breaking news
Karnataka Latest News
-
పండ్లు, కూరగాయల మార్కెట్లను తరలించాలి
బళ్లారి అర్బన్: ఏపీఎంసీలోని పండ్లు, కాయగూరల మార్కెట్లను వేరే చోటకు తరలించాలని బళ్లారి ఏపీఎంసీ ట్రేడర్స్ అసోసియేషన్ జిల్లాధ్యక్షుడు మెణసిన ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. ఆయన ఏపీఎంసీ శాఖ మంత్రి శివానంద పాటిల్కు రాసిన వినతిపత్రాన్ని జిల్లాధికారి కార్యాలయంలో అధికారికి అందజేసి మాట్లాడారు. ఏపీఎంసీ మార్కెట్ ఉన్నది రైతుల వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికని అన్నారు. అయితే స్థలాభావం వల్ల రైతులు తమ ఉత్పత్తులను రోడ్డులో వేయడం వల్ల ఆటోలు, లారీలు వాటి మీదుగా వెళ్లడంతో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. పండ్లు, కూరగాయల మార్కెట్ పశువుల సంతలా మారాయని, తక్షణమే వేరే చోటకు తరలించాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వసంత్ కుమార్, ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు పాలన్న, అరవిందం, కన్ని శివమూర్తి, ప్రహ్లాద్, విజయ్కుమార్, మనోజ్కుమార్, నరసింహులు, వినోద్కుమార్, పదాధికారులు పాల్గొన్నారు. -
ఏకధాటి వర్షాలు.. అధ్వానంగా వీధులు
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో భారీ వర్షం కురిిసింది. సోమవారం మధ్యాహ్నం గోడ గడియారం, బస్టాండ్ రహదారిలో వర్షపు నీరు ఏరులై పారింది. ఎక్కడ చూసినా రోడ్లు నీటి గుంతలుగా మారాయి. అంబేడ్కర్ సర్కిల్, టిప్పు సర్కిల్, కసబా లింగసూగూరు, గాంధీ చౌక్, పోలీస్ స్టేషన్ చౌక్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చొరబడ్డాయి. వాటిని తొలగించుకోడానికి మహిళలు నానా తంటాలు పడ్డారు. బైరూన్కిల్లా, నీరుబావికుంట, మున్నూరు వాడి, గాంధీ చౌక్, మహావీర్ చౌక్, బంగికుంట, కూరగాయల మార్కెట్లోకి వర్షపు నీరు చొరబడ్డాయి. రాయచూరు నగరసభ పరిధిలోని ప్రధాన రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నగరసభ ఇంజినీర్లు ముందు చూపు లేకుండా ఇష్టానుసారంగా రోడ్లను నిర్మించడంతో ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలున్నాయి. పూడికతో నిండిన మురుగు కాలువలు మురుగు కాలువల్లో చెత్తను సక్రమంగా ఎత్తివేయక పోవడంతో కాలువలు నిండిపోయి రహదారుల పైకి మురుగు నీరు ప్రవహిస్తున్నాయి. కాలువ మీద నిర్మించిన వంతెనల వద్ద పూడిక నిండిపోతోంది. నగరసభ అధికారులు, ఇంజినీర్లు ఇప్పటికై నా స్పందించి కాలువలో పూడికతీతకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. చిన్నపాటి వానలకు గుంతలు పడిన రహదారులను పూడ్చడంలో నగరసభ మౌనం వహించింది. ఆదివారం సాయంత్రం బోళమానుదొడ్డి రహదారిలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అదుపు తప్పి కిందపడి గాయపడిన యువకుడిని అంబులెన్సు ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఇక యాదగిరి జిల్లాలోనూ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు నీటి గుంతలుగా మారిన వైనం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు -
పీఓపీ వినాయక విగ్రహాలు స్వాధీనం
హుబ్లీ: ధార్వాడ జిల్లా కుందగోళ పట్టణంలో తహసీల్దార్ రాజు నేతృత్వంలో ఆకస్మిక దాడి చేసిన టాస్క్ఫోర్స్ బృందం 10 పీఓపీ వినాయక విగ్రహాలను స్వాధీనం చేసుకుంది. ఆ విగ్రహాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విక్రయ కేంద్రాలపై దాడి చేశారు. ఈ మేరకు కిల్లా వీధిలో విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న విగ్రహాలను పట్టణ పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచామన్నారు. విగ్రహాలను పరీక్షించి నివేదిక వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దాడిలో పట్టణ పంచాయతీ ముఖ్యాధికారి సీవీ కులకర్ణి, ఎస్ఐ ఇమ్రాన్ పఠాన్, ఆరోగ్య అధికారిణి జానకి బళ్లారి తదితరులు పాల్గొన్నారు. 26న వీరభద్రేశ్వర జయంతి ఉత్సవాలు రాయచూరు రూరల్: దేశ వ్యాప్తంగా ఈ నెల 26న వీరభద్రేశ్వర జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జాతీయ వీరశైవ సంఘం వేదిక సలహా సభ్యుడు జీజీ మనోహర్ తెలిపారు. ఆయన ఈమేరకు సోమవారం నగరంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో సెప్టెంబర్ 15న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వీరభద్రేశ్వర అవార్డును అందజేస్తారన్నారు. 2021 నుంచి వీరభద్రేశ్వర అవార్డును ప్రకటించామన్నారు. 2021లో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు, 2022లో బెళగావి ప్రభాకర్ కోరేకు, 2023లో ఇస్రో చైర్మన్ మనోహర్కు, 2024లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సోమన్నకు, 2025లో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడకు ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు. చదువుతో పాటు క్రీడలూ అవసరమే బళ్లారిఅర్బన్: చదువుతో పాటు ఆటపాటల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని ఎస్ఎల్ఎన్ సేవా సంస్థ అధ్యక్షుడు, శ్రీధరగడ్డ జెడ్పీ ప్రముఖులు వై.షణ్ముఖ తెలిపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు యూనిఫాంలను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. గాంధీనగర డివిజన్ స్థాయి ఈ క్రీడా పోటీల్లో సంస్థ తరపున ఉచితంగా విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశామన్నారు. ఆటల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా దృఢంగా తయారవుతారని, విజేతలుగా నిలిచి తమ ఊరికి పేరు తేవాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. ఆ పాఠశాల ప్రముఖులు ఎన్.వీరేష్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయిని సరస్వతి, మాలగడ్డ బాబు, పీఈటీ రాఘవేంద్ర, ఉమామహేశ్వరి శెట్టితో పాటు క్రీడాకారులు, విద్యార్థులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. గణేష్ మంటపాలకు స్థల పరిశీలన రాయచూరు రూరల్: నగరంలో ప్రశాంతంగా గణేష్ పండుగ ఆచరణ దిశగా నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో మంటపాలకు స్థల పరిశీలన చేశారు. సోమవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరించి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈనెల 27న వినాయకులను ప్రతిష్టాపించాలని 31న నిమజ్జనం చేయాలన్నారు. డీజేల ఏర్పాటును పూర్తిగా నిషేధించామన్నారు. రాత్రి 10 గంటల తరువాత డీజేలను వినియోగిస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు. అదనపు ఎస్పీ కుమార స్వామి, డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ కాంబ్లేలున్నారు. స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి రాయచూరు రూరల్ : సమాజంలో బతుకు తెరువుకు, జీవనోపాధికి, స్వయం ఉపాధిపై విద్యార్థులు దృష్టి సారించాలని హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థల ఉపాధ్యక్షుడు రాజా భీమళ్లి పిలుపునిచ్చారు. సోమవారం కలబుర్గిలోని హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థ, వీరమ్మ గంగసిరి మహిళా జూనియర్ కళాశాలలో అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంస్కారాలతో పాటు జీవిత విలువలను అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి ఉదయ్ కుమార్, ఎన్ఎస్ఎస్ అధికారి మహేష్, ప్రిన్సిపాల్ రాజేంద్ర కొండా, వీణా, మోహన్రాజ్, సుష్మా, ఉమా, రేణుకలున్నారు. -
హనుమ భక్తుల మహాబైక్ ర్యాలీ
సాక్షి,బళ్లారి: నగరంలో హనుమ మాలధారులు చేపట్టిన బైక్ ర్యాలీ నగర వాసులను ఆకట్టుకుంది. సోమవారం సాయంత్రం మరూరు ఆభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న మాదిరిగానే ఈ ఏడాది కూడా హనుమ మాలధారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా హనుమ మాల ధరించడంతో ఆయన ఇచ్చిన పిలుపుతో వేలాది మంది హనుమ మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై వీరాంజనేయ, జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ తమ భక్తిని చాటారు. ముందుగా నగరంలో కూల్కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ లోక్సభ సభ్యుడు సన్న పక్కీరప్ప, బెస్ట్ స్కూల్ అధినేత కోనంకి రామప్ప, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే.ఎస్.దివాకర్, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్, కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, కే.ఎస్.అశోక్ తదితరులు పాల్గొని వేదికపై ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి బైక్ ర్యాలీని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హనుమ భక్తులు బైక్పై ఆంజనేయ స్వామి ఉన్న కాషాయ జెండాను కట్టుకుని, మెడలో వేసుకుని నగరంలో నినాదాలు చేస్తూ హోరెత్తించారు. గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ బైక్ ర్యాలీ ఈసారి విజయవంతం కాగా ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోందని, అదంతా ఆంజనేయ స్వామి మహిమ అని కొనియాడారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హనుమ మాలధారులు -
టీబీ డ్యాం క్రస్ట్గేట్ల నిర్వహణలో విఫలం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం టీబీ డ్యాం క్రస్ట్గేట్ల నిర్వహణలో విఫలమైందని, జిల్లా ఇన్చార్జి, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగిని మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ జిల్లాధ్యక్షుడు వీరనగౌడ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీబీ డ్యాం పరిధిలోకి వచ్చే రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాల్లోని కాలువలకు రెండవ పంటకు నీరు ఇవ్వడం కుదరదని మంత్రి పేర్కొనడాన్ని ఖండించారు. బెంగళూరులో జరిగిన సమావేశంలో మంత్రి ప్రస్తావించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. కేంద్ర జలవనరుల శాఖ అధికారులు క్రస్ట్గేట్లను మరమ్మతు చేయాలని ఆదేశించినా సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. క్రస్ట్గేట్లు పని చేయని వైనంపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రశ్నించినా జవాబివ్వక పోవడం సరికాదన్నారు. రైతులకు ఎకరాకు రూ.లక్ష పరిహారం అందించాలని కోరారు. సిద్దనగౌడ, శంకరరెడ్డి, వీపీ రెడ్డిలున్నారు. -
తుంగభద్ర వరద ఉగ్రరూపం
హొసపేటె: తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాచ్చింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల రైతుల జీవనాడి అయిన తుంగభద్ర డ్యాం నిండుకుండలా తొణికిసలాడుతోంది. సోమవారం డ్యాం వద్ద ఎగువ నుంచి జలాశయంలోకి 75 వేలకు పైగా క్యూసెక్కుల వరద నమోదైంది. అధికారుల లెక్కల ప్రకారం సాయంత్రానికి జలాశయంలోకి మరింత వరద పెరిగే అవకాశం ఉంది. డ్యాం వద్ద 26 క్రస్ట్ గేట్లలో 9 గేట్లను 2 అడుగులు 3 గేట్లను 3 అడుగులు, 12 గేట్లను 5 అడుగులు, ఒక గేటు 4 అడుగులు, మరో ఒక గేటు 3.5 అడుగుల మేర పైకెత్తి నదికి నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1624.96 అడుగులు, నీటినిల్వ 76.35 టీఎంసీలు ఉందని మండలి అఽధికారులు తెలిపారు. కంప్లి రోడ్డు వంతెనపై నిలిచిన రాకపోకలు తుంగభద్ర డ్యాం నుంచి నదికి లక్ష క్యూసెక్కుల మేర వరద నీటిని సోమవారం విడుదల చేయడంతో చిక్కజంతకల్ సమీపంలో ఉన్న కంప్లి రోడ్డు వంతెన పైకి నీటి ప్రవాహం చేరింది. దీంతో నదిలో తీవ్ర వరద పరిస్థితి తలెత్తింది. ఈ రహదారి గుండా వాహన రాకపోకలను నిషేధిస్తూ ప్రజా రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. హంపీలో నీట మునిగిన స్మారకాలు తుంగభద్ర జలాశయం నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల వరకు నీరు విడుదల చేయడంతో హంపీ వద్ద నది తీరంలో ఉన్న స్మారకాలు నీట మునిగాయి. తుంగభద్ర పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హంపీ సమీపంలోని పురంధర మంటపం ఇప్పటికే పూర్తిగా మునిగింది. అనేక మంటపాల్లోకి సగం వరకు నీరు చేరింది. మరో వైపు కోదండరామ ఆలయానికి వెళ్లే దారి పూర్తిగా జలమయంగా మారింది. పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర డ్యాం నీరు నిండుకుండలా తొణికిసలాడుతున్న జలాశయం డ్యాంకు ఎగువ నుంచి 75 వేలకు పైగా క్యూసెక్కుల రాక డ్యాం వద్ద 26 క్లస్ట్ గేట్ల నుంచి దిగువకు నీరు విడుదల -
ఈ రోడ్ల పనులకు మోక్షమెన్నడో?
