breaking news
Karnataka Latest News
-
బడికి వెళ్లిన, లేదా ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలలు అదృశ్యమవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు హతాశులవుతున్నారు. వారు ఏమయ్యారో, ఎక్కడున్నారో తెలియక తల్లడిల్లుతున్నారు. పిల్లల ఆచూకీ కోసం కళ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో బాలల మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. అదృశ్యమైన పిల్లల ఆచూకీ మిస్టరీగా మారుతోంది. వారు ఎలా మాయమవుతున్నారు? ఎవరు మాయం చేస్తున్నారు? ఎందుకు మాయం చేస్తున్నారు? అనే విషయాలు అంతుబట్టడం లేదు. కనబడకుండాపోతున్న పిల్లల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లలు తమ చెంతకు ఎప్పుడు చేరుతారోనని కళ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. మిస్సింగ్ కేసుల సంఖ్య ఇలా... హోంశాఖ సమాచారం ప్రకారం 2020 నుంచి 2025(జూలై)వరకూ 14,878 మంది పిల్లలు మాయమయ్యారు. వీరిలో 13,542మంది పిల్లల ఆచూకీ లభించింది. వారు తల్లితండ్రుల వద్దకు క్షేమంగా చేరారు. 2025 జూలై చివరికి మొత్తం 2,170మంది పిల్లలు కనబడకుండాపోయారు. వీరిలో 551 మంది మగపిల్లలు, 1,619మంది ఆడపిల్లలు ఉన్నారు. గత ఐదున్నరేళ్ల కాలంలో అదృశ్యమైన 10,792మంది బాలికలపైకి 1003మంది, అదేవిధంగా 4086 మంది మగ పిల్లలపైకి 333మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఈ జిల్లాలో ఎక్కువ కేసులు పిల్లలు మాయమవుతున్న కేసులను చూస్తే బెంగళూరు ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత దావణగెరె, ఉడుపి, దక్షిణకన్నడ, హావేరి, చిత్రదుర్గ, తుమకూరు, మైసూరు జిల్లాలు ఉన్నాయి. మాయమవుతున్న బాలలు మిస్సింగ్ కేసుల్లో బెంగళూరు ఫస్ట్ పత్తాలేని వెయ్యి మంది ఆడపిల్లలుహోం శాఖకు లేఖ రాశాం కనబడకుండాపోయిన పిల్లలను త్వరగా కనిపెట్టి తీసుకురావాలని లేఖలు రాయడం ద్వారా హోం శాఖపై ఒత్తిడి తీసుకువస్తున్నామని, రాష్ట్ర పిల్లల హక్కుల రక్షణ కమిటీ అధ్యక్షుడు నాగణ్ణగౌడ తెలిపారు.చైతన్యం తీసుకు వస్తున్నా... పిల్లల హక్కులు, సంరక్షణ తదితర అంశాలపై ప్రభుత్వం ప్రచారం ద్వారా చైతన్యం కలిగిస్తున్నా పిల్లలు మాయమవుతూనే ఉన్నారు. ఆడపిల్లలు అధిక సంఖ్యలో మాయమవడానికి కారణం సెక్స్ మాఫియా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆడపిల్లలను వేశ్యావాటికకు తరలించి డబ్బు దండుకునే మాఫియా దేశ వ్యాప్తంగా విస్తరించింది. అదే ఆడపిల్లలను విదేశాలకు పంపించి విక్రయించే మాఫియా కూడా ఉంది. ఇక లెక్కకు దొరకని, కనబడకుండాపోయిన పిల్లల సంఖ్య ఎంత ఉందో ఊహించుకోవచ్చు.బాలల అదృశ్యానికి అనేక కారణాలు తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, కుటుంబ కలహాలు, పరిపక్వత లేని ప్రేమ, పిల్లల పట్ల కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం, పేదరికం, గ్రామీణ జీవితం పట్ల విరక్తి,నగర జీవితాల పట్ల ఆకర్షణ ఇలా అనేకం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలను భిక్షాటన కోసం వాడుకునే మాఫియా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉంది. ఆ మాఫియా కూడా పిల్లల అదృశ్యానికి కారణంగా చెప్పుకోవచ్చు. -
రోడ్డుపై చెత్త వేసిన స్కూటరిస్టుకు గుణపాఠం
చిక్కబళ్లాపురం: రోడ్లపై ఇష్టానుసారంగా చెత్త వేసిన యువకుడిపై నగరసభ సిబ్బంది గట్టి గుణపాఠం చెప్పారు. ఈఘటన చిక్కబళ్లాపురంలో జరిగింది. శుక్రవారం ఓ యువకుడు స్కూటర్లో చెత్త తీసుకొని వచ్చి కందవార రోడ్డులో వేశాడు. నగరసభ సిబ్బంది గమనించి ఆ యువకుడిని మందలించారు. రోడ్డుపై చెత్త వేసినందుకు జరిమానా చెల్లించాలని సూచించారు. మీరు ఏం చేస్తారో చేసుకోండి..జరిమానా చెల్లించేది లేదని ఆ యువకుడు పేర్కొనడంతో నగరసభ సిబ్బంది అతని స్కూటర్ను నగరసభ కార్యాలయానికి తీసుకెళ్లారు. కంతులు చెల్లించలేదని ఇల్లు జప్తు మైసూరు: కొంతకాలంగా చప్పుడు లేకుండా ఉన్న సూక్ష్మరుణ సంస్థలు మళ్లీ పంజా విసురుతున్నాయి. బాకీ చెల్లించలేదని ఓ వ్యక్తికి చెందిన ఇంటిని మైక్రోఫైనాన్స్ అధికారులు కోర్టు ఆదేశాలతో వచ్చి జప్తు చేశారు. మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా కందెగాల గ్రామంలో చిన్న స్వామి అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం మైక్రోఫైనాన్స్లో రూ.2.70 లక్షలు రుణం తీసుకున్నాడు. ఇప్పటికే 19 వాయిదాల్లో రూ.1.89లక్షలు చెల్లించాడు. ఆర్థిక ఇబ్బందులతో మిగతా కంతులు చెల్లించడంలో జాప్యం జరిగింది. తనకు సమయం ఇస్తే కంతులు చెల్లిస్తానని చిన్నస్వామి తహసీల్దార్, కలెక్టర్కు లేఖ రాశారు. అయితే ఫైనాన్స్ సంస్థలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో వచ్చి శుక్రవారం చిన్నస్వామి ఇంటిని జప్తు చేశారు. సంచార జాతులకు రిజర్వేషన్పై కట్టుబడి ఉన్నాంబనశంకరి: సంచార(అలెమారి) సముదాయాలకు సామాజిక న్యాయం కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశలో 1 శాతం రిజర్వేషన్ ఏవిధంగా అందించాలి అనేదానిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించి అలెమారి ఒక్కూట పదాధికారుల కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను విధానసౌధలో కలిసి మనవి చేశారు. సముదాయ డిమాండ్లపై స్పందించిన సిద్దరామయ్య ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కులాల కోసం ఎస్సీపీ, టీఎస్పీ కార్యక్రమాలను అమలు చేసింది తమ ప్రభుత్వమేనన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం ప్రామాణిక ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రస్తుతం తలెత్తిన గందరగోళాన్ని ప్రాధాన్యత మేరకు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నాగమోహన్దాస్ సిఫార్సుల ప్రకారం సంచార(అలెమారి) సముదాయానికి సామాజిక న్యాయం కల్పించే దృష్టితో ఒక శాతం రిజర్వేషన్ కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. తాను మరణించి నలుగురికి పునర్జన్మ బనశంకరి: తీవ్ర ఒత్తిడితో మెదడులో రక్తస్రావం ఏర్పడి బ్రెయిన్డెడ్ కావడంతో 33 ఏళ్ల యువకుడి అవయవాలను నమ్మ మెట్రోలో తరలించిన డాక్టర్లు నలుగురు రోగులకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి పునరుజ్జీవం కల్పించారు. యశవంతపుర స్పర్శ్ ఆసుపత్రిలో దాత నుంచి తీసుకున్న అవయవాల్లో శ్వాసకోశం గురగుంటెపాళ్య మెట్రోస్టేషన్ నుంచి ఆర్వీ రోడ్డు స్టేషన్కు అక్కడ నుంచి యెల్లోలైన్ మార్గంగా బొమ్మసంద్ర మెట్రోస్టేషన్కు 61 నిమిషాల్లో 33 కిలోమీటర్లు నారాయణ హెల్త్ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నగరంలోని మత్తికెరె నివాసి ఇంట్లో స్నానం చేసి బయటికి రాగానే తల తిరిగి స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. తక్షణం కుటుంబ సభ్యులు నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించిన తరువాత స్పర్శ్ ఆసుపత్రిలో చేర్చారు. యువకుడు బ్రెయిన్డెడ్ అయినట్లు డాక్టర్లు తెలపడంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి సమ్మతించారు. అనంతరం మెట్రోలో అవయవాలను తరలించారు. యశవంతపుర స్పర్శ్ ఆసుపత్రికి ఒక కిడ్నీ, విక్టోరియా ఆవరణలోని నరాలు, యూరాలజీ సంస్తకు మరో కిడ్నీ, మింటో కంటి ఆసుపత్రికి రెండు కార్నియాలను తరలించి శస్త్రచికిత్స ద్వారా రోగులకు అమర్చారు. -
కారు బోల్తా: 8 మందికి గాయాలు
సాక్షి బళ్లారి: దావణగెరె జిల్లా జగళూరు తాలూకా తాతన్హట్టి సమీపంలో శుక్రవారం ప్రమాదవశాత్తూ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. వివరాలు..బెంగళూరు నుంచి గంగావతికి ఓ కుటుంబం కారులో బయలుదేరింది. జగళూరు తాలూకా తాతన్హట్టి సమీపంలోకి చేరుకోగానే కారు అదుపుతప్పింది. ఈ ఘటనలో నూర్, షమీ హుల్లా, గురురాజ్, ఖాదర్ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై జగనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వద్దు రాయచూరు రూరల్: జిల్లాలో పోలీసులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి. అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని బళ్లారి డివిజన్ ఐజీపీ వర్తిక కటియార్ పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో గబ్బూరు, దేవదదుర్గ, జాళహళ్లిలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నేరాల కట్టడికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను వాడరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్పీ పుట్ట మాదయ్య, అదనపు ఎస్పీలు హరీష్, కుమార స్వామి, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. ఈరమ్మకు రాష్ట్ర స్థాయి కన్నడ రాజ్యోత్సవ అవార్డు హొసపేటె: గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది గర్భిణులకు ప్రసవాలు చేసిన ఓబల్శెహట్టి హళ్లి గ్రామానికి చెందిన సూలగత్తి ఈరమ్మ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. శనివారం జరగనున్న కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో ఆమెకు రాష్ట్ర స్థాయి కన్నడ రాజ్యోత్సవ అవార్డు అందజేయనున్నారు. ఈరమ్మ అవార్డుకు ఎంపిక కావడంతో ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.టి శ్రీనివాస్ అభినందించారు. -
వల్లభాయ్ పటేల్ సేవలు ఎనలేనివి
బళ్లారి రూరల్: స్వతంత్య్ర భారత్ ఏకీకరణకు సూత్రధారి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఏఎస్ఎం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ధూపం సతీష్ తెలిపారు. శుక్రవారం ఏఎస్ఎం కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మొదటి ఉప ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎనలేని సేవలు అందించారన్నారు. యావత్తు భారతదేశాన్ని ఏకతాటికి తేవడానికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. సేవలకు గుర్తుగా సర్ధార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, స్కౌట్స్ అండ్ గౌడ్స్, ప్రముఖులు పాల్గొన్నారు. బళ్లారి టౌన్: అఖండ భారత ఐక్యతకు కారకుడు ఉక్కుమనిషి సర్దార్ వల్లబాయి పటేల్ అని జిల్లా ఎస్పీ శోభరాణి పేర్కొన్నారు. శుక్రవారం సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీఏఆర్ పోలీస్ గ్రౌండ్లో రన్ ఫర్ యూనిటీ మారథాన్ నిర్వహించారు. జిల్లా పంచాయతీ పీఈఓ మహమ్మద్ హ్యారీష్ సుమేరా మాట్లాడుతూ.. యువత ఆన్లైన్ గేమ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మారథాన్లో విజేతలకు బహుమతులు అందజేశారు. హొసపేటె: నగరంలోని పునీత్ రాజ్కుమార్ సర్కిల్లో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారి కవితా ఎస్.మన్నికేరి మాట్లాడుతూ.. ఐక్యత అనేది ఒకేసారి జరిగే కార్యక్రమం కాదని.. జాతీయ పునరుద్ధరణకు నిరంతర ప్రయత్నం అని తెలిపారు. దేశ వ్యాప్తంగా పాఠశాలలు పౌర సంస్థలు, పౌరులు దేశ సమగ్రతను నిలబెట్టాలనే తమ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నారు. అనంతరం నగరంలో ప్రముఖ వీధుల్లో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఎస్పీ జాహ్నవి తదితరులు అధికారులు పాల్గొన్నారు. రాయచూరు రూరల్: నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరా గాంధీ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు వసంత్కుమార్, గ్రామీణ సభ్యుడు బసన గౌడ దద్దల్, నగరాద్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నగర సభ కమిషనర్ జుబీన్ మెహపాత్రో తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ కార్యాలయంలో జిల్లాధ్యక్షుడు వీరన గౌడ ఆధ్వర్యంలో వల్లభాయి పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు. -
నీరు ఇవ్వకపోతే పోరాటం చేస్తాం
సాక్షి బళ్లారి: తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని రైతులకు రబీలో పంటలు సాగు చేసేందుకు డ్యామ్ నుంచి నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తమ గౌడ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పత్రికా భవనంలో పలువురు రైతులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తుంగభద్ర డ్యామ్ పరిధిలో గేట్లు మార్చడానికి మూడు నెలల సమయం చాలని నిపుణుడు కన్నయ్య నాయుడు సూచించారన్నారు. రబీ పంట అయిన తర్వాత గేట్ల మార్చవచ్చని తెలిపారు. అయితే గేట్లు మార్చే పనుల నేపథ్యంలో రబీ పంటకు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం సరికాదని పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన నీటి పారుదల సలహా సమితి (ఐసీసీ) సమావేశంలో సంబంధించిన మంత్రులు కూడా అప్పట్లో రబీకి నీరు ఇవ్వలేమని చెప్పలేదని.. మరొక సారి సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు గుర్తు చేశారు. ఆయకట్టు రైతుల్లో గందరగోళం సృష్టించేలా ప్రకటనలు వస్తుండటం విచారకరమన్నారు. గేట్లు మార్చడంలో కన్నయ్య నాయుడు సూచనలు పాటించి రబీలో రైతులకు నీరు వదలడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రబీ పంట తర్వాత గేట్లు మార్చే పనులు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. సాగు నీరు అందించాలి రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో రెండవ పంటకు సాగు నీరు అందించాలని మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ, మాజీ ఎంపీ విరుపాక్షప్ప, మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రబీ పంటలకు నీరు అందించేందుకు డీసీఎం అంగీకరించక పోవడాన్ని తప్పుబట్టారు. -
పేదలకు సేవ చేస్తాం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో దారి తప్పుతున్న భక్తులకు స్వామిజీలు ధర్మ సందేశాలు ఇవ్వాలని బాళే హోన్నురు రంబాపుర పీఠాధిపతి జగుద్గరు ప్రసన్న రేణుక వీర సోమేశ్వర రాజ దేశీ కేంద్ర శివాచార్యలు సూచించారు. శుక్రవారం కిల్లే బ్రహన్మఠ మఠంలో గురుపాదేశ్వర 25 పుణ్యారాధన నిర్వహించారు. బడుగు, బలహీన, దళిత వర్గాలు సామాజికంగా వెనుకబడిన పేదలకు సేవలు చేయాలని నిర్ణయించుకున్నామని స్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో శాంతమల్ల శివాచార్యులు, అభినవ రాచోటి శివాచార్యులు, చంద్రశేఖర్ పాటిల్, సమాజం అధ్యక్షుడు శరణ భూపాల నాడగౌడ, వీరభద్రప్ప గౌడ, శరణగౌడ, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలతో అసభ్య ప్రవర్తన చెళ్లెకెరె రూరల్: నగరంలోని త్యాగరాజ నగర్లో ఓ వ్యక్తి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నడి వీధిలో నగ్నంగా తిరుగుతూ మహిళలను భయ భ్రాంతులకు గురి చేశాడు. దీందతో మహిళలు భయపడి ఇళ్లలోకి పారిపోయారు. వికృతి కామి వికృత చేష్టలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చెళ్లెకెరె పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. కరువు ప్రాంతంగా ప్రకటించాలి రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతు సంఘం గౌరవాధ్యక్షుడు మల్లికార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో వేసిన వరి, కంది, పత్తి పంటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయన్నారు. పంటలు నాశనం కావడంతో పరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అనంతరం పంట నష్టపరిహారం అందించాలని కోరుతూ స్థానిక అధికారికి వినతిపత్రం అందజేశారు. -
మొక్కజొన్న కొనుగోలు చేయాలి
బళ్లారి టౌన్: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా వెంటనే మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏఐకేకేఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక రాయల్ సర్కిల్ నుంచి ర్యాలీగా జిల్లా అధికారి కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లాధ్యక్షుడు గోవింద్ మాట్లాడుతూ.. దిగుబడి బాగానే ఉన్నా సరైన ధర లేక పోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు తక్కువ ధరతో మొక్కజొన్నను ఖరీదు చేసి ఎక్కువ ధరతో అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి గురళ్లి రాజు, రైతు నేతలు బసవరాజు, పంపాపతి, హొన్నూర్ మల్లికార్జున, మహబూసాబ్ తదితరులు పాల్గొన్నారు. -
గారపాటి సేవలు అమూల్యం
రాయచూరు రూరల్: అఖిల భారత తెలుగు అకాడమీ అధ్యక్షుడు, ప్రవాసాంధ్రుడు గారపాటి రామకృష్ణను శుక్రవారం గోవా, మహరాష్ట్ర తెలుగు సంఘాల ఆధ్వర్యంలో సత్కరించారు. గోవాలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర తెలుగు సంఘాల అధ్యక్షుడు జగన్, ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడారు. గారపాటి రామకృష్ణ సమాజానికి చేసిన సేవలను గుర్తించి సన్మానించామన్నారు. ప్రవాసాంధ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారని కొనియాడారు. ఉచిత అరోగ్య సేవలు, సాముహిక వివాహాలు, విద్యా రంగం, ధార్మిక కార్యక్రమాల్లో రామకృష్ణ చురుకుగా పాల్గొంటూ యువకులకు ఆదర్శంగా నిలిచారన్నారు. కర్ణాటక తెలుగు సంఘాల అద్యక్షుడు ఉమా మహేశ్వరరావు, దక్షిణ గోవా తెలుగు సంఘాల అధ్యక్షుడు బి.నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. -
దర్శన్ అండ్ గ్యాంగ్పై 3న తుది చార్జిషీట్
యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ఈ నెల 3న తుది చార్జిషీట్ను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం పోలీసులను అదేశించింది. కేసులో రెండో నిందితుడు నటుడు దర్శన్తో పాటు ఇతర నిందితులను కోర్టు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టారు. ఈ నెల 3న చార్జిషీట్ సమర్పించాలని, ఆరోజు నిందితులు తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని జడ్జి అదేశించారు. నిందితులపై పోలీసులు దాఖలు చేసిన ఆరోపణలను న్యాయమూర్తి చదివి వినిపించారు. ఇవి నిజమేనా అని అడిగారు. 9 మంది నిందితులు నేరాన్ని అంగీకరిస్తే సాక్షులను విచారించే అవకాశం ఉంటుంది. చార్జిషీట్లో దర్శన్పై పోలీసులు ఎలాంటి నేరారోపణ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జైల్లో ఉన్న ఏడు మందితో పాటు కేసులోని 9 మందిపై పోలీసులు చార్జిషీట్ సమర్పించనున్నారు. అయితే కొందరి పేర్లును తొలగించే అవకాశం కూడా ఉంది. గతంలో నిందితులపై చార్జిషీట్ సమర్పించాలని పోలీసులపై ఒత్తిడి చేశారు. అయితే పీపీ గడువు అడిగారు. దర్శన్ తరపున న్యాయవాది మాత్రం విచారణను ఎదుర్కొని కేసులో గెలిచి బయటకు వస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దర్శన్, పవిత్ర గౌడల ఫొటోలు వైరల్ హత్య కేసు నిందితుడు నటుడు దర్శన్, పవిత్రాగౌడలు పెళ్లి చేసుకున్నట్లు ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. ఎవరో ఈ ఫోటోలను లీక్ చేశారని అనుమానిస్తున్నారు. దర్శన్, పవిత్రలిద్దరూ పెళ్లి బట్టలు ధరించినట్లు, పవిత్ర మెడలో పసువు దారం ఉన్నట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. పవిత్రతో దర్శన్ అన్యోన్యంగా ఉన్నట్లు సెల్ఫీ ఫొటో ఉంది. ఇవి పదేళ్లనాటి ఫొటోలని నెటిజన్లు అంటున్నారు. పోలీసులను ఆదేశించిన కోర్టు -
ఏనుగు దాడిలో అన్నదమ్ముల మృతి
యశవంతపుర: ఏనుగుల దాడిలో అన్నదమ్ములు మృతి చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా శృంగేరి తాలూకా కెరెమనె గ్రామంలోని కుదురెముఖ జాతీయ ఉద్యానవనం పరిధిలో జరిగింది. గ్రామానికి చెందిన అన్నదమ్ములు హరీశ్(44), ఉమేశ్(40)లు గురువరం పశువుల మేత తేవటానికి పొలం వద్దకు వెళ్లారు. ఏనుగులు దాడి చేసి ఇద్దరిని కాళ్లతో తొక్కేశాయి. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన స్థలాన్ని శృంగేరి పోలీసులు, అటవీశాఖ అధికారులు పరిశీలించారు. కాగా మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్లిన శృంగేరి తహసీల్దార్ కారును అడ్డగించి స్థానిక రైతులు అందోళన చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయమైన పరిహరం ఇచ్చి అదుకోవాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటీ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులతో చర్చించి పరిహారం అందజేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కాగా పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
స్వాతంత్య్రం కోసం బీజేపీ పోరాడలేదు
● సీఎం సిద్ధరామయ్య యశవంతపుర: ఇందిరాగాంధి ఆదర్శాలను అందరూ పాటించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి, దివంగత సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధి ఉక్కు మహిళ. బాంగ్లాదేశ్ విమోచన సందర్భంగా ఇందిరాగాంధిని దుర్గగా సంబోధించారు. బాంగ్లాదేశంపై యుద్ధం సమయంలో పాకిస్తాన్కు చెందిన 90 వేల మంది సైనికులను అరెస్ట్ చేశారు. ఇందిరాగాధీ ధీమంతమైన నాయకురాలిగా పేరుగాంచారు. దేశానికీ కీర్తి ప్రతిష్ఠిలు తెచ్చినట్లు సిద్ధరామయ్య వివరించారు. పేదల కోసం 20 సూత్రాలను అమలు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం ఇందిరాగాంధి నేతృత్వంలో నెహ్రు, వల్లబాయి పటేల్, సుభాష్ చంద్రబోస్లతో కలిసి పోరాటం చేశారన్నారు. తప్పు ఒప్పుకున్న సుజాత భట్ బనశంకరి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనన్యభట్ అదృశ్యం కేసు దర్యాప్తును సిట్ అధికారులు పూర్తి చేశారు. కుమార్తె ధర్మస్థలలో కనబడలేదని సుజాత భట్ ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులకు అబద్ధమని రుజువైంది. సిట్ అధికారుల విచారణలో సుజాతభట్ అబద్ధం చెప్పినట్లు ఒప్పుకోవడంతో కేసు దర్యాప్తు పూర్తి చేశారు. సుజాతభట్ ఫిర్యాదును క్లియర్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. అంతిమంగా సుజాతభట్ ధర్మస్థల కేసుకు సంబంధించి తల పుర్రె గ్యాంగ్తో చేరడంపై తీవ్ర పశ్చాత్తాపం చెందింది. ఇతరుల మాటలు విని తమ జీవితం నాశనం చేసుకోవడం ఇష్టం లేదని, దీనిపై ధర్మస్థల వీరేంద్రహెగ్డే వద్ద క్షమాపణ కోరతానని తెలిపింది. ఈ విషయంలో మహేశ్శెట్టి తిమరోడి, గిరీశ్ మట్టణ్ణవర్తో పాటు ఇతరులతో ప్రస్తుతానికి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. -
పరిహారం మహోప్రభో
శివాజీనగర: అత్యాచారం, లైంగిక వేధింపులు, అమాయకుల హత్య, యాసిడ్ దాడులు, ఇతరత్రా తీవ్ర నేరాలకు గురైన బాధితులు ప్రభుత్వం నుంచి సహాయం అందక కుమిలిపోతున్నారు. వీరికి, బాధిత కుటుంబాలకు సత్వరమే పరిహార సొమ్ము మంజూరు చేయాలని రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. పై నేరాల్లో బాధిత మహిళలకు, బాలికలకు కర్ణాటక బాధిత పరిహార పథకం–2011 కింద న్యాయ సేవల ప్రాధికార ద్వారా పరిహారం అందుతోంది. 982 మంది నిరీక్షణ లైంగిక దాడులే కాకుండా, వర్గపోరు గొడవల్లో మృతులకు గరిష్ఠంగా రూ.10 లక్షలు, ఇతర గొడవల్లో 80 శాతం అంగవైకల్యం అయినవారికి రూ.3 లక్షలు పరిహారం ఇవ్వాలని రెండేళ్ల కిందట జత చేశారు. బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, హత్యలకు గరిష్టంగా రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని సవరణ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసింది, అందులో 276 మంది బాధితులకు సొమ్ము ఇచ్చారు, ఇది చాలా తక్కువే. గత 3 సంవత్సరాల్లో బకాయిపడిన 982 మంది బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి రూ.35.61 కోట్లు అవసరముంది. అందుచేత ఈ సొమ్మును మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రాధికార కోరుతోంది. పోక్సో కేసులే ఎక్కువ రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో పోక్సో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 3 సంవత్సరాల్లో 13,719 పోక్సో కేసులు రావడం బాలలపై పెరుగుతోన్న లైంగిక హింసకు అద్దం పడుతోంది. ఇందులో 80 శాతం కేసుల్లో బాలికల బంధువులు, పరిచయస్తులే నిందితులుగా ఉన్నారు. ఇటీవలి కాలంలో ఫిర్యాదు చేసేవారి సంఖ్య అధికమైందని ప్రాధికార అధికారి ఒకరు తెలిపారు. అందువల్ల కేసులు పెరిగి, పరిహార మొత్తం కూడా ఎక్కువవుతోందని చెప్పారు. 2023కు ముందు సంవత్సరానికి సుమారు 300 కేసులు పరిష్కారమై ప్రాధికారకు పరిహారం కోసం దరఖాస్తులు వచ్చాయి. అయితే గత 2 సంవత్సరాల్లో ఈ సంఖ్య 3 రెట్లు పెరిగింది. గత నెలాఖరుకు 650 కు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. సర్కారు ఏటా రూ.10 కోట్లు మాత్రమే ఇస్తోంది. ఇది చాలడం లేదు, అందుకే మరిన్ని నిధులు కావాలని సర్కారుకు నివేదికను పంపినట్లు చెప్పారు. పురుషులకూ లభిస్తుంది మహిళలకే కాదు, పురుషులకు కూడా పరిహారం లభిస్తుంది. అమాయకులు దాడుల్లో అంగ వైకల్యానికి, హత్యకు గురైతే కుటుంబీకులు పరిహారం పొందవచ్చు. వయసును బట్టి పరిహార మొత్తం ఉంటుంది. మృతులు 40 సంవత్సరాలు పైబడినవారైతే రూ.3 లక్షలు ఇస్తారు. వయసు పెరిగే కొద్దీ పరిహారం తగ్గుతుంది. యాసిడ్ దాడికి గురైతే రూ.3 లక్షల సాయం లభిస్తుంది. కొండలా బకాయిలు ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో రూ.46.75 కోట్లను విడుదల చేసింది. అంటే ఏటా రూ.10 కోట్ల కంటే తక్కువే. కొండలా బకాయిలు ఉండడంతో రూ.35 కోట్ల నిధులు కోరుతూ ప్రభుత్వానికి ప్రాధికార లేఖ రాసింది. పరిహారం కోసం బాధితులు,వారి కుటుంబ సభ్యుల నుంచి ప్రాధికార మీద ఒత్తిడి పెరుగుతోంది. నిధులు వచ్చిన తక్షణమే 982 కేసుల్లో పరిహారం అందజేస్తామని న్యాయ సేవల ప్రాధికార కార్యదర్శి హెచ్.శశిధర్శెట్టి తెలిపారు. లైంగికదాడులు, వేధింపుల బాధితుల మొర అరకొరగానే సాయం పంపిణీ వేలాదిమంది ఎదురుచూపులు రూ.35 కోట్లు కావాలని సర్కారుకు న్యాయ సేవల ప్రాధికార నివేదిక -
బళ్లారిలో ట్రాఫిక్ అస్తవ్యస్తం
సాక్షి బళ్లారి: నగరంలో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. రాయల్ సర్కిల్, బసవేశ్వర నగర్ కాలనీలోని ప్రధాన రహదారి, కోలాచలం కాంపౌండ్ రోడ్డు, ఎస్వీ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ఆరు నెలల క్రితం అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఓ వైపు అభివృద్ధి పనులు ఊపందుకున్నా.. ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. రోడ్డు వెడల్పు, డ్రైనేజీ పనులు, సీసీ రోడ్లు వేయడానికి సంబంధిత యంత్రాలతో రోడ్లు తవ్వడం, తదితర చర్యలు చేపట్టడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అభివృద్ది పనులు చేపట్టడం మంచిదే.. కానీ ట్రాఫిక్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని నగర వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. -
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
కెలమంగలం: అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపేందుకు వెళ్లిన వృద్ధుడిపై ఒంటి ఏనుగు దాడి చేసి చంపిన ఘటన డెంకణీకోట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. డెంకణీకోట సమీపంలోని తావరకెరె గ్రామానికి చెందిన రైతు క్రిష్ణప్ప (65) గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఓ గొర్రె అటవీ ప్రాంతం లోపలికి వెళ్లడంతో వెతుక్కుంటూ వెళ్లాడు. ఈ సమయంలో పొదలో దాగి ఉన్న ఒంటి ఏనుగు క్రిష్ణప్పపై దాడి చేసి దారుణంగా చంపేసింది. స్థానికులు డెంకణీకోట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్రిష్ణప్ప మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఏనుగు దాడిలో రైతు మృతి చెందడంతో ఆవేశానికి గురైన స్థానిక ప్రజలు అటవీ శాఖాధికారుల తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు. అటవీ ప్రాంత గ్రామాల్లో ఏనుగుల దాడులను నివారించాలని డిమాండ్ చేస్తున్నా అధికార్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. పంటలు ధ్వంసం కావడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. డీఎస్పీ ఆనంద్రాజ్, పోలీసులు ఆందోళనకారులతో చర్చించారు. -
ప్రథమ చికిత్సపై అవగాహన అవసరం
బళ్లారి రూరల్: ప్రథమ చికిత్సపై యువ రెడ్క్రాస్ సభ్యులందరికీ అవగాహన ఉండాలని రాష్ట్ర రెడ్క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షుడు భాస్కర్రావు తెలిపారు. గురువారం వీఎస్కేయూ అంబేడ్కర్ సభా భవన్లో యువ రెడ్క్రాస్ సొసైటీ సభ్యులకు ప్రథమ చికిత్సపై జాగృతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ.. అంతర్జాతీయ రెడ్క్రాస్ సొసైటీకి నాలుగు సార్లు నోబెల్ శాంతి పురష్కారం దక్కిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో రెడ్క్రాస్ సొసైటీ బ్రాంచ్లు ఉన్నట్లు వెల్లడించారు. మానవీయ విలువలను విశ్వానికి తెలియజేయడమే రెడ్క్రాస్ సొసైటీ ప్రధాన లక్ష్యమన్నారు. విషమ పరిస్థితుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం రెడ్క్రాస్ శిక్షణతో సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సద్యోజాతప్ప ఎస్.బళ్లారి రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి ఎం.ఎ.షకీబ్, రాష్ట్ర కార్యదర్శి ఉమాకాంత్, విశ్వవిద్యాలయ రెడ్క్రాస్ సొసైటీ ప్రముఖుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో రైళ్లకు అంతరాయం
● వేలాది ప్రయాణికుల సతమతం ● పర్పుల్, గ్రీన్ లైన్లలో సాంకేతిక లోపాలు శివాజీనగర: బెంగళూరు మెట్రో రైలు వ్యవస్థలో పలు రైళ్లు నిలిచిపోయి తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో పర్సుల్ లైన్ (నేరేడు మార్గం) లో విజయనగర– హొసహళ్లి మార్గంలో దీపాంజలి నగర మెట్రో స్టేషన్లో ఓ రైలు సుమారు 40 నిమిషాల పాటు మొరాయించింది. దీనివల్ల ఇటు చల్లఘట్ట నుంచి అటు వైట్ఫీల్డ్ వరకు ఈ మార్గంలోని ఇతర స్టేషన్ల నుంచి వచ్చి పోయే రైళ్లకు ఇబ్బంది ఏర్పడి గొలుసుకట్టు సమస్య నెలకొంది. ఎక్కడెక్కడ అంతరాయం.. విజయనగర– హొసహళ్ళి నేరేడు మార్గంలో ఉదయం 9.15 గంటలకు ఓ రైలు ఉన్నపళంగా నిలిచిపోయింది. దీంతో మెజిస్టిక్, చల్లఘట్ట మధ్య నేరేడు మార్గంలో రైలు సేవలు మొత్తం స్తంభించాయి. గ్రీన్ మార్గంలో కూడా రైళ్లను తగ్గించారు. కొన్ని గంటలపాటు రైళ్లు ఎందుకు నిలిచిపోయాయో, ఎలా గమ్యం చేరాలో తెలియక వేలాది ప్రయాణికులు దిక్కులు చూశారు. తాము గంటల కొద్దీ స్టేషన్లలోనే చిక్కుకున్నట్లు సోషల్ మీడియాలో ఆక్రోశం వ్యక్తంచేశారు. నేరేడు మార్గంలో మైసూరు రోడ్డు వరకు ఉదయం 10.15 నుంచి సర్వీసులను పునరుద్ధరించారు. ప్రయాణికుల ఆవేదన కాడుగోడికి వెళ్తుండగా సడన్గా మా రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఓ అర్ధగంట తరువాత రైలును విజయనగర స్టేషన్కు మళ్లించారు, మమ్మల్ని దిగిపోవాలని సిబ్బంది ఆదేశించారు, ఎందుకిలా చేశారో తెలియదు అని అనేకమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ఆరోపించారు. ఏం జరుగుతోందో మాకు చెప్పలేదు, చాలామంది భయాందోళనలకు గురయ్యమని తెలిపారు. కబ్బన్ పార్క్ నుంచి ఎంజీ రోడ్డు మధ్యలో ఓ రైలు నిలిచిపోయింది, 40 నిమిషాలు రైల్లోనే ఇరుక్కుపోయాం అని ఓ ప్రయాణికుడు ఎక్స్లో తెలిపాడు. మరో రైలు.. కొన్ని నిమిషాల తేడాలో విజయనగర స్టేషన్లో కూడా మరో రైలు యాంత్రిక లోపంలో నిలిచిపోయింది. అర్ధగంట అయినా కూడా సమస్యలను మెట్రో సిబ్బంది పరిష్కరించలేకపోయారు. ఉదయం పీక్ అవర్లో వేలాది ప్రయాణికులు స్టేషన్లలోనే వేచిచూస్తూ అవస్థలుపడ్డారు. అసౌకర్యానికి చింతిస్తున్నామని బీఎంఆర్సీఎల్ అధికారులు తెలిపారు. -
ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్
హొసపేటె: యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి, అలాగే వారికి మరింతగా విజ్ఞానాన్ని పెంపొందించడానికి సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడుతాయని టీబీ డ్యాం పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ మనోహర్లాల్ జీన్గర్ తెలిపారు. గురువారం పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మొత్తంగా 50 పైగా సమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. సైన్స్ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు నగరంలోని పలు ప్రైవేట్ పాఠశాలల నుంచి బాలబాలికలు తరలివచ్చారు. భౌతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్స్ శాఖ నుంచి అత్యవసర సమయాల్లో ఉపయోగించే సెన్సార్ ఆధారిత నీటి స్ప్రింకర్లు పియానో, ఆటోమేటిక్ డస్ట్బిన్, కూలర్, సౌరవ్యవస్థ నమూనాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ మనోహర్లాల్ జీన్గర్ మాట్లాడుతూ.. విద్యార్థులు నూతన పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాష్, రాజశేఖర్, అబ్తాబ్, ఆసియా సుల్తాన్, దీపిక, అనుపమా, గులాం ముస్తాఫా, అంజలి, రమిజా, సునీత, సంగమ, అభిషేక్, నిఖిత, రాహుల్, తదితరులు పాల్గొన్నారు. -
అవార్డులకు సాహితీవేత్త అగ్గి
● సర్కారుపై తీవ్ర నిరసన మాలూరు: కోలారు జిల్లాలో హృదయ విదారక సంఘటన జరిగింది. సీనియర్ సాహితీవేత్త హరిహర ప్రియ గతంలో గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు, అప్పుడు చాలా డబ్బులు ఖర్చయ్యాయి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఆవేదనతో హరిహర ప్రియ తనకు వచ్చిన అవార్డులను దగ్ధం చేసి ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. మాలూరు గ్రీన్ సిటి కాలేజ్ సమీపంలో పుస్తకమనె అనే నివాసంలో హరిహర ప్రియ నివసిస్తున్నారు. గతేడాది గుండెపోటు వచ్చి బెంగుళూరులోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. తనకు వైద్యం ఖర్చులు అందించాలని హరిహరప్రియ ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు విన్నవించారు. కానీ ఎలాంటి స్పందన లేదని వాపోయారు. అరణ్య రోదనే అయ్యింది. గురువారం తన అవార్డులను రోడ్డుపై వేసి కాల్చివేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. -
అక్రమ బియ్యం పట్టివేత
రాయచూరు రూరల్: క్రీడాకారుల హాస్టల్లో అక్రమంగా నిల్వ ఉంచిన బియాన్ని అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. యాదగిరి జిల్లా క్రీడాంగణంలో బుధవారం సాయంత్రం యాదగరి నగరసభ అధ్యక్షురాలు లలితా అనపూరే ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. నల్ల బజారులో విక్రయించే ఆహర పదార్థలను తెచ్చి హాస్టల్ విద్యార్థులకు భోజనం వడ్డించడంపై పౌర సరఫరాల శాఖ అధికారిని పిలిచి ఆరా తీయించారు. బాల, బాలికలకు ప్రత్యేక గదులు లేకపోవడంతో వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో అక్రమ బియ్యం నిల్వ ఉండటంతో అధికారులను మందలించారు. యాదగిరి జిల్లాలో అక్రమ బియ్యంపై సీఐడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గురుమిఠకల్ తాలుకాలో అక్రమ బియ్యం పట్టివేతపై విచారణ జరుగుతోందని వివరించారు. బియ్యాన్ని పాలిష్ చేసి వాటిని ఏజెన్సీల ద్వారా హాస్టల్కు సరఫరా చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. అన్నభాగ్య బియ్యం సరఫరా చేసినట్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కన్నకూతురిలా చూసుకుని కోట్ల ఆస్తిని రాసిస్తే..
