సంస్థ సంచాలకురాలు లక్ష్మి, జేసీఐ అధ్యక్షుడు గౌతమ్ కట్టిమని, శరణే గౌడ, సిద్ధప్ప, బసన గౌడ, సవితలున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన హొసపేటె: నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబాన్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు, మేం ఎల్లప్పుడూ గాంధీ కుటుంబానికి అండగా ఉంటామని కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సిరాజ్షేక్ నాయకత్వంలో మంగళవారం చేపట్టిన నిరసనలో పాల్గొని మాట్లాడారు. హొసపేటె అంబేడ్కర్ సర్కిల్లో జరిగిన నిరసనలో బీజేపీ రాజకీయాలకు తలొగ్గబోమని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. అదే విధంగా నరేగ పథకం పేరు నుంచి గాంధీజీ పేరు తొలగించారు. బీజేపీకి గాంధీజీ చరిత్ర, పోరాటం తెలియదు. అదనంగా నరేగ పథకం పేరును తొలగించి వీబీజీ రామ్జీగా పేరును మార్చారు. దీనిలో 60:40 నిష్పత్తిని చేయడం ద్వారా వారు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి గోపీనాథ్ పళనియప్పన్, మాజీ మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్, ఎమ్మెల్యే శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు నూర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
గ్యారెంటీల అమలులో నిర్లక్ష్యం వద్దు
రాయచూరు రూరల్: పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి లభించే సౌకర్యాలను కల్పించే పంచ గ్యారెంటీల అమలులో అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదని రాష్ట్ర పంచ గ్యారెంటీల అమలు సమితి ఉపాధ్యక్షుడు ఎస్.ఆర్.మెహరోజ్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జెడ్పీ జల నిర్మల కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. పేద ప్రజలకు ప్రభుత్వం పంచ గ్యారెంటీల అమలు విషయంలో అందరికీ అందేలా చూడాలన్నారు. అన్న భాగ్య, యువ నిధి, గృహలక్ష్మి, శక్తి, గృహజ్యోతి అమలులో లోపాలు రాకుండా అందరికీ అందేలా అధికారులు శ్రమించాలన్నారు. గృహజ్యోతి నుంచి 3,52,582 మంది, 1,58,435 మంది నిరుద్యోగులు యువనిధి నుంచి లాభం చేకూరిందన్నారు. సమావేశంలో జిల్లాధ్యక్షుడు పామయ్య మురారి, తాలూకా అధ్యక్షుడు పవన్, రజాక్ ఉస్తాద్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, వ్యవసాయ వర్సిటీ వీసీ హన్మంతప్ప, హుడేద్, నవీన్ కుమార్, రోణలున్నారు. -
అయోధ్యకు స్వామీజీ రైలు యాత్ర
మైసూరు: గణపతి సచ్చిదానంద స్వామి వేలాది మంది భక్తులతో మైసూరు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన రైల్వే స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ, అయోధ్యలో కర్ణాటక దత్త పీఠానికి స్థలం కేటాయించారని తెలిపారు. దత్త పీఠం శాఖను ప్రారంభించి, రామ పరివార్ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి తాను అక్కడికి వెళ్తున్నానని చెప్పారు. కర్ణాటక హనుమంతుని భూమి. హంపిలోని కిష్కింధలో హనుమంతుడు అవతారం ఎత్తిన ప్రదేశం, కాబట్టి, రాముడు, కర్ణాటక మధ్య ప్రత్యేక సంబంధం ఉంది అని స్వామీజీ వివరించారు. కిచ్చ సుదీప్ వర్సెస్ దర్శన్ శివాజీనగర: హుబ్లీలో జరిగిన మార్క్ సినిమా ఈవెంట్ లో నటుడు కిచ్చ సుదీప్ మాట్లాడిన మాటలు చర్చకు కారణమయ్యాయి. సుదీప్ ఎవరి పేరును ఎత్తకున్నా, దర్శన్ గురించే అని దిబాస్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్ సతీమణి విజయలక్ష్మి కూడా ఎవరి పేరును చెప్పకుండా సుదీప్పై విమర్శలు గుప్పించారు. కొందరు దర్శన్ లేకపోవడంతో ఏదేదో మాట్లాడుతున్నారు, వేదికపై నిలబడి మాట్లాడటం, వీడియోల్లో కూర్చొని మాట్లాడటం, బయట మాట్లాడటం చేస్తున్నారు. అదే జనం దర్శన్ ఉన్నప్పుడు బెంగళూరులో ఉంటారో, లేదో కూడా తెలియదు అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక అభిమానులు సుదీప్కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. సుదీప్ మార్క్ సినిమా ప్రచారం కోసం జిమ్మిక్కులు చేస్తున్నాడని వారు మండిపడ్డారు. పేలుడు కేసంటూ.. రూ.5 లక్షలు స్వాహా దొడ్డబళ్లాపురం: సైబర్ నేరగాళ్లు రూ. 5 లక్షలకు పైగా స్వాహా చేశారని శరణ్ ఆర్ ముకుంద్ అనే కన్నడిగుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వివరాలు.. ఆయనకు కాల్ చేసిన వ్యక్తి ఏటీఎస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో మీ హస్తం ఉందని, విచారించాలని బెదిరించాడు. ఏ తప్పూ చేయలేదని చెప్పినా వినిపించుకోలేదు. తరువాత ఐపీఎస్ అధికారి గౌరవ్ పేరుతో ఒక వ్యక్తి మాట్లాడి వీడియో కాల్లోనే విచారణ పేరుతో ప్రశ్నలు వేశాడు. బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకున్నాడు. ఈ కేసు బయటపడాలంటే ఓ సర్టిఫికెట్ మంజూరు చేయాలి, ఖర్చవుతుందని చెప్పాడు. అలా రూ.5.53 లక్షలు బదలాయించుకున్నారు. తరువాత మోసం అని తెలుసుకుని 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. చిన్నస్వామిలో మ్యాచ్లపై సమీక్ష శివాజీనగర: ఇటీవల ప్రాణాంతకమైన తొక్కిసలాట జరిగిన బెంగళూరు చిన్నస్వామి క్రీడా మైదానంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే విషయం పరిశీలనకు కమిటీని నియమించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. సోమవారం విధానసౌధలో క్రికెట్ సంఘం అధికారులు, పోలీసు అధికారులతో ఆయన భేటీ జరిపారు. 24న విజయ్ హజారె టోర్నీ జరపడానికి క్రికెట్ సంఘం అనుమతి కోరిందన్నారు. జీబీఏ కమిషనర్ నేతృత్వంలో పలు ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేశామని, స్టేడియాన్ని పరిశీలించి మార్పులు చేర్పుల గురించి ప్రభుత్వానికి నివేదికను ఇస్తుందని, దానిని బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. రూ.5 వేల కోట్లు ఏమయ్యాయి?: కుమారదొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో మహిళల ఖాతాల్లోకి జమ కావాల్సిన రెండు నెలల గృహలక్ష్మి పథకం డబ్బులు రూ.5000 కోట్లు ఏమయ్యాయంటూ కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి సర్కారును ప్రశ్నించారు. హాసన్లో సోమవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన మార్చ్, ఏప్రిల్ నెలలకు మహిళలకు ఇవ్వాల్సిన గృహలక్ష్మి డబ్బులు ఉన్నాయా, ఉందా లేదా అన్నారు. ఆర్థికమంత్రి అయిన సీఎం సిద్ధరామయ్య జవాబు చెప్పాలన్నారు. రూ.5 వేల కోట్లు మిస్సింగ్ అంటే మామూలు విషయం కాదన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించి రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. -
మైసూరులో మది దోచే మ్యాగి వేడుక
రాజ్యాంగ గ్రంధానికి పుష్ప రూపం ఆదిశేషుడు మైసూర్: క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మైసూరులో జిల్లా యంత్రాంగంచే అంబా విలాస్ ప్యాలెస్ ఆవరణలో 21 నుండి 31 వరకు మ్యాగి ఉత్సవాలు– పుష్ప ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తోంది. దేశ, విదేశాల నుంచి మైసూరుకు వచ్చే పర్యాటకులను ఆహ్లాదపరిచేందుకు లక్షలాది పుష్పాలతో వైవిధ్య పుష్ప రూపాలను రూపొందించారు. శృంగేరి ఆలయం, దివంగత చెట్లమాత తిమ్మక్క, హంసలు, రాజ్యాంగ పుస్తకం, ఇంకా అనేక ఆకృతులు అబ్బురపరుస్తాయి. అలాగే సాయంత్రం వేళల్లో సంగీత కచేరీ వీనులవిందు చేస్తోంది. కలెక్టరు లక్ష్మికాంతరెడ్డి, అధికారులు సోమవారం సందర్శించారు.సుందరమైన పూల హంసలు అల్లరి ఉడుత -
అరటి తోటలో పులి గర్జన
మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకాలోని బండీపుర అభయారణ్యం పరిధిలో బరగి సమీపంలోని ముక్తి కాలనీ వద్ద అరటి తోటలో పెద్ద పులి పట్టుబడింది. వివరాలు.. జిల్లాలో పులుల దాడుల సంఘటనలు పెరగడంతో, అటవీ శాఖ సిబ్బంది గుండ్లుపేట తాలూకాలోని భీమనబీడు, చామరాజనగర తాలూకాలోని నంజెదేవన్పుర పరిసరాల్లో గాలింపు జరుపుతున్నారు. శుక్రవారం భీమనబీడు గ్రామం వద్ద రెండు ఆవులు అరటి తోటలో మేస్తుండగా పులి దాడి చేసింది. ఒక ఆవు ముందు కాలును కరిచింది, మరొక ఆవు వెనుక కాలిని గాయపరిచింది. గత వారం రోజులుగా పులి మేకలను చంపి తింటోంది. పులిని పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మత్తు మందు ఇచ్చి.. ఈ నేపథ్యంలో సోమవారం అరటి తోటలో పులి దాక్కున్నట్లు గుర్తించిన అటవీ సిబ్బంది దానిని వలలతో చుట్టుముట్టారు. మత్తు మందును తుపాకీ ద్వారా కొట్టారు. కొంతసేపటికి అది మత్తులోకి జారుకుంది. వెంటనే దానిని బంధించారు. పులి వయస్సు దాదాపు 7, 8 సంవత్సరాలు ఉంటుందని. పులి ఎద, వెనుక కాళ్ళపై గాయాలు ఉన్నాయని, మరో పులితో జరిగిన పోరాటంలో గాయపడి ఉండవచ్చని అటవీ అధికారులు తెలిపారు. అది కోలుకునేవరకు చికిత్స చేస్తారు. పులిని మైసూరు జూ కు తరలించినట్లు తెలిసింది. వారంరోజులుగా గ్రామస్తులకు భయం ఎట్టకేలకు నిర్బంధం గుండ్లుపేట తాలూకాలో ఘటన -
జనవరి 15లోగా డీకే సీఎం: జ్యోతిష్యుడు
శివాజీనగర: సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి సీటు రగడ మొదటికొచ్చేలా ఉంది. ఇడ్లీ– దోసె, కోడికూర అల్పాహార విందు భేటీల తరువాత కాస్త చల్లారినట్లున్న వివాదం మళ్లీ తారాస్థాయికి చేరుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మధ్యలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేస్తున్న వ్యాఖ్యలు సమస్య తీవ్రతను మరింత పెంచేవిగా ఉంటున్నాయి. కుర్చీ పోట్లాటకు చరమగీతం పాడాలనే దిశలో హైకమాండ్ బలమైన చర్యలు తీసుకుంటోందా, లేదా అనే మీమాంస పార్టీలోనే నెలకొంది. గొడవ అనేది హైకమాండ్ సృష్టించలేదు, స్థానికంగానే తలెత్తింది అని ఖర్గే చెప్పడం ద్వారా కొత్త అనుమానాలను రేకెత్తించారు. ఇద్దరు నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడతామని అంతకుముందు చెప్పేవారు. ఖర్గే తాజా వ్యాఖ్యలు అన్ని లెక్కాచారాలను తలకిందులు చేసేలా ఉన్నాయని నాయకులు భావిస్తున్నారు. సిద్దరామయ్య, డీకే వాగ్బాణాలు ఇక జనవరి 5వ తేదీకి సిద్దరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసిన నేతగా రికార్డు సృష్టిస్తున్నారు. నేనే ఐదు సంవత్సరాలు పదవిలో ఉంటా, అధికార మార్పిడి చర్చలు జరగలేదని సీఎం సిద్దరామయ్య బెళగావి అసెంబ్లీలో ప్రకటించి డీకే శివ ఆశల మీద నీళ్లు చల్లారు. ఆ రోజు ఢిల్లీలో తమ మధ్య అధికార మార్పిడి ఒప్పందం జరిగిందని డీకే మళ్లీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల మధ్య వారిద్దరే గొడవను పరిష్కరించుకోవాలని ఖర్గే చెప్పడం ద్వారా బంతిని బెంగళూరు మైదానానికి పంపించారు. ఖర్గే వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో భిన్న భావాలు ఏర్పడ్డాయి. సిద్దరామయ్య వర్గంలో సంతోషం, డీకే శిబిరంలో కలవరం నెలకొంది. రాహుల్గాంధీ, సోనియాగాంధీలతో మాట్లాడాలని డీకే నిశ్చయించినట్లు సమాచారం. నేడు ఢిల్లీకి డీసీఎం శివ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంగళవారం ఢిల్లీకి వెళ్తారు. గత 10 రోజుల్లో హస్తినకు వెళ్లడం ఇది రెండవసారి. హైకమాండ్ నేతలు తమ ఇద్దరితో ఓ విషయం చెప్పారని, దాని గురించి ఢిల్లీకి వెళ్లి చర్చించి పరిష్కరించుకుంటామని డీకే ఇటీవల తెలిపారు. ఢిల్లీలో శివకుమార్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరవుతారు. కేంద్రజలశక్తి మంత్రి సీఆర్.పాటిల్ నేతృత్వంలో జరిగే నదుల అనుసంధానం సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రనీటి ప్రాజెక్టులకు, మెట్రో రైలు పథకానికి 50 శాతం నిధుల సాయం కోరనున్నారు. కాగా డీకేను కేపీసీసీ పదవి నుంచి తొలగించాలని, మరికొందరు డిప్యూటీ సీఎంలను నియమించాలని సిద్దరామయ్య ఆప్త మంత్రులు, ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేస్తున్నారు. ఎత్తు, పై ఎత్తులతో రాష్ట్ర కాంగ్రెస్లో సెగ రాజుకుంది. సీఎం, డీసీఎంలే తేల్చుకోవాలన్న ఖర్గే వ్యాఖ్యలతో అంతా తారుమారు హైకమాండ్ పట్టించుకోదా? అనే సందేహాలు మైలారిలో సీఎం అల్పాహారం మైసూరు: మైసూరులో సీఎం సిద్దు టీకే లేఔట్లోని తన నివాసం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పరిష్కారానికి హామీ ఇచ్చారు. తరువాత, అగ్రహారలో మైలారి హోటల్కు వెళ్లి దోసె, ఇడ్లీ అల్పాహారం ఆరగించారు. ఆయన వెంట మంత్రి వెంకటేష్, ఎమ్మెల్యే డి.రవిశంకర్, కలెక్టరు లక్ష్మీకాంత్ రెడ్డి, పోలీసు కమిషనర్ సీమా తదితరులు ఉన్నారు. బనశంకరి: జనవరి 15 లోగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని, మంత్రి సతీశ్ జార్కిహొళి కేపీసీసీ చీఫ్ అవుతారని సోమవారం బబలేశ్వర జ్యోతిష్యుడు ఉల్లాస్ జోషి చెప్పారు. దీనిని రాఘవేంద్రస్వామి తన నాలుక నుంచి పలికించారన్నారు. సమస్య గురించి జపం చేస్తూ రాఘవేంద్రస్వామికి నివేదిస్తానని, ఇందుకు స్వామివారు సమాధానం ఇస్తారని చెప్పారు. ఎంతోమందికి జాతకాలు చెప్పానని, ఏదీ అబద్ధం కాలేదన్నారు. జనవరి 15లోగా డీకే కుర్చీలో ఆసీనులవుతారన్నారు. ఈ జోస్యం రాజకీయాల్లో చర్చ రేకెత్తించింది. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
రాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి జిల్లాల్లో కృష్ణా నదీ తీరం వెంట ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా, మూడు పువ్వలు, ఆరు కాయలుగా సాగుతోంది. వర్షాభావంతో రైతుల పశువులు, ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతోంటే దర్జాగా టిప్పర్ల ద్వారా రాత్రికి రాత్రే ఇసుకను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఇసుక వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇసుక అక్రమ రవాణ చేసే వారిపై పోలీస్, రెవెన్యూ, ఆర్టీఓ శాఖల అధికారులు మౌనం వహిస్తున్నారు. నారాయణపుర జలాశయం కింది భాగంలో జేసీబీలు, హిటాచీలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో యాదగిరి, రాయచూరు జిల్లాలు, తెలంగాణలోని జూరాల, గూగల్, గుర్జాపూర్, దేవదుర్గ, వడగేర, సురపుర, భీమరాయన గుడి, శహాపుర ప్రాంతాల్లో చెక్పోస్టులున్నా పోలీసుల కళ్లుగప్పి అక్రమార్కులు ఇసుక రవాణాను నిరాటంకంగా సాగిస్తున్నారు. భాగ్యనగరానికి భారీగా తరలింపు హైదరాబాద్తో పాటు మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్లీ, మీరజ్ల వరకు అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. ఒక టిప్పర్కు రూ.55 వేల నుంచి రూ.60 వేలు, కలబుర్గి జిల్లాలో రూ.80 వేలు, ఇతర రాష్ట్రాలకు రూ.1.50 లక్షల వరకు ధరలు పలుకుతున్నాయి. నిత్యం సుమారు 400 టిప్పర్ల మేర ఇసుక అక్రమ రవాణా అవుతోంది. ప్రతి టిప్పర్లో 35 టన్నుల మేర ఇసుకను రవాణా చేస్తున్నారు. రోజు రూ.2 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయి. యాదగిరి జిల్లా ఇంచార్జి మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్, దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ల నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా వాహనాల సంచారం అధికమైంది. ఇంత జరుగుతున్నా కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాధికారులు, ఎస్పీలు మౌనం వహించడంపై ప్రజలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. మూడు పువ్వులు, ఆరు కాయలుగా వ్యవహారం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికార గణం -
వేషభాషణ చట్టాన్ని విరమించుకోవాలి
బళ్లారిఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన హిందూ వ్యతిరేక వేషభాషణ చట్టాన్ని విరమించుకోవాలని జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. రాయల్ సర్కిల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనంతరం జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. జిల్లాధ్యక్షుడు అనిల్కుమార్ మోకా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఆసక్తి చూపకుండా ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తోందన్నారు. నగరంలో మట్కా, ఇస్పేట్, అక్రమ మద్యం అమ్మకాలు, దొంగతనం, వేశ్యావాటిక, గంజాయి వంటి అమ్మకాలు చేపడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇటీవల మహిళలపై కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. హిందూ వ్యతిరేక వేషభాషణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు శ్రీనివాస్ మోత్కర్, కే.హనుమంతప్ప, ధరప్పనాయక్, రామలింగప్ప, మారుతీ ప్రసాద్, గోవిందరాజులు, అరుణ, బాలచంద్ర, గోవింద్, సిద్దేష్, లోకేష్, నాగరాజు, ఆర్.మల్లేశ్, పుష్ప, చంద్రశేఖర్, చాందిని తదితరులు పాల్గొన్నారు. -
మట్టిలో మాణిక్యం.. గుర్తింపు దక్కని వైనం
హుబ్లీ: క్రీడా రంగంలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన యాదగిరి జిల్లా క్రీడాకారుడికి తీరని అవమానం జరిగింది. వివరాలు.. యాదగిరి జిల్లా క్రీడా మైదానంలో తగిన వసతులు లేక క్రీడాకారులు పడరాని పాట్లు పడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ దుస్థితి నెలకొన్నా సంబంధిత ఆఖ అధికారుల్లో ఎలాంటి స్పందన లేదు. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఏమి పట్టించుకోవడం లేదని ఖేలో ఇండియా ఫేం క్రీడాకారుడు లోకేష్ రాథోడ్ పెదవి విరిచారు. సోమవారం మైదానం ఎదుట రోడ్డులో తాను సాధించిన వివిధ పతకాలను ప్రదర్శించి ధర్నా చేపట్టారు. గత నెలలో రాజస్తాన్ రాజధాని జైపూర్లో ఖేలో ఇండియా జాతీయ క్రీడల్లో పాల్గొని మూడో స్థానం చేజిక్కించుకొని దేశ గౌరవాన్ని పెంచానన్నారు. ఇప్పటి వరకు వివిధ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని 50కి పైగా పతకాలను సాధించారు. జాతీయ డెకథ్లాన్ పోటీలు–2025కు కసరత్తు చేసే క్రమంలో తగిన సౌకర్యాల కొరతతో బెంగళూరుకు ఎంతో వ్యయప్రయాసలతో వచ్చి వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ కారణంగా ఎన్నో పోటీల్లో పాల్గొనలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా పోటీల్లో తృతీయ విజేతగా నిలిచినా కూడా యాదగిరి జిల్లా యంత్రాంగం ఒక్కసారైనా తనను పిలిచి అభినందించలేదన్నారు. ఐపీఎల్ వంటి జల్సా ఆటల్లో పాల్గొనే క్రీడాకారులకు మాత్రం ఎక్కడ లేని స్వాగతాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంత పేదరికం నేపథ్యంలో క్రీడాకారులు జిల్లా యంత్రాంగానికి కానీ పాలకుల కంటికి గాని కనిపించడం లేదని వాపోయారు. గత మూడున్నరేళ్ల నుంచి జిల్లా క్రీడా యోజన అధికారికి నిరంతరంగా వినతిపత్రాలు సమర్పించి సమస్యలను ఏకరువు పెట్టినా ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆ జాతీయ క్రీడాకారుడు తన ఆవేదనను వ్యక్తం చేశారు. రోడ్డుపై పతకాలను ప్రదర్శించి జాతీయ క్రీడాకారుడి అక్రందన -
ప్రేమకు ప్రతిరూపం క్రిస్మస్
బనశంకరి: ప్రేమకు ప్రతిరూపం క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆనందంగా జరుపు కొంటున్నారని తెలుగు బాప్టిస్ట్ చర్చి (టీబీసీ) పాస్టర్ రెవరెండ్ ఎం.బీ.మోసెస్ తెలిపారు. ఆదివారం రాత్రి రామచంద్రపురలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. తెలుగు క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సమాజంలో అసమానతల తొలగింపునకు కరుణామయుడు ఏసుక్రీస్తు పోరాటం చేశారని, శాంతి, ప్రేమలతో కూడిన సమాజం కోసం శ్రమించారని తెలిపారు. ఈ సందర్భంగా బాలలు క్రీస్తు జన్మవృత్తం నృత్యనాటికతో పాటు మహిళలు ఆంధ్ర క్రైస్తవ గీతాలను ఆలపించారు. పాస్టర్లు కేఎన్.రావు, బాలసుందరం తదితరులు పాల్గొన్నారు. -
సౌకర్య లోపం.. ప్రజలకు శాపం
హుబ్లీ: నగరానికి వివిధ పనుల కోసం విచ్చేసే ప్రజలకు ప్రకృతి బాధలైన మూత్ర, మలవిసర్జన ఎక్కడ చేయాలో తెలియక పడరాని పాట్లు పడుతున్న దృశ్యాలు కాసింత పరికించి చూస్తే తేటతెల్లం అవుతుంది. మరుగుదొడ్ల వ్యవస్థ కల్పించాల్సిన హుబ్లీ ధార్వాడ సిటీ కార్పొరేషన్ ఆవరణలో శౌచాలయం ఉండీ లేనట్లుగా అఘోరించడంతో ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. పాలికెకు వివిధ పనుల కోసం నిత్యం వందలాది మంది వస్తుంటారు. మూత్రవిసర్జన బయలు ప్రదేశంలో చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక బహిర్భూమి సంగతి సరేసరి. వీటిపై జాగృత పరిచే పాలికె ఆవరణలో ఇలాంటి దుస్థితి ఉన్నా కూడా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా పాలించే ప్రజాప్రతినిధులు గాని సంబంధిత ఉన్నతాధికారులు కాని వారి చేతికింద ఉన్న సిబ్బంది కానీ ఈ దుస్థితి గురించి పట్టించుకోవడం లేదు. పాలికె ఆవరణలో ఓ శౌచాలయాన్ని నిర్మించారు. నిర్వహణ కొరతతో సంవత్సరాలుగా దాన్ని వాడటానికి సాధ్యపడటం లేదు. ఆ మరుగుదొడ్డి లోపలికి వెళితే తరతరాల వాసన ముక్కుపుటాలను అదరగొడుతుంది. దీంతో స్థానికులు బహిర్భూమి ప్రాంతంలోనే తమ ఒకటి, రెండు సమస్యలను తీర్చుకుంటున్నారు. పాలికె ఆవరణలో మరుగుదొడ్ల స్వచ్ఛత, ఉత్తమ ఆరోగ్యం కోసం మరుగుదొడ్డినే వాడండి అన్న నినాదం వెక్కిరిస్తోంది. అయితే శౌచాలయానికి ముక్కు మూసుకొని వెళ్లక తప్పడం లేదు. మరుగుదొడ్డిలో తగిన నీటి వసతి కూడా కరువైంది. వివిధ పనుల కోసం పాలికె ఆవరణలోకి అడుగు పెట్టిన ప్రజలకు శౌచాలయ సమస్య నరకయాతన దర్శనమిస్తుంది. మొత్తం మీద బయలు మరుగుదొడ్డి ఇక్కడ తప్పనిసరి అని స్థానిక తంతు క్షౌ రశాల యజమాని చెన్నమ్మ సర్కిల్ అంగడి నివాసి గోవిందరాజులు, మంజునాథ్, సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యేక మరుగుదొడ్ల వసతి ఉండగా దీంతో వీరు వాటినే వాడతారు. అయితే జనసామాన్య ప్రజలకు ఉండే ఒకే ఒక్క శౌచాలయం ఉండగా నిర్వహణ కొరతతో చెత్తచెదారానికి మరుగుదొడ్లు నెలవయ్యాయి. పాలికెకు వచ్చిన సార్వజనికులు సమీపంలోని హోటల్పై ఆధారపడుతూ తమ ఈతి బాధలను అక్కడికి వెళ్లి తీర్చుకుంటున్నారు. బీజేపీ సీనియర్ కార్పొరేటర్ తిప్పణ్ణ మజ్జిగి ఈ సమస్యపై స్పందించారు. స్థానికులకు అవసరమైన వసతులు కల్పించడం పాలికె కర్తవ్యం అని పాలికె కమిషనర్తో మరుగుదొడ్ల మరమ్మతులతో పాటు నిర్వహణ తీరు గురించి చర్చిస్తానన్నారు. మేయర్ జ్యోతి పాటిల్ తక్షణమే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చి తగిన సూచనలు చేసిన అధికారి ప్రబుద్ధులు సాక్షాత్తు మేయర్ ఆదేశాలను కూడా పట్టించుకోక పోవడం శోచనీయం. ఇప్పటికై నా పాలికె ఆవరణలో ఉన్న సార్వజనిక మరుగుదొడ్లకు తక్షణమే మరమ్మతులు చేయించి పాలికె పనుల కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంచుతామని పాలికె కమిషనర్ డాక్టర్ రుద్రేష్ గాలి తెలిపారు. హుబ్లీలోని సిటీ కార్పొరేషన్ కార్యాలయం హుబ్లీలోని కిత్తూరు రాణి చెన్నమ్మ కూడలి నగరంలో కాలకృత్యాలు తీర్చుకునేదెలా? నగరానికి వచ్చిన ప్రజలకు తప్పని తిప్పలు కానరాని ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలు పట్టించుకోని హుబ్లీ–ధార్వాడ మహానగర పాలికె యంత్రాంగం సమస్యలమయంగా మరుగుదొడ్లు ఈతి బాధలకు హోటలే గతి -
బిహార్ సీఎం రాజీనామాకు డిమాండ్
రాయచూరు రూరల్: ముస్లిం మహిళలను అవమానపరిచిన బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేసింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు సయ్యద్ మహ్మద్ మాట్లాడుతూ ప్రజలు ఏర్పాటు చేసిన సమావేశంలో ముస్లిం మహిళ ధరించిన బురఖాను అక్కడి సీఎం తీసి చూడటం రాజ్యాంగ బద్ధంగా మైనార్టీ ధర్మానికి వ్యతిరేకమన్నారు. హిజాబ్ను తీసి చూసిన ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో తౌసిఫ్, అక్బర్ హుసేన్, ఫర్జానా, మాసూమ్, తయ్యబా, జానీ, షఫీ, జాఫర్లున్నారు. హిజాబ్ ఘటన మత వ్యతిరేకం మైనార్టీ మహిళ హిజాబ్ను తొలగించి చూసిన ఘటనకు నైతిక బాధ్యత వహించి బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని ఏఐఎంఐఎం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి అధ్యక్షుడు ఫారూక్ షేక్ మాట్లాడారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ సామాన్యులు సంచరించే ప్రదేశంలో నిండు సమావేశంలో మైనార్టీ మహిళ వేసుకున్న బురఖాను తీసి చూడటం ముస్లిం మతానికి వ్యతిరేకమన్నారు. హిజాబ్ను తొలగించిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో ఖాజావలి, హాజీ, అఫ్తాబ్ హుసేన్, తన్వీర్, అల్తాఫ్, రహీం, అజీజ్, రఫీ, జలాల్లున్నారు. -
విశాఖపట్నం రైలును రాయచూరు వరకు నడపాలి
రాయచూరు రూరల్: విశాఖపట్నం రైలును రాయచూరు వరకు నడపాలని రాయచూరు లోక్సభ సభ్యుడు కుమార నాయక్ను ప్రవాసాంధ్ర ప్రముఖుడు సూర్యదేవర నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం రాయచూరు లోక్సభ సభ్యుడు కుమార నాయక్ను ఆయన కార్యాలయంలో కలుసుకుని పుష్పగుచ్ఛం సమర్పించిన అనంతరం మాట్లాడారు. విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్కు ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు చేరుకునే ఈ రైలును రాయచూరు వరకు పొడిగించాలన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు ఎంతో అనుకూలం అవుతుందని తెలిపారు. అగ్నిప్రమాదంలో థియేటర్ బుగ్గి హుబ్లీ: గదగ్ నగరంలోని ఓ సినిమా థియేటర్లో ఆకస్మికంగా అగ్నిప్రమాదం చోటు చేసుకోగా అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణపాయం జరగలేదు. కానీ థియేటర్లోని కుర్చీలు, తెర, స్పీకర్లు, పీఓపీ, ఫ్యాన్లు, ఏసీలు తదితర పరికరాలు కాలి బూడిదయ్యాయి. శాంతి టాకీస్లో ఈ ప్రమాదం చోటు చేసుకోగా సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అధికారులు, సిబ్బంది హుటాహుటిన విచ్చేసి మంటలను ఆర్పి భారీ నష్టం జరగకుండా నివారించారు. ఘటనపై బెటగేరి లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా సోమవారం సూర్యోదయాన్నే ప్రమాదం వల్ల స్థానికులతో పాటు సదరు థియేటర్ యజమాని, ఇతర సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. విజ్ఞాన రంగంలో కొత్త ఒరవడికి బాటలు రాయచూరు రూరల్: శాసీ్త్రయ, విజ్ఞాన రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని డయట్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శేఖర్ భండారి పేర్కొన్నారు. సోమవారం దేవదుర్గ తాలూకా శివంగి ప్రభుత్వ హైస్కూల్లో శాసీ్త్రయ, విజ్ఞాన సమ్మేళనం–2025ను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని సద్వినియోగ పరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో మల్లికార్జున, తహసీల్దార్ నాగమ్మ, జాన్ రాబర్ట్లున్నారు. వీనుల విందుగా సంగీత సమ్మేళనం రాయచూరు రూరల్: నగరంలో ఆదివారం రాత్రి సంగీత పితామహుడు పండిత సిద్ధరామ జంబలదిన్ని జ్ఞాపకార్థం 37వ సంగీత సమ్మేళనాన్ని వీనుల విందుగా నిర్వహించారు. ఉదయ నగర్లోని స్వర సంగమ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కిల్లె బృహన్మఠం శాంత మల్ల శివాచార్య ప్రారంభించారు. అంతర్జాతీయ క్లారినెట్ విద్వాంసుడు, స్వర సంగమ సంగీత కళాశాల అధ్యక్షుడు వడవాటి నరసింహులు, భరత్, శారద, చంద్రశేఖర్, వెంకటసింగ్, శివప్రసాద్లున్నారు. జీరామ్జీ బిల్లును ఉపసంహరించుకోండిహొసపేటె: అభివృద్ధి చెందిన భారతదేశంలో జీరామ్జీ బిల్లు– 2025 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. జీరామ్జీ బిల్లు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగ)బిల్లు– 2005కు పూర్తి వ్యతిరేకమన్నారు. ఈ బిల్లును కార్మికులు, కార్మిక సంఘాలు, ఆలోచనాపరులు, మేధావులు, కార్యకర్తలతో ఎలాంటి సంప్రదింపులు జరుపకుండా రూపొందించారన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం పేదల ఉపాధి హక్కును హరించే కుట్ర అని ఆరోపించారు. భార్యను చంపి ప్రమాదంగా ప్రచారందొడ్డబళ్లాపురం: భార్య తలపై బండరాయితో బాది దారుణంగా హత్య చేసిన భర్తను బాగలూరు పోలీసులు అరెస్టు చేశారు. మిట్టగానహళ్లికి చెందిన గాయత్రి(55)ని ఆమె భర్త అనంత్(62)హత్య చేశాడు. ఇద్దరి మధ్య తరచూ పోట్లాటలు జరిగేవి. ఈ క్రమంలో భార్యను అనంత్ తమ స్థలం వద్దకు తీసికెళ్లి తలపై బండరాయితో కొట్టి చంపాడు, రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అందరికీ చెప్పాడు. అయితే స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇంటి వద్దకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారణకు వచ్చారు. తరువాత అనంత్ను విచారించగా అసలు విషయం చెప్పాడు. వీరికి పీయూసీ చదువుతున్న కుమార్తె ఉంది. నిందితున్ని అరెస్టు చేశారు. -