బళ్లారిటౌన్: నగర శివార్లలోని వాజ్పేయి లేఅవుట్ వెనుక భాగంలోని దొడ్డబసవేశ్వర లే అవుట్ నుంచి స్టాండర్డ్ ఇన్ఫ్రా లేఅవుట్ వరకు రోడ్లన్ని పూర్తిగా ధ్వంసమై, అడుగు తీసి అడుగు వేయలేని విధంగా మారాయి. ఈ ప్రాంతంలో వందలాది ఇళ్ల నిర్మాణం జరిగింది. గత ఐదేళ్లుగా ప్రారంభం నుంచి స్థానికులే గ్రావెల్ వేసుకుని రోడ్డు నిర్మాణం చేసుకున్నారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఈ రోడ్లన్ని బురదమయంగా మారాయి. మూడేళ్ల క్రితం రూరల్ ఎమ్మెల్యే నాగేంద్రను కలిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆయన్ను కోరారు. 2022 నుంచి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. రోడ్ల అభివృద్ధికి రూ.3.5 కోట్లు నిధులు కావాలని నివేదకను కూడా పంపారు. గత ఏడాది ఆగస్టులో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి. అయితే ప్రస్తుతం వశిష్ట కళాశాల వరకు కేవలం ఒక సీసీ రోడ్డు నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభించారు. మిగిలిన రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం చేయాల్సి ఉండగా, ఈ రోడ్లను మూడేళ్లలో దశల వారీగా నిర్మించే యోచనలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న చిత్తడి నేల పరిస్థితి చూసి అయినా ఈ పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
గృహిణి అనుమానాస్పద మృతి
హుబ్లీ: కాళ్లపారాణి ఆరక ముందే ఓ గృహిణి గోకుల్ రోడ్డు పోలీసు స్టేషన్ పరిధిలోని నందగోకుల లేఅవుట్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతురాలు జయశ్రీ బడిగేర్(31) ఆమె ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈమె స్వగ్రామంలో గదగ్ జిల్లా హొళెఇటిగి కాగా హుబ్లీ నివాసి శివానందతో గత మే 21న వివాహం జరిగింది. ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైందని, ఆమె ఆత్మహత్య చేసుకొలేదని, హత్య చేసి ఇలా నాటకం ఆడుతున్నారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా భర్త శివానందను ఈ కేసులో అరెస్ట్ చేశారు. పెళ్లికి ముందు శివానంద తన ప్రేమ వ్యవహారాన్ని దాచి పెట్టారని, ఇదే విషయమై తరచు ఘర్షణలు, వేధింపులకు పాల్పడే వారని మృతురాలి బంధువులు ఆరోపించారు. జయశ్రీ మృతదేహాన్ని కిమ్స్ మార్చురీకి తరలించారు. ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరైన వైనం చూపరులను కలిచి వేసింది. దుష్ప్రచారకులపై చర్యలు తీసుకోండి హుబ్లీ: ధర్మస్థలపై భారీ స్థాయిలో కుట్ర జరుగుతోందని, దుష్ప్రచారం చేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వరూరు నవగ్రహ తీర్థ క్షేత్రం గుణధర నంది మహారాజ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం మంచిదేనని, దీని వల్ల సత్యాలు బయటకు వస్తాయి. అయితే ఈ విషయంతో పాటు కుట్రలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి ఉగ్రవాది అయినా 300 హత్యలు చేయడం అసాధ్యం అని, ఈ నేపథ్యంలో పలువురిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసిన వారి వ్యతిరేకంగా కూడా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. దుష్ప్రచారమే ధ్యేయంగా పని చేస్తున్న కొందరు యూట్యూబర్లపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా వాటి నియంత్రణకు తగిన నియమావళి రూపొందించాలని ఆయన సూచించారు. పైకప్పు పెచ్చులూడిన బస్టాండ్ రాయచూరు రూరల్: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. గత కొన్ని రోజుల నుంచి వానలు కురుస్తుండడంతో సోమవారం అకస్మాత్తుగా పెచ్చులూడి పడ్డాయి. త్రుటిలో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయట పడ్డారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు బస్సుల కోసం వేచి ఉన్న సమయంలో పెచ్చులూడడంతో పిల్లలతో పాటు పెద్దలు భయభ్రాంతులకు గురయ్యారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి రాయచూరు రూరల్: సమాజంలో మార్పులకు అనుగుణంగా పురాతన కాలం నాటి సంస్కృతిని, ఆచారాలను అలవర్చుకొనేలా రాసిన పుస్తకాలకు, సీనియర్ సాహితీవేత్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆది కవి వాల్మీకి మహర్షి విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద పేర్కొన్నారు. కన్నడ భవనంలో జిల్లా, తాలుకా కన్నడ సాహిత్య పరిషత్, కళా సంకుల సంస్థల ఆధ్వర్యంలో రేఖా బడిగేర్ రాసిన ఉద్దో యల్లమ్మ పుస్తకం విడుదల చేసి మాట్లాడారు. సాహితీవేత్త రాసిన పుస్తకాలు ప్రజల మన్ననలను పొందాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రంగణ్ణ పాటిల్, తాలూకా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు వెంకటేష్ బేవినబెంచి, రావుత్రావ్, వీరహనుమాన్లున్నారు. -
పుష్పరాశులకు ఇక సెలవు
● లాల్బాగ్ ఫ్లవర్ షో సమాప్తం బనశంకరి: స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా బెంగళూరు లాల్బాగ్లో గత 11 రోజులుగా నిర్వహిస్తున్న వీరనారి రాణి కిత్తూరు చెన్నమ్మ, క్రాంతివీర సంగోళ్లి రాయణ్ణ థీమ్ ఫల పుష్ప ప్రదర్శన సోమవారం సాయంత్రంతో సమాప్తమైంది. ఆదివారం నాటికి 5.80 లక్షల మందికి పైగా వీక్షించారు. టికెట్ల ద్వారా రూ.2.50 కోట్లపైగా వసూలైంది. గత మూడు రోజులుగా సెలవులు రావడంతో లాల్బాగ్ కిటకిటలాడింది. అప్పుడప్పుడు వర్షాల వల్ల కొద్దిగా సందడి తగ్గింది. పుష్ప సౌందర్యాలను ఫోటోలు తీస్తూ సందడి చేశారు. మళ్లీ పుష్ప ప్రదర్శన గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జనవరిలో జరుగుతుంది. -
శనీశ్వరస్వామి వైభవం
తుమకూరు: శ్రావణ మాసంలో భాగంగా నగరంలోని శనీశ్వర ఆలయంలో విశేష పూజలు జరిగాయి. వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. సోమవారం పూల పల్లకీలో స్వామివారి ఊరేగింపు సంభ్రమం సాగింది. వీరభద్ర కునిత సహా జానపద కళాకారుల ప్రదర్శనలు రంజింపజేశాయి. ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఉత్సవం నగరంలోని ప్రధాన రహదారుల గుండా కదిలింది. ఆలయ ప్రధాన పూజారి రాజన్న, వందలాది భక్తులు పాల్గొన్నారు. ఫ్లై ఓవర్ ర్యాంపు ప్రారంభం శివాజీనగర: బెంగళూరులో ట్రాఫిక్పరంగా ఎంతో ముఖ్యమైన హెబ్బాళ జంక్షన్లో కే.ఆర్.పురం వైపు నుంచి మేఖ్రీ సర్కిల్ వైపు సంచరించేందుకు నిర్మించిన ఫ్లై ఓవర్ ర్యాంప్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ర్యాంపుపై కాలేజీ రోజుల్లోని పాత యజ్డీ బైక్ మీద డీసీఎం డీ.కే.శివకుమార్ రైడ్ చేశారు. ప్రారంభోత్సవం తరువాత ప్రజల వాహనాలను అనుమతించారు. ప్రపంచంలో గుర్తింపు పొందిన బెంగళూరు నగరానికి కొత్త రూపాన్ని ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని డీకేశి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు నటి రమ్యా పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు దొడ్డబళ్లాపురం: మహిళపై అత్యాచారం చేశాడని మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ ఎమ్మెల్యే భగవాన్ శర్మపై బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ (40) ఫిర్యాదు చేసింది. వివాహం చేసుకుంటానని నమ్మించి ఎయిర్పోర్టు హోటల్కి తీసికెళ్లి అఘాయిత్యం చేశాడు, చిత్రదుర్గలో కూడా లైంగిక దాడి చేశాడు, పెళ్లి మాత్రం చేసుకోలేదు, వీడియోలు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు పేర్కొంది. పోలీసులు కేసు విచారణ చేపట్టారు. -
టీచర్ని బదిలీ చేయరాదని ధర్నా
శ్రీనివాసపురం: తాలూకాలోని శెట్టిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు వరలక్ష్మిని వేరే ప్రాంతానికి బదిలీ చేసిన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు సోమవారం బీఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి రామచంద్రప్ప మాట్లాడుతూ పాఠశాలలో వరలక్ష్మి టీచర్ ఎన్నో యేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కేవలం 15 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను వరలక్ష్మి టీచర్ వచ్చిన తరువాత 150 మంది అయ్యారు. ఉత్తమ టీచర్గా పేరు గడించారు. ఇలాంటి టీచర్ను అదనపు టీచర్ జాబితాలో చూపించి బదిలీ చేయడం ఎంతవరకు సమంజసమని వాపోయారు. కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు పంపి వరలక్ష్మి టీచర్ను ఇక్కడే కొనసాగించాలన్నారు. ధర్నాలో ఎస్డీఎంసీ అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ, గ్రామస్తులు చైత్ర, నవీన్కుమార్ తదితరులు ఉన్నారు. -
సంద్రంలో అలజడి.. ఒడ్డుకు పిల్ల డాల్ఫిన్లు
యశవంతపుర: అరేబియా సముద్రం వెంబడి భారీగా వానలు పడుతున్నాయి. సముద్రంలో గాలులు వీస్తూ పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, ఆ అలజడికి డాల్ఫిన్ పిల్లలు ఒడ్డుకు వస్తున్నాయి. కార్వార సమీపంలో సోమవారం జంగిల్ లాడ్జెస్ రిసార్ట్ వద్ద ఒడ్డుకు రాగా స్థానికులు వాటిని మళ్లీ సముద్రంలో వదిలారు. తుఫాన్ కారణంగా తల్లీ పిల్లలు వేరైనట్లు తెలుస్తోంది. రిసార్టులో ఉన్న పర్యాటకులు ఆ జలచరాలను ఆసక్తిగా వీక్షించి ఫోటోలు వీడియోలు తీశారు. రేబీస్కు చిన్నారి బలి దొడ్డబళ్లాపురం: నాలుగు నెలల క్రితం వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక రేబీస్కు గురై ప్రాణాలు వదిలింది. ఈ విషాద సంఘటన దావణగెరెలోని శాస్త్రి కాలనీలో చోటుచేసుకుంది. ఖదీరా బాను (4) అనే బాలిక నాలుగు నెలల క్రితం ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా టీకాలు వేశారు. అయితే గాయాలు తీవ్రంగా ఉండడంతో క్రమంగా బాలికకు రేబీస్ వ్యాధి సోకింది. పరిస్థితి విషమించడంతో బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న చిన్నారి ఆదివారం రాత్రి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కిరాతక భర్త చేతిలో భార్య హత్య మైసూరు: పొలాన్ని అమ్మి డబ్బులు తీసుకోవాలని భర్త, పొలం అమ్మరాదని భార్య పట్టుదల. చివరకు భార్య హత్యకు దారితీసింది. ఈ సంఘటన మైసూరు సిటీలోని విజయనగర ఠాణా పరిధిలోని మహాదేశ్వర లేఔట్లో జరిగింది. పాపన్న (56) చేతిలో గాయత్రి (45) హత్యకు గురైంది. వివరాలు.. పాపన్న గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు, నష్టాలు వచ్చాయని అప్పులు చేసి మద్యానికి బానిసయ్యాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు అయ్యాయి. కుమార్తెకు పెళ్లి చేయాల్సి ఉంది. కొడుకులు కష్టపడి తండ్రి అప్పులు తీర్చేపనిలో ఉన్నారు. అయినా నిత్యం డబ్బులు కావాలని భార్యా పిల్లలను సతాయించసాగాడు. సాహుకారహుండిలో ఉన్న పొలాన్ని అమ్మేద్దామని చెప్పడంతో భార్య వద్దని వారిస్తోంది. ఆదివారం కూడా గొడవ జరిగింది. ఆగ్రహం పట్టలేని పాపన్న కొడవలిలో భార్యను నరికి చంపాడు. ఇంటికి తాళం వేసి రక్తపు మరకలతో పారిపోతూ ఉండగా కొడుకు చూశాడు. ఇంటికి వెళ్లి చూడగా తల్లి మృతదేహం కనిపించింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలించి నిందితున్ని అరెస్టు చేశారు. -
మల్నాడు జిల్లాల్లో వాన హోరు
మండ్య జిల్లాలో కేఆర్ఎస్ డ్యాం నుంచి కావేరి పరుగుచిక్కమగళూరులో జల్లులు శివమొగ్గ: మల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీని కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. శివమొగ్గ జిల్లాలోని ప్రధాన జలాశయాలైన తుంగ, భద్ర, లింగనమక్కిలకు ఇన్ఫ్లో గణనీయంగా పెరిగింది. ఆగస్ట్ 18 ఉదయం నాటికి గజనూరులోని తుంగా రిజర్వాయర్ ఇన్ఫ్లో 73,415 క్యూసెక్కులు ఉంటే, 76,656 కూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతో శివమొగ్గ నగరం గుండా తుంగా నది నిండుగా ప్రవహిస్తోంది. నీటి విడుదల మరింత పెరిగితే నగరంలోని నదికి అటు ఇటు ఉన్న ప్రాంతాలు మునిగిపోతాయనే భయం నెలకొంది. ప్రమాదకరంగా భద్ర మరో వైపు భద్ర డ్యాం ఇన్ప్లో 43,430 క్యూసెక్కులకు పెరిగింది. 39,245 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రావతి వద్ద నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కొత్త వంతెన మునిగిపోవడంతో వాహనాలను నిషేధించారు. కలువగుండి ప్రాంతంలో కొన్ని ఇళ్లలోకి వాన నీరు ప్రవేశించింది. వారికి కమ్యూనిటీ హాల్లో ఆశ్రయం కల్పించారు. లింగనమక్కి ఆనకట్ట నిండుగా ఉంది. చిక్కమగళూరులో మూడురోజులుగా జోరువాన కురుస్తూనే ఉంది. విద్యార్థులు, చిరువ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. మండ్య జిల్లాలో కృష్ణరాజసాగర జలాశయం నిండిపోవడంతో భారీ మొత్తంలో నీటిని వదిలేస్తున్నారు. శివమొగ్గలో కుండపోత శివమొగ్గ జిల్లాలో హొసానగర తాలూకాలోని పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురిశాయి. మణిలో 238 మిల్లీమీటర్లు, యాదూర్ 200 మిల్లీమీటర్లు, హులికల్ 220 మిల్లీమీటర్లు, మస్తికట్టె 204, చక్ర 150, సావెహక్లు ప్రాంతంలో 179 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తుంగ, భద్ర నదులు ఉధృతం -
తిరుమల యాత్రలో ఘోర విషాదం
తనకల్లు: ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల వెంకన్నస్వామిని దర్శించుకుని ఇళ్లకు సంతోషంగా తిరుగుముఖం పట్టినవారి మీద మృత్యువు పంజా విసిరింది. ఈ ఘోరంలో నలుగురు చనిపోగా కొందరు గాయపడడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం తాండవిస్తోంది. సోమవారం ఉదయం ఏపీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు, రెండు టూరిస్ట్ మినీబస్సులు ఢీకొన్నాయి. తనకల్లు మండలం మండ్లిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో టూరిస్ట్ బస్సుల్లోని అనసూయమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ మణికంఠ (41), నాగేంద్రప్ప (45), జాహ్నవి (4) చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా కర్ణాటకవాసులే. ఎలా జరిగిందంటే.. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన భక్తులు రెండు టూరిస్ట్ మినీబస్సుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం బళ్లారికి తిరుగు పయనమయ్యారు. మార్గంమధ్యలో మండ్లిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న మలుపు వద్ద కదిరి నుంచి మదనపల్లి వెళుతున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టూరిస్ట్ బస్సు ఢీకొంది. ఆ వెనుకనే వస్తున్న మరో టూరిస్ట్ బస్సు ముందున్న టూరిస్ట్ బస్సును ఢీకొట్టింది. ఒకదానికొకటి బలంగా ఢీ కొనడంతో ముందున్న టూరిస్ట్ బస్సు నుజ్జునుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న అనసూయమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నారి జాహ్నవి, డ్రైవర్ మణికంఠ, నాగార్జున, కుమార్స్వామి, భార్గవి, రిత్విక, నాగేంద్రప్ప, గోవిందమ్మ, గోవిందప్ప, రాకేష్, చిన్నమ్మ, అంజినమ్మ తీవ్రంగా గాయపడ్డారు. భీతావహం వెంటనే స్థానికులు బాధితుల్ని తమ అంబులెన్స్లో తనకల్లు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తరువాత జాహ్నవి, నాగేంద్రప్ప, మణికంఠ, నాగార్జున, రిత్విక, భార్గవిలను కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో డ్రైవర్ మణికంఠ, నాగేంద్రప్ప, జాహ్నవి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వీరు చనిపోయారు. తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి మార్మోగింది. రెండు టూరిస్టు మినీ బస్సులు, ఆర్టీసీ బస్సు ఢీ ఏపీలో కదిరి వద్ద దుర్ఘటన నలుగురు మృతి, 9 మందికి గాయాలు బాధితులు బళ్లారి ప్రాంతవాసులు -