శివాజీనగర: కేర్ టేకర్గా వచ్చినామెకు కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తి రాసిచ్చి కన్న కూతురులా చూసుకున్నా కూడా యజమాని ఇంటికి కన్నం వేసిన యువతి కటకటాలు లెక్కిస్తోంది. మంగళ (32) అరెస్ట్ అయిన నిందితురాలు. జల్సాలు, ప్రియుడు, ఆన్లైన్ బెట్టింగ్ల మోజులో పడి పనిచేసే ఇంటిలో బంగారు నగలను కాజేసింది. బెంగళూరు జే.పీ.నగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. జేపీ నగర రెండో స్టేజ్లో నివాసమున్న ఆశా జాదవ్ అనే మహిళ తమ తల్లిని చూసుకోవటానికి 15 సంవత్సరాల క్రితం మంగళ అనే యువతిని నియమించుకుంది. రూ.కోట్ల ఇళ్లు మంగళ పేరిట జే.పీ.నగరలో కోట్లాది ఆస్తులు కలిగిన ఆశా జాదవ్, మంగళను స్వంత కుమార్తెలా చూసుకునేవారు. అంతేకాకుండా ఒకటిన్నర కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లును మంగళా పేరుకు రాసిచ్చారు. త్వరలో పెళ్లి చేయాలని కూడా అనుకుంది. కానీ మంగళ పెడతోవ పట్టింది, ప్రియునితో కలిసి జల్సాలు చేసేది, పబ్లకు వెళ్లేది, ఇలా రూ.40 లక్షల వరకూ అప్పులు చేసినట్లు చెప్పడంతో ఆశా జాదవ్ పెద్దమనసుతో చెల్లించింది. అంతేకాకుండగా రూ. 5 కోట్ల విలువ చేసే నివాసమున్న ఇంటిని కూడా మంగళ కు రాసిచ్చింది. జల్సాల కోసం మొదట రాసిచ్చిన ఇంటిని మంగళ అమ్మేసింది. ఇటీవల ఆశాకు చెందిన 450 గ్రాముల బంగారం, 3 కే.జీల వెండిని చోరీ చేసింది. ఎవరో దొంగలు చేసి ఉంటారని ఆశా పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ సాగించారు. చివరకు మంగళను అరెస్టు చేసి ఆ బంగారం, వెండిని స్వాధీనం చేసుకొన్నారు. నిందితురాలిని జైలుకు తరలించారు. పనిచేసే ఇంటిలోనే బంగారం చోరీ నిందితురాలు మంగళకు కటకటాలు -
భర్త హత్యకు భార్య కుట్ర
మైసూరు: దోపిడీ సన్నివేశాన్ని సృష్టించి భర్తను హత్య చేయడానికి స్కెచ్ వేసిన భార్య, మరో ముగ్గురి ఉదంతం మైసూరు జిల్లా నంజనగూడులో జరిగింది. ఓ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ సంగీత, ఈమె సోదరుడు సంజయ్, ఇతని స్నేహితుడు విఘ్నేష్, మరో మైనర్ని పోలీసులు అరెస్టు చేశారు.కారులో వచ్చి అడ్డగించి..వివరాలు.. సంగీత భర్త రాజేంద్ర, ఇతడు ఇళ్లకు ఫైబర్ తలుపులను అమర్చే పని చేసేవాడు, భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండురోజుల కిందట రాజేంద్ర భార్యను స్కూటర్లో హుండివినకెరె లేఔట్లో ఉన్న ముడా లేఔట్ వద్దకు వెళ్తుండగా ఓ తెల్ల కారు వారిని అడ్డగించింది. కారులోని వ్యక్తి రాజేంద్ర, సంగీతలను కిందపడేసి గొడవకు దిగారు. మరో ఇద్దరు సంగీత మెడలో ఉన్న బంగారం చైన్ను లాక్కోబోయారు. అలాగే పెద్ద కత్తితో రాజేంద్రపైన దాడి చేశారు. ఇంతలో మరో వాహనం రావడంతో దుండుగులు భయపడి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రాజేంద్ర ఫిర్యాదు మేరకు నంజనగూడు పోలీసులు విచారణ చేపట్టారు. పలుచోట్ల సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. సంగీతనే తమను హత్య చేయాలని పురమాయించిందని విచారణలో నోరు విప్పారు. దీంతో నిందితులతో పాటు సంగీతని అరెస్టు చేశారు. -
యోగ, ధ్యానంతో మానసిక ఆరోగ్య వృద్ధి
హుబ్లీ: యోగ, ధ్యానం సాధనతో మానసిక ఆరోగ్య వృద్ధి సాధ్యపడుతుందని ప్రధాన సీనియర్ సివిల్ న్యాయమూర్తి పరశురామ దొడ్డమణి తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో జిల్లా మానసిక ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినం, అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ యోగభ్యాసం, ధ్యానం, ఒత్తిడి లేని జీవనశైలి అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ఎల్లప్పుడు సానుకూల ధృక్పథం అలవర్చుకోవాలన్నారు. దూర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబం, మిత్రులతో ఎక్కువ సమయం గడపటం ద్వారా సంతోషంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో డీహెచ్ సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య రాయచూరు రూరల్: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. గురుమిఠకల్ తాలుకా వడవాటి శివ కుమార్ (30) నాలుగు ఎకరాల భూమిలో పత్తి సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం నీటిలో మునిగిపోయింది. పత్తి సాగుకు రూ.6 లక్షలకు పైగా అప్పులు చేయడంతో మనోవేదనకు గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గంలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరణ్ణ దోడ్డమని తెలిపారు. పరిశోధనలపై దృష్టి సారించాలిహుబ్లీ: పారిశ్రామిక రంగంలో అవసరాలకు అనుగుణంగా సాంకేతిక శిక్షణ నైపుణ్యంతో కూడిన మానవ వనరులను సిద్ధం చేయాల్సిన అవసరం చాలా ఉందని కర్ణాటక విశ్వవిద్యాలయం విజ్ఞాన విభాగం డీన్ ప్రొఫెసర్ అరవింద మూలిమని తెలిపారు. గురువారం కర్ణాటక విశ్వవిద్యాలయం ఖనిజ శాస్త్రం అధ్యయన విభాగం సహకారంతో ప్రధానమంత్రి శిక్ష అభియాన ద్వారా మూడు రోజుల జాతీయ స్థాయి అధ్యాపకుల పునచేతన శిబిరం, బాలకృష్ణన్ ఎండోమెంట్ కోర్సును ప్రారంభించారు. కువెంపు విశ్వవిద్యాలయం గణిత శాస్త్రం అధ్యయన విభాగం ముఖ్యులు ప్రొఫెసర్ బీజీ గిరిశ మాట్లాడుతూ.. గణిత శాస్త్రం విద్యార్థులు పరిశోధన మనోభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఆ వర్సిటీ సిండెకేట్ సభ్యుడు రాబట్ గద్దాపురి మాట్లాడుతూ.. సమయానికి తగు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అధ్యాయనంలో నిరంతరం శ్రమించాలన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పత్తి మిల్లుకు నిప్పు ● రూ.లక్షల్లో ఆస్తి నష్టం బళ్లారి టౌన్: నగరంలోని ఇండస్ట్రియల్ ఏరియా రెండవ స్టేజ్లో వెంకటేష్కు చెందిన దీప్తి కాటన్ మిల్లుకు గురువారం ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకుంది. రూ.లక్షల విలువైన పత్తి కాలిపోయింది. మధ్యాహ్నం సమయంలో పత్తిని అన్లోడ్ చేస్తుండగా విద్యుత్ సర్క్యూట్ వల్ల నిప్పు అంటుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక దళాలకు ఫోన్ చేయడంతో హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనపై స్థానిక ఏపీఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొత్త భవనంలో వికాస్ సౌహార్థ కో–ఆపరేటివ్ బ్యాంక్ సేవలు హొసపేటె: హోస్పేట్ కేంద్రంగా పని చేస్తున్న వికాస్ సౌహార్థ కో–ఆపరేటివ్ బ్యాంక్ సర్దార్ పటేల్ మెయిన్ రోడ్డులోని నాలుగు అంతస్తుల భవనంలో కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఆ బ్యాంక్ అధ్యక్షుడు విశ్వనాథ్ హిరేమట్ తెలిపారు. నవంబర్ 1న ఉదయం 9:30 గంటలకు కొత్త భవనంలో సేవలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. కొట్టూరు బసవలింగ మహాస్వామీజీ, కొప్పల్ గవి మఠానికి చెందిన అభినవ గవిసిద్దేశ్వర మహాస్వామిజీ, వి సాప్ట్కు చెందిన మూర్తి వీరగంటి, గోద్రేష్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పెర్సీ మాస్టర్ బహదూర్ హాజరవుతారన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ సలహాదారు విజే కులకర్ణి, సీనియర్ డైరెక్టర్లు ఛాయా దివాకర్, రమేష్ పురోహిత్, ఎం.వెంకప్ప, కే.వికాస్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న హిరేమట్ పాల్గొన్నారు. -
పీడీఓ సస్పెన్షన్ ఎత్తివేత
రాయచూరు రూరల్: రాష్ట్రీయ స్వయం సేవక్ పథ సంచలనంలో పాల్గొన్నారనే కారణంతో లింగ సూగురు తాలుకా రోడలబండ పీడీఓ పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఏకపక్ష నిర్ణయాలతో పీడీఓను సస్పెండ్ చేయడాన్ని మైసూరు ఎంపీ తేజస్వి సూర్య ఖండించారు. కర్నాటక పరిపాలన ట్రిబ్యూనల్లో పిటీషన్ వేశారు. విచారణ చేపట్టిన కేఏటీ ప్రవీణ్ కుమార్ను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యోత్సవ అవార్డుల ప్రకటనపై హర్షం హుబ్లీ: ప్రస్తుత కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 70 మందికి రాజ్యోత్సవ అవార్డులు ప్రకటించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీరంగ ఆల్ రౌండర్గా ఎదిగిన ప్రకాష్ రాజ్కు అవార్డు రావడంపై జిల్లా ప్రముఖులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర కర్ణాటకలోని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులకు రాజ్యోత్సవ ప్రశక్తులను ప్రకటించారు. కొప్పళ జానపద కళాకారుడు బసవప్ప బరమప్ప చౌడి, అలాగే బెళగావి సన్నింగప్ప సత్తప్ప ముసేన్నగోళ, చిత్రదుర్గ హనుమంతప్ప మారెప్ప, విజయపుర సోమన్న దుండప్పకు జానపద రంగానికి సంబంధించి అవార్డులు ప్రకటించారు. ఇక సంగీత రంగంలో కృషి చేసిన కోప్పళ దేవేంద్ర కుమార్ పత్తార్, బీదర్ మడివాళయ్య సాలికి అవార్డులు ప్రకటించారు. విద్యార్థుల సంఖ్య పెంచాలి హొసపేటె: పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరింత పెంచాలని టీబీ డ్యాం ప్రభుత్వ పీయూ కాలేజీ ఉపాధ్యాయురాలు, సముదాయదత్త వీక్షకరాలు శ్రీలత తెలిపారు. గురువారం టీబీ డ్యాం పీఎల్సీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సముదాయ దత్త కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యాబోధన చేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా పెంచేందుకు నిరంతరంగా శ్రమించాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, రవి, హేమలత, మంజుల, శారద పాల్గొన్నారు. నేడు గురుపాదేశ్వరుడి పుణ్యారాధన రాయచూరు రూరల్: నగరంలోని కిల్లే బ్రహన్మఠంలో శుక్రవారం గురుపాదేశ్వరుడి పుణ్యారాధన కార్యక్రమం చేపట్టనున్నారు. మఠాధిపతి శాంతమల్ల శివాచార్య ఆధ్వర్యంలో గురుపాదేశ్వర మూల విరాట్కు అభిషేకం,పుష్పార్చన, కుంకుమార్చన, మంగళ హారతి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరాధనలో భాళే హోన్నురు రంబాపుర పీఠాధిపతి జగుద్గరు ప్రసన్న రేణుక వీర సోమేశ్వర రాజ దేశీ కేంద్ర శివాచార్యులు పాల్గొంటారన్నారు. పులి దాడిలో యువకుడికి గాయాలు రాయచూరు రూరల్: పులి దాడిలో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం చిక్క హెసరూరు–పామన కల్లూరు గ్రామాల మధ్య చోటుచేసుకుంది. వివరాలు.. పామన కల్లూరుకు గ్రామానికి చెందిన యువకుడు రవికుమార్ పత్తి పొలంలో పత్తి విడిపించేందుకు వెళ్లాడు. యువకుడు పని చేస్తుండగా ఒక్కసారిగా పులి దాడి చేసింది. గాయపడిన రవికుమార్ వెంటనే చెట్టుపైకి ఎక్కి కూర్చొన్నాడు. అయితే అక్కడి నుంచి కిందపడటంతో గాయాలయ్యాయి. ప్రజలు పెద్దగా కేకలు వేయడంతో పులి అడవిలోకి పారిపోయింది. గాయపడిన యువకుడిని చికిత్సల నిమిత్తం లింగసూగురు ఆస్పత్రికి తరలించారు. బొలెరో బోల్తా రాయచూరు రూరల్: పత్తి లోడుతో బయలుదేరిన బొలెరో పొలం గట్టు దాటే క్రమంలో బోల్తా పడింది. గురువారం రాయచూరు తాలుకా గారలదిన్నిలో జరిగిన ఘటనలో డ్రైవర్ నరసింహ (33) గాయాలపాలయ్యాడు. పొలం గట్టు ఎక్కే క్రమంలో బొలెరో అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. -
టిప్పర్ ఢీ.. కారు దగ్ధం
● వ్యక్తి సజీవ దహనం మండ్య: ఇన్నోవా కారును టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టిన ప్రమాదంలో మంటలు రేగి కారు కాలిపోయింది, అందులోని వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణం తాలూకాలోని పి.హొసహళ్ళి వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ఘోరం జరిగింది. హుణసూరుకు చెందిన చంద్రశేఖర్ (30) అనే వ్యక్తి.. పనిమీద బయటకు వెళ్లి కేఆర్ఎస్ మార్గంలో తిరిగి హుణసూరుకు వెళ్తున్నాడు. ఘటనాస్థలిలో టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు బాగం నుజ్జు నుజ్జు కావడంతో పాటు మంటలు అంటుకుంది. డీజిల్ ట్యాంకు పేలి క్షణాల్లో అగ్నికీలలు చుట్టుముట్టాయి. కారులో చిక్కుకున్న చంద్రశేఖర్ బయటకు రాలేకపోయాడు. డ్రైవర్ టిప్పర్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. పుర్రె గ్యాంగ్ యూటర్న్● ధర్మస్థలపై తమ ఫిర్యాదును కొట్టివేయాలని హైకోర్టుకు శివాజీనగర: ధర్మస్థల చుట్టుపక్కల వందలాది శవాలను పూడ్చిపెట్టారనే కేసులో చేసిన ఫిర్యాదును రద్దు చేయాలని హైకోర్టులో పుర్రె గ్యాంగ్ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. ధర్మస్థలలో వందలాది యువతులు, మహిళల మీద అఘాయిత్యాలు చేసి హత్యలు చేసి పాతిపెట్టారని చిన్నయ్య అలియాస్ చెన్నయ్య గతంలో జిల్లా ఎస్పీకి, జడ్జికి ఫిర్యాదు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం సిట్తో విచారణ జరిపించడం తెలిసిందే. ఇందులో చిన్నయ్య, మరికొందరి ఆరోపణలు అవాస్తవాలని, సంచలనాల కోసం ఆరోపణలు చేశారని సిట్ తేల్చింది. ఇప్పుడు చిన్నయ్య జైలులో ఉన్నాడు. కేసు తమ మెడకే చుట్టుకోవడంతో అసలు ఫిర్యాదునే కొట్టివేయాలని కోర్టుకెక్కినట్లు భావిస్తున్నారు. మహేశ్ శెట్టి తిమరోడి, జయంత్, గిరీశ్ మట్టణ్ణవర్, విఠల్గౌడ హైకోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ధర్మస్థళ క్షేత్రం మీద బురద చల్లిన వీరందరూ ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉమాశ్రీకి రాజ్కుమార్ అవార్డుసాక్షి, బెంగళూరు: 2019 ఏడాదికి గాను దివంగత డాక్టర్ రాజ్కుమార్ అవార్డు శాండల్వుడ్ సీనియర్ నటి ఉమాశ్రీని వరించింది. గురువారం రాజ్కుమార్ అవార్డు, పుట్టణ్ణ కణగాల్ అవార్డు, డాక్టర్ విష్ణువర్ధన్ అవార్డు, చలనచిత్ర సాహిత్య వార్షిక అవార్డుతో పాటు అత్యుత్తమ షార్ట్ఫిల్మ్ అవార్డుకు విజేతలను కన్నడ సంస్కృతి, వార్తా ఇలాఖ ప్రకటించింది. ఉమాశ్రీకి అవార్డు కింద రూ. 5 లక్షల నగదు, 50 గ్రాముల బంగారు పతకాన్ని అందిస్తారు. నంజుండేగౌడకు పుట్టణ్ణ ప్రశస్తి ● పుట్టణ్ణ కణ్ణగాల్ అవార్డుకు దర్శకుడు ఎన్ఆర్ నంజుండేగౌడను ఎంపిక చేశారు. ఈ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు, 50 గ్రాముల బంగారు పతకం అందించనున్నారు. ● డాక్టర్ విష్ణు వర్ధన్ అవార్డుకు నిర్మాత, దర్శకుడు రిచర్డ్ క్యాస్టలినో ఎంపిక అయ్యారు. ఈ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు, 50 గ్రాముల బంగారు పతకం అందించనున్నారు. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. చెట్టుకు వ్యాన్ ఢీ.. ముగ్గురు మృతి● శివమొగ్గ వద్ద ప్రమాదం శివమొగ్గ: శివమొగ్గ, శికారిపుర తాలూకాలో జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. శివమొగ్గ నగరానికి దగ్గరిలో గొంది చట్నహళ్ళి వద్ద గురువారం తెల్లవారుజామున గూడ్స్ వ్యాన్ చెట్టును ఢీకొట్టింది, అందులో ప్రయాణిస్తున్న అసాదుల్లా (50), సాదిక్ (30), ఫిరోజ్ (22) గాయాలతో మరణించారు. అసాదుల్లా దావణగెరెకు, మిగతావారు ఉత్తరప్రదేశ్కు చెందినవారు. లారీ– బైక్ ఢీ.. శికారిపుర తాలూకాలోని సుణ్నదకొప్ప గ్రామం వద్ద బైకును లారీ ఢీకొట్టింది. బైక్లో వెళ్తున్న పునీత్ (22) దుర్మరణం చెందగా, రాజీవ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు. -
తుపాను ప్రభావం.. పంటలు నాశనం
సాక్షి బళ్లారి: ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు బాగా కురవడంతో పాటు తుంగభద్ర డ్యాంకు ఎగువన భారీ వర్షాలు కురవడంతో డ్యాంలోకి జూన్ నెలాఖరు కల్లా తగినంత నీరు రావడంతో పాటు జూలైలోనే కాలువలకు నీటిని విడుదల చేయడంతో తుంగభద్ర ఆయకట్టు రైతులు ఉత్సాహంగా పంటలను సాగు చేశారు. ఆయకట్టు పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర నాలుగు జిల్లాల్లో దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి, మిర్చి, పత్తి, మొక్క జొన్న, జొన్న, కొర్రలు, సాములు తదితర పంటలను విస్తారంగా సాగు చేశారు. తమకు అనుకూలమైన పంటలను రైతులు సాగు చేసిన నేపథ్యంలో అష్టకష్టాలతో లక్షలాది రూపాయలను పెట్టుబడి పెట్టి పంటలను కాపాడుకుంటూ వచ్చారు. మూడు నెలలుగా పంటలకు సోకిన తెగుళ్లను నివారిస్తూ కలుపు మొక్కలను తొలగించి చంటి బిడ్డల్లా పెంచి తీతా పంట చేతికి అందే సమయంలో గత 15 రోజుల నుంచి వివిధ రకాలుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు, తుఫాను ప్రభావం, చలి గాలులు వీస్తుండటంతో ఆయకట్టు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గోరుచుట్టుపై రోకటి పోటులా వర్షాలు వరి గింజలు బాగా పట్టి మరో 15–20 రోజుల్లో కోతలు జరుగుతాయని ఆశిస్తున్న రైతాంగానికి గోరుచుట్టుపై రోకటి పోటులా వర్షాలు వెంటాడుతుండటంతో వరి నేల మీద వాలిపోతూ గింజలు నేల రాలుతున్నాయి. దీంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు చేతికి అందే సరికి వరుణుడు, వాతావరణ ప్రభావం పంటలపై పడుతుండటంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వరి రైతులే కాకుండా మిర్చి, మొక్క జొన్న రైతుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. గత మూడేళ్లుగా మిర్చి పంటను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఈసారి ఒక వైపు తెగుళ్లు వెంటాడుతుండటం వల్ల మరో వైపు వాతావరణ ప్రభావం వల్ల కూడా మిర్చి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. రోజు మార్చి రోజు మందులు కొడుతున్నా మిర్చికి తెగుళ్లు పోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొంతా తుఫాన్ ప్రభావం తగ్గినప్పటికీ ఈదురు గాలులు కొనసాగుతూ రోగాలు వెంటాడుతుండటంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవుడిపైనే పంట రక్షణ భారం పంట చేతికొచ్చే వేళ మొంథా ప్రతాపంతో ఈదురు గాలులు, వర్షాలు నేలవాలుతున్న పంటలతో రైతన్నల్లో ఆందోళనతుంగభద్ర ఆయకట్టు పరిధిలో లక్షలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలు ప్రతి రైతన్న పంట చేతికి అందుతుందో లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఆయకట్టు పరిధిలో రబీ పంట వేసుకోకూడదని ఇప్పటికే ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఖరీఫ్లో సాగు చేసిన పంటలను ఎలా దక్కించుకోవాలోనని దేవుడిపైనే భారం వేస్తున్నారు. తుంగభద్ర డ్యాంలో 33 గేట్లలో గత ఏడాది ఒక గేటు కొట్టుకొని పోయిన నేపథ్యంలో మిగిలిన అన్ని గేట్లను మరమ్మతులు, కొత్తగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో రబీకి హాలిడే ప్రకటించి నాలుగు నెలల్లో తుంగభద్ర గేట్లన్నింటిని మార్చాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో దాదాపు రబీ పంట దాదాపు లేనట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ప్రస్తుతం ఖరీఫ్లో సాగు చేసిన పంటలను దక్కించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈసందర్భంగా పలువురు రైతులు సాక్షితో మాట్లాడుతూ ఆయకట్టు పరిధిలో ఖరీఫ్లో సాగు చేసిన పంటలకు వర్షం ప్రభావంతో భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అంతేగాక రబీలో కూడా క్రాఫ్ హాలిడే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆయకట్టు రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారంతో పాటు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. -
బురదమయంగా పాఠశాల ఆవరణ
హుబ్లీ: పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో.. మధ్య కర్ణాటకలో వివిధ రంగాల్లో దూసుకుపోతున్న దావణగెరె జిల్లా జగళూరు తాలూకా హనుమంతపుర పాఠశాల ఆవరణం కుండపోత వానతో మురుగు నీరు యథేచ్ఛగా జొరబడి బురదమయంగా మారడంతో ఆ మురుగు నీటిలో రాలేక విద్యార్థులు స్కూలుకు డుమ్మా కొట్టారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న విద్యార్థుల హాజరు సంఖ్యకు అనుగుణంగా హెచ్ఎం సుజాత రెడ్డితో పాటు నలుగురు టీచర్లు, ఓ అతిథి ఉపాధ్యాయిని ఉన్నారు. 143 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో వసతులు ఫర్వాలేదు. వానలు ఎక్కువగా కురిస్తే ఆవరణం జలమయం కావడమే కాకుండా ఇరుగుపొరుగు మురుగు నీరు చేరుకోవడంతో విద్యార్థులు నడవటానికి కూడా కష్టకరంగా మారింది. దోమల రాజ్యం, గడ్డి ఇతర చెత్త చెదారం కూడా తక్కువేమీ లేదు. ఈ అస్తవ్యస్తాన్ని సరి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భూగర్భ జలం అధికం కావడంతో గత రెండేళ్ల నుంచి బోరుబావుల్లో నీరు ఉప్పొంగుతోంది. మొత్తానికి మరుగుదొడ్లు, పాఠశాల గదులు దుస్థితిలో ఉండగా. పైకప్పు కారుతోంది. ఈ విషయంపై అధికారులకు ఎంత మొర పెట్టుకున్నా స్పందించలేదని విద్యార్థులు వాపోయారు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు కాస్త కరుణ చూపి పాఠశాల ఆవరణ బాగు చేసి విద్యార్థులు భవితవ్యానికి బాటలు వేయాలని ప్రజలు కోరుతున్నారు. వద్దు బాబోయ్ అంటూ స్కూల్ మానేసిన పలువురు విద్యార్థులు దావణగెరె జిల్లా జగళూరు తాలూకా హనుమంతపురలో ఘటన -
పురుగుల బియ్యం శుభ్రం
రాయచూరు రూరల్ : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద అందించే ఆహార పదార్థాలకు పురుగులు పట్టాయి. దీంతో ఆ బియ్యాన్ని శుభ్రం చేయడానికి ఉపాధ్యాయులు నడుం బిగించిన ఘటన బుధవారం యాదగిరి తాలూకా అరకేర(కె)లో జరిగింది. 20 రోజుల పాటు దీపావళి పండుగతో పాటు కుల గణన సమీక్షలో పాల్గొనడంతో స్టోర్ రూంలో నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలకు పురుగులు పట్టడంతో శుభ్రం చేసే యంత్రం ద్వారా బియ్యాన్ని శుభ్రం చేశారు. ఏడు క్వింటాళ్ల బియ్యం, ఆరు క్వింటాళ్ల గోధుమలు, క్వింటాల్ కంది పప్పులను శుభ్ర పరిచినట్లు ప్రధానోపాధ్యాయుడు చంద్ర నాయక్ తెలిపారు. ఉపాధ్యాయులు సాబణ్ణ, కాశప్ప, రేణుక, నరసమ్మ, విద్యాశ్రీ, అనురాధ, భీమా బాయి స్వంత ఖర్చుతో యంత్రాన్ని తెచ్చి వాటిని శుభ్రం చేయించారన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు కళాశాల విద్య నాంది రాయచూరు రూరల్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కళాశాల విద్య నాంది కావాలని రాయచూరు డీఎస్పీ శాంతవీర పేర్కొన్నారు. బుధవారం సేట్ చున్నీలాల్ అమర్చంద్ బోహర న్యాయ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యా శాఖలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు పిల్లల సంక్షేమ కోసం పాటుపడాలన్నారు. ప్రతిభకు తార్కాణంగా విద్యార్థుల భవిష్యత్తును రూపొందించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు తార్కాణం కావాలన్నారు. -
అంగన్వాడీ కార్యకర్తలకు పెన్షన్ ఇవ్వాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు పింఛన్ నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. 2011 నుంచి 2023 వరకు పదవీ విరమణ చేసిన 10,311 మంది అంగన్వాడీ కార్యకర్తలకు, 11,980 మంది సహాయకులకు కలిపి మొత్తం రూ.183 కోట్లు ఆర్ధిక శాఖ నుంచి విడుదల చేయించడంలో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. ప్రావిడెంట్ ఫండ్, గ్రాచ్యుటీ, జనరల్ ప్రావిడెంట్ పంఢ్లను పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో నర్మద, గంగమ్మ, మహాలక్ష్మి, శకుంతల, జయలక్ష్మి, నరసమ్మ, పార్వతి, వీరేష్, శరణ బసవలున్నారు. -
యోగా, ధ్యానంతో మానసిక ఆరోగ్యం
హొసపేటె: శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం అని, యోగా, ధ్యానం ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చీఫ్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సుబ్రహ్మణ్య అన్నారు. బుధవారం మాతా శిశు ఆస్పత్రి ఆవరణలోని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి కార్యాలయ హాలులో నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేసి ఒత్తిడి లేని జీవనశైలిని అవలంబించాలన్నారు. ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించడం, చెడు అలవాట్లు లేని కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మానసిక ఆనందం పెరుగుతుందన్నారు. ఇంట్లో తయారు చేసిన ఆహారం తినడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. అసమతుల్య ఆహారంతో శరీరంలో జడత్వం పెరుగుతుందన్నారు. శారీరక ఆరోగ్యాన్ని కోల్పోతే మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు. సివిల్ జడ్జి ప్రశాంత్ నాగలాపూర్ తదితరులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి పర్యటన జయప్రదం చేయండి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో 74 చెరువులకు నీరు నింపే ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య నవంబర్ 9వ తేదీన వస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా చేపట్టి విజయవంతం చేయాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి సూచించారు. బుధవారం విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాలూకా స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ప్రాథమిక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి 30 వేల మందికి పైగా ప్రజలు చేరే అవకాశం ఉందన్నారు. పోలీస్ శాఖ దృఢ సంకల్పంతో బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. ఎంపీ తుకారాం, ఎమ్మెల్యే శ్రీనివాస్, ఎస్పీ జాహ్నవి పాల్గొన్నారు. అంత్యక్రియలకు ఆపసోపాలే.! రాయచూరు రూరల్ : గ్రామంలో మనిషి చనిపోతే అంత్యక్రియలు జరపడానికి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం సిరవార తాలూకా మల్లటలో శఽవసంస్కారానికి ప్రజలు నానా పాట్లు పడ్డారు. గ్రామంలో దళిత వ్యక్తి మృతి చెందడంతో శవ సంస్కారం కోసం కిలోమీటర్ల దూరం చొప్పున మృతదేహాన్ని మోసుకొని వాగులో గుండా నడిచి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. -
అక్రమ మద్యం అమ్మకాలు అరికట్టండి
హొసపేటె: విజయనగర జిల్లా గ్రామీణ ప్రాంతంలో అక్రమ మద్యం అమ్మకాలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ మధ్య నిషేధ ఆందోళన సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లాధికారిణి కవిత ఎస్. మన్నికేరికి వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం నేత శైనాజ్ మాట్లాడుతూ ఇటీవల గ్రామీణ భాగంలో విచ్చలవిడిగా చిన్న చిన్న బంక్లు, పాన్ దుకాణాల్లో అక్రమంగా మద్యం బాటిల్స్ను అమ్ముతున్నారని తెలిపారు. అక్రమ మద్యం బాటిల్స్లను అమ్మడం ద్వారా గ్రామీణ భాగంలో యువత తాగుడుకు బానిసలుగా తయారయ్యారన్నారు. అదే విధంగా రోజు రోజుకు తాగుబోతుల సంఖ్య పెరుగుతోందన్నారు. వెంటనే గ్రామీణ భాగంలో అక్రమ మద్య వ్యాపారాన్ని అరికట్టాలన్నారు. సంఘం నేతలు మంజమ్మ, అక్కమహాదేవి, రేఖ, నారాయణ, నింగమ్మ, సుధ, యల్లమ్మ, దుర్గమ్మ, శృతి తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నివారణకు జాగృతి అవసరం
రాయచూరు రూరల్: నేరాల నివారణకు జనజాగృతి అవసరమని ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. బుధవారం ఎస్పీ కార్యాలయం వద్ద మారథాన్ జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఇంటింటికీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు జాగృతి కల్గించి మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్ఎస్ సహాయవాణి 112, 1930 నంబర్ల వినియోగం ద్వారా ప్రజలు సహకరించాలన్నారు. వల్లభాయి పటేల్ జీవితం ఆదర్శప్రాయం రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో విద్యార్థులు పురాతన కాలం నాటి మహానుభావుల జీవిత చరిత్రలను తెలుసుకోవాలని ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. బుధవారం టాగూర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ స్మారక పోటీలను ప్రారంభించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయి పటేల్ ఉక్కు మనిషి అని కొనియాడారు. ఆయన ధైర్య సాహసాలను విద్యార్థులు జీవితంలో అలవర్చుకోవాలన్నారు. పెరుగుతున్న జనాభా ఆధారంగా దోపిడీలు, అత్యాచారాలు, చోరీలు వంటి దుర్ఘటనలు జరగకుండా నిఘా ఉంచడానికి నగరంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శాంతవీర, సీఐ మేకా నాగరాజు, ఎస్ఐ మంజునాథ్లున్నారు. విజయపురలో భూకంపం సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో మళ్లీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున విజయపుర జిల్లాలో పలు గ్రామాల్లో రిక్టర్ స్కేల్పై 3.0 పాయింట్లతో భూమి కంపించడంతో జనం భయాందోళన చెంది పరుగులు తీశారు. ఈ జిల్లాలో పదే పదే భూమి కంపిస్తుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 11 సార్లు భూకంపం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. దీంతో భూకంపం వచ్చిన ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రోడ్లలో గోతులున్నాయి జాగ్రత్త.! రాయచూరు రూరల్ : గత రెండేళ్ల నుంచి జిల్లాలోని నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లలో పడిన గుంతలను మరమ్మతులు చేయడానికి, గుంతలు పూడ్చడానికి నిధుల కొరత ఏర్పడడంతో ప్రజా పనుల శాఖ అధికారులు రోడ్లలో గుంతలు అధికంగా ఉన్నాయి. వాహన చోదకులు జాగ్రత్తగా సంచరించాలని హెచ్చరిక బోర్డు వేసి సూచించడం ఆశ్చర్యం కల్గించింది. రాష్ట్ర సర్కార్ పంచ గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడస్తున్నా అభివృద్ధి పనులకు నిధుల లేమితో ప్రజలు సంచరించే రోడ్లలో పడిన గోతులను మరమ్మతు చేయడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రాకపోవడంపై ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. -
నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
సాక్షి,బళ్లారి: నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి సన్నిహితుడు, కాంట్రాక్టర్ సతీష్రెడ్డి నుంచి తనకు ప్రాణభయం ఉందని, మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ఆప్తసహాయకుడు, ముఖ్య అనుచరుడుగా గుర్తింపు పొందిన అలీఖాన్ ఎస్పీ శోభారాణికి ఫిర్యాదు చేశారు. బుధవారం ఆయన బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ తదితరులతో కలిసి ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు సతీష్రెడ్డి ఫోన్లో సంభాషించుకున్న ఆడియోను కూడా అందజేశారు. వివరాలు.. అలీఖాన్ మాటల్లో తాను బెంగళూరులోని వసంతనగర్ కార్యాలయంలో ఉన్నప్పుడు తనకు బాగా తెలిసిన యాళ్పి బాషా అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. అప్పుడు ఫోన్ రిసీవ్ చేయడానికి సమయం లేకపోవడంతో మళ్లీ కాల్ చేయగా ఆ వ్యక్తి మరొక వ్యక్తి(సతీష్రెడ్డి) మాట్లాడతారని చెప్పారన్నారు. ఫోన్లో నానా దుర్భాషలాడారు తాను వెంటనే హలో అనడంతో ఉన్నఫళంగా తెలుగులో పత్రికల్లో రాయలేని భాషను ఉపయోగించి, నానా బూతులు తిట్టారని తెలిపారు. బళ్లారికి వస్తే నీ అంతు చూస్తానని బెదిరించారన్నారు. తాను కూడా అదే భాషలో మాట్లాడానని, తనకు ప్రాణభయం ఉందని వివరించారు. తనకు పరిచయం ఉన్న వ్యక్తి కదా అని ఫోన్ రిసీవ్ చేశానని, మళ్లీ కాన్ఫరెన్స్ కాల్లో 9513333339 నంబరు నుంచి ఫోన్ చేసి తనను బూతులు తిట్టారన్నారు. రాజకీయంగా పలుకుబడి కలిగి ఉన్నారని, ఆయన మాట తీరు చూస్తుంటే తనను ఏ క్షణంలోనైనా ఏమైనా చేయవచ్చనే భయం ఉందని, తనకు రక్షణ కల్పించాలని, తన ప్రాణాలకు ఏమైనా జరిగితే వారే బాధ్యులని తెలిపారు. సతీష్రెడ్డితో తనకు పరిచయం కూడా లేదని, ఆయన ముఖం కూడా చూడలేదని తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు బెదిరేది లేదని, చట్టపరంగా పోరాడేందుకు వీలుగా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. నగరంలో శాంతిని కాపాడాలి – మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా ఉన్న బళ్లారిలో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నించకూడదన్నారు. అలీఖాన్ తమ బీజేపీ కార్యకర్త. ఆయనకు పార్టీ అండగా ఉంటుందన్నారు. అలీఖాన్ను ఫోన్ ద్వారా సతీష్రెడ్డి నానా బూతులు తిట్టి, బెదిరించారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. శాంతియుతంగా ఉన్న బళ్లారిలో అశాంతి రేకెత్తించడం ఎంత మాత్రం సహించలేనిదన్నారు. మేము భయపడేది లేదు – మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ మాట్లాడుతూ ఇప్పటికే వ్యాపారులతో పాటు పలువురిని బెదిరించారన్నారు. బెదిరిస్తే భయపడతారని, ఇష్టారాజ్యంగా పాలన చేయవచ్చని భావిస్తున్నారన్నారు. గాలి జనార్దనరెడ్డి ఆప్త సహాయకుడినే బెదిరిస్తే నగరంలో అందరూ భయపడతారని అనుకుంటున్నారని మండిపడ్డారు. తమకు ఎవరి భయం లేదన్నారు. అలాంటి వారి వ్యక్తిత్వం తెలుస్తుందనే ఉద్దేశ్యంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కార్పొరేటర్ మోత్కూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి పీఏ అలీఖాన్ ఎమ్మెల్యే సన్నిహితుడు సతీష్రెడ్డిపై ఫిర్యాదు ఫోన్ ద్వారా పత్రికల్లో రాయలేని భాషతో తిట్టారు బీజేపీ నేతలతో కలిసి ఎస్పీకి విన్నవించిన వైనం నగరంలో చర్చనీయాంశమైన ఫోన్ సంభాషణ -
వివాదాల సొరంగ మార్గం
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగరంలో నిర్మించతలపెట్టిన బృహత్ సొరంగ మార్గం రహదారి పథకం వివాదాలకు కేరాఫ్గా మారింది. ఈ పథకం వద్దే వద్దని ప్రతిపక్ష బీజేపీ నేతలు హఠం చేస్తున్నారు. సొరంగ రోడ్డు నిర్మాణం లాల్బాగ్ ఉద్యానవనం కిందుగా వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. ఈ మలుపును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మాణం చేస్తామని అధికార పక్షం హామీనిస్తోంది. భూమి లోపలే పనులు చాలావరకు భూమి లోపలే సొరంగ మార్గం నిర్మాణం జరుగుతుంది, కొన్ని చోట్ల మాత్రం భూమి పైన పనులు సాగుతాయని అధికారులు తెలిపారు. భూమిపై ఉన్న కట్టడాలు, ఉద్యానవనాలు, రోడ్లు ఇలా వేటికీ ఇబ్బంది రాదని అన్నారు. లాల్బాగ్ పార్కుకు ఎలాంటి హాని కలగదని చెప్పారు. లాల్బాగ్ కింద వందల అడుగుల పొడవులో మాత్రమే సొరంగ దారి వెళుతుందని, అందువల్ల ఎలాంటి ముప్పు కలగదని అన్నారు. లాల్బాగ్ లోపల ప్రాంతంలో నిర్మాణ యంత్రోపకరణాలను ఉంచేందుకు ఒక ఎకరా స్థలాన్ని మాత్రమే ఉపయోగిస్తామని, పనులు ముగిసిన తర్వాత మళ్లీ ఆ ఎకరా స్థలాన్ని యథావిధిగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం హామీనిస్తోంది. లాల్బాగ్కు గుదిబండ ఈ సొరంగ నిర్మాణంపై కేవలం ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా పౌర సంఘాలు, పర్యావరణ ప్రేమికులు, లాల్బాగ్లో వాకింగ్ చేసే నగరవాసులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. లాల్బాగ్ అడుగున బండలను తొలుచుకుంటూ సొరంగం సాగితే పార్కు ఛిన్నాభిన్నం అవుతుందని కొందరు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు సాగడం సరికాదని అన్నారు. ఈ ప్రాజెక్టు కార్లు ఉన్న వారికే ఉపయోగపడుతుంది కానీ సామాన్య, మధ్యతరగతి వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని అన్నారు. వద్దంటున్న ఎంపీ తేజస్వి కార్ల రహదారికి వేలాది కోట్లాది రూపాయలు వ్యర్థం చేయడం అవసరమా అంటూ నగర సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య మండిపడ్డారు. ఆయన మొదటి నుంచీ ఈ ప్రాజెక్టు అంటే మండిపడుతున్నారు. నటుడు ప్రకాశ్ బెళవాడి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసును ఎంపీ తేజస్వీ సూర్య లాయర్గా వాదించనున్నారు. చారిత్రక లాల్బాగ్ ఉద్యానవనంలో ఎన్నో చెట్లకు హాని జరుగుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. సొరంగ మార్గం నమూనా నిర్మాణ మార్గం మ్యాప్ బెంగళూరులో సిల్క్బోర్డు నుంచి హెబ్బాళ వరకు.. 18 కిలోమీటర్లు భూమిలో టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు లాల్బాగ్ పార్కు కింద నుంచి వెళ్లనున్న సొరంగం బీజేపీ సహా పలువురి వ్యతిరేకత ఎవరొచ్చినా ఆపేది లేదు: డీసీఎం సొరంగ నిర్మాణం కారణంగా 90 నిమిషాల ప్రయాణం 20–25 నిమిషాల్లో పూర్తవుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఇది కనుక సాకారమైతే ప్రపంచస్థాయి సొరంగ మార్గాల్లో బెంగళూరు చేరుతుందని చెబుతోంది. సొరంగం పనులు ఆపడం ఎవరి తరం కాదు.. ఆపితే ఆ దేవుడు మాత్రమే ఆపాలి.. ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు ఎవరూ వ్యతిరేకించినా ప్రజలకు ఉపయోగపడే ఈ సొరంగం పనులు ఆపే ప్రసక్తే లేదు అని నగరాభివృద్ధి మంత్రి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? హెబ్బాళ నుంచి నేషనల్ సిల్క్ బోర్డు ఇన్స్టిట్యూట్ జంక్షన్ వరకు సొరంగ రోడ్డు నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. బెంగళూరు నడిబొడ్డున ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ పథకం అవసరమని చెబుతోంది. ఉత్తరం నుంచి దక్షిణానికి కలిపే ఈ మార్గం సుమారు 18 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సిల్క్ బోర్డు నుంచి హెబ్బాళ వరకూ నిర్మాణమవుతుంది. ఈ సొరంగ దారిలో కార్లు మాత్రమే ప్రయాణిస్తాయని సర్కారు తెలిపింది. -
ఆర్ఎస్ఎస్కు హైకోర్టులో ఊరట
బనశంకరి: ఈ నెలలో రాష్ట్రంతో పాటు దేశంలో తీవ్ర చర్చ రేకెత్తించిన అంశం ఏదైనా ఉందా అంటే ఆర్ఎస్ఎస్ను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కట్టడి చేయడమే. మొట్టమొదట ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి ప్రియాంక్ ఖర్గే.. పబ్లిక్ ప్లేసుల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని సీఎం సిద్దరామయ్యకు లేఖ రాయడంతో అలజడి ఆరంభమైంది. తరువాత సీఎం ఆ లేఖ ప్రకారం నిబంధలను తీసుకొచ్చారు. సంఘ్ ర్యాలీ జరపాలంటే రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అనుమతులు తీసుకోవాలని పలురకాల నిబంధనలను ప్రకటించడంతో చిచ్చు రేగింది. దీనికి విరుద్ధంగా పలువురు సంఘ్ నాయకులు హైకోర్టులో ధార్వాడ బెంచ్లో కేసులు వేశారు. ఈ విచారణ ఇదివరకే రెండుసార్లు జరిగి తీర్పు రిజర్వు అయ్యింది. మంగళవారం హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న.. ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ స్టేతో రాష్ట్ర ప్రభుత్వానికి భంగపాటు ఎదురైంది. ఈ పోరాటంలో సంఘ్దే పైచేయిగా నిలిచింది. రాజ్యాంగ విరుద్ధం... 10 మంది కంటే ఎక్కువమంది చేరి రోడ్లు, పార్కులు, మైదానాలు, చెరువులు మొదలైన ప్రదేశాల్లో కవాతు నిర్వహించరాదని సర్కారు ఇటీవల ప్రకటించింది. ఇది అక్రమమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పలు ఉదాహరణతో వాదించారు. రాజ్యాంగానికే విరుద్ధమని అన్నారు. హక్కును కాలరాయొద్దు: న్యాయమూర్తి రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రభుత్వం కాలరాయరాదని జడ్జి పేర్కొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కు ను ప్రభుత్వం ఒక్క ఆదేశంతో లాక్కోవడం సాధ్యం కాదని పేర్కొంటూ మధ్యంతర స్టేని జారీచేశారు. ఈ సమయంలో వాదనలకు ఒకరోజు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ వకీళ్లు కోరగా, మీకు నోటీస్ ఇస్తాము, అప్పుడు వాదించండి అని స్పష్టంచేసి వాయిదా వేశారు. అప్పీల్ చేస్తాం: సీఎం హైకోర్టు ఆదేశాలను ప్రశ్నిస్తూ అప్పీల్ చేస్తామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. విధానసౌధలో విలేకరులతో సిద్దరామయ్య మాట్లాడుతూ స్టే తొలగింపునకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ ఈ తీర్పు తమకు వ్యతిరేకం కాదని, ద్విసభ్య ధర్మాసనానికి అప్పీల్ చేస్తామని చెప్పారు. హైకోర్టు ర్యాలీలపై విధించిన ఆంక్షల మీద స్టే జారీ సిద్దరామయ్య సర్కారుకు ముఖభంగం -
డ్రగ్స్ దందా మీకు తెలుసు, దానిని అరికట్టాలి
శివాజీనగర: డ్రగ్స్ విముక్త కర్ణాటక ప్రకటనగానే మిగిలిపోకుండా పటిష్టంగా అమలు చేయడానికి పోలీసులు అంకితభావంతో పని చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. డ్రగ్స్ విముక్త కర్ణాటక నా లక్ష్యం. ఇది మీ లక్ష్యం కూడా కావాలి అన్నారు. మంగళవారం విధానసౌధలో రాష్ట్ర పోలీసు కానిస్టేబుళ్లకు కొత్త క్యాప్ను అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాదక ద్రవ్య వ్యతిరేక కార్యచరణ ప్రారంభం, సన్మిత్ర కార్యపథకం డైరీనీ విడుదల చేశారు. డ్రగ్స్ దందా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులకు తెలిసే ఉంటుంది. దానిని అంతం చేసేందుకు శ్రమించాలని సూచించారు. డ్రగ్స్ ఎవరు తెస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు అనేది మీకు తెలిసే ఉంటుంది. ఈ దందాను నిర్మూలించాలన్నారు. మత్తు భూతానికి మన యువశక్తి, విద్యార్థులు బలి కాకూడదన్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో అదుపు చేశాం దక్షణ కన్నడ జిల్లాలో మత ఘర్షణలు, మోరల్ పోలీసింగ్ కార్యకలాపాలు అధికమయ్యాయి, గతంలో ఉన్న అధికారులు నియంత్రించలేదు. ఇద్దరు అధికారులను బదిలీ చేశాం, ఇప్పుడు జిల్లా నియంత్రణలో ఉంది అని సీఎం అన్నారు. మీరు సాధన చేస్తే కర్ణాటక పోలీస్ ఘనత అంతర్జాతీయ స్థాయికి చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి జీ.పరమేశ్వర్, సీఎస్ శాలిని రజనీశ్, డీజీపీ ఎం.ఏ.సలీం, ఐపీఎస్లు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు పాత స్లోజ్ టోపీలకు బదులు నీలి రంగు పీక్ క్యాప్లలో కనిపిస్తారు. పోలీసులకు సీఎం సిద్దు పిలుపు కానిస్టేబుళ్లకు కొత్త క్యాప్ల పంపిణీ -
మంత్రి జమీర్.. జొన్నల పంచాయతీ
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం సమీపంలో పెరేసంద్ర గ్రామంలో జొన్నల వ్యాపారి రామక్రిష్ణప్ప హైదరాబాద్లోని అబ్దుల్ రజాక్, అక్బర్ బాషా, నసీర్ అనే దళారులకు జొన్నల లోడ్ లను పంపారు, సుమారు రూ. 1.89 కోట్లను వారు రామక్రిష్ణప్పకు చెల్లించాలి. అయితే డబ్బులు ఇవ్వడం లేదు, బాధితుడు పేరేసంద్ర ఠాణాలో ఫిర్యాదు చేయగా, సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్రెడ్డి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో ఉంటున్న అక్బర్ను ఠాణాకు పిలుచుకుని వచ్చారు. సెటిల్ చేసుకుంటారులే కథ ఇక్కడే మలుపు తిరిగింది. వ్యాపారిని సీఐ విచారణ చేస్తున్నారు. ఈ సమయంలో గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ఖాన్ ఆఫీసు నుంచి సహాయకుడు లక్ష్మినారాయణ ఠాణాకు కాల్ చేసి, మంత్రి మీతో మాట్లాడతారని ఫోన్ను మంత్రికి ఇచ్చారు, అప్పుడు మంత్రి జమీర్ అహ్మద్ సీన్లోకి వచ్చారు, సమస్తే బ్రదర్, మన బంధువు హైదరాబాద్ లో ఉంటున్న అక్బర్ ని ఇక్కడ ఎవరికో డబ్బులు ఇవ్వాలని పిలుచుకు వచ్చారట, ఏమి కేసు అది? అని అన్నారు. అప్పుడు ఎస్ఐ జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ జొన్నల వ్యాపాకి డబ్బులు ఇవ్వాలి, అన్ని రికార్డులు ఉన్నాయి, వారి పైన ఎఫ్ఐఆర్ అయింది, అందుకోసం వారిని పిలుచుకు వచ్చాము అన్నారు. తరువాత మంత్రి మాట్లాడుతూ అది అంత మొత్తం కాదు, కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటారట, మేము ఆ పని చేస్తాము, మీరు వారిని వదిలిపెట్టండి అని సూచించారు. మంత్రి జొన్నల పంచాయతీ ఆడియో వైరల్ అయింది. బాధితుడు రామక్రిష్ణప్ప మాట్లాడుతు రైతులకు సహాయం చేయవలసిన మంత్రి ఇలా చేస్తే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నాకు కూర్చుంటామని తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తికి వత్తాసు వదిలేయాలని ఎస్ఐకి ఫోన్ రైతుకు రూ.1.89 కోట్ల బాకీ పడిన నిందితులు -