మానవతా విలువలు పెంచుకోవాలి
రాయచూరు రూరల్: విద్యార్థులు మానవతా విలువలను పెంచుకోవాలని కిల్లె బృహన్మఠం శాంతమల్ల శివాచార్య స్వామీజీ పేర్కొన్నారు. సోమవారం తాలూకాలోని నెలెహాళ్ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన కళా ఉత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు మొక్కలు పెంచడంతో పాటు ప్లాస్టిక్ నిర్మూలన, స్వచ్ఛతకు శ్రీకారం చుట్టాలన్నారు. క్రమశిక్షణతో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలన్నారు. బీఈఓ ఈరణ్ణ కోసిగి, పాఠశాల ట్రస్టీ మహేశ్వరి, రాఘవేంద్ర, రవి, తిమ్మణ్ణ నాయక్, శ్రీనాథ్లున్నారు. జనవరిలో జిల్లా ఉత్సవాలురాయచూరు రూరల్: జిల్లాలో జనవరి 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు రాయచూరు జిల్లా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. దశాబ్దం అనంతరం చేపడుతున్న జిల్లా ఉత్సవాల్లో అందరూ చురుకుగా పాల్గొని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ దిశగా ఉత్సవాలకు అధికారులు ఇప్పటి నుంచే తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏడీసీ శివానంద, ఏఎస్పీ కుమారస్వామి, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి నరేష్, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఈరన్న, సంతోష్ రాణి, సురేష్ వర్మలున్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్య విప్లవంరాయచూరు రూరల్: దేశంలో చిరుధాన్యాల వినియోగంతో ఆరోగ్య విప్లవం జరుగుతుందని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అన్నారు. సోమవారం వ్యవసాయ వర్సిటీలో సిరిధాన్యాల జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళ్యాణ కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో వర్షాధారిత ప్రాంతాల్లో జొన్నలు, కొర్రలు, సజ్జలు, మినుములు, నువ్వులు, రాగులు, గోధుమ పంటలు పండించవచ్చన్నారు. సర్కార్ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయనుందన్నారు. జాతాలో వైస్ చాన్సలర్ హన్మంతప్ప, అధికారులు ప్రకాష్ చౌహాన్, కృష్ణలున్నారు. పథకం పేరు మార్పు తగదు రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(నరేగ) పథకం పేరును మార్చడం తగదని గ్రామీణ కూలీ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో కార్యదర్శి గురురాజ్ మాట్లాడారు. పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చి పేదల కడుపు కొట్టడానికి కుట్ర చేస్తోందన్నారు. నరేగ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలన్నారు. ఈ పథకం కింద కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో పనులు చేయించడానికి అనుమతి ఉంటుందని వివరించారు. ఆందోళనలో అజీజ్ జాగీర్దార్, కలమంగి పంపాపతి, హన్మంతరాయ, జగదీష్, మహేష్, జిలాని, హనీఫ్, శ్రీనివాస్లున్నారు. బంగ్లా అక్రమ వలసదారులతో సమస్య దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడం పోలీసులకు కష్టంగా మారింది. రాష్ట్రంలో కనీసం 485 మంది అక్రమ బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 308 మందిని బహిష్కరించారు. కొందరు స్థానికులు వలసదారులకు సహకరిస్తుండడంతో వారిని గుర్తించడం సాధ్యం కావడం లేదు. నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి వలసదారులు ఆధార్ తీసుకుని లోకల్ అని చెప్పుకుంటున్నారు. మరోవైపు చదువులు, టూరిస్టుల పేరుతోభారత్లోకి అగుడుపెట్టిన వారు వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోయారు. కేంద్ర హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులో 344, మంగళూరులో 41, బెంగళూరు జిల్లాలో 49, తుమకూరులో 1,కోలారులో 12, హాసన్లో 3, కొడగులో 1, చిత్రదుర్గలో 6, ధారవాడలో 2, శివమొగ్గలో 12, ఉడుపిలో 10, ఉత్తరకన్నడలో 4 మంది అక్రమ వలసదారులను గుర్తించారు. కొందరు నేరాలకూ పాల్పడుతున్నారు. రాష్ట్రంలో 157 మంది అక్రమ వలసదారులపై మొత్తం 37 నేరాల కేసులు నమోదయ్యాయి. -
సాగు రుణాలు మెండుగా ఇవ్వండి
కోలారు: వ్యవసాయ తదితర రుణాలను ప్రాధాన్యత క్రమంలో విరివిగా అందించాలని జెడ్పీ సీఈఓ ప్రవీణ్ బాగేవాడి తెలిపారు. సోమవారం జెడ్పీ భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగానికి అధికంగా రుణాలు అందించాలన్నారు. అటల్ పింఛన్ పథకం లక్ష్యాన్ని సాధించిన బ్యాంకర్లను ఆయన అభినందించారు. పీఎంజేజేవై, పీఎంఎస్బీవై పథకం కింద అధికంగా ప్రజలను చేర్చాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రధానమంత్రి సురక్షా పథకం వార్షిక ప్రీమియం రూ.20, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో ప్రతి త్రైమాసికానికి ఉన్న వార్షిక ప్రీమియం రూ.436లను వినియోగదారులు చెల్లించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద అధికంగా రుణాలు అందించాలన్నారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఈ సిల్వియా గౌతం, నబార్డు డీడీఎం హిమాంశు శుక్లా, కెనరా బ్యాంకు ప్రాంతీయ ప్రముఖుడు అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకర్లకు జెడ్పీ సీఈఓ సూచన -
రైల్వే డిమాండ్లు పరిష్కరించండి
హొసపేటె: హొసపేటె–కొట్టూరు–దావణగెరె మీదుగా మంగళూరుకు నేరుగా రైలు ప్రారంభిస్తే, ప్రపంచ వారసత్వ ప్రదేశాల మధ్య కనెక్టివిటీని అందిస్తుందని రైల్వే అభివృద్ధి సంఘం నేత యమునేష్ తెలిపారు. సోమవారం నగరంలో ఎంపీ ఈ.తుకారాంకు వినతి పత్రాన్ని అందజేశారు. హొసపేటె– షోలాపూర్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైలును పండర్పూర్ వరకు పొడిగించాలన్నారు. తద్వారా పాండురంగ విఠల భక్తులకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. హొసపేటె రైల్వే స్టేషన్ ఆధునీకరణ, పిట్ లైన్ నిర్మాణం, 2 కొత్త ఫ్లాట్ఫాంల నిర్మాణం చేపట్టి దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు అనుకూలంగా స్టేషన్ను అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా విజయనగర రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో బళ్లారి లోక్సభ సభ్యుడు ఈ.తుకారాంను కలిసి బెళగావి– హొసపేటె–రాయచూరు –హైదరాబాద్– మణుగూరు రైలు పునః ప్రారంభం గురించితో పాటు రైల్వే డిమాండ్లపై పిటిషన్ సమర్పించారు. విజయనగర రైలు వినియోగదారుల సంఘం అధ్యక్షుడు వై.యమునేష్, కార్యదర్శి మహేష్ కుడితిని, నాయకులు దీపక్ ఉల్లి, జీర కల్లేశ్, ప్రభాకర్, ఎం.శంకరప్ప, కేవీ.రమాలి, ఆర్.రమేష్గౌడ, నజీర్సాబ్, శ్రవణ్కుమార్ జే.వరుణ్, మనోహర్, కృష్ణమూర్తిరావు, నాగరాజరావు, అరుణ్కుమార్, శ్రీనివాస్ రావు, అమర్ నాథ్ కటరే, హరిశంకర్ రావు తదితరులున్నారు. -
చెరువు సంరక్షణకు చర్యలు
రాయచూరురూరల్: పురాతన కాలం నాటి చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్ తెలిపారు. నగరంలోని నీరుబావి కుంట చెరువు సంరక్షణ పనులకు ఆయన ఆదివారం భూమిపూజ చేసి మాట్లాడారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పైపులైన్లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల చెరువులకు నీరందించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాపారెడ్డి, ఎంపీ కుమారనాయక్, శాంతప్ప, తాయన్న నాయక్, జయన్న, శాలం, తదితరులు పాల్గొన్నారు. శివానుభవ గోష్ఠిరాయచూరు రూరల్: శరణుల పరంపర, సంస్కతి మానవ మనుగడకు అవసరమని లింగ సూగురు ఆశ్రమవాసులు వరదానేశ్వర స్వామిజీ పిలుపునిచ్చారు. స్థానిక మారుతీనగర్లోని గిరి అభయాంజనేయ స్వామి అలయంలో ఆదివారం శరణుల చింతన శివానుభవ గోష్టిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 12వ శతాబ్దంలో ఆశ్రమ వాసులు వేసిన బాటలో పయనిస్తే ఎవరికీ ఎలాంటి ఆపదలు రావన్నారు. నేడు కులం, మతం పేరుతో మానవుడి జీవితం దుర్భరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరి, బసవరాజ్, లక్ష్మణ్, అయ్యన్న, శ్రీనివాస్, అశోక్, మహదేవప్ప, భీమన్న, చంద్ర శేఖర్, గిరియప్ప, అరుణ, కురుబర్, తదితరులు పాల్గొన్నారు. అప్పుల బాధతో రైతు అత్మహత్యరాయచూరు రూరల్: వ్యవసాయ కోసం తెచ్చిన అప్పుల తీరకపోవడంతో ఓ రైతు అత్మహత్య చేసుకున్న సంఘటన యాదగిరి జిల్లాలో జరిగింది. వివరాలు ఇవీ.. యాదగిరి జిల్లా వడగేర తాలుకహల గేరలో ఎల్లప్ప(55) తన మూడు ఎకరాల భూమిలో పంటలు సాగు చేశారు. అతివృష్టితో పంట దిగుబడులు రాక నష్టపోయారు. అయితే సాగుకోసం తెచ్చిన రూ.5 లక్షల అప్పులు తీర్చలేక మానసికంగా కుంగిపోయాడు. శనివారం సాయంత్రం పొలంలోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వడగేర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాసులకు నిలయం.. రాయచూరు క్షేత్రం రాయచూరు రూరల్: దాసులు పుట్టిన నిలయం రాయచూరు క్షేత్రం అని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్ వెల్లడించారు. నగరంలోని జోడు వీరాంజనేయస్వామి ఆలయంలో బన్నెంజె గోవిందాచార్యుల 90వ నమన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బన్నెంజె గోవిందాచార్యులు విద్యా వాచస్పతి అని, సంస్క్రతం, కన్నడ సాహిత్యానికి దిగ్గజుడు అని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో ఎంపీ కుమారనాయక్, రోహిత్చక్రవర్తి, విజయ సింహాచారి, రమేష్, వీణ, వెంకటేష్, త్రివిక్రంజోషి, నరసింగరావు, కవిత, దానప్ప, వీరహనుమాన్ విష్ణుతీర్థ, అరవింద్, తదితరులు పాల్గొన్నారు. సంస్కృతికి ప్రతీక పొరుగు సంబరంరాయచూరురూరల్: సంస్కృతిక ప్రతీకగా నిలిచిన పొరుగు సంబరాలను యాదగిరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే తమ ఎద్దుల బళ్లను చెరకు గడలు, పూలతో అలంకరించారు. వాటిపై ఊరేగింపుగా పొలానికి చేరుకుని భూ మాతకు పూజలు చేశారు. యడ్రామి, రామసముద్రం, అబ్బెతుంకురులో పొలాల్లోనే రైతు కుటుంబీకులు సామూహిక భోజనాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజనుల సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది. నియామకంకోలారు: కర్ణాటక జ్ఞాన విజ్ఞాన సమితి కోలారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా వై.మంజుళ నియమితులయ్యారు. సమితి జిల్లా అధ్యక్షుడు జి శ్రీనివాస్ మాట్లాడుతూ సమితి కార్యక్రమాలకు ఆమె నాయకత్వం అందించాలన్నారు. జగన్నాథ్, పద్మావతి పాల్గొన్నారు. -
విద్యారత్న, సేవా భూషణ అవార్డుల ప్రదానం
కోలారు : నగరంలోని సువర్ణ కన్నడ భవనంలో ఆదివారం పాఠశాల విద్యాశాఖ, ఉద్యోగుల సంఘం ప్రథమ జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఆరు తాలూకాల్లోని 24 మంది ఉపాధ్యాయులకు విద్యారత్న, ఆరు మంది బోధనేతర సిబ్బందికి సేవాభూషణ అవార్డులను అందించారు. కార్యక్రమాన్ని ముళబాగిలు బీఈఓ రామచంద్ర ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు వృత్తి పావిత్య్రతను కాపాడాలన్నారు. సంఘం పదాధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండి పరిషత్ సభ్యుల ద్వారా సమాలోచన చేసి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోలారు జిల్లా నౌకర్ల సంఘం అధ్యక్షుడు అజయకుమార్, గౌరవాధ్యక్షుడు మంజునాథ్, జిల్లా ఉన్నత పాఠశాల సహ శిక్షకుల సంఘం అధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. -
సమాజానికి వెలుగుగా జీవించాలి