గజరాజుల తాలీముకు నాంది
మైసూరు: ప్రఖ్యాత మైసూరు దసరా వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన గజరాజుల బృందం తాలీముకు శ్రీకారం చుట్టింది. శనివారం, ఆదివారం తాలీమును సాగించాయి. మైసూరు ప్యాలెస్ నుంచి బన్నిమంటపం వరకు సుమారు నాలుగు కిలోమీటర్లకు పైగా నడుస్తూ వెళ్లి మళ్లీ తిరిగి వచ్చాయి. పాదయాత్ర సజావుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగుల మందగమనాన్ని నగరవాసులు, పర్యాటకులు ఉత్సాహంగా వీక్షించారు. తరువాత ప్యాలెస్ ఆవరణలో ఆదివారం ఉదయం గజరాజులు ఫుట్బాల్ ఆడుతూ సేదదీరాయి. మావటీలు, కాపలాదారులు పిల్లలతో సరదాగా ఫుట్బాల్ ఆడాయి. బన్నిమంటప వరకు నడక -
విహారయాత్రలో ప్రమాదం, ఒకరు మృతి
శివమొగ్గ: విహారయాత్రకు వెళ్తూ ఉండగా పికప్ వాహనం, మారుతీ ఓమ్ని కారును ఎదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓమ్నిలోని ఒకరు మరణించగా, 8 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకా బలెగారు గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్ పుర తాలూకాకు చెందినవారు ఓమ్ని కారులో జోగ్ జలపాతం చూడడానికి వెళ్తున్నారు. ఈ సమయంలో పికప్ వ్యాన్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. రెండు వాహనాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ఓమ్ని కారులో ఉన్న శేఖర్ అనే చనిపోగా, మరో 8 మందికి గాయాలతో ఆర్తనాదాలు చేశారు. ఓమ్ని మొత్తం నుజ్జయింది. స్థానికులు, పోలీసులు కలిసి బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ పరిశీలించారు. సాగర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కారెక్కిన కొండచిలువ
శివమొగ్గ: ఎవరికై నా కారులో దూసుకెళ్లాలని ఉంటుంది, ఓ కొండచిలువ కూడా అలాగే అనుకుంది ఏమో మరి.. కారులోకి ఎక్కేసింది. ఈ సంఘటన శివమొగ్గ నగరంలోని స్వామి వివేకానంద లేఔట్లోని ఎ బ్లాక్లో శనివారం సాయంత్రం జరిగింది. శ్వేతా బండి అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న కారులోకి సుమారు 7 అడుగుల పొడవైన కొండచిలువ రోడ్డు మీద నుంచి పాకుతూ వెళ్లింది. ఈ దృశ్యాలను చూసిన కొందరు కారు యజమానికి చెప్పడంతో ఆయన స్నేక్ కిరణ్కు ఫోన్ చేశారు. స్నేక్ కిరణ్ చేరుకుని ఎంతసేపు ప్రయత్నించినా కొండచిలువ బయటకు రాలేదు. చివరకు మెకానిక్ను పిలిపించి కొన్ని భాగాలను విప్పి దానిని బయటకు తీశారు. తరువాత దూరంగా వదిలిపెట్టారు. గోవధ కేసులో ఇద్దరి అరెస్టు దొడ్డబళ్లాపురం: కిరాతకంగా ఆవుల గొంతుకోసి హత్య చేసి కళేబరాలను రోడ్డుపై విసిరేసిన ఇద్దరు దుండగులను నెలమంగల గ్రామీణ పోలీసులు అరెస్టు చేసారు. ఇమ్రాన్ (30), సయ్యద్ నవాజ్ (35) అరైస్టెన నిందితులు. నెలమంగల తాలూకా అరళసంద్ర గ్రామంలో ఇటీవల రెండు ఆవులను ఇలా వధించారు. ఈ సంఘటనపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేరళకు జీవాలను తరలిస్తున్న ముఠా సభ్యులను పట్టుకుని విచారించగా నిందితులు రెండు ఆవులు మాంసానికి పనికిరావని తెలిసి కోపంతో వాటిని గొంతుకోసి హత్య చేసి కళేబరాలను విసిరేసి వెళ్లిపోయినట్టు తెలిపారు. వారి సమాచారం మేరకు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఉన్మాద ప్రేమికుడు ఆస్పత్రిపాలు మైసూరు: మైనర్ బాలికను ప్రేమించాలని వెంటపడ్డాడు, ఆమె తిరస్కరించడంతో దాడి చేయబోయి, తానే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యా చేసుకున్నాడో పాగల్ ప్రేమికుడు. ఈ సంఘటన చామరాజనగరలో జరిగింది. వివరాలు.. సాణెగాలకు చెందిన ప్రదీప్ అనే యువకుడు గ్రామంలోనే ఓ బాలికను ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. చామరాజనగరలో కేఎస్ ఆర్టీసీ బస్టాండు వద్ద బస్సు ఎక్కుతున్న బాలికను అతడు ప్రేమించాలని అడిగాడు, బాలిక అతనిపై మండిపడింది. దీంతో బాలిక మీద కత్తితో దాడి చేయబోగా ఆమె తప్పించుకుంది. తర్వాత తన కడుపులోనే పొడుచుకున్నాడు. కొందరు పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి స్థానిక సిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ కోలారు: తాలూకాలోని వేమగల్ – కురుగల్ పట్టణ పంచాయతీ ఎన్నిక ఆదివారం శాంతియుతంగా ముగిసింది. 92.56 శాతం పోలింగ్ జరిగింది. వార్డు నెంబర్ 6లో అత్యధికంగా 98.52 శాతం ఓటింగ్ సాగింది. పట్టణ పంచాయతీలో మొత్తం 17 వార్డులు ఉండి, వివిధ పార్టీల నుంచి 51 మంది పోటీ పడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఎంఆర్ రవి, డిప్యూటీ కలెక్టర్ మంగళ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. వేమగల్ – కురుగల్ పట్టణ పంచాయతీ అయిన తరువాత మొదటిసారి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ – జేడీఎస్ మరోవైపు పోటీలో ఉన్నాయి. బుధవారం కౌంటింగ్ జరుగుతుంది. -
ఇరుకై న స్థలంలో కిక్కిరిసిన భవనాలు
శివాజీనగర: బెంగళూరులో హలసూరు ఠాణా పరిధిలోని నగర్తపేటెలో శనివారం తెల్లవారుజామున 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి ఐదుగురు మరణించిన దుర్ఘటనలో భవన యజమానులైన బాలకృష్ణయ్య శెట్టి, సందీప్ శెట్టి లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు మదన్కుమార్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. అశాసీ్త్రయంగా భవన నిర్మాణం, భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు తెలిపారు. భవనం నేల అంతస్థులో ఉన్న ప్లాస్టిక్ మ్యాట్ గోదాములో మొదట అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పై వరకూ విస్తరించాయి. మంటలు ఎలా పుట్టాయనేది ఇంకా నిర్ధారణ కాలేదు. డిప్యూటీ సీఎం పరిశీలన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం, ఇరుగు పొరుగున ఉండే కట్టడాలు బలహీనపడ్డాయి. వీటికి యజమానులు మరమ్మత్తులు చేయించాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటామన్నారు. ఆయన ఘటనాస్థలిని పరిశీలించి మాట్లాడారు. రెండు అంతస్థుల భవనం కట్టాల్సిన చోట 7– 8 అంతస్తులను నిర్మించారు. లోపలకు వెళ్లడానికి స్థలం చాలా ఇరుకుగా ఉందని చెప్పారు. ఉపాధి కోసం రాజస్థాన్ నుంచి బెంగళూరుకు వచ్చి ఐదు మంది చనిపోయారని వాపోయారు. బీబీఎంపీ కమిషనర్ మహేశ్వరరావు, నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్లు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు కారణాలు అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు అరెస్టు -
హెబ్బాళ ఫ్లై ఓవర్ ర్యాంప్ నేడు షురూ
శివాజీనగర: బెంగళూరులోని హెబ్బాళ కొత్త ఫ్లై ఓవర్ ర్యాంప్ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. దీనిద్వారా హెబ్బాళలో ట్రాఫిక్ ఒత్తిడి 30 శాతం తగ్గే అవకాశముంది. ర్యాంప్పై రెండు రోజుల ట్రయల్ రన్ చేశారు. 700 మీటర్ల పొడవైన హెబ్బాళ ర్యాంపు సుమారు రూ.80 కోట్ల ఖర్చుతో నిర్మించారు. కే.ఆర్.పురం వైపు నుంచి మేఖ్రీ సర్కిల్ను కలుపుతుంది. 2023లో పనులు ఆరంభమై ఇటీవల ముగిశాయి. నాగవార నుంచి వచ్చే వాహనాలు ర్యాంప్ మీద నుంచి వెళ్లిపోవచ్చు. దీని వల్ల మేఖ్రీ కూడలికి సులభంగా చేరుకుని అక్కడ వాహన రద్దీ రెట్టింపు అవుతుందని విమర్శలు వస్తున్నాయి. ఇతర రోడ్లపై ఒత్తిడి ట్రయల్ రన్ సమయంలో మేఖ్రీ కూడలిలో ట్రాఫిక్ పెరిగినట్లు గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు. ఇది ఇతర రోడ్లపై ప్రభావం చూపుతోందన్నారు. మేఖ్రీ సర్కిల్ వద్ద రోడ్డును విస్తరించాలని సూచించారు. ఇందుకోసం బీబీఎంపీ ఇప్పటికే రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని గుర్తించింది. రోడ్డు విస్తరణ జరిగితే ఆర్.టీ.నగర, జయమహల్, వసంతనగర వైపు వెళ్లే వాహనాలు మేఖ్రీ సర్కిల్లో ఫ్రీ లెఫ్ట్ తీసుకోవచ్చు. దీనిద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. బాప్టిస్ట్ ఆసుపత్రి వద్ద మళ్లీ రద్దీ ఇబ్బంది కలుగుతుంది. ఆసుపత్రి వద్ద ఉన్న బస్టాప్లను మార్చే అవకాశముంది. అయితే రెండు వారాల పాటు ట్రాఫిక్ని గమనించిన తరువాత నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అక్కడ ట్రాఫిక్ రద్దీ తగ్గి.. మేఖ్రీ కూడలిలో ఇబ్బంది! -
భారీ వర్షాలు.. కూలిన కొండచరియలు
● హాసన్ జిల్లాలో సంఘటన ● బెంగళూరు– మంగళూరు మార్గంలో రైళ్లు బంద్యశవంతపుర: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం, రుతు పవనాల వల్ల హాసన్ జిల్లావ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. సకలేశపుర సమీపంలోని ఎడకుమారి వద్ద రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడ్డాయి. దీనితో బెంగళూరు– మంగళూరు మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు. మంగళూరు నుంచి విజయవాడకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును బంట్వాళలో నిలిపేశారు. విపరీతమైన వానలు కొనసాగే అవకాశం ఉన్న కారణంగా మట్టి చరియలను తొలగించిన తరువాత రైళ్ల సంచారానికి అనుమతిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం ఉదయానికల్లా సుగమం చేస్తామని చెప్పారు. శిరాడి ఘాట్లో తీవ్ర ఇబ్బందులు బెంగళూరు – మంగళూరును కలిపే శిరాడిఘాట్ మార్గంలో కుండపోత వర్షాల వల్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. మారనహళ్లి వద్ద మట్టి చరియలతో పాటు చెట్లు కూలిపోయాయి. వాహనాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వారాంతం కావటంతో శిరాడి, సకలేశపుర, మంగళూరు మార్గం స్థానికులు, టూరిస్టుల వాహనాలతో నిండిపోయింది. రెండు వైపుల నుంచి వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. చెట్లు, మట్టి తొలగింపు పనులు జరుగుతున్నాయి. చలిలో వర్షాలకు వాహనదారులు తడిసిపోయారు. తాము చెప్పేవరకు వాహనాలను కదిలించవద్దని అధికారులు తెలిపారు. జిల్లాల్లో వర్షాలు వివిధ జిల్లాల పరిధిలో భారీగా వానలు పడుతున్నాయి. బెంగళూరులో ఆకాశం మేఘావృతమై అప్పుడప్పులు జల్లులు పడుతున్నాయి. చలి తీవ్రత పెరిగింది. ప్రజలు గొడుగులు పట్టుకుని బయటకు వచ్చారు. శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తర కర్ణాటకలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బెళగావి జిల్లాలో నదులు, జలపాతాలు జోరందుకున్నాయి. కావేరి నది పరవళ్లు మండ్య: మండ్య జిల్లాలో ఉన్న కావేరి జలాశయం ఎగువన భారీ వర్షాలు పడుతుండటంతో నది ఉరకలు వేస్తోంది. కృష్ణరాజసాగర జలాశయంలోకి వరదనీరు వెల్లువెత్తుతోంది. ఆదివారం డ్యాం నుంచి 50 వేల క్యూసెక్కుల నీటిని వదిలివేశారు. నది ప్రవాహం ఉధృతంగా మారింది. ముందుజాగ్రత్తగా నది పరిసరాల్లోకి ప్రజలు, పశువులు రాకూడదనని, లోతట్టు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రకటించారు. డ్యాం దాదాపుగా నిండిపోయింది. -
క్రికెటర్ శ్రీనాథ్ తల్లి కన్నుమూత
మైసూరు: భారత జట్టు మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి భాగ్యలక్ష్మి (88) కన్నుమూశారు. కొంతకాలంగా వయోసహజ అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మైసూరు కువెంపు నగరలోని నివాసంలో శనివారం కన్నుమూశారు. ఆదివారం చాముండి కొండ తప్పలిలోని శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. రూ.లక్ష లంచం.. సీఐ, ఎస్ఐ అరెస్టు బనశంకరి: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ సీఐ, ఎస్ఐతో పాటు ముగ్గురు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బెంగళూరు రామమూర్తినగర పోలీస్స్టేషన్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ రుమాన్ బాషా, ప్రైవేటు వ్యక్తి ఇమ్రాన్బాబు దొరికిపోయినవారు. వివరాలు.. తనకు తెలియకుండా తన భార్య బంగారు నగలు, నగదు తీసుకుందని, న్యాయం చేయాలని గోపీనాథ్ అనే వ్యక్తి రామమూర్తినగర ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేయాలంటే రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని సీఐ, ఎస్ఐలు డిమాండ్ చేశారని బాధితుడు లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో లోకాయుక్త బెంగళూరు ఎస్పీ కే.వంశీకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు వల పన్నారు. ఆదివారం గోపీనాథ్ నుంచి సీఐ, ఎస్ఐ, బ్రోకరు ఇమ్రాన్బాబు రూ. లక్ష లంచం తీసుకుంటూ ఉండగా దాడి చేసి పట్టుకున్నారు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
ఆగని ఆన్లైన్ కేటుగాళ్ల దోపిడీ
● ఇద్దరి వ్యక్తులనుంచి రూ.లక్షలు వసూలు హుబ్లీ: సైబర్ నేరాలపై పోలీస్, సైబర్ క్రైం విభాగాలు, ఆర్బీఐ తదితర సంస్థలు ఎంత చైతన్య పరచినా ప్రజలు మోసాలకు గురవుతూనే ఉన్నారు. ఆన్లైన్ కేటుగాళ్ల దోపిడికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా నగరంలో ఇద్దరి నుంచి కేటుగాళ్లు లక్షల రూపాయలు దోచుకున్నారు. నగరంలోని రియాజ్ అహ్మద్ ముల్లాకు కేటుగేళ్లు ఫోన్ చేసి స్మార్ట్ మైడ్ అలయన్స్ గ్రూప్–62లో పెట్టుబడులు పెడితే బాగా లాభాలు వస్తాయంటు నమ్మించారు. వాట్సాప్ గ్రూపులో ఆయన్ను చేర్పించి కొన్ని కంపెనీల పేరు చెప్పి రూ.9.70 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అయితే నగదును డ్రా చేసుకునేందుకు యత్నించగా అవి నకిలీ కంపెనీలని తేలింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా లోన్లు ఇప్పిస్తామని నగరానికి చెందిన ఖాజాసాబ్ నదాప్ అనే వ్యక్తి నుంచి కేటుగాళ్లు రూ.6.14 లక్షలు తీసుకొని వంచించారు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి పాన్, ఆధార్కార్డు తీసుకొని నగదును బదిలీ చేయించకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్సును అడ్డుకొని డ్రైవర్, కండక్టర్పై దాడి హుబ్లీ: కేఎస్ ఆర్టీసీ బస్సును ఓ వ్యక్తి అడ్డుకొని డ్రైవర్, కండక్టర్పై దాడికి పాల్పడ్డాడు. ఈఘటన కేశ్వపుర పోలీస్స్షేషన్ పరిధిలో జరిగింది. గదగ్ నుంచి హుబ్లీకి వస్తున్న ఆర్టీసీ బస్సు గదగ్ రోడ్డు వద్దకు చేరగానే ఓ వ్యక్తి బైక్ను రోడ్డుకు అడ్డంగా నిలిపాడు. బస్సు ఆగిన వెంటనే అద్దాలు బద్దలు కొట్టి డ్రైవర్ మల్లికార్జున, కండక్టర్ యల్లప్పపై దాడి చేశాడు. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ వ్యక్తి ఉడాయించాడు. ఈ ఘటనపైడ్రైవర్, కండక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పండుగలను శాంతియుతంగా ఆచరించాలి రాయచూరురూరల్: జిల్లాలో ఈద్మిలాద్, గణేష్ పండుగలను ప్రజలు శాంతియుతంగా ఆచరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాధికారి నీతీస్ ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. 27న వినాయక విగ్రహాలను ప్రతిష్టాపించాలని, 31 న నిమజ్జనం చేయాలన్నారు. వినాయక చవితి, ఈద్ మిలాద్ను హిందూ ముస్లింలు కలిసిమెలసి నిర్వహించుకోవాలన్నారు. డీజేలను వినియోగిస్తే చర్యలు చేపడుతామన్నారు. ప్లాస్టిక్ను వినియోగించరాదన్నారు. నగరసభ కమిషనర్ జుబీన్ మోహపా త్రో, అదనపు ఎస్పీ హరీష్, కుమార స్వామి, రవీంద్ర పాల్గొన్నారు. నిరంతర నీటి సరఫరాకు శ్రీకారం హొసపేటె: కొట్టూరు తాలూకా కందగల్లు గ్రామం, హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని కల్లహళ్లి గ్రామంలో జేజేఎం పథకం కింద 24గంటలపాటు నీటి సరఫరాకు జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మొహమ్మద్ అలీ అక్రమ్ షా శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ నీరు చాలా విలువైనదని, నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృథా చేయరాదని సూచించారు. ఆయా గ్రామాల్లో వంద శాతం గృహాలకు నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వ్యక్తికీ రోజుకు 55 లీటర్ల నీటిని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ పథకాన్ని నిర్వహించడం గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, పంచాయతీ అధికారుల బాధ్యత అని తెలిపారు. తాలూకా పంచాయతీ కార్యనిర్వహక అధికారి లక్ష్మీకాంత్, గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్య విభాగం ఏఈ దీపా ఎస్, ఏఈఈ కూడ్లిగి ప్రసన్న బీఆర్, కందగల్లు గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు జయమ్మ ఏఎం.గాధరయ్య పాల్గొన్నారు. -