వాకర్ అడ్డువచ్చి.. ఇద్దరు బలి
దొడ్డబళ్లాపురం: రోడ్డు మీద ఇష్టానుసారం వాకింగ్ చేయడం, వాహనాల అతి వేగం రెండు జీవితాలను బలి తీసుకుంది. హిట్ అండ్ రన్కు ఇద్దరు యువకులు బలైన సంఘటన దొడ్డ తాలూకా రామయ్యనపాళ్య వద్ద జరిగింది. దొడ్డ తాలూకా తూబుగెరె గ్రామానికి చెందిన నందన్ (22), రవికుమార్ (24) దొడ్డబళ్లాపురం–దేవనహళ్లి మార్గంలో ఉన్న ఎల్ అండ్ టీ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఇద్దరూ బైక్పై ఫ్యాక్టరీకి బయలుదేరారు. దారి మధ్యలో రామయ్యనపాళ్య వద్ద వాకింగ్ చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా అడ్డురావడంతో అతడిని తప్పించబోయి అదుపుతప్పి కిందపడిపోయారు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన అపరిచిత వాహనం వారిద్దరిపై దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన యువకులు అక్కడే మరణించారు. అపరిచిత వాహనం పరారైంది. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆపద్బాంధవులు కాపాడారు దొడ్డబళ్లాపురం: ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలోకి పడిన చిన్నారిని ఆపద్భాంధవుల్లా యువకులు కాపాడిన సంఘటన దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాల తాలూకా దేరళకట్టె గ్రామంలో జరిగింది. వివరాలు.. ఆదివారం సాయంత్రం గురుప్రసాద్ అనే వ్యక్తి కుమార్తె రెండున్నరేళ్ల హిమాని ఇంటి ముందు ఆడుకుంటూ అక్కడే ఉండే 15 అడుగుల లోతుగల బావిలోకి పడిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన బాలిక చిన్నాన్న జీవన్ బావిలోకి తాడు వదిలాడు, అతని స్నేహితులు వివేక్, ధనుంజయ్ కూడా కలిసి పాపను కాపాడారు. సమయస్ఫూర్తితో రక్షించారంటూ గ్రామస్తులు అభినందించారు. ప్రైవేటు బస్సులో రూ.కోటి సీజ్ యశవంతపుర: గోవా నుంచి బెంగళూరుకు అక్రమంగా ప్రైవేట్ బస్సులో కోటి రూపాయలను తరలిస్తుండగా ఉత్తర కన్నడ జిల్లా కారవార–గోవా సరిహద్దులోని మజాళి చెక్పోస్ట్లో పోలీసులు పట్టుకున్నారు. చెక్పోస్టులో పోలీసులు తనిఖీలు చేయగా గోనె సంచిలో దాచిన నోట్ల కట్టలు లభించాయి. బెంగళూరుకు చెందిన కల్లేశ, రాజస్థాన్కు చెందిన బమరరామ్లు ఈ డబ్బు తరలిస్తున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కల్లేశ, బరమరామ్లు గోవాలో ఓ వ్యక్తి నుంచి నగదు తీసుకొని బెంగళూరుకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. చిత్తాకుల పోలీసులు నగదు స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేశారు. మొబైల్ షోరూం దొంగల అరెస్టు యశవంతపుర: ప్రియురాలితో కలిసి ఐఫోన్ వంటి ఖరీదైన మొబైల్ఫోన్లు చోరీ చేస్తున్న ముగ్గురిని వర్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దివాస్ కమి, ఆరోహన్ థాపా, అస్మిత ను పోలీసులు అరెస్ట్ చేసి రూ.30 లక్షలు విలువగల 17 ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ కూడా నేపాల్, ఉత్తరాది ప్రాంతానికి చెందినవారు. ఉపాధి కోసం బెంగళూరుకు వలసవచ్చారు. అస్మిత భర్తను వదిలేసి ప్రియుడు దివాస్తో కలిసి ఆరు నెలల నుంచి వర్తూరులో ఉంటోంది. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు చేస్తున్నారు. దివాస్ స్నేహితుడు ఆరోహన్తో కలిసి పెద్ద పెద్ద షోరూంలకు కన్నం వేస్తున్నారు. వర్తూరు పరిధిలో ఒకే సంస్థకు చెందిన రెండు షోరూముల్లో ఒకేరోజు దొంగతనాలకు పాల్పడారు. చోరీ చేసిన మొబైళ్లను అస్మిత అమ్మేసింది. ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఎం మార్పు లేదు: హోంమంత్రి దొడ్డబళ్లాపురం: సీఎం సిద్దరామయ్యకు హోంమంత్రి పరమేశ్వర్ బాసటగా నిలిచారు. 5 ఏళ్లూ సిద్ధరామయ్యే సీఎంగా ఉంటారు, రెండున్నరేళ్లు మాత్రమే అని ఎవరూ చెప్పలేదని హోంమంత్రి అన్నారు. మంగళవారంనాడు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు అందరూ 5 ఏళ్లపాటు సిద్ధరామయ్య కుర్చీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ సమావేశంలో రెండేళ్లు, మూడేళ్లు అని తీర్మానం చేయలేదన్నారు. సీఎం విషయంలో హైకమాండ్ అంతిమ నిర్ణయం ప్రకటిస్తే మంచిదని అన్నారు. -
పోకిరీ డెలివరీ బాయ్
● బ్రెజిల్ మోడల్లతో అసభ్య ప్రవర్తన కృష్ణరాజపురం: బెంగళూరులో బస చేసిన బ్రెజిల్ మోడల్ భామలపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్లింకెట్ డెలివరీ బాయ్ని ఆర్టీ నగర పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బ్రెజిల్కు చెందిన ముగ్గురు మోడల్స్ సుల్తాన్పాళ్యలో నివసిస్తున్నారు. ఈ నెల 17న నిత్యావసరాలను ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. ఆర్డర్ డెలివరీకి వెళ్లిన డిప్లొమా ఇంజనీరింగ్ విద్యార్థి కుమార్.. వారిని చూడగానే అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సుందరాంగులు మండిపడడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటనపై మోడల్స్ తమ కంపెనీ యజమాని కార్తీక్కు తెలిపారు. ఆయన ఆర్టీనగర పోలీసు స్టేషన్కు ఫిర్యాదు చేశాడు. దీంతో కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గ్యాంగ్ రేప్ కేసులో మరొకరు.. దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని మాదనాయకనహళ్లిలో వివాహిత మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ముఖ్య నిందితుడిని అరెస్టు చేశారు. దీపావళి పండుగ రోజున గంగొండనహళ్లిలో పశ్చిమబెంగాల్ బ్యూటిషియన్ ఇంట్లోకి ఆరుమంది దుండగులు చొరబడి అత్యాచారం చేసి, ఆమె కుటుంబీకులను చితకబాది పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుమందిని అరెస్టు చేయగా ప్రముఖ నిందితుడు ఏ1 మిథున్ ఇప్పుడు దొరికాడు. నిందితుల్లో ఇద్దరు మైనర్ బాలలు ఉన్నారు. -
వ్యక్తి హత్య కేసులో నిందితుల అరెస్ట్
సాక్షిబళ్లారి: తాలూకాలోని అసుండి గ్రామ సమీపంలోని బైపాస్లో పాతకక్షలతో ఈ నెల 23వ తేదీ రాత్రి రవికుమార్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రవికుమార్ హత్యపై పీడీహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో జిల్లా ఎస్పీ, డీఎస్పీ ఆదేశాలతో రవికుమార్ను హత్య చేసిన అదే గ్రామానికి చెందిన దొడ్డహొన్నూర స్వామి, శేఖర్, దుబ్బ హొన్నూర స్వామి, దొడ్డ ఎర్రప్ప, నాగరాజ్, ఆటో ఎర్రిస్వామి, ప్రకాష్, సురేంద్ర, ప్రసాద్ హత్య చేసినట్లు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నలుగురిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. కాగా రవికుమార్ హత్య కేసులో పూర్తి న్యాయం చేయాలని, నిందితులు ఇంకా బయట ఉన్నారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్కుమార్ మోకా, బీజేపీ నాయకులు ఓబుళేశు తదితరులు జిల్లా ఎస్పీని కలిసి మనవి చేశారు. కొబ్బరి చెట్టెక్కి కూర్చొన్న దొంగ హుబ్లీ: దొంగ.. దొంగ.. పట్టుకోండి అంటూ ఆ గ్రామస్తులు వెంటపడటంతో సదరు దొంగ ఎటూ తప్పించుకొనే దారి లేక వెంట పడిన వారి బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈ అరుదైన, ఆసక్తి గల హైడ్రామా గదగ్లోని వివేకానంద నగర లేఔట్లో మంగళవారం సూర్యోదయాన చోటు చేసుకుంది. చోరీ ఆరోపణలపై స్థానికులు వెంటాడగా ఆ యువకుడు చెట్టు ఎక్కాడు. బసవరాజ్ షోలాపుర సుమారు 40 అడుగుల ఎత్తైన టెంకాయ చెట్టు పైకెక్కాడు. ఇతని స్వస్థలం బెళగావి జిల్లా కబ్బూరు కాగా తెల్లవారు జామున రైల్లో వచ్చి గదగ్లో దిగాడు. అనంతరం వివేకానంద లేఔట్లో ఓ ఇంటి తలుపు తట్టాడని చెబుతున్నారు. కంటి వైద్య పరీక్ష శిబిరంబళ్లారిఅర్బన్: స్థానిక కంటోన్మెంట్ లయన్స్ క్లబ్, అగర్వాల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జయరాం విద్యాలయంలో ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో సుమారు 200 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జి.శ్రీనివాస్రెడ్డి, జోనల్ చైర్ పర్సన్ రాజేష్, విద్యాలయం చైర్మన్ నిఖిలేశ్వర్, ప్రధానోపాధ్యాయిని అనగశ్రీ, అగర్వాల్ ఆస్పత్రి ప్రముఖులు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలుహుబ్లీ: కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే దేవుడి పరమార్థం అని దేశ్పాండే నగర్లోని సీఎస్ఐ ప్రార్థన మందిరం సీనియర్ రెవరెండ్ బోధకులు సురేష్ జాన్సన్ తెలిపారు. కేఎంసీ ఆస్పత్రిలో గత కొన్ని నెలలుగా మద్య వ్యసన విముక్తి కోసం చికిత్స పొందుతున్న వారు మందిరానికి వచ్చిన వేళ వారి కోసం ఉదయమే ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఆయన మాట్లాడుతూ యువకులు విలువైన జీవితాన్ని మద్యం తదితర చెడు అలవాట్లకు బానిసలుగా మారి బలి చేసుకోరాదన్నారు. ఏసు ప్రభువు శిష్యులైన పీటర్ తదితరుల అనుభవంతో కూడిన బోధనలను ఆయన వివరించారు. చెడు అలవాట్ల నుంచి శాశ్వతంగా విముక్తి చెందడంతో పాటు తమ విలువైన జీవితాన్ని సార్థకం చేసుకుని సామాజిక స్పృహతో మెలగాలని సూచించారు. సదరు మద్య వ్యసన పరుల తల్లిదండ్రుల ఆరోగ్యం, ఇతర విషయాల్లో బాగుండేలా ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నీటి కొలనులో చెప్పు● హంపీలో బడవిలింగ ఆలయం అపవిత్రం ● ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ● తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ హొసపేటె: ప్రపంచ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్న హంపీలోని బడవిలింగ ఆలయ పవిత్ర నీటి కొలనులో చెప్పు తేలుతున్నట్లు కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. పర్యాటకులుగా వచ్చిన గుర్తు తెలియని దుండగులు చెప్పు వదిలారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఆలయంలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయంలో ఇలాంటి సంఘటన జరగడం ఇది మూడో సారి. ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. స్థానికులు ఈ సంఘటనను పురావస్తు శాఖ దృష్టికి తెచ్చారు. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. రక్షిత స్మారక చిహ్నం అయినా పూజలు, ఇతర ఆచారాలు అక్కడ ప్రతి రోజూ నిర్వహిస్తారు. మనిషికి సంస్కారం ప్రధానంరాయచూరు రూరల్: సమాజంలో మనిషికి సంస్కారం ప్రధానమని సాయి మందిర్ చీఫ్ కిరణ్ అభిప్రాయ పడ్డారు. మంగళవారం నగరంలోని టాగూర్ కళాశాలలో టాగూర్– 2025 ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయ, ఆచార, విచారాలను బోధించడం మనందరి కర్తవ్యమని, వాటిని సద్వినియోగ పర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో వీరేంద్ర జాలదార్, పదాధికారులు డీ.నరేష్, మురళీధర్ కులకర్ణి, దానమ్మ, అంబరీష్ మేదర్, వసంత పతంగి, తుంగా హిరేమఠ్లున్నారు. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
సాక్షి, బళ్లారి: ముక్కుపచ్చలారని ఇద్దరు పసికందులను, ఆటలాడించి ఓదార్చి పెంచాల్సిన కన్నతల్లికి ఎంత పెద్ద కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ తల్లి తన పసికందులను ఉరి వేసి, తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన ఎందరినో కలిచివేసింది. కొప్పళ జిల్లా కుకనూరు సమీపంలోని బెణకల్లు గ్రామానికి చెందిన హనుమేష్ భజంత్రీ భార్య లక్ష్మవ్వ(30) అనే మహిళ తన ఇద్దరు పసికందులైన రమేష్(3), జాహ్నవి(1)లను ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసి చంపింది. అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చుట్టుపక్కల వారికి తెలియడంతో కుక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే జిల్లా ఎస్పీ అరసిద్ధి, కలబుర్గి డీఎస్పీ, స్థానిక పోలీసు అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కుకనూరు గ్రామంలో ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. కుటుంబ కలహాలతో లక్ష్మవ్వ ఆత్మహత్య చేసుకుందన్న ప్రాథమిక సమాచారంతో స్థానిక పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. కొప్పళ జిల్లా బెణకల్లులో తల్లీబిడ్డల బలవన్మరణం ముక్కుపచ్చలారని చిన్నారులను ఉరి వేసి చంపిన తల్లి ఆపై తానూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న వైనం -
చిత్తాపూర్లో కవాతుకు పోటాపోటీ
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా చిత్తాపూర్లో ఆర్ఎస్ఎస్ కవాతుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆర్ఎస్ఎస్తో పాటు మూడు సంఘాల నుంచి కలబుర్గి జిల్లాధికారి దరఖాస్తులు అందాయి. చిత్తాపూర్లో ఆర్ఎస్ఎస్, భీమ్ ఆర్మీ, కురుబ సమాజం, దళిత ప్యాంథర్ ఒకే రోజు నవంబర్ 2న కవాతుకు మూడింటికి అవకాశం ఇవ్వాలంటూ అర్జీలను జిల్లాధికారి ఫౌజియా తరన్నంకు విన్నవించారు. ఈ విషయంపై మంగళవారం కార్యాలయంలో జరిగిన సమావేశంలో అందరి వాదనలు విన్న అధికారులు దానికి సంబంధించిన నివేదికను కలబుర్గి హైకోర్టుకు సమర్పించనుంది. సమావేశంలో ఆర్ఎస్ఎస్ నేతలు కృష్ణాజీ జోషి, ప్రహ్లాద్, బీజేపీ ఉపాధ్య అంబారాయలున్నారు. మూడు సంఘాల నుంచి అర్జీల స్వీకారం -
ఆగని ఉపాధి వలసలు
సాక్షి బళ్లారి: ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలకులు మారుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీకి చెందిన వారైనా నిరుద్యోగ సమస్యలను తీరుస్తామని, పరిశ్రమలను నెలకొల్పుతామని ఒకటే హామీ గుప్పిస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి కాలం వెళ్లదీస్తున్నారు. ఇది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అయితేనేమి రెండూ దొందూ దొందుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఉత్తర, కల్యాణ కర్ణాటక పరిధిలో ఉద్యోగాలు, ఉపాధి కోసం విద్యావంతుల నుంచి కూలీకార్మికుల వరకు నిత్యం వలసలు వెళ్లడం పరిపాటిగా మారింది. పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారే కానీ ఆ దిశగా పూర్తిగా హామీలను నెరవేర్చకపోవడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించడం సమస్యగా మారింది. ఒక వేళ ఆయా జిల్లాల్లో ఉన్న పరిశ్రమలు స్థానికేతరులకే ఎక్కువ అవకాశాలు కల్పిస్తుండటంతో ఈ ప్రాంత వాసులకు నిరుద్యోగ సమస్య రోజురోజుకు జటిలమవుతోంది. బళ్లారి జిల్లాలో నెలకొన్న జిందాల్ సౌత్వెస్ట్(జేఎస్డబ్ల్యూ) స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతి పెద్ద ఉక్కు కర్మాగారం. దీంతో పాటు పలు చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఎన్నో ఉన్నాయి. నూతనంగా పరిశ్రమలను స్థాపించేందుకు వేలాది ఎకరాల భూసేకరణ కూడా జరిగింది. అయితే పరిశ్రమలు కనిపిస్తున్నాయే కానీ ఉపాధి లేకపోవడంతో వలసలు నిత్యం కృత్యమయ్యాయి. ఉత్తర కర్ణాటక పరిధిలోని కలబుర్గి, రాయచూరు, బెళగావి, కార్వార తదితర జిల్లాల్లో ఉపాధి అవకాశాలు లేక గోవా, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలసలు వెళుతుండటం కనిపిస్తోంది. బెళగావి జిల్లాలో దాదాపు వెయ్యికి పైగా చిన్న చిన్న పరిశ్రమలున్నాయి. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలున్నప్పటికీ వందలాది మంది యువకులు వలసలు వెళ్తున్నారు. కార్వార జిల్లా నుంచి సమీపంలోని గోవాకు వలసలు వెళ్లడం పరిపాటిగా మారింది. అక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేకపోవడంతో స్థానికులకు పెద్ద సమస్యగా మారింది. బెళగావి జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీలు విస్తారంగా ఉన్నాయి. చెరుకు పండించే రైతులకు అవకాశాలున్నప్పటికీ కూలీలకు అంతంత మాత్రమే ఉపాధి దొరుకుతోంది. మహారాష్ట్ర సరిహద్దులోని విజయపుర జిల్లాలో కూడా ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ పరిశ్రమలను స్థాపించేందుకు తగినంత భూమి, నీరు, విద్యుత్ సౌకర్యాలున్నప్పటికీ పరిశ్రమలను స్థాపించకపోవడంతో నిత్యం పుణె, ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. కలబుర్గి జిల్లాలో సిమెంటు ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ ఎక్కువగా స్థానికేతరులకు ఉపాధి అవకాశాలు ఉండగా, స్థానికులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని, దీంతో తాము వలసలు వెళ్లక తప్పడం లేదని కలబుర్గి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడు స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారే కానీ అనంతరం చేతులు ఎత్తేయడంతో పాలకులు కూడా పట్టించుకోకపోవడంతో ఇతర ప్రాంతాలకు పొట్టకూటి కోసం వలసలు వెళ్తున్నట్లు వాపోతున్నారు. పెట్టెబేడాతో వలస బాట పట్టిన విద్యావంతులు మూటాముల్లె సర్దుకొని వలస వెళుతున్న కార్మికులు సొంత ఊళ్ల నుంచి ఇతర చోట్లకు తరలుతున్న వైనం ఉన్న పరిశ్రమల్లో స్థానికేతరులకే ఎక్కువ అవకాశాలు విద్యావంతులకూ దొరకని ఉపాధి రాయచూరు జిల్లా కూడా ఇందుకు భిన్నమేమి కాదు. ఫ్యాక్టరీలు స్థాపించేందుకు అవకాశాలున్నప్పటికీ ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదని విమర్శలున్నాయి. రాయచూరు జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్కులను స్థాపించేందుకు అనుకూలమైన వాతావరణం కూడా ఉంది. అయితే ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై స్థానికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బళ్లారి జిల్లాలో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ, స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలు, జీన్స్ ఉత్పత్తి తదితర పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతున్నారే కానీ ఒక్క జీన్స్ ఉత్పత్తి రంగంలో మినహా జిందాల్ లాంటి స్టీల్ కంపెనీల్లో స్థానికేతరులకే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని పోరాటాలు కూడా జరుగుతున్నాయి. కాగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధాన ప్రభావంతో ఇంజినీరింగ్ పట్టభద్రులకు కూడా స్థానికంగా కంపెనీలు ఉపాధి కల్పనకు ముందుకు రాకపోవడంతో ఆయా ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పొట్ట చేతపట్టుకొని మూటాముల్లె సర్దుకొని కుటుంబ సభ్యులతో మహానగరాలకు వలస బాట పడుతుండటం సర్వసాధారణంగా కనిపిస్తోంది. బెళగావిలో చక్కెర ఫ్యాక్టరీలు అధికం జేఎస్డబ్ల్యూ దేశంలోనే అతి పెద్దది -
ఈ–ఖాతాల సత్వర పూర్తికి ఆదేశం
రాయచూరు రూరల్ : ప్రభుత్వం నిర్ణయించిన ఈ– ఖాతాలను నగరంలో సత్వరం పూర్తి చేయడానికి అధికారులు ముందుకు రావాలని నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పంచాయతీ భవనంలో జరిగిన నగరసభ సామాన్య సమావేశంలో మాట్లాడారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషనర్ జుబీన్ మహాపాత్రోను మందలించారు. మురికి వాడల ప్రాంతంలో ఇళ్ల పట్టాలిచ్చి వారి నుంచి పన్నులను వసూలు చేసిన వారికి నేడు ఈ–ఖాతాలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టడం తగదన్నారు. రోడ్ల మరమ్మతులో విఫలం నగరంలో గుంతలు పడ్డ రహదారులకు మరమ్మతులు చేపట్టడంలో శాసన సభ్యుడు విఫలమయ్యారని నగరసభ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ శాసన సభ్యులకు గుంతలు పూడ్చడానికి నిధులు రావని, నగరసభ వారే చేపట్టాలని సూచించారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా ఇంచార్జి మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, మరో మంత్రి బోసురాజులను ప్రశ్నించాలన్నారు. నగరంలో 287 దుకాణాలుండగా, 110 దుకాణాల మరమ్మతులు, 117 దుకాణాల నుంచి నెలకు రూ.800 చొప్పున బాడుగ లభిస్తున్నట్లు అధికారులు వివరించారు. రూ.18 కోట్ల పన్ను వసూలు ఈ విషయంలో టెండర్లు పిలిచి వాటి ధరలను పెంచాలన్నారు. రూ.28 కోట్ల పన్నుల వసూళ్లలో రూ.18 కోట్లు వసూలు చేశామన్నారు. నూతనంగా ఎన్నికై న 31వ వార్డు నగరసభ సభ్యురాలు అంజినమ్మ పేరు గల బోర్డు లేకపోవడంతో అధికారులు వెంటనే బోర్డును సిద్ధం చేశారు. 8 మంది బీజేపీ సభ్యులు గైర్హాజరయ్యారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, అధికారులు జయపాల్ రెడ్డి, విజయ లక్ష్మి, మేనకా పాటిల్, సభ్యులు బసవ రాజ్, జయన్న, నాగరాజ్, జిందప్ప, రేఖా, సరోజమ్మ, శరణ బసవ, రమేష్లున్నారు. ఎమ్మెల్యే, కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం సమావేశానికి గైర్హాజరైన బీజేపీ సభ్యులు -
పార్టీ కార్యక్రమంలో ఉపాధ్యాయుల ప్రత్యక్షం
రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పార్టీ కార్యక్రమంలో వేదికపై కనిపించిన సంఘటన యాదగిరి జిల్లాలో ెనెలకొంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ విషయంలో జిల్లాధికారి, జిల్లా విద్యా శాఖాధికారులు మౌనం వహించడంపై ప్రజలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లింగసూగూరు పీడీఓ ఆర్ఎస్ఎస్ కవాతులో పాల్గొన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యాదగిరిలో జరిగిన పార్టీలో వేదికపై పంచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
8న కనకదాసు జయంతికి అన్ని ఏర్పాట్లు చేయండి
బళ్లారిటౌన్: నవంబర్ 8న భక్త కనకదాసు జయంతిని వైభవంగా జరపాలని అదనపు జిల్లాధికారి(ఏడీసీ) మహ్మద్ జుబేర్ అధికారులకు సూచించారు. మంగళవారం అధికారులతో జరిగిన ముందస్తు ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు కుమారస్వామి గుడి వద్ద కనకదాసు ప్రతిమకు పూలమాల సమర్పించాలన్నారు. అనంతరం ఆయన చిత్రపటాన్ని నగర ప్రముఖ వీధుల్లో వివిధ కళా బృందాలతో ఊరేగింపు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో వేదిక కార్యక్రమాన్ని కూడా ఎలాంటి లోటు లేకుండా విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. సిద్దలింగేశ్వర రోడ్డుగా పేరు పెట్టండిరాయచూరు రూరల్: రాయచూరు నుంచి మన్సలాపూర్ గ్రామానికి వెళ్లే రహదారికి సిద్దలింగేశ్వర రోడ్డుగా పేరు పెట్టాలని మన్సలాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రాఘవేంద్ర బోరెడ్డి మాట్లాడారు. నగరం నుంచి 4 కి.మీ.ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఆ పేరు పెట్టాలని కోరుతూ నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రోకు వినతిపత్రం సమర్పించారు. యరగేరలో ఆర్ఎస్ఎస్ కవాతురాయచూరు రూరల్ : రాయచూరు తాలూకా యరగేరలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ హవల్దార్ అధ్యక్షతన వందలాది మంది ఆర్ఎస్ఎస్ సభ్యులు కవాతు చేశారు. బాల గణ వేషధారి కవాతు చూపరులను మరింతగా ఆకట్టుకుంది. మంటల్లో కారు బుగ్గి హొసపేటె: హొసపేటె నుంచి కంప్లికి వెళ్లే మార్గంలో బుక్కసాగర గ్రామ సమీపంలో సోమవారం రాత్రి కారులో మంటలు చెలరేగిన సంఘటన జరిగింది. కంప్లికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తికి చెందిన ఈ కారు టైర్ దగ్గర ముందుగా మంటలు కనిపించాయి. డ్రైవర్ కిందకు దిగి చూసేసరికి కారు క్షణాల్లో మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది మంటలను ఆర్పారు. ఘటనపై కమలాపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రైతుల సంక్షేమమే సర్కారు ధే ్యయం●ఎమ్మెల్యే హంపయ్య నాయక్ వెల్లడి ●మాన్విలో పత్తి కొనుగోలు కేంద్రం షురూ రాయచూరు రూరల్ : రైతుల సంక్షేమమే ధే ్యయంగా సర్కార్ పని చేస్తోందని మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం మాన్విలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. హుబ్లీ భారతీయ పత్తి మండలి అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రైతులకు మూడు రోజుల్లో వారి ఖాతాలో డబ్బులను జమ చేయాలని సూచించారు. ప్రస్తుతం రైతులు కష్టాల సుడిలో ఉన్నారని, అలాంటి రైతులను ఆదుకోవాలన్నారు. మాన్వి తాలూకాలో 30 వేల హెక్టార్లలో పత్తి పంట సాగు చేశారన్నారు. 3,140 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. తహసీల్దార్ భీమరాయ, ఏపీఎంసీ కార్యదర్శి రంగనాథ్, హుబ్లీ సీసీఐ అధికారులు వర్మ, అజయ్, శైలజ, సిద్దప్ప గౌడ, సుబాష్ చంద్ర నాయక్లున్నారు. -
కార్యవర్గం ఎన్నికకు నామినేషన్లు
బళ్లారిటౌన్: జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 2025–28 సంవత్సరాల మధ్య అవధికి కార్యవర్గం(పదాధికారుల) ఎన్నికకు సోమవారం చివరి రోజున నామినేషన్ల పర్వం చురుగ్గా సాగింది. ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ నామినేషన్ల ప్రక్రియ తొలుత నెమ్మదిగా సాగి క్రమంగా ఊపందుకుంది. మొత్తం 24 స్థానాలకు 44 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా అధ్యక్ష స్థానానికి 4, మూడు ఉపాధ్యక్ష స్థానాలకు 5 దరఖాస్తులు, ప్రధాన కార్యదర్శి పదవికి మూడు దరఖాస్తులు, రాష్ట్ర కార్యవర్గ సమితి స్థానానికి మూడు, జిల్లా కార్యదర్శి మూడు స్థానాలకు 5 దరఖాస్తులు, కోశాధికారికి మూడు దరఖాస్తులు, ఇక 15 జిల్లా కార్యవర్గ సభ్యుల స్థానాలకు 21 మంది దరఖాస్తులు సమర్పించారు. కాగా మంగళవారం దరఖాస్తుల పరిశీలన, ఈ నెల 30 వరకు విత్డ్రాకు అవకాశం, తర్వాత నవంబర్ 9న ఎన్నికలు జరిపి అనంతరం అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరపనున్నట్లు ఎన్నికల అధికారి నాగరాజ్ తెలిపారు. -
శిష్యుల ఉన్నతి గర్వకారణం
హుబ్లీ: గురువుల కన్నా శిష్యులు ఎక్కువ ఉన్నతి సాధిస్తేనే గర్వకారణం అవుతుందని విశ్రాంత వైద్యుడు డాక్టర్ అనిల్ వైద్య తెలిపారు. గదగ్లోని పంచాచార్య విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంచి పని చేయడానికి సాధ్యం కాకపోతే ఫర్వాలేదు. చెడ్డ పనిని చేయరాదు. మనమందరం చక్కగా మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. సాధకులకు సన్మానం రాయచూరు రూరల్ : సమాజ సేవ చేయడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని బీజేపీ కార్యదర్శి రవీంద్ర జాలదార్ అభిప్రాయ పడ్డారు. ఆదివారం నగరంలోని జాలదార్ కార్యాలయంలో సమాజంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి కళా తపస్వి సంస్థ ఆధ్వర్యంలో ఎడదొరె సిరి అవార్డులను అందించి సన్మానించారు. సమాజానికి ఉన్నతమైన సేవలు అందించాలనే తపనతో భారతీయ సేనలో శివకుమార్, కవిత్వంలో ఈరణ్ణ, సమాజ సేవా రంగంలో విరుపమ్మలు అందించిన సేవలు మరువరానివన్నారు. కార్యక్రమంలో అశోక్ కుమార్, అశ్విని, శేఖర్, వెంకటేష్, సంతోష్ కుమార్లున్నారు. మెరుగైన ఆరోగ్యంతోనే ఆర్థికాభివృద్ధి హుబ్లీ: ప్రణాళికా బద్ధంగా ఆర్థిక నిర్వహణ, పొదుపు, ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చని, శారీరకంగా, మానసికంగా బాగుంటేనే ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుందని సమాచార నిపుణులు ప్రశాంత మొటగి తెలిపారు. గదగ్ తాలూకా హులకోటిలోని కేహెచ్ పాటిల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. షేర్ మార్కెట్లో ఆన్లైన్ మోసాల ప్రక్రియ గురించి, తదితర నేరాలు జరిగే విధానాలను వివరించి ఆర్థికంగా బాగుండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధ, డాక్టర్ జితేంద్ర, సంబంధిత విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. నగరసభ కమిషనర్ బదిలీకి డిమాండ్ రాయచూరు రూరల్: రాయచూరు నగరసభ కమిషనర్ను బదిలీ చేయాలని రాయచూరు నగర ఉస్మానియా కాయగూరల విక్రయదారుల క్షేమాభివృద్ధి సంఘం అధ్యక్షుడు మహావీర్ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరసభలో విధులు నిర్వహిస్తున్న కమిషనర్ ఏనాడూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించలేదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు రాలేదన్నారు. అక్రమంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను తొలగించాలన్నారు. బీజేపీ నేత రవీంద్ర జాలదార్ సీఏ, ప్రైవేట్ వ్యక్తుల స్థలంలో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ప్రభు నాయక్, తిమ్మారెడ్డి, బసవరాజ్, రిజ్వాన్, ఉదయ కుమార్, ఖాజప్పలున్నారు. వీధి కుక్కలకు ఆపరేషన్లు హుబ్లీ: గదగ్లో వీధి కుక్కల బెడద తీవ్రత గమనించిన ఆ నగరసభ పాలనాధికారి అనుమతి మేరకు రెండవ దశ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సతో పాటు యాంటిరేబిస్ వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టారు. జిల్లాలో వీధి కుక్కల సమస్య అంతా ఇంత కాదు. దీంతో ఆ నగరసభ అధికారులు రెండవ దశలో భాగంగా మొత్తం 615 వీధి కుక్కలకు రేబిస్, ఎంఆర్ఐ తదితర చికిత్సలు అందించారు. మొత్తం 1వ దశలో 485 కుక్కలకు రేబిస్, ఏఆర్వీ ప్రక్రియ చేపట్టారు. రెండవ దశలో 615 వీధి కుక్కలకు ఈ ప్రక్రియ చేశారు. ఈ ప్రాంతంలో వీధి కుక్కలను పట్టుకొనే ప్రక్రియ జరుగుతోందని కౌన్సిలర్ చంద్రు కరి, కమిషనర్ రాజారాం, ఏఈ ఆనంద్ బది తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సాయం పంపిణీ హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని కక్కుప్పి గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్తో మరణించిన విద్యార్థిని కే.హెచ్.భాగ్య కుటుంబానికి అమ్మనకెరె గ్రామంలోని బసవేశ్వర ఆలయ అభివృద్ధి సేవా కమిటీ సోమవారం రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేసింది. ఆలయ కమిటీ సభ్యులు కెంపేగౌడర బసవరాజ్, గురికార్ బసవరాజ్, సీజీ మమ్మునాథ్, కే.సత్యనారాయణ మూర్తి, కే.కొట్రేష్, జీ.బసవరాజ్, ఎస్.బసవరాజ్, ఏఎం.వీరయ్య, హెచ్ఎం కరిబసయ్య పాల్గొన్నారు. -
కలబుర్గిలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు
రాయచూరు రూరల్ : కలబుర్గి జిల్లాలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను భక్తులు నెరవేర్చారు. ఆళంద తాలూకా గోళా(బి)లో కొండ మీద వెలసిన లక్ష్మీదేవికి పంచమి రోజున భక్తులు, గ్రామస్తులు కలిసి ప్రత్యేక పూజలు చేస్తారు. సాధారణంగా దేవతా విగ్రహాల ఎదుట పూజలు చేస్తారు. ఇక్కడ దేవి పడమటి వైపు ముఖం చేసి ఉన్నందున దేవి విగ్రహానికి వెనుక భాగంలో పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. తమ కోరికలు నెరవేరాలని భక్తులు ఆమె వెన్నెముక భాగంలో కర్పూరం సమర్పించి, కొత్త చెప్పుల జతను కడతారు. అమ్మవారికి వెనుక భాగంలో పూజలు కొత్త చెప్పుల జత కట్టడం ఆచారం -
కళామతల్లి ముద్దుబిడ్డ ఈరణ్ణ
రాయచూరు రూరల్: పురాతన కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో నాటకాలు, జానపద పాటలు, కోలాటాలు వంటి సంప్రదాయక సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతుండేవి. నాటి నుంచి పగటి పూట వేషధారణ ధరించి ప్రజలకు మనోరంజనం చేసే పగటి వేషధారణ కళాకారుల్లో ఈరణ్ణ రుద్రాక్షిని మేటిగా చెప్పవచ్చు. నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో మార్పులు వచ్చినా పురాతన కాలం నాటి కళలు నేటికీ గ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఆ కోవకు చెందిన ఈరణ్ణ రుద్రాక్షి తల్లి శరణమ్మ, భార్య హన్మంతితో దేవదుర్గ శాంతినగర్ కాలనీలో నివాసముంటూ పల్లెల్లో తిరుగుతూ బుర్రకథలు చెబుతూ సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పౌరాణిక, ధార్మిక రంగాల ద్వారా బుడగ జంగమ సమాజం తరఫున పగటి వేషాలు వేస్తున్నారు. పలు వేదికలపై ప్రతిభ ప్రదర్శన ఈరణ్ణ రుద్రాక్షి, తల్లి శరణమ్మ, భార్య హన్మంతి హంపీ, మైసూరు దసరా ఉత్సవాలు, విశ్వ కన్నడ సమ్మేళనం, జానపద ఉత్సవాలు, కన్నడ రాష్ట్రావతరణ ఉత్సవాల్లో పాల్గొని పలు రకాల వేషాలు ధరించి చూపరులను ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీలో పగటి వేషధారణ ప్రదర్శనలు నిర్వహించారు. భీమాంజనేయ యుద్ధం, మోహిని భస్మాసుర, జటాసుర వధ, కంసుడి వధ, సుందోపసుంద, రామాయణ, మహాభారత పౌరాణిక ప్రదర్శనలు చేశారు. సాంఘీక నాటకాల్లో సంగొళ్లి రాయణ్ణ, సింధూర లక్ష్మణ, భీమ, రావణ, దుర్యోధన, శ్రీరామ, ఆంజనేయ వంటి పాత్రలు ధరించి ప్రజల మన్ననలను పొందారు. దర్శకుడిగా, సంగీత కళాకారుడిగా విధులు నిర్వహించారు. కర్ణాటక జానపద అకాడమి అవార్డు, హంపీ ఉత్సవ్ అవార్డు, బెళవడి మల్లమ్మ అవార్డు, విశ్వ కన్నడ సమ్మేళన అవార్డు, సంగొళ్లి రాయణ్ణ అవార్డులు పొందారు. 2007లో పురసభ సభ్యుడిగా గెలుపొంది తమ వార్డులో పలు అభివృద్ధి పనులు చేశారు. పగటి వేషధారణ కళా ప్రతిభ అమోఘం పలు రకాల అవార్డులు వరించిన వైనం -
ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి
బళ్లారిటౌన్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నియామకాల్లో 5 ఏళ్ల వయోమితిని సడలించాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. సోమవారం డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యూ.ఎర్రిస్వామి జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించి మాట్లాడారు. గతంలో పాలించిన బీజేపీ ప్రభుత్వం కూడా ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. దీని వల్ల నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేక వంచితులు అవుతున్నారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే బాటలోనే కాలయాపన చేస్తూ వచ్చిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా శాఖలో సుమారు 80 వేల దాకా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. ఇక ఆరోగ్య శాఖలో 37 వేలు, పాలన మండలిలో 26 వేలు, పోలీస్ శాఖలో 8 వేలు, ఇతర 43 శాఖల్లో కలిపి మొత్తం 2,76,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సమితి నేతలు హనుమప్ప, నవీన్, జీఎం ఎర్రిస్వామి, తిప్పేరుద్ర, వరదరాజు, రాజేంద్రప్రసాద్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్ను శాసీ్త్రయంగా చేపట్టాలి
బళ్లారిటౌన్: జిల్లాలో మైనింగ్ను శాసీ్త్రయంగా చేపట్టి పర్యావరణాన్ని కాపాడటమే కాక రానున్న తరాలకు కూడా ఉపయోగపడేలా చూడాలని గని బాధిత పరిసర పునశ్చేతన పోరాట సమితి నేతలు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పత్రికా భవనంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సండూరు తాలూకాలో ఇటీవల మైనింగ్ తవ్వకాల ప్రభావం తీవ్రంగా శృతిమించిందన్నారు. వార్షికంగా 20 మిలియన్ టన్నులు మాత్రమే తవ్వాల్సి ఉండగా 50 మిలియన్ టన్నుల మైనింగ్ ఉత్పత్తులను తవ్వుతున్నారన్నారు. దీని వల్ల ఈ ప్రాంతంలో మైనింగ్, లారీల రాకపోకల ప్రభావం వ్యవసాయ భూములతో పాటు ఇతర పర్యావరణానికి ముప్పు వాటిల్లిందన్నారు. దీనిపై తాము మంగళవారం జిల్లాలోని సండూరు తాలూకా నరసాపురం గ్రామం కొండపై ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. పరిసరాలను రక్షించడం అడవులను కాపాడుకోవడం మన హక్కు అని కుమారస్వామి కొండ పక్కన గల కొండలను పిండి చేసి మైనింగ్ తవ్వుతున్నారని, ఇది ఇలాగే కొనసాగితే మరో 40 ఏళ్లలో కొండలు కనిపించకుండా పోతాయని, దీనిపై అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి నియంత్రించాలన్నారు. సమావేశంలో సమితి నేతలు ఉగ్రనరసింహగౌడ, సీఎం శివకుమార్, మల్లికార్జున రెడ్డి, నాగలక్ష్మిద, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ నాయుడు, ప్రకాష్ రెడ్డి, విరుపనగౌడ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
హొసపేటె: విజయనగర జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి సోమవారం టీబీ డ్యాం ఆఫీషియల్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు పుస్తకాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులను చదువుపై ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న వేడి భోజనాన్ని సక్రమంగా అందించాలని పాఠశాల హెచ్ఎంను ఆదేశించారు. పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధనపై శ్రద్ధ వహించాలన్నారు. నలి–కలి తరగతులను సందర్శించి పిల్లలతో చాలా ఆప్యాయంగా ముచ్చటించారు. అధికారి మనోహర్, పాఠశాల అధ్యక్షుడు, సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరణంలోనూ వీడని బంధం ● మృత్యువులోను ఒక్కటైన దంపతులు ● బీదర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన రాయచూరు రూరల్: ఏడడుగుల బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు మరణంలోనూ ఒక్కటై అందరినీ కలిచి వేసిన ఘటన బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. బీదర్ జిల్లా కమల నగర తాలూకా ముధోళ్(బి) గ్రామానికి చెందిన గుండప్ప హొడగి(85), భార్య లక్ష్మీబాయి హొడగి(83) అనే దంపతులు వయో సహజ అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. గురువారం రాత్రి భార్య మరణ వార్త విన్న భర్త రాత్రి 10 గంటలకు గుండెపోటుతో మరణించారు. ఏడుగురు సంతానం, మునిమనవళ్లను చూసిన ఈ దంపతులకు అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. కల్మలలో ఇళ్ల దొంగతనాలు ● ముగ్గురు నిందితుల అరెస్ట్ రాయచూరు రూరల్ : తాలూకాలోని కల్మలలో ఇళ్లలోకి దూరి చోరీ చేసిన ముగ్గురు నిందితులను గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం కల్మల రాకేష్, యశవంత్, శివకుమార్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సొమ్ము. ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సాబయ్య తెలిపారు. రెండు తులాల టక్కమణి హారం, 26 తులాల వెండి, రూ.86 వేల నగదును స్వాధీనం చేసుకొని కస్టడీకి తరలించినట్లు తెలిపారు. మాజీ సీఎం సేవలు అనన్యం రాయచూరు రూరల్ : రాష్ట్రానికి మాజీ సీఎం బంగారప్ప చేసిన సేవలు అనన్యమని ఆర్య ఈడిగ సమాజం అధ్యక్షుడు నరసనగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని హెచ్ఆర్బీ కాలనీలోని ఆర్య ఈడిగ సమాజ భవనంలో ఏర్పాటు చేసిన బంగారప్ప 79వ జయంతి వేడుకల సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. బంగారప్ప పేదల పెన్నిధి అని, రాయచూరు జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ఉండడానికి గణేకల్ వద్ద బంగారప్ప చెరువును నిర్మించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మంజునాథ్, ఈరప్ప గౌడ, తాయణ్ణ గౌడ, శివరాజ్, వీరేష్, రమేష్, రంగనగౌడ, బాబురావ్లున్నారు. ఓటరు జాబితాలో పేర్లు చేర్చుకోండిరాయచూరు రూరల్ : కలబుర్గి డివిజన్ పరిధిలోని రాయచూరు జిల్లాలో ఈశాన్య ఉపాధ్యాయుల ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేయించాలని తహసీల్దార్ సురేష్ వర్మ సూచించారు. సోమవారం నగరంలోని రిమ్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేర్లను జాబితాలో చేర్పించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. నవంబర్ 6వ తేదీ చివరి రోజు కావడంతో ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సమావేశంలో రిమ్స్ డీన్ రమేష్, పాలనాధికారి గురు లింగయ్య, జిల్లా విద్యాశాఖాధికారి బడిగేర్, టీపీ అధికారి చంద్రశేఖర్ పవార్లున్నారు. -
ఓంకారేశ్వరాయ నమః
బనశంకరి: కార్తీక మాసం సోమవారం సందర్భంగా ఉత్తరహళ్లి–కెంగేరి మార్గంలో ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి. మధుసూదనానంద పురి స్వామీ ఓంకారేశ్వర శివలింగంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలకు భస్మహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సుల్లో భద్రతా తనిఖీలు చేయాలి శివాజీనగర: ఆంధ్రప్రదేశ్ కర్నూల్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం నేపథ్యంలో కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో పేలుడు, మండే వస్తువులను ప్రయాణికులు తీసుకెళ్లడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ప్రతి బ్యాగ్ను సిబ్బంది చెక్ చేయాలని, భద్రతా చర్యలను పటిష్టం చేయాలని రవాణా మంత్రి రామలింగారెడ్డి ఆదేశించారు. ప్రమాదం జరగకుండా చూడాలని, జరిగితే ప్రాణనష్టం లేకుండా బయటపడే సదుపాయాలు ఉండాలని తెలిపారు. ఘాట్ రోడ్డులో ట్యాంకర్ ఆటంకం యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా చార్మాడి ఘాట్ హైవేలో 10 చక్రాల సిమెంట్ ట్యాంకర్ రోడ్డు మధ్యలో చెడిపోయింది. దీనితో గంటల కొద్దీ ఘాట్ మార్గంలో వాహనాలు నిలిచిపోయ్యాయి. బెంగళూరు నుంచి మంగళూరుకు వెళుతున్న సిమెంట్ లారీ ఘాట్ మార్గంలో మొరాయించింది. అటు ఇటు వందలాదిగా వాహనాలు చిక్కుకుపోయాయి. ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. కొట్టిగేహర చెక్పోస్ట్లో ట్యాంకర్ను అడ్డుకోకుండా అనుమతించారని, దానివల్ల సమస్య వచ్చిందని స్థానికులు ఆరోపించారు. అధికారులు, స్థానికులు ట్యాంకర్ను ఎంతో కష్టమ్మీద రోడ్డు పక్కకు చేర్చి నెమ్మదిగా సంచారానికి వీలు కల్పించారు. ఎయిర్పోర్టులో గంజాయి సీజ్ దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో ఒక ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తుండగా 2.5 కేజీల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుని బ్యాగులో గంజాయి లభించింది. తనిఖీలలో గుర్తు పట్టకుండా బ్యాగ్ కింద భాగంలో గంజాయి దాచాడు. ఎయిర్పోర్టు పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితున్ని అరెస్టు చేశారు. మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ దొడ్డబళ్లాపురం: తన స్నేహితునితో చనువుగా ఉందనే కారణంతో ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో బెంగళూరు తిలక్ నగర పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. సుబ్బుమణి, సెంథిల్ అరైస్టెన నిందితులు. గత వారం సల్మా (35) అనే మహిళ మృతదేహం ఒక ఆటోలో పడి ఉంది. ఈమె తిలక్ నగర పీఎస్ పరిధిలో నివసిస్తుండేది, నలుగురు పిల్లలు ఉండగా, భర్త గతంలో చనిపోయాడు. సుబ్బుమణితో కలిసి ఉంటోంది. అయితే సుబ్బుమణి స్నేహితుడు సెంథిల్తోనూ చనువుగా ఉండడం చూసి, చంపాలని నిశ్చయించాడు. హత్యకు ముందు సల్మా, సుబ్బుమణి, సెంథిల్ ముగ్గురూ బాగా తాగారు. వారిద్దరూ మత్తులో జారుకున్నాక సుబ్బుమణి రాగిముద్ద గెలికే కట్టెతో ఆమె తలపై బాది హత్య చేశాడు. మృతదేహాన్ని చెడిపోయిన పాత ఆటోలో ఉంచి సుబ్బుమణి, సెంథిల్ పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తుమకూరులో ఉన్నట్టు తెలిసి నిందితులను అరెస్టు చేయించి నగరానికి తరలించారు. నెలమంగలలో తుపాకీ కాల్పులు దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలో నెలమంగల ఇస్లాంపురలో రివాల్వర్ పేలింది... గ్రామ పంచాయతీ సభ్యునిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. జీపీ సభ్యుడు సలీం ఇంటి ముందు మొబైల్లో మాట్లాడుతుండగా దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. సలీం చేతికి, కాలికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ఎవరు ఎందుకు కాల్పులు జరిపారన్నది తెలిసిరాలేదు. నెలమంగల గ్రామీణ పోలీసులు విచారణ చేపట్టారు. -
మహిళలకు రూ.3 కోట్లు టోపీ