మండ్య: మనిషి ఇష్టానుసారం కాదు, ప్రకృతి సంకల్పం ప్రకారం జీవించాలి. ప్రకృతి ముందు మనుషుల ఆట సాధ్యం కాదని కొప్పళ గవిసిద్దేశ్వర సంస్థాన మఠాధిపతి అభినవ గవిసిద్ధేశ్వర మహాస్వామి అన్నారు. జిల్లాలోని మళవళ్లి పట్టణంలో జరుగుతున్న శివరాత్రీశ్వర శివయోగుల 1,066వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శతాబ్దాల క్రితం శివయోగి స్వామి అందరి సంక్షేమాన్ని కాపాడుతూ అందరికీ దారి చూపించాడని, సమాజానికి వెలుగుగా జీవించాడని అన్నారు. ఒక వ్యక్తి తనకోసం కాకుండా ఇతరుల కోసం జీవించినప్పుడు, అతను ప్రపంచ ప్రసిద్ధి చెందుతాడు. దీపం వెలుగుతూ ఇతరులకు వెలుగునిచ్చినట్లే, మనం కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలని తెలిపారు. డబ్బు, పదవులు శాశ్వతం కాదు మానవులు జీవితాంతం డబ్బు, పదవులు, ఆస్తి, కీర్తి వెంట పరిగెడుతున్నారు, ఇవన్నీ శాశ్వతం కాదనే చిన్న వాస్తవాన్ని గ్రహించకపోవడం విచారకరమని స్వామీజీ అన్నారు. చక్రవర్తి బౌద్ధ భిక్షువు అయ్యాడు, భిక్షువు చక్రవర్తి అయ్యాడని అన్నారు. నేటి తల్లిదండ్రులు పిల్లలకు నైతికత, సంస్కృతిని నేర్పించడానికి బదులు, మంచి స్థానం, సక్సెస్ అంటూ పరుగులు తీయిస్తున్నారు, కానీ ఇవన్నీ తాత్కాలికమేనని వారు మర్చిపోయారని వాపోయారు. హృదయంలో ఆనందం ఉన్నవాడే విజయం సాధిస్తాడని తెలిపారు. మనిషి ఒక సమాజంగా జీవించాలని, అంకితభావంతో బతకాలని, ఘర్షణ పడకూడదని, దేవుని చిత్తం ప్రకారం జీవించాలని ఆయన ఉద్బోధించారు. కోరుకోవడం తప్పు కాదు, కానీ ప్రతిదీ తన సంకల్పం ప్రకారం జరగాలని వాంఛించడం తప్పు అన్నారు. దేవుని సంకల్పం ముందు మన కోరికలన్నీ శూన్యమని ఆయన అన్నారు. మన జీవితాల్లో చెడు ఆలోచనల కలుపు మొక్కలను తొలగించి, మంచి వ్యక్తిత్వం యొక్క పంటను పెంచుకోవాలని తెలిపారు. గతంలో చాలా మంది సాధువులు ఈ మాదిరిగా జీవించి చూపించడం ద్వారా మనకు ఆదర్శంగా నిలిచారని, శివరాత్రి శివయోగి అటువంటి మహానుభావులని పేర్కొన్నారు. అన్నీ నాకే కావాలని పాకులాడొద్దు కొప్పళ గవిసిద్ధేశ్వర స్వామి సుత్తూరు వేడుకలో ప్రసంగంమతం, భక్తితో విజయం సుత్తూరు సంస్థానం మానవ విలువలకు పుట్టినిల్లు అని విశ్వ ఒక్కలిగర మహాసంస్థాన్ మఠం జగద్గురు నిశ్చలానందనాథ మహాస్వామి అన్నారు. ఆయన మాట్లాడుతూ భారత సంస్కృతికి పురాతనమైన చరిత్ర ఉందని అన్నారు. మతం యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకుని భక్తితో ఆచరిస్తేనే విజయం సాధ్యమని ఆయన అన్నారు. ప్రజలు అజ్ఞానం నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు. కుటుంబంలో సామరస్యం ఏర్పడాలంటే, వారి జీవితాల్లో మతపరమైన, సంప్రదాయ ఆలోచనలను పాటించాలని సూచించారు. మతం, మానవతా విలువలను ప్రజలకు తెలియజేయడంలో సుత్తూరు మఠం గొప్ప కృషి చేస్తోందన్నారు. -
మళ్లీ జగనన్న పాలనకు కృషి
బనశంకరి: హెచ్ఎస్ఆర్ లేఔట్లోని సమర్థనం దివ్యాంగుల ట్రస్ట్లో డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తరువాత మధ్యాహ్నం 1 గంటకు కేక్ కటింగ్ నిర్వహించి బాలలకు పంచిపెట్టి అన్నదానం చేపట్టారు. ఫౌండేషన్ సంస్థాపక అధ్యక్షుడు బీ.రమణారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అన్నిరంగాల అభివృద్ధితో పాటు ప్రజాసంక్షేమానికి కృషిచేశారని తెలిపారు. మళ్లీ 2029లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త సైనికునిగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో కూటమి పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాబు రాజేంద్రకుమార్, కాసినాయన ఎంపీటీసీ భాస్కర్రెడ్డి, కల్లూరు హుసేనయ్య, ముత్యాల నారాయణరెడ్డి, కేఎల్.వెంకటరెడ్డి, వెంకటరామిరెడ్డి, కల్లూరి ఉస్మాన్, నయాబ్, నారాయణరెడ్డి, వీరనారాయణరెడ్డి, పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. -
జగనన్న కోసం సమైక్యంగా కదలాలి: ఐటీ వింగ్
బనశంకరి: 2029లో మళ్లీ వైఎస్.జగన్మోహన్రెడ్డి ని ముఖ్యమంత్రిగా చేయడానికి బెంగళూరులో నివసించే ప్రవాసాంధ్రులు కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు కుమార్ పులివెందుల పిలుపునిచ్చారు. కృష్ణరాజపురం బెళతూరు శబరి ఆశ్రయధామలో ఐటీ వింగ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అన్నదానం నిర్వహించారు. కుమార్ పులివెందుల మాట్లాడుతూ.. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్గా చేసుకుని, అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం విద్య, వైద్య, సంక్షేమ రంగాలను పూర్తిగా విస్మరిస్తూ ఆటవిక పాలన సాగిస్తోందని విమర్శించారు. గత జగనన్న ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఐటీ వింగ్ సభ్యుడు, పార్టీ కార్యకర్తపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీవింగ్ సభ్యులు రాజశేఖర్రెడ్డి, చంద్ర, అనిల్, పూల ప్రవీణ్, పూల సురేంద్ర, నరసింహారెడ్డి, రామ్, రుద్ర, అమర్, హరి, ఓబుళరెడ్డి, పర్వత శివశంకర్రెడ్డి, మురళీకృష్ణ, నారాయణరెడ్డి, సుబ్రమణ్యం, సంతోష్, శివకుమార్గౌడ్, నయాబ్ రసూల్, మహ్మద్ రఫీ, అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
చిన్నారులకు పోలియో చుక్కలు
సాక్షి బళ్లారి: 0–5 ఏళ్ల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ప్రముఖులు పేర్కొన్నారు. నగర మేయర్ గాదెప్ప, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు, డీఎంహెచ్ఓ రమేష్బాబు, తదితరులు ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు మాట్లాడుతూ జిల్లాలో 920 బూత్లలో 49 బృందాలు, రెండు వేల మంది సిబ్బంది. 1000 మంది ఇతర సభ్యులు చురుకుగా పాల్గొని పోలియో చుక్కలు వేశారన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాల్లోనూ కార్యక్రమం కొనసాగిందని తెలిపారు. బళ్లారిటౌన్: పిల్లల అంగ వైకల్యాన్ని నియంత్రించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్.బాబుజగ్జీవన్ రామ్ చర్మ పారిశ్రామిక నిగమ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజ్ పేర్కొన్నారు. బళ్లారి జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఆదివారం జిల్లా స్థాయి పల్స్ పోలియో చుక్కల వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా గత పదేళ్లుగా పల్స్ పోలియో చురుగా సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ పి.గాదెప్ప, గ్యారెంటీ పథకాల ప్రాధికార అధ్యక్షుడు చిదానందప్ప, జెడ్పీ సీఎస్ మహమ్మద్ హ్యరీస్, అధికారులు రమేష్బాబు, ఏడీసీ మహమ్మద్ ఝుబేర, బసిరెడ్డి, హనుమంతప్ప, ఖుర్కిద్ బేగం తదితరులు పాల్గొన్నార బళ్లారి అర్బన్: జిల్లాలో పల్స్ పోలియో విజయవంతమైంది. జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆవరణలో నమ్మ క్లినిక్ తరఫున ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు అవార్ మంజునాథ్, గౌరవ కార్యదర్శి సురేష్బాబు ప్రారంభించారు. సదరు ఆస్పత్రి ఛైర్మన్ సురేంద్రకుమార్, వైద్యాధికారులు డాక్టర్.అభిషేక్ పాల్గొన్నారు. రాయచూరురూరల్: రాయచూరు జిల్లాలో నాలుగు రోజులపాటు పల్స్ పోలియో చుక్కలు వేయాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్ కోరారు. స్థానిక నిజలింగప్ప కాలనీలోని కేఈబీ పాఠశాలలో ఆదివారం ఓ చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 1132 కేంద్రాలల్లో 2,59,984 మంది పిల్లలకు చుక్కలమందు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి నితీష్, సురేంద్రబాబు, నందిత, విజయ్శంకర్, ప్రవీణ్కుమార్, హారతి, శివమానప్ప, అనిల్, గణేశ్, శివ కుమార్, షాకీర్, ఈశ్వర్, బసయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పోలియో నిర్మూలనకు కట్టుబడి ఉందాం
● ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హొసపేటె: మానవాళికి శాపంగా మారిన పోలియో వైరస్ నిర్మూలనకు అధికారులంతా కట్టుబడి ఉండాలని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. కమలాపూర్ సమీపంలోని హంపీ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంగణంలో చింతపండు, సీతాఫలం, లక్షణ పండ్లతో సహా వివిధ జాతుల మొక్కలను నాటి నీరు పోశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పిల్లలకు టీకాలు వేశారు. మంత్రి మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రాధాన్యం, వైభవం.. సంపన్న భారతదేశాన్ని నిర్మించాలనే సందేశం తీసుకువెళ్తాయన్నారు. విజయనగరాన్ని స్ఫూర్తిగా తీసుకొని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతామన్నారు. అనంతరం హవామా కార్యాలయ ప్రాంగణంలో ఆమె చింత చెట్టు నాటి నీరు పోశారు. ఎంపీ ఇ.తుకారాం, ఎమ్మెల్యేలు హెచ్ఆర్.గవియప్ప, డాక్టర్.ఎన్టి.శ్రీనివాస్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ వ్యవహరాలు, రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా, నాగరాజు మద్దిరాల, రవిఅగర్వాల్, అనురాధ ఠాకూర్, అనిరుద్ధ శ్రవణ్. కే.మోసెస్చలై, దీప్తిగౌర్ ముఖర్జీ, కలెక్టర్ కవితా ఎస్.మన్నికేరి, తదితరులు పాల్గొన్నారు. హంపీలో నిర్మలా సీతారామన్ హొసపేటె: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రాత్రి హంపీలోని ఎలిఫెంట్ హౌస్ వద్ద ఏర్పాటుచేసిన లేజర్ షో(ధ్వని, కాంతి)ను వీక్షించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో హంపీకి చేరుకున్న ఆమె గత వైభవాన్ని గుర్తుచేసేలా నిర్వహించిన లేజర్షోను ఆసక్తిగా తిలకించారు. విజయనగర సామ్రాజ్యం వైభవం, శ్రీకృష్ణ దేవరాయ పాలనను ప్రతిబింబించేలా దేశ సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శించి అందరినీ అలరింపజేశారు. శనివారం రాత్రి హంపీ అనిలే సమీపంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు
సాక్షి,బళ్లారి: జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని, ఇపుడు అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందని వైఎస్ రాజశేఖరరెడ్డి చిన్ననాటి స్నేహితుడు బాలస్వామి, నరాలరోషిరెడ్డి అన్నారు. జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా నగరంలోని గాంధీ నగర్లో శ్రీశివశక్తి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో సూర్య నివాస్ వృద్ధాశ్రమంలో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వృద్ధుల సమక్షంలో కేక్ కోసి మిఠాయిలు, బ్రెడ్లు పంచి పెట్టారు. వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్పనాయకుడు జగన్మోహన్రెడ్డి అన్నారు. మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని జనం వేచిచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
పథకం పేరును మార్చడం తగదు
రాయచూరురూరల్: బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం తగదని సీసీఐఎం(ఎల్) కార్యదర్శి నాగరాజు అన్నారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద కార్మికులతో కలిసి ఆదివారం ఆందోళన చేపట్టారు. నాగరాజు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకం పేరును మార్చి కేంద్ర సర్కారు పేదల కడుపు కొడుతోందన్నారు. బీజేపీ, అర్ఎస్ఎస్ పేర్లను నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. గతంలో ఉన్న పేరును కొనసాగించాలని, పాత విధానం ప్రకారం కేంద్రం 90 శాతం, రాష్ట్ర సర్కారు 10 శాతం నిధులు సమకూర్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో అజిజ్జాగిర్దార్, కలమంగి, పంపాపతి, హన్మంతరాయ్, జగదీష్, మహేష్, జిలాని, హనీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈడీ పేరుతో అవమానించారురాయచూరురూరల్: నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో కేసు నమోదు చేయకుండా, ఈడీ పేరుతో కాంగ్రెస్ నేతలను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు విఎస్.ఉగ్రప్ప అరోపించారు. కోప్పళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాహుల్గాంధీ, సోనియాగాంధీలను బలవంతంగా విచారించడం సరికాదన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కలిసి నడిపిన పత్రికపై అనవసర రాద్ధాంతం చేశారని, న్యాయస్థానంలో కేసు కొట్టి పారేశారని తెలిపారు. గురుధన పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న సంఘటనలు వదలి, కాంగ్రెస్ నేతలపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో క్రిష్ణ, జ్యోతి గోండబాల, శైలజ, మంజునాథ పాల్గొన్నారు. మధుమేహ వ్యాధిపై అవగాహనరాయచూరు రూరల్: మధుమేహ వ్యాధిపై అవగాహన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని నవోదయ వైద్యకీయ కళాశాల ట్రస్టీ రాజేంద్రరెడ్డి అన్నారు. కర్నాటక చాప్టర్ రీసర్స్ సొసైటీ ఆఫ్ డయాబెటీస్, నవోదయ వైద్యకీయ, రిమ్స్ సంయుక్తంగా రాయచూరులోని నవోదయ వైద్యకీయ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాలను దత్తత తీసుకుని వ్యాధి నియంత్రణకు కృషిచేయాలని, సెమినార్లు, వైద్య శిబిరాలను నాలుగు గోడలకు పరిమితం చేయకుండా రోగులకు అవగాహన కల్పించేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బసవరాజ్ పాటిల్, హరిప్రసాద్, రామక్రిష్ణ, మహలింగ, సురేష్ సగరద, ఎస్ఎస్.రెడ్డి, శ్రీనివాస్, కార్తిక్, విజయ్కుమార్, శ్రీధర్, కల్లప్ప, తదితరులు పాల్గొన్నారు. హోటళ్లపై దాడులురాయచూరు రూరల్: నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లపై జిల్లా అధికారి నితీష్, నగరసభ కమిషనర్ జుబీన్ మోహపాత్రో, ఆహార పౌర సరఫారాల శాఖ అధికారి క్రిష్ణ శనివారం సాయంత్రం విస్తృతంగా దాడులు నిర్వహించారు. అక్కడ వండిన ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని హోటల్, రెస్టారెంట్ల యజమానులకు జరిమానా విధించారు. సీతరాం తండాలో ఎన్నికలు ప్రశాంతం హొసపేటె: హొసపేటె తాలూకాలోని సీతారాంతాండ పంచాయతీలోని ఎనిమిది వార్డు స్థానాలకు ఆదివారం నిర్వహించిన ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవగా ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు వేశారు. సీతారాం తాండాలో 4, నల్లపూర్లో 3, చిన్నాపూర్ గ్రామంలో ఒక స్థానానికి జరిగే ఈ ఎన్నికల్లో 20 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. విజయనగరం ఎస్పీ ఎస్.జాహ్నవి, డీసీ కవితా ఎస్మన్నికేరి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మంజునాథ్, డీవైఎస్పీ డాక్టర్ మంజునాథ్ తల్వార్, హంపీ సీఐ రాజేష్ భట్గుర్కి, కమలాపూర్ పీఎస్ఐ సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
24న కిష్కింధ విశ్వవిద్యాలయం ఘటికోత్సవం