పంటలు నీటిపాలు.. అన్నదాతలు కుదేలు
రాయచూరు రూరల్: వారం రోజలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా అన్నదాతలకు అపార నష్టం కలిగింది. పలుచోట్ల ఇంటి గోడలు కూడా పేదలు నిరాశ్రయులుగా మారారు. కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, కలబుర్గి, రాయచూరు, బీదర్ జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెసలు, కంది, ఉల్లి, మొక్కజొన్న పంట పొలాల్లో నీరు చేరింది. తేమ ఎక్కువ కావడంతో పంటలు కుళ్లిపోతున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, వర్షాలతో పంటలు చేతికందే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కలబుర్గి జల్లా అప్జల్ పూర్ తాలుకా బోస్కలో ఇంటి గోడ కూలి లక్ష్మీ బాయి(55) అనే మహిళ మృతి చెందింది. బెళగావి జిల్లా సవదత్తి యల్లమ్మ ఆలయంలోకి వరద నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
మానవీయ విలువలు పెంచేలా బోధన
రాయచూరు రూరల్: విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంచేలా బోధన చేయాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, ఎమ్మెల్యే శివరాజ పాటిల్లు ఉపాధ్యాయులకు సూచించారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందరింలో అవోపా సంఘం ఏర్పాటు చేసిన ప్రతిభాపురస్కార ప్రదానోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అనంతరం టెన్త్, పీయూసీలో ప్రతిభ చాటిన విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు. అవోపా రాష్ట్ర అధ్యక్షుడు కోర వెంకటేష్, పురుషోత్తం, లక్ష్మిపతి, జగదీష్, హనుమేష్, తిప్పయ్య , కిశోర్, దత్తాత్రేయ, భీమాశంకర్, శశిరాజ్ పాల్గొన్నారు. సంగీత, సాహిత్య కళలను పోషించాలి రాయచూరు రూరల్: సంగీత, సాహిత్య కళలను సైకళా సంసకుల సంస్థ పోషిస్తుండటం అభినందనీయమని మాజీ మంత్రి శివనగౌడ నాయక్ అన్నారు. పండిత సిద్దరామ జంబల దిన్ని రంగమందిరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సాహిత్యం, సంగీతం, కళలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. సమాజానికి సేవలు అందించేవారిని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో విధానపరిషత్ సభ్యుడు వసంత కుమార్, సంస్థకు చెందిన మారుతీ, రేఖ, శ్రీదేవి, శరణ బసవ, చెన్న బసవ, అస్లాం పాషా, అబ్దుల్ ఖరీం, నిజాముుద్దీన్, జాపర్ అలీ పటేల్ పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు రాయచూరురూరల్: శరణ పరంపరకు చెందిన శరణ బసవేశ్వర ఆలయ 8 వ పీఠాధిపతి శరణ బసవప్ప అప్ప అంత్య సంస్కారాలు శుక్రవారం కలబురిగిలో ప్రభుత్వ లాంచనాలతో వీరశైవ లింగాయత్ విధివిధానాల మధ్య నిర్వహించారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరై శరణ బసవప్ప అప్పకు నివాళులర్పించారు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వాలి రాయచూరురూరల్: సమాచార హక్కు చట్టం కింద ప్రజలు కోరిన సమాచారం ఇవ్వకపోతే ఆయా శాఖలు అర్జీదారులకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ అధికారులు రుద్రణ, రాజశేఖర్ అన్నారు. శనివారం జెడ్పీ కార్యాలయంలో జరిగిన సభలో ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు అందించిన అర్జీలకు సరైన సమాధానం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రతి రోజు జరిమాన కింద రూ.వంద నుండి 250 వరకు అర్జిదారుడికి చెల్లించాల్సి వస్తు ందన్నారు. మరింత జాప్యం చేస్తే రూ.25 వేల వరకు జరిమానా పడుతుందన్నారు. అదనపు జిల్లాధికారి శివానంద పాల్గొన్నారు. చిన్నప్పటినుంచే సంస్కారం నేర్పాలి రాయచూరు రూరల్: సమాజంలో మానవుడికి సంస్కారం నేర్చుకోవడానికి లింగ దీక్ష ఆవశ్యమని కిల్లే బృహన్మఠం మఠాధిపతి శాంత మల్లశివాచార్యులు అన్నారు. మఠంలో ఆదివారం జంగమ వటులకు లింగ దీక్ష చేయించారు. చిన్నప్పటినుంచే సంస్కారం, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలన్నారు. రూ.20 కోట్లతో చిక్క తిరుపతికి హంగులు మాలూరు: తాలూకాలోని చిక్కతిరుపతి శ్రీ ప్రసన్న వేంకటరమణస్వామి దేవాలయాన్ని రూ. 20 కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే కైవె నంజేగౌడ తెలిపారు. దేవాలయం వద్ద నిర్మిస్తున్న 108 అడుగుల రాజగోపుర నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ దేవాలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిందని, వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సౌకర్యాల కొరత ఉందని, దేవదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి సహకారంతో భక్తులకు సౌలభ్యాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. బ్రహ్మ రథోత్సవం నాటికి రథం వీధిని రూ. 2.5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తామన్నారు. స్నానఘట్టాలు, శౌచాలయాలను నిర్మిస్తామన్నారు. 50కి పైగా విశ్రాంతి గృహాలను, 150 దుకాణాలను నిర్మాణం చేపడుతున్నామన్నారు. రామమూర్తి, ఎంఎ కృష్ణారెడ్డి , దేవాలయం ఈఓ టి సెల్వమణి తదితరులు పాల్గొన్నారు. -
యత్నాళ్ వ్యాఖ్యలపై నిరసన
సాక్షి,బళ్లారి: ముస్లిం యువతులను పెళ్లి చేసుకునే హిందూ యువకులకు రూ.5 లక్షల ప్రోత్సహం ధనం ఇస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే బసవన్నగౌడ పాటిల్ యత్నాళ్ వ్యాఖ్యలపై ముస్లిం యువకులు మండిపడ్డారు. విజయపుర జిల్లా హాలమేళ పట్టణంలో నల్లవస్త్రాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సదరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యత్నాళ్ వాహనం ర్యాలీగా వెళుతుండగా బైక్లో వచ్చిన ముస్లిం యువకులు నల్లజెండాలు ప్రదర్శించి ఆక్రోషం వెల్లగక్కారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో ముస్లిం మహిళలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. -
తుంగభద్ర గేట్ల ఏర్పాటులో అంతులేని నిర్లక్ష్యం
సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల పరిఽధిలో పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలో గేట్ల ఏర్పాటు విషయంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరించడం ఈ ప్రాంత రైతులకు శాపంగా మారిందని రైతు సంఘం నేతలు హనుమనగౌడ, మాధవరెడ్డి విరుచుకుపడ్డారు. నగరంలోని పత్రికా భవన్లో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది తుంగభద్ర 19వ క్రస్ట్ గేటు కొట్టుకుపోయిందన్నారు. తాత్కాలిక గేటు ఏర్పాటుతో పంటలు చేతికందాయన్నారు. అయితే మిగతా 32 గేట్లు దుస్థితిలో ఉన్నాయని, వాటిని మార్చాలని నిపుణులు కమిటీ సూచించినప్పటికీ పాలకులు, అధికారులు జాప్యం చేశారన్నారు. ఫలితంగా ఆ గేట్లు ఇప్పుడు మొరాయిస్తున్నాయని, పైకి ఎత్తితే దించడానికి, దించితే ఎత్తడానికి రాని దుస్థితి నెలకొందన్నారు. మూడు రాష్ట్రాల పాలకుల నిర్లక్ష్యం వల్ల కొత్త గేట్ల అమరికలో విపరీతమైన జాప్యం జరిగిందన్నారు. డ్యాంలో ఏటేటా పెరిగిపోతున్న ౖపూడిక గురించి ఆలోచించడం లేదన్నారు. డ్యాంలో ప్రస్తుతం 30 టీఎంసీల మేర పూడిక చేరిందన్నారు. దీంతో దామాషా ప్రకారం రైతులకు నీరు తగ్గించేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఓ వైపు పూడిక వల్ల 30 టీఎంసీలు తగ్గిపోగా, కొత్త గేట్ల అమరికలో జాప్యం వల్ల ఈ ఏడాది మరో 20 టీఎంసీల నీటి నిల్వ తగ్గిందన్నారు. 80 టీఎంసీలకు నీటి నిల్వ పరిమితం చేశారన్నారు. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో రైతులు సమస్యలు తరుపున గట్టి పోరాటం చేస్తామని, అధ్వానంగా ఉన్న గేట్లును వెంటనే మార్చాలని, పూడిక తీత గురించి గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండిపడిన రైతు సంఘం నేతలు -
ధర్మస్థాపనకే శ్రీకృష్ణ అవతారం
హొసపేటె: ధర్మస్థాపనకే శ్రీ కృష్ణుడు అవతరించారని కన్నడ, సాంస్కృతిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దలింగేష్ రంగన్నవర్ అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మానవ జీవితంలోని అన్ని అంశాలలో శ్రీకృష్ణుడి సహకారం ఉంటుందన్నారు. మార్గదర్శిగా, స్నేహితుడిగా, అన్నయ్యగా, గురువుగా, కుమారుడిగా , వీరుడిగా దర్శనమిస్తాడని తెలిపారు. హోస్పేట తాలూకా యాదవ, గొల్లర సంఘం గౌరవాధ్యక్షుడు గోని బసప్ప, నాయకులు బి.ఈరన్న, జి.శ్రీనివాసులు, వైబి.మధుసూధన్, మారుతితో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఘనంగా కృష్ణాష్టమి హుబ్లీ: కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం కూడా నగరంలో పలుచోట్ల ఉట్టి కొట్టే కార్యక్రమాలు సందడిగా సాగాయి. గోకుల్ రోడ్డు అక్షయ పార్క్ మైదానంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే పోటీలను నిర్వహించగా యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఉట్టి కొట్టడాన్ని వీక్షించారు. తెలుగు పాత హుబ్లీ అరవింద నగర్లో హుబ్లీ సవితా సమాజం ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సవితా సమాజ బాంధవులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పద్మవతి ఆలయంలో ప్రత్యేక పూజలను నెరవేర్చారు. హుబ్లీ: స్థానిక ఆనంద్ నగర్ చెందిన పలువురు తెలుగింటి ఆడపడుచులు తమ మెట్టినిల్లు తెలంగాణలోని నారాయణపేట జిల్లా ధనువాడలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు రాధాకృష్ణుడు వేషధారణ వేయించి మురిసిపోయారు. -
కేఎస్ఆర్టీసీ బస్సు– లారీ ఢీ
సాక్షి,బళ్లారి: కేఎస్ ఆర్టీసీ బస్సు– లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈఘటన సిరుగుప్ప తాలూకాలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి రాయచూరు నుంచి సిరుగుప్ప మీదుగా బెంగళూరుకు బయల్దేరిన కేఎస్ ఆర్టీసీ బస్సు సిరిగుప్ప తాలూకా సిరిగేరి పోలీసు స్టేషన్ పరిధిలో బైరాపురం క్రాస్ బీదర్– శ్రీరంగపట్టణ రాష్ట్ర రహదారిలోకి రాగానే లారీ ఎదురైంది. పరస్పరం వాహనాలు ఢీకొనడంతో బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాదంలో బస్సులో ఉన్న మండ్యజిల్లా మళవళ్లికి చెందిన శ్వేత(38), చెన్నపట్టణానికి చెందిన బాలానాయక్(42)మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. జిల్లా ఎస్పీ శోభారాణి, పోలీసు అధికారులు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైక్ను ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరి మృతి సిరుగుప్ప తాలూకాలో జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సిరుగుప్ప బాగేవాడి గ్రామానికి చెందిన డిష్ అయ్యప్ప(50) అనే వ్యక్తి బైక్లో వెళ్తుండగా సిరుగుప్ప తాలూకా ఇబ్రహీంపుర గ్రామ సమీపంలోని దౌలాసాబ్ రైస్ మిల్ వద్ద ట్రాక్టర్ ఢీకొంది. దీంతో బైకిస్టు అదుపు తప్పి రోడ్డు పక్కన వరి పొలంలోకి పడిపోయి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. ఇద్దరి మృతి 12 మందికి పైగా గాయాలు -
తుంగభద్రకు పోటెత్తిన వరద
● లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు హొసపేటె: కర్ణాటక, ఏపీ, తెలంగాణ, రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు సాగునీరందించే తుంగభద్ర జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువుతట్టు ఉన్న మొరాళి తీర్థహళ్లి, శివమొగ్గ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆదివారం సాయంత్రానికి 80 వేలకు పైగా క్యూసెక్కుల వరద చేరింది. 16 గేట్లను మూడున్నర అడుగులు, మిగితా 6 గేట్లకు రెండున్నర అడుగులు పైకెత్తి 80 వేల క్యూసెక్కులు దిగువుకు విడుదల చేసినట్లు మండలి అధికారులు తెలిపారు. 24 గంటల్లో లక్షకు పైగా క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హంపీ స్మారకాలు, కంప్లి వద్ద వంతెనకు వరద ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1625.57 అడుగులు, నీటినిల్వ 78.327 టీఎంసీలు ఇన్ఫ్లో 43253 క్యూసెక్కులు ఉందని మండళి వర్గాలు తెలిపారు. పర్యాటకులతో డ్యాం కిటకిట ఆదివారం పర్యాటకుల సందడితో కిటకిట లాడింది. గేట్ల నుంచి దిగువకు ప్రవహిస్తున్న నీటి అందాలను వీక్షించి పర్యాటకులు సంతోషంగా గడిపారు. -
అగ్నికీలల్లో భవనం
బనశంకరి: బెంగళూరులో బృహత్ విస్ఫోటం జరిగి భవనం కూలిన దుర్ఘటనను మరువక ముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. కేఆర్ మార్కెట్ నగర్తపేటేలో నాలుగు అంతస్తుల కట్టడంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరొకరు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన హలసూరుగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో సంభవించింది. మృతులు వ్యాపారి మదన్కుమార్ (38), భార్య సంగీత (33), వారి పిల్లలు మితేశ్ (8), విహాన్ (5), మరో అంతస్తులో సురేశ్ (36). తెల్లవారుజామున.. సందీప్, బాలకృష్ణ అనే ఇద్దరికి చెందిన నాలుగు అంతస్తుల భవనంలో అనేక కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులోనే ప్లాస్టిక్ వస్తువుల తయారీ యూనిట్లు కూడా ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున 3.30 సమయంలో అగ్ని ప్రమాదం మొదలైంది. భవనం గ్రౌండ్ ఫ్లోర్తో పాటు రెండో అంతస్తులో ప్లాస్టిక్ గోదాములు, తయారీ యూనిట్లు ఉండగా, మొదటి అంతస్తులో ఉన్న ముగ్గురు కార్మికులు మంటలు వ్యాపించగానే బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మూడో అంతస్తులో వ్యాపారి మదన్కుమార్ కుటుంబం నివాసం ఉంటోంది. మదన్ ఇంటికి బయటి నుంచి తాళం వేసుకుని, గ్రౌండ్ఫ్లోర్లో తన యూనిట్లో పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం జరగ్గా మదన్ మంటల్లో చిక్కాడు. పై అంతస్తులో కుటుంబం.. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేయగా శ్రమించారు. రెండుగంటలపాటు ఏకధాటిగా నీళ్లు చిమ్మి ఆర్పివేశారు. 3వ అంతస్తులోని మదన్ ఫ్లాటు తాళాన్ని పగలగొట్టి వెళ్లి చూడగా అతని భార్య, ఇద్దరు పిల్లలు వేడి, పొగ తాకిడికి చనిపోయి ఉన్నారు. వీరు రాజస్థాన్ నుంచి వలసవచ్చి వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. పై అంతస్తులోని ఫ్లాటులో సురేష్ అనే వ్యక్తి మరణించాడు. సిలిండర్ పేలుడా.. కరెంటు వైర్లా? భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాస్టిక్ మ్యాట్లను తయారీ కేంద్రంలో మంటలు రేగి కట్టడం మొత్తం వ్యాపించినట్లు అనుమానాలున్నాయి. గ్యాస్ సిలిండర్ లీకై , లేదా కరెంటు వైర్ల నుంచి మంటలు వచ్చి ఉంటాయని చెబుతున్నారు. ఇరుకై న సందులో భవనం ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. దట్టమైన పొగ వ్యాపించడంతో నివాసితులకు దిక్కుతోచలేదు. ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, 6 ఫైరింజన్లతో శ్రమించారు. మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతులు మదన్కుమార్, భార్య సంగీత, పిల్లలు (ఫైల్) సురేశ్ (ఫైల్) ఓ కుటుంబం, మరొకరు మృత్యువాత బెంగళూరులో నగర్తపేటెలో ఘోర ప్రమాదం ప్లాస్టిక్ యూనిట్లో మంటలే కారణం! విచారణ సాగుతోంది: కమిషనర్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్ సింగ్ తెలిపారు. ఘటనాస్థలిని ఆయన పరిశీలించారు. ఫైర్ అధికారులు, విద్యుత్ ఇంజినీర్లు తనిఖీ చేస్తున్నారని, అందులో కచ్చితమైన కారణం తెలుస్తుందని చెప్పారు. ఓ ఇంటికి తాళం వేసి ఉండడంతో వారిని కాపాడడం ఇబ్బందిగా మారిందని అన్నారు. -