హాసన్ (దొడ్డబళ్లాపురం): చిత్రంలో మధ్యలో కనిపిస్తున్న సీ్త్రపై ఇద్దరు మహిళలు దాడి చేస్తుండడం చూశారా..! మాయమాటలు చెప్పి అమాయకుల వద్ద నుంచి రూ.3 కోట్ల అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన మహిళను నడిరోడ్డులో చితకకొట్టిన సంఘటన హాసన్ పట్టణంలోని అరళేపేటెలో జరిగింది. స్థానికంగా లేడీస్ టైలర్ షాప్ నిర్వహించే హేమావతికి ఇలా దేహశుద్ధి గావించారు. అప్పులు తీసుకుని ఆస్తులు.. ఆమె టైలర్గా అందరితో పరిచయాలు పెంచుకుంది. ఒకరికి తెలియకుండా మరొక మహిళకు మాయమాటలు చెప్పి రూ. లక్షలాదిగా అప్పులు తీసుకుంది. ఆ డబ్బుతో దండిగా బంగారు నగలు, కారు, స్థలాలు వంటివి కొనుక్కుంది. విలాస జీవనం జీవిస్తోంది. ఎన్ని రోజులైనా తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో అడిగి అడిగి విసిగిపోయిన మహిళలు రౌద్రరూపం దాల్చారు. హేమావతిని రోడ్డు మీద జుట్టుపట్టుకుని కొట్టారు. స్థానికులు ఈ తతంగాన్ని మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. హాసన్ పోలీస్స్టేషన్లో ఆమె, బాధితులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. లేడీస్ టైలర్కు వీధిలో దేహశుద్ధి -
మహిళ కేసు.. ఎస్ఐ సస్పెండ్
బనశంకరి: మహిళపై అత్యాచారం ఆరోపణలతో డీజే.హళ్లి పోలీస్స్టేషన్ ఎస్ఐ సునీల్ ను సోమవారం నగర పోలీస్కమిషనర్ సీమంత్కుమార్సింగ్ సస్పెండ్ చేశారు. ఎస్ఐ, ఏఎస్ఐ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నామని సింగ్ తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్ఐ సునీల్ పై కొన్నిరోజుల క్రితం మైనారిటీ వర్గానికి చెందిన మహిళ అదే ఠాణాలో ఫిర్యాదు చేయడం తెలిసిందే. తాను బ్యూటిషియన్గా పనిచేస్తానని, పని మీద ఓ సారి ఠాణాకు వెళ్లగా ఎస్ఐ సునీల్ ప్రేమ, పెళ్లి పేరుతో మభ్యపెట్టాడని ఆమె ఆరోపిస్తోంది. డీజీపీ సలీంకు కూడా ఫిర్యాదు పంపింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎస్ఐని, ఆయనకు కొమ్ముకాసిన ఏఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. -
అడవుల్లో రిసార్టులు, గ్రామాల్లోకి మృగాలు
దాడులకు తెగబడుతున్న పెద్ద పులులు మైసూరు: జిల్లాలో పులుల దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఇటీవల ఓ రైతు మీద పడి కళ్లు పీకి తీవ్ర గాయాలు చేసిన దుర్ఘటనను మరువకముందే.. బండీపుర పులుల అభయారణ్యంలో బెణ్నెగెరె గ్రామం వద్ద రాజశేఖర్ అనే మరో రైతును పులి పొట్టనపెట్టుకుంది. ఈ ఘోరానికి అటవీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని, వారిని సస్పెండ్ చేయాలని రైతు కుటుంబసభ్యులతో పాటు రైతులు, సంఘాల నాయకులు సోమవారం మైసూరులో ప్రభుత్వ ఆస్పత్రిలో ధర్నా చేశారు. రైతు మృతదేహం ఉన్న మార్చురీ ముందు నిరసనకు దిగారు. అటవీ మంత్రికి ఫిర్యాదు అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రె రాగా, మంత్రి ముందు అటవీ సిబ్బందిపై రైతులు మండిపడ్డారు. పులి తిరుగుతోందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దానిని పట్టుకుని ఉంటే ఈ దారుణం జరిగేది కాదన్నారు. అడవిలో అక్రమంగా రిసార్టులకు అనుమతి ఇస్తున్నారని, దాంతో అడవి జంతువులు అడవులను విడిచి గ్రామాల్లోకి వస్తూ దాడులు చేస్తున్నాయని చెప్పారు. రైతు కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ఇస్తామని మంత్రి తెలిపారు. అందువల్లే రైతులపై పులుల దాడులు మైసూరులో రైతుల నిరసన -
రోజుకొక పేరు, వారానికో వర్గం
సాక్షి, బెంగళూరు: కన్నడ కాంగ్రెస్ పార్టీలో సీఎం ఆట జోరందుకుంది. సీఎం కుర్చీ కోసం నాయకులు ఆశల పందిళ్లలో ఊరేగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లను.. వెళ్లను అంటూనే ఆదివారం మధ్యాహ్నం హస్తినకు పయనమయ్యారు. అయితే హైకమాండ్ నాయకులు బిజీగా ఉండడంతో డీకే శివకుమార్ వారినెవరినీ కలవకుండానే రిక్తహస్తాలతో బెంగళూరుకు తిరిగి వచ్చేశారు. మిగిలిన ఇతర నాయకులు కూడా హైకమాండ్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతున్నారు. డీకేకి పోటీగా, దళిత సీఎం అనే కొత్త రాగాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు అందుకున్నారు. డీకే వ్యతిరేకుల కూటమి సీఎం సిద్ధరామయ్య తర్వాత ఎవరు ఆయన వారసుడంటూ జోరుగా చర్చ సాగుతున్న తరుణంలో దళిత నేతే తదుపరి ముఖ్యమంత్రి కావాలని పలువురు నేతలు కోరుతున్నారు. హోం మంత్రి జి.పరమేశ్వర్ పేరు వినిపిస్తోంది. మంత్రి కేహెచ్ మునియప్ప సీఎం అయితే స్వాగతిస్తానని పరమేశ్వర్ చెప్పారు. వీరికి మంత్రి సతీశ్ జార్కిహొళి మద్దతు ప్రకటించారు. దళిత నేత ముఖ్యమంత్రి కావడం మంచిదే అన్నారు. ఇలా పరస్పరం మద్దతు పలుకుతూ డీకేశి వ్యతిరేకంగా గట్టి కూటమిని తయారు చేసే పనిలో ఉన్నారు. వీరికి సీఎం సిద్దరామయ్య అండగా ఉన్నట్లు డీకే మద్దతుదారులు అనుమానిస్తున్నారు. నవంబరు 11న మళ్లీ ఢిల్లీకి దళిత సీఎం డిమాండ్లు ఎక్కువవడంతో డీకే శివకుమార్ అప్రమత్తమయ్యారు. ఆదివారం ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నా ఏమీ జరగలేదు. మళ్లీ నవంబర్ 11న ఢిల్లీ టూర్ చేయబోతున్నారు. ఆరోజు రాహుల్ గాంధీతో భేటీకి అవకాశం కోరారు. అధికార పంపిణీ గురించి రాహుల్గాంధీతో చర్చించే అవకాశం ఉంది. ఆ రోజున బిహార్ రెండో దశ ఎన్నికల పోలింగ్తో ఎన్నికలు పూర్తవుతాయి. అందుకే అప్పటివరకు వేచిచూడక తప్పదు. త్వరలో సిద్దరామయ్య సైతం.. నవంబర్ 15న లేదా 18న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఢిల్లీకి వెళ్లి నన్నే ఐదేళ్లూ కొనసాగించాలని కోరే అవకాశముంది. లేనిపక్షంలో తాను సూచించినవారికి పట్టం కట్టాలని సిద్దరామయ్య కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రుల్లో పలువురు సీనియర్ దళిత నేతలు ఉన్నారు. వారిలో ఒకరిద్దరి పేర్లను సిఫార్సు చేయబోతున్నారు. ఇప్పటికే మంత్రులతో డిన్నర్ మీటింగ్ నిర్వహించిన సీఎం తాజాగా మరోసారి నవంబరు 1వ తేదీన విందు జరపబోతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో సతీశ్ జార్కిహొళి, పరమేశ్వర, హెచ్సీ మహదేవప్ప వంటి దళిత నాయకులతో కూడా సీఎం సిద్ధరామయ్య మంతనాలు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం కాంగ్రెస్లో ఆగమాగం డిప్యూటీ సీఎం ఢిల్లీ యాత్ర విఫలం తెరపైకి దళిత సీఎం డిమాండ్ 1వ తేదీన సీఎం విందు భేటీ నాయకత్వానిదే నిర్ణయం: సీఎంబనశంకరి: పదవుల కోసం పోటీ సహజమేనని సీఎం అన్నారు. సోమవారం మంగళూరులో విలేకరులతో సిద్దరామయ్య సీఎం మార్పు గురించి మాట్లాడుతూ హైకమాండ్ తీర్మానానికి వదిలిపెట్టామన్నారు. డీకే.శివకుమార్, పరమేశ్వర్, కేహెచ్.మునియప్ప సీఎం రేసులో ఉన్నారని విలేకరులు ప్రస్తావించగా, ప్రజాస్వామ్యంలో పోటీని తప్పించడం సాధ్యం కాదన్నారు. సీఎం స్థానానికి పోటీచేసే హక్కు అందరికీ ఉందన్నారు. నేను పదవిలో కొనసాగడం గురించి నాయకత్వం చేసే తీర్మానం అంతిమం అని తెలిపారు. -
రూ.49 కోట్ల లూటీలో ఇద్దరు అరెస్టు
బనశంకరి: బెంగళూరులో ఈ ఏడాది ఆగస్టులో విజ్డమ్ ఫైనాన్స్ సర్వీసెస్ అనే ఆర్థిక సేవల కంపెనీని విదేశాల నుంచి హ్యాకర్లు భారీగా కొల్లగొట్టడం తెలిసిందే. ఆ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలలోకి చొరబడి రూ. 49 కోట్ల ను స్వాహా చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పటి నుంచి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. బెళగావిలో ఇస్మాయిల్ అత్తర్ (27), రాజస్థాన్లో సంజయ్పటేల్ (43) అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హాంకాంగ్, దుబాయ్లో తలదాచుకున్న మరో 5 మంది బడా కేటుగాళ్ల కోసం గాలింపు సాగుతోంది. -
లవ్ జిహాద్ కేసులో అరెస్టు
దొడ్డబళ్లాపురం: యువతిని ఇన్స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెను శారీరకంగా వాడుకుని తరువాత మతం మారలేదంటూ ముఖం చాటేసిన మోసగాన్ని బెంగళూరు అమృతహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. మహమ్మద్ బిన్ ఇషాక్ అరైస్టెన నిందితుడు. ఈ సంఘటనను లవ్ జిహాద్గా భావిస్తున్నారు. 2024లో ఇన్స్టా ద్వారా యువతితో పరిచయం పెంచుకున్న ఇషాక్ ఆమెను ప్రేమించినట్టు నటించాడు. తరువాత షికార్లు చేశారు, వివాహం చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతి అడిగితే తమ మతంలోకి మారాలని లేదంటే ఇంట్లో ఒప్పుకోరని, పైగా ప్రైవేటు ఫోటోలు, వీడియోలను లీక్ చేస్తానని బెదిరించాడు. ఈ సెప్టెంబరు 14న ఇంట్లో చూసిన ఓ యువతిని నిశ్చితార్థం చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించి నిందితున్ని అరెస్టు చేశారు. సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం ● వృద్ధురాలు మృతి కృష్ణరాజపురం: వంట గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించి ఇల్లు నేలమట్టమైన ఘటన శనివారం ఉదయం బెంగళూరులోని కృష్ణరాజపురం త్రివేణినగరలో జరిగింది. ఇంటి శిథిలాల కింద ముగ్గురు చిక్కుకోగా, ఒక వృద్ధురాలు మరణించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతురాలిని అక్కయమ్మ (80)గా గుర్తించారు. శేఖర్ (52), కిరణ్ (22) చందన్ (25)లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విస్ఫోటం వల్ల చుట్టుపక్కల ఇళ్లకు కూడా నష్టం వాటిల్లింది. పోలీసులు విచారణ చేపట్టారు. టీవీ నటి బ్లాక్మెయిలింగ్ ● మహిళ ఫోటోలు సేకరించి డబ్బు కోసం డిమాండ్ యశవంతపుర: టీవీ సీరియళ్ల కథల గురించి అందరికీ తెలిసిందే. అందులో పాత్రధారులు నిరంతరం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. అదేమాదిరి ఓ నటి నిజ జీవితంలోనూ ప్రవర్తించింది. కన్నడ టీవీ సీరియల్స్లో నటించి పేరుపొందిన నటీమణి ఆశా జోయిస్ నేరారోపణల్లో చిక్కుకుంది. ఓ మహిళ ప్రైవేట్ వీడియో, ఫోటోలను దొంగతనం చేసి రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్లు బెంగళూరు నగర తిలక్ నగర ఠాణాలో ఫిర్యాదు దాఖలైంది. డబ్బు ఇవ్వకపోవడంతో.. శృంగేరి శారదా పీఠం జోయిస్ కుటుంబ సభ్యురాలు, బుల్లితెర నటి ఆశా జోయిస్ పై పార్వతి (61) అనే మహిళ ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఆశా 2016లో మిస్ ఇండియా ప్లానెట్లో పోటీలలో విజేతగా నిలిచారు, తరువాత టీవీ సీరియళ్లలో నటించింది. ఆశాకు బాధితురాలు స్నేహితురాలు అయ్యింది. ఆమె కూడా టీవీ నటి అని చెప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆశా.. బాధితురాలి వీడియోలను సేకరించి ఆమె భర్తను డబ్బు కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఇందుకు వారు తిరస్కరించడంతో వీడియోలు, ఫోటోలు, వాయిస్ రికార్డ్లను బాధితురాలికి తెలిసినవారికి పంపించింది. దీనివల్ల తనకు తీవ్ర అవమానం అయ్యిందని బాధిత మహిళ ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. బీజేపీ నేత ఖూబాకు రూ.25 కోట్ల జరిమానా దొడ్డబళ్లాపురం: అక్రమ మైనింగ్ కేసులో బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి భగవంత్ ఖూబాకు భారీ జరిమానా విధిస్తూ నోటీసులు వెళ్లాయి. కలబుర్గి జిల్లా కాళగి తహసీల్దార్ రూ.25.30 కోట్లు చెల్లించాలని ఖూబాకు నోటీసులు పంపించారు. కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా వచ్చా గ్రామం పరిధిలో 2014 జూన్ నుంచి 2019 జూన్ వరకూ 2 ఎకరాలకు అనుమతి తీసుకుని 8 ఎకరాలలో గనుల తవ్వకాలు జరిపారని నోటీసుల్లో పేర్కొన్నారు. సంజీవ్కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గనుల శాఖ, కాళగి తహసీల్దార్ జంటగా దర్యాప్తు చేసి ఆరోపణలు నిజమని తేల్చారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చి రూ.25.30 కోట్లు చెల్లించాలని ఆదేశించగా, దీనిని ఆయన కోర్టులో సవాల్ చేశారు. -
పలు జిల్లాల్లో తుపాను వర్షాలు
● అన్నదాతలకు కష్టం యశవంతపుర: బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో కన్నడనాట పలుజిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఉత్తరకన్నడ జిల్లా కరావళిలో కుండపోత కురుస్తోంది. గాలివానతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంకోలా తాలూకా హరవాడలో 24 గంటల్లో 80 మిల్లీమీటర్ల వర్షం దంచికొట్టింది. బెళెకెరిలో 76 మి.మీ, కుమలా–73 మి.మీ వర్షపాతం నమోదైంది. కారవారలో శనివారం ఉదయం రైల్వేస్టేషన్ మార్గం నీటమునిగింది. రాయచూరు, దక్షిణ కన్నడ, విజయపుర, గదగ్లోనూ భారీ వానలు పడ్డాయి. వరి, జొన్న, ఉల్లి తదితర పంటలకు తీవ్ర నష్టం కలుగుతోంది. డ్యాములు ఫుల్ మైసూరు: కేరళలోని వైనాడు, పశ్చిమ కనుమల్లోని అటవీ ప్రాంతంలో నిరంతరంగా వర్షాలు కురుస్తున్నందున కావేరి, ఉప నదులకు వరద పోటెత్తింది. జిల్లాలోని హెచ్డీ కోటె తాలూకా బీచనహళ్లి గ్రామంలోని కబిని జలాశయం ఈ ఏడాదిలో ఐదోసారి పూర్తిగా నిండి కొత్త రికార్డును లిఖించింది. ఈ డ్యాం 50 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారిగా మే నెలలోనే నిండింది. తరువాత జూన్, జూలై, ఆగస్టు, తాజాగా అక్టోబర్ నెలాఖరులో డ్యాం నిండింది.ఇంకా రెండు మూడు నెలల పాటు జలాశయ నిండుగా ఉంటుందని అధికారులు తెలిపారు. కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండ్య జిల్లాలోని కేఆర్ఎస్ డ్యాంలో పలు గేట్లను ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. -
ఓటీపీ, మోసపూరిత లింక్లతో జాగ్రత్త
● ఓ టెక్కీ సంపాదన చాలక పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్నాడు. ఇంటర్నెట్లో గాలించగా ఓ లింక్ దొరికింది. దానిని క్లిక్ చేయగానే ఫోన్ ఖరాబైంది. ఖాతాలోని రూ.లక్షకు పైగా నగదు దుండగుల ఖాతాకు బదిలీ అయ్యింది. ● మ్యాట్రిమొని వెబ్సైట్లో రెండో పెళ్లి కోసం ఓ మహిళ వివరాలను నమోదు చేసుకుంది. అమెరికాలో ఇంజనీరునంటూ ఓ మోసగాడు ఆమెకు వలవేశాడు. తీయని మాటలు చెప్పి మూడేళ్లలో రూ.2 కోట్లకు పైగా వసూలు చేశాడు. ఇదంతా ఆన్లైన్లోనే జరిగింది.ఇలా చెప్పుకుంటూ పోతే సిలికాన్ రాజధానిలో జరుగుతున్న ఆన్లైన్ నేరాలకు అంతం లేదు. నగరవాసులకు బతిమాలి, బెదిరించి సైబర్ వంచకులు నిండా ముంచుతున్నారు. ఏటా వందల కోట్ల రూపాయలను ఇలా దోచేస్తున్నారు. పోలీసులు ఛేదిస్తున్నవి చాలా తక్కువ కేసులే.దేశంలో అత్యధిక సైబర్ నేరాలు జరుగుతున్న నగరాల్లో బెంగళూరు ఒకటిదొడ్డబళ్లాపురం: సైబర్ క్రైం కేసుల్లో బెంగళూరు రూరల్ జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే సైబర్ ౖక్రైం బాధితుల్లో చాలామంది విద్యావంతులే కావడం. బెంగళూరు తరువాత బెంగళూరు రూరల్ జిల్లా ప్రజలను ఎక్కువగా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. ఆన్లైన్ నేరాల్లో కూడా రాజధాని అగ్రస్థానంలో కొనసాగడం ఓ రకంగా పోలీసు శాఖకే అప్రతిష్టగా మారిందనే విమర్శలున్నాయి. ఎలాంటి నేరాలు అంటే ఉద్యోగాలు, పార్ట్ టైం ఉద్యోగాలు, తక్కువ సమయంలో డబ్బులు రెట్టింపు చేస్తామని, షేర్లలో పెట్టుబడి, ప్రభుత్వ పథకాల మంజూరు, పెళ్లి సంబంధాలు, డిజిటల్ అరెస్టు పేరుతో ఎక్కువగా సైబర్ నేరాలు, మోసాలు జరుగుతున్నాయి. అమాయకుల నుంచి లక్షల రూపాయలను తమ అక్కౌంట్లలోకి బదిలీ చేయించుకుంటున్నారు సైబర్ నేరస్తులు. సిటీ, సౌత్లో అత్యధికం ● బెంగళూరు సిటీ, దక్షిణ బెంగళూరు ప్రాంతాల్లో అత్యధింగా సైబర్ క్రైం కేసులు నమోదవుతున్నాయని పోలీసులు తెలిపారు. నెల నెలా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ● బెంగళూరు గ్రామీణ జిల్లాలో నెలకు సరాసరి 35 కేసులు వస్తుంటే, 6 నెలలకు 210 కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులను దర్యాప్తు చేసే సైబర్ క్రైం స్టేషన్ బెంగళూరులోనే ఉంది. ● ముఖ్యంగా ఇన్స్టా, వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మోసగాళ్లు వల వేస్తున్నారు. ● నష్టపోతున్న వారిలో ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, టెక్కీలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. ● ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్, నగదు లావాదేవీలు చేసేవారు సులభంగా బలైతున్నారు. పేరుకుపోతున్న కేసులు బెంగళూరు గ్రామీణ జిల్లాలో సైబర్ క్రైం స్టేషన్ లేకపోవడంతో జిల్లాలో నమోదయ్యే కేసులను బెంగళూరుకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే వేలాది కేసులు పెండింగ్లో ఉంటున్నాయి, కొత్తగా వచ్చేవాటిని దర్యాప్తు చేయడం, నేరగాళ్లను పట్టుకోవడం ఆలస్యమవుతోంది. సులభంగా మోసపోతున్న నగరవాసులు బెంగళూరులోని ఓ సైబర్ ఠాణాలో రద్దీ కొల్లగొడుతున్న ఆన్లైన్ వంచకులు బెంగళూరు, బెంగళూరు రూరల్కు తొలి, రెండవ స్థానాలు ఖాకీలకు పెను సవాల్ సైబర్ క్రైం నేరాలపై మాట్లాడిన బెంగళూరు రూరల్ జిల్లా ఏఎస్పీ నాగరాజు ఓటీపీ షేర్ చేయడం వల్ల, ఆన్లైన్లో వచ్చే లింక్లు క్లిక్ చేయడం వల్ల మోసాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా నేరస్తులు బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎయిర్పోర్టు, జిల్లాలో అన్ని తాలూకాల్లో పారిశ్రామిక వాడలు ఎక్కువగా ఉండడం వల్ల ఆన్లైన్ నేరాలూ ఎక్కువైనట్లు చెప్పారు. సైబర్ క్రైం నివారణ కోసం పోలీసుశాఖ ప్రజల్లో జాగృతిని కలిగించేందుకు కృషి చేస్తోందన్నారు. సైబర్ క్రైం బాధితులు నేరుగా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోని కేసుల పరిష్కారానికి బెంగళూరు మిల్లర్స్ రోడ్డులో ప్రత్యేక సైబర్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
కంది పంట వెలవెల.. రైతన్న విలవిల
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలో అధికంగా పండించే కంది(ఎర్రబంగారం) పంట విస్తీర్ణం ఈసారి తగ్గింది. కంది పంటకు పేరొందిన కలబుర్గి డివిజన్లో సున్నపు రాళ్లతో కూడిన భూమిలో కంది ఏపుగా పెరుగుతుంది. ఈ పంటను క్యాల్షియం, పొటాషియంతో కూడిన మట్టిలో పండిస్తారు. కలబుర్గి జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో కంది పంట సాగవుతుంది. ఖరీఫ్ సీజన్లో అతివృష్టితో అధికంగా ఈదురు గాలులు వీయడంతో కందికి రోగం సోకింది. కంది పంట ఆరు నెలల్లో చేతికి వస్తుంది. కోతకు బిహార్ నుంచి యంత్రాలు వస్తాయి. కల్యాణ కర్ణాటకలోని కలబుర్గి, బీదర్, విజయపుర, యాదగిరి, రాయచూరు, కొప్పళ, గదగ్, బాగల్కోటె, బెళగావి, హావేరి, బళ్లారి జిల్లాలో అధికంగా పండిస్తారు. ఇక్కడ పండిన పంటలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రకు తరలిస్తారు. ఏడాదికి కలబుర్గి జిల్లాలో ఎనిమిది లక్షల హెక్టార్లలో పండిస్తుండగా ఈ ఏడాది రెండు లక్షల హెక్టార్ల మేర విస్తీర్ణం తగ్గింది. జీఐఎల్ గుర్తింపు కలిగిన కంది పప్పును ఆస్ట్రేలియా, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ ఏడాది మార్కెట్లో కందిపప్పు ధర క్వింటాల్కు రూ.12,700 పలికింది. వినియోగదారుడికి కిలో ధర రూ.160–200ల వరకు లభిస్తుంది. ఏడాదికి రూ.5,500 కోట్ల లావాదేవీలు కల్యాణ కర్ణాటకలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, బళ్లారి, కొప్పళ, గదగ్, హావేరి, బాగల్కోటె, విజయపుర, బెళగావి జిల్లాల్లో పండిన పంట ద్వారా ఏడాదికి రూ.5,500 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం రూ.7,550 మద్దతు ధర ప్రకటించింది. 55 లక్షల క్వింటాళ్ల మేర కొనుగోలు చేయాలని కంది మండలి నిర్ణయం తీసు కుంది. కంది మండలి ఏర్పాటై దశాబ్దం గడిచినా నేటికి సర్కార్ నయా పైసా నిధులు కూడా కేటాయించలేదు. రోగం బారిన పడిన ఎర్రబంగారం ఈ సంవత్సరం తగ్గిన సాగు విస్తీర్ణం -
డిసెంబర్ 13న లోక్ అదాలత్
కేజీఎఫ్ : డిసెంబర్ 13న చివరి లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి శివకుమార్ తెలిపారు. శనివారం నగరంలోని న్యాయవాదుల సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది అక్టోబర్ 13నాటికి 1,99,93,873 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. కుటుంబ కలహాలు, చెక్బౌన్స్ తదితర ఎన్నో కేసులను లోక్అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. సమావేశంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రాజగోపాలగౌడ, న్యాయమూర్తి నాగలక్ష్మి, ముజాఫర్ మాంజరి, వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నగల షాపులో మస్కా
● 6 బంగారు గొలుసుల చోరీ మైసూరు: బంగారం బహుప్రియం కావడంతో దొంగలు తెగబడుతున్నారు. కొనుగోలుదారులా వచ్చి ఓ నగల షాపులో పెద్దమొత్తంలో చైన్లను తస్కరించాడో దొంగ. మైసూరు అశోక రోడ్డులోని దీప్ జువెలర్స్లో ఈ ఘటన జరిగింది. వివరాలు... అంగడికి సుమారు 55 ఏళ్ల వ్యక్తి వచ్చి బంగారు, వెండి నాణేలను చూపించాలని అడిగాడు. దీంతో యజమాని రతన్లాల్ 20 నాణేలను అతని ముందు ఉంచాడు. వాటిని చూసి పక్కన పెట్టిన ఆ వ్యక్తి 2 గ్రాముల బంగారు నాణేలుంటే చూపించండి, దేవస్థానానికి ఇవ్వాలి, లోపల ఉంటే తీసుకురండి అని చెప్పాడు. రతన్లాల్ తమ వద్ద బంగారు నాణేలు లేవు, కావాలంటే తెప్పించి ఇస్తామని చెప్పి బాబు అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. అంతలో ఆ వ్యక్తి బంగారు గొలుసులను చూపించండి అనడంతో కొన్ని గొలుసులను తీశాడు. జైన దేవాలయం స్వామీజీకి ఇవ్వాలని, అందువల్ల మహిళలు తాకని కవర్లో ఉంచిన చైన్లను చూపించాలని అడిగాడు. దీంతో రతన్లాల్ ఫోల్డింగ్ లెదర్ బ్యాగ్లో వివిధ డిజైన్లు ఉన్న 5–6 గొలుసుల ను చూపించారు. ఆ వ్యక్తి ఆ గొలుసులను ఒక్కొక్కటే ప్లాస్టిక్ కవర్లో వేసి అంగడిలో పూజా పీఠంలో ఉంచి పండ్ల బ్యాగ్లో పెట్టాడు. వీటిని ఇలానే బ్యాగ్లో పెట్టి ఉంచండి, మా పిల్లాడు వచ్చి ఒక గొలుసును కొనుగోలు చేస్తాడని చెప్పి రూ.5 వేల నగదు ఇచ్చి వెళ్లాడు. అతను వెళ్లిన తర్వాత రతన్లాల్ కవర్ను పరిశీలించగా, అందులో 6 గొలుసులు లేవు. లబోదిబోమంటూ లష్కర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.సవతి తండ్రి చేతిలో బాలిక హత్యబనశంకరి: మారుతండ్రి చేతిలో చిన్నారి పాప బలైంది. తమ సంతోషానికి అడ్డుగా ఉందని పాపను కిరాతకుడు గొంతు పిసికి చంపివేశాడు, ఈ సంఘటన బెంగళూరు పరిధిలోని కుంభళగూడు పోలీస్స్టేషన్ పరిదిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు... స్థానిక రామసముద్ర కన్నికా లేఔట్లో శిల్పా, కూతురు సిరి (7)తో నివసిస్తోంది. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న శిల్పా భర్త నుంచి విడిగా ఉంటోంది. ఈ మధ్య ఆనేకల్లో మార్కెటింగ్ ఉద్యోగం చేసే దర్శన్ అనే వ్యక్తితో శిల్పా కు పరిచయం ఏర్పడి తరువాత పెళ్లి చేసుకున్నారు. సవతి కూతురు సిరి అంటే దర్శన్కు నచ్చేది కాదు. మన సంసారంలో సిరి అడ్డుగా ఉందని శిల్పా తో గొడవపడ్డాడు. శుక్రవారం ఉదయం శిల్పా విధులకు వెళ్లింది. సాయంత్రం 5.30 సమయంలో దర్శన్ ఇంటికి వచ్చాడు, సిరి ముఖంపై కొట్టి గొంతు పిసికి చంపి పారిపోయాడు. శిల్పా ఇంటికి వచ్చి చూడగా కుమార్తె శవం కనిపించడంతో తల్లిడిల్లింది. స్థానిక పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్శన్ కోసం గాలిస్తున్నారు.అవినీతి పెరిగింది: మోహన్దాస్ శివాజీనగర: తరచూ విమర్శలతో రాష్ట్ర కాంగ్రెస్ సర్కారును ఇరుకున పెడుతున్న ఐటీ పారిశ్రామికవేత్త మోహన్దాస్ పాయ్.. మరోసారి ఎక్స్లో ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి గారూ.. మీ శాఖల్లో అవినీతి చాలా అధికమైంది. ఒక్కొక్క శాఖ ఒక్కొక్క వసూలు రేటును పెట్టుకొందని ఆరోపించారు. పరిశ్రమలకు తక్షణ అనుమతులకు మీరు సింగిల్ విండోకు ప్లాన్ చేశారు, ఇది మంచిదే అన్నారు. మీ ఆలోచనకు ధన్యవాదాలు. అయితే అధికారులు ఆ తరువాత అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది, సింగిల్ విండో ఇక్కడ సాధ్యపడదు. ఎందుకంటే శాఖలలో అవినీతి చాలా ఎక్కువైంది అని పేర్కొన్నారు. -
గీజర్ మృత్యువాయువు
జానపదంమైసూరు: వేడినీళ్ల కోసం అమర్చుకున్న గ్యాస్ గీజర్ మృత్యుపాశాలుగా మారుతున్నాయి. తరచూ ఎక్కడో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గీజర్ నుంచి గ్యాస్ లీకై అక్కాచెల్లెళిద్దరూ ఊపిరాడక మరణించిన దారుణ ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకాలో జరిగింది. మృతులను పిరియాపట్టణలోని బెట్టదపుర నివాసులైన అల్తాఫ్ పాషా రెండో కుమార్తె గుల్బమ్ తాజ్ (23), నాలుగో కుమార్తె సిమ్రాన్ (21)గా గుర్తించారు. వివరాలు.. పిరియాపట్టణలోని జోనిగేరి వీధిలో అల్తాఫ్ పాషా కుటుంబం కొత్తగా బాడుగ ఇంటిలోకి చేరి ప్రార్థనలు చేసి పిండివంటలు చేసుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికి.. రాత్రి సుమారు 7 గంటల సమయంలో అక్కాచెల్లెళ్లిద్దరూ స్నానానికి వెళ్లారు. ఈ సమయంలో స్నానాల గదిలోని గ్యాస్ గీజర్ను ఆన్ చేయగానే దాని నుంచి విషపూరిత గ్యాస్ లీకై ంది. కొంతసేపటికి ఊపిరాడక ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో గది తలుపులు తెరిచి చూడగా కుప్పకూలిపోయి ఉన్నారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల నిశ్చితార్థం కాగా అల్తాఫ్ పాషాకు నలుగురు కుమార్తెలు సంతానం ఉండగా, వారిలో ఇద్దరికి వివాహాలయ్యాయి. గుల్బమ్ తాజ్కు ఇటీవల నిశ్చితార్థమైంది. ఘటన సమయంలో కాబోయే భర్త కుటుంబం వారి ఇంటిలోనే ఉంది. ఈ ఘోరంతో కుటుంబీకులు తీవ్రంగా విలపించారు. అక్కాచెల్లి బలి మైసూరు జిల్లాలో దుర్ఘటన -
వణికించిన భారీ వర్షం
రాయచూరు రూరల్: జిల్లాలో శుక్ర, శనివారాల్లో తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసినా రోడ్లు బురద గుంటలుగా మారాయి. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారు జామున 2 గంటల వరకు వర్షం పడింది. లోతట్టు ప్రాంతంలోని జలాల్ నగర్, మున్నూరు వాడి, లాల్ పహాడ్, మహావీర చౌక్, దేవినగర్, మడ్డిపేట ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చొరబడ్డాయి. నగరసభ మాజీ సభ్యులు తిమ్మారెడ్డి, శాలం కాలనీలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వాన నీటిని మళ్లించడానికి చర్యలు తీసుకోవాలని నగరసభ అధికారులకు సూచనలు జారీ చేశారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వానలకు వాగులు, వంతెనలు పొంగి ప్రవహిస్తుండటంతో పంట పొలాల్లోకి నీరు చేరాయి. ఇడపనూరు, పుచ్చలదిన్ని, మిడగలదిన్ని, గదార, యరగేర, బిచ్చాలి, యడ్లాపుర మధ్య రహదారి కోతకు గురైంది. మరో వైపు వర్షాలు కురవడంతో వరి పైరు నేలకొరిగి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొప్పళ తాలూకా బసాపుర రైతు లక్ష్మణ్ రాజారాం పేట పొలంలో క్రిమి సంహారక మందును తాగడానికి ప్రయత్నించాడు. నెల రోజుల క్రితం అతివృష్టి కురవడం, శుక్రవారం సాయంత్రం అకాల వర్షాలకు వరిపైరు నేలకొరిగింది. నేలవాలిన పంటను చూడలేక రైతు ఆత్మహత్యాయ త్నానికి పూనుకున్నారు. లోతట్టు కాలనీలు జలమయం వర్షం దెబ్బకు నేలకొరిగిన వరి పైరు కొప్పళ జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం -
మాతా శిశు మరణాలను అరికట్టాలి
హొసపేటె: జిల్లాలోని అన్ని ఆస్పత్రులలో మాతా, శిశు మరణాల కేసులు పెరగకుండా వైద్య అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, జాగ్రత్తగా విధులు నిర్వహించాలని జిల్లాధికారిణి కవిత ఎస్. మన్నికేరి సూచించారు. శుక్రవారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో జిల్లా యంత్రాంగం, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన మాతా, శిశు మరణాలపై ఆడిట్ సమావేశానికి అధ్యక్షత వహించి ఆమె మాట్లాడారు. అన్ని ఆస్పత్రుల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి, వైద్యులు సకాలంలో ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలన్నారు. రోగులను తనిఖీ చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మాతా శిశు, మరణాల పెరుగుదలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోడానికి, జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆస్పత్రిలో వైద్యాధికారులంతా ప్రతి శనివారం జిల్లా, తాలూకా స్థాయి సమావేశాలను నిర్వహించి లోపాలకు పరిష్కారాలను కనుగొనాలని ఆదేశించారు. ఈ విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణులకు అత్యవసర సేవలు అవసరమైతే తాలూకా వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి చికిత్స అందించాలన్నారు. అందుబాటులో ఉన్న నిధులను నాణ్యమైన సేవలను అందించడానికి ఉపయోగించాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు ఆరోగ్య సలహాలు, నివారణ చర్యల గురించి వివరించాలన్నారు. గర్భిణులు, బాలింతల స్క్రీనింగ్, సురక్షితమైన డెలివరీ, పౌష్టికాహారంపై ఆయుష్ విభాగంతో సంప్రదింపులు జరపాలన్నారు. సాధారణంగా మాతృ మరణాల్లో ముఖ్యమైన రక్తహీనత, రక్తస్రావం అంశాలకు ఆరోగ్య శాఖ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అన్నారు. జెడ్పీ డిప్యూటీ సెక్రటరీ కే.తిమ్మప్ప, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ఎల్ఆర్.శంకర్నాయక్, జిల్లా ఆర్సీహెచ్ అధికారి జంబయ్య, జిల్లా సర్వే అధికారి డాక్టర్ షణ్ముఖ నాయక్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ రాధిక, తాలూకా వైద్యాధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
రైలు ప్రయాణం.. నరకప్రాయం
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలో రైలు ప్రయాణికులకు తిప్పలు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి యాదగిరి, రాయచూరు రైల్వే స్టేషన్ల పరిధిలో రైలు బోగీలు ప్రయాణికులతో పూర్తిగా నిండిపోవడంతో కింద పడుకొని పిల్లా పాపలతో ప్రయాణం చేశారు. లాతూర్ నుంచి బెంగళూరు వరకు వెళ్లే రైలులో ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల నుంచి జీవనోపాధి కోసం వెళ్లే వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. పండుగ సమయంలో అదనపు రైళ్లను నడపకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనీసం అదనపు బోగీలను కూడా అమర్చకుండా ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలున్నాయి. -
తుంగభద్ర పరవళ్లు
హొసపేటె: కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన నదీ పరివాహకంలోని తీర్ధహళ్లి, శివమొగ్గ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శనివారం 24 వేలకు పైగా క్యూసెక్కుల వరద చేరింది. దీంతో 5 గేట్లను రెండున్నర అడుగుల మేరకు పైకెత్తి దిగువకు 18 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసినట్లు మండలి అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో నదికి ఇరువైపుల లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1626.06 అడుగులు, నీటినిల్వ 80.003 టీఎంసీలు, ఇన్ఫ్లో 24,500 క్యూసెక్కులుగా ఉందని మండలి వర్గాలు తెలిపాయి. తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో పర్యాటకులతో డ్యాం పరిసరాలు కిటకిటలాడాయి. శనివారం డ్యాం వద్ద పర్యాటకుల సందడి కనిపించింది. గేట్ల నుంచి దిగువకు పారుతున్న నీటిని వీక్షించి పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు. -
అభివృద్ధి పథంలో బళ్లారి
సాక్షి బళ్లారి: తనపై ఎంతో విశ్వాసం, నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం తన 36వ జన్మదినం పురస్కరించుకొని నగరంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, కనక దుర్గమ్మ ఆలయంతో పాటు పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బళ్లారి సర్వతోముఖాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. సువర్ణ బళ్లారిగా మార్చేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఎన్నో నూతన పథకాలు అమలు చేశామన్నారు. ప్రతి రోడ్డును అభివృద్ది చేయడానికి ముందుకు వెళ్తున్నామన్నారు. నగరంలో పారదర్శక పాలనను అందిస్తున్నామన్నారు. నగరంలో నిరంతరం మంచినీటిని అందించేందుకు తుంగభద్ర డ్యాం నుంచి బళ్లారి నగరానికి నేరుగా నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. నగరంలో రోడ్ల వెడల్పు, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.200 కోట్లతో పనులు చేపడుతున్నామన్నారు. ఇలా నగరంలో పలు రోడ్లు, స్వచ్ఛత కోసం చేపడుతున్న పనులకు నిధుల కొరత లేదన్నారు. జన్మదినం నేపథ్యంలో ముందుగా తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకొన్నారు. నగరంలో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసి ఆయా వార్డుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల రుణం తీర్చుకుంటా ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి -
గురుమఠకల్లో కవాతుకు బ్రేక్
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా చిత్తాపూర్లో ఆర్ఎస్ఎస్ కవాతు నిర్వహణకు కలబుర్గి హైకోర్టు డివిజన్ బెంచ్లో మరో పిటిషన్ వేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో యాదగిరి జిల్లాధికారి హర్షల్ బోయర్ గురుమఠకల్లో ఆర్ఎస్ఎస్ కవాతుకు బ్రేక్ వేశారు. వారం రోజుల క్రితం చిత్తాపూర్లో ఆర్ఎస్ఎస్, భీమ్ ఆర్మీ కవాతును ఒకే రోజున రెండింటికీ అవకాశం ఇవ్వడం కుదరదని తహసీల్దార్ నాగయ్య హిరేమఠ్ రెండు అర్జీలను తిరస్కరించిన సంగతి విదితమే. దీనిని ఆధారంగా చేసుకొని ఆర్ఎస్ఎస్ కలబుర్గి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆర్ఎస్ఎస్కు కొన్ని సలహాలు, సూచనలు జారీ చేస్తూ ఏరోజున ఆర్ఎస్ఎస్ కవాతు చేస్తారు? అనే అంశాన్ని ఉల్లేఖిస్తూ కొత్తగా పిటిషన్ వేయాలని ఆదేశించింది. ఈ విషయంపై కోర్టులో జరిగిన వాదనల అనంతరం విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. మూడు రోజుల క్రితం చేసిన దరఖాస్తును రద్దు చేయడంపై ఆర్ఎ్స్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరి జిల్లా సురపుర, హుణసగి, శహాపుర, వడగేర, యాదగిరిల్లో కవాతు నిర్వహించారు. త్రిచక్రవాహనాల పంపిణీరాయచూరు రూరల్ : నగరంలో పురాతన పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. శనివారం రూ.కోటితో చేపట్టిన నేతాజీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గదులను ప్రారంభించి మాట్లాడారు. పెద్దలు పిల్లలను పాఠశాలకు పంపి విద్యాబుద్దులు నేర్పించాలన్నారు. నగరంలోని చంద్ర మౌళేశ్వర సర్కిల్ నుంచి గంజ్ సర్కిల్ వరకు రహదారి అభివృద్ధికి రూ.30 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. నగరంలోని అంబిగర చౌడయ్య నూతన విగ్రహాన్ని పరిశీలించారు. తన కార్యాలయంలో మంత్రి 34 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందించారు. కార్యక్రమంలో అభినవ రాచోటి శివాచార్యులు, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షుడు సాజిద్, రుద్రప్ప, శాంతప్ప, అమరేగౌడ, జయన్న, రాజు, సుభాష్, నరసింహులు, శాలం, అధికారులున్నారు. కన్నడ భాష పరిరక్షణకు ఉద్యమం రావాలి కోలారు: అన్య భాషలు మాట్లాడే వారిని కన్నడం వైపు ఆకర్షించే ప్రయత్నం చేయాలని రాష్ట్ర కన్నడ అభివృద్ధి ప్రాధికార కార్యదర్శి సంతోష్ హానగల్ సూచించారు. కన్నడ భాషాభివృద్ధి– సవాళ్లు అనే అంశంపై నగరంలోని ప్రభుత్వ కళాశాలలో కన్నడ అభివృద్ధి ప్రాధికార, ఆదిమ సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన విచార సంకీర్ణంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఉన్నంత కన్నడ భాషాభిమానం మనలో లేకపోవడం విచారకరమన్నారు. కన్నడ అభివృద్ధికి గోకాక్ విప్లవం తరహాలో కన్నడ భాషా ఉద్యమం ప్రారంభించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కన్నడ పర సంఘటనల జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, కరవే జిల్లా అధ్యక్షుడు మేడిహాళ రాఘవేంద్ర, జయ కర్నాటక సంఘం జిల్లా అధ్యక్షుడు త్యాగరాజ్ పాల్గొన్నారు. పెళ్లి కాలేదని వ్యాన్ డ్రైవర్ ఆత్మహత్య క్రిష్ణగిరి: ఇరవై ఎనిమిది ఏళ్ల వయస్సు వచ్చినా పెళ్లి కాలేదనే బాధతో తాగుడుకు బానిస అయిన వ్యాన్ డ్రైవర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన కురుబరపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు క్రిష్ణగిరి సమీపంలోని గంగోజి కొత్తూరు గ్రామానికి చెందిన బాలాజీకి పలు సంబంధాలు చూసినా పెళ్లి కుదరలేదు. దీంతో తాగుడుకు అలవాటుపడ్డాడు. ఇక పెళ్లి జరగదేమో అని మనస్థాపానికి గురైన బాలాజీ.. శుక్రవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కురుబరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. పోలియో నిర్మూలనకు సైకిల్ యాత్ర కోలారు: పోలియో నిర్మూలనకు శ్రమిస్తున్న రోటరీ సంస్థ సీనియర్ సభ్యులు శనివారం కోలారు నగరం నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర చేపట్టారు. రోటరీ సెంట్రల్ మాజీ అధ్యక్షుడు సిఎంఆర్ శ్రీనాథ్ మాట్లాడుతూ దేశంలో పోలియేను సమూలంగా నిర్మూలించాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ఇందుకోసం సైకిల్ యాత్రను ప్రారంభించామన్నారు. అనంతరం సైకిల్ యాత్రికులకు పుష్పగుచ్ఛం అందించి శక్తి వర్ధక పానీయాలను అందించారు. రోటరి అధ్యక్షుడు నాగరాజ్, వలయ కార్యదర్శి ఎస్ సుధాకర్, వలయ అధ్యక్షుడు రవీంద్రనాథ్ పాల్గొన్నారు. -
కంది రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఈ ఏడాది కంది పంటకు రోగం సోకడంతో పాటు అతివృష్టి, ఈదురు గాలులతో నష్టపోయిన రైతులకు సర్కార్ మద్దతు ధరలు ప్రకటించి, ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలి. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు పరిచి మద్దతు ధర కల్పించాలి. ముఖ్యమంత్రి కార్పస్ ఫండ్ నుంచి పరిహారం అందించాలి. – శరణ బసప్ప, కర్ణాటక ప్రాంత రైతు సంఘం జిల్లాధ్యక్షుడు పంటకు శాసీ్త్రయ ధరలు ప్రకటించాలి కళ్యాణ కర్ణాటకలో కంది పంటకు రోగం సోకి నష్టాల బారిన పడి అప్పుల ఊబిలో చిక్కిన రైతులకు శాసీ్త్రయ ధరలు ప్రకటించాలి. ప్రకృతి వైపరీత్యాలకు అనుగుణంగా పంటల రక్షణకు సలహా, సూచనలివ్వడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారు. వానలు అధికంగా కురవడం, ఈదురు గాలులు వీయడంతో పూత రాలిపోయింది. – భీమా శంకర్, కిసాన్ సభ సంచాలకుడు -
రెండో పంటకు నీరందించండి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు కింద రెండో పంటకు నీరందించాలని రైతు సంఘం గౌరవాధ్యక్షుడు చామరస మాలి పాటిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ పంటకు నీరు అందించడానికి డీసీఎం అంగీకరించక పోవడాన్ని తప్పు బట్టారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల అమరిక విషయంలో డ్యాంలో 50 టీఎంసీల నీరున్నా గేట్ల ఏర్పాటుకు ఎలాంటి నష్టం లేదన్నారు. రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయ నగర జిల్లాల్లోని ఇంచార్జి మంత్రులు, శాసన సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు కలిసి ముఖ్యమంత్రిని కలిసి తుంగభద్ర ఎడమ కాలువ కింద రబీ సీజన్కు నీరు వదలాలని కోరాలన్నారు. 70 ఏళ్ల నాటి అక్విడక్ట్లు, రహదారులు, డిస్ట్రిబ్యూటర్ల మరమ్మతులు చేపడతామంటే రైతులు రెండవ పంటను వదులుకోడానికి సిద్ధమన్నారు. డ్యాం క్రస్ట్గేట్ల అమరిక కోసం రైతులు రబీ పంటను వదులుకోవడం సాధ్యం కాదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలన్నారు. మాజీ శాసన సభ్యుడు గంగాధర నాయక్, రైతు నేతలు బూదయ్య స్వామి, ప్రభాకర్ పాటిల్, జాన్ వెస్తీలున్నారు. -
విద్యార్థులు వృత్తిశీల నైపుణ్యత సాధించాలి
బళ్లారి రూరల్: ఇంజినీరింగ్లో ఐఈఈఈ విద్యార్థులు అత్యాధునిక అవకాశాలతో వృత్తిశీల నైపుణ్యాన్ని సాధించాలని బెంగళూరు దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్, అకడమిక్ అండ్ హెచ్ఓడీ డాక్టర్ అన్నపూర్ణ పి.పాటీల్ తెలిపారు. శుక్రవారం ఆర్వైఎంఈసీలో జాతీయ స్థాయి ఐఈఈఈ దినోత్సవ ఆచరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఐఈఈఈ విద్యార్థులు నెట్వర్కింగ్, అత్యాధునిక పరిశోధనలు వృత్తిశీల అభివృద్ధికి ఎంతో సహకరిస్తాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రగతిని సాధించాలన్నారు. కార్యక్రమంలో వీరశైవ విద్యావర్ధక సంఘం అధ్యక్షుడు డాక్టర్ కణేకల్ మహంతేశ్, పాలక మండలి అధ్యక్షుడు జానెకుంటె బసవరాజు, కార్యదర్శి డాక్టర్ అరవింద్ పాటిల్, సహకార్యదర్శి యాళ్పి మేటి పంపనగౌడ, కోశాధికారి బైలువద్దిగేరి ఎర్రిస్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ హనుమంతరెడ్డి, వైస్ప్రిన్సిపాల్ డాక్టర్ సబితా సోనాలి తదితరులు పాల్గొన్నారు. దంత పరీక్ష శిబిరంరాయచూరు రూరల్: నగరంలో ఉచిత దంత ఆరోగ్య చికిత్స శిబిరాన్ని ప్రముఖ దంత వైద్యురాలు జయశ్రీరెడ్డి చేపట్టారు. శనివారం నగరంలోని జైన్ మందిర్ రహదారిలోని ఆస్పత్రిలో దంత వ్యాధులపై ఉచిత పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో మొదటి రోజున 25 మందికి ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు చేశారు. బళ్లారిలో జువెల్స్లో సోదాలుసాక్షి బళ్లారి: కేరళ శబరిమలలో అయ్యప్పస్వామి ఆలయానికి చెందిన బంగారాన్ని అక్రమంగా బళ్లారిలోని రొద్దం జువెల్స్లో అమ్మకం జరిగినట్లు సిట్ అధికారులకు తెలియడంతో సదరు అంగడిలో సోదాలు చేశారు. బళ్లారి నగరంలోని రొద్దం జువెల్స్లో 475 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు అంగడి యజమాని గోవర్ధన్ సిట్ అధికారుల ముందు ఒప్పుకొన్నారు. తనకు అయ్యప్పస్వామి ఆలయానికి చెందిన బంగారమని తెలియదని చెప్పాడు. సిట్ అధికారులు విచారణ జరిపి, మళ్లీ పిలిస్తే తప్పకుండా రావాలని సూచించారు. రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలుబళ్లారి రూరల్ : బళ్లారి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని పోలీస్ జింఖానాలో రాష్ట్ర స్థాయి వెటరన్ టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను జిందాల్ ఫౌండేషన్ సీఎస్ఆర్ హెడ్ బి.పెద్దన్న ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం, ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ఈ పోటీల విజేతలకు జిందాల్ ఫౌండేషన్ ట్రోఫీలను, ఆరు టేబుల్ టెన్నిస్ బోర్డులను, ఇతర పరికరాలను అందజేసింది. పోటీల్లో బళ్లారి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రముఖులు, టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు. నదిలో యువకుడు జలసమాధి గుమ్మఘట్ట: సరదాగా నదిలో స్నానానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో బైరవానితిప్ప ప్రాజెక్టు ఎగువ భాగాన ఉన్న సరిహద్దు కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఆంధ్ర, కర్ణాకట నుంచి నిత్యం సందర్శకులు వస్తుంటారు. యువకులు నీటిని చూసి ఊరుకోలేక ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. అయినా సంబంధిత శాఖల అధికారుల్లో మచ్చుకై నా చలనం కనిపించడం లేదని బాధిత తల్లిదండ్రులు, ప్రజలు విమర్శిస్తున్నారు. రాయదుర్గం పట్టణానికి చెందిన ఫయాజ్, హమాన్, నోమిన్ అనే యువకులు శనివారం బైక్లో ప్రాజెక్టు వద్దకు వచ్చారు, వేదావతి హగరికి వెళుతున్న నీటిలోకి దిగారు, వీరిలో ఫయాజ్ (20) ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోవడంతో చనిపోయాడు. సనావుల్లా, ఫాతిమా దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు కావడంతో వారు గుండెలవిసేలా రోదించారు. -
రోగుల గోస పట్టేదెవరికి?