సాక్షి బళ్లారి: సిరుగుప్ప తాలూకా సింధిగేరి సమీపంలోని కిష్కింధ విశ్వవిద్యాలయ క్యాంపస్లో డిసెంబరు 24న ప్రథమ ఘటికోత్సవం నిర్వహిస్తున్నట్లు వీసీ టీఎన్.నాగభూషణ్ పేర్కొన్నారు. ప్రముఖులు ఫృథ్వీరాజ్, యశ్వంత్భూపాల్, మహిపాల్తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి గవర్నర్ థావర్చాంద్ గెహ్లాట్ విచ్చేస్తున్నాని పేర్కొన్నారు. 80 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం ఉంటుందని వివరించారు. ఎంబీఏలో షబానాకు 9.33, సౌగంధిక లక్ష్మీ 9.27 సీజీపీతో ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచారని, వారికి బంగారు, వెండి పథకాలను గవర్నర్ అందజేస్తారన్నారు. బీఐటీఎం డైరెక్టర్ ఫృథ్వీరాజ్ మాట్లాడుతూ పేదలకు ఉన్నత చదువులు అందాలనే దూర దృష్టితో కిష్కింధ విశ్వ విద్యాలయం నెలకొల్పామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖులు అమరేశయ్య, భరత్, ఈరణ్ణ, తదితరులు పాల్గొన్నారు. -
కన్నడలోనే రైల్వే పోటీ పరీక్షలు
● కేంద్ర మంత్రి సోమణ్ణ కోలారు: నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి దరఖాస్తు చేసుకోలేదు. ఆ పదవి గురించి హైకమాండ్ చూసుకుంటుందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ అన్నారు. ఆదివారం కోలారులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికలలో సిద్దరామయ్యపై పోటీ చేయాలని హైకమాండ్ ఆదేశిస్తే, పాటించాను. తరువాత లోక్సభ ఎన్నికలలో తుమకూరు నుంచి పోటీ చేయాలని చెబితే పోటీ చేసి గెలిచాను అని చెప్పారు. రైల్వే ఉద్యోగ పరీక్షలను కన్నడంలోనే రాయడానికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపారన్నారు. దీనివల్ల కన్నడిగులకు ఉపయోగం కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విద్వేష ప్రసంగాల నిరోధక చట్టం గురించి స్పందిస్తూ సంస్కారం, సంస్కృతి తెలియని వారే ఇదంతా చేస్తారన్నారు. 12 లక్షల రైల్వే ఉద్యోగులు ఉన్నారు. ఇంతవరకు చిన్న ధర్నా కూడా చేయలేదు. రైల్వే ఉద్యోగులకు అన్ని సౌలభ్యాలు అందిస్తున్నామన్నారు. సీఎం సిద్దరామయ్య కుర్చీని కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. ప్రచారానికి చేసిన ఖర్చును అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించి ఉంటే ఎంతో ప్రగతి సాధ్యమయ్యేదన్నారు. రాష్ట్ర బీజేపీ లో ఎలాంటి అసమ్మతి లేదన్నారు. త్వరలో గృహలక్ష్మి సొమ్ము జమ: మంత్రి శివాజీనగర: రాష్ట్రంలో గృహలక్ష్మీ లబ్ధిదారులు వేచి చూస్తున్న పథకం సొమ్ము విడుదల గురించి మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ తీయని కబురు అందించారు. 3 నెలలుగా సొమ్ము పడలేదని ప్రతిపక్షాలు ఆరోపించడం తెలిసిందే. ఆదివారం బెళగావిలో మాట్లాడిన ఆమె సోమవారం నుంచి శనివారం లోగా 24వ కంతు సొమ్ము మహిళల ఖాతాల్లోకి జమ అవుతుందని చెప్పారు. ఆర్థికశాఖ నుంచి శనివారంలోగా సొమ్ము విడుదల కానుందని భరోసానిచ్చారు. మరణించిన మహిళల ఖాతాలకూ సొమ్ము పడుతోందని విలేకరులు ప్రస్తావించగా, ఈ విషయమై సీఎస్ నేతృత్వంలో 2 సార్లు సమావేశం జరిపారు. సాఫ్ట్వేర్ను మెరుగుపరిచాం. మరణ ధృవీకరణ పత్రాలను అంగనవాడి కార్యకర్తలు పరిశీలిస్తారు. డబ్బులను ఖాతాల నుంచి వెనక్కి తీసుకునే బాధ్యతను బ్యాంకులకు ఇచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్ మిత్రుని వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం యశవంతపుర: ఆర్థిక సాయం చేసినందుకు ప్రతిఫలంగా కోరిక తీర్చాలని వేధించడంతో మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన బెంగళూరు రాజగోపాలనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఇటీవల ఆమె ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి కూతురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరింది. మహిళ ఆన్లైన్ స్నేహితుడైన పారితోష్ యాదవ్ అనే వ్యక్తిని ఆర్థిక సాయం అడిగింది. అతడు కొంచెం డబ్బులు ఇచ్చాడు. కొన్నిరోజులుగా అతడు బాకీ తీర్చవద్దు, పడకగదికి వస్తే చాలని ఒత్తిడి చేయసాగాడు. ఇలాంటి పనులు చేయనని ఆమె చెప్పేసింది. ఈ గొడవ భర్తకు తెలియటంతో సంసారంలో చిచ్చు రేగింది. అంతటితో వదలకుండా ఆమె మొబైల్ఫోన్కు అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపడం ప్రారంభించారు. దీంతో మహిళ దిక్కుతోచక ఆత్మహత్యకు యత్నించగా, ప్రాణాలతో బయటపడింది. పోలీసులు ఆమెను విచారించగా యాదవ్ నిర్వాకాన్ని వివరించింది. అతనిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. రెండు చుక్కలు.. ఆరోగ్యానికి అస్త్రాలు● చురుగ్గా పోలియో మందు పంపిణీ శివాజీనగర: రాష్ట్రమంతటా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే పల్స్ పోలియో చుక్కల పంపిణీ ఆరంభమైంది. బెంగళూరులో సీఎం సిద్దరామయ్య నివాస కార్యాలయం కృష్ణాలో శిశువులకు చుక్కలు వేశారు. 5 సంవత్సరాలోపు ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా సమీపంలో పల్స్ పోలియో కేంద్రంలో చుక్కలు మందును వేయించాలని సీఎం సూచించారు. ఈ చుక్కలే భవిష్యత్ అంగవైకల్యాన్ని అడ్డుకుంటాయన్నారు. రాష్ట్రంలో 62.40 లక్షల మంది పిల్లలకు చుక్కలు వేస్తారు. అన్ని ఆసుపత్రులు, అంగనవాడీలు, ఆరోగ్య కేంద్రాలు, అలాగే ఆరోగ్య కార్యకర్తలు కర్మాగారాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు వెళ్లి చుక్కలను పంపిణీ చేస్తారు. సోమవారం నుంచి ఆరోగ్య కార్యకర్తలు సంచరిస్తూ మందును ఇస్తారు. రాష్ట్రమంతటా 33,258 బూత్లు, 1,030 సంచార బృందాలు, 1096 ట్రాన్సిట్ బృందాలు, 1,13,115 మంది పల్స్ పోలియో కార్యకర్తలు, 7,322 సూపర్వైజర్లను ఈ కార్యక్రమానికి నియమించారు. -
భర్త ఎమ్మెల్యే.. భార్య అంగన్వాడీ
సాక్షి, బళ్లారి: ప్రజా ప్రతినిధిగా గెలుపొందితే చాలామంది తమకెవరూ సాటి లేరని గర్వపడతారు. అందులోనూ ఎమ్మెల్యే భర్త దొరికితే భార్యల కనుసన్నల్లోనే పాలన సాగుతుందనేది అందరికీ తెలిసిందే. కానీ ఇందుకు భిన్నంగా భర్త ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన భార్య మాత్రం అంగన్వాడీ టీచర్గా ప్రస్థానం కొనసాగిస్తోంది. తన వృత్తికి స్వస్తి చెప్పకుండా.. చిన్న పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ సాధారణ జీవితం గడుపుతోంది. బెళగావి జిల్లా ఖాణాపుర ఎమ్మెల్యే విఠలహలగేకర్ టీచర్గా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. అనంతరం గత శాసనసభ ఎన్నికల్లో ఖాణాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇతడి భార్య రుక్మిణమ్మ అప్పటికే అంగన్వాడీ టీచర్గా పనిచేసేది. భర్త ఎమ్మెల్యేగా గెలుపొందినా ఆమె తన వృత్తికి స్వస్తి చెప్పలేదు. సాధారణ జీవితం గడుపుతూ బెళగావి 149 సెంటర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. 2011 నుంచి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఆమె పలువురికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తన భర్త ప్రజా ప్రతినిధిగా సేవలందిస్తే.. తాను టీచర్గా పాఠాలు నేర్పుతున్నానని చెబుతున్నారు. చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడంలోనే సంతృప్తి అంటున్న ఎమ్మెల్యే భార్య -
ఘర్షణ వద్దన్న వ్యక్తి హత్య
హొసపేటె: నగర శివారులోని కారిగనూర్లో చిన్న విషయంపై జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. రూరల్ పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలివీ.. కరిగనూర్ నివాసి మాబుసాబ్(50) కుమారుడు మౌలా హుసేన్తో కొందరు యువకులు ఘర్షణ పడ్డారు. ఈ సమయంలో తన కుమారుడితో ఘర్షణ పడవద్దంటూ తండ్రి మాబూసాబ్ ఆ యువకులను అడ్డుకునేందుకు యత్నించారు. కోపోద్రిక్తులైన యువకులు మాబూసాబ్పై దాడిచేసి హత్య చేశారు. కుటుంబ సభ్యులు నగర ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని రోధించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు భంగి హనుమంత, చరణ, హులిగెమ్మతోసహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాఘవేంద్ర, దర్శన్, చంద్రశేఖర్, గురురాయ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐజీపీ వర్తికాకటియార్, ఎస్పీ ఎస్.జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్, డీవైఎస్పీ డాక్టర్. మంజునాథ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. -
ఆరోగ్య సేతు ప్రారంభించిన సీఎం
దొడ్డబళ్లాపురం: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం బెళగావిలోని సువర్ణసౌధ ముందు ఆరోగ్య సేతు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మీ ఆరోగ్యం–మా బాధ్యత అనే నినాదంతో సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందాలనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మొబైల్ హెల్త్ సెంటర్లు మారుమూల గ్రామానికి కూడా వెళ్లి సేవలు అందిస్తాయి. ప్రతి జిల్లాకు జనాభా, విస్తీర్ణం తదితర అంశాల ఆధారంగా ఈ వాహనాలను 1, 2, 3, 4 అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 81 వాహనాలను పంపించారు. వీటి నిర్వహణకు ఏడాదికి సుమారు రూ.1686 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. -
రైతుకు నష్టం.. దళారులకు లాభం
సాక్షి, బళ్లారి: నెల రోజులు కిందట ఉల్లి ధర అమాంతం పడిపోయింది. దళారుల మాయతో .. తాజాగా రోజు రోజుకూ పెరుగుతోంది. రైతులు విక్రయించినపుడు కిలో ఉల్లి రూ.5కు కొనుగోలు చేసిన దళారులు గోదాముల్లో నిల్వ ఉంచారు. ఇపుడు కిలో రూ.25కు పైగా విక్రయిస్తున్నారు. పంట పండించిన రైతన్న పెట్టుబడులు దక్కక నష్టపోగా.. వ్యాపారులు మాత్రం లాభం మూటగట్టుకుంటున్నారు. రైతులకు భారీ నష్టం ఉమ్మడి బళ్లారి జిల్లాతోపాటు, చిత్రదుర్గం, బాగల్కోట, బీజాపూర్, బీదర్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేశారు. ఎకరాల పొలంలో ఉల్లి పంట సాగుకు రూ.80 వేల వరకు ఖర్చు చేసిన రైతులు గిట్టుబాటు ధరలేక అప్పులు కట్టుకోలేని దుస్థితి. 50 కిలోల ఉల్లిగడ్డ సంచిని రూ.200కే విక్రయించుకున్నారు. క్వింటాకు రూ.50 వేలు కూడా రాలేదని గతంలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల కిందట ఉల్లి గడ్డలను రోడ్డుపై పారవేసి, శవయాత్రలు చేసి ఆందోళన చేస్తే ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేకపోయింది. పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర పెరగడంతో తమకూ నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారుల చేతివాటం ఉల్లి గడ్డ నిల్వలు రైతుల వద్ద తగ్గిపోవడంతో దళారులు, వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అన్నం పెట్టే రైతన్న వద్ద దిగుబడులను కిలో రూ.5కే కొన్న వ్యాపారులు నిల్వలను గోదాములకు చేర్చారు. ఇపుడు రేట్లు పెంచే దానిపై దృష్టిసారించారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో నిల్వ ఉంచిన ఉల్లి గడ్డలు మార్కెట్కు చేరుతున్నాయి. నగరంలోని ఏపీఎంసీలోని చిరువ్యాపారులు మాత్రం తమ చేతుల్లో ఏమీలేదని, మార్కెట్కు వచ్చే దానిని బట్టి ధర నిర్ణయిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 50 కిలోల ఉల్లి గడ్డల సంచి ధర రూ.2000 పలుకుతోంది. లోకల్ ఉల్లి గడ్డల 50 కిలోల సంచి ధర రూ.1500గా ఉంది. రైతుల వద్ద ఖాళీ అయిన తర్వాత, వ్యాపారులు నిల్వలు బయటికి తీసి ధర పెంచి నాలుగింతలు లాభాలు ఆర్జిస్తున్నారు. వచ్చే ఏడాదైనా పాలకులు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెల కిందట కిలో ఉల్లి ధర రూ.5 కొనుగోలు చేసి నిల్వ ఉంచిన వ్యాపారులు కొరత చూపుతూ ఉల్లి ధరల పెంపు నష్ట పరిహారం అందించాలని రైతుల డిమాండ్ -
జింకలతో పంటలకు నష్టం
రాయచూరు రూరల్: రైతులు సాగు చేసిన పంటలపై జింకలు తొక్కి.. పరుగుతీయడంతో నష్టపోతున్నారు. కళ్యాణ కర్నాటక పరిధిలోని రాయచూరు, యాదగిరి, కోప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాల్లోని లక్షలాది ఎకరాల్లో రైతులు జొన్న, వేరుశనగ, పత్తి, మిరప, ఇతర పంటలు సాగు చేశారు. ఇటీవల పొలంలోకి చొరబడుతున్న జింకలు పంట తొక్కుతూ చిందరవందర చేసి నాశనం చేస్తున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నికల సమయంలో జింకల వనం ప్రాధాన్యం గుర్తించే నాయకులు అనంతరం వదిలేస్తున్నారు. తమ బాధను పట్టించు కోవడంలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల జింకలు జిల్లాలో 20,572 క్రిష్ణ జింకలు, జింకార 16,420, లాంగ్ చాపర్ 10,856, చుక్కలున్న జింకలు 370 ఉన్నాయి. 2006 నుంచి ఈ జింకల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు రైతు సంఘం నేతలు అనందప్ప, రుద్రప్ప వెల్లడించారు. 2010లో పరిహారం అందించడంతో పాటు జింకల వనం నిర్మాణానికి రూ.50 లక్షల మంజూరుకు అనుమతి లభించినా అమలుకు నోచుకోలేదు. 2016లో విధాన సభలో చర్చలు జరిగినా ప్రాధాన్యం ఇవ్వలేదు. వెంటనే జింకల వనం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
21 నుంచి పల్స్ పోలియో
హొసపేటె: డిసెంబర్ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కవితా ఎస్ మన్నికేరి తెలిపారు. సంబంధిత కార్యక్రమ పోస్టర్లను శుక్రవారం సాయంత్రం ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 0–5 పిల్లలు 1,21,585 మంది ఉన్నారని, వంద శాతం పోలియో చుక్కలమందు పంపిణీ పూర్తి కావాలన్నారు. మొత్తం 923 బృందాలతో 1040 కేంద్రాలలో పోలియో టీకా వేయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బస్టాండు, రైల్వే స్టేషన్, ప్రధాన కేంద్రాలలో నాలుగు మొబైల్ బృందాలు, 50 ట్రాన్సిట్ కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. 2170 మంది కార్మికులను నియమించామని, తొలి రోజున బూత్ స్థాయిలో టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. అదనపు డిప్యూటీ కమిషనర్ ఇ.బాలకృష్ణప్ప, డాక్టర్.జంబయ్య,జేఎం.అన్నదానస్వామి, అధికారులు పాల్గొన్నారు. -
నేనే సీఎం...అలాగని రాసిచ్చారా?