జనావాసాల్లో ఎలుగుబంటి సంచారం
హొసపేటె: హొసపేటె నగర పరిధిలో సండూరు రోడ్డులోని అంబేడ్కర్నగర్లో శుక్రవారం సాయంత్రం ఎలుగుబంటి సంచారం కాలనీ వాసులకు భయాందోళన కలిగించింది. ఓ ఇంటి ఆవరణలో ఎలుగుబంటి అతిథిగా కనిపించింది. అది ఇంటి చుట్టూ తిరుగుతుండటం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ సమయంలో పెంపుడు కుక్క ఇంటి బయట నిద్రిస్తుండగా భయపడి ఇంటి ఆవరణలోకి పరుగెత్తింది. ఆహారం కోసం వచ్చిన ఎగులుబంటి ఇంటి ఆవరణలోకి వచ్చింది. ఈ సంఘటన ఇంటి సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇది చూసిన ఇంటి యజమాని, స్థానికులు షాక్కు అయ్యారు. ఇటీవల రోజుల్లో నగరంలో, పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంట్ల సంచారం పెరగడంతో ప్రజల్లో భయం నెలకొంది. అదేవిధంగా అనేక గ్రామాలు, పొలాలు, కొండలు, ఇళ్ల చుట్టూ ఎలుగుబంట్లు చాలా సార్లు కనిపించినా హొసపేటె ప్రాంతంలో ఇప్పటి వరకు మనుషులపై దాడులు జరిగిన కేసులు నమోదు కాలేదు. అయితే భవిష్యత్తులో అటవీ శాఖ అత్యవసర చర్యలు తీసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖాధికారులు ఎలుగుబంటి కదలికలను పర్యవేక్షించి తక్షణమే పట్టివేతకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హొసపేటె నగర శివార్లలో కలకలం ప్రజలు భయాందోళనకు గురైన వైనం -
శ్రీకృష్ణ ఆదర్శాలు అనుసరణీయం
రాయచూరు రూరల్: అణగారిపోతున్న నేటి ఆధునిక సమాజంలో శ్రీకృష్ణ పరమాత్ముని ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని లోక్సభ సభ్యుడు కుమార నాయక్ అన్నారు. శనివారం శ్రీకృష్ణ యాదవ భవనంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. దేశంలో కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు ప్రథమ ప్రాధాన్యత కల్పించారన్నారు. నగరేశ్వర ఆలయం నుంచి శ్రీకృష్ణ భగవాన్ చిత్రపటానికి భెమ్మెల్సీ వసంత్ కుమార్ జాతాను ప్రారంభించారు. కార్యక్రమంలో నగరసభ మాజీ అధ్యక్షుడు తిమ్మప్ప నాడగౌడ, శరణప్ప, బిచ్చన్న, భీమన్న, హనుమంతప్ప, చెన్నారెడ్డిలున్నారు. -
మైసూరులో నిరసన
మైసూరు: ధర్మస్థల మీద, ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేపై మీద కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ జైన సమాజం ఆధ్వర్యంలో శనివారం నగరంలో శాంతియుత మౌన నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలోని గాంధీ సర్కిల్లో దిగంబర జైన్ సామాజీకులు బైఠాయించారు. అపప్రచారం చేయరాదని, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోపణలకు తగిన సాక్ష్యాలను ఇవ్వాలని, జైన ధర్మాన్ని కాపాడాలని, రత్నగిరిని రక్షించడం మన బాధ్యత అని అన్నారు. శ్రీక్షేత్ర రక్షణకు ఎలాంటి త్యాగాలకై నా సిద్ధమన్నారు. ధర్మస్థల గౌరవాన్ని కాపాడుతాం ● డీసీఎం శివకుమార్ శివాజీనగర: ధర్మస్థల కేసులో తనిఖీ కోసం సిట్ను నియమించినప్పుడే బీజేపీవారు ఎందుకు మాట్లాడలేదు, గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడు కూడా ప్రశ్నించలేదు. ఇప్పుడు రాజకీయం కోసం ధర్మస్థల జాతా చేస్తున్నారని డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ ఆరోపించారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ధర్మస్థల గౌరవాన్ని కాపాడటమే తమ లక్ష్యమన్నారు. ఎవరు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకొంటాం, ఎవరినీ కాపాడే ఉద్దేశం లేదు. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. అది అబద్ధమో, నిజమో తెలియదు. జడ్జి ముందు కూడా వాంగ్మూలం ఇచ్చాడు, ఇంత జరిగిన తరువాత తనిఖీ జరపకపోతే బీజేపీవారే ప్రశ్నించేవారు. విచారణ చేస్తే రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ధర్మస్థలకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని తాను భావిస్తున్నానన్నారు. సిట్లో నేను వేలు పెట్టలేదు, హోం మంత్రి చూసుకొంటారు. తనకు తెలిసిన వారి నుంచి సమాచారం తెలుసుకొంటున్నా. ఎవరికీ అన్యాయం జరగనివ్వం అని అన్నారు. ధర్మస్థల మీద అప ప్రచారం చేసే వారి మీద చర్యలు తీసుకొంటామని పార్టీ నాయకులకు సీఎం భరోసా ఇచ్చారని తెలిపారు. -
ధర్మస్థలపై త్వరలో సిట్ నివేదిక
యశవంతపుర: ప్రముఖ దేవస్థానం ధర్మస్థల పరిసరాలలో వందలాది మంది శవాలను పాతిపెట్టారని మాజీ పారిశుధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడంతో సిట్ పోలీసులు గాలింపు చేపట్టడం తెలిసిందే. గత 20 రోజుల నుంచి ఫిర్యాదుదారు చెప్పిన చోటల్లా తవ్వకాలు చేశారు. తోడిన గుంతల్లో మట్టిని నింపకుండా అలాగే వదిలేశారు. ఆధారాలు దొరకని కారణంగా ఎక్కడ తోడినా ఇంక ప్రయోజనం లేదని సిట్ అధికారులు అనుకుంటున్నారు. ఈ కేసులో సిట్ రెండు రోజుల్లో పూర్తి నివేదికను సర్కారుకు ఇవ్వనుంది. అపరిచితునికి గుబులు గట్టి ఆధారాలు దొరకని కారణంగా పోలీసులు మట్టిని తోడే పనిని నిలిపేశారు. అస్థిపంజరాలున్నట్లు చెప్పిన అపరిచితునికి ఇప్పుడు భయం ఏర్పడింది. మునుముందు నా పరిస్థితి ఏమవుతుందోనని అతడు గుబులుతో ఉన్నారు. తనకు జీవితకాలం భద్రతను కల్పించాలని కోరుతున్నాడు. కోర్టును, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించాడని విమర్శలు వస్తున్నాయి. నార్కో పరీక్షలు? అపరిచిత వ్యక్తి చెప్పిన జాగాలను సిట్ పరిశీలించింది. అతడు ఎస్పీ, కోర్టు ముందు చెప్పినట్లు భారీ సంఖ్యలో మృతదేహాల జాడలు ఎక్కడా బయటపడలేదు. అతడు చెప్పినదంతా అబద్ధం అని, ఎందుకు అలా చెప్పాడో తెలుసుకోవడానికి నార్కో పరీక్షలను జరిపి నిజం కక్కించాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఎంతోమంది వ్యయ ప్రయాసలకోర్చి గుంతలు తవ్వారు, దీనికి డబ్బు కూడా భారీగా ఖర్చయినట్లు సమాచారం. అపరిచితునికి కోర్టు అనుమతులు తీసుకుని సత్యశోధన పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి సిట్ నివేదిక, నార్కో పరీక్షల మీదే నిలబడింది. ధర్మస్థలతోనే సర్కారు: మంత్రి రాష్ట్ర ప్రభుత్వం ధర్మస్థలతోనే ఉంటుందని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కార్ అన్నారు. ఆమె ఉడుపిలో విలేకరులతో మాట్లాడారు. కొందరూ పవిత్రమైన ధర్మస్థలపై మసి పూసి మారేడుకాయ చేయాలని చూశారని అన్నారు. ఇప్పుడు కొండను తోడి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు. ధర్మస్థల మీద అపప్రచారం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని మానాలని ఆమె అన్నారు. 20 చోట్ల తవ్వినా ఏమీ దొరకనట్లే గాలింపు నిలిపివేత -
మృత్యు శకటాలైన బస్సులు
యశవంతపుర: ఆర్టీసీ బస్సులు యమశకటాలుగా మారాయి. రెండుచోట్ల నిలిచి ఉన్న లారీలను ఢీకొట్టడంతో ముగ్గురు చొప్పున 6 మంది చనిపోయారు. వివరాలు.. గొర్రెలు, మేకలతో నిలిచిన లారీని కేఎస్ ఆర్టీసీ బస్ ఢీకొనగా ముగ్గురు చనిపోయిన ఘటన బెంగళూరు గ్రామాంతర జిల్లా నెలమంగల తాలూకా గుండేనహళ్లి వద్ద శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగింది. ప్రమాదంలో లారీ క్లీనర్, ఏపీలోని మడకశిరకు చెందిన శ్రీనివాసులు (50), డ్రైవర్ ఆనంద (26), నజీర్ అహ్మద్ (36) అనే వ్యాపారి మరణించారు. వీరు బెంగళూరులో ఉండేవారు, బాగలకోట జిల్లా ముధోళకు వెళ్లి మేకలు, గొర్రెలను కొని లారీలో బెంగళూరుకు వస్తున్నారు. ఘటనాస్థలంలో లారీ పంచరు కావడంతో రోడ్డుపక్కన నిలిపి టైరు మారుస్తున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు లారీ ముందుభాగాన్ని ఢీకొంది. లారీ డ్రైవర్ ఆనంద, శ్రీనివాసులు, నజీర్లు తీవ్ర గాయాలతో మరణించారు. బస్సులోని కొందరికి గాయాలు తగిలాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యల్లాపురలో ముగ్గురు.. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర మావళ్లి క్రాస్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి మరో దుర్ఘటన జరిగింది. బాగలకోట నుంచి మంగళూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన నిలిపిన కేరళకు చెందిన లారీని వెనుక నుంచి ఢీకొంది. బస్సు డ్రైవర్ ఓవర్టేక్ చేయబోయి ప్రమాదం జరిగినట్లు తెలిసింది. బస్సులోని నీలప్ప హరదొళ్లి (40), గిరిజప్పా బూదన్నవర (30) మరో వ్యక్తి (40) చనిపోగా, 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బాగలకోట నుంచి కూలి పనుల కోసం మంగళూరుకు వలస వెళుతున్నట్లు తెలిసింది. బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నెలమంగల, ఉత్తర కన్నడలో నిలిచిన లారీలను ఢీ 6 మంది దుర్మరణం -
నాగమోహన్ దాస్ నివేదికను తిరస్కరించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిస్టిస్ నాగమోహన్ దాస్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను తిరస్కరించాలని అంబేడ్కర్ ఎస్సీ వర్గీకరణ సమితి సంచాలకుడు మహేంద్ర కుమార్ మిత్ర పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణకు కాంగ్రెస్ సర్కార్కు జిస్టిస్ నాగమోహన దాస్ నివేదికను అందించారన్నారు. అందులో ఎస్సీ వర్గాల వారిని నియమించకుండా అగ్ర వర్ణాల వారిని కమిషన్ అధ్యక్షుడిగా నియమించడంతో పాటు ఆది కర్ణాటక, ద్రావిడ, ఇతర ఉప కులాలను చేర్చడంలో లోపాలు ఏర్పడ్డాయన్నారు. ఆ లోపాలను సవరించి ఆమోదించాలన్నారు. -
కన్నుల పండువగా కృష్ణాష్టమి
ఊరేగింపులో డోలు వాయిద్య కళాకారుల ప్రదర్శన హొసపేటెలో రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు శ్రీకృష్ణుడికి పూజ చేస్తున్న ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్ తదితరులు సాక్షి,బళ్లారి: సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, మహాభారత యుద్ధంలో పాండవుల్లో ఒకరైన అర్జునుడికి రథసారథిగా ఉండి పాండవుల(ధర్మం) వైపు నిలబడి వారి విజయానికి సహకరించిన మహానుభావుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కన్నుల పండువగా ఆచరించారు. ముఖ్యంగా నగరంలో జిల్లా యంత్రాంగం, గొల్లర సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టారు. శ్రీకృష్ణుని విగ్రహానికి పూజలు చేసిన తర్వాత నగరంలోని అండర్ బ్రిడ్జి, రాయల్ సర్కిల్ గుండా బీడీఏఏ మైదానం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం బీడీఏఏ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి మాట్లాడుతూ గొల్ల యాదవ సమాజ ప్రజల కోరిక మేరకు సముదాయ భవన నిర్మాణానికి రూ. 25 లక్షల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధంలో పాండవులకు సహకారం అందించి ధర్మాన్ని కాపాడిన శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడని అన్నారు. మానవ రూపంలో పుట్టిన దేవుడు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీత మనందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందంటే అది శ్రీకృష్ణ భగవానుడు అందించిన పరమ పవిత్రమైన గ్రంథం అని గుర్తు చేశారు. గ్యారెంటీ పథకాల అమలు ప్రాధికార జిల్లాధ్యక్షుడు చిదానందప్ప, మేయర్ నందీష్, గొల్లర సంఘం అధ్యక్షుడు, కార్పొరేటర్ గాదెప్ప తదితరులు పాల్గొన్నారు. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు హొసపేటె: నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. టీబీ డ్యాం పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో శనివారం తల్లిదండ్రులు తమ పిల్లలకు శ్రీకృష్ణుడి వేషధారణలు చేసి మురిసిపోయారు. కృష్ణజన్మాష్టమి నాడు పిల్లలను అలంకరించడం వల్ల పిల్లల్లో మతం, సంస్కృతి పట్ల గౌరవం పెరుగుతుంది. ఇంట్లోని తమ పిల్లలకు శ్రీకృష్ణ, రాధ వేషధారణ చేసి చూడాలనుకునే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. కృష్ణజన్మాష్టమి ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయడానికి శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. సరళంగా శ్రీకృష్ణాష్టమి రాయచూరు రూరల్: నగరంలో శ్రీకృష్ణుని జన్మాష్టమిని సరళంగా ఆచరించారు. ఉప్పారవాడి లక్ష్మీవేంకటేశ్వరాలయంలో శ్రీకృష్ణుని జన్మాష్టమి కార్యక్రమంలో ప్రత్యేక పూజలు జరిపి బాలలతో శ్రీకృష్ణుని పాత్రలు వేయించారు. విఠల్ రుక్మిణి మందిరంలో విశేష కార్యక్రమాలను నెరవేర్చారు. ఇస్కాన్ మందిరంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు చేశారు. శ్రీకృష్ణుడికి ఊయల సేవలు జరిపారు. వేడుకగా నల్లనయ్య జయంతి హుబ్లీ: జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా గోకుల అష్టమి శుభవేళ అన్ని చోట్ల బాలకృష్ణుని జయంతి వేడుకలను ఆయా ఆలయాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు జరుపుకొన్నారు. ముఖ్యంగా రాయాపుర ఇస్కాన్, కేశవపుర గీతా మందిరతో పాటు ధార్వాడలోని కృష్ణ మందిరాల్లో, అలాగే జిల్లాలోని వివిధ చోట్ల నల్లనయ్య జయంతి వేడుకల సందర్భంగా తెల్లవారు జాము నుంచే ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. ముఖ్యంగా ఇస్కాన్లో శుక్రవారం నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. విశేషంగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా మంటపాలు నిర్మించి కృష్ణయ్య దర్శనం చేయించారు. కేశవపుర గీతా మందిరంలో శనివారం ఉదయం పరమాత్ముడికి వెన్న అలంకారంతో పూజలు నిర్వహించారు. నగరంలోని వివిధ మహిళా మండళ్ల సభ్యులతో భజనలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 7 గంటలకు రామచంద్రాచార్య దాసవాణి కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం, ఊయల పూజలు, మహామంగళ హారతి తదితర వేడుకలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. ఇక విద్యా సంస్థల్లో అయితే చిన్నారుల చిట్టిపొట్టి వేషాలతో బాలకృష్ణులను తనివితీరా చూడాల్సిందే. ఫ్యాన్సీ డ్రస్సులతో ముద్దు మురిపాలతో తమ పిల్లలను బాలకృష్ణుడి వేషభూషణాలతో తీర్చిదిద్ది ప్రతి విద్యా సంస్థల్లోను ఈ బాలల కృష్ణవేషధారణ సందడి విశేషంగా కనిపించింది. ఇంకా అదివారం రోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలను వివిధ ఆలయాల్లో ఏర్పాటు చేశారు. ఆరోజు కృష్ణుడి విగ్రహానికి విశేష పంచామృతాభిషేకం, భజనలు, పారాయణం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాజవీధిలో వైభవంగా రథోత్సవాన్ని ఏర్పాటు చేశామని కేశవపుర గీతా మందిరం ధర్మ కన్వీనర్ వెంకటేష్ ఆచార్, జాగీర్దార్, ఆ మందిరం మేనేజింగ్ ట్రస్టీ కేశవ్ దేశాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలో శ్రీకృష్ణుని విగ్రహం ఊరేగింపు యాదవ సముదాయ భవనం నిర్మిస్తాం నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి వెల్లడి -