సాక్షి, బళ్లారి: నగరంలో పేరు గాంచిన జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ఓపీ రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జిల్లా ఆస్పత్రిలో కొత్త హంగులతో ప్రైవేటు ఆస్పత్రికి దీటుగా వైద్యం అందిస్తుండటంతో పాటు ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్రే, తదితరాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నగరంలో ఓపీడీ ఆస్పత్రి తర్వాత అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా గుర్తింపు పొందిన గోస ఆస్పత్రి(జిల్లా ఆస్పత్రి) ప్రముఖంగా కాన్పుల ఆస్పత్రిగా పేరుగాంచింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు స్థానికంగా ఓటర్ ఐడీ, ఇతర గుర్తింపు కార్డుతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి ముందుగా ఇక్కడ పేరు నమోదు చేసి ఓపీ చీటీ తీసుకున్న తర్వాతే ఆస్పత్రిలో చికిత్స చేయించుకొనే అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రతి నిత్యం ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోయి ఓపీ చీటీల సంఖ్య నమోదు చేసేందుకు సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. కంప్యూటర్లలో కూడా పేరు నమోదు చేయడానికి ఒక్కొక్కసారి సాంకేతిక సమస్య కూడా తలెత్తుతోంది. రోగుల బాధలు వర్ణనాతీతం ఈ నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ఓపీ చీటీ తీసుకోవడానికి రోగులు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఆస్పత్రిలో అన్ని రకాల చికిత్సలకు వైద్యులు మెరుగైన చికిత్సలను అందిస్తున్నా ముందుగా ఓపీ చీటీ తీసుకోడానికి గంటల తరబడి వరుస(క్యూ)లో నిలబడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో అత్యవసర చికిత్స పొందే రోగుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ తరుణంలో గురువారం ఏఐకేకేఎంస్ జిల్లా కార్యదర్శి గురళ్లి రాజా తదితరులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు రోగులు పడుతున్న ఇబ్బందులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని సందర్శించి సులభంగా ఓపీ చీటీలు ఇచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రోగులు రెండు సార్లు పేర్లు నమోదు చేసుకొనే చర్యలు చేపట్టడం సరికాదని, ఇందుకు ప్రత్యామ్నాయంగా రోగులకు ఇబ్బంది కలగకుండా జిల్లా ఆస్పత్రి పాలక మండలి తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. జిల్లా ఆస్పత్రి కౌంటర్లో పేరు నమోదుకు రోగులకు ఇక్కట్లు గంటల తరబడి క్యూలో నిలిచి ఇబ్బందులు పడుతున్న వైనం -
గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు అరికట్టండి
హొసపేటె: జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల వాడకంలో తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాల గురించి ప్రజలకు తెలియజేయడం ద్వారా గ్యాస్ సిలిండర్ ప్రమాదాలను అరికట్టాలని జిల్లాధికారిణి కవిత అధికారులకు సూచించారు. వంట గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసే, రవాణా చేసే, నిల్వ చేసే గ్యాస్ ఏజెన్సీల నిర్వహణపై నగరంలోని జిల్లాధికారి సభాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. అత్యవసర సమయాల్లో గృహ వంట సిలిండర్ల వినియోగదారులు 1906 టోల్ ఫ్రీ నెంబర్ను ఉపయోగించుకోవాలన్నారు. గృహ గ్యాస్ వినియోదారుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. వినియోగదారుల నుంచి ఏవైనా ఫిర్యాదులు వచ్చిన వెంటనే సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు నిర్లక్ష్యం వహిస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. బుకింగ్ చేసిన 48 గంటల్లోపు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలి. జిల్లాలో గృహ సిలిండర్ల సరఫరా తగినంతగా ఉండేలా చూసుకోవాలి. గృహ సిలిండర్ల కొరత లేకుండా చూసుకోవడానికి స్టాక్ను సక్రమంగా నిర్వహించాలి. ఉజ్వల పథకం లబ్ధిదారుల ఈ–కేవైసీ తప్పనిసరి చేయాలి. సిలిండర్ గృహ వినియోగదారుల కోసం భద్రతా నియమాలు (ఎస్ఓపీ) ముద్రించి, ప్రతి సిలిండర్తో పాటు వారి ఇళ్లకు పంపిణీ చేయాలి. గృహిణులకు వంట గ్యాస్ సిలిండర్ల వాడకం గురించి సమాచారం అందించాలి. ప్రతి గ్యాస్ ఏజెన్సీ తమ పరిధిలోని గ్రామాలు, వార్డులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. గాదిగనూరు గ్రామంలో ఇటీవల జరిగిన సిలిండర్ పేలుడు సంఘటనపై మనం మేల్కోనాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్ మాట్లాడుతూ గృహ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు గ్యాస్ స్టౌ పైపును అగ్ని నిరోధక పైపుతో భర్తీ చేయాలని అన్నారు. అధికారిక గ్యాస్ సరఫరాదారుల నుంచి మాత్రమే గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయాలి. సిలిండర్పై సంబంధిత కంపెనీ సీల్, క్యాప్ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. ఇళ్లలో సిలిండర్లను వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. రాత్రి నిద్రపోతున్నప్పుడు గ్యాస్ స్టౌ ఆపివేశారా లేదా అని తనిఖీ చేయాలి. సిలిండర్లను వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. గ్యాస్ ఏజెన్సీ యజమానులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
మానవ జన్మ ఎంతో ఉత్తమం
సాక్షి, బళ్లారి: ఈ చరాచర జీవరాశుల్లో మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని, మనిషిగా పుట్టిన వారు ప్రేమ, విశ్వాసం, నమ్మకంతో జీవించి దైవ నామస్మరణ చేసి ముందుకు వెళ్లాలని అడవిలింగ స్వామి పేర్కొన్నారు. గురువారం నగరంలోని అఖండ కర్ణాటక వాల్మీకి ఐక్య కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవుడికి పూజ చేయడం, టెంకాయ కొట్టడం, నైవేద్యం సమర్పించడంతోనే సరికాదని, మనసు శుద్ధంగా ఉంచుకొని భగవంతుడిని ఎవరు పూజిస్తారో అలాంటి వారికి ఎల్లప్పుడు దేవుడి ఆశీస్సులు ఉంటాయన్నారు. అఖండ కర్ణాటక వాల్మీకి ఐక్య కూటమి రాష్ట్ర అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప మాట్లాడుతూ వాల్మీకి సమాజంలో జన్మించిన మహర్షి వాల్మీకి భక్తిశ్రద్ధలతో, నియమనిష్టతో జీవితాన్ని సాగించి వాల్మీకి రామాయణాన్ని రచించి భూమి, ఆకాశం ఉన్నంత వరకు వాల్మీకి పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఇలాంటి సమాజంలో జన్మించిన మనమందరం మంచి నడతతో ముందుకెళ్లి సమాజంలో అందరి దృష్టిని ఆకర్షించాలన్నారు. కలిసి కట్టుగా ఉంటేనే ముందుకు వెళ్లడానికి సాధ్యపడుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. వాల్మీకి సమాజ ప్రముఖులు లక్ష్మణ్ తుమటి, ముద్ద మల్లయ్య, జయరాం, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అడవిలింగ స్వామి -
రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రధాన రహదారులు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులు గోతులమయంగా మారాయి. ఈ విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్లూరు, నీరమాన్వి, మాన్వి, సింధనూరు, సిరవార, కవితాళ, లింగసూగూరు, రాయచూరు, శక్తినగర్, గిల్లేసూగూరులకు వెళ్లే రహదారులు గుంతలు పడ్డాయి. గత శాసనసభ ఎన్నికల్లో గెలిచిన శాసన సభ్యులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని ప్రజలు ఖండిస్తున్నారు. శాసన సభ్యులు, మంత్రులు రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించక కాలహరణం చేయడంతోనే సరిపోయిందని ప్రజలు వాపోయారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు హరీ వారం రోజుల్లోనే ఆరు మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2002లో అప్పటి ప్రజాపనుల శాఖ మంత్రి ధరం సింగ్ హయాంలో రాయచూరు–మాన్వి–సింధనూరు రోడ్డు పనులు చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు మరమ్మతు పనులు చేపట్టలేకపోయారు. సెప్టెంబర్లో నీరమాన్వి–కప్పగల్ వద్ద పాఠశాల బస్సు ప్రమాదంలో ఇద్దరు బాలురు మరణించగా, 25 మంది విద్యార్థులు గాయాల పాలయ్యారు. వారం రోజుల క్రితం కల్లూరు వద్ద ముగ్గురు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. జాతీయ రహదారి– 167 బెళగావి నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రాంతంలో 2025లో 616 ప్రమాదాలు జరగగా 280 మంది దుర్మరణం పాలయ్యారు. అధ్వాన స్థితిలో ప్రధాన రహదారులు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోని వైనం 2025లో 616 ప్రమాదాల్లో 280 మంది మృతి -
కన్నడలో నామఫలకాలు ఏర్పాటు చేయాలి
రాయచూరు రూరల్: నగరంలో వ్యాపారస్తులు దుకాణాలు, హోటళ్లపై కన్నడ భాషలో నామఫలకాలు ఏర్పాటు చేయాలని నమ్మ కర్ణాటక సేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు కొండప్ప మాట్లాడారు. నవంబర్ నుంచి కన్నడ రాష్ట్రావతరణ సందర్భంగా ఖచ్చితంగా కన్నడ భాషలోనే నామఫలకాలను వేసేలా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆయకట్టులో రెండో పంటకు నీరివ్వండిరాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో రెండో పంటకు నీరందించాలని ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి, రైతు సంఘం గౌరవాధ్యక్షుడు చామరస మాలి పాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం మంత్రాలయంలోని పద్మనాభ అతిథిగృహంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్తో చర్చించారు. రబీ పంటకు నీరు అందించడానికి డీసీఎం అంగీకరించారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల అమరికకు రెండు రాష్ట్రాల మంత్రులతో చర్చిస్తామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం అందించాలని విన్నవించినట్లు తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరూ రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో పండించిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం దేవదుర్గ తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మల్లేష్ నాయక్ మాట్లాడారు. కల్యాణ కర్ణాటకలోని కొప్పళ, బళ్లారి, రాయచూరు, యాదగిరి, కలబుర్గి, బీదర్, విజయ నగర జిల్లాల్లో వరదల వల్ల నష్ట పోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు. వాణిజ్య పంటలకు మద్దతు ధర ప్రకటించి వారిని ఆదుకోవాలన్నారు. మొక్కజొన్నలకు క్వింటాల్కు రూ.4500 మద్దతు ధర కేటాయించి 35 క్వింటాళ్లను కొనుగోలు చేయాలని, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటాల్కు రూ.9100 మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. టీబీ డ్యాంకు పెరిగిన వరదహొసపేటె: తుంగభద్ర జలాశయానికి తిరిగి వరద కొనసాగుతుండటంతో ఏ క్షణమైనా నదికి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. గత మూడు రోజుల నుంచి డ్యాంకు ఎగువన పరివాహక ప్రాంతాల్లో వర్షాలు ఊపందుకోవడంతో డ్యాంకు వస్తున్న వరద భారీగా పెరిగింది. గురువారం డ్యాంకు 21 వేల క్యూసెక్కుల వరకు నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం వర్షం కురుస్తుండటం కొనసాగుతుండటంతో భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని, ఏ సమయంలోనైనా దిగువకు భారీగా వరద నీరు విడుదల చేసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేశారు. పంటలకు మద్దతు ధర ప్రకటించండి రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో పండించిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాలని జన సేవ ఫౌండేషన్ డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జావిద్ ఖాన్ మాట్లాడారు. రాయచూరు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం, వాణిజ్య పంటలకు మద్దతు ధర ప్రకటించి రైతులు ఆదుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
పేకాట కేంద్రాలపై మెరుపు దాడి
సాక్షి, బళ్లారి: దీపావళి పండుగ నేపథ్యంలో పేకాటరాయుళ్లు జిల్లాలో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు మెరుపుదాడి చేసి దాదాపు రూ.17,31,140లను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ శోభారాణి గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. గత మూడేళ్లుగా దీపావళి పండుగ సందర్భంగా పేకాట నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఎంతెంత నగదు స్వాధీనం చేసుకొన్నారో పేర్కొన్నారు. 2023లో 101 కేసులు నమోదు కాగా రూ.10,83,800లను స్వాధీనం చేసుకొన్నామన్నారు. 2024లో 137 కేసులు నమోదు కాగా రూ.16,44,665లను స్వాధీనం చేసుకొన్నామన్నారు. పండుగల నేపథ్యంలో పేకాట నిర్వహించే వారిపై జిల్లా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. టపాసుల పేలుళ్లలో ఇద్దరికి గాయాలు హొసపేటె: దీపాల పండుగ దీపావళి సందర్భంగా బుధవారం రాత్రి ఓ ఇంటి సమీపంలో టపాసులు పేలుస్తుండటంతో ఇద్దరు పిల్లల ముఖాలపై తీవ్ర గాయాలయ్యాయి. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా గుడేకోటె గ్రామానికి చెందిన రుద్రేష్ సుజాత దంపతుల కుమారుడు కుమార్(9), తిప్పేస్వామి కుమార్తె రేణుక (10) అనే ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర వదిలి పెట్టిన బాణసంచా కాగితపు ముక్కలను పోగు చేసి వెలిగించబోగా బాణసంచా పేలి, నిప్పురవ్వలు వీరిద్దరి కళ్లు, ముఖంపై పడటంతో గాయాలయ్యాయి. బాలుడిని వెంటనే బళ్లారిలోని బిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక రేణుక గుడేకోటె ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని బాలిక తండ్రి తిప్పేస్వామి తెలిపారు. కవాతుకు సంఘాల పోటీ రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా చిత్తాపురలో ఆర్ఎస్ఎస్ కవాతుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆర్ఎస్ఎస్తో పాటు చిత్తాపురలో మూడు సంఘాల నుంచి కలబుర్గి జిల్లాధికారికి దరఖాస్తులు అందాయి. చిత్తాపురలో ఆర్ఎస్ఎస్, భీమ్ ఆర్మీ, కురుబ సమాజం, దళిత ప్యాంథర్లు నవంబర్ 2న ఒకే రోజు కవాతుకు మూడింటికి అవకాశం ఇవ్వాలంటూ అర్జీలను జిల్లాధికారిణి ఫౌజియ తరన్నంకు విన్నవించారు. ఈ విషయంపై ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కలబుర్గి హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ వేసిన సంగతి విదితమే. పేదల చదువుకు అడ్డంకి వద్దురాయచూరు రూరల్: సమాజంలో పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి అడ్డంకి రాకూడదని ఈడీఆర్టీ సంస్థ సంచాలకురాలు రత్న పేర్కొన్నారు. గురువారం తాలూకాలోని పంచముఖి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 250 బ్యాగులు, 1080 నోటు పుస్తకాలు, వంద ప్లేట్లు, వంద గ్లాసులు పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రాధాన్యత కల్పించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిద్దాలన్నారు. మహిళా ఎస్ఐపై లైన్మెన్ దాడి.. అరెస్ట్ హుబ్లీ: విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై రైల్వే లైన్మెన్ దాడి చేసి పోలీసు వాహనానికి హాని కలిగించిన ఘటన నవలగుంద బస్టాండ్ దగ్గర హుబ్లీ– విజయపుర హైవేలో వెలుగు చూసింది. బాధ్యుడిని అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్ కవాతు వేళ భద్రత కోసం విచ్చేసిన అణ్ణిగేరి ఎస్ఐ ఉమాదేవిపై నవలగుంద తాలూకా గుడిసాగర నివాసి ద్యామనగౌడ కులకర్ణి బైక్లో వచ్చి పోలీస్ వాహనాన్ని ఢీకొన్నాడు. అంతేగాక ఆమె ఎస్ఐను అసభ్యంగా దుర్భాషలాడి నిందించాడు. కాలిపై కొరికి గాయపరిచాడని ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనపై నవలగుంద పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. సీఐపై అవినీతి కేసు నమోదు రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో నిధి తవ్వే విషయంలో నలుగురు నిందితులను పట్టించిన వారి వద్ద నుంచి లంచం తీసుకున్న ఆరోపణలపై సురపుర సీఐపై కేసు నమోదైన ఘటన చోటు చేసుకుంది. సురపుర తాలూకా నాగరాళలో గుప్త నిధులున్నాయని, వాటిని తీసి ఇస్తామని మోసం చేసిన వ్యక్తులు, డబ్బులను రెండింతలు చేసి ఇస్తామని చెబుతూ నమ్మించిన రామణ్ణ గౌడ, నాగయ్య స్వామి, వగ్గ నింగయ్య, భీమణ్ణ ఇతరుల నుంచి డబ్బులు వసూలు చేసి స్వామిని పిలిపించి పనులు చేయిస్తామంటూ పట్టించిన నిందితులను సీఐ ఉమేష్ నాయక్ రూ.10 లక్షలు లంచం తీసుకొని వదిలిపెట్టినట్లు ఎస్సీ, ఎస్టీ సమితి అధ్యక్షుడు మల్లికార్జున నాయక్ ఎస్పీ పృథ్వీశంకర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సీఐపై ఎస్పీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆస్పత్రి ఆవరణం వర్షార్పణం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా గుడేకోటె ఆస్పత్రి ఆవరణం గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి వాన నీటితో నిండింది. ఆస్పత్రికి వచ్చే రోగులు వాన నీటిలోనే నడవాల్సిన పరిస్థితి వచ్చింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో ఇక్కడ నీరు నిలిచిపోవడంతో రోగులకు నరకయాతనగా మారింది. ఈ ప్రాంతంలో ఈ ఏకై క ఆస్పత్రి ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి నిత్యం వందలాది రోగులు ఆస్పత్రికి వస్తారు. వర్షం పడినప్పుడు తాము ఆస్పత్రికి వెళ్లాలంటే వర్షం నీటిలో అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉందని, ఈ విషయంపై ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
అకాల వర్ష బీభత్సం.. వరి పైరుకు నష్టం
రాయచూరు రూరల్: అకాల వర్ష బీభత్సంతో కోతకొచ్చిన వరి పైరు నష్టం అంచు కోంది. దేవదుర్గ, సింధనూరు తాలూకాలో వేలాది ఎకరాల్లో పంట ఒరిగింది. శుక్రవారం సాయంత్రం రెండు తాలూకాల్లో వర్షాలు కురవడంతో రైతుల నోటిలో మట్టి పడినట్లయింది. సింధనూరు తాలూకా రౌడకుంద, జవళగేర, రాగలపర్వి, బూదిహాళ క్యాంప్, హుడా, గొరేబాళ్, సోమలాపుర వంటి ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. దేవదుర్గ తాలూకా జాలహళ్లి, చప్పళికి ఇతర ప్రాంతాల్లో రైతులు వేసుకున్న వరి పంటలు చేతికొచ్చే సమయంలో వరుణ దేవుడు కరుణించక కాటు వేశాడని రైతులు చింతిస్తున్నారు. గురువారం విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి అకాల వర్షంతో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. -
చెన్నమ్మ ధైర్య సాహసాలు ఆదర్శప్రాయం
హొసపేటె: బ్రిటిష్ వారికి ఎదురొడ్డి ధైర్యంగా పోరాడి దేశ స్వాతంత్య్రం కోసం వీర సైనికులను పెంచిన తొలి మహిళా పోరాట యోధురాలు కిత్తూరు రాణి చెన్నమ్మ ధైర్యసాహసాలు నేటి మహిళలకు ఆదర్శప్రాయమని జిల్లాధికారిణి కవితా ఎస్.మన్నికేరి అన్నారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతిని చెన్నమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడారు. వీర వనిత కిత్తూరు రాణి చెన్నమ్మ ఇప్పటికీ మహిళా సమాజానికి గొప్ప ప్రేరణ అన్నారు. ఆమె దృఢ సంకల్పం, పోరాట స్పూర్తి, ప్రతి సీ్త్ర అన్యాయానికి వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచడానికి ప్రేరేపిస్తుందన్నారు. పురుషాధిక్య సమాజంలో కూడా ఆమె సమర్ధవంతంగా పాలించారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలను కాపాడిందన్నారు. పరిపాలన, రాజకీయాలు సహా ఏ రంగంలోనైనా మహిళలు విజయవంతమైన నాయకులుగా ఎదగగలరని ఆమె నిరూపించారన్నారు. చిన్నతనంలోనే ఆమె గుర్రపు స్వారీ, కత్తిసాము, విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించారన్నారు. నేటి మహిళలు కూడా ఆత్మరక్షణ కోసం కొన్ని నైపుణ్యాలను నేర్చుకోవాలన్నారు. అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప, జిల్లా పంచాయతీ ఉప కార్యదర్శి కే.తిమ్మప్ప, కన్నడ, సంస్కృతి శాఖ సహాయ సంచాలకులు సిద్దలింగేష్ రంగన్నవర్, వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు గొగ్గ చెన్నబసవరాజ్, ప్రధాన కార్యదర్శి నీలకంఠగౌడ, ప్రముఖ కిచిడి కొట్రేష్, మధుర చెన్నశాస్త్రి, సోమ బసవరాజ్, రవిశంకర్, శరణ బసవరాజ్ ఎల్.కోతంబరి, శివపుత్రప్ప, కాశీనాథయ్య, చిత్తప్ప, మల్లికార్జున్ మేస్త్రి, విశ్వనాథ్, గౌళి రుద్రప్ప, మల్లేశప్ప, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: నగరంలో కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతిని గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో నిర్వహించారు. ముందుగా కిత్తూరు రాణి చెన్నమ్మ చిత్రపటానికి రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పూజలు చేశారు. అనంతరం రంగమందిరంలో జరిగిన సమావేశంలో అదనపు ఎస్పీ కుమారస్వామి మాట్లాడారు. బాల్యం నుంచి గుర్రపు స్వారీ చేస్తూ కత్తి పట్టుకొని యుద్ధం చేయడానికి తర్ఫీదు పొందిన ఆమె బ్రిటిష్ సైనికులతో యుద్ధ విజయాలలో ఓటమి ఎరుగని ధీరురాలిగా పేరొందారన్నారు. కార్యక్రమంలో పంచ గ్యారెంటీల సమితి అధ్యక్షుడు పవన్ పాటిల్, పరమేశ్వర సాలిమట్్, ఉదయ్ కుమార్, తహసీల్దార్ పరశురాం, చంద్రశేఖర్, విజయలక్ష్మి, నిర్మల బెణ్ణి, సులోచన, జ్యోతి, సరోజ, ఈరమ్మ, నాగనగౌడ, మహంతేష్ పాటిల్, దండెప్పలున్నారు. -
సతీష్ జార్కిహోళి సీఎం అయితే సంతోషమే
సాక్షి బళ్లారి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మారుస్తారనే వదంతులు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడే సిద్ధూ తర్వాత జార్కిహోళి సమర్ధవంతమైన నాయకుడని పేర్కొన్న నేపథ్యంలో వాల్మీకి సముదాయానికి చెందిన సతీష్ జార్కిహోళి ముఖ్యమంత్రి అయితే తమకు సంతోషమేనని వ్యక్తిగతంగా తన మద్దతు కూడా ఉంటుందని మాజీ మంత్రి బీ.శ్రీరాములు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అస్తవ్యస్తంగా మారిందని, కుర్చీ కోసం రాజకీయం చేస్తున్నారే కాని జనం సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ(అత్యవసర) పాలన ఏ విధంగా కొనసాగిందో అదే తరహాలో రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే ఉపముఖ్యమంత్రిని చేయడానికి చేస్తున్న రాజకీయాలు జనం గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్వి కక్షసాధింపు రాజకీయాలు ఆర్ఎస్ఎస్కు మద్దతు ఇచ్చేవారిపై కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు రాజకీయాలు చేస్తుందన్నారు. నవంబర్లో రాష్ట్రంలో రాజకీయ మార్పులు ఉంటాయని తుమకూరు ఎమ్మెల్యే రాజన్న పేర్కొన్న నేపథ్యంలో ఆయనతో రాజీనామా చేయించారన్నారు. ప్రియాంక్ ఖర్గేని డీసీఎం చేయడానికి చర్చ కూడా జరిగినట్లు తెలుస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్కి మద్దతు ఇచ్చిన వారిని, భారత్ మాతాకీ జై అన్నవారిని జైలుకు పంపుతున్నారని అదే పాకిస్థాన్ కో జై అన్నవారిని రాజ్యసభకు పంపుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల అధికారావధి ముగిసిందని, బీజేపీ తరఫున నియమించేందుకు పార్టీ అధ్యక్షుడు సమావేశం నిర్వహించి కేంద్ర నాయకులకు పేరు పంపుతారన్నారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన పార్టీ కోసం ఎంతో శ్రమించారు రాష్ట్రంలో అస్తవ్యస్తంగా సర్కారు పరిపాలన 1975లో ఇందిరాగాంధీ పాలనను తలపిస్తోంది ప్రియాంక్ ఖర్గేని డీసీఎం చేయడానికి యత్నం విలేకరులతో మాజీ మంత్రి శ్రీరాములు -
కడుపులోనూ బతకనివ్వరు
గర్భిణులకు వ్యథ మైసూరు: అవాంఛిత గర్భం, కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తేలితే నిర్దాక్షిణ్యంగా అబార్షన్లు చేసే ముఠా బాగోతమిది. మైసూరు తాలూకా హునగనహళ్లిలో అక్రమ అబార్షన్ల ముఠా పట్టుబడింది. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. హునగనహళ్లిలోని తోటలో ఉన్న ఇంటిలో చట్టవ్యతిరేకంగా స్కానింగ్ సెంటర్ను తెరిచారు. ముఠా సభ్యులు.. వైద్యులు, తెలిసినవారిని కలిసి లింగ నిర్ధారణ చేస్తామని చెప్పేవారు. వేలాది రూపాయలను తీసుకుని స్కానింగ్ చేసేవారు. గర్భిణి కడుపులో ఉన్న శిశువు ఆడ, మగో చెప్పేవారు. ఇందుకు రూ.25 వేలు వసూలు చేస్తారు. ఇక ఆడ బిడ్డ ఉంది, అబార్షన్ చేయాలంటే మరింత డబ్బు ఇవ్వాలి. అక్కడే గర్భవిచ్ఛిత్తికి పాల్పడేవారు. అలా వందలాది అబార్షన్లు చేసినట్లు అనుమానాలున్నాయి. గర్భిణులు వద్దు వద్దంటున్నా వారి భర్తల ఒత్తిడితో అబార్షన్లు చేసేవారు. ఆకస్మిక దాడి.. పట్టివేత బన్నూరు రోడ్డు చుట్టుపక్కల గ్రామాల్లో కొంతకాలంగా గర్భస్థ లింగ నిర్ధారణ, అబార్షన్లు జరుగుతున్నాయని జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో గత రెండు నెలలుగా నిఘా పెట్టారు. హునగనహళ్లిలోని ఆ ఇంటి గురించి తెలియడంతో బుధవారం ఉదయమే అధికారులు, పోలీసులు సంయుక్త దాడులు జరిపి ముఠాను పట్టుకున్నారు. లాకర్లో ఉన్న రూ.3 లక్షలకు పైగా నగదును, స్కానింగ్ యంత్రాలు, గర్భస్థ నిర్ధారణ కిట్లు, ఔషధాలను స్వాధీనపరచుకున్నారు. స్కానింగ్కు వచ్చిన ఇద్దరు మహిళలను కూడా రక్షించారు. నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీహెచ్ఓ డాక్టర్ పీసీ కుమారస్వామి తెలిపారు. ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ మైసూరు వద్ద లింగనిర్ధారణ దందా ఏడుమంది ముఠా అరెస్టు -
వర్షాలకు ఇల్లు ధ్వంసం
మండ్య: తాలూకాలోని కారిగానహళ్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన ఇల్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కూలిపోయింది. సన్నకారు రైతు కాంతరాజు పెంకుటిల్లు మంగళవారం నుంచి కురిసిన వర్షానికి మట్టిగోడలు పూర్తిగా నానిపోయి కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ హాని జరగలేదు. ఇంటిలోని ధాన్యం, వంటపాత్రలు పాడయ్యాయి. రైతుకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. శిశువు చోరీ, మహిళ అరెస్టు మైసూరు: ఆరు నెలల మగ శిశువును అపహరించిన ఓ మహిళను రైల్వే పోలీసులు బంధించి శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. హాసన్కు చెందిన నందిని (50) నిందితురాలు. బుధవారం రాత్రి శిశువుతో తల్లిదండ్రులు మైసూరు రైల్వేస్టేషన్లో ప్లాట్ఫాంపై నిద్రించారు. ఈ సమయంలో నందిని, ఆ శిశువును ఎత్తుకెళ్లింది. మేల్కొన్న తల్లిదండ్రులు బిడ్డ కనిపించలేదని రోదించసాగారు. రైల్వే పోలీసులు విచారించి వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ మహిళ ఆచూకీ లభ్యమైంది. గాలింపు చేపట్టి నందినిని అరెస్టు చేసి శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. ఎందుకు ఎత్తుకెళ్లిందో నిందితురాలిని తీవ్ర విచారణ చేస్తున్నారు. సొంతూళ్ల నుంచి సిటీకి.. భారీ రద్దీ శివాజీనగర: వీకెండ్, దీపావళి వరుస సెలవులతో సొంతూళ్లకు, టూర్లకు వెళ్లిన ప్రజలు పండుగ ముగించుకొని బెంగళూరుకు తిరుగుముఖం పట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. దీపావళి వరుస సెలవుల నేపథ్యంలో గత శుక్రవారం నుంచి ప్రజలు తమ తమ స్వస్థలాలకు వెళ్లారు. పండుగ ముగించుకొని తిరిగి రావడంతో బుధ, గురువారాల్లో నగరంలో రద్దీ తీవ్రతరమైంది. మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు బారులుతీరారు. మెట్రో స్టేషన్ లోపల భాగంలో కూడా జనసందడి నెలకొంది. ఆ రైళ్లలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. వర్షాలతో ట్రాక్కు దెబ్బ, రైలుకు ఆటంకం యశవంతపుర: చిక్కమగళూరు తాలూకా కణివె గ్రామం వద్ద రైలు పట్టాలకు వేసిన కంకర భారీ వర్షాల వల్ల కొట్టుకుపోయింది. బుధవారం రాత్రి మల్నాడులో కుండపోత వానలు కురిశాయి, కణివె గ్రామం వద్ద వాననీటి ధాటికి రైలు పట్టాల కిందనున్న మట్టి, కంకర పూర్తిగా కొట్టుకుపోయింది. పట్టాలు వేలాడుతూ ఉన్నాయి. గురువారం ఉదయం చిక్కమగళూరు నుంచి శివమొగ్గకు వెళ్లతున్న ప్యాసిజర్ రైలు కణివె వద్దకు వెళ్లగానే సిబ్బంది రైలును ఆపాలని సిగ్నల్ ఇచ్చారు. రైలు డ్రైవరు వెంటనే ఆపేశారు. సిబ్బంది రైలు పట్టాలను సరి చేసి రైలును పంపించారు. దీనివల్ల 45 నిమిషాలపాటు రైలు సంచారం నిలిచిపోయింది. ఎద్దుల రేసుల్లో ప్రాణనష్టం ● ముగ్గురి మృత్యువాత దొడ్డబళ్లాపురం: దీపావళి ఉత్సవాల సందర్భంగా హావేరి నగరం పరిసరాల్లో బుధవారంనాడు భారీఎత్తున జల్లికట్టు తరహా ఎద్దుల రేసులు జరగడం తెలిసిందే. యువత, జనం పరుగులు తీసే ఎద్దులను పట్టుకోవడానికి పోటీలు పడ్డారు. అయితే ఇందులో విషాదాలు కూడా సంభవించాయి. మూడు వేర్వేరు ఘటనల్లో ఎద్దులు పొడిచి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దానేశ్వరి నగరలో ఎద్దుల రేసులో చంద్రశేఖర్ కోడిహళ్లి (75) అనే వృద్ధుడు వేడుకలను చూస్తూ ఉండగా ఎద్దు దాడి చేయడంతో చనిపోయాడు. దేవిహొసూరు గ్రామంలో జరిగిన వేడుకలో ఎద్దు పొడిచి ఘనిసాబ్ (75) అనే వృద్ధుడు మరణించాడు. పోటీలో పాల్గొన్న ఓ ఎద్దు ఇంట్లోకి జొరబడి ఈయనను పొడిచింది. హానగల్ తాలూకా తిళవళ్లిలో ఎద్దు దాడిలో భరత్ (24) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. వీరంతా జల్లికట్టులో పాల్గొనకపోయినప్పటికీ ఎద్దుల దాడుల్లో చనిపోయారు. స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. -
మళ్లీ గణేశ చతుర్థి వచ్చిందోచ్
తుమకూరు: వినాయక చవితి ముగిసిన నెలల తరువాత మళ్లీ ఆ పండుగను ఆచరించడం ఆ గ్రామ విశిష్టత. ఇది ఆశ్చర్యంగా ఉన్నా నిజం. జిల్లాలోని చారిత్రక ప్రసిద్ధ గూళూరులో గణేశ మండపంలో మహా గణపతి విగ్రహాన్ని దీపావళి తరువాత బలిపాడ్యమి రోజున 18 కులాల ప్రజలు కలిసి ప్రతిష్టించి సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. ఇంకా నెల రోజుల పాటు భక్తులకు గణేష్ విగ్రహ దర్శనభాగ్యం లభిస్తుంది. గూళూరు మహా గణపతిని కార్తీక మాసంలో నెల రోజుల పాటు ప్రతిష్టించి ప్రతినిత్యం ప్రత్యేక పూజా కై ంకర్యాలు నిర్వర్తించడం ఆచారంగా వస్తోంది. స్వామివారికి ప్రతి కుటుంబం నిత్యం ప్రత్యేక అర్చనలు చేస్తారు. రోజూ రాత్రి 9 గంటలకు మహామంగళ హారతి ఇస్తారు. నవంబర్ 23వ తేదీ వరకు భక్తులకు దర్శనానికి ఏర్పాట్లు చేసినట్లు మహాగణపతి భక్తమండలి అధ్యక్షుడు జీఎస్ శివకుమార్ తెలిపారు. గూళూరులో మహా గణపతి ఉత్సవాలకు శ్రీకారం -
ప్రత్యామ్నాయం చూపాలి
ఇలా వేగంగా పెరుగుతున్న జనాభా కారణంగా బెంగళూరులో మౌలిక వసతులు, ఇతరత్రా సౌకర్యాల కోసం తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఇళ్లు, స్థలాలు, రోడ్లు, నీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, ట్రాఫిక్ వంటి సమస్యలు ఇప్పటికే బెంగళూరును తీవ్రంగా బాధిస్తున్నాయి. జనాభా మరింత అధికమైతే ఈ సమస్యలు పరిష్కరించలేనంత స్థాయికి చేరుకుంటాయి. బెంగళూరు సరిహద్దులు వేగంగా విస్తరించాయి. కానీ సౌకర్యాలు ఆ స్థాయిలో లేవనేది అందరికీ తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో ప్రముఖులు, ప్రజలు తరచూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జనాభాకు తగినట్లు వసతులు అనేది సవాల్గా మారింది. -
నగరం.. జన సాగరం
సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీ, మెట్రో సిటీ.. ఇలా ఎన్ని పేర్లతో పిలుచుకున్నా, ఎంత మంది వచ్చినా అక్కున చేర్చుకునేది బెంగళూరు నగరం. ఇదే బెంగళూరు పాలిట సమస్యగా మారింది. విపరీతమైన జన రద్దీతో సతమతమవుతోంది. సదుపాయాల కోసం ఒత్తిడి అధికమైంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుంది అనే సామెత నగరానికి వర్తిస్తుంది. బెంగళూరులో జనసంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఎక్కడెక్కడి నుంచో ఉపాధి, ఉద్యోగాలు, చదువుల కోసం తరలివచ్చేవారితో నిండిపోతోంది. 2031 నాటికి నగర జనాభా సుమారు కోటిన్నర దాటుతుందని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీఈఎస్) చెబుతోంది. అంత దూరం అవసరం లేదు, రెండు మూడేళ్లు చాలని మరికొందరు చెబుతున్నారు. బెంగళూరు జనాభా 1.40 కోట్లకు పెరిగిందని ఇటీవల డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పడం తెలిసిందే. ఈ ఏడాది అత్యధిక వలసలు డీఈఎస్ ప్రకారం 2021లో నగర జనాభా సుమారు 1.22 కోట్లు. ఇది 2031 నాటికి 1.47 కోట్లకు పెరగనున్నట్లు అంచనా వేసింది. 2025–2026 ఏడాదిలో అత్యధిక మంది బెంగళూరుకు వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది 1.93 శాతం మేర జనాభా అధికమైంది. గత 15 ఏళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది. కర్ణాటక జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరు బెంగళూరు వాసి ఉండేంతలా నగర జనసంఖ్య విస్తరిస్తోంది. 2021 ఏడాదిలో కర్ణాటక మొత్తం జనాభాలో ఒక్క బెంగళూరు నగర వాటానే 18.2 శాతంగా ఉంది. 2031 నాటికి ఈ ప్రమాణం 20.7 శాతానికి పెరగనుందని డీఈఎస్ వెల్లడించింది. రాష్ట్రంలోని ఇతర నగరాలను అభివృద్ధి చేసి, బెంగళూరుపై ఒత్తిడిని తగ్గించాలని హెచ్చరించింది. 2021లో కర్ణాటక జనాభాలో నగరాల వాటా 43.9 శాతంగా ఉంది. 2031 నాటికి 47.8 శాతానికి పెరగవచ్చని అంచనా. బెంగళూరు కేఆర్ మార్కెట్లో జనం.. జనం జనాలతో కిక్కిరిసిపోతున్న బెంగళూరు ఉద్యోగ, ఉపాధి కోసం తరలివస్తున్న ప్రజలు సౌకర్యాల కోసం తీవ్ర పోటాపోటీ మరింతగా జనాభా వృద్ధి: డీఈఎస్ సర్వేఇక్కడే ఎందుకు బెంగళూరులో తామరతంపరగా ఐటీ బీటీ కంపెనీలు పెరిగాయి. నిర్మాణ, ఆతిథ్య రంగం విస్తరిస్తోంది. రాష్ట్రంలోని ఇతర నగరాలన్నింటి కంటే అధికంగా, విద్య, ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు బెంగళూరులో ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిగా తరలి వస్తున్నారు. దీనివల్ల ఏ మూల చూసినా జనంతో నిండిపోతోంది. -
చీకట్లు నింపిన టపాసులు
శివాజీనగర: సిలికాన్ సిటీలో వెలుగుల దీపావళి సంబరాల్లో ప్రమాదాలలో పెద్దసంఖ్యలో జనం గాయపడ్డారు. బాధితుల సంఖ్య గురువారం నాటికి 250 మందికి చేరింది. పటాకులను కాల్చేవారు, చూసేవారు విధివశాత్తు గాయాలపాలు కాగా, వీరిలో కొందరికి కళ్లే పోయాయి. ఒక్క నారాయణ నేత్రాలయంలో 100 మంది బాధితులు చేరారు, అందులో 50 మందికి పైగా పిల్లలున్నారు. 10 మందికి శస్త్రచికిత్స అవసరమైంది. కొందరు అడ్మిట్ కాగా, మరికొందరికి చికిత్స చేసి పంపారు. బాధితుల్లో సగం మంది టపాసులను కాల్చేవారు, మిగతా సగం మంది దారిన వెళ్లేవారు, చూసేవారు ఉన్నారు. మింటో కంటి ఆసుపత్రిలో 30 మంది చికిత్స పొందారు. శంకర కంటి ఆసుపత్రిలో 20 కేసులు నమోదుకాగా, ప్రభా కంటి ఆసుపత్రిలో గాయపడిన 10మందికి చికిత్స కల్పించడమైనది. అగర్వాల్ కంటి ఆసుపత్రిలో 10 మంది చికిత్స పొందారు. పాపం.. వలస కూలీ ● బిహార్కు చెందిన వలస కూలీ యువకుడు శాశ్వత అంధత్వాన్ని పొందాడు, నగరంలోని అక్కిపేటలో ఉండేవాడు. ఫ్లవర్ పాట్ పేల్చేటపుడు ప్రమాదం సంభవించడమైనది. కంటి గుడ్డు చీలింది. ఫ్లవర్ పాట్ చేతిలో పట్టుకుని పోజు ఇస్తుండగా అది పేలిపోవడంతో ఓ కన్ను పూర్తిగా పోయింది, మరో కంటికి తీవ్ర గాయాలు తగిలాయి. మింటో ఆసుపత్రిలో యువకుడికి చికిత్స పొందుతున్నాడు. ● మరో ఘటనలో రోడ్డు మీద నడచుకొంటూ వెళుతున్న 67 సంవత్సరాల విదేశీ వృద్ధునికి టపాసు పేలి ఓ కంటికి బాగా గాయమైంది. ● 10 ఏళ్ల బాలునికి కంటి గుడ్డు కు తీవ్ర గాయమైంది. మరో 13 ఏళ్ల బాలునికి ఇదే సమస్య నెలకొంది. ● ఎక్కువమంది బాధితులకు ముఖం, కాళ్లు, చేతులకు కాలిన గాయాలయ్యాయి. విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొంది వెళ్లిపోయారు. మూడు ముక్కలు.. మింట్లో ఆసుపత్రిలో కంటికి అపాయమైన 37 మందిలో కొందరికి అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్నారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికి దృష్టి లోపం ఎదురైందని మింట్లో ఆసుపత్రి అదనపు డైరెక్టర్ డాక్టర్ శశిధర్ తెలిపారు. ఓ బాలునికి కంటి ముందు టపాసు పేలడంతో కన్ను మూడు ముక్కలైంది. కొడుకు దుస్థితిని చూసి అతని తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. బెంగళూరులో 250 మందికి పైగా గాయాలు అనేకమందికి కళ్లకు దెబ్బలు దృష్టిదోషం ఏర్పడే ముప్పు కంటి వైద్యశాలలకు తాకిడి -
పొలంలో చిరుత కూనలు
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా కెంపేగౌడనదొడ్డి గ్రామంలో కే.టి.ప్రతాప్ అనే రైతు పొలంలో మూడు చిరుత కూనలు కనిపించాయి. మద్దూరు అటవీ సిబ్బంది వచ్చి వాటిని తీసుకుని అడవిలోకి తరలించారు. తల్లి చిరుత కోసం గాలింపు చేపట్టారు. బావిలో చిరుత కెంపెయ్యనదొడ్డి గ్రామంలోనే మరో చిరుత ఘటన జరిగింది. ఉన్న కెంచేగౌడ అనె రైతు పొలంలోని పాడుబడిన బావిలో బుధవారం రాత్రి ఓ చిరుతపులి పడిపోయింది. దగ్గరిలోని బసవన కొండ అడవిలో నుంచి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చినట్లు భావిస్తున్నారు. గురువారం ఉదయం దాని గాండ్రింపులు విని జనం వచ్చి చూసి అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి దానిని బంధించి తరలించారు. చిరుతను చూడడానికి వందలాది మంది పోగయ్యారు. -
రూ.5.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత
బనశంకరి: బెంగళూరులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను గురువారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.5.5 కోట్ల విలువచేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. హెబ్బగోడిలో డ్రగ్స్ను పరిశీలించి వివరాలను వెల్లడించారు. నైజీరియా కు చెందిన డురో మిషెల్, ఇబు సామ్యేల్ అనే ఇద్దరు బిజినెస్ వీసాతో భారత్కు వచ్చారు. 2017 నుంచి బెంగళూరు హెబ్బగోడి ఠాణా పరిధిలో మకాం వేశారు. తమిళనాడు నుంచి బట్టలు కొనుగోలుచేసి నైజీరియా కు ఎగుమతి చేసేవారు. మరోవైపు ఢిల్లీ నుంచి లగేజీ ద్వారా డ్రగ్స్ను దిగుమతి చేసుకుని నగరంలోని కాలేజీల ముందు అమ్మి సొమ్ము చేసుకునేవారు. విదేశీ పోస్టల్ ఆఫీసుకు అనుమానాస్పద పార్శిల్స్ వచ్చినట్లు తెలిసి నిఘా పెట్టారు. థాయ్లాండ్ నుంచి బిస్కెట్, చాక్లెట్ పార్శిళ్ల పేరుతో హైడ్రో గంజాయిని తెప్పించారు. ఈ నేపథ్యంలో దాడులు జరిపి ఇద్దరినీ అరెస్టు చేశారు. గంజాయితో పాటు రూ.2.50 కోట్ల విలువచేసే 1.47 కిలోల ఎండీఎంఏ క్రిస్టల్ను, రూ. 42 వేల నగదును పట్టుకున్నారు. గతంలోనూ కేసు కాగా వీరు గతంలో హెణ్ణూరు ఠాణా పరిధిలో డ్రగ్స్ అమ్ముతూ దొరికారు. విడుదలయ్యాక మళ్లీ పాత దందానే కొనసాగించడం గమనార్హం. పట్టుబడిన రూ.5.5 కోట్ల డ్రగ్స్ గురించి విచారిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. డ్రగ్స్ పార్శిళ్లు వచ్చిన కేజీ నగరలోని విదేశీ తపాలా ఆఫీసులోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరులో ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్ -
చెరువులోకి పడిన చిన్నారులు..