శివాజీనగర: అసెంబ్లీలో చివరిరోజు శుక్రవారం సీఎం సిద్ధరామయ్య, ప్రతిపక్ష నేత అశోక్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మున్ముందూ తానే సీఎంగా కొనసాగుతానని సీఎం సిద్ధు అనగా..అలాగని రాసిచ్చారా అంటూ అశోక్ కౌంటరిచ్చారు. ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ రెండున్నరేళ్లకు మాత్రమే ముఖ్యమంత్రి స్థానం అనే నిర్ణయం కాలేదని, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీర్మానిస్తే మున్ముందు కూడా తానే కొనసాగుతానని, హైకమాండ్ తనకు అండగా ఉందని అన్నారు. ఇందుకు ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ జోక్యం చేసుకుంటూ .. ‘మేమంతా బ్రహ్మ వద్ద ఎక్కువ సేపు ఉండకుండా విడిచి వచ్చేశాం. సిద్ధరామయ్య మాత్రం బ్రహ్మ వద్ద కూర్చొని 2013 నుంచి 2018 వరకు ఐదు సంవత్సరాలూ ముఖ్యమంత్రిగా ఖరారు చేసుకుని రాయించుకుని వచ్చారు. ప్రస్తుతం మాత్రం రెండున్నర సంవత్సరాలు రాసిచ్చార’ంటూ ఎద్దేవా చేశారు. ఇది మీకు ఎలా తెలిసిందని సిద్ధు ప్రశ్నించగా... ‘మీరు అధికార మార్పిడి గురించి ఢిల్లీ విమానం ఎక్కి వెళ్లిన నాటి నుంచి తీర్మానం అయ్యే వరకు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి నాకు ఫోన్ ద్వారా సమాచారం వస్తుండేది. మీకు రెండున్నరేళ్లనని గడువు రాశారు. దానితో సరిపెట్టుకోవాలి’ అని అన్నారు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య తమది హైకమాండ్ ఉన్న పార్టీ అని, తొలిసారి కాలావధికి ఐదేళ్లు అధికారాన్ని పూర్తి చేశానని, ప్రస్తుతం హైకమాండ్ తనకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఇన్ని సమస్యల మధ్య కూడా మీరు సమర్థించుకోవటాన్ని మెచ్చుకోవాలని బీజేపీ సభ్యులు అరగ జ్ఞానేంద్ర, వి.సునీల్కుమార్ తదితరులు ఎద్దేవా చేశారు. బీజేపీలో యడియూరప్పను అధికారం నుంచి తొలగించింది ఎందుకని సిద్ధు ప్రశ్నించారు. అశోక్కు ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్లు పూర్తి చేసే విశ్వాసముందా అని సవాల్ చేశారు. అశోక్ ఐదేళ్లూ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారని, ఆ విషయంలో తమకు గ్యారెంటీ ఉందని, మీకు ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉంటాననే విశ్వాసం ఉందా అని సునీల్కుమార్ ప్రశ్నించారు. ‘శాసనసభా పార్టీ సమావేశంలో నన్ను ఎంపిక చేశారు. అదే ప్రకారం ముఖ్యమంత్రి అయ్యా. హైకమాండ్ తీర్మానించినట్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. రెండున్నరేళ్లు అంటూ మాలో ఎలాంటి తీర్మానమూ కాలేద’ని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. మంత్రి కేజే జార్జ్ మాట్లాడుతూ తమ పార్టీ విషయాలు బీజేపీ వారికి ఎందుకని ప్రశ్నించారు. సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే మాట్లాడుతూ రెండున్నరేళ్లలో అధికార మార్పిడి అంటూ తీర్మానం కాలేదు.. అనవసరమైన చర్చ ఎందుకన్నారు. అసెంబ్లీలో సీఎం సిద్ధు, ప్రతిపక్ష నేత అశోక్ మాటల యుద్ధం -
ప్రజల సహకారం అవసరం
మాలూరు: అవినీతి రహిత తాలూకా నిర్మాణమే తమ లక్ష్యమని, ఇందుకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని స్వాభిమాన పార్టీ సంస్థాపక అధ్యక్షుడు హూడి విజయకుమార్ పేర్కొన్నారు. నగరంలోని అరళేరి రోడ్డులోని ఆయన నివాసంలో కాంగ్రెస్, బీజేపీ ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పాలనకు విసిగిన చాలామంది తమ పార్టీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో తాలూకాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడంలేదని, అవినీతి పెచ్చుమీరిపోయిందని ఆరోపించారు. లంచం ఇవ్వనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనీ జరగని పరిస్థితి నెలకొందన్నారు. యువకులు అధికంగా పార్టీలోకి చేరడంతో మరింత పటిష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ప్రభాకర్, శ్రీనాథ్, రామమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగి పాదయాత్ర
హుబ్లీ: అవినీతి ఎన్నికల వ్యవస్థను మార్పు చేయాలని కోరుతూ బాగళకోటె నివాసి, ఐటీ ఉద్యోగి నాగరాజ కలకుటకర్ జన జాగృతి పాదయాత్ర చేపట్ట్టారు. భుజంపై జాతీయ జెండా, కన్నడ మాత భువనేశ్వరి ధ్వజం పట్టుకుని ముందుకు కదిలారు. బెళగావి సువర్ణ సౌధలో తన సంకల్పాన్ని ప్రస్తావించేందుకు వచ్చిన నాగరాజ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏరోస్పేస్ ఇంజినీర్గా పనిచేస్తూ లక్షల వేతనాలు వస్తున్నా..వదిలేసి ప్రామాణిక ఉత్తమ ఎన్నికల వ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న బెంగళూరు విధాన సౌధ నుంచి పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య మనుగడ కోసం, అవినీతి, కుల,మత పిచ్చిలేని, సంస్కార సంప్రదాయాల వ్యక్తిత్వాలకు ప్రతినిధులుగా ఉన్న వారికే ఓటు వేయాలని ప్రజలను జాగృతి చేస్తున్నట్లు వెల్లడించారు. 31 జిల్లాలు, 224 అసెంబ్లీ నియోజక వర్గాలలో పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే 18 జిల్లా కేంద్రంలో 2300 కిలో మీటర్ల మేర ప్రయాణించానని తెలిపారు. లక్షలాది మంది తనకు నైతికంగా అండగా నిలిచారన్నారు. -
నేరాల నియంత్రణకు సహకరించండి
హొసపేటె: జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు యువత సహకరించాలని రచయిత స్వరూప్ కొట్టూరు కోరారు. కూడ్లిగి తాలూకా నరసింహగిరి గ్రామంలోని బోరమ్మ తమప్ప ఉన్నత పాఠశాలలో జరిగిన నేర నివారణా మాస వేడుకల్లో ఆయన మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలను గమనిస్తూ, నేర కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత నేర కార్యకలాపాలకు పాల్పడితే, అది వారి వ్యక్తిత్వంపై మచ్చగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నాగేంద్ర ఆచార్య, ప్రధానోపాధ్యాయుడు జి.బసశెట్టప్ప, ఆర్.బసవరాజ్, ఎం.శివప్రసాద్, డి.రాజ్కుమార్, జి.తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనంలో పురుగులుహొసపేటె: కొప్పళ తాలూకా పాతనింగపుర ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం వైరల్గా మారింది. వివరాలివీ.. పాతనింగపుర ప్రభుత్వ పాఠశాల పిల్లలకు వడ్డించే భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పిల్లలకు వడ్డించే ఆహారం, పరిశుభ్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పురుగులను చూసిన తర్వాత, విద్యార్థులు భోజనం పడేసి అధికారులకు సమాచారం ఇచ్చారని ఉపాధ్యాయులు తెలిపారు. మధ్యాహ్న భోజన సిబ్బంది నిర్లక్ష్యమే ఈ సంఘటనకు కారణమని వారు ఆరోపించారు. పథకం పేరు మార్చవద్దురాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం తగదని గ్రామీణ కూలీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు గురురాజ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇటీవల కేంద్ర సర్కార్ మార్చిందన్నారు. ఇది పేదల కడుపు కొట్టేలా ఉందని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పేర్లను నమోదు చేసేందుకు చేసే ప్రయత్నమేనని అన్నారు. గతంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరునే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో బసవరాజ్, మారెమ్మ, రూప, హుచ్చమ్మ, తదితరులు పాల్గొన్నారు. 21న సంగీత సమ్మేళనంరాయచూరు రూరల్: సంగీత పితామహుడు పండిత సిద్ధరామ జంబులదిన్నె జ్ఙాపకార్థం ఈ నెల 21న సంగీత సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంగీత విద్వాంసుడు వడవాటి నరసింహులు తెలిపారు. పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ నగరంలోని స్వరసంగమ సంగీత కళాశాలలో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. చెరకు కోత యంత్రంలో పడి ఇద్దరు మహిళల దుర్మరణంరాయచూరురూరల్: చెరకు కోత యంత్రంలో పడి ఇద్దరు మహిళలు దుర్మరణం చెందిన సంఘటన బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం బెళగావి జిల్లా అథణి తాలుకా సత్తి గ్రామంలోని కాడగౌడ పోలంలో చెరకు కోత యంత్రం పనులు చేసేందుకు చౌరవ్య(60), లక్ష్మీభాయి(65) వెళ్లారు. యంత్రం పనిచేస్తున్న సమయంలో.. వెనుకభాగంలో మిగిలిన చెరుకుగడలు తీసేందుకు వారు ప్రయత్నించారు. చక్రాలలో ఇరుక్కు పోవడంతో చౌరవ్య, లక్ష్మిబాయి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబీకులకు సాయంకోలారు: ఉపాధ్యాయురాలు అక్తర్ బేగం కుటుంబీకులకు ప్రభుత్వం రూ.20 లక్షల పరిహారం అందజేసింది. తాలూకాలోని కెబిహొసహళ్లి పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న అక్తర్ బేగం నరసాపురం ఫిర్కాలో జాతి సమీక్ష నిర్వహణ విధులకు వెళ్లారు. అదే సమయంలో ఆమె చెరువులో విగతజీవిగా కనిపించారు. జిల్లా కలెక్టర్ ఎంఆర్.రవి ఆమె మృతిపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. స్పందించిన ప్రభుత్వం అక్తర్ బేగం కుటుంబీకులకు రూ.20 లక్షల పరిహారం అందజేసింది. -
విద్యార్థులు సాహిత్యంపై ఆసక్తి పెంచుకోవాలి
హొసపేటె: వచన సాహిత్యంలో దాగిన జీవిత విలువలు, సందేశాలను అర్థం చేసుకోవడం వ్యక్తిత్వ వికాసానికి దారితీస్తుందని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం వైస్ఛాన్సలర్ డీవీ.పరమశివమూర్తి అన్నారు. నగరంలో కన్నడ, సాంస్కృతిక శాఖ, కర్ణాటక సాహిత్య అకాడమీ, బెంగళూరు చకోర సాహిత్య విచార్ వేదిక, శ్రీశంకర్ ఆనంద్ సింగ్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల నిర్వహించిన ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సాహిత్య శైలిలో వచన సాహిత్యానికి ముఖ్యమైన, ఆకర్షణీయమైన ప్రాముఖ్యత ఉందన్నారు. సాంకేతికత, కృత్రిమ మేథస్సు యుగంలో, వచనాలను చదివే వారి సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. వచనాలను చదవడం ద్వారా ప్రతి ఒక్కరూ వాటి ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలన్నారు. కర్ణాటక సాహిత్యం అకాడమీ సభ్య కన్వీనర్ డాక్టర్ మల్లికార్జున బి.మన్నాడే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులలో సాహిత్యంపై ఆసక్తి, అవగాహన పెంచడానికి పీయూ, డిగ్రీ కళాశాలలో చకోర వచన సాహిత్య వేదిక కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పాఠ్యాంశాలతో పాటు వచన సాహిత్యం, నవలలు, కథలు, కవితలను చదవాలన్నారు. -
చిన్నారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి
కోలారు: పిల్లలలో దాగిన ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయులు తగిన ప్రోత్సాహం కల్పించాలని, ఇందుకు ప్రతిభా కారంజీలు చక్కటి వేదిక అని బీఈఓ మధు మాలలీ పడువణె తెలిపారు. నగరంలోని అంజుమన్ ఆల్ అమీన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాలూకాస్థాయి ప్రతిభా కారంజి పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పాఠాలతోపాటు, ఇతర కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉండాలని తెలిపారు. కోలాటం, పౌరాణిక నాటకాలు, బుర్రకథ, ఇలా అనేక కళల సాధకులు జిల్లా నుంచే వెళ్లారన్నారు. పాఠాలతోపాటు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి నాగరాజ్, వెంకటాచలపతిగౌడ, గోవిందు, శ్రీనివాస్, నంజుండగౌడ, తదితరులు పాల్గొన్నారు. -
బెళగావికి బైబై
సాక్షి బెంగళూరు: కుందానగరి బెళగావి సువర్ణసౌధలో రెండు వారాలుగా జరుగుతున్న రాష్ట్ర విధాన మండల ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఒకవైపు ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరిగిన పోటీ, డిన్నర్ మీటింగ్లు, వివిధ సంఘాల ఆందోళనల మధ్య శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగిన సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలతో పాటు వివిధ తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాల వల్ల బెళగావికి ఒక్కసారిగా రాజకీయ నాయకులు, అధికారులు, ఇతరులు వచ్చి చేరడంతో పర్యాటక, యాత్రా స్థలాలు కిక్కిరిసిపోయాయి. డిసెంబర్ 8న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. పది రోజుల్లో రెండు రోజులు దివంగత ఎమ్మెల్యేలు హెచ్.వై.మేటి, శామనూరు శివశంకరప్పలకు సంతాపం వ్యక్తం చేసి కార్యకలాపాలను వాయిదా వేశారు. ఇటీవల మరణించిన ఇతర ప్రముఖులకు కూడా సమావేశాల ప్రారంభంలో శ్రద్ధాంజలి ఘటించారు. మిగిలిన 8 రోజుల్లో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యలపై ప్రశ్నోత్తరాల సమయంలో సలహా సూచనలిచ్చారు. జీరో అవర్లో వివిధ అంశాలపై చర్చ జీరో అవర్లో వివిధ అంశాలను ప్రస్తావించి ప్రభుత్వం నుంచి పరిష్కారం కోసం నేతలు శ్రమించారు. ఉత్తర కర్ణాటక జలవనరుల ప్రాజెక్టులతో పాటు వివిధ రకాల అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు వరకు ఉన్న పెండింగ్ బకాయిలన్నింటిని చెల్లించిందని మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ ప్రకటించారు. అయితే ప్రతిపక్షాలు ఒక అడుగు ముందుకేసి ఫిబ్రవరి, మార్చి నెలల డబ్బులు విడుదల కాలేదని నిరూపించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్య కలుగజేసుకుని ఆ రెండు నెలల డబ్బులను త్వరగా అందిస్తామని హామీనివ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత మంత్రి కూడా తాను చేసిన తప్పునకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నిధుల వినియోగ బిల్లు, ద్వేషప్రసంగాల నియంత్రణ బిల్లు, అంతర్గత రిజర్వేషన్కు సంబంధించిన బిల్లు తదితర బిల్లులకు విధానసభలో ఆమోదం లభించింది. ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు పది రోజుల పాటు బెళగావిలోనే నాయకులు, అధికారుల మకాం -