బాధిత కుటుంబానికి పరిహారం పంపిణీ
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా యరగేరలో వారం రోజుల క్రితం పిడుగుపాటుకు గురై మృతి చెందిన భవాని కుటుంబానికి శనివారం రాయచూరు రూరల్ శాసన సభ్యులు బసనగౌడ దద్దల్ రూ.5 లక్షల పరిహార ధనం చెక్ను అందించారు. పల్లెల్లో పచ్చదనం పెంపొందించండిరాయచూరు రూరల్: గ్రామాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని గ్రామీణ సీఐ నింగప్ప పేర్కొన్నారు. శనివారం తాలూకాలోని ఆదికవి వాల్మీకి మహర్షి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్ఎన్ఎస్ శిబిరంలో ఆయన మాట్లాడారు. యువకులు నేరాలు, వ్యసనాలు, మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండి మంచి ప్రవర్తనతో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలకు చేరాలని పిలుపునిచ్చారు. గ్రామాలను పచ్చని చెట్లతో కళకళలాడేలా తీర్చిదిద్ది పచ్చని పల్లెలుగా మార్చాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎన్ఎస్ అధికారిణి పద్మజ, బజారప్ప, రేణుక, బుజ్జమ్మ, శివరాజ్, నాగవేణి, విజయ్లున్నారు. సంగొళ్లి రాయణ్ణ ఆశయాలు అలవర్చుకోవాలిరాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో అణగారిపోతున్న ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లాధికారి నితీష్ అన్నారు. జిల్లాధికారి కార్యాలయంలో జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జరిగిన క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ జయంతిని పురస్కరించుకొని చిత్ర పటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. దేశంలో కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఏడీసీ శివానంద, తహసీల్దార్ సురేష్ వర్మ, నాసీర్ అహ్మద్లున్నారు. -
గోపాలా.. గోవింద.. దీవించరావ
శనివారం ధార్వాడలో కృష్ణాష్టమి సంబరాల్లో బాలలు బెంగళూరు ఇస్కాన్ దేవస్థానంలో భక్తులుబనశంకరి: మానవాళికి భగవద్గీత ద్వారా గీతోపదేశం చేసిన శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినరోజును శనివారం కన్నడనాడు అంతటా ఆనందోత్సాహాలతో ఆచరించారు. బాలలు నల్లనయ్య, గోపికల మాదిరిగా అలంకరించుకుని మురిపించారు. ఆలయాలలో విశేష వేడుకలు జరిగాయి. బెంగళూరు రాజాజీనగర ఇస్కాన్ ఆలయంలో వేకువజాము నుంచి అర్చకులు రాధాకృష్ణుల విగ్రహాలకు వివిధ అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వందలాదిగా భక్తులు తరలివచ్చి వెన్నదొంగను దర్శించుకున్నారు. బెంగళూరులోని శ్రీకృష్ణ ఆలయాలు హరే రామ హరే కృష్ణ నినాదాలతో మారుమోగాయి. రాధా కృష్ణ వేషధారణతో పిల్లలతో వేడుకలు ఆకట్టుకున్నాయి. ఉడుపి శ్రీకృష్ణ మఠంలో కృష్ణజయంతి వేడుకలు నిర్వహించారు. ఉట్టి కొట్టే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ధార్వాడలో కృష్ణ గోపికల రూపాల్లో బాలలు అలరించారు. రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాధాకృష్ణుల వేషాల్లో బాలల సందడి -
అగర వెంకన్నకు విశేష పూజలు
బొమ్మనహళ్లి: శ్రావణ శనివారం సందర్భంగా బెంగళూరు బొమ్మనహళ్ళిలోని అగరలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ఉదయమే స్వామివారికి పంచామృత అభిషేకం, అలంకారం గావించారు. వందలాదిగా భక్తులు దర్శించుకున్నారు. చెరువు కబ్జాదారులకు చుక్కెదురు శివాజీనగర: చెరువు ఆక్రమణల గురించి ఐదుగురికి బీబీఎంపీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నగరంలోని కే.ఆర్.పురం సమీపంలో విభూతిపురం చెరువును ఆక్రమించారని, ఆ స్థలాన్ని ఖాళీ చేయిస్తామని ఐదుగురికి పాలికె అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులను రద్దు చేయాలని జీ.వీ.మంజునాథ్, తమిళరసి, పళనిమ్మాళ్, ఎన్.సుందరమూర్తి, జే.శివరామన్ అనేవారు హైకోర్టును ఆశ్రయించారు. భూకబ్జా నిషేధ చట్టం, చెరువు పరిరక్షణ చట్టాల కింద నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పిటిషన్దారుల వాదన సమర్థనీయం కాదని జడ్జి కొట్టివేశారు. ప్రైవేటు స్కూలు బస్సు పల్టీ శివమొగ్గ: ప్రైవేట్ స్కూలు బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన శనివారం జిల్లాలోని హొసనగర తాలూకా రిప్పన్పేటె పోలీసు స్టేషన్ పరిధిలోని కానుగోడు గ్రామం వద్ద జరిగింది. వివరాలు.. గర్తికెరెలోని ప్రైవేట్ పాఠశాల బస్సు 12 మంది నర్సరీ విద్యార్థులతో బయల్దేరింది. తమ్మడికొప్ప–మూగుడి మార్గంలో బస్సు డ్రైవర్ నియంత్రణ తప్పడంతో పొదల్లోకి దూసుకెళ్లింది. ఘటనలో ఒక బాలునికి స్వల్ప గాయాలు కాగా మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు చేరుకుని పిల్లలకు బయటకు తీసుకొచ్చారు. టేకాఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ దొడ్డబళ్లాపురం: బెళగావి నుంచి ముంబైకి బయలుదేరిన స్టార్ ఎయిర్ ప్రయాణికుల విమానంలో ఇంజిన్లో యాంత్రిక లోపం తలెత్తడంతో బెళగావిలోనే అత్యవసరంగా దిగిపోయింది. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. బెళగావి విమానాశ్రయ అధికారుల వివరాల ప్రకారం.. విమానం 48 మంది ప్రయాణికులతో ఉదయం 7:50కి ముంబైకి బయలుదేరింది. కొంతదూరం ప్రయాణించగానే ఇంజిన్లో సమస్య కనిపించడంతో పైలట్ తిరిగి బెళగావిలో ఎయిర్పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులను మరో విమానం ఏర్పాటు చేసి పంపించినట్లు తెలిపారు. కొందరు ప్రయాణికులు ప్రయాణం రద్దు చేసుకున్నారు. -
తుంగభద్ర వరద యథాతథం
●డ్యాం వద్ద 11 గేట్ల నుంచి నీటి విడుదల హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర జలాశయానికి ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు యథావిధిగా కొనసాగుతుండటంతో డ్యాంకు వరద పోటెత్తుతోంది. శనివారం డ్యాంలో నీటి నిల్వ 80.003 టీఎంసీలు ఉండగా డ్యాం వద్ద 11 క్రస్ట్గేట్లను పైకెత్తి దిగువకు సుమారు 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంకు వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. డ్యాంలో నీటిమట్టం 1626.06 అడుగులు, ఇన్ఫ్లో 40 వేల క్యూసెక్కులు ఉందని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. సర్వోత్తమ సేవా అవార్డుల ప్రదానం రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో ప్రభుత్వ సేవల్లో కొలువు దీరిన అధికారుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సర్వోత్తమ సేవా అవార్డులను మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ చేతుల మీదుగా అందించారు. ఆగస్టు 15న మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో రాయచూరు తహసీల్దార్ సురేష్ వర్మ, స్టాటికల్ ఉద్యోగి సంతోష్ నందిని, సిరవార సీడీపీఓ అధికారి నాగరత్న, జిల్లా ఖజానా లెక్కాధికారి వెంకటాచల, మాన్వి ఆయుష్ వైద్యాధికారి రాజేంద్ర, విద్యా శాఖ ఉద్యోగి హనుమంతరాయ, సింధనూరు గ్రంథాలయం ఉద్యోగి యల్లప్ప, మిస్కి ఉద్యోగి గురునాథ్, దేవదుర్గ టీపీ ఎఫ్డీసీ హమీదా బేగం, మాన్వి వ్యవసాయ శాఖ అధికారి యంకణ్ణ యాదవ్లను మంత్రి సన్మానించారు. ట్రామా కేర్ యూనిట్కు శ్రీకారంరాయచూరు రూరల్: రాయచూరులో ట్రామా కేర్ యూనిట్కు రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ శ్రీకారం చుట్టారు. శనివారం ఒపెక్ ఆస్పత్రిలో ఉంచిన ట్రామా కేర్ పరికరాల గురించి ప్రత్యేక అధికారి బాలాజీ వివరించారు. ప్రజలకు ఉత్తమ రీతిలో వైద్య సేవలు అందించాలన్నారు. కళ్యాణ కర్ణాటకలోని జిల్లాల్లో ప్రజలు వ్యవసాయంపై ఆధార పడ్డారన్నారు. వ్యాధులు సక్రమించినప్పుడు స్పందించి చికిత్స అందించాలని సూచించారు. రూ.10 కోట్లతో ట్రామా కేర్ యూనిట్, క్యాన్సర్ యూనిట్లను ప్రారంభించామన్నారు. సమావేశంలో లోక్సభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసనగౌడ, ఎమ్మెల్సీ వసంత కుమార్, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, రిమ్స్ అధికారి రమేష్, గురుసిద్దయ్య హిరేమఠలున్నారు. ఉజ్జిని సబ్స్టేషన్ జలమయంహొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి సమీపంలోని ఉజ్జిని గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా కూడ్లిగి రోడ్డులోని 66/11 కేవీ విద్యుత్ పంపిణీ సబ్స్టేషన్లోకి పెద్ద మొత్తంలో నీరు ప్రవేశించింది. నీటి ప్రవాహాన్ని ఆపడానికి శాఖ సిబ్బంది తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ ప్రాంతం పూర్తిగా మునిగింది. కార్యాలయం కాంపౌండ్ పక్కన గ్రామ మార్కెట్ నుంచి ప్రవహించే బాహ్యడ్రైనేజీ కాలువ నుంచి నీరు సబ్స్టేషన్లోకి చేరుతోంది. గ్రామ పంచాయతీ వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టాలని ఉద్యోగులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. అవయవదానానికి మంత్రి అంగీకారం హుబ్లీ: అవయవదాన వాగ్దాన పత్రంపై న్యాయ, పర్యాటక శాఖ మంత్రి హెచ్కే.పాటిల్ సంతకం చేశారు. రాజకీయ రంగంలో సుదీర్ఘంగా 46 ఏళ్ల పాటు క్రియాశీలుడైన ఆయన తన 72వ జన్మదిన వేళ ఈ ఆదర్శ కార్యానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ అవయవదానంలో ఆయన పేరు నమోదు చేయించారు. గుండె, కిడ్నీలు, కళ్లతో పాటు ఇతర అవయవదానాన్ని ఆయన ప్రకటించారు. తద్వారా తన జన్మదినాన్ని విశిష్టంగా ఆచరించారు. హెచ్కే.పాటిల్ సేవా బృందం చేపట్టిన ఈ అభియాన్లో శుక్రవారం వరకు 1440 మంది అవయవదాన పత్రాలను నమోదు చేయించుకున్నారు. -
పని లేక యంత్రాల మూగ నోము
హుబ్లీ: కొప్పళ, విజయనగర, బళ్లారి జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రోణ తాలూకాకు వచ్చిన వరి కోత యంత్రాల యజమానులు, కార్మికులు పని లేక పస్తులతో గడపాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తాలూకాలో ఎక్కువగా పండించే పెసలు కోత కోయడానికి వేలాది యంత్రాలు వచ్చాయి. అయితే కుండపోత వర్షాలతో పొలాల్లో నీరు నిలవడటంతో యంత్రాలు ముందుకు వెళ్లలేక మొరాయిస్తున్నాయి. దీంతో గత 10 రోజుల నుంచి సదరు యంత్రాలకు పని లేక యజమానులు, కార్మికులు రోజు వారి కడుపు తిప్పల కోసం అగచాట్లు పడుతున్నారు. రోణ, సూడి, నరేగల్ తదితర గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల్లో ప్రస్తుతం యంత్రాలదే హోరు. ఎక్కడ పడితే అక్కడ అవి కనిపిస్తున్నాయి. అయితే కొన్ని రోజుల నుంచి కార్మికులు రోడ్డు పక్కన బతుకు వెళ్లదీస్తున్నారు. జూలై చివరి వారంలో వచ్చిన ఈ యంత్రాలు ఊరి శివారులో టికానా వేశాయి. జూలైలో కొన్ని భాగాల్లో పెసలు కోత చేసి రాశులు చేసేవారు. అనంతరం పంట చేతికొస్తుందని అనుకునేంతలోనే వానలు నిరంతరంగా కురవడంతో సదరు యంత్రాల యజమానులకు ఇక్కట్లు ఓ వైపు కాగా అన్నదాతలకు మరో రకంగా బాధలు తప్పడం లేదు. ఖరీఫ్ సీజన్లో పండించే పెసలు, మొక్కజొన్న, రబీ సీజన్లో శెనగకు ఈ యంత్రాలే ఆసరా. వ్యవసాయ కూలీల కొరత వల్లే ఈ యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. పెసల కోత, ఉల్లి కలప, నిర్వహణ కలిసి రావడంతో కూలీల కొరత కనిపిస్తోంది. దీంతో కూలీలు దొరికిన రోజుకి ఒక్కరికి రూ.400 కూలీ చెల్లించాలి. ఒక ఎకరాకు 15 మంది కూలీలు అనుకున్నా రూ.6000 కూలి చెల్లించాలి. దీనికి బదులుగా భారీ యంత్రం ద్వారా కోతలు చేస్తే రూ.1500 ఖర్చు అవుతుంది. దీంతో ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ యంత్రాలను వాడటం అనివార్యం అని రైతన్న సంతోష్ కమతర్ తెలిపారు. గత 10, 15 రోజులుగా రోణ తాలూకాలో పూర్తిగా పెసల పంట కోతలు చేసి రైతులకు అండగా నిలిచే వారమని, అయితే నిరంతర వానలతో ఖాళీగా ఉండాల్సి వస్తోందని సదరు యంత్రాల యజమానులు, కూలీలు వాపోతున్నారు. వేలాది రూపాయలు ఖర్చులు చేసి దూరం నుంచి వచ్చామని ప్రస్తుతం పని లేక డబ్బు, సమయం రెండు వృథా అవుతున్నాయని బళ్లారికి చెందిన సదరు యంత్రం యజమాని రమేష్ చిక్కగౌడ్ర తన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు తప్పని కడుపు తిప్పలు పస్తులతో గడపాల్సిన దైన్య స్థితులు -
అన్నదాసోహ సేవాకర్త కన్నుమూత
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో శరణ పరంపర, విద్యా క్రాంతి, అన్నదాసోహ సేవాకర్త కలబుర్గి శరణ బసవేశ్వర ఆలయం 8వ పీఠాధిపతి శరణ బసవప్ప అప్ప(90) గురువారం రాత్రి ఇహలోకాన్ని త్యజించారు. గత 10 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయనను గురువారం సాయంత్రం వారి నివాసానికి తీసుకొచ్చారు. ఆయనకు భార్య దాక్షాయణి, ఏడుగురు కుమార్తెలు, 9వ పీఠాధిపతి దొడ్డప్ప అప్ప అనే కుమారుడున్నారు. 1914 నవంబర్ 14న దొడ్డప్ప అప్ప, గోదుతాయి దంపతులకు జన్మించారు. ఆధ్యాత్మిక, ధార్మిక, ధర్మ చింతన, తత్వ జ్ఞానం కలిగి ఉన్నారు. రాజకీయ రంగం నుంచి దూరంగా ఉండడానికి 13వ ఏట షోలాపూర్కు వెళ్లి త్రికాల పూజలో నిమగ్నులయ్యారు. 14వ ఏట ముగుళగాన గవిసిద్ద లింగ శివాచార్యతో ధార్మిక విద్యనభ్యసించారు. ప్రాథమిక విద్యా స్థాయి నుంచి బీఏ వరకు కలబుర్గిలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ధార్వాడ వర్సిటీ నుంచి ఎంఏ పట్టా ధార్వాడ విశ్వవిద్యాలయం నుంచి 1953లో ఎంఏ తత్వజ్ఞానంలో పరిణతి పొందారు. బుద్ధ, బసవ, మహావీర, శరణ, దాస పరంపరను అనుసరించారు. 1972–74 మధ్య కాలంలో హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థలకు అధ్యక్షుడిగా పని చేశారు. 1957లో హావేరి శివప్ప అనూర్ శెట్టి కుమార్తె కోమలను వివాహమాడారు. ఆమెకు డాక్టర్ గంగాబిక, నీలాంబిక, ముక్తాంబిక, ఉమా, గోదావరిలు జన్మించారు. ముక్తాంబిక చిన్న వయసులోనే మరణించింది. కలబుర్గిలోని కేంద్రీయ విశ్వ విద్యాలయంలో పీజీ కోర్సుల ప్రారంబానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భూములను మంజూరు చేయించారు. 1983లో కలబుర్గి శరణ బసవేశ్వర దేవాలయం 8వ పీఠాధిపతిగా శరణ బసవప్ప అప్ప బాధ్యతలు స్వీకరించారు. యాదగిరి జిల్లా సురపురలో ఇంజినీరింగ్ కళాశాల, యాదగిరి, బీదర్, కలబుర్గిలో జూనియర్ కళాశాలలను ప్రారంభించారు. కలబుర్గి శరణ బసవేశ్వర అప్ప దేవాలయాన్ని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సందర్శించారు. సంతాపం ప్రకటించిన మంత్రులు: కలబుర్గి శరణ బసవప్ప అప్ప మరణంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, ప్రియాంక్ ఖర్గే, శరణ బసప్ప దర్శనాపూర్, ఈశ్వర్ ఖండ్రేలు సంతాపం వ్యక్తం చేశారు. కలబుర్గి శరణ బసవప్ప అప్ప అంత్యక్రియలను వీరశైవ లింగాయత విధివిధానాలతో దేవాలయం ముందు భాగంలో జరిపారు. వందలాది మంది స్వామీజీలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కళ్యాణ కర్ణాటకలో విద్యావేత్తగా గుర్తింపు 60కి పైగా విద్యా సంస్థలు నెలకొల్పిన వైనం -