తుమకూరు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణనష్టం తప్పదు. చిక్కనాయకనహళ్లి తాలూకా యరేకట్టె గ్రామ చెరువులో ప్రమాదవశాత్తు పడి తండ్రి, కుమార్తె, మరో బాలిక చనిపోయారు. వివరాలు.. వెంకటేశ్ (43) కూతురు శ్రావ్య (12), స్నేహితురాలు పుణ్య (11) మంగళవారం సాయంత్రం 6 గంటలకు గ్రామం వద్ద ఉన్న చెరువుకు వెళ్లారు. అయితే నీటిలోకి జారిపడిపోయారు. వారి వెంట ఉన్న మరో బాలిక ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి చెప్పింది. దీంతో వెంకటేశ్ బాలికలను కాపాడాలని పరిగెత్తుకుని వచ్చి చెరువులోకి దూకాడు. పుణ్యను బటయకు తీసుకువచ్చి మళ్లీ చెరువులోకి వెళ్లాడు, కానీ అలసిపోయి మునిగిపోయాడు. స్థానికులు గాలించగా వెంకటేశ్, కూతురు శ్రావ్య మృతదేహాలు బయటపడ్డాయి. పుణ్యను ఆస్పత్రిలో చేర్పించగా ఆమె కూడా చనిపోయింది. ఎమ్మెల్యే సీబీ సురేశ్ బాబు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. హందనకెరె పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. కాపాడాలని తండ్రి ప్రయత్నం.. ముగ్గురూ మృతి -
ఆ ఎస్ఐ నమ్మించి.. మోసగించాడు
బనశంకరి: ఈ చిత్రంలో కనిపిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ పేరు సునీల్. మంచి ఉద్యోగం, ఆదాయంతో జీవితం సాగుతోంది, కానీ తనను ప్రలోభపెట్టి మోసం చేశాడని ఓ మహిళ మీడియా ముందు గోడు వెళ్లబోసుకోవడంతో చిక్కుల్లో పడ్డాడు. ఈ మేరకు ఎస్ఐ హెచ్బీ సునీల్ పై బెంగళూరు డీజే.హళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆయన పనిచేసేది కూడా అదే ఠాణాలో కావడం విశేషం. ఇంటికి, హోటల్కు పిలిపించి వివరాలు ఇలా ఉన్నాయి... పెళ్లి చేసుకుంటాను, ఇల్లు కొనిస్తాను, బ్యూటీపార్లర్ పెట్టిస్తా, నీ జీవితాన్ని సెటిల్ చేస్తా అని తీయని మాటలతో మభ్యపెట్టాడు, లైంగికంగా వాడుకున్నాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. డీజే హళ్లి 8వ మైల్లో ఇల్లు, హోటల్కు పిలిపించుకుని రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఎవరికై నా చెబితే హత్యచేస్తానని బెదిరించాడని పేర్కొంది. అంతేగాక తన ప్రైవేటు ఫోటోలు, వీడియో పెట్టుకుని బెదిరిస్తున్నాడంది. తాను బ్యూటిషియన్గా పనిచేస్తానని, ఏడాదిన్నర కిందట ఓ సారి పనిమీద ఎస్ఐని కలిశానని, అప్పటినుంచి లోబర్చుకున్నాడని చెప్పింది. తమ వాట్సాప్ చాటింగ్లను చూపింది. పెళ్లి చేసుకోవాలని కోరగా తిరస్కరించాడని, తనకు న్యాయం చేయాలని కోరింది. ఫిర్యాదు మేరకు ఆ ఎస్ఐపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐపై ఆమె డీజీపీ సలీంకు కూడా ఫిర్యాదు చేసింది. బెంగళూరు డీజే హళ్లి ఎస్ఐపై అదే ఠాణాలో మహిళ ఫిర్యాదు -
రియల్టర్కు కత్తిపోట్లు
మైసూరు: రియల్టర్ని రౌడీ ముఠా చాకుతో పొడిచిన ఘటన మైసూరులోని విజయనగర పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గురుప్రసాద్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. రియల్టర్ గురుప్రసాద్ ఒక బార్కు వెళ్లారు. అక్కడే రౌడీషీటర్ కౌశిక్ కూడా ఉన్నాడు. గురుప్రసాద్ బిల్లు కట్టే సమయంలో, కౌశిక్ వెళ్లి తన బిల్లును కూడా నువ్వే కట్టాలని అతనిని ఒత్తిడి చేశాడు. బిల్లు కట్టకపోతే, నీ అంతు చూస్తా అని గదమాయించాడు. గురుప్రసాద్ బార్ నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ సాయంత్రం తన సోదరుడు కరుణాకర్తో కలిసి అదే బార్లోకి వెళ్లగా కౌశిక్ ఎదురు పడ్డాడు. మధ్యాహ్నం నా బిల్లు కట్టకుండా పారిపోయింది వీడే అంటూ ఎగతాళి చేస్తూ గొడవకు దిగాడు. భయపడిన వారిద్దరూ బయటకు పరుగులు తీయగా కౌశిక్, అతని అనుచరులు వెంటాడి గురుప్రసాద్ను ఇష్టానుసారం చాకుతో పొడిచారు. కాగా, కౌశిక్, దేవరాజ్, మరో ముగ్గురిపై విజయనగర పోలీసులు కేసు నమోదు చేశారు. కనువిందుగా పండుగ పావగడ: తాలూకాలోని తండాల్లో దీపావళిని ఉత్సాహంగా జరిపారు. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేసి అలరించారు. బుధవారం పెద్దల పండుగను జరుపుకున్నారు. ఐదలమ్మ గుడి వద్ద ముగ్గులు వేసి తంగేడు పూలతో పూజలు చేశారు. సేవాలాల్ దేవాలయంలో దీపాలు వెలిగించి పూజలు చేశారు. పాఠశాలలో దండన.. ఆస్పత్రిపాలైన బాలుడు శివాజీనగర: 2 రోజులు పాఠశాలకు రానందుకు ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు దాడి చేశారు. వివరాలు.. బెంగళూరులోని సుంకదకట్టె, పైప్లైన్ రోడ్డులో ఉన్న సెయింట్ మేరీస్ పబ్లిక్ పాఠశాలలో 5వ తరగతి బాలుడు గైర్హాజరు కావడంతో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అతనిని తీవ్ర స్థాయిలో దండించారు. దీంతో భయాందోళనకు గురైన బాధిత బాలుడు ఇంటిలో విచిత్రంగా ప్రవర్తిస్తుండగా, తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్లో స్కూలు నిర్వాహకులపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో, తమకు న్యాయం చేయాలని రోడ్డుకెక్కారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బాలల హక్కుల భద్రతా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. వారం రోజుల్లో పాఠశాలకు వెళ్లి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖను ఆదేశించింది. -
ఆస్పత్రిలో యంత్ర పరికరాల చోరీ
రాయచూరు రూరల్: దేవదుర్గ ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ రకాల యంత్రపరికరాలు చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.లక్షలాది విలువ చేసే యంత్రాలను, పరికరాలను సిబ్బంది వాటి గదికి తాళం వేయకుండా అలాగే వదిలి వేశారు. ఈ నెల 12న చోరీ జరిగినట్లు తాలూకా ఆరోగ్యాధికారి శివానంద ఈనెల 16వ తేదీన దేవదుర్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ిహిమోగ్లోబిన్ యంత్రం, ఆక్సిజన్ యంత్రం, ఎలక్ట్రోలైట్ పరీక్షలు నిర్వహించే పరికరాలు చోరీ కావడంతో పోలీసులు విచారణకు శ్రీకారం చుట్టారు. వైభవంగా సిద్దరామేశ్వర జోడు రథోత్సవంరాయచూరు రూరల్: తాలూకాలోని చిక్కసూగూరులో సిద్దరామేశ్వర జాతర, రథోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం చౌకి మఠం నుంచి దేవాలయం వరకు మహిళలు కుంభ కలశాలతో ఊరేగింపు జరిపారు. వీరగాసె నృత్యం చేస్తూ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సిద్దరామేశ్వర జోడు రథోత్సవాన్ని వందలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవం ముందు సిద్దలింగ మహాస్వామి, అభినవ రాచోటి శివాచార్యులు, మహాలింగ స్వామి, శిఖామణి అవధూత, వీర సిద్దస్వామి, విరుపాక్ష స్వామి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇన్నోవా, స్విఫ్ట్ కారు ఢీ ● త్రుటిలో తప్పిన ప్రమాదం సాక్షి బళ్లారి: విజయపుర జిల్లా సింధిగి ఎమ్మెల్యే అశోక్ మనగూళి ఇన్నోవా, స్విఫ్ట్ కారు ఢీకొనడంతో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. బుధవారం సింధిగి బైపాస్ సమీపంలో ఎమ్మెల్యే ఇన్నోవా ఐక్రాస్ (కేఏ03–ఎన్టీ–2827 అనే నెంబర్ గల) కారుకు ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కారులో ఆయన కుమార్తె, సోదరుడి కుమారుడితో పాటు డ్రైవర్ ప్రయాణిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే రెండు కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో ఎమ్మెల్యే అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 1 నుంచి బెంగళూరు– హంపీ డైలీ విమాన సర్వీసు హొసపేటె: బళ్లారి, విజయనగర జిల్లాల్లో పర్యాటకం, వ్యాపార రంగానికి పెద్ద ప్రోత్సాహాన్నిస్తూ, ప్రాంతీయ విమానయాన సంస్థ స్టార్ ఎయిర్ బెంగళూరు–హంపీని అనుసంధానిస్తూ కొత్త విమాన సర్వీసును ప్రారంభించాలని ప్రణాళిక ప్రకటించింది. చారిత్రాత్మక హంపీకి సమీపంలోని జిందాల్ విద్యానగర్ విమానాశ్రయం గుండా ఈ విమానాలు ప్రయాణిస్తాయి. కొత్త విమాన సర్వీసు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన హంపీకి కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. నవంబర్ 1న విమాన సర్వీసు ప్రారంభం కానుండటంతో బళ్లారికి కూడా ప్రయోజనం చేకూరుతుందని సమాచారం. స్టార్ ఎయిర్ ప్రకటన పర్యాటకులకు, స్థానిక వ్యాపారవేత్తలకు ఆనందాన్ని కలిగించింది. గతంలో అలయన్స్ ఎయిర్ హంపీ నుంచి బెంగళూరుకు రోజువారీ విమానాలను నడిపింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ సేవలు నిలిపివేశారు. కార్తీకమాస పూజలు ప్రారంభం అమరాపురం: మండలంలోని హేమావతి గ్రామంలో వెలసిన శైవక్షేత్రం శ్రీసిద్దేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాస పూజలను బుధవారం ఆలయ అర్చకులు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామి వారికి సుప్రభాభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు చేశారు. అనంతరం భక్తులు తెచ్చిన వివిధ పూలతో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు ప్రసాద వినియోగం చేశారు. -
ఇంటింటా దీపావళి కాంతులు
బళ్లారి రూరల్: భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనందోత్సాహాలతో కుల, మత, వర్గ, ధనిక, పేద అనే భేదాలు లేకుండా సమైక్యంగా జరుపుకొనే పండుగ దీపావళి. పండుగ నేపథ్యంలో దావణగెరెలో మంత్రి శామనూరు మల్లికార్జున, ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జునలు కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా పేల్చారు. ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున ముగ్గుపై మట్టిదీపాలు వెలిగించారు. ఘనంగా దీపావళి వేడుకలు హొసపేటె: నగర ప్రజలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. బుధవారం రాత్రి ప్రజలు తమ ఇంటిలో లక్ష్మీ దేవిని కూర్చొండబెట్టి పూల మాలలతో విశేషంగా అలంకరించి పూజలు చేశారు. ఇంటి ముంగిళ్లలో దీపాలు వెలిగించడంతో పాటు ఇంటికి విద్యుత్ దీపాలంకరణ చేశారు. టపాసుల శబ్దాలతో నగరం మారు మ్రోగిపోయింది. -
మిర్చికి తెగులు.. రైతన్నకు దిగులు
సాక్షి బళ్లారి: వరుసగా గత నాలుగేళ్ల నుంచి మిర్చి సాగు చేసిన రైతులు ఏదో రకంగా కష్టాలు, నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. మూడేళ్లుగా మిర్చి సాగు చేసిన రైతులకు పెట్టుబడి రాక, గిట్టుబాటు ధర దక్కక పోవడంతో ఎండు మిర్చిని కోల్ట్ స్టోరేజ్లోనే ఉంచి రేట్లు పెరుగుతాయనే ఆశతో రైతులు ఎదురు చూస్తూ కష్టాలను అనుభవిస్తున్నారు. మరో వైపు ఈ ఏడాది మిర్చిని సాగు చేసిన రైతులకు ప్రారంభం నుంచే సమస్యలు వెంటాడుతున్నాయి. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో బళ్లారి, సిరుగుప్ప, కంప్లి, హొసపేటె తదితర ప్రాంతాల్లో విస్తారంగా మిరప పంటను సాగు చేశారు. గత మూడేళ్లుగా మిర్చి సాగు చేసిన రైతులు అప్పులు పాలు కావడంతో ఈ ఏడాదైనా పంట చేతికి అందిన తర్వాత గిట్టుబాటు ధర వస్తుందేమోనని ఆశించిన మిర్చి రైతులకు పంట కోత దశ మాట పక్కన పెడితే మిర్చిని సాగు చేసినప్పటి నుంచి ఏదో ఒక తెగుళ్లతో మిర్చి పంటకు రైతులు మందులు పిచికారీ చేయాల్సిన దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి రైతులు వివిధ మందులను పిచికారీ చేస్తున్నారు. నాలుగు రోజులకు ఒకసారి పిచికారీ ప్రస్తుతం దోమ పోటు, నల్ల తామర పురుగు తదితరాలు మిర్చి పంటను వెంటాడుతున్న నేపథ్యంలో రైతులు వివిధ రకాల మందులను వాడుతున్నారు. ప్రతి రోజు మిర్చి పొలాల్లో రైతులు భుజాన మందు ట్యాంక్ను వేసుకొని పిచికారీ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మిర్చి పంట పొలాల్లో మిరపకాయలు కాసి కళకళలాడుతున్నప్పటికీ దోమ పోటు, నల్లతామర పురుగు వెంటాడుతుండటంతో ఆకు ముడత బారిన పడి పంట పూర్తిగా చేతికి అందే పరిస్థితులు వస్తాయో లేవోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మిర్చి సాగు చేసిన శంకరబండె, మంగమ్మ క్యాంపు తదితర గ్రామాలకు చెందిన ఎర్రిస్వామి, రుద్రగౌడ, గంగిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే మిర్చి పంట సాగు సగానికి సగం తగ్గించామన్నారు. ఒక ఎకరానికి రూ.1.5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టామన్నారు. ప్రస్తుతం దోమపోటు, ఆకుముడత తెగులు రావడం వల్ల ప్రతి నాలుగు రోజులకు ఒకసారి మందు పిచికారీ చేస్తున్నామన్నారు. ఎన్నిసార్లు పిచికారీ చేసిన ఆకుముడత తెగులు పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పొలంలో ఏపుగా కాసిన మిర్చి పంట తెగుళ్ల నివారణకు సూచనలిస్తున్న నిపుణుడు ఏపుగా పెరిగిన పంటను వెంటాడుతున్న తెగుళ్లు మొక్కలు నాటినప్పటి నుంచి తెగులుతో ఇబ్బంది మిర్చి రైతుకు మిగిలింది కన్నీళ్లే మిర్చి ధర మూడేళ్లుగా పతనం కావడంతో తాము మూడేళ్లుగా పండించిన మిర్చి పంటను కోల్డ్ స్టోరేజ్లో ఉంచామన్నారు. ప్రస్తుతం ఈ ఏడాది కూడా గత్యంతరం లేక మిర్చినే సాగు చేశామన్నారు. తెగుళ్లు వెంటాడుతుండటంతో మరింత ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. తెగుళ్ల నివారణకు, దోమ పోటుకు, ఆకు ముడతను తగ్గించేందుకు బ్యారిక్స్ స్టికర్స్ ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ స్టికర్స్ను ప్రతి ఒక్క రైతు వినియోగించాల్సిందిగా సంబంధిత వ్యవసాయ నిపుణుడు టీ.హంపయ్య పేర్కొన్నారు. మ్యాజిక్ స్టికర్స్ ఎల్లో, బ్లూ వైట్ ఈ మూడు స్టికర్లను ఒక్కో ఎకరానికి 30 నుంచి 50 వరకు ఉపయోగించి మిర్చి పొలాల్లో ఉంచితే దోమలు వచ్చి స్టికర్స్పై వాలతాయన్నారు. దోమలు ఆ స్టికర్స్పై వాలడంతో వాటి ఉత్పత్తిని అరికట్టడానికి వీలవుతుందన్నారు. దీంతో మందులు ఉపయోగించాల్సిన అవసరం లేకపోగా పంట దిగుబడి కూడా బాగా వస్తుందన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఆయకట్టు పరిధిలో విస్తారంగా సాగు చేసిన మిర్చి పంట చేతికి అందేలోపు బ్యారిక్స్ స్టికర్లను పెట్టవలసిందిగా రైతులకు ఆయా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి మిర్చి పంటలో తెగుళ్ల నివారణకు తగిన సలహా సూచనలు అందజేయాలని మిర్చి రైతులు కోరారు. -
రాఘవేంద్రుని సన్నిధిలో డీసీఎం
రాయచూరు రూరల్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠాన్ని కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయంలో రాఘవేంద్ర స్వాముల వారి దివ్య దర్శనం చేసుకున్న ఆయన వెంట రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. ఆయనకు మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం రాయచూరు తాలూకా పంచముఖి గాణదాళ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి, ప్రత్యేక దర్శనం పొందారు. బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మించండి రాయచూరు జిల్లా మాన్వి తాలూకా చీకలపర్వి, రాయచూరు తాలూకా చిక్కమంచాల వద్ద తుంగభద్రా నదిపై బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ సూచించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయంలో పద్మనాభ అతిథి గృహంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, గ్రామీణ శాసన సభ్యుఢు బసనగౌడ దద్దల్లతో సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చించి సాంకేతిక నివేదికల ఆధారంగా నిర్మాణం చేపట్టాలన్నారు. తాగు, సాగు నీటి విషయంలో గత ఏడాది రెండు ప్రాంతాల్లో బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణం చేపడితే కర్నూలు జిల్లా సుంకేసుల వద్ద బ్రిడ్జి కం బ్యారేజీలో నీటి నిల్వ తగ్గుముఖం పడుతుందనే విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని సరిదిద్దాలని సూచించారు. టీబీడ్యాం క్రస్ట్గేట్ల అమరికకు చర్యలు తుంగభద్ర డ్యాం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల అమరికకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ వెల్లడించారు. బుధవారం పంచముఖి గాణదాళలో ఆలయాన్ని దర్శించుకొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది క్రస్ట్గేట్ తొలగిపోవడంతో ఇంజినీర్ల ఆదేశాల మేరకు నూతనంగా 37 గేట్ల అమరికకు చర్యలు చేపట్టామన్నారు. నవలి వద్ద నూతనంగా చేపట్టనున్న సమాంతర జలాశయం విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ససేమిరా అంగీకరించడం లేదన్నారు. ఈ విషయంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు మూడు సార్లు సమావేశాలు నిర్వహించినా అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. రాష్ట్రంలో తుంగభద్ర, కృష్ణ, మహదాయి, మేకెదాటు వంటి నీటి వనరులకు కేంద్రం నుంచి గెజెట్ విడుదలపై బీజేపీ శాసన సభ్యులు, లోక్సభ సభ్యులు స్పందించాలన్నారు. రైతుల సంక్షేమం కోరుతూ రూ.20 వేల కోట్లతో పంప్సెట్ల కొనుగోలు, ఐదు గ్యారెంటీలకు రూ.53 వేల కోట్లు, పేదల సంక్షేమం కోసం రూ.లక్ష కోట్లు, కళ్యాణ కర్ణాటకలోని జిల్లాల అభివృద్ధికి రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించామన్నారు. సమాజ సేవకు సిద్ధంగా ఉండాలిసమాజ సేవకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ పిలుపునిచ్చారు. బుధవారం రాయచూరు తాలూకాలోని పంచముఖి గాణదాళలో గ్రామీణ కాంగ్రెస్ పార్టీ నూతన పదాధికారుల పదగ్రహణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. సమాజ సేవ చేసే పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీకి సేవలు అందించాలన్నారు. తమ ఉన్న భేదాభిప్రాయాలను మరిచి పార్టీకి పటిష్టతకు పాటు పడాలన్నారు. నాయకులు కావాలంటే కార్యకర్తల కష్టాన్ని మరిచి పోరాదన్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్నారు. పంచ గ్యారెంటీల వల్ల పేద ప్రజల కడుపు నిండుతోందన్నారు. పంచ గ్యారెంటీలను కాపీ కొట్టి బీజేపీ మహిళలకు రూ.10 వేలను బ్యాంక్ ఖాతాలోకి వేసిందన్నారు. సమావేశంలో రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, లోక్సభ సభ్యుడు కుమార నాయక్, గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ, శాసన సభ్యులు హంపయ్య నాయక్, బసన గౌడ తుర్విహాళ్, ఎమ్మెల్సీలు బసనగౌడ బాదర్లి, వసంత కుమార్, జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి తదితరులున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం దర్శనం -
కాలు లేకున్నా.. కలత లేదన్నా..
చెళ్లకెరె రూరల్ : వృద్ధులైన తల్లిదండ్రులను పోషించడం కోసం దివ్యాంగుడైన వీరణ్ణ కొరియర్ బాయ్గా విధులు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తల్లిదండ్రులు భారమయ్యారని వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్న నేటి యువకులు వీరణ్ణను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాలు పోయి కృత్రిమ కాలు పెట్టుకున్న యువకుడు వీరణ్ణ ప్రభుత్వం అందించిన త్రిచక్రవాహనాన్ని సద్వినియోగం చేసుకుని కొరియర్ బాయ్గా పని చేస్తూ నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నాడు. చెళ్లకెరె నగర నివాసి వీరణ్ణకు ప్రమాదంలో కాలు విరిగి పోయింది. చికిత్స అనంతరం కృత్రిమ కాలు పెట్టారు. ఎమ్మెల్యే టి.రఘుమూర్తి ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలతో వీరణ్ణకు త్రిచక్రవాహనం అందేలా చూశారు. కాలు లేకున్నా ఆత్మ స్థైర్యం కోల్పోని వీరణ్ణ ఫ్లిప్కార్టు కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ప్రతి నిత్యం ఉదయం 7 గంటలకు విధులకు హాజరయ్యే వీరణ్ణ తన త్రిచక్రవాహనంలో ఇంటింటికి వెళ్లి కొరియర్ పార్శిల్ ఇచ్చి వస్తుంటారు. కదలకుండా కూర్చొంటే జీవించడం ఎలా? కాలు లేదని పని చేయకుండా చింతిస్తూ కదలకుండా కూర్చొంటే జీవించడం కష్టం. ఇంట్లో తల్లిదండ్రులను పోషించాలి. ప్రభుత్వం నుంచి నాకు త్రిచక్రవాహనాన్ని ఇప్పించిన ఎమ్మెల్యే రుణం తీర్చలేనిది. –దివ్యాంగుడు వీరణ్ణ వృద్ధ తల్లిదండ్రుల పోషణే ధ్యేయం కొరియర్ బాయ్గా దివ్యాంగుడు వీరణ్ణ -
భర్త వేధింపులు.. బావిలోకి దూకి..
రాయచూరు రూరల్: జీవితాంతం తోడునీడగా ఉంటానని కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిసై చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె భరించలేక తీవ్ర నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పసికందుతో సహా బావిలోకి దూకి అత్మ హత్య చేసుకున్న ఘటన బాగల్కోట జిల్లా బాదామి తాలూకా కెరూరు చెన్నమదేవి గుడి వద్ద జరిగింది. భర్త మస్తాన్సాబ్ (25), భార్య ఫాతిమా (21), కొడుకు అబ్దుల్ (3)తో కూలి పని చేసుకుంటూ జీవించేవాడు. అతనికి అదివరకే పెళ్లయినా ఫాతిమాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఫాతిమాను చీటికిమాటికీ వేధించేవాడు, భరించలేక మూడురోజల క్రితం పుట్టింటికొచ్చింది. మంగళవారం సాయంత్రం కొడుకుతో సహా బావిలోకి దూకింది. స్థానికులు గాలించి మృతదేహాలను వెలికితీశారు. ఆమె తల్లిదండ్రులు అల్లునిపై ఫిర్యాదు చేశారు. -
ఎయిమ్స్ మంజూరు కోసం ధర్నా
రాయచూరు రూరల్: రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు కోసం చర్యలు చేపట్టాలని మంగళవారం మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో 1259వ రోజు ఆందోళన కొనసాగింది. సమితి అధ్యక్షుడు బసవరాజ కళస మాట్లాడారు. రాయచూరుకు ఎయిమ్స్ను కేటాయించాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో మౌనం వహించకుండా గళం విప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలంటూ ధర్నాకు మద్దతు పలికారు. జిల్లాను ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులు పాలించినంత వరకు అభివృద్ధి జరగడం అసాధ్యమన్నారు. రాజకీయ నాయకుల కుట్రలకు జిల్లాను పట్టించు కొనేవారు ఎవరనే ప్రశ్న ఉదయిస్తోందన్నారు. భారీ వర్షాలకు నేలకొరిగిన వరిరాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, కొప్పళ, కలబుర్గి, బీదర్, యాదగిరి జిల్లాల్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు వరి పైరు నేలకొరిగింది. కలబుర్గి జిల్లా చించోళి తాలూకా నాగరహాళ, కనకపుర, రాయచూరు జిల్లాలోని సింధనూరు, మాన్వి, మస్కి, కవితాళ, కొప్పళ జిల్లా అంజనాద్రిలో అరగంట సేపు వానలు పడ్డాయి. ఇటీవల కురిసిన అతివృష్టితో వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించగా కురిసిన వానలతో వరి దుబ్బులు నేలకొరగడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అట్రాసిటీ కేసు నమోదు చేయండి హొసపేటె: బెళగావి జిల్లా బాగేవాడి తాలూకా హుక్కేరిలో ఇటీవల విశ్వనాథ్ కత్తి వాల్మీకి సమాజంపై అవహేళనగా మాట్లాడటం సరి కాదని, వెంటనే ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మానవ సంబంధాల వేదిక విజయనగర జిల్లా సమన్వయకర్త ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేదిక నేత సోమశేఖర్ మాట్లాడుతూ హుక్కేరి మోడల్ హైస్కూల్ మైదానంలో డీసీసీ బ్యాంక్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో బ్యాంక్ మాజీ అధ్యక్షుడు విశ్వనాథ్ కత్తి వాల్మీకి సమాజాన్ని అసభ్యకరమైన పదజాలంతో అవమానించారన్నారు. తద్వారా వాల్మీకి సమాజ ప్రజల మనోభావాలను దెబ్బ తీశారన్నారు. రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలురాయచూరు రూరల్: మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠంలో దీపావళి ఉత్సవాలను మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ప్రారంభించారు. బుధవారం మఠంలో రాఘవేంద్రస్వామి మూల విరాట్కు ప్రత్యేక పూజలు జరిపారు. బలి పాడ్యమి సందర్భంగా భక్తుల సమక్షంలో విశేష పూజలు, అభిషేకాలు చేశారు. -
మాదప్ప సన్నిధిలో దీపావళి పూజలు
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రసిద్ధ మలెమహదేశ్వర బెట్టలోని మాదప్ప సన్నిధిలో దీపావళి మహోత్సవం సంబరంగా జరిగింది. మాదప్పకు తైలమజ్జన సేవలు గావించారు. లింగమూర్తికి నువ్వుల నూనె, కొబ్బరినీళ్లు, తేనె, పెరుగు, చక్కెర, కర్జూరం, ద్రాక్షలతో పాటు పాలాభిషేకం, సహస్ర బిల్వార్చన నెరవేర్చారు. అనంతరం మాదప్ప మూర్తిని వివిధ రకాల పూలతో అలంకరించారు. ధూప, దీప హారతి, మహామంగళ హారతి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బెట్టపై విడిది చేసిన లక్షలాది మంది భక్తులు తమ కోర్కెలతో వివిధ రకాల సేవలను చేసి పునీతులయ్యారు. బెట్ట విద్యుద్దీపాలంకరణతో మెరిసిపోయింది. నేను కన్నడిగురాలినే = కిరణ్ మజుందార్ షా శివాజీనగర: బెంగళూరులో రోడ్లు, సౌకర్యాలు సరిగా లేవని విమర్శలు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా ఆ తరువాత సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసి వివరణ ఇచ్చారు. బెంగళూరుని ఆమె విమర్శించడంపై కొందరు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. నేను గుజరాతీ కాదు, కన్నడిగురాలు అని జనం కోపాన్ని చల్లార్చే యత్నం చేశారు. నేను బెంగళూరులో పుట్టాను, బెంగళూరు, కన్నడ సంస్కృతిని ప్రేమిస్తూ ఏడు దశబ్దాలను ఇక్కడే గడిపాను. కన్నడ అద్భుతమైన భాష, రాయడం, మాట్లాడడం వస్తుంది. నా మమకారాన్ని ప్రశ్నించేవారికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. నేను గర్వంగా చెప్పుకునే కన్నడిగురాలు అని పోస్టులో పేర్కొన్నారు. -
చిచ్చు రేపిన టపాసులు
● బెంగళూరు పరిసరాల్లో 150 మందికి గాయాలు ● ఎక్కువమందికి కళ్లకు దెబ్బలుబెంగళూరులో ఓ ఆస్పత్రిలో బాలునికి పరీక్షలు శివాజీనగర: దీపావళి టపాసులు పేలుతుంటే చూడడం నేత్రానందాన్ని కలిగిస్తుంది కానీ, ప్రమాదం జరిగితే సంకటం తప్పదు. దీపావళి సంబరాలలో విషాదాలూ జరిగాయి. బెంగళూరులో గత మూడు రోజుల నుంచి బాణసంచా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. టపాసులు వల్ల గాయపడినవారి సంఖ్య అధికమైంది. బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో 150 మందికి పైగా కంటి హాని కేసులు నమోదయ్యాయి. 60 శాతం కేసులు టపాసుల పేలుళ్లను చూస్తూ నిలబడినవారేనని నిర్ధారణ అయ్యింది. బాధితుల్లో 8 మందికి పైగా శాశ్వతంగా దృష్టిని కోల్పోవడం విషాదకరం. బెంగళూరు, చిక్కబళ్లాపురంలో ముగ్గురు బాలురు పూర్తిగా దృష్టి దోషానికి గురైన దుర్ఘటనలు జరిగినట్లు తెలిసింది. ఆ బాలునికి రెండు కళ్లు చిద్రం బెంగళూరులోని కత్రిగుప్పలో 11 సంవత్సరాల బాలుడు టపాకులు పేల్చుతూ ఉండగా ప్రమాదం సంభవించింది. టపాసులు పేలి రెండు కళ్లకు తగిలాయి, మందుగుండు రవ్వలు ఎంత తీవ్రంగా తగిలాయి అంటే.. బాలుడు ధరించిన కళ్లజోడు పగిలిపోయి రెండు కనుగుడ్లు చిట్టిపోయాయి. ఓ కార్పొరేట్ కంటి ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స జరిపినా కూడా కంటి చూపును కాపాడేందుకు సాధ్యపడలేదని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ముందే జాగ్రత్త తీసుకుని ఉండాల్సిందని అన్నారు. అయ్యో పాపం.. చిన్నారి బాలిక చిక్కబళ్లాపురకు చెందిన 5 సంవత్సరాల బాలిక ఇతరులు టపాసులు పేలుస్తుండగా చూస్తూ ఉంది. ఆ సమయంలో పటాకీ వచ్చి కళ్ల ముందు పేలింది, దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక చూపును కోల్పోయింది. ప్రస్తుతం బెంగళూరు మింటో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వైద్యులు శస్త్రచికిత్స జరిపేందుకు ఏర్పాట్లు చేసుకొన్నారు. భవిష్యత్లో చూపు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు. మరో అబ్బాయికి ఇబ్బంది బెంగళూరు సిద్ధాపురలో పీయూసీ విద్యార్థి ఒకరు రోడ్డు పక్కన నడచుకొంటూ వెళుతున్నపుడు పటాసు పేలి కంటికి తీవ్ర గాయమైంది. కొందరు యువకులు రాతిపై టపాసును ఉంచి పేల్చినపుడు టపాసు ఎగిరి అతని కంటిని తాకడంతో గాయం తీవ్రత ఎక్కువగా ఉంది. తల్లిదండ్రులు టపాసులు పేల్చిన యువకుల మీద మండిపడ్డారు. గాయపడిన అబ్బాయి మింటో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. ఇదేమాదిరిగా కళ్లకు తీవ్రగాయాలై ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇతరుల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరిగి జీవితాన్ని చీకటిగా మార్చాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.బెంగళూరులోని ఆసుపత్రుల్లో నమోదైన కేసులు నారాయణ నేత్రాలయ –75 కేసులు మింటో ఆసుపత్రి –28 శంకర కంటి ఆసుపత్రి –27 ప్రభా కంటి ఆసుపత్రి –11 మోదీ ఆసుపత్రి –3 అగర్వాల్ కంటి ఆసుపత్రి – 3 -
కారు పోయిందే!
తుమకూరు: భారీ వర్షాలకు జిల్లాలో చెరువులు, కాలువలుపొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వర్షపు నీటిలో కారు కొట్టుకుపోయిన ఘటన గుబ్బి తాలూకా తోటసాగర వద్ద జరిగింది. వివరాలు.. తోటసాగర గ్రామవాసి మంజునాథ్ కారు డ్రైవర్గా జీవిస్తున్నాడు. గ్రామం నుంచి వెళ్తుండగా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కారు పక్క నుంచి వేగంగా టెంపో వెళ్లడంతో మంజునాథ్ అదుపుతప్పడంతో కారు వాగులోకి పడి కొట్టుకుపోసాగింది. మంజునాథ్ వెంటనే కారు నుంచి బయటకు వచ్చి ఈత కొట్టుకుంటూ బయటపడ్డాడు. అయితే కారు మాత్రం నీటిలో సుమారు ఒక కిలోమీటర్ వరకు కొట్టుకుని పోయింది. సుమారు రెండు గంటల పాటు శ్రమించి కారును స్థానికులు బయటకు తీశారు. -
అందరి నోటా మోదీ బిల్డింగ్
హుబ్లీ: కర్ణాటక మెడికల్ కాలేజీ(కేఎంసీ) ఆస్పత్రికి వచ్చే అత్యధిక రోగుల నోటి నుంచి వచ్చే తొలి మాట వమోదీ బిల్డింగ్. 5 అంగశాస్త్ర ప్రత్యేక విభాగాలు కలిగిన ఈ 5 అంతస్తుల అత్యాధునిక భవనంలో శరీరంలోని కీలక అవయవాలకు సంబంధించిన ప్రత్యేక విభాగాలతో అత్యంత అనుభవజ్ఞులైన ఎండీ, ఎంబీబీఎస్, ఆపై ఉన్నత వైద్య విద్యా కోర్సులు చేసిన నిపుణులైన వైద్యులు 24 గంటలూ ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు ఆ మోదీ బిల్డింగ్లో వేలాది మంది పునర్జన్మ పొందారు. కన్నీటిమయంగా మారిన క్యాన్సర్ రోగులు, వారి సహాయకులు ఆ విభాగంలోని వార్డులలో రేడియేషన్, కిమోథెరపీ తదితర అత్యాధునిక చికిత్సలతో పాటు మిగతా మూడు వేర్వేరు అవయవాలకు సంబంధించిన విభాగాల్లో కూడా నిపుణులైన వైద్య బృందం నిరంతరం విధుల్లో ఉంటారు. ముఖ్యంగా ఎండీ పూర్తి చేసి వచ్చిన యువ వైద్యులు, మొదటి, రెండవ, మూడవ ఏడాది చదివే సంబంధిత ఎండీ విద్యార్థులు ఇక ఎంతో కష్టపడి 5 ఏళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసిన మెరిట్ విద్యార్థులు ఒక ఏడాది పాటు వీరికి ఇంటర్న్షిప్ లేదా హౌస్సర్జన్లుగా కేవలం నెలకు రూ.30 వేల స్టైఫండ్ తీసుకొని క్యాంపస్ ఆవరణలో 24 గంటలూ ఉంటూ వైద్యంపై అధ్యయనం చేస్తూ రోగులకు ఎంతో సేవలు అందిస్తారు. ముఖ్యంగా పేషెంట్ల సహాయకులు ఏ మాత్రం అజాగ్రత్తతో ఉన్నా వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు. కేఎంసీలో తీవ్ర అనారోగ్య బాధితుల పాలిట పునర్జన్మ కేంద్రం 5 కీలకాంగ శాస్త్ర విభాగాలతో రోగుల పాలిట ఆరోగ్య పెన్నిధి -
చిత్తాపురలో ఆర్ఎస్ఎస్కు బ్రేక్
శివాజీనగర: కల్బుర్గి జిల్లా చిత్తాపురలో ఆదివారం ఆర్ఎస్ఎస్ పథసంచలనం జరగరాదని అక్కడి ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ప్రియాంక్ ఖర్గే, జరిపి తీరాలని సంఘ్ నాయకులు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ జాతాకు అనుమతి ఇవ్వలేదని చిత్తాపుర తహసీల్దారు ప్రకటించడంపై సంఘ్ పెద్దలు భగ్గుమన్నారు. ఆదేశాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసును దాఖలు చేశారు. ఆదివారం అయినప్పటికీ హైకోర్టు అత్యవసరంగా విచారణ జరిపింది. తహసీల్దారు నిరాకరణ చిత్తాపురలో ఆర్ఎస్ఎస్ పథసంచలనం జరిపేందుకు తీర్మానించింది. ఇదే సమయంలో భీమ్ ఆర్మీ అనే దళిత సంఘం కూడా కవాతు జరపాలని నిర్ణయించింది. ఇలా ఒకే సమయంలో రెండు సంఘాలు ర్యాలీల వల్ల శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని చిత్తాపుర తహశీల్దార్ నాగయ్య ఆర్ఎస్ఎస్కు అనుమతిని నిరాకరించారు. దీనిని అశోక్ పాటిల్ అనే సంఘ్ నేత హైకోర్టు కల్బుర్గి ధర్మాసనంలో పిటిషన్ వేశారు. ఆర్ఎస్ఎస్కు సూచనలు పిటిషన్దారుల విన్నపాన్ని తిరస్కరించేందుకు తగిన చట్టం లేదని జడ్జి పేర్కొన్నారు. ఈసారి దరఖాస్తులో పథసంచలనం మార్గం, స్థలం, సమయం వివరాలు ఉండాలని, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. అనుమతికి సంబంధించిన నివేదికను 24న తమకు సమర్పించాలని జడ్జి ప్రభుత్వ న్యాయవాదికి సూచించారు. చిత్తాపుర ర్యాలీకి అనుమతి ఇవ్వాలనగా మొదట్లోనే జడ్జి నిరాకరించారు. తేదీ మార్పు కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. చిత్తాపురలో ఓ రకంగా ఆర్ఎస్ఎస్కు నిరాశే మిగిలింది. ర్యాలీకి తహసీల్దారు తిరస్కృతి హైకోర్టులో ఆర్ఎస్ఎస్ పిటిషన్ తక్షణ అనుమతికి జడ్జి నిరాకరణ అనుమతి ఉంటే నవంబరు 2న జరపవచ్చని ఆదేశం 24కు కేసు వాయిదాముఖభంగం కాదు: మంత్రి ఖర్గే ఈ కేసులో తనకు ఎలాంటి ముఖభంగం కాలేదని మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. బెంగళూరులో నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ర్యాలీ జరపాలనుకుంటే ఆర్ఎస్ఎ జిల్లా యంత్రాంగానికి పిటిషన్ను సమర్పించాలని జడ్జి ఆదేశించారని తెలిపారు. బీజేపీ నేతలు సొంత తెలివితో విమర్శలు చేస్తున్నారని హేళన చేశారు. కోర్టు ఏకాఎకిన అనుమతి ఇచ్చి ఉంటే కదా? అన్నారు. ఎవరి వాదనలు ఏమిటి? ఆర్ఎస్ఎస్ నుంచి సీనియర్ న్యాయవాది అరుణ్శ్యామ్, ప్రభుత్వం తరఫున న్యాయవాది శశికిరణ్ శెట్టి వాదించారు. ఇరువైపులా వాదనలను ఆలకించిన న్యాయమూర్తి ఏ.జీ.ఎస్ కమల్.. నవంబర్ 2న ఆర్ఎస్ఎస్ పథసంచలనానికి అనుమతి కల్పించారు. రాష్ట్రంలో వందలాది పథ సంచలనాలను నిర్వహించాము, ఎక్కడా సమస్య రాలేదు, కాబట్టి ఆదివారమే జరుపుతామన్న సంఘ్ వకీలు వాదనను ఆమోదించలేదు. నవంబర్ 2న ఆర్ఎస్ఎస్ పథసంచలనం జరుపుకోవచ్చని, శాంతిభద్రతలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగరాదని ఆదేశించారు, ర్యాలీ కోసం కొత్తగా జిల్లాధికారులకు అనుమతికి పిటిషన్ సమర్పించాలని సూచించారు. తదుపరి విచారణను జడ్జి 24వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అయితే ఈదఫా కూడా జిల్లా యంత్రాంగం అనుమతిస్తుందా? అనే అనుమానం సంఘ్ నేతల్లో తలెత్తింది. -
బళ్లారి– కుమటా బస్సు పల్టీ
యశవంతపుర: కేఎస్ ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో 49 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార వద్ద జరిగింది. శనివారం రాత్రి అంకోలా తాలూకా వడ్డి ఘాట్లో బస్సు పల్టీ పడింది. కుమటా – శిరసి మార్గంలో రోడ్డు పనులు జరుగుతున్న కారణంగా సంచారాన్ని బంద్ చేశారు. శిరసికి వెళ్లే వాహనాలను వడ్డి ఘాట్ రోడ్డు వైపు మళ్లించారు. ఇరుకై న మలుపుల్లో బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల పల్టీ కొట్టింది. ఈ బస్సు బళ్లారి సిటీ నుంచి కుమటాకు వెళ్తోంది. డ్రైవరుతో సహా 49 మంది గాయాల పాలయ్యారు. అంకోలా, కుమటా కు బాధితులను తరలించారు. మరోవైపు శివమొగ్గ, మండ్య వద్ద ప్రమాదాలు జరిగాయి. 49 మందికి గాయాలు -
బెంగళూరు మేలును మరచి తిడతారా?
● పారిశ్రామికవేత్తలపై డిప్యూటీ సీఎం గుర్రు బనశంకరి: బెంగళూరులో సౌకర్యాలను వాడుకుని కంపెనీలను ప్రారంభించి పెద్దస్థాయిలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగినవారు నేడు బెంగళూరును విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ధ్వజమెత్తారు. అనేకమంది ఐటీ, బీటీ పారిశ్రామికవేత్తలు ఇటీవల రోడ్లు, ట్రాఫిక్ సమస్యలపై వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం తెలిసిందే. ఆదివారం కోరమంగల వీరయోధ ఉద్యానవనంలో బెంగళూరు నడిగే అభియానలో డీకే.శివకుమార్ పాల్గొని ప్రజలతో మాట్లాడారు. బెంగళూరుకు వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనే దానిని మరచిపోయి ట్వీట్లు చేస్తున్నారు, మనం మూలాలను మరిచిపోరాదు అని కోరారు. గుంతల రోడ్ల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత రెండేళ్లలో తాము చేసిన సంక్షేమం, అభివృద్ధి ఎవరూ చేయలేదన్నారు. ఢిల్లీ, ముంబై తో పాటు ఎక్కడికి తీసుకెళ్లినా రోడ్ల సమస్యలను చూపిస్తానని సవాల్ చేశారు. బెంగళూరు నగరంలో నిత్యం 3 వేల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి, జనాభా 1.40 కోట్ల కు చేరుకుంది. 70 లక్షల మంది ప్రతి రోజు బయటి జిల్లాల నుంచి వచ్చి వెళుతున్నారు, ఉద్యోగం విద్య, పరిశ్రమలు, వ్యాపారం తదితర అనేక రంగాల కోసం బెంగళూరుపై ఆధారపడ్డారని తెలిపారు. బెంగళూరు పాలికెలకు నిధులను పెంచామన్నారు. టన్నెల్ రోడ్డు మార్గం, ఎలివేటెడ్ కారిడార్, డబుల్ డెక్కర్ వంతెనలు, బఫర్ రోడ్లు, సిటీ లైటింగ్ తదితరాల కోసం రూ.1.04 లక్షల కోట్లతో పనులు చేపడతామని చెప్పారు. మహిళలకు కుంకుమ– పసుపుమైసూరు: మైసూరు నగరంలోని శ్రీదుర్గా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటె ఆంజనేయ స్వామి దేవాలయం ముందు అర్చక సిబ్బందికి, పౌరకార్మికులకు, మహిళలకు పసుపు కుంకుమ, పూలను బహూకరించారు. సమాజ సేవకుడు కే.రఘురామ్ వాజపాయ్ మాట్లాడుతూ దీపావళికి నిజమైన అర్థం అంటే సంతోషాన్ని పంచడమే అన్నారు. ఒక దీపం వెయ్యి దీపాలు వెలిగేలా చేస్తుందని, ఒకరి వల్ల మిగతావారికి వెలుగు రావాలని చెప్పారు. మరో వారం భారీ వర్షసూచన యశవంతపుర: రాష్ట్రవ్యాప్తంగా మరో వారం పాటు వానలు కొనసాగే అవకాశం ఉంది. మూడు రోజుల నుంచి కరావళి, మలెనాడు, దక్షిణ ఒళనాడు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరు చుట్టుపక్కల ఓ మాదిరి వానలు పడ్డాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పులతో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ నెల 25 వరకు వానలు పడే అవకాశం ఉంది. ముంగారు వానల కంటే హింగారు వానలు ఎక్కువ పడవచ్చని వాతావారణశాఖ అధికారులు తెలిపారు. శివమొగ్గలో కుండపోత శివమొగ్గ: దీపావళి పండుగ వేళలో శివమొగ్గ నగరంతో పాటు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం ఆదివారమంతా కొనసాగింది. శివమొగ్గ నగరమంతటా వర్షం పడింది. జన జీవితానికి అంతరాయం ఏర్పడింది. -
టపాసుల వ్యాపారం.. గత వైభవం
బొమ్మనహళ్లి: ఒకప్పుడు నగరవాసులు పెద్దమొత్తంలో టపాసుల్ని కొనాలి అంటే తమిళనాడులోని హోసూరుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా బొమ్మనహళ్లి పరిధిలోని చందాపుర నుంచి మొదలుకొని, అత్తిబెలిలో తమిళనాడు సరిహద్దుల వరకు వందలాది దుకాణాలు వెలిసేవి. కానీ అదంతా గత వైభవంగా మారింది. 2023లో దీపావళి సమయంలో టపాసుల గోదాము– షాపులో అగ్నిప్రమాదం జరిగి సుమారు 16 మంది వరకూ మరణించారు. ఆ దుర్ఘటన తరువాత ఇక్కడ దుకాణాల ఏర్పాటు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు అక్కడక్కడ ఒకటి తప్ప పెద్ద షాపులు లేవు. వ్యాపారం తుడిచేసినట్లు పడిపోయింది. 90 శాతం డిస్కౌంట్ అట గిరాకీ లేకపోవడంతో 90 శాతం డిస్కౌంటు ఇస్తామని పిల్లలు అంగళ్ల ముందు ప్లకార్డులు పట్టుకుని జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి నెరళూరులో టపాసుల వ్యాపారం చేస్తున్నాం, ఇప్పుడు ఆన్లైన్లో కూడా బాణాసంచా లభిస్తోంది. అంగడి వద్దకు వచ్చి కొనేవారు తక్కువయ్యారు, అని రామస్వామి అనే వ్యాపారి తెలిపారు. అనుమతుల భారం ● గతంలో ఘోర ప్రమాదం తరువాత టపాసుల దుకాణాలకు బెంగళూరు అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. ● పోలీసు, కాలుష్య నియంత్రణ, మున్సిపల్, రెవెన్యూ, ఫైర్ వంటి శాఖల అనుమతులు తీసుకున్నవారికే షాపులు ఏర్పాటు చేయనిచ్చారు. ● చాలామంది ఈ అనుమతులను పొందలేక, అందుకోసం పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు చేయలేక టపాసుల వ్యాపారాన్నే వదులుకున్నారు. ●అత్తిబెలి పోలీసు స్టేషన్ పరిధిలో 12 షాపులు, నెరళూరులో 9 అంగళ్లు మాత్రమే ఉన్నాయి. గతంలో ఇక్కడ కనీసం 50 షాపులతో భారీగా టపాసుల వ్యాపారం జరిగేది. ●బొమ్మసంద్ర పురభ, హెబ్బగోడి నగరసభలో ఒక్క అంగడికీ అనుమతి లేదు. ఆనేకల్ తాలూకాలోని హెబ్బగోడి, బొమ్మసంద్ర, చందాపుర, తిరుమగొండనహళ్ళి గేట్, నెరళూరు, యారండహళ్ళి, అత్తిబెలి వరకు వందలాది టపాసుల షాపులతో కళకళలాడేది. ఇప్పుడు 20 కి దాటకపోవడం విశేషం. బెంగళూరు– తమిళనాడు సరిహద్దుల్లో సవాలక్ష ఆటంకాలు వందల నుంచి పదుల సంఖ్యకు తగ్గిన దుకాణాలు రెండేళ్ల కిందటి దుర్ఘటనే కారణం -
మా బిడ్డను అల్లుడే చంపాడు
యశవంతపుర: బెంగళూరు మారతహళ్లి ఠాణా పరిధిలో సంచలనాత్మక డాక్టర్ కృతికారెడ్డి హత్య కేసులో ఆమె భర్త డాక్టర్ మహేంద్రరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. తాను మత్తు మందు ఇవ్వలేదని, చంపలేదని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో మృతురాలి తల్లి అల్లునిపై మండిపడ్డారు. నా కూతురిని 2024 అక్టోబర్లోనే హత్య చేయాలని అల్లుడు డాక్టర్ మహేంద్రరెడ్డి పథకం వేశాడని మృతురాలు డాక్టర్ కృతికారెడ్డి తల్లి, న్యాయవాది సౌజన్య ఆరోపించారు. ఆమె ఆదివారం బెంగళూరులో విలేకర్లుతో మాట్లాడారు. పెళ్లి నాటి నుంచి మహేంద్రరెడ్డి అనుమానం రాకుండా నడుచుకున్నాడు. పెళ్లయ్యాక కృతిక అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. రోజు మార్చి రోజు నైట్ డ్యూటీ అని చెబుతూ నాకు తెలియకుండా కూతురి ప్రాణం తీశాడు అని ఆమె విలపించారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆమెకు ఇంటిలోనే వైద్యం చేస్తున్నట్లు చెప్పాడు, 22న కృతికను మా ఇంటికి తీసుకెళ్లాం. ఐవీ డ్రిప్ వేసుకొని వచ్చింది. 23న కృతిక మాతో కలిసి భోజనం చేసింది. రాత్రి 9:30 గంటలకు రూంకు వెళ్లారు. మరుసటి రోజున ఉదయం 7:30 గంటలకు అల్లుడు రూం నుంచి కేకలు వేశాడు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు అని సౌజన్య వివరించారు. అల్లుడు మహేంద్రరెడ్డి కృతిక కు మత్తుమందు ఇచ్చి హత్య చేశాడని ఆరోపించారు. ఎన్నో ఆశలు పెట్టుకుంది ఎన్నో ఆశలు పెట్టుకొని కృతికారెడ్డి నాలుగు మెడిసిన్ కోర్సులు చేసింది. డాక్టర్ చదివి సమాజ సేవ చేయాలని ఎన్నో కలలుగంది, కృతిక కు ఎలాంటి అనారోగ్యంలేదు. అల్లుడు మహేంద్రరెడ్డి మత్తు మందులిచ్చి ప్రాణాలు తీశాడు అని ఆమె చెప్పారు. డా.కృతికారెడ్డి తల్లి సౌజన్య ఆరోపణలు -
పీఎస్ఐ తిమ్మప్ప జోగి మృతి
హొసపేటె: విజయనగర జిల్లా హువినహడగలి తాలూకా హిరేహడగలి పోలీస్ స్టేషన్ క్రైమ్ బ్రాంచ్ పీఎస్ఐ తిమ్మప్ప జోగి (59) శనివారం రాత్రి కన్ను మూశారు. ఈయన కొన్ని రోజులుగా హార్ట్స్ట్రోక్తో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. హరపనహళ్లి పట్టణానికి చెందిన తిమ్మప్ప గత 32 సంవత్సరాలుగా పోలీసు శాఖలో సేవలందించారు. అంత్యక్రియలు విజయనగర జిల్లాలోని హరపనహళ్లి పట్టణంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. తిమ్మప్ప జోగి మృతిపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్.జాహ్నవి, అదనపు ఎస్పీ జి.మంజునాథ్, హరపనహళ్లి డీవైఎస్పీ వెంకటప్ప నాయక్, హోస్పేట డీవైఎస్పీ డాక్టర్.టి.మంజునాథ్, కూడ్లిగి డీవైఎస్పీ మల్లేష్ దొడ్డాని, ఇతర పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు. ‘బతికుండగానే చంపేశారు’ ● రేషన్ కార్డులో విద్యార్థిని చనిపోయినట్లు నమోదు చేసిన అధికారులు హుబ్లీ: హావేరిలో విద్యార్థిని బతికి ఉండగానే రేషన్ కార్డులో చనిపోయినట్లు అధికారులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆటో డ్రైవర్ మహబూబ్ సాబ్ తన పెద్ద కుమార్తె సుహానకు రేషన్ ఇవ్వక పోవడంతో విచారించడానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే తన పెద్ద కుమార్తె మూడున్నర ఏళ్ల క్రితమే మృతి చెందినట్లుగా రేషన్ కార్డు రికార్డుల్లో నమోదు కావడం గుర్తించాడు. వెంటనే సమస్యను ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. సుహాన పేరు రేషన్కార్డులో లేకపోవడంతో స్కాలర్షిప్, ఇతర పథకాలు అందడం లేదని మహబూబ్ సాబ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు స్పందించి వెంటనే రేషన్కార్డులోకి పేరు చేర్చాలని కోరుతున్నాడు. -
దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదం
● మూడు బైక్లు దగ్ధం, ఏడుగురికి గాయాలు సాక్షి బళ్లారి: బాగలకోట నగరంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఇంటి ముందు దీపాలు వెలిగించే క్రమంలో అగ్ని ప్రమాదం జరగడంతో మూడు ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. 7 మందికి గాయాలు అయ్యాయి. బాగలకోట నగరంలో రాజేంద్ర అనే వ్యక్తి ఇంటి ఎదురుగా దీపాలు వెలిగించాడు. ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించడంతో పాటు గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన ఇంట్లో వారు పరుగులు తీయడంతో ప్రాణాలను దక్కించుకున్నారు. అయితే 7 మందికి గాయాలు అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. రాజేంద్ర బోర్వెల్ పనుల కోసం తెచ్చిన ఆయిల్ దీపాలకు తగలడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై బాగలకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నకలీ ఓటర్ల జాబితా దగ్ధంపై విచారణ రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా అళందలో మాజీ శాసన సభ్యుడు సుభాష్ గుత్తేదార్ నివాసంపై ఎస్ఐటీ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు చేశారు. నకలీ ఓటరు జాబితా తెచ్చి కాల్చిన అంశంపై విచారణ చేపట్టారు. ఓటరు రికార్డులు తెచ్చిన గూడ్స్ వాహనాన్ని అళంద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ మద్యంతో ప్రాణనష్టం హొసపేటె: ఆంధ్ర సరిహద్దు నుంచి తీసుకొచ్చిన సీహెచ్ పౌడర్తో మద్యం తయారు చేసి అక్రమంగా అమ్ముతున్నారు. దీని వల్ల జిల్లాలో యువకులు మరణిస్తున్నారని ఎంపీ ఈ.తుకారాం అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం కూడ్లిగి పట్టణంలోని శ్రీమతి అంగడి వీరమ్మ తిరుకప్ప ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో జిల్లా స్థాయి దిశ (అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ) సమావేశం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ.. పోలీసులు శాఖ సరిహద్దులో చెక్ పోస్ట్ ప్రారంభించి సీహెచ్ పౌడర్ రవాణాను అరికట్టాలని ఎస్పీ జాహ్నవిని ఆదేశించారు. ఎకై ్సజ్, పోలీసులు శాఖలు దీనిపై నిర్లక్ష్యం వహించొద్దన్నారు. కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎకై ్సజ్ శాఖ వెంటనే మేల్కోని అక్రమ మద్యం అమ్మకాలపై చర్యలు తీసుకోవాలన్నారు. లంపీ వ్యాధి నివారణకు మందుల కొరత ఉంటే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల దృష్టికి తీసుకెళ్లాలని పశుసంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లతా మల్లికార్జున, జిల్లాధికారి కవితా ఎస్ మన్నికేరి, జిల్లా పంచాయతీ అధికారి మొహమ్మద్ నోయంగ్జాయ్ అక్రమ్ అలీషా, ఎస్పీ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. రెండు ద్విచక్ర వాహనాల ఢీ హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా బనవికల్లు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన బనవికల్లు సమీపంలోని జాతీయ రహదారి–50పై శనివారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో మోహన్ (27) తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని చికిత్స నిమిత్తం కూడ్లిగి తాలూకా ఆస్పత్రిలో చేర్చారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. కానహోసల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. డీసీసీ బ్యాంక్ ఎన్నికల్లో వర్గపోరు సాక్షిబళ్లారి: బెళగావి డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య గొడవ జరిగింది. ముందు నుంచి బెళగావి అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంతర్గత విభేదాలు ఉండటంతో ఈ ఎన్నికల్లో పతక స్థాయికి చేరుకున్నాయి. జార్కిహొళి సోదరులు లక్ష్మణ సవధి, ఉమేష్ కత్తి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జార్కిహొళి వర్గానికి చెందిన అప్పాసాహెబ్ వ్యతిరేకంగా ఓటు లేని వారు ప్రవేశించడంతో గొడవ మొదలైంది. రాయబాగ్ తాలూకా డైరెక్టర్ స్థానానికి బసగౌడ రంగంలోకి దిగడంతో ఈయన సౌది, కత్తి వర్గం తరఫున పోటీ చేయడంతో బసగౌడ వర్గీయులు ఘర్షణకు దిగారు. హోటల్ ముందు లక్ష్మణ సౌది–జారికెహొళి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను కట్టడి చేశారు. -
దీపావళి కోలాహలం
విభిన్న రీతుల్లో ఆకట్టుకుంటున్న మట్టి దీపాలుసొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ కిటకిట రోడ్డు పక్కన అరటి పిలకల అమ్మకాలు బళ్లారి, హొసపేటెలో ఆదివారం దీపావళి కోలాహలం నెలకొంది. దీపావళి, లక్ష్మీపూజను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. బళ్లారిలో పారిశ్రామిక వాడగా పేరొందిన తోరణగల్లు, తోరణగల్లు ఆర్ఎస్లో పూజా సామగ్రి కొనుగోళ్లతో సందడి వాతావరణం కనిపించింది. ఉత్తరాది, దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు చెందిన జిందాల్ కార్మికులు, అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు, కూలీలు పూలు, పండ్లు, కొత్త దుస్తులు, అరటి పిలకలు, మట్టి దీపాలు కొనుగోలు చేశారు. మరోవైపు పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు కిక్కిరిశాయి. పండుగ సందర్భంగా పూలు పండ్లు, టెంకాయలు, కాయకూరలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. మట్టి ప్రమీదలను నగరంలో ప్రముఖ రహదారుల్లో అమ్మకానికి ఉంచారు. – బళ్లారి రూరల్/హొసపేటె: -
టూరిస్టు బస్సు బోల్తా.. 18 మందికి గాయాలు
శివమొగ్గ: ప్రైవేటు టూరిస్టు బస్సు వేగంగా వెళ్తూ పల్టీలు కొట్టిన ప్రమాదంలో 18 మంది గాయపడిన సంఘటన శివమొగ్గ జిల్లాలోని సాగర్ తాలూకా ఆడుకట్టె వద్ద ఆదివారం జరిగింది. చిక్కబళ్లాపురం జిల్లాలోని గౌరిబిదనూరుకు చెందిన 45 మంది సిగందూరు చౌడేశ్వరి దేవస్థానం దర్శనానికి వెళ్లి, అక్కడి నుంచి వడనబైలులో ఉన్న పద్మావతి ఆలయానికి బయల్దేరారు. ఈ సమయంలో ప్రమాదం జరిగింది. పురుషులు, మహిళలు సహా బాలలు గాయాలపాలయ్యారు. స్థానిక ప్రజలు వారిని సాగర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు బ్రేక్ విఫలం కావడమే కారణమని డ్రైవర్ చెప్పాడు. -
టైరు పేలి.. రెండు బస్సులు ఢీ
● మండ్య వద్ద ఇద్దరు మృతి మండ్య: రెండు కేఎస్ ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోగా, 70 మంది గాయపడిన సంఘటన మండ్య జిల్లాలోని మళవళ్ళి తాలూకాలోని బాచనహళ్ళి వద్ద జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం జరిగింది. కొళ్ళెగాల వైపు నుంచి బెంగళూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు టైరు పేలిపోయింది, దీంతో అదుపుతప్పి ఎదురుగా అవతలి లేన్లో మళవళ్ళి నుంచి కొళ్ళెగాలకు వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. రెండు బస్సుల్లోను ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు మహిళలు మరణించగా, 70 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా ఉన్న కొందరిని మండ్య మిమ్స్కు తరలించారు. మండ్య గ్రామీణ పోలీసులు, ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. -
కొండ కోనలు దాటుకుని..
యశవంతపుర: దీపావళి పర్వదినాల సందర్భంగా కాఫీనాడు చిక్కమగళూరు శక్తిదేవతగా పేరుగాంటిన దేవీరమ్మ దర్శనం కోసం భక్త కోటి తరలివచ్చింది. దట్టమైన అడవుల్లో ముళ్లయ్యనగిరి ప్రాంతంలో సముద్ర మట్టానికి 3800 అడుగుల ఎత్తులో కొండపై వెలసిన అమ్మవారి ఆలయానికి ఆదివారం ఉదయం నుంచి భక్తుల రాక మొదలైంది. వేలాది మంది ఎన్నో ప్రయాసలకోర్చి కొండను ఎక్కి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్య మధ్యలో జోరువాన వచ్చినా తడుస్తూనే భక్తులు కొండను ఎక్కారు. ఆది, సోమవారం రెండు రోజుల పాటు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. మట్టిచరియలు విరిగే అవకాశం ఉన్నందున భక్తులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు తెలిపారు. ముళ్లయ్యనగిరిలో దేవీరమ్మ జాతర -
నిందితులపై చర్యలు తీసుకోండి
రాయచూరు రూరల్: విజయపుర జిల్లా ముద్దే బిహళ్ తాలుకా బనోశిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై చర్యలు చేపట్టాలని చలువాది మహిళా మహాసభ డిమాండ్ చేసింది. ఆదివారం జిల్లా అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చలువాది మహిళా మహాసభ అధ్యక్షురాలు అర్చన మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. ఉద్యోగం ఇచ్చి, ఇల్లు, భూమి మంజూరు చేయాలన్నారు. స్థానిక అధికారికి వినతిపత్రం అందజేశారు. రహదారి నిర్మించాలి రాయచూరు రూరల్: దేవదుర్గ తాలుకా గబ్బూరు–గూగల్ వంతెన వరకూ రోడ్డు అధ్వానంగా మారింది. వెంటనే రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కర్ణాటక రైతు, వ్యవసాయ సంరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఇంజనీరింగ్ విభాగం అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కర్ణాటక రైతు, వ్యవసాయ సంరక్షణ సమితి అధ్యక్షుడు మస్తాన్ నాయక్ మాట్లాడుతూ.. రహదారి మరమ్మతులు చేపడితే యాదగిరికి 50 కి.మీ దూరం తగ్గుతుందన్నారు. వెంటనే రహదారి పనులు చేపట్టి, సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరం ఇంజనీర్ వెంకటేష్ గలగకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంగమేష్ నాయక్, శామిల్, మూసా, శివరాజ్, తిమ్మప్ప నాయక్, విరుపాక్షి తదితరులు పాల్గొన్నారు. యేహోవా మందిరంలో ప్రార్థనలు హుబ్లీ: స్థానిక శాంతి నగర్లోని యేహోవా ప్రార్థన మందిరంలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. బ్రదర్ రాబిన్, మంజునాథ్ మాట్లాడుతూ.. వివిధ అధ్యాయాల్లోని సంబంధిత వచనాలను చక్కగా వివరించారు. ప్రత్యేక ప్రార్థన కూటముల్లో పాల్గొనాలని సూచించారు. అందరి మేలు కోసం నిత్యము ప్రార్థనలు చేయాలన్నారు. -
ఎయిడ్స్పై అవగాహన అవసరం
రాయచూరు రూరల్: దేశాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్పై ప్రచారం చేపట్టాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుగుణ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా ఆరోగ్యశాఖ, రెడ్రిబ్బన్, రిమ్స్, పాఠశాలలు, స్వచ్ఛంధ సంస్థల ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై వీధి నాటకాల జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఎయిడ్స్ అంటువ్యాధి కాదన్నారు. సమాజంలో ఈ వ్యాధికి గురైన వారిపై వివక్ష చూపొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిపై గ్రామస్థాయి నుంచి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సంతోష్ కుమార్, మఠపతి, మల్లయ్య, శాంత కుమార్, దేవమ్మ, మహాలింగమ్మ, శారద, అన్నపూర్ణ, సువర్ణ, జమున తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు రాయచూరు రూరల్: జిల్లా యువకులు క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని తారానాథ్ విద్యా సంస్థల ఉపాధ్యక్షుడు పవన్ పేర్కొన్నారు ఆదివారం మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో రాయచూరు, కొప్పళ జిల్లాల సిటీ ఎలెవన్ అండర్–14 క్రికెట్ శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. సుమాదు 110 జట్లు శిక్షణ శిబిరానికి వచ్చాయి. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. క్రీడాకారులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. క్రీడల్లో రాణించి, పాఠశాల తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సిటీ ఎలెవన్ క్లబ్ అధ్యక్షుడు శరణ రెడ్డి, రాజశేఖర్, రాజేష్, వెంకట రెడ్డి, సంజీవ నాయక్, భరత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి యువజనోత్సవాలు ప్రారంభం రాయచూరు రూరల్: విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మానవీయ మౌల్యాలను పెంచుకోవాలని అదనపు జిల్లా అధికారి శివానంద పిలుపునిచ్చారు. ఆదివారం వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, యువజన క్రీడల సేవా శాఖ ఆధ్వర్యంలో 2025–26 జిల్లా స్థాయి యువజనోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో విద్యార్థులకు ఉత్సవాలపై ఆసక్తి తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్స్కు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. యువకులు భారతీయ సంస్కృతిని కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో 180 మంది యువకులు పాల్గొనడం అభినందనీయమన్నారు. ఉత్సవాల్లో యువజన క్రీడల సేవా శాఖ అదికారి వీరేష్ నాయక్ పాల్గొన్నారు. రాష్ట్రావతరణ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి రాయచూరు రూరల్: జిల్లాలో నవంబర్ 1న జరగనున్న రాష్ట్రావతరణ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు జిల్లా అధికారి శివానంద పేర్కొన్నారు. ఆదివారం జిల్లా అధికారి కార్యాలయంలో రాష్ట్రావరణ వేడుకలపై సమావేశం నిర్వహించారు. నగరంలోని కర్ణాటక సంఘం ఆధ్వర్యంలో తల్లి భువనేశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి ఊరేగించడం జరుగుతుందన్నారు. మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల పాటు కన్నడ సినిమాలను ప్రదర్శించాలని ఆదేశించడం జరిగిందన్నారు. దుకాణాలు, హోటళ్లకు కన్నడ భాషలో నామఫలాకాలు రాయించాలని సూచించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు శాంతప్ప, కొండప్ప, చంద్రశేఖర్ పాటిల్, మురళీధర్ కులకర్ణి, శ్రీనివా్స్, గురునాథ్, వినోద్ రెడ్డి, అధికారులు విజయ రాణి, వీరేష్ నాయక్, రమేష్ గౌడ తదితరులు పాల్గొన్నారు. కేఎంసీ పరిశోధన ఆస్పత్రి వైద్యుల ఘనత ● మగబిడ్డ కడుపులో బ్రూణం తొలగింపు ● చిన్నారి ఆరోగ్యం ఉండటంతో డిశ్చార్జ్ హుబ్లీ: అప్పుడే పుట్టిన మగబిడ్డ కడపులో 8 సెంటీమీటర్ల పొడవు ఉన్న బ్రూణాన్ని ఈనెల 8వ తేదీన హుబ్లీ కేఎంసీ పరిశోధన ఆస్పత్రి వైద్యులు తొలగించిన విషయం తెలిసిందే. చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వివరాలు.. సెప్టెంబర్ 23న ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకాకు చెందిన మహిళ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. మగబిడ్డ పొట్టలో బ్రూణం ఉన్నట్లు వైద్య బృందం గుర్తించింది. కిమ్స్ ఆస్పత్రిలో అనుభవం గల వైద్య నిపుణుడు, బాలల ఆపరేషన్ విభాగం డాక్టర్ రాజ శంకర్, డాక్టర్ రుపాలి నేతృత్వంలో చిన్నారికి ల్యాబోస్కోపీ చేసి కడుపులోని ఏ భాగంలో బ్రూణం ఉందో నిర్ధారించారు. అనంతరం చిన్నారికి మత్తు మందు ఇచ్చి పొట్ట భాగంలో చిన్న రంద్రం చేసి ఆపరేషన్ చేశారు. కడుపులో ఉన్న 8 సెంటిమీటర్ల ఉన్న బ్రూణాన్ని విజయవంతంగా బయటకు తీశారు. బ్రూణానికి మొదడు, హృదయం లేవు. వెన్నెముక అలాగే చిన్న కాళ్లు, చేతులు ఉన్నట్లు గుర్తించారు. ఎఫ్ఈటీయూఎస్ఐఎన్ఎఫ్ఈటీయూగా పిలిచే ఈ కేసు ప్రపంచంలోనే అరుదైనది కావడంతో బ్రూణం గడ్డను వ్యాధుల నిర్ధారణ వైద్య శాస్త్ర విభాగంలో నిల్వ చేశారు. వైద్యులకు బోధన నిమిత్తం దాచి పెట్టారు. -
పంట నష్ట పరిహారం చెల్లించాలి
రాయచూరు రూరల్: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం మంజూరు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేవారు. ఆదివారం బీదర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఈశ్వర్ ఖండ్రే నివాసం ముందు శాసన సభ్యుడు ప్రభు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అతివృష్టితో కలబుర్గి, బీదర్, యాదగిరి, రాయచూరు జిల్లాలో పంట నష్టం సంభవించిందన్నారు. పత్తికి క్వింటాల్కు రూ.10 వేలు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సౌకర్యార్థం పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. రైతులు తీసుకున్న రుణాలను పూర్తిస్థాయిలో రద్దు చేయాలని తెలిపారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రం అందజేశారు. -
సొంతూర్లో దీపావళి
టపాసుల బాక్సుతో బాలుడు దీపావళి పండుగ సందర్బంగా విబిన్నరకాలు టపాసులు చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్సీ టపాసులు ఈసారి అదికంగా మార్కెట్లో లభిస్తున్నాయి. ఏటా మాదిరిగానే బెంగళూరు– తమిళనాడు సరిహద్దులోని హొసూరు రోడ్డులో అత్తిబెలె, సూర్యనగర మార్గంలో రోడ్డుపక్కన వందలాది టపాసుల దుకాణాలు వెలిశాయి. చిత్ర విచిత్రమైన ఆకారాల్లోని టపాసులు ఇక్కడ అమ్మకానికి ఉంచారు. తమిళనాడు నుంచి టోకుగా తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు, ఎక్కువ రకాలు దొరుకుతాయని పలు జిల్లాల నుంచి వచ్చి టపాసులు కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు తెలిపారు. రాష్ట్రంలో వివిధ నగరాల్లో దీపావళి ప్రమిదలు, లాంతర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.బెంగళూరు మెజెస్టిక్ బస్టాండులో రద్దీ దృశ్యాలు పండుగకు ఎలాగైనా ఊరికి చేరాలి బనశంకరి: దీపావళి పండుగ, అది కూడా వీకెండ్తో పాటు కలిసి రావడంతో బెంగళూరువాసులు సొంతూళ్లకు క్యూ కట్టారు. బంధుమిత్రుల మధ్య టపాసులతో సందడిగా గడపాలని ప్రయాణమయ్యారు. దీంతో సిలికాన్ సిటీ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఉద్యోగం, చదువు, వ్యాపారాలతో నగరంలో ఉంటున్న లక్షలాది మంది సొంత ఊర్ల బాటపట్టారు. నగరం నుంచి శివార్ల వరకూ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. శని, ఆదివారం సెలవు, సోమవారం దీపావళి కావడంతో మూడురోజులు స్వగ్రామంలో గడపాలని నిర్ణయించుకున్నారు. అన్ని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో శుక్రవారం రాత్రి నుంచి మెజెస్టిక్ బస్టాండు, రైల్వేస్టేషన్ వద్ద కిటకిటలాడింది. శాంతినగర బస్టాండు, యశవంతపుర రైల్వేస్టేషన్తో పాటు వివిధ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోనూ విపరీతంగా రద్దీ నెలకొంది. కేఎస్ ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో చోటు దొరకలేదు. ప్రైవేటు ట్రావెల్స్లో టికెట్ రేట్లను రెండు మూడు రెట్లు పెంచేసి దోచుకుంటున్నారని ఆరోపణలొచ్చాయి. హోసూరు రోడ్డు, మైసూరు రోడ్డు, తుమకూరు రోడ్డు, బళ్లారి రోడ్లలో కిలోమీటర్ల కొద్దీ కార్లు, బస్సులు బారులు తీరాయి. లక్షలాది మంది కార్లు, ద్విచక్ర వాహనాల్లో బయలుదేరడంతో మధ్యలో వర్షం వచ్చి గంటల కొద్దీ ట్రాఫిక్లో చిక్కుకున్నారు. సజావుగా వాహనాలు సంచారానికి ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించారు. రైల్వే స్టేషన్, బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్టాండ్లలో పోలీసు భద్రత పెరిగింది. బెంగళూరు నుంచి లక్షలాది మంది పయనం రహదారులన్నీ కిటకిట రాష్ట్రంలో పండుగ సందడి బిహార్ కూలీలు సైతం దీపావళి పండుగకు బెంగళూరులోని లక్షలాది మంది బిహారీ వలస కార్మికులు కుటుంబాలతో సహా బయలుదేరారు. దీంతో మెజెస్టిక్ కేఎస్ఆర్, యశవంతపుర రైల్వేస్టేషన్లలో తీవ్ర రద్దీ ఏర్పడింది. నవంబరు 6 నుంచి 11 వరకు బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఓటు వేయడానికి కూడా ఎక్కువమంది పయనమయ్యారు. -
చామరాజనగర బంద్
మైసూరు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి మీదకు రాకేష్ కిషోర్ అనే లాయరు బూటు విసరడాన్ని ఖండిస్తూ దళిత సంఘాలు శనివారం చామరాజనగర బంద్ను నిర్వహించాయి. బంద్ విజయవంతమైంది. థియేటర్లు, హోటళ్లు, షాపులు, ఆఫీసులు మూతపడ్డాయి. ఉదయం నుంచి దళిత సంఘాల నాయకులు ర్యాలీలు నిర్వహించారు. బస్టాండు ముందు బైఠాయించారు. దాంతో మధ్యాహ్నం వరకు బస్సులు కదలలేదు. అనేక జిల్లాలలో దళిత సంఘాల ఆందోళనలు జరిగాయి. ఏబీసీ వర్గీకరణలో చుక్కెదురు శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలను మూడు గ్రూపులుగా ఉప వర్గీకరణ చేసి విడుదల చేసిన నోటిఫికేషన్ కింద ఎలాంటి ఉద్యోగ నియామకాలను చేయరాదని హైకోర్టు ఆదేశించింది. ఇదివరకే ఆరంభమైన నియమాకాలను కొనసాగించవచ్చని సూచించింది. ఆగస్టు ఆఖరులో చేసిన ఏబీసీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ అస్పృశ్య సంచార సముదాయాల ఒక్కూట, సంచార సంఘం దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్ విచారించారు. వర్గీకరణను నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. అశాసీ్త్రయంగా ఉందని, ప్రభుత్వం సక్రమంగా చేయలేదని ఆరోపించారు. వాదనలను ఆలకించిన జడ్జి సర్కారు ఉత్తర్వులపై స్టే జారీచేశారు. ఖాకీ చేతిలో మాజీ భార్య హత్య ● బెళగావి జిల్లా సవదత్తిలో ఘటన రాయచూరు రూరల్: బెంగళూరులో డాక్టరు చేతిలో భార్య హత్య జరిగిన విషయం మరిచిపోకముందే, ప్రేమించి, పెళ్లి చేసుకొని, ఆపై విడాకులు పొందిన మాజీ భార్యను పోలీస్ కానిస్టేబుల్ హత్య చేసిన ఘటన బెళగావి జిల్లా సవదత్తిలో చోటు చేసుకుంది. బైలహొంగల తాలూకా బెళవడికి చెందిన కాశమ్మ (34) ని, బనజవాడకు చెందిన సంతోష్ కాంబ్లే హత్య చేశాడని పోలీసులు తెలిపారు. వివరాలు.. సవదత్తి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పని చేస్తున్న కాశమ్మ, కానిస్టేబుల్ సంతోష్ 13 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఇద్దరు కులాలు వేరైనా పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. కొన్నాళ్లకే అనుమానంతో భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. అతని పోరు పడలేక ఆమె సవదత్తిలో ఇంటిని అద్దెకు తీసుకొని వేరుగా ఉండేది. ఐదు నెలల క్రితం మంజూరయ్యాయి. ఇదంతా అతడు తట్టుకోలేకపోయాడు. ఈ నెల 13న రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చింది. సంతోష్ ఇంటికొచ్చి ఆమెను హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. కుళ్లిన శరీరం నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల ప్రజలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న హంతకున్ని అరెస్టు చేశారు. హనీట్రాప్కు యువకుడు బలి ● యువతి, ముఠా సభ్యుల బెదిరింపులు ● ఉడుపి జిల్లాలో సంఘటన యశవంతపుర: ఉడుపి జిల్లా కార్కళ తాలూకా నిట్టె గ్రామానికి చెందిన అభిషేక్ (25) అనే యువకుడు స్థానిక లాడ్జిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెనుక హనీ ట్రాప్ జరిగినట్లు డెత్నోటు ద్వారా బయటపడింది. అభిషేక్ ప్రభుత్వ గోషా ఆస్పత్రిలో ల్యాబ్లో ఉద్యోగి అని తెలిసింది. అభిషేక్, నిరీక్ష అనే యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే ఆమె మరో యువకునితోనూ ప్రేమాయణం నడుపుతోందని సమాచారం. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను చూపి డబ్బులు ఇవ్వాలని ఆమె అభిషేక్ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. భయపడిన అభిషేక్ డబ్బులను ఇచ్చాడు. మళ్లీ రూ. 4 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తానని, కేసు పెడతానని బెదిరించింది. కొన్నిసార్లు దాడి కూడా చేసింది. ఈ వేధింపులతో భయపడిన బాధితుడు లాడ్జిలో డెత్నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నిరీక్ష మంగళూరుకు చెందిన రాకేశ్, రాహుల్, తస్లీమ్లతో కలిసి అభిషేక్ను హనీట్రాప్ చేసిందని పోలీసుల విచారణలో బయట పడింది. యువతి ఫోటోలు వైరల్ అయ్యాయి. -
రౌడీ పులి పట్టివేత
మైసూరు: రైతుపై దాడి చేసిన పులిని అటవీ సిబ్బంది పట్టుకున్నారు. జిల్లాలోని సరగూరు తాలూకా బండీపుర అభయారణ్యం పరిధిలోని బడగలపుర గ్రామంలో పత్తి చేనులో ఉన్న రైతు మహదేవగౌడపై దాడి చేసి కళ్లు పీకేసి, తీవ్రంగా గాయపరచిన పెద్ద పులి ఉదంతం తెలిసిందే. గురువారంనాడు ఈ దాడి జరిగింది. క్షతగాత్రున్ని మైసూరు అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమీప యడియాళ వలయంలో పెంపుడు ఏనుగుల సహాయంతో కార్యాచరణ జరిపి పులిని గుర్తించారు. దానికి మత్తు సూది కొట్టి బంధించారు. దీంతో గ్రామస్తులు హమ్మయ్య అనుకున్నారు. రౌడీ పులిని బోనులో బంధించి తరలించారు. పులిని చూసేందుకు జనం భారీగా గుమికూడారు. -
బెంగళూరులో భారీ వర్షం
బెంగళూరులో.. వర్షంలో వెళ్తున్న ఆటో.. బన్నేరుఘట్ట రోడ్డులో వాననీరు బనశంకరి: బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి బెంగళూరు నగరంలో పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసి రోడ్లు జలమయం కాగా ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. దీంతో జనం వీకెండ్ సంతోషానికి ఆటంకం ఏర్పడింది. మెజస్టిక్, కార్పొరేషన్, మల్లేశ్వరం, యశవంతపుర, యలహంక, హెబ్బాల, శాంతినగర, కోరమంగల, బొమ్మనహళ్లి, జయనగర, మైసూరురోడ్డు, నాయండహళ్లి, కెంగేరి, బన్నేరుఘట్టరోడ్డు, కృష్ణరాజపురం, మారతహళ్లి, మహదేవపుర, హెచ్ఎస్ఆర్ లేఔట్, మడివాళ, విజయనగర, బసవనగుడి, జేపీ.నగర, ఉత్తరహళ్లి, బనశంకరి , బీటీఎం లేఔట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పండుగకు ఊళ్లకు వెళ్లేవారు కార్లు, సొంత వాహనాల్లో ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. బెంగళూరు– రూరల్తో పాటు పలు జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. -
నకిలీ నోట్లు.. అసలుకు మూడు రెట్లు
కృష్ణరాజపురం: రూ.10 లక్షల అసలైన నోట్లు ఇస్తే రూ.30 లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసగిస్తున్న తమిళనాడు తిరునైల్వేలి ముఠాను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. మీరు అసలు నోట్లను ఇస్తే, అంతకు మూడు రెట్లు అధికంగా నకిలీ డబ్బులను ఇస్తామని చెప్పి ఈ ముఠా మోసం చేసేది. తమిళనాడులో చురుకుగా ఉన్న ఈ ముఠా బెంగళూరులో కూడా సంచరిస్తున్నట్లు తెలిసి జయనగర పోలీసులు రంగంలోకి దిగారు. ఓ చోట ఇలాగే మోసం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా రాహేశ్వరన్, మిరాయ్ ముయిద్దీన్, షేక్ మహ్మద్ అనే ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సూట్కేసును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.500 నోట్ల కట్టలు లభించాయి. కట్ట పైన, కింద కొన్ని అసలు నోట్లను ఉంచి మధ్యలో తెల్లకాగితాలను సర్దారు. మిగతా వారు తప్పించుకొని పారిపోగా గాలింపు చేపట్టారు.పట్టుబడిన నిందితులు వీరే బెంగళూరులో మోసకారి ముఠా అరెస్టు -
ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కవాతు
చెళ్లకెరె రూరల్: దేశంలోనే అతి పెద్ద స్వయం సేవా సంఘం అని పేరొందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాల నిమిత్తం నగరంలో ఏర్పాటు చేసిన భవ్య కవాతు అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గణవేషంతో పాటు 250 మందికి పైగా స్వయం సేవకులు పాల్గొన్నారు. నగరంలోని గాంధీ నగర్, బసవేశ్వర సర్కిల్, నెహ్రు సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్, త్యాగరాజ్ నగర్ వంటి ప్రముఖ రహదారుల్లో కవాతు సాగింది. ఈ సందర్భంగా ప్రజలు, ఆర్ఎస్ఎస్ అభిమానులు పూలవర్షం కురిపించారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సదృఢ, ఆరోగ్యకర సమాజ నిర్మాణం కోసం పని చేస్తుందన్నారు. హిందూ పరంపర, సనాతన సంస్కృతి రక్షణే ధ్యేయంగా దేశ ప్రేమికుల శక్తిసాలి సంఘంగా పేరు పొందిందన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు రాందాస్, చెళ్లకెరె బీజేపీ మండల అధ్యక్షుడు బీఎల్ సురేష్, జయపాలయ్య, డాక్టర్ మంజునాథ్, శ్రీనివాస్, దయానంద్, ప్రహ్లాద్, మారుతీ తదితరులు పాల్గొన్నారు. -
వీధి కుక్కల దాడి.. 25 మందికి గాయాలు
రాయచూరు రూరల్: నగరంలో వీధి కుక్కలు దాడి చేయడంతో 25 మంది గాయాల పాలైన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నగరంలోని బైరూన్ కిల్లా, తిమ్మాపూర్పేట, ఖూనీ మసీదు, ఇతర ప్రాంతాల్లో వీధి కుక్కలు పిల్లలు, మహిళలపై దాడి చేసి గాయపరచడంతో రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పీడీఓకు ఎంపీ అండ సాక్షి బళ్లారి: ఆర్ఎస్ఎస్ కవాతు కార్యక్రమంలో పాల్గొన్నాడని రాయచూరు జిల్లా లింగసుగూరు తాలూకాకు చెందిన పీడీఓ ప్రవీణ్కుమార్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం బీజేపీ లోక్సభ సభ్యుడు తేజస్వీసూర్య సదరు పీడీఓకు అండగా నిలిచారు. ధైర్యంగా ఉండాలని, చట్టపరంగా పోరాటం చేసి తిరిగి ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని ఎక్స్లో పేర్కొన్నారు. బాపనయ్యదొడ్డిలో మరుగుదొడ్లు నిర్మించరూ రాయచూరు రూరల్: నగరంలోని 147వ వార్డులోని బాపనయ్యదొడ్డిలో మరుగుదొడ్లను నిర్మించాలని నవరత్న యువక సంఘం డిమాండ్ చేసింది. శనివారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శరణప్ప మాట్లాడారు. నగరసభ నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ పథకం నుంచి నిర్మిస్తున్న పనులను కొనసాగించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. సేవలకు సన్మానం సాక్షి బళ్లారి: ఈ నెల 17న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో రోటరీ ఇండియా కార్యక్రమంలో విద్యా, జల నిర్వహణ రంగాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తుగా జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ ముఖ్యులను సన్మానించారు. సంస్థ ప్రతినిధులు పెద్దన్న బిడార, రాజశేఖర్రాజు అవార్డును స్వీకరించారు. గ్రామాల్లో చదువులు, జల సంరక్షణ కోసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మైనర్ బాలికతో పెళ్లి కేసులో ఆరుగురికి జైలు శిక్ష హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని గద్వాల్ క్యాంప్ గ్రామంలో 14 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకున్న కేసులో గంగావతి ప్రిన్సిపల్ సివిల్, జేఎంఎఫ్సీ కోర్టు న్యాయమూర్తి నాగేష్ పాటిల్ ఆరుగురు నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు. 2020 మే 22న ఉదయం 11.30 గంటలకు గద్వాల్ క్యాంప్ గ్రామంలోని ఒక చర్చిలో బాల్య వివాహం జరిగింది. బాలిక తల్లిదండ్రులు, వరుడి కుటుంబం, చర్చి ఫాదర్ ఈ వివాహాన్ని నిర్వహించారు. ఈ కేసులో నిందితులు కూరపన్న, అతని తండ్రి యేసు, తల్లి శాంతమ్మ, చర్చి ఫాదర్ డి.అబ్రహం అందరూ బాల్య వివాహ నిషేధ చట్టం–2006లోని సెక్షన్లు 9, 10, 11 కింద దోషులుగా ఖరారయ్యారు. అప్పటి దర్యాప్తు అధికారి, పీఎస్ఐ జే.దొడ్డప్ప దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా కోర్టు విచారణ నిర్వహించింది. అక్టోబర్ 14న ప్రచురించిన తీర్పులో, నిందితులందరికీ ప్రతి సెక్షన్కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. కార్యాలయాల్లో పరిశుభ్రత కాపాడండిరాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలోని కార్యాలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. ఆయన శనివారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మాట్లాడారు. తాలూకా, గ్రామ స్థాయిలో ప్రతి శనివారం స్వచ్ఛతకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ముందుకు రావాలన్నారు. పాత తాలూకా, జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయాలను తనీఖీ చేసి నూతన భవన నిర్మాణానికి సంబంధించి అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించారు. పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచెళ్లకెరె రూరల్: పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే టి.రఘుమూర్తి తెలిపారు. ఆయన తాలూకాలోని సిద్దాపుర గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన బీఎంసీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తాలూకాలో పశువులను సంరక్షించే పాడి ఉత్పత్తిదారులను గుర్తించి రూ.25 వేల ప్రోత్సాహధనం ఇస్తారన్నారు. కార్యక్రమంలో సిద్దాపుర పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు గద్దిగె తిప్పేస్వామి, చిత్రదుర్గ పాల ఉత్పత్తిదారుల సంఘం నిర్దేశకులు బీసీ సంజీవమూర్తి, సిద్దాపుర మాజీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పాత లింగప్ప, శివమొగ్గ, దావణగెర, చిత్రదుర్గ జిల్లా పాల ఉత్పత్తిదారుల అధ్యక్షుడు హెచ్ఎం.విద్యాధర్ తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతున్న మహిళ, వ్యక్తి, చిన్నారి -
విదేశీ వద్దు.. స్వదేశీ ముద్దు
హొసపేటె: సదృఢ భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ విదేశీ ఉత్పత్తులను బహిష్కరించాలి, స్వదేశీ ఉత్పత్తులనే ఉపయోగించాలని బీజేపీ రాష్ట్ర శాఖ కన్వీనర్ జీఎస్.ప్రశాంత్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని జ్ఞానభారతి కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన స్వావలంబిత భారతదేశం, మోదీ ప్రభుత్వ నుంచి జీఎస్టీ తగ్గింపు బహుమతి అనే సంభాషణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాలకు మద్దతు ఇవ్వడంతో పాటు భారతదేశంతో సహా అనేక దేశాల ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను విధించడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి ప్రతిస్పందిస్తూ మనం ఒక గుణపాఠం నేర్పాలి, స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడాలి. దసరా కానుకగా మోదీ ప్రభుత్వం ధరలను తగ్గించి మధ్య తరగతికి ప్రయోజనం చేకూర్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశీయ ఉత్పత్తులను ఉపయోగించండి బీజేపీ రాష్ట్ర శాఖ కన్వీనర్ ప్రశాంత్ పిలుపు -
రక్తదానంపై జాగృతి జాతా
రాయచూరు రూరల్ : అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఇంచార్జి జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారి గణేష్ పేర్కొన్నారు. శనివారం తమ కార్యాలయం వద్ద జెడ్పీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, రోటరీ క్లబ్, రిమ్స్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన జాగృతి జాతాను ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తం పుట్టుకు వస్తుందన్నారు. రక్తదానం చేయడంతో ఇతరులకు ఉపయోగపడుతుందన్నారు. రక్తం ఇవ్వడం వల్ల మనిషి దేహంలో కొత్త రక్తం పుట్టి శుద్ధీకరణ అవుతుందన్నారు. జాతాలో వైద్యాధికారులు మనోహర్ పత్తార్, శాకీర్, సరోజ, లేపాక్షయ్యలున్నారు. సీపీఐ(ఎంఎల్) అభ్యర్థి అరెస్ట్ తగదు రాయచూరు రూరల్: బిహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి అరెస్ట్ తగదని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆరోపించింది. శనివారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనను ఉద్దేశించి అధ్యక్షుడు మహ్మద్ హనీఫ్ మాట్లాడారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థులు జితేంద్ర పాస్వాన్, సత్యదేవ్ రామ్లను పాలక పార్టీ బలవంతంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు. ప్రజా ప్రభుత్వంలో పోటీకి అందరు అర్హులే అయినా పోటీ నుంచి విరమించుకోడానికి ఇలాంటి కుట్రలు పన్నడం తగదన్నారు. నామినేషన్లు సమర్పించిన వెంటనే వారిని అరెస్ట్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి 75 లక్షల మంది మహిళల ఖాతాలకు రూ.10 వేలను జమ చేయడం జరిగిందన్నారు. అరెస్ట్ చేసిన నేతలను విడిచి పెట్టాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్కు జిల్లాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. సంబంధాల క్షీణతతో మానసిక ఒత్తిడిరాయచూరు రూరల్: నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలో కుటుంబాల్లో సంబంధాలు తెగడం వల్లే ఒత్తిడి అధికమై మానసిక ప్రశాంతతను కోల్పోతున్నట్లు జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి స్వాతిక్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఆరోగ్య శాఖ కృష్ణ భవనంలో జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మానసిక ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. దైనందిన కార్యక్రమాలు, పని ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో సతమతమైన మానవుడు మానసికంగా మారిపోతాడన్నారు. మానసిక ఆరోగ్య శాఖ అధికారి మనోహర్ పత్తార్, ఇంచార్జి జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారి గణేష్, శాకీర్, నందిత, సరోజ, ఈశ్వర్, అరవింద్ సంగావి, చంద్రశేఖరయ్యస్వామి, దాసప్పలున్నారు. అనుచిత వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలిరాయచూరు రూరల్: బసవ మఠాధీశులను అవమానించిన స్వామీజీపై చర్యలు చేపట్టాలని జాగతిక లింగాయత మహాసభ డిమాండ్ చేసింది. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నాగనగౌడ మాట్లాడారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్ అదృశ్య కాడసిద్దేశ్వర స్వామీజీ బసవ సంస్కృతి అభియాన్పై దుష్ప్రచారం చేసి బసవ పంథాను ఆచరించే మఠాధీశులను అగౌరవ పరిచే విధంగా సమావేశంలో ప్రసంగించారని, అలాంటి వారిని సరిహద్దు బహిష్కరణ చేయాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానంద్కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శాంతప్ప, ఆంజనేయులు, విరుపాక్షి, గిరిజా శంకర్, చుక్కి సూగప్ప, ఉదయ్ కుమార్లున్నారు. -
ఆటో, క్యాంటర్ ఢీ.. మహిళ మృతి
శ్రీనివాసపురం: రెండు వాహనాలు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తాలూకాలోని ముళబాగిలు రహదారిలో మీసగానహళ్లి గేట్ వద్ద శనివారం చోటు చేసుకుంది. శ్రీనివాసపురం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో ముళబాగిలు వైపు వెళుతున్న ఆటో మీసగానహళ్లి గేట్ వద్దకు చేరుకోగానే ముళబాగిలు నుంచి శ్రీనివాసపురం వైపు వస్తున్న క్యాంటర్ ఢీకొంది. ఆటోలో ఉన్న 8 మంది తీవ్రంగా గాయపడ్డారు .క్షతగాత్రులను కోలారులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా యశోదమ్మ (50) అనే మహిళ చికిత్స పొందుతూ మరణించింది. డీఎస్పీ మోనిషా, ఎస్ఐ జయరాం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
హులిగమ్మ దేవి ఆలయంలో హుండీ లెక్కింపు
హొసపేటె: హులిగిలో వెలసిన హులిగమ్మ ఆలయంలో శుక్రవారం అర్థరాత్రి వరకు జరిగిన హుండీ కానుకల లెక్కింపులో భక్తుల నుంచి దాదాపు కోటి రూపాయలకు పైగా సొమ్ము లభించింది. కళ్యాణ కర్ణాటకలో ప్రధాన శక్తిదేవత, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి రోజుల్లో హులిగమ్మ దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం పౌర్ణమి రోజున సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులతో నిండిపోతుంది. భక్తుల సంఖ్య పెరగడంతో కానుకల మొత్తం కూడా పెరిగింది. ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా, అర్థరాత్రి వరకు ఆలయం హుండీ లెక్కింపు జరిగింది. 43 రోజుల వ్యవధిలో మొత్తం రూ.95.02 లక్షల నగదు, భక్తుల నుంచి 160 గ్రాముల బంగారం, 7 కిలో గ్రాముల వెండిని భక్తులు విరాళంగా ఇచ్చారు. హుండీ లెక్కింపును పోలీసు భద్రత, సీసీ టీవీ కెమెరాల నిఘాలో నిర్వహించారు. గత 50 రోజుల వ్యవధిలో రూ.కోటి 45 వేల నగదు, 80 గ్రాముల బంగారం, 8 కిలో గ్రాముల వెండి లభించాయి. భక్తుల నుంచి కానుకల రూపంలో కోట్లాది రూపాయలు వసూలవుతున్నప్పటికీ హులిగి గ్రామంలో ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, హుండీ లెక్కింపు కంటే అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపకపోవడంపై భక్తుల్లో అసంతృప్తి నెలకొంది. దాదాపు రూ.కోటికి పైగా కానుకల సేకరణ -
పేదలకు భూములు పంచండి
రాయచూరు రూరల్: పేదలకు భూములు కేటాయించాలని కుర్డి గ్రామస్తులు డిమాండ్ చేశారు. శనివారం మాన్వి తాలూకా కుర్డిలో ఎమ్మెల్సీ వసంత్ కుమార్ను కలిసిన గ్రామ ప్రజలు మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధీనంలోని భూములను సాగు చేస్తున్న సన్నకారు రైతులపై అధికారులు కేసు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. అక్రమార్కులపై చర్యలేవీ? కోలారు : బాల్య వివాహాలు, పోక్సో, చిన్నారులను దత్తత ఇచ్చే ప్రక్రియలో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత రైతు సేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం జిల్లా ఎస్పీకి సంఘటన అధ్యక్షుడు హుణసనహళ్లి వెంకటేష్ వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పథకం కింద వస్తున్న నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. -
యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
బళ్లారిటౌన్: నేటి యువత ఉద్యోగాల కోసం వేచి చూడకుండా 10 మందికి ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలను స్థాపించే దిశగా నైపుణ్యం పెంపొందించుకోవాలని జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యశ్వంత్రాజ్ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా వాణిజ్య పరిశ్రమల శాఖ, ఇండస్ట్రియల్ తదితర శాఖల ఆధ్వర్యంలో జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభాంగణంలో ఏర్పాటు చేసిన లింక్డ్ పథకం జెడ్ఈడీలపై వర్క్షాప్లో పాల్గొని మాట్లాడారు. రైతులు, కళాశాల విద్యార్థులు తమ కార్యకలాపాలతో పాటు పరిశ్రమలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి చిన్నకారు పరిశ్రమల స్థాపనకు సబ్సిడీ, రుణ సౌకర్యాలు లభిస్తున్నాయన్నారు. వీటిని సద్వినియోగ పరుచుకోవాలన్నారు. జిల్లా పరిశ్రమల సంఘం అధ్యక్షుడు వీ.రామచంద్ర మాట్లాడుతూ మన దేశంలో చిన్న పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటితో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు ముందడుగు వేయాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జేడీ సోమశేఖర్, పారిశ్రామిక వేత్తలు జి.తిప్పయ్య, కాశియ, నింగణ్ణ, సురేష్బాబు, కేశవమూర్తి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లకు దీపావళి శోభ
సాక్షి బళ్లారి: ప్రతి ఏటా కార్తీక మాస అమావాస్య రోజున వచ్చే దీపావళి పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సోమవారం దీపావళి పండుగను పురస్కరించుకొని ముందుగానే ప్రమిదలు(మట్టి దీపాలు) కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. దీపావళి పండుగ అంటేనే టపాసులు పేల్చడంతో పాటు ఇంటింటా మట్టి దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా మట్టి దీపాలను నగరంలోని సంగం సర్కిల్, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో, బెంగళూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో మట్టి దీపాలను అమ్మకానికి ఉంచడంతో కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లో మట్టి దీపాలు వెలిగిస్తే మేలు దీపావళి రోజున మట్టి దీపాలు ఇంట్లో వెలిగిస్తే మంచి జరుగుతుందని నమ్మకం ఉండటంతో మట్టి ప్రమిదలను జోరుగా కొనుగోలు చేస్తున్నారు. అలాగే వాహనాలకు, ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తున్న నేపథ్యంలో పూలు, పండ్లు కొనుగోలు చేయడంతో బెంగళూరు రోడ్డు, చిన్న మార్కెట్, పెద్ద మార్కెట్ జనంతో కిటకిటలాడింది. దీపావళి అంటేనే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆనందంగా జరుపుకునే పండుగ కావడంతో సంప్రదాయ బద్ధంగా ఆచరించుకునేందుకు సర్వ సిద్ధం చేసుకుంటున్నారు. జోరుగా బాణసంచా కొనుగోళ్లు హొసపేటె: లక్షలాది మంది భారతీయులు దీపావళిని జరుపుకుంటున్నారు. దేశంలోని అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన హిందువుల దీపాల పండుగ దీపావళి సందర్భంగా శనివారం నగరవాసులు బళ్లారి రోడ్డులో కారిగనూరు వద్ద ఏర్పాటు చేసిన శ్రీనివాస క్రాకర్స్ దుకాణంలో తమకు కావాల్సిన టపాసులను జోరుగా కొనుగోలు చేశారు. ఈ దుకాణాల్లో టపాసులను కిలోల ప్రకారంగా అమ్ముతుండడంతో పండుగ ముందే నగర ప్రజలు టపాసులు కొనుగోలు చేసేందుకు క్యూ కట్టారు. మట్టి ప్రమిదలకు భలే డిమాండ్ జోరుగా పూజ సామగ్రి విక్రయాలు -
ట్రాక్టర్ బోల్తా
● 18 మందికి గాయాలు హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా ఆలూర్ క్రాస్ సమీపంలో జాతీయ రహదారి–50పై ట్రాక్టర్ అదపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని బోగలేరహట్టి నుంచి తాలూకాలోని హుడెం గ్రామంలో జరగనున్న నామకరణ కార్యక్రమానికి ట్రాక్టర్లో బయలుదేరారు. కూడ్లిగి తాలూకా ఆలూర్ క్రాస్ సమీపంలో జాతీయ రహదారి–50పైకి రాగానే ట్రాక్టర్ అదపుతప్పి బోల్తా పడింది. కనహోసహళ్లి పోలీస్స్టేషన్ పీఎస్ఐ సిద్రామ్ బిదరాణి, పోలీసులు, హైవే అసిస్టెంట్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని జగలూర్ తాలూకా ఆస్పత్రికి తరలించారు. తదుపరి చికిత్స కోసం దావణగెరె ఆస్పత్రిలో చేరారు. సంఘటన తర్వాత పారిపోయిన ట్రాక్టర్ డ్రైవర్ తిప్పేస్వామిని హోస్పేట్ సమీపంలో అరెస్టు చేశారు. కానహోసహళ్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీపావళికి సామగ్రి సిద్ధం హుబ్లీ: నగరంలో దీపావళి కోసం పూజా సామగ్రి విక్రయాలు జోరందుకున్నాయి. ధార్వాడ జిల్లా, అలాగే జంట నగరాలైన హుబ్లీ, ధార్వాడ, గదగ, హావేరి, బళ్లారి, హోస్పేట, సుమారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ పూలు, ఇతర సామగ్రి విక్రయిస్తున్నారు. బెంగళూరుకు చెందిన వ్యాపారులు వందల సంఖ్యలో ప్లాస్టిక్ పూలను వివిధ రకాల డిజైన్లలో రూపొందించారు. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో స్థానికులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. -
బొలెరోను ఢీకొన్న కారు
● ముగ్గురు మృతి సాక్షి బళ్లారి: హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా కాకోలా సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న బొలెరోను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. దావణగెరె జిల్లా మలెరాణి బెన్నూరు గ్రామానికి చెందిన చమన్ సాబ్, మహబూబ్ సాబ్, లింగమ్మ కారులో వివాహానికి వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా రాణిబెన్నూరు సమీపంలో బొలెరో వాహనాన్ని కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రాణిబెన్నూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రూ.39 లక్షలతో పైప్లైన్ పనులురాయచూరు రూరల్: నగరంలో రూ.39 లక్షలతో పైప్లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ వెల్లడించారు. శుక్రవారం గంగా నివాస్ వద్ద పైప్లైన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాకర్లు, శాఖ అధికారులను ఆదేశించారు. పాత కాలం నాటి పైపులు కావడంతో తరచుగా పగిలిపోతున్నాయన్నారు. ప్రజలకు నీటి సరఫరా చేయడం కష్ట సాధ్యం కావడంతో నూతన పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సభ్యులు జయన్న, అబ్దుల్ వాహిద్, అల్లా ఉద్దీన్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్య కార్యాలయం ప్రారంభం హుబ్లీ: ఉత్తర కన్నడ జిల్లా మానసిక ఆరోగ్య పరిశీలన మండలి కార్యాలయాన్ని క్రిమ్స్ బోధన ఆస్పత్రి మనోవైద్య విభాగం గది సంఖ్య 111లో అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా సెక్షన్ న్యాయమూర్తి కిరణ్ కిన్ని, దివ్య శ్రీ, సీఎం జిల్లా న్యాయసేవ ప్రాధికార డాక్టర్లు విజయరాజ మనోవైద్య విభాగం డాక్టర్ అక్షయ పాఠక అసోసియేషన్ ప్రొఫెసర్ బసవరాజ్, మనోసామాజిక నిపుణులు మనోవైద్య విభాగం కార్వార క్రిమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైభవంగా సుమీతీంద్ర తీర్థుల ఉత్సవాలు రాయచూరు రూరల్: మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వాముల మఠంలో సుమీతీంద్ర తీర్థుల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గురువారం రాత్రి 300వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా త్రిష్ట మనోత్సవాలు, రాఘవేంద్ర స్వామి మూల విరాట్కు ఊంజల సేవలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. మహ పంచామృతాభిషేకం, గజ, రజత, స్వర్ణ రథోత్సవాలు జరిపారు. -
నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మిస్తాం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా నరసింహగిరిలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం చిరతాగుండా గ్రామంలో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మా నాన్న గారి కలను నెరవేర్చబోతున్నానని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు శ్రమిస్తానని పేర్కొన్నారు. రేషన్ కార్డు, ఇళ్ల మంజూరు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చిరాతుగుండు గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు రత్నమ్మ బసన్న, ఈఓ నరసప్ప, తహసీల్దార్ వీకే.నేత్రావతి, డాక్టర్ ఎస్పీ ప్రదీప్, బీఈఓ మిలేష్ బేవూర్, శాన్ తమన్న, సీపీఐ ప్రహ్లాద్ ఎస్.చన్నగిరి పీఐ జి.సుబ్రమణ్య, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకటేష్, మాజీ ఈఓ బసన్న, తళ్వార్ శరణప్ప, ఫుడ్ సర్వీస్ డైరెక్టర్ జే.ఆంజనేయ, గూడెకోటె గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఎన్.కృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మురళీ కృష్ణ, ఓబన్న, సావిత్రిమ్మ, కమలమ్మ, జయమ్మ, సూరమ్మ, గౌడు బొమ్మయ్య, కేపీ పాలయ్య, ఏకై గొండి నాగరాజ్, ఎస్టీ ఎంసీ అధ్యక్షురాలు మల్లమ్మ పాల్గొన్నారు. -
తెగిపడిన చేతివేళ్లు
హుబ్లీ: హవేరి నగరంలో మంజునాథ్ అనే బాలుడు కొడవలితో జొన్న సొప్పదంటును చిన్న ముక్కలుగా కట్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఎడమ బొటన వేలు, పక్కన ఉన్న చూపుడు వేలు కొంత భాగం తెగిపడింది. వెంటనే తెగి పడిన వేళ్లను ప్లాస్టిక్ కవర్లో చుట్టుకుని తన తండ్రి, అన్నతో కలిసి కేఎంసీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి వెళ్లాడు. అయితే తెగిపడిన వేళ్లను అమర్చడానికి కుదరదని సర్జన్ డాక్టర్లు స్పష్టం చేశారు. అలా అమరిస్తే ఇన్ఫెక్షన్ అవుతుందని తెలిపారు. బాలుడికి సర్జన్ డాక్టర్లు చికిత్స చేసి డిశార్జ్ చేశారు. -
తుంగభద్రలో పూడికతీత పనులు చేపట్టాలి
సాక్షి బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందించే తుంగభద్ర జలాశయంలో పూడిక తీసేందుకు చర్యలు చేపట్టాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తమ్ గౌడ కోరారు. పలువురు రైతు సంఘం నాయకులతో కలసి ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో నగర మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్ రెడ్డితో కలిసి తుంగభద్ర డ్యామ్ ఆయకట్టు రైతుల సమస్యలను వివరించారు. 1953లో తుంగభద్ర డ్యామ్ నిర్మాణాలు పూర్తి చేసి బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, తెలంగాణ పరిధిలోని గద్వాల్, మహబూబ్ నగర్ జిల్లాలకు తాగు, సాగు నీటిని అందిస్తున్నారన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో వేలాది మంది రైతులకు సాగు నీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందుతోందని తెలిపారు. తుంగభద్ర డ్యామ్లో ప్రారంభంలో 133 టీఎంసీలు నీటి నిల్వ ఉండేదని.. ప్రస్తుతం పూడిక చేరడంతో 33 టీఎంసీలు నీరు తగ్గిపోయి 100 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల ఆయకట్టు పరిధిలోని రైతులకు దామాషా ప్రకారం నీటిని తగ్గించారని తెలిపారు. తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందిగా మారిందన్నారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర జలమండలి, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి తుంగభద్ర డ్యామ్లో పూడిక చేపట్టాలని కోరారు. అలాగే బళ్లారి నగరంలో చిరు వ్యాపారులకు సోలార్ వాహనాలు అందజేయాలని సూచించారు. అంజూర, దానిమ్మ రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సాధ్యసాధ్యాలను పరిశీలించి తుంగభద్ర డ్యాంలో పూడికతీతపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ కేపీసీసీ అధ్యక్షుడు అల్లం వీరభద్రప్ప, మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ జి.వెంకటరమణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేఎస్.దివాకర్ తదితరులు ప్రాంత సమస్యలను వివరించారు. జాతీయ బ్యాంకుల్లో రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్న నేపథ్యంలో కర్నాటక గ్రామీణ బ్యాంక్లో కూడా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా రైతు మోర్చా అధ్యక్షుడు ఐనాథ్ రెడ్డి విన్నవించారు. డిమాండ్ల జాబితా సమర్పణ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) అనుబంధ కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అధికారుల సంఘం (కేఏజీబీఓఓ), కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం (కేఏజీబీడబ్ల్యూఓ) తరఫున కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అఽధికారులు, ఉద్యోగుల డిమాండ్ల జాబితాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేశారు. కార్యక్రమంలో కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.సతీష్ కుమార్ పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విన్నవించిన రైతు సంఘం నేతలు వివిధ సమస్యలపై చర్చించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు -
నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవాలు
బళ్లారి టౌన్: నవంబర్ 1న జిల్లా పాలన విభాగం ఆధ్వర్యంలో కర్ణాటక రాజ్యోత్సవాలను వైభవంగా జరుపుకోవాలని ఏడీసీ మహమ్మద్ ఝుబేర అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో జరిగిన ముందస్తు సమావేశంలో మాట్లాడారు. నవంబర్ 1వ తేదీ ఉదయం 9 గంటలకు రాజ్కుమార్ రోడ్డులోని మున్సిపల్ కళాశాల మైదానంలో పౌర పాలన మంత్రి రహిమ్ఖాన్ ధ్వజారోహణ చేస్తారన్నారు. ఇందుకోసం వేదికల సిద్ధత, పూర్తి పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై ఆయా అధికారులతో చర్చించారు. తొలుత కన్నడ మాత భువనేశ్వరి దేవి చిత్రపటానికి పూజలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం వివిధ విభాగాల శద్ధ చిత్రాల వాహనాలను ఊరేగింపు చేపట్టాలని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని సన్మానించాలని పేర్కొన్నారు. నగరంలోని పరిశుభ్రత ప్రముఖ సర్కిల్లో దీపాలంకరణ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. సమావేశంలో కన్నడ సంస్కృతిక శాఖ ఏడీ బీ.నాగరాజు, వివిధ శాఖల అధికారులు చిదానందప్ప, షషుమొదీన్ పాల్గొన్నారు. -
నీటి కుంటలో పడి చిన్నారులు మృతి
రాయచూరు రూరల్: వ్యవసాయ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలైన ఘటన విజయపురలో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం విజయపుర తాలుకా మించినాళ తాండాకు చెందిన స్వప్న రాజు రాథోడ్ (10), శివం రాజు రాథోడ్ (8), కార్తిక్ విశ్వ రాథోడ్ (8) నీటి కుంట వద్దకు వెళ్లారు. ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తూ కుంటలో పడటంతో ముగ్గురూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రశాంత్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకట్టుకున్న విజ్ఞాన ప్రదర్శన
రాయచూరు రూరల్: విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంపై అవగాహన పెంచుకోవాలని కలబుర్గి డివిజన్ విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరం డివిజన్ స్థాయి విజ్ఞాన ప్రదర్శన పోటీలను ప్రారంభించారు. రామాయణం, మహభారత్లో దాగి ఉన్న అంశాలను క్షుణ్ణంగా అవలోకనం చేయాలన్నారు. కార్యక్రమంలో సిరాజ్, చంద్రశేఖర్ భండారి, గోవింద రెడ్డి, వీరేంద్ర పాటిల్, సంగమేష్, సుజాత, బసప్ప తదితరులు పాల్గొన్నారు. కాడసిద్దేశ్వర స్వామికి నో ఎంట్రీ హుబ్లీ: లింగాయత మఠాధిపతుల గురించి ఓ బహిరంగ కార్యక్రమంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కనేరి మఠం కాడుసిద్దేశ్వర స్వామికి విజయపుర జిల్లా ప్రవేశాన్ని నిర్బంధిస్తూ జిల్లాధికారి డాక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 16 నుంచి డిసెంబర్ 16 వరకు విజయపుర జిల్లాలో ప్రవేశించకుండా నిర్భంధం విధించారు. బసవ సంస్కృతి అభియాన్ను విమర్శించే దిశలో మాట్లాడిన కనేరి మఠం కాడుసిద్దేశ్వర స్వామి.. లింగాయత మఠాధీశుల ఒక్యూటను ముఖ్యమంత్రి కృపాపోషిత నాటక బృందం అనడమే కాకుండా, అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలపై విధాన సభ విపక్ష నేత అశోక్, ఎంపీ జగదీశ్ శెట్టర్, ప్రతాప్ సింహ తదితరుల ఫిర్యాదు మేరకు జిల్లాధికారి చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. -
తేలిపోయిన తెల్ల బంగారం
రాయచూరు పత్తి మార్కెట్ పత్తి బేళ్లతో మార్కెట్కు వచ్చిన వాహనాలు రాయచూరు రూరల్: పత్తి రైతులకు కాలం కలసి రావడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టాలపాలవుతున్నారు. తెల్ల బంగారానికి మార్కెట్లో ధరలు లభించడం లేదు. గత ఏడాది క్వింటాల్ రూ.8,500 నుంచి రూ.9,000 వరకూ పత్తి ధరలు పలికాయి. అయితే నేడు క్వింటా రూ.6,800 నుంచి రూ.7,100 వరకూ ధరలు పరిమితం అయ్యాయి. నూతన పత్తి మర్కెట్లో ధరలు ప్రకటించిన మిల్లు యజమానులు క్వింటాకు రూ.300 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలోని క్రిష్ణ, మక్తల్, నారాయణ పేట, మద్దూరు, ఊట్కూరు, గద్వాల దరూరు, నందిని, బలిగేర, అయిజ, మాదవరం, ఇతర ప్రాంతాల నుంచి అధికంగా పత్తి బేళ్లు రాయచూరు మార్కెట్కు వస్తున్నాయి. నిత్యం హైదరాబాద్–రాయచూరు రహదారిలో పత్తి లారీలు, ట్రాక్టర్లు, మినీ లారీలు, జీపులు, క్యాబ్లతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాలు కరువు ప్రాంతాలుగా మారాయి. రాయచూరు, యాదగిరి, కలబుర్గి జిల్లాలో కృష్ణా నది ఉన్నా నీరందడం లేదు. రైతులు భూముల్లో సాగు చేసిన పంటల దిగుడులు అంతంత మాత్రమే. జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. భారతీయ పత్తి మండలి అధికారులు ఎక్కడా పత్తి కోనుగోలు చేస్తున్నట్లు సమాచారం రైతులకు అందడం లేదు. రాజకీయ నేతలు బూటకపు ప్రకటనలతో ప్రచారం చేయడాన్ని రైతులు ఖండిస్తున్నారు. మార్కెట్లో పడిపోయిన పత్తి ధరలు క్వింటా రూ.6,800 నుంచి రూ.7,100 వరకూ పలుకుతున్న వైనం నష్టాలపాలవుతున్న అన్నదాతలు -
తాగుబోతుల అడ్డాగా పాఠశాల ఆవరణ
హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణ నడిబొడ్డున ఉన్న పాఠశాల మైదానం తాగుబోతులకు అడ్డాగా మారింది. సాయంత్రం కావడంతో మందుబాబులు పాఠశాల ఆవరణలోకి వచ్చేస్తున్నారు. మద్యం తాగి, సీసాలు, ప్లాస్టిక్ చెత్తను అక్కడే పారేస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ ప్రీ–డిగ్రీ కళాశాలల ప్రాంగణంలో కొంత మంది దుర్మార్గులు రోజూ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీని వలన ఉదయం వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలుగుతోంది. రాత్రి కాగానే గుంపులుగా.. పాఠశాల, ప్రభుత్వ ప్రీ–డిగ్రీ కళాశాల ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశిస్తున్నారు. గుంపులు గుంపులుగా మద్యం తాగి, ఖాళీ సీసాలు, మద్యం సీసాలు, గుట్కా స్లిప్లను విసిరేస్తున్నారు. మరి కొందరు సీసాలు పగలగొడుతున్నారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, పాఠశాలకు వచ్చే పిల్లలు నిరంతరం ఖాళీ సీసా పెంకులతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సార్లు పగలిన గాజు ముక్కలు పిల్లల పాదాలకు గుచ్చుకున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రాత్రి పూట పాఠశాలలో గస్తీ నిర్వహించాలని కోరుతున్నారు. లైటింగ్ వ్యవస్థ కరువు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో లైటింగ్ వ్యవస్థ లేదు. దీనిని దుండగులు దుర్వినియోగం చేస్తున్నారు. పాఠశాల ఆవరణ దేవాలయంతో సమానం అనే సాధారణ జ్ఞానం లేకుండా దుర్మార్గులు పాఠశాల ఆవరణలో ఎటువంటి నిర్వహణ లేకుండా మద్యం సేవిస్తున్నారు. పాఠశాల ఆవరణలో మరమ్మతులు చేయని వీధి దీపాలను (హైమాస్) మరమ్మతు చేయడానికి పట్టణ పంచాయతీ చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. విద్యా సంస్థల సమీపంలోని చిన్న దుకాణాల నుంచి విద్యార్థులకు గుట్కా లాంటి వస్తువులు పుష్కలంగా విక్రయిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. తాగిన మందు సీసాలను అక్కడే పారేస్తున్న వైనం ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు -
వ్యవసాయ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత
హొసపేటె: స్వయం సహాయక బృందాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కసాపుర గ్రామంలో నాబార్డ్, ఎంపీ నిధులతో నిర్మించిన వ్యవసాయ ప్రొసెసింగ్, వేరుశనగ, చింతపండు, ప్రొసెసింగ్ యూనిట్, రైతు శిక్షణ, జనరల్ ఫెసిలిటీ సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు. వివిధ బ్యాంక్ పథకాల కింద రుణాలు పొందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కిసాన్ క్రెడిట్ కార్డుల జారీతో రైతులు, మత్య్సకారులు, చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ లీడ్ బ్యాంక్ ద్వారా అన్ని బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి అర్హులైన వారికి కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేయాలని అధికారులు సూచించారు. విజయనగర జిల్లాలో 1,80,234 కేసీసీ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కేసీసీ కార్డులు అందని లబ్ధిదారులందరూ డిసెంబర్ చివరి నాటికి మిషన్ మోడ్లో నమోదు చేసుకోవాలన్నారు. కార్డులను అందుకోలేని వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమాన్ యోజన కింద సంవత్సరానికి రూ.6 వేలు అందజేస్తోందన్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని 7 జిల్లాల్లో ఎఫ్పీఓలు, స్వయం సహాయక బృందాల ద్వారా రైతు ఉత్పత్తుల ఆధారంగా ప్రొసెసింగ్ యూనిట్లను స్థాపించామన్నారు. కార్యక్రమంలో ఎంపీ తుకారాం, ఎమ్మెల్యే, డాక్టర్ శ్రీనివాస్, లతా మలికార్జున, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కమిషనర్ ఉమా మహదేవన్, నాబార్డ్ అధ్యక్షుడు కాగి, జిల్లాధికారి ఎస్ కవితా ఎస్ మన్నికేరి, జిల్లా పంచాయతీ సీఈఓ నోంగ్జామ్ మహమ్మద్ అలీ అక్రమ్షా, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనురుద్దన్ షావాన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ -
బెదిరింపు ఫోన్ కాల్ చేశారు
దొడ్డబళ్లాపురం: మంత్రి ప్రియాంక్ ఖర్గే అనుచరుడు తనకు బెదిరింపు ఫోన్ కాల్ చేశాడని బీజేపీ నేత, మాజీ మంత్రి, ఎంపీ రేణుకాచార్య ఆరోపించారు. శుక్రవారం ఆయన దావణగెరెలో మీడియాతో మాట్లాడారు. బెళగావి నుంచి ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి ప్రియాంక్ ఖర్గే గురించి మాట్లాడితే హుషార్..అంటూ బెదిరించాడన్నారు. ఆ మొబైల్ నంబర్ తనవద్ద ఉందని, అయితే తాను పోలీసులకు ఫిర్యాదు చేయనన్నారు. తేనెటీగల దాడిలో విద్యార్థులకు అస్వస్థతశివమొగ్గ : తేనెటీగల దాడి చేయడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈఘటన శివమొగ్గ జిళ్లాలోని శికారిపుర తాలూకాలోని బగనకట్టె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. శుక్రవారం ఉదయం విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టుపై నుంచి తేనెటీగలు దాడి చేశాయి. విద్యార్థులు వాటిబారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసినా వెంటాడి కుట్టాయి. ఘటనలో 13 మంది విద్యార్థులు, ఒక మహిళ అస్వస్థతకు గురవ్వగా ఆస్పత్రికి శికారిపురలోని తరలించారు. జీతం అందక వాటర్మెన్ ఆత్మహత్య మైసూరు : సంవత్సరాల తరబడి జీతం అందక ఆర్థిక ఇబ్బందులతో వాటర్మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన చామరాజ నగర తాలూకా హోంగనూరు గ్రామంలో జరిగింది. చిక్క సునాయక(65) అనే వ్యక్తి అరకొర జీతంతో వాటర్మెన్గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు సంతానం ఉన్నారు. 27 నెలలుగా వేతనం అందక కుటుంబ పోషణ కష్టమై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వేతనం మంజూరు చేయాలని గ్రామ పంచాయతీ అధ్యక్షురాలలు రూపా, పీడీఓ రామేగౌడను కోరగా తిట్టి పంపించారు. దీంతో మనో వేదనకు గురై శుక్రవారం సూసైడ్ నోట్ రాసి పంచాయతీ కార్యాలయం తలుపు వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. నటి సంగీతభట్కు అస్వస్థత ● చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిక యశవంతపుర: శాండిల్వుడ్ నటి సంగీతభట్ అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. హైస్టరోస్కోపిక్ పోలిఫెక్టమికి వైద్యులు శస్త్రచికిత్సలు చేశారు. గర్భాశయంలో 1.75 సెంటిమీటర్ల మేర పెరిగిన పాలిప్(గడ్డ)ను గుర్తించిన్నట్లు సంగీతభట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వ్యాధితో రక్తస్రావంతో పాటు ప్రమాదకరమైన నొప్పులు రావటంతో తూకం తగ్గుతుంది. గడ్డ ఉన్న విషయాన్ని గుర్తించిన తరువాత నెల రోజుల తరువాత ఆమెకు అపరేషన్ చేశారు. అనియమిత రక్తస్రావంతో బహిష్టు సమయంలో హార్మోన్లలో వ్యత్యాసం అవుతుంది. మహిళలు ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని సంగీతభట్ వివరించారు. -
ఉద్యోగాల పేరుతో రూ.కోటి వసూలు
● కొప్పళ నగరసభ మాజీ సభ్యురాలి అరెస్ట్ రాయచూరు రూరల్: నిరుద్యోగులకు ఉద్యోగాలిపిస్తామని చెప్పి రూ.కోటి వసూలు చేసినట్లు ఆరోపణలపై కొప్పళ నగరసభ మాజీ సభ్యురాలు విజయ హిరేమఠ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి12 మందితో రూ.కోటి వసూలు చేసింది. అయితే ఉద్యోగాలు రాకపోవడంతో తమ డబ్బు వెనక్కు ఇవ్వాలని బాధితులు కోరారు. దీంతో ఆమె బెదిరింపులకు పాల్పడింది. గత్యంతరం లేక బాధితులు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామదుర్గ పోలీసులు విచారణ చేపట్టి విజయ హిరేమఠ్ను అరెస్ట్ చేశారు. బహిరంగ స్థలాల్లో నమాజును నిషేధించాలి ● సీఎంకు ఎమ్మెల్యే బసనగౌడ పాటీల్ యత్నాళ్ లేఖ శివాజీనగర: బహిరంగ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో నమాజు చేసేందుకు అవకాశం కల్పించరాదని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటీల్ యత్నాళ్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు. ఆంగ్లంలో రాసిన లేఖను సామాజిక మాధ్యమంలో విడుదల చేశారు. ‘సర్వజన శాంతి తోట’ అనే ప్రభుత్వ ఆశయం అందరికీ అన్వయించాలి. బహిరంగ స్థలాల్లో, ప్రభుత్వ స్థలాల్లో నమోజు చేసేందుకు అవకాశం కల్పించరాదు. ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ సంఘ సంస్థల కార్యకలాపాలను నిషేధించినట్లుగానే నమాజు చేయటాన్ని కూడా నిషేధించాలి. అప్పుడే మీరు నిజమైన లౌకికవాది అనిపించుకుంటారు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై మళ్లీ కాంట్రాక్టర్ల వార్ ● నెలలోగా బకాయిలు విడుదల చేయకుంటే తీవ్ర పోరాటం శివాజీనగర: కాంట్రాక్టర్ల సంఘం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. కాంట్రాక్టర్ల పెండింగ్ సొమ్ము చెల్లించాలని, వివిధ డిమాండ్లను పరిష్కరించాలని ఒత్తిడి చేస్తూ పోరాటం చేపడతామని హెచ్చరించింది. శుక్రవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఆర్.మంజునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్ వసూలు అధికమైందన్నారు. 60 నుంచి 80 శాతం పర్సెంటేజీ కమీషన్ అని తాము చెప్పలేదు. అయితే కాంట్రాక్టర్లకు పెండింగ్ సొమ్ము చెల్లించకుండానే కమీషన్ డిమాండ్ చేస్తున్నారన్నారు. రూ.52 వేల కోట్ల పెండింగ్ సొమ్ము విడుదల చేయాల్సి ఉంది. కొన్ని శాఖలు సొమ్ము విడుదల చేశాయి. రూ.33 వేల కోట్లు పెండింగ్లో ఉంది. మరో నెల రోజుల పాటు వేచి చూస్తాం. అంతలోగా సొమ్ము విడుదల చేయకుంటే తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సిట్ తనిఖీలుదొడ్డబళ్లాపురం: కలబుర్గి జిల్లా ఆళంద నియోజకవర్గంలో ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించి సీఐడీ, సిట్ అధికారులు శుక్రవారం రెండుచోట్ల దాడులు చేశారు. గుబ్బి కాలనీలో ఉన్న ఆళంద నియోజకవర్గం బీజేపీ మాజీ ఎమ్మెల్యే సుభాష్ గుత్తేదార్ ఇల్లు, వివేకానంద నగర్లో ఉన్న సీఏ మల్లికార్జున్ అనే వ్యక్తి ఇంట్లో ఈ దాడులు జరిగాయి. 50 మంది పోలీసులు 80 మందికి పైగా అధికారులు, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. గత నాలుగు రోజులుగా పట్టణంలో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆళంద నియోజకవర్గంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 వేలకుపైగా ఓటర్ల పేర్లను తొలగించడానికి ప్రయత్నించినట్టు ఆళంద ఎమ్మెల్యే బీఆర్ పాటీల్ ఆరోపించారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. -
నేత్రపర్వం తీర్థోద్భవం
యశవంతపుర: కొడగు జిల్లా భాగమండల సమీపంలోని తలకావేరిలో శుక్రవారం కావేరి తీర్థోద్భవమైంది. కావేరి అమ్మవారు రోహిణిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి అశీర్వాదం తీసుకోవటానికి వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడ్డారు. కొడగుకు చెందిన మహిళలు సంప్రదాయ దుస్తులను ధరించి గీతాలకు నృత్యాలు చేస్తూ అమ్మవారికి హారతినిచ్చి స్వాగతం పలికారు. కొడగు ప్రజల సంప్రదాయ నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం 1.44 గంటలకు మకర లగ్నంలో కావేరి తీర్థరూపిణిం అమ్మవారు దర్శనం ఇచ్చారు. సూర్యుడు కన్యారాశి నుంచి తులా రాశికి మారుతున్న కారణంగా మకర లగ్నంలో కావేరి అమ్మ తీర్థరూపిణిగా ఉద్భవించారు. కావేరి ఉద్భవి స్థానం నుంచి నీరు ఉత్పత్తి కావటం ఇక్కడ విస్మయంగా మారింది. కొడగుతో పాటు వేల మంది భక్తులు భక్తితో జీవ నదికి పూజలు చేశారు. తలకావేరిలో ప్రతి ఏటా కావేరి తీర్థ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వటం పురాతన కాలం నుంచి ఆనవాయితీ. తమిళనాడు నుంచి భక్తులు వచ్చి ఇక్కడి తీర్థాన్ని తీసుకెళ్లారు. మైసూరు మహారాజు, ఎంపీ యదువీర్ కృష్ణరాజ దత్త ఒడెయర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
భారీ శబ్దపు టపాసులు నిషేధం
బనశంకరి: దీపావళి సందర్భంగా టపాసులు కాల్చి శబ్ద, వాయు కాలుష్యం ఏర్పడి పరిసరాలకు హాని కలుగుతుంది. అంతేగాక ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తుంది. ప్రాణులు, పక్షులకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను పరిసర స్నేహిగా, నిరాడంబరంగా, కాలుష్యరహితంగా, భక్తిపూర్వకంగా ఆచరించాలని ప్రభుత్వం మనవి చేసింది. టపాసుల విక్రయాలు, ప్రజలు హసిరు టపాసులు గుర్తించడానికి చర్యలు టపాసుల బాక్సులపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్ఎల్), నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోగో, రిజిస్ట్రేషన్ నెంబరు ముద్రించాలి. అధికారికంగా టపాసుల విక్రయాలకు సంబంధించిన శాఖ ప్రాధికార నుంచి అందించిన లైసెన్సులో నిర్ణయించిన తేదీ, స్థలాల్లో మాత్రమే తాత్కాలికంగా టపాసుల దుకాణాలు తెరవాలి. నిషేధించిన టపాసులు కనబడితే అలాంటి టపాసులను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీపావళి పండుగను అపార్టుమెంట్ మైదానంలో పరిసర స్నేహిగా ఆచరించాలని అపార్టుమెంట్ వాసులకు సూచించింది. చెట్లు, ప్రాణులు, పక్షులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త వహించాలి. 125 డెసిబల్స్ శబ్దం కంటే అధిక ప్రమాణపు శబ్దం కలిగిన టపాసులను నిషేధించారు. విద్యాసంస్థలు, ఆసుపత్రి, వృద్ధాశ్రమాలు లాంటి సున్నిత ప్రదేశాల వద్ద టపాసులు కాల్చడం నిషేధం. టపాసులు కాల్చిన అనంతరం ఉత్పత్తి అయ్యే పొడిచెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయరాదు. స్థానిక సంస్థలు నిర్ణయించిన చెత్త తరలించే వాహనాల్లో అందించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం హసిరు టపాసులు మినహా ఎలాంటి టపాసులను రాత్రి 8నుంచి 10 గంటల వరకు కాల్చాలి. 125 డెసిబల్స్ కంటే ఎక్కువ ప్రమాణంలో శబ్దం ఉండరాదు దీపావళిని పరిసర స్నేహిగా ఆచరించాలని సర్కారు మనవి -
డ్రగ్స్ దందా ఎలా జరుగుతుందంటే...
బనశంకరి: ఐటీ బీటీ సిలికాన్సిటీగా ఖ్యాతి గడించిన బెంగళూరు నగరంలో డ్రగ్స్ మాఫియా వేళ్లూనుకుంది. పలు అక్రమ మార్గాల్లో డ్రగ్స్పెడ్లర్లు పోలీసుల కళ్లుగప్పి విదేశీ తపాలా, కొరియర్ ద్వారా డ్రగ్స్ దిగుమతి చేసుకుని డ్రగ్స్ దందాకు పాల్పడుతూ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. పోలీసుల దాడుల్లో కోట్లాది రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టుబడటంతో బెంగళూరు నగరంలో డ్రగ్స్మాఫియా ఎంతమేర విస్తరించింది అనేందుకు నిదర్శనం. ఉడ్తా పంజాబ్ తరహాలో కర్ణాటకలో డ్రగ్స్ మాఫియా వేళ్లూనింది. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ మాఫియా ప్రస్తుతం శునకాలు, పిల్లులు, చేపలతో పాటు ఇతర పెంపుడు జంతువుల ఆహారం ముసుగులో విదేశాల నుంచి కోట్లాది రూపాయలు విలువ చేసే డ్రగ్స్ను బెంగళూరుకు దిగుమతి చేసుకుంటుండడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. థాయ్లాండ్, దక్షిణాఫ్రికా, నైజీరియాతో పాటు వివిధ దేశాల ద్వారా బెంగళూరు నగరానికి డ్రగ్స్ దిగుమతి అవుతుంది. నలుగురు ఉద్యోగుల అరెస్టు 2019లో డ్రగ్స్ పెడ్లర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపణలతో తపాలా శాఖకు చెందిన నలుగురు ఉద్యోగులను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు విదేశాల నుంచి తపాలా ద్వారా వచ్చే డ్రగ్స్ను పెడ్లర్లకు అందించేవారు. విదేశాల నుంచి బెంగళూరుకు పార్శిల్ ద్వారా గత కొన్నేళ్లుగా సరఫరా కొనసాగుతోంది. నెదర్లాండ్స్ నుంచి 2020లో బెంగళూరు చామరాజపేటెకు పార్శిల్ ద్వారా వచ్చిన ఎంఎండీఏ, బ్రౌన్షుగర్ లాంటి సైకోట్రోఫిక్ డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన కస్టమ్స్ అధికారులు డార్క్వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసిన బెంగళూరు యువకులను అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ విదేశీ తపాలా ద్వారా బెంగళూరుకు సరఫరా చేసుకుంటున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. చామరాజపేటె పార్శిల్స్లో 200 డ్రగ్స్ మాత్రలు, ఎండీఎంఏ, బ్రౌన్షుగర్ స్వాధీనం చేసుకున్నారు. 2024 అక్టోబరులో విదేశీ తపాలా కార్యాలయానికి రూ.21 కోట్ల విలువ చేసే 600కు పైగా డ్రగ్స్ పార్శిల్స్ సరఫరా కావడంతో సీసీబీ పోలీసులు దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అడ్రసులతో పార్శిల్స్ విదేశాల నుంచి పంపిన పార్శిల్స్కు నకిలీ అడ్రస్లు ఇచ్చారు. కొరియర్, తపాలా కార్యాలయాల్లో డ్రగ్స్ సరఫరా నియంత్రణకు నగర వ్యాప్తంగా దాడులు నిర్వహించి కొరియర్, తపాలా కార్యాలయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 2024 డిసెంబరులో న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరు కొరియర్ ఏజెన్సీ, తపాలా కార్యాలయాలపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. సంపంగి రామనగర కొరియర్ ఏజెన్సీలో సీసీబీ, డాగ్స్క్వాడ్ పార్శిల్స్ పరిశీలించి ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. 2025 జూలై నెలలో సీసీబీ పోలీసులు చామరాజపేటెలోని విదేశీ తపాలా కార్యాలయంపై దాడి చేసి కొకై న్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, గంజాయితో పాటు సుమారు రూ.6 లక్షల విలువ చేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని కొందరు విదేశీయులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ దందాలో విదేశీయులు అధికంగా ఉండటం విశేషం. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 35 మందిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేగాక కేరళ, తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన 1,013 మంది డ్రగ్స్పెడ్లర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గత మూడు నెలల్లో బెంగళూరు నగరంలో డ్రగ్స్ దందాకు అధిక కేసులు నమోదయ్యాయి. జూలైలో 158 కేసులు నమోదు కాగా 196 మంది భారతీయులతో కలిపి 5 మంది విదేశీయులను అరెస్ట్ చేశారు. ఆగస్టులో 132 కేసులు నమోదు కాగా వీరిలో 2024 మంది భారతీయులు, 5 మంది విదేశీయులు, సెప్టెంబరు నెలలో 160 కేసులు నమోదు చేసిన పోలీసులు 237 మంది భారతీయులు, 6 మంది విదేశీ డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. తపాలా, కొరియర్ ద్వారా విదేశాల నుంచి దిగుమతి డగ్స్ దందాలో విదేశీయుల భాగస్వామ్యం అధికం బిజినెస్, మెడికల్ వీసాతో బెంగళూరు నగరానికి వచ్చే విదేశీయులు అంతర్జాతీయ తపాలా కార్యాలయాల ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని విక్రయాలు డార్క్నెట్, డార్క్వెబ్ ద్వారా కొరియర్, ఆన్లైన్ సేల్ అద్దె ఇళ్ల యజమాని అడ్రస్ అందించి పోస్ట్ ద్వారా డ్రగ్స్ వస్తువుల రవాణా కొందరు స్థానిక డ్రగ్స్ పెడ్లర్లకు ఆధార్ అడ్రస్ అందించి వారి పేరుతో పార్శిల్స్ పెంపుడు జంతువులు ఆహారం బాక్సుల్లో డ్రగ్స్ పెట్టి సరఫరా హైడ్రోగంజాయి, అపీము, కొకై న్ అధికంగా విక్రయాలు ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డ్రగ్స్పెడ్లర్లపై పోలీసుల నిఘా సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్పెడ్లర్లపై ప్రత్యేక నిఘా సర్పేల్వెబ్, డార్క్నెట్, డార్క్వెబ్స్పై ప్రత్యేక పర్యవేక్షణ ఎఫ్ఆర్ఆర్ఓ, డీఆర్ఐ, ఎన్సీబీ సంస్థలతో కలిసి సమాచారం వినిమయం విదేశీ పౌరులు నివసించే అడ్రస్లు, ఉద్యోగ సమాచారం సేకరణ