కేరళ ఆర్టీసీ బస్సు బుగ్గి
● 40 మందికిపైగా ప్రయాణికులు క్షేమం మైసూరు: ప్రయాణికులతో వెళుతున్న కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న 40 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు హొసళ్లి గేట్ సమీపంలో జరిగింది. మైసూరు నుంచి కేరళకు వెళ్తున్న బస్సు గురువారం అర్ధరాత్రి సమయంలో హొసళ్లి గేట్ వద్దకు రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను కిందకు దింపేశాడు. అనంతరం కొన్ని నిమిషాల్లోనే మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే బస్సు మొత్తం కాలిపోయింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేశారు. నంజనగూడు ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. జగదీశ్వరి ఆలయంలో డీసీఎం పూజలు దొడ్డబళ్లాపురం: డీసీఎం డీకే శివకుమార్ శుక్రవారం కార్వార జిల్లా అంకోల తాలూకాలో ఉన్న ప్రసిద్ద జగదీశ్వరిదేవి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు. ఆయనతో పాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి మంకాళ వైద్య, ఎమ్మెల్యే సతీస్ సైల్ ఉన్నారు. అయితే వీరందరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులను బయటే ఉంచి డీకే శివకుమార్ ఆలయ గర్భగుడి తలుపులు మూసి పూజలు చేశారు. కాలితో తన్నడంతో గాల్లోకి లేచి పడిన చిన్నారి దొడ్డబళ్లాపురం: రోడ్డు మీద ఆడుకుంటున్న చిన్నారిని ఒక వ్యక్తి ఫుట్బాల్ తరహాలో కాలితో తన్నాడు. దీంతో బాలిక గాల్లోకి లేచి కిందపడి గాయపడింది. ఈ అమానుష సంఘటన బెంగళూరు త్యాగరాజగనర్లో చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి ఇంటి బయట బ్యాడ్మింటన్ ఆడుతుండగా వెనుక నుంచి వచ్చిన రంజన్ అనే వ్యక్తి కాలితో తన్నాడు. దీంతో ఆ చిన్నారి గాల్లోకి లేచి కిందపడింది. చిన్నారి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎందుకు అలా తన్నాడో తెలియరాలేదు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించి రంజన్(35)ను బనశంకరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి బాగాలేదని తెలిసింది. లీటర్ పాలపై ప్రోత్సాహక ధనం రూ.7కు పెంపు ● ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి శివాజీనగర: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బెళగావి సమావేశాల్లో సిద్దరామయ్య అతి ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇంతకాలం ప్రతి లీటర్ పాలకు రూ.5ల ప్రోత్సాహ ధనం ఇచ్చేవారు. రైతుల మేలు దృష్ట్యా వారికి ఇస్తున్న రూ.5ల ప్రోత్సాహ ధనాన్ని రూ.7లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. ప్రస్తుత ప్రోత్సాహ ధనం రైతులకు పూర్తిగా చేరటం లేదనే ఆరోపణలపై శుక్రవారం విధానసభలో సీఎం సమాధానమిచ్చారు. ధర పెంపుదలతో పాటు ప్రభుత్వం నుంచి పాడి రైతులకు సాయం కొనసాగుతుందన్నారు. -
అంధ విద్యార్థులకు చట్టాలపై అవగాహన
రాయచూరురూరల్: న్యాయ సేవలపై అవగాహన పెంచుకొని విద్యార్థులు అవసరమైనపుడు సద్వినియోగం చేసుకోవాలని రాయచూరు తాలుకా విద్యా శాఖ అధికారి ఈరణ్ణ కోస్గి పిలుపునిచ్చారు. నగరంలోని మాణిక్ ప్రభు అంధ విద్యార్థుల పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈరణ్ణ కోస్గి మాట్లాడారు. ప్రతి నాగరికుడు మానవ హక్కులు, చట్టం వివరాలు తెలుసుకోవాలన్నారు. అపుడే ఉచిత న్యాయ సలహాలు పొందడానికి వీలుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివకుమార్, వెంకటేష్, సుదర్శన్, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. పొరుగు ఉత్సవాల సంబరంరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో పొరుగు ఉత్సవాల సంబరాలు జోరుగా సాగుతున్నాయి. పొలంలో భూ మాతకు రైతులు పూజలు జరిపి సామూహిక భోజనాలు చేశారు. ఉడంగల్లో నువ్వుల అమవాస్యగా పిలవబడే ఈ పండగను రైతులు ఘనంగా జరుపుకున్నారు. కార్మికుల వేతనాల్లో కోత తగదు రాయచూరురూరల్: జిల్లా అరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో కోత విధించడం తగదని రాజ్ కుమార్ అభిమానుల సంఘం డిమాండ్ చేిసింది. పాత్రికేయుల భవనంలో విలేకరులతో సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ మైసూరు షార్ఫ్వాచ్ ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు జూన్ నుంచి వేతనాలు ఇవ్వలేదన్నారు. నెలవారీ రూ.3 వేలు కోత విధించడమేగాక, వారికి పీఎఫ్, ఈపిఎఫ్, జీపీఎఫ్ చెల్లించకుండా నిధులు కాజేశారని ఆయన అరోపించారు. భూ బాధిత రైతుల దీక్షకు బాసటబళ్లారి అర్బన్: భూ బాధితుల రైతులకు సీఐడీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే.సత్తిబాబు మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి దారీ విధానాలతో కార్మికుల గొంతును నొక్కేస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులు పిడికిలి బిగించి ఒక్కతాటిపైకి వచ్చినపుడే న్యాయం జరుగుతుందన్నారు. జంగ్లి సాబ్, తిప్పేస్వామి, ఓలిగి సిద్దప్ప, శ్రీధర, తులసమ్మ, దేవమ్మ, హులిగమ్మ, ఈరమ్మ, తిమ్మప్ప, గోపాల, రుద్రప్ప, తదితరులు పాల్గొన్నారు. వ్యాపారి హత్యరాయచూరు రూరల్: వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. కడపకు చెందిన సయ్యద్ హుసేన్్ పాషా(25) 15 రోజుల కిందట నగరానికి వచ్చి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నారు. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో రాయచూరు ఆకాశవాణి కార్యాలయం వద్ద పాషా తన వ్యానులో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని ఎస్పీ పుట్టమాదయ్య, యస్.మంజునాథ్, బసవరాజ్ పరిశీలించారు. -
జగనన్న జన్మదినం సందర్భంగా నేటి నుంచి క్రికెట్ టోర్నీ
బనశంకరి: వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం నుంచి రెండు రోజుల పాటు ఐటీవింగ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు చేతన్ క్రికెట్ గ్రౌండ్స్ సర్జాపురలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఈ సారి టోర్నమెంట్ను పరిమిత జట్లతో నిర్వహించడంతో అందరికీ ఆటలో పాల్గొనే అవకాశం కల్పించలేక పోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శబరి ఆశ్రయధామలో సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ బెంగళూరు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈనెల 21 తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు కృష్ణరాజపురం శబరి ఆశ్రయధామ, బెళత్తూరులో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని బెంగళూరు వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ టీం తెలిపింది. సర్జాపుర చేతన్ క్రికెట్ స్టేడియంలో ఐటీ వింగ్ క్రికెట్ టోర్నమెంట్ -
ప్రజల సహకారంతో స్వచ్ఛ నగరం
కోలారు: కోలారు నగరాన్ని సుందర స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారం అవసరమని కలెక్టర్ ఎంఆర్.రవి అన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయ సభాంగణంలో పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చారిత్రక ఇతిహాసం కలిగిన కోలారు నగరంలో నేటికీ రహదారులు, పాదచారి మార్గాలు, శౌచాలయం, ట్రాఫిక్ నియంత్రణ, సూచన పలకాల కొరతతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితి మార్చడానికి జిల్లా యంత్రాంగం ప్రయతిస్తోందని, పిల్లలు సురక్షితంగా తిరిగే రోడ్లు, సీనియర్లకు విశ్రాంతినిచ్చే పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ మంగళ, కమిషనర్ నవీన్చంద్ర పాల్గొన్నారు. -
ఐవీఎఫ్ కేంద్రం ఏర్పాటుకు పచ్చజెండా
హుబ్లీ: కేఎంసీ పరిశోధన ఆస్పత్రి ఆవరణలో తొలిసారిగా కృత్రిమ గర్భధారణ కేంద్రం(ఐవీఎఫ్) ప్రారంభం కానుంది. ఈ ఆస్పత్రిలో ఇప్పటికే సీ్త్ర రోగాలు, కాన్పుల విభాగం పనులు పూర్తవడంతో ఐవీఎఫ్ కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్. డాక్టర్ ఈశ్వరహొసమని తెలిపారు. 2021–22లో ఈ మేరకు ప్రతిపాదనలు పంపగా వివిధ వర్గాల నుంచి ఆర్థిక వనరులు సేకరించి ఐవీఎఫ్ కేంద్రంలో వైద్య పరికరాలు సిద్ధం చేశామన్నారు. ఏ దశలో పరీక్షలు జరపాలి, ఔషధాల పంపిణీ ఎలా ఉండాలనేది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఒక్కో మహిళకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు వస్తుందని ఆయన తెలిపారు. పేద రోగులకు బీపీటీ తరహాలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. లోపాలు అధిగమించి మార్గదర్శకాలను రూపొందిస్తామని, ఎంతమేర సర్వీస్ ఛార్జి విధించాలో ప్రకటిస్తామని తెలిపారు. సీసీసీ తరహాలో పిల్లలు లేని మహిళలకు అనుకూలంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తామన్నారు. -
జర్నలిస్టులకు సదస్సులు అవసరం
హొసపేటె: జర్నలిజంలో ఆధునిక అంశాలను తెలుసుకోడానికి జర్నలిస్టులకు వర్క్షాప్ అవసరం, విజయనగర జిల్లాలో కర్ణాటక మీడియా అకాడమి ద్వారా అధ్యక్షుడితో ఇప్పటికే చర్చలు జరిగాయని కర్ణాటక మీడియా అకాడమీ సభ్యుడు కే.నింగజ్జ అన్నారు. హొసపేటెలోని కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని ఆయన సందర్శించి సన్మానం అందుకున్న తర్వాత మాట్లాడారు. ఆధునిక కాలంలో జర్నలిజం చాలా అభివృద్ధి చెందినప్పటికీ ప్రజల సమస్యలకు స్పందించే వృత్తిపరమైన నైపుణ్యాలు, నివేదికలు లేకపోవడం గమనార్హం. అందువల్ల కర్ణాటక మీడియా అకాడమీ వర్క్షాప్లను నిర్వహించడం ద్వారా జర్నలిజంలో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించి, కొత్త ఆలోచనలను తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మీడియా అకాడమి కలబుర్గి, హుబ్బళ్లి, కోలారు, మైసూరులలో వర్క్షాప్లను నిర్వహిస్తోందన్నారు. ఈ ప్రాంతాల్లో జర్నలిజం పండితులు, సీనియర్ జర్నలిస్టుల ప్రస్తుత సమస్యలు, సవాళ్ల గురించి జర్నలిస్టులకు అవగాహన కల్పించడానికి త్వరలో వర్క్షాప్ను నిర్వహిస్తామని తెలిపారు. సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ, ఉపాధ్యక్షులు నాగరాజ్, కోశాధికారి వెంకటేష్ పాల్గొన్నారు. ఘనంగా బసవేశ్వర ఉత్సవం రాయచూరు రూరల్: తాలూకాలోని ఆల్కూరులో వెలసిన బసవేశ్వర ఆలయంలో మల్లికార్జున, బసవేశ్వర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శుక్రవారం రాత్రి ఆలయంలో భక్తులు విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు. కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్యుల ఆధ్వర్యంలో భక్తులు స్వామివారిని సేవించి రథోత్సవం జరిపారు. కళాకారులను ఆదుకోవాలి బళ్లారి అర్బన్: కళాకారులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కర్ణాటక ఇతిహాస అకాడమి జిల్లా అధ్యక్షుడు టీహెచ్ఎం బసవరాజ్ పిలుపునిచ్చారు. శివదీక్ష మందిరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళను నమ్ముకున్న కళాకారులు తమ వ్యక్తిగత కనీస అవసరాలకు తమపై ఆధార పడిన కుటుంబ నిర్వహణ కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా జడేష్ బృందం జానపద గీతాలను ఆలపించారు. అనంతరం ముఖ్యఅతిథులను ఘనంగా సన్మానించారు. వేదికపై దేవస్థాన అధ్యక్షుడు కే.రాజశేఖర్ గౌడ, తోలుబొమ్మలాట కళాకారుడు కే.హొన్నూరు స్వామి, ఆలాప్ సంగీత కళా ట్రస్ట్ అధ్యక్షుడు రమణప్ప భజంత్రి, నాగనగౌడ, హాల్రెడ్డి, కండక్టర్ పంపాపతి, అరుణ్ గురునాథ్ భట్ పాల్గొన్నారు. -
కాటేస్తున్న వాయు కాలుష్యం
సాక్షి బళ్లారి: తాలూకాలోని శిడిగినమొళ, కారేకల్లు గ్రామాల సమీపంలో వెలసిన ప్రముఖ ఇండస్ట్రీ జానకీ బసాయ్ స్టీల్ పరిశ్రమలతో సమీపంలోని గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పలుమార్లు అధికారులకు నివేదికను, సూచనలు చేసినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఇండస్ట్రీ పక్కనే గల భూముల్లో దుమ్ము, ధూళి చేరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్న తరుణంలో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో శనివారం అసిస్టెంట్ కమిషనర్ రాజేష్, పర్యావరణ శాఖాధికారి సిద్దేశ్వరబాబు శిడిగినమొళ, కారేకల్లు పరిసరాల్లోని పంట పొలాలను పరిశీలించారు. అధికారులు విచ్చేయడంతో స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో చేరి పరిశ్రమల నుంచి జరుగుతున్న నష్టాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. తాము పంటను నష్టపోతున్నామని, ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, ఒక ఎకరానికి కేవలం రూ.1000ల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, ఇలాంటి నామమాత్ర పరిహారం తమకు అవసరం లేదని వాపోయారు. భారీగా పంటనష్టం వాటిల్లుతోందని ఆవేదన ఎకరాకు దాదాపు 10 క్వింటాళ్లు పంట పండేదని, దుమ్ము, ధూళి వల్ల ఒకటి లేదా రెండు సంచులు కూడా పండటం లేదన్నారు. వారు ఇచ్చే పరిహారం అక్కరలేదని, దుమ్ము, ధూళి లేకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. అంతేకాకుండా మంచినీటి చెరువుల్లో కూడా విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోందన్నారు. సమీపంలోని ఇళ్లల్లోకి కూడా కాలుష్యం రావడం వల్ల ప్రజలకు ఆనారోగ్యకర పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. దుమ్ము, ధూళి, వాయు కాలుష్యం వల్ల పంట పొలాలు, తాగునీరు, ప్రజలకు శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని కన్నీరు పెట్టుకున్నారు. మానవతా ధృక్పథంలో ఆలోచించి పరిశ్రమల నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమల ద్వారా ప్రారంభం నుంచి ఇదే సమస్య తలెత్తిందన్నారు. అయితే అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారే కానీ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. నివేదిక వచ్చిన అనంతరం చర్యలపై హామీ పర్యావరణ శాఖాధికారులు, జిల్లాధికారుల బృందం సమగ్ర తనిఖీ నిర్వహించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఓ వైపు ఆరోగ్యాలు దెబ్బతినడంతో పాటు పంటలు కూడా పూర్తిగా నాశనమవుతున్నాయన్నారు. ప్రారంభంలో చిన్నగా మొదలైన జానకీ బసాయి పరిశ్రమలు అంచెలంచెలుగా పెద్ద స్థాయికి చేరుకోవడంతో తమకు శాపంగా మారిందన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఒత్తిడి చేశారు. రైతులు, స్థానికుల ఆవేదనను విన్నపాన్ని ఆలకించిన అధికారుల బృందం ఉన్నతాధికారులతో చర్చించడంతో పాటు పూర్తి స్థాయి నివేదిక తీసుకొని ప్రజలకు పరిశ్రమల ద్వారా హాని కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈసందర్భంగా రైతు సంఘం నాయకులు, స్థానికులు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొన్నారు. కారేకల్లు వద్ద పరిశీలిస్తున్న అధికారులు అధికారికి పంటనష్టంపై వివరిస్తున్న రైతులు కారేకల్లు, శిడిగినమొళ పరిసరాల్లో పర్యావరణానికి ముప్పు అసిస్టెంట్ కమిషనర్, పర్యావరణ శాఖ అధికారుల పరిశీలన దుమ్ము, ధూళితో పంట నష్టాన్ని వివరించిన రైతులు -
విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానం అత్యవసరం
హొసపేటె: నేటి ఆధునిక పరిజ్ఞాన యుగంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శనివారం విజయనగర జిల్లా హొసపేటెలో సియెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పీయూ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తరగతులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎస్టీఈఎం, రోబోటిక్స్, కోడింగ్, డిజిటల్ ఇన్నోవేషన్లో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. సియెంట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వ విద్యాశాఖ సహకారంతో అమలు చేసిన ఈ ప్రాజెక్టును ఈరోజు భారత ప్రభుత్వ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభించడం గర్వకారణమన్నారు. కర్ణాటకలో మొట్టమొదటి హొసపేటె తాలూకాలోని ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పైలెట్ ప్రాజెక్ట్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే 2000 మందికి పైగా విద్యార్థులకు ఐటీ సాధికారత కల్పిస్తుందన్నారు. ఎమ్మెల్యే గవియప్ప, జిల్లాధికారి కవిత తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
విద్యా బోధనపై రాష్ట్ర స్థాయి సదస్సు
హొసపేటె: విజయనగర కళాశాలలో అంతర్గత నాణ్యత హామీ సెల్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులందరికీ ఫలితాల ఆధారిత విద్య ద్వారా బోధన, అభ్యాసంలో నాణ్యతను అందించడం అనే అంశంపై ఒక రోజు రాష్ట్ర స్థాయి సదస్సును శనివారం నిర్వహించింది. కార్యక్రమాన్ని విజయనగర కళాశాల అధ్యక్షుడు మల్లికార్జున్ ఎన్.మైత్రి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ మహంతేష్ ఎన్. ఆరాధ్యమట్ అధ్యక్షత వహించారు. వర్క్షాప్ ఫెసిలిటేటర్గా ఉన్న ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ డి.రవికిరణ్ వర్క్షాప్, ఫలితాల ఆధారిత విద్యపై పరిచయ వ్యాఖ్యలు చేశారు. కొప్పళలోని ప్రభుత్వ ఫస్ట్గ్రేడ్ కళాశాలలో జర్నలిజంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, రిసోర్స్ పర్సన్ సుధా హెగ్డే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. కర్ణాటక నలుమూలల నుంచి తరలి వచ్చిన మొత్తం 180 మంది ఉపాధ్యాయులు వర్క్షాప్లో పాల్గొన్నారు. డాక్టర్ సుప్రియ, డాక్టర్ శ్రింగేష్, డాక్టర్ శివమల్లికార్జున, డాక్టర్ గాదెప్ప, అమృత్, డాక్టర్ శివప్రసాద్, తదితరులు హాజరయ్యారు. -
వ్యాపారి హత్య కేసులో నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులను పోలీ్సులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డబ్బులు ఇచ్చి పుచ్చుకొనే విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమన్నారు. నిందితులను నగరంలోని తిమ్మాపూర్పేటకు చెందిన నాగరాజ్(17), బాషా(17), పునీత్ కుమార్ (18), సమీర్(18)లుగా గుర్తించారన్నారు. గురువారం రాత్రి 1 గంట సమయంలో ఆకాశవాణి వద్ద వ్యానులో నిద్రిస్తున్న సయ్యద్ హుసేన్ పాషాను హత్య చేశారన్నారు. -
అబ్బురం.. ముళ్ల కంపలపై శయనం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో వివిధ రకాలైన పండుగలను ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఒళ్లు గగుర్పొడిచేలా ముుళ్ల పందిరిపై శయనించే జాతర కొప్పళ జిల్లాలో జరిగింది. అచంచల భక్తివిశ్వాసాలతో ముళ్ల కంప చెట్ల కొమ్మలపై శరీరంపై గాయాలైన వారు వెల్లికిలా పడుకున్నా ఏమీ కాదు. కొప్పళ తాలూకాలోని పలు గ్రామాల్లో ముళ్లకంప చెట్ల శయన ఉత్సవాలను ఆచరిస్తారు. కార్తీక అమావాస్య నుంచి 41 రోజుల పాటు పూజలు జరిపి చట్టి అమవాస్య నాడు మారుతేశ్వర ఆలయంలో యువకులు ఉదయం చెప్పులు వేసుకోకుండా ముళ్ల కంప చెట్లను నరికి తీసుకొచ్చి కుప్పలుగా పోస్తారు. మిద్దెల మీద నుంచి శయనంగా చేసిన ముళ్ల కంప చెట్ల కుప్పలపైకి దూకుతారు. అందులో పడిన యువకులకు గాయాలు కాకుండా ఉంటాయనేది భక్తితో కూడిన విశ్వాసం. ముళ్లకంప చెట్లను రాయితో కత్తిరించి తీసుకొస్తారు. ఎలాంటి ఇనుముతో కూడిన వస్తువులను వినియోగించరాదని గ్రామస్తులు వెల్లడించారు. ముళ్లకంప చెట్లకొమ్మల రాశులపై దూకిన యువకులు రక్త గాయాలతో ఇంటికెళ్లి రాత్రి పూట నల్ల కంబళిపై పడుకుంటే అది నయమవుతుందనే విశ్వాసం వారిలో ఉంది. రెండు, మూడు రోజుల్లో గాయాలు వాటంతటవే మానిపోతాయని చెబుతున్నారు. ముళ్ల కంప చెట్ల రాశుల మీద పడితే తాము కోరుకున్న కోరికలు నెరవేరతాయని వారు వెల్లడించారు. ఒళ్లు గగుర్పొడిచేలా భక్తుల విన్యాసం కొప్పళ జిల్లాలోని పల్లెల్లో వింత ఆచారం -
జంతు సంరక్షణ మన ప్రాధాన్యత కావాలి
హొసపేటె: మన చుట్టు ఉన్న జంతువులను మన స్వంత కుటుంబ సభ్యుల మాదిరిగానే జాగ్రత్తగా చూసుకోవాలి, వాటికి ఇబ్బంది కలిగించకూడదు అని అటల్ బిహారీ వాజ్పేయి జూలాజికల్ పార్క్ వన్యప్రాణి జీవశాస్త్ర వేత్త, విద్యా అధికారిణి బీ.ఎల్.శైలశ్రీ తెలిపారు. కన్నడ సాహిత్య అధ్యయన విభాగం అల్లమ హాల్లో శనివారం ఆమె జంతువుల ప్రవర్తన అనే అంశంపై మాట్లాడారు. మానవుల్లో తల్లికి తన పిల్లలపై ఉన్న ప్రేమ వలె తల్లి పులి, నీటిగుర్రం వంటి జంతువులలో మనం దానిని చూడవచ్చన్నారు. అదే విధంగా జంతువుల ప్రవర్తన నుంచి నేర్చుకోవడం అనే నినాదం ప్రకారం మానవులు జంతువులను ఇబ్బంది పెట్టకపోతే అవి మనల్ని ఇబ్బంది పెట్టవని అన్నారు. నేడు కొన్ని జంతువులకు ప్రకృతిలో తినే ఆహారానికి బదులుగా మనకు లభించే ఆహారాన్ని ఇస్తున్నాం, ఇది జంతువుల ప్రవర్తనలో తేడాలను కలిగిస్తోందన్నారు. జంతువులను అడవి సంస్కృతిలో జీవించడానికి అనుమతించాలని ఆమె అన్నారు. వేదికపై మోడరేటర్ డాక్టర్ గోవింద రవిచంద్ర, విభాగాధిపతి ప్రొఫెసర్ వెంకటగిరి దళవాయి, పరిశోధకులు రవిచంద్ర, ఇస్మాయిల్ సిద్ధిక్, అక్షత పాల్గొన్నారు. -
పోలియో రహిత దేశానికి టీకా తప్పనిసరి
హొసపేటె: దేశాన్ని పూర్తిగా పోలియో రహితంగా మార్చాలంటే ప్రజలు సమీపంలోని పోలియో చుక్కల కేంద్రాలకు వెళ్లి ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న తమ పిల్లలకు చుక్కలు వేయించాలని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ ఎల్ఆర్ శంకర్ నాయక్ అన్నారు. మాతా శిశు ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో అవగాహన జాతాను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈసారి ఈనెల 21 నుండి 24 వరకు వివిధ విభాగాల సమన్వయంతో నిర్వహించే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తప్పనిసరి టీకాను వేయించుకోవాలన్నారు. అనంతరం నగర వీధుల్లో ప్రధాన సర్కిళ్ల గుండా మాతాశిశు ఆస్పత్రి ప్రాంగణం వరకు జాతా సాగింది. 200 మందికి పైగా విద్యార్థులు, ఆశా వర్కర్లు పోలియోకు సంబంధించిన వివిధ నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. జిల్లా ఆర్సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య, జిల్లా కుష్టు వ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ కే.రాధిక, జిల్లా సర్వే అధికారి డాక్టర్ షణ్ముఖ, తాలూకా వైద్యాధికారి డాక్టర్ వినోద్, బాలల అభివృద్ధి ప్రాజెక్టు అధికారి సింధు అంగడి, ఐఎంఏ అధ్యక్షుడు రఘునాథ్ దీపాలి, పిల్లల వైద్యురాలు లలితా జైన్, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.వెయ్యి కోట్ల సైబర్ నేరాల ముఠా
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలోనే అతిపెద్ద సైబర్ క్రైం కేసును దావణగెరె పోలీసులు ఛేదించారు. సుమారు రూ.1000 కోట్ల మేరకు ఈ సైబర్ నేరస్తులు దోచుకున్నట్టు భావిస్తున్నారు. అర్ఫాత్, సంజయ్ కుంద్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రమోద్ ఫిర్యాదుతో.. గత రెండు నెలల క్రితం ప్రమోద్ అనే వ్యక్తి ఖాతా నుంచి రూ.52 లక్షలు పోయాయని దావణగెరె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ప్రమోద్ ఖాతా నుంచి రూ.150 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఇంకా లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు సైబర్ క్రైంలో ఇతడూ భాగస్వామి అని తేలింది. అతని ఖాతాలోకి అపరిచిత అకౌంట్ల నుంచి కోట్ల రూపాయలు వచ్చేవి. అతనిని ప్రశ్నించగా, వ్యాపారవేత్తనంటూ బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలను తెరిచి వాటిని సైబర్ నేరస్తులకు ఇచ్చేవాడు. నేరగాళ్లు తాము కొట్టేసిన సొమ్ములను ఈ ఖాతాల్లో నిల్వ ఉంచేవారు. ఇందుకుగాను ప్రమోద్కు కమీషన్ ఇచ్చేవారు. గ్యాంబ్లింగ్, ఫేక్ ట్రేడింగ్, ఆన్లైన్ గేమింగ్ తదితర అక్రమ దందాల ద్వారా వచ్చే డబ్బు జమ ఇతని ఖాతాల్లో అయ్యేది. అర్ఫాత్ ఖాతాలో రూ.18 కోట్లు ఈ కేసులో అర్ఫాత్ అనే వంచకున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని బ్యాంక్ అకౌంట్లో కూడా రూ.18 కోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో నిందితుడు సంజయ్ కుంద్ను గుజరాత్లో పట్టుకున్నారు. ఈ ముఠాలో చాలా మంది ఉన్నట్లు, సుమారు రూ. వెయ్యి కోట్ల మేర అక్రమాలు జరిగాయని తేల్చారు. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. ఛేదించిన దావణగెరె పోలీసులు బ్యాంకు ఖాతాదారు ద్వారా కదిలిన డొంక