మోకా ఎస్ఐ భార్య ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: తాలూకాలోని మోకా పోలీసు స్టేషన్ ఎస్ఐ కాళింగ భార్య చైత్ర(34) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. ఉదయం మోకాలోని పోలీసు క్వార్టర్స్లోని ఇంట్లో ఆమె తలుపులు వేసుకుని బలవన్మరణానికి పాల్పడడం కలకలం సృష్టించింది. భర్త ఎస్ఐ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కుమారుడితో పాటు పోలీసు స్టేషన్లో మూడు రంగుల జెండాను ఎగరవేశారు. రెండు రోజుల క్రితం తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని వచ్చారు. గత శుక్రవారం ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ కూడా చేయించుకుని సంతోషంగా గడుపుతున్న సమయంలో ఆమె ఉన్నఫళంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్ఐ భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియగానే జిల్లా ఎస్పీ శోభారాణి, ఏఎస్పీ రవికుమార్ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. మోకా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు సంతానం ఉన్నారు. గత రెండేళ్లుగా ఇదే పోలీసు స్టేషన్లో కాళింగ విధులు నిర్వహిస్తున్నారు. మృతురాలు మానసిక వ్యాధితో బాధపడుతుండేవారని సమాచారం. -
ప్రతి మదిలో ఉప్పొంగిన దేశభక్తి
బనశంకరి: స్వాతంత్య్ర దిన వేడుకలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. జాతి నేతల త్యాగాలను స్మరిస్తూ నేతల ప్రసంగాలు ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, మహనీయుల వేషధారణలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరులోని మానెక్షా పరేడ్ మైదానంలో కర్ణాటక పోలీస్ బ్రాండ్ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హరొహళ్లి పాలికె పీయూ కళాశాలకు చెందిన విద్యార్థులు స్వాతంత్య్ర ఘట్టానికి సంబంధించిన వీర కన్నడతి పేరుతో నృత్య రూపకం ప్రదర్శించారు. ఐదు గ్యారంటీ పథకాలకు సంబంధించి విద్యార్థులతో ప్రదర్శనలు ఇప్పించారు. రాజేశ్, నిర్మల డీఆర్బృందం నాడగీతం, రైతుగీతం, డొళ్లుకుణిత తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కలబుర్గి, ధార్వాడ, మైసూరు తదితర నగరాల్లో స్వాతంత్య్ర దిన వేడుకల సంబరాలు మిన్నంటాయి. -
రూ.కోట్లాది నగదు, కేజీల చొప్పున బంగారు లభ్యం
● ఎమ్మెల్యే సతీశ్ సైల్ ఇంట్లో ఈడీ జరిపిన సోదాలతో వెలుగులోకి శివాజీనగర: ఉత్తర కన్నడ జిల్లా కార్వారకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ సైల్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రెండు రోజుల నుంచి ముమ్మర సోదాలు చేపట్టారు. తనిఖీల్లో కోట్లాది రూపాయల నగదు, కేజీల కొద్దీ బంగారం స్వాధీనం చేసుకొన్నారు. ఎమ్మెల్యే సతీశ్ సైల్ ఇల్లు, బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.1.68 కోట్ల నగదు, సుమారు రూ.6,20,45,319 విలువ చేసే 6.75 కేజీల బంగారాన్ని అధికారులు జప్తు చేసుకొన్నారు. చరాస్తి, స్థిరాస్తితో పాటు మొత్తం రూ.14.13 కోట్ల విలువ చేసే ఆస్తిని స్వాధీనం చేసుకొన్నారు. ఈడీ అధికారులు 2 పెట్టెల్లో బంగారు, నగదు, ఆధారాలు తీసుకెళ్లారు. ఈడీ సోదాల సమయంలో ఆర్థికత, దోషారోపణ ఆధారాలు, ఈ–మెయిల్, ఇతర ఆధారాలు లభించాయి. దర్శన్ @7314 యశవంతపుర : రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహర జైలుకు వెళ్లిన నటుడు దర్శన్, పవిత్రాగౌడలకు జైలు అధికారులు నంబర్లు ఇచ్చారు. ఏ1 పవిత్రాగౌడకు–7313, ఏ–2దర్శన్కు 7314 నంబర్లను ఇచ్చారు. ఇదే కేసులోని నిందితులు ప్రదోశ్కు 7317, నాగరాజుకు 7315, లక్ష్మణ్కు 7316 నంబర్ కేటాయించారు. నేడు కుటుంబసభ్యులు భేటీ? దర్శన్, పవిత్రాగౌడ కుటుంబసభ్యులు శనివారం జైలుకు వెళ్లి ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. దర్శన్తో పాటు మరో ముగ్గరిని ఒకే బ్యారక్లో ఉంచారు. పవిత్రాగౌడను క్యారంటైన్లో ఉంచారు. ఆమెను ముఖ్యమైన బ్యారక్లోకి పంపే అవకాశం ఉందని జైలు అధికారులు తెలిపారు. కాగా గురువారం రాత్రి దర్శన్ రాత్రి నిద్రపోలేదు. సహచరులతో కలిసి మాట్లాడుతూ గడిపారు. దుష్ప్రచారకులపై చర్యలు తీసుకోండి మైసూరు : ధర్మస్థలలో మృతదేహాలు పూడ్చి పెట్టారనే కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ వెంటనే మధ్యంతర నివేదికను సమర్పించాలని మైసూరు, కొడగు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మైసూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ధర్మస్థలలో మృతదేహాలను ఖననం చేసినట్లు చెబుతున్న కేసులపై సిట్ దర్యాప్తు జరుపుతోందన్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై మధ్యంతర నివేదిక విడుదల చేయాలన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫాంలు, యూట్యూబర్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
దంచి కొట్టిన వానలు.. జలమయంగా వీధులు
హొసపేటే: నగరంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారుల్లో వర్షం నీరు ఏరులా ప్రవహించింది. గత నాలుగైదు రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం పాఠశాలల నుంచి విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలో వర్షాలు సాయంత్రం 3 గంటల నుంచి ఏకధాటిగా సుమారు ఆరు గంటల పాటు భారీ వర్షం కురియడంతో నగరంలోని ప్రధాన మోర్ రోడ్డు, పవర్ ప్లాజా వద్ద ఉన్న రహదారిలో వర్షం నీరు భారీగా చేరడంతో వాహన సంచారానికి తీవ్ర ఇబ్బంది కలిగింది. ఈ రోడ్లలో మోకాలి లోతున వర్షం నీరు ప్రవహించడంతో కొద్ది సేపటి వరకు వాహనాలు నిలిచి పోయాయి. ఇందిరా నగర్ కాలనీలో వర్షం నీటితో వీధులు జలమయంగా మారడంతో పాటు ఇళ్లలోకి వర్షం నీరు ప్రవహించింది. దీంతో కాలనీ ప్రజలు వర్షం నీటిలోనే గడప వలసి వచ్చింది. జిల్లా క్రీడా మైదానం రహదారిలో కూడా వర్షం నీటితో నిండిపోయింది. నగరంలో చిత్తవాడిగి, నెహ్రు కాలనీ, బసవేశ్వర బడావణె, మృత్యుంజయ నగర్, చప్పరదహళ్లి, అమరావతి, రాజీవ్నగర్, ఎంపీ ప్రకాష్ నగర్, రాణి పేట్, పటేల్ నగర తదితర చోట్ల వర్షం నీరు నిలిచింది. కుండపోత వర్షాలు రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శుక్రవారం కూడా జోరు వాన కురిసింది. పలు జిల్లాల్లో ఎక్కడ చూసినా వంతెనలు నీట మునిగాయి. రాత్రంతా కురిసిన వానతో అక్కడక్కడ వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కలబుర్గి జిల్లా సేడం తాలూకాలో రాత్రి భారీ వర్షం కురవడంతో కాగిణ నదిలో వరద ముంచెత్తింది. వంతెన నీట మునగడంతో వాహన రాకపోకలు పూర్తి స్థాయిలో స్తంభించాయి. రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా మస్కి వద్ద ఉన్న జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో హిరేహళ్లలో నీరు అధికంగా ప్రవహించింది. రైతు హన్మంతప్ప ఎద్దులబండి నీటిలో చిక్కుకుంది. హన్మంతప్పను ప్రజలు రక్షించారు. ఒక ఎద్దు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకోగా మరో ఎద్దుతో పాటు బండి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. పాదచారులకు నరకయాతన వాహన రాకపోకలకు పాట్లు -
ఉదయమే ఉలికిపాటు
బనశంకరి: ఉదయమే నిద్రలేచిన నగరవాసులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా భారీ శబ్ధంతో కూడిన పేలుడు ఉలికిపాటుకు గురి చేసింది. కిలోమీటర్ల మేర వినిపించిన శబ్దానికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో పేలుడు చోటు చేసుకొని బాలుడు మృతి చెందగా, 12 మంది గాయపడిన ఘటన బెంగళూరు నగరంలోని ఆడుగోడి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. విల్సన్గార్డెన్ ఆడుగోడి చిన్నయ్యనపాళ్య, శ్రీరామ కాలనీలో నివాసం ఉంటున్న కస్తూరమ్మ అనే మహిళ ఇంట్లో పేలుడు సంభవించింది. పక్కింటిలో ఉంటున్న ముబారక్(8) అనే బాలుడు మృతి చెందగా కస్తూరమ్మ, సరసమ్మ, సబ్రీనా బాను, సుబ్రమణి, షేక్నజీబ్ ఉల్లా, 8 ఏళ్ల బాలిక ఫాతిమాతో పాటు 12 మంది గాయపడ్డారు. కస్తూరమ్మ కుమార్తె ఖయాల్కు కాలిన గాయాలు కావడంతో వీక్టోరియా ఆస్పత్రికి, మిగిలినవారిని సంజయ్ గాంధీ, జయనగర ఆసుపత్రులకు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటిలో ఇంటిపైకప్పు సమేతంగా ధ్వంసం కాగా మొదటి అంతస్తు పూర్తిగా దెబ్బతింది. 8 ఇళ్లకు పైగా దెబ్బతిన్నాయి. ఆడుగోడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు.బెంగళూరు నగరంలో విస్ఫోటం ఆడుగోడి చిన్నయ్యనపాళ్య పరిధిలోని శ్రీరామ కాలనీలో ఘటన బాలుడు మృతి, 12 మందికి గాయాలు మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి సిద్దరామయ్యపేలుడు ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం సిద్దరామయ్య శ్రీరామ కాలనీలో పేలుడు సంభవించిన ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య, నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్సింగ్ పరిశీలించారు. ఉదయం 7.30 గంటలకు పేలుడు సంభవించిందని, ఇది ఎలా జరిగిందనేది ఘటనాస్థలానికి సుకో టీమ్, ఎఫ్ఎస్ఎల్ బృందాలు చేరుకుని పరిశీలిస్తున్నాయని కమిషనర్ తెలిపారు. పేలుడు జరిగిన ఇంటిలో శకలాలు తొలగించి సాంకేతిక బృందం అందించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపడతామని కమిషనర్ తెలిపారు. సిలెండర్ పేలితే మంటలు వచ్చేవన్నారు. మంటలు రాకున్నా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని, కరెంట్ షాక్తో ఇలా జరిగిందా లేక మెట్రో పనులు ఇక్కడ చేపడుతుండటంతో ప్రమాదం సంభవించిందా? అని తెలియడంలేదని స్దానికులు అనుమానం వ్యక్తం చేశారు.పనులకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డ ప్రజలు శ్రీరామ కాలనీలో చాలా మంది ఉదయం లాల్బాగ్లో పనులకు వెళ్లారు. ఆ సమయంలో పేలుడు జరిగింది. లేని పక్షంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. పేలుడుతో ఆ ప్రాంత నివాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఉదయం 8 గంటలకు భారీ పేలుడు జరిగిందని, పేలుడు జరిగిన ఇంటికి, తమ ఇంటికి నాలుగు అడుగుల దూరం అని, పరిస్థితి భయానకంగా ఉందని స్థానికులు తెలిపారు. -
మహనీయుల త్యాగాలు మరువకూడదు
సాక్షి,బళ్లారి: తెల్లదొరల పాలనను అంతమొందించేందుకు, భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎందరో మహానుభావులు త్యాగ, బలిదానాలు చేశారని, వారిని మనందరం మరవకూడదని రాష్ట్ర పురపాలక, హజ్ శాఖ మంత్రి రహీంఖాన్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని, మూడు రంగుల జెండాను ఎగరవేసిన తర్వాత మాట్లాడారు. నగరంలో బీఎంసీఆర్సీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పోలీసులు, విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రవి అస్తమించని బ్రిటిష్ సామాజ్య్రాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేశారన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ అహింసా నినాదంతో ఎంతో శ్రమించారన్నారు. జవహర్లాల్ నెహ్రు, బాలగంగాధర తిలక్, సర్దార్ వల్లబ్భాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ వంటి మహనీయులు తమ అపారమైన ప్రతిభతో దేశాన్ని ముందుకు నడిపించి బ్రిటిష్ వారిని దేశం విడిచిపెట్టేలా చేశారన్నారు. ఆగస్టు 15వ తేదీ మనందరికి పండుగ రోజు అని అన్నారు. ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, మేయర్ నందీష్, జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా, ఎస్పీ శోభారాణి, ప్రముఖులు ముండ్రిగి నాగరాజు, జే.ఎస్. ఆంజనేయులు పాల్గొన్నారు. అభివృద్ధి దిశగా బళ్లారి బళ్లారి నగరంతో పాటు నగరసభలు, పురసభలు, పట్టణ పంచాయతీలు, అన్ని గ్రామాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయని మంత్రి రహీంఖాన్ తెలిపారు. ఆయన శుక్రవారం నగరంలో స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆకట్టుకున్న స్వాతంత్య్ర దిన వేడుకలు 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలా జరుపుకున్నారు. గవియప్ప సర్కిల్ వద్ద 150 అడుగుల ఎత్తైన స్తంభంలో వెలసిన జెండాను ఎగరవేశారు. జిల్లాధికారి కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి, గాంధీభవన్లోని గాంధీజీ విగ్రహానికి, గాంధీజీ చితాభస్మానికి పూల మాలలు వేసి పూజలు చేశారు. జిల్లాధికారి కార్యాలయ ఆవరణలో జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా జెండా ఎగరవేశారు. జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలో రిహార్సల్స్, నృత్యాలు, దేశభక్తి గీతాలకు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఆర్వైఎంఈసీలో.. నగరంలోని ఆర్వైఎంఈ కళాశాలలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కళాశాల చైర్మన్ జానేకుంటె బసవరాజు, ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి తదితరులు పాల్గొని జెండా ఎగరవేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని కొనియాడారు. ఎస్జీటీలో కళాశాలలో.. బళ్లారి అర్బన్: కేంద్ర సమాచార శాఖ, శ్రీగురు తిప్పేరుద్ర జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆ సంస్థ డైరెక్టర్ మంజుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యా సంస్థ కార్యదర్శి జీ.నాగరాజు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల బలిదాన ఫలితంగా మనకు స్వాతంత్య్రం లభించిందన్నారు. అలాంటి మహానేతలను ఈసందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించి గౌరవించాలన్నారు. సమాచార శాఖ అధికారి రామకృష్ణ, ఎస్జీటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రీనారెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శారద, హైస్కూల్ విభాగం హెచ్ఎం ఇలియాస్, లెక్చరర్లు కృష్ణప్ప, పద్మావతి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర బళ్లారి రూరల్ : క్విట్ ఇండియా ఉద్యమంలో దావణగెరె జిల్లావాసులు ప్రాణత్యాగం చేసిన చరిత్ర దావణగెరెకు ఉందని జిల్లా ఇన్చార్జి, గనులు విజ్ఞాన, ఉద్యానవన శాఖ మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున తెలిపారు.స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా శుక్రవారం దావణగెరెలో జాతీయజెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. 1947 ఆగస్టు 15కు మునుపు నుంచి అనేక మంది సమరయోధుల పోరాటంతో బ్రిటీషు వారి నుంచి స్వాతంత్య్ర సిద్ధించిందన్నారు. మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్, సరోజినీనాయుడు, లాలా లజపతిరాయ్, టిప్పుసుల్తాను, కిత్తూరు రాణిచెన్నమ్మ తదితర అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులను మనం స్మరించుకోవాలన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సమయంలో ఆ ఉద్యమాన్ని బలపరచడానికి దావణగెరెలోను స్థానికులు ఉద్యమం చేశారన్నారు. ఆ సమయంలో హళ్లూరు నాగప్ప, అక్కసాలి విరూపాక్షప్ప, బిదిరికుంతి నింగప్ప, హమాలి తిమ్మణ్ణ, నింగప్ప, మాగానహళ్లి హనుమంతప్ప తదితరులు బ్రిటీషువారి తుపాకీ గుళ్లకు బలయ్యారని తెలిపారు. దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభామల్లికార్జున, జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హొసపేటె: దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీర యోధులందరినీ స్మరించుకోవడం మన ప్రాథమిక కర్తవ్యమని విజయనగర జిల్లా ఇన్చార్జ్, గృహ నిర్మాణ, వక్ఫ్, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి బీ.జెడ్.జమీర్ అహ్మద్ఖాన్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల వల్ల మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. నాడు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన రాష్ట్రపిత మహాత్మాగాంఽధీ, సర్దార్ వల్లబ్భాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్చంద్రబోస్, అబ్దుల్కలాం ఆజాద్, భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి వేలాది మంది ధైర్య యోధులను మనం స్మరించుకోవాలన్నారు. రెండేళ్లకు పైగా సాగుతున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన ఐదు హామీలను ఒకే నెలలో అమలు చేశామని గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు నిర్మించడానికి, ముఖ్యంగా పేదలు, నిరాశ్రయులకు ఇళ్లను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మొత్తం 2,30,000 ఇళ్లను రాబోయే రోజుల్లో దశల వారీగా మంజూరు చేస్తామన్నారు. నిరాశ్రయులకు ఇప్పటికే 36,799 ఇళ్లు అందించామన్నారు. ఇందుకోసం రూ.500 కోట్లు విడుదల చేశామన్నారు. 2026 చివరి నాటికి లబ్ధిదారులకు పూర్తి ఆశ్రయం కల్పించే దిశగా ఈ పథకానికి నిధులు కేటాయిస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారన్నారు. గ్యారెంటీ పథకాలతో పేదలు, మధ్య తరగతికి చాలా లబ్ధి కలిగిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ పథకాలను నిలిపివేయబోమన్నారు. ఈ పథకాలతో ప్రజల ఆర్థికస్థితి మెరుగుపడిందన్నారు. జిల్లాధికారి కార్యాలయంలో.. హొసపేటెలోని జిల్లాధికారి కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాధికారి ఎం.ఎస్.దివాకర్ జాతీయ జెండాను ఎగరవేశారు. జిల్లా పంచాయతీ సీఈఓ నోంగ్జోయ్ మహ్మద్ అక్రమ్ అలీ షా, అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ.బాలకృష్ణప్ప, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, రెవిన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా వారు ఆ శాఖ అధికారులతో కలిసి హొసపేటెలోని జోళదరాశి కొండపై జెండాను ఎగరవేశారు. దేశాభివృద్ధికి కంకణబద్ధులు కావాలి రాయచూరు రూరల్: భారత దేశ ఐక్యతకు, అభివృద్ధికి నేటి యువత కంకణబద్ధులు కావాలని జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ క్రీడాంగణంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగుర వేసి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని మననం చేసుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదలకు ఐదు గ్యారెంటీ పథకాలను అమలు చేశామన్నారు. ప్రజా స్నేహి పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. ఎమ్మెల్యేలు శివరాజ్ పాటిల్, బసనగౌడ దద్దల్, జిల్లాధికారి నితీష్, ఏడీసీ శివప్ప, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ పుట్టమాదయ్య, ఏపీఎంసీ అధ్యక్షులు బసనగౌడలున్నారు. కలబుర్గిలో.. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహానేత మహాత్మ గాంధీజీ అని కలబుర్గి ఇన్చార్జి మంత్రి ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. శుక్రవారం కలబుర్గి సర్దార్ వల్లబ్భాయి పటేల్ క్రీడా మైదానంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. నాడు సాధించిన స్వాతంత్య్రం వల్ల నేడు మనం దానిని రక్షించుకోవడానికి ముందుండాలన్నారు. వెనుక బడిన కళ్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా ఈ ఏడాది రూ.5000 కోట్లుకేటాయిుంచారన్నారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి, రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జే) ఉప కార్యాలయం కలబుర్గిలో ఏర్పాటు చేస్తామన్నారు. శాసన సభ్యులు బీఆర్ పాటిల్, అల్లమ ప్రభు, తిప్పణప్ప, ఖనీజా ఫాతిమాలున్నారు. యాదగిరిలో.. యాదగిరిలోని క్రీడా మైదానంలో గురువారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖ మంత్రి శరణ బసప్ప దర్శనాపుర ధ్వజారోహణ చేసి ప్రారంభించారు. జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ముందుండాలన్నారు. కాంగ్రెస్ సర్కార్లో పేదలకు ఐదు గ్యారెంటీ పథకాలను అమలు చేశామన్నారు. వరదలు ఎక్కువగా ఉన్నందున పరిహారం, ఇతర కార్యక్రమాలను చేపట్టాలన్నారు. చెళ్లకెరెలో.. చెళ్లకెరె రూరల్: ఎందరో మహానుభావుల త్యాగ బలిదానాలతో దేశానికి స్వాతంత్య్రం లభించిందని, అలాంటి మహనీయుల ఆదర్శాలను యువత అలవర్చుకోవాలని హొయ్సళ బ్యాంక్ జనరల్ మేనేజర్ వీరేష్ తెలిపారు. ఆయన శుక్రవారం బ్యాంక్ కార్యాలయం ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. బ్యాంక్ డైరెక్టర్లు సీ.వీరభద్ర బాబు, ఇంజినీర్ రవి, ప్రహ్లాద్, సిద్ధార్థ, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్య్ర ఫలాలను మనందరం అనుభవిస్తున్నాం రాష్ట్ర పురపాలక, హజ్ శాఖ మంత్రి రహీంఖాన్ ఆకట్టుకున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా త్రివర్ణ పతాక రెపరెపలు హుబ్లీ: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. జిల్లా వ్యాప్తంగా దేశభక్తి పరిమళించింది. ప్రధాన కార్యక్రమం ఆర్ఎన్.శెట్టి మైదానంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంతోష్లాడ్ పతాకావిష్కరణ గావించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యాక్రమాల గురించి సమగ్రంగా వివరించారు. అంతకు ముందు వివిధ దళాలచే గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాధికారి దివ్యప్రభు, జిల్లా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలాగే హుబ్లీలోని ప్రముఖ ఈద్గా మైదానంలో పాలికె ఆధ్వర్యంలో పతాకావిష్కరణ గావించారు. మేయర్ వీణా, కమిషనర్ రుద్రప్ప గాళి, డిప్యూటీ మేయర్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈద్గా మైదానంలో తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంకా హుబ్లీలోని నెహ్రూ మైదానంలో కూడా అధికారులు పతాకావిష్కరణ చేశారు. ఇంకా జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు అన్ని విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు తదితరాలతో పాటు దాదాపు అన్ని చోట్ల జాతీయ పతాకాన్ని అక్కడి ఉద్యోగులు ఎగరవేసి ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకొన్నారు. అలాగే స్టేషన్ సమీపంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని దళిత నాయకులు ఆవిష్కరించారు. తాలూకా కేంద్రాలల్లో ఎమ్మెల్యేలు, తహసీల్దార్ తదితరులు పాల్గొని 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ఆచరించారు. మొత్తం మీద సర్వత్రా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత దేశభక్తితో ఉత్సాహంగా ప్రజలు జరుపుకొన్నారు. -
ట్రేడింగ్ పేరిట వంచన
హుబ్లీ: ఫేస్బుక్లో పరిచయమైన మహిళ ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా డబ్బులను సంపాదించవచ్చని ధార్వాడకు చెందిన వ్యక్తిని నమ్మించి ఏకంగా రూ.22 లక్షలు బదలాయించుకొని మోసగించింది. వివరాలు.. ప్రకాష్గౌడ అనే వ్యక్తిని మధుశ్రీ అనే మహిళ మోసగించింది. పరిచయం అయిన ఆ మహిళా ట్రేడింగ్ వ్యవహారం, డబ్బు సంపాదన గురించి వివరించింది. ఈక్రమంలో ముందుగా లాభాలు వచ్చినట్లు నమ్మించి ఆ మేరకు వైసీఎం అనే యాప్లో లాభాలను చూపించి రూ.22 లక్షలను తన ఖాతాలోకి బదలాయించుకొని వంచించినట్లు బాధితుడు సైబర్క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా జేబు దొంగతనానికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన వెలుగు చూసింది. ఉప నగర పోలీస్టేషన్ పరిధిలో మీరజ్నగర్ పెట్రోల్బంకు వద్ద బస్టాప్లో నిలిబడి ఉన్న బస్సు ప్రయాణికుడి వద్ద జేబు దొంగతనానికి ప్రయత్నించిన సెటిల్మెంట్ నివాసి గణేష్(27)ని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వైభవంగా రథోత్సవం రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా కురిడి గుండూరు భీమేష్ తాత రథోత్సవం వైభవంగా జరిగింది. గురువారం రాత్రి వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. భీమేష్ తాతకు ప్రత్యేక పూజలను కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య నెరవేర్చారు. రథోత్సవంలో రాయచూరు, మాన్వి, సింధనూరు, బళ్లారిల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం బళ్లారి రూరల్: జిల్లాలో ప్లాస్టిక్ రహిత నేల, నీరు, పర్యావరణం, పరిసరాల సంరక్షణ ఆవశ్యకమని దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి తెలిపారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో అధికారులకు, రైతులకు పర్యావరణం, పరిసరాల పరిరక్షణపై ఏర్పాటు చేసిన జాగృతి కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గతనెల 18న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, పీడీఓలకు, గ్రామాధికారులకు, రైతు సంఘాలకు, సంఘ సంస్థలతో వెబినార్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిసరాల పరిరక్షణ మహత్తరమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, మొక్కలను పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శబ్ద, వాయు, జల కాలుష్యాలను అరికట్టాలన్నారు. జెడ్పీ సీఈఓ గిత్తెమాధవ విఠలరావ్, అదనపు జిల్లాధికారి శీలవంత శివకుమార్, రైతు ప్రముఖులు బల్లూరు రవికుమార్, వసంత్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యం హొసపేటె: కిర్లోస్కర్ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పని చేసే శ్రీనాథ్ అనే వ్యక్తి పనికి వెళ్లి తిరిగి రాకపోవడంతో మరియమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో వ్యక్తి అదృశ్యం కేసు నమోదైంది. తప్పిపోయిన వ్యక్తి 5.5 అడుగుల ఎత్తు, పలుచని శరీరాకృతి, నలుపు రంగు శరీరఛాయ కలిగి, కుడి చేతిపై ఎస్పీ అనే ఆంగ్ల అక్షరాలను టాటూగా వేయించుకొన్నాడు. అతను బూడిద రంగు ప్యాంట్, నీలం చారల కాటన్ చొక్కా ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, కన్నడలో మాట్లాడగలడని, ఈ వ్యక్తి ఆచూకీ గురించి ఏదైనా సమాచారం ఉంటే మరియమ్మనహళ్లి పోలీస్స్టేషన్ లేదా ఎస్ఐ సెల్: 9480805769కు సమాచారం అందించాలని ఓ ప్రకటనలో కోరారు. ఎయిమ్స్ కోసం కేంద్ర మంత్రితో భేటీ రాయచూరు రూరల్: రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామని వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాన మంత్రికి లేఖ రాశారన్నారు. ప్రజా ప్రతినిధులు జిల్లా నేతలతో కలసి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిపై ఒత్తిడి తెస్తామన్నారు. కలబుర్గి, మైసూరు, బెళగావిలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఒపెక్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలకు చర్యలు చేపట్టామన్నారు. రూ.40 కోట్లతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కన్వెన్షన్ భవనం, రూ.10 కోట్లతో ట్రామా కేర్, క్యాన్సర్ యూనిట్లను ప్రారంభించామన్నారు. లోక్సభ సభ్యుడు కుమార నాయక్, గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్, ఎమ్మెల్సీ వసంత కుమార్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్లున్నారు. ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు హుబ్లీ: నగరంలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి 454 గ్రాముల గంజాయితో పాటు బైకును స్వాధీనం చేసుకొన్నారు. మంటూరు రోడ్డు నివాసి అఽథన్ జుబేద్, సంకేశ్వరకు చెందిన హబీబ్ను అరెస్టు చేసి హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పోలీసుల అదుపులో అక్రమ వలసదారులు
కోలారు: అక్రమ వలసదారులుగా అనుమానిస్తున్న ఇద్దరు బంగ్లాదేశీయులను కోలారు జిల్లా శ్రీనివాసపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ బీ నిఖిల్ స్టేషన్ వెళ్లి పరిశీలన జరిపారు. వీరిద్దరు శ్రీనివాసపురం పట్టణ సమీపంలోని బయలు ప్రదేశంలో షెడ్ వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరితో పాటు ఇంకా నలుగురు పిల్లలు, నలుగురు మహిళలు కలిపి మొత్తం 12 మంది ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని బెంగుళూరులోని డిటెన్షన్ కేంద్రానికి తరలించనున్నారు. వీరు దేశంలోకి ఎప్పుడు చొరబడ్డారు, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు. వీరితో పాటుఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో బల్లి ● 22 మంది విద్యార్థులకు అస్వస్థత హోసూరు: మధ్యాహ్న భోజనంలో బల్లి పడి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బేరికె సమీపంలోని కాటినాయకనదొడ్డి గ్రామంలో జరిగింది. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. గురువారం పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం తింటుండగా ఓ విద్యార్థికి ఆహారంలో బల్లి కనిపించింది. వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. అంతలోపే 22 మందికి పైగా విద్యార్థులు భోజనం చేశారు. విషయం తెలుసుకొన్న ఉపాధ్యాయులు వండిన ఆహారాన్ని పడేశారు. కొద్ది సేపటికే భోజనం తిన్న 22 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వీరిని బేరికె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కవాతులో విద్యార్థులకు అస్వస్థత శివమొగ్గ: శివమొగ్గ నగరంలో నెహ్రూ స్టేడియంలో శుక్రవారం ఉదయం జిల్లా యంత్రాంగం నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ కవాతులో అపశృతి చోటు చేసుకుంది. కవాతు నిర్వహిస్తుండగా ఒక బాలిక, ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ డాక్టర్ ధనంజయ సర్జీ అంబులెన్స్లో బాలికను తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందజేశారు. బాలిక కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని డాక్టర్ ధనుంజయ సర్జీ అన్నారు. మరో ఇద్దరు పిల్లలకు సపర్యలు చేశారు. చాలా సేపు నిశ్చలంగా నిలబడి నీళ్లు తాగకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు. -
హర్ ఘర్ తిరంగా ర్యాలీకి శ్రీకారం
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా జాలహళ్లిలో హర్ ఘర్ తిరంగాకు దేవదుర్గ తాలూకా బీజేపీ అధ్యక్షుడు శరణ బసవ పాటిల్ శ్రీకారం చుట్టారు. గురువారం పార్టీ కార్యాలయం నుంచి బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రజలకు తిరంగా ప్రాముఖ్యత గురించి వివరించారు. హుబ్లీ–రామేశ్వరం రైలు గడువు పొడిగింపు హుబ్లీ: దక్షిణ రైల్వేలోని కార్యాచరణ నిర్బంధాల వల్ల హుబ్లీ–రామేశ్వరం–హుబ్లీ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు సంచారం గడువు విస్తరించడానికి రైల్వే మండలి అనుమతి ఇచ్చిందని నైరుతి రైల్వే పేర్కొంది. అయితే ఈ రైలు రామేశ్వరానికి బదులు రామనాథపురం వరకు మాత్రమే సంచరిస్తుంది. గతంలో ఈనెల 30 వరకు సంచారానికి సూచించినా ఈ రైలును ప్రస్తుతం సెప్టెంబర్ 27 వరకు నాలుగు ట్రిప్పుల మేరకు పొడిగించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత కల్పించండిరాయచూరు రూరల్: నగరంలో స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పించాలని నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో పేర్కొన్నారు. గురువారం నగరసభ కార్యాలయంలో అధ్యక్షురాలు నరసమ్మ అధ్యక్షతన జరిగిన స్వసహాయ మహిళా సంఘాలకు ఏర్పాటు చేసిన సమావేశంలో స్వచ్ఛ భారత్–2 పథకం కింద స్వచ్ఛత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. సహకార సంఘాల ద్వారా ఎంపికై న మహిళలకు గుర్తింపు కార్డులను అందించారు. నగరసభ పరిధిలో బకాయి ఉన్న ఇంటి పన్ను, నీటి పన్ను వసూళ్లలో ముందుండాలన్నారు. స్వచ్ఛతకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ముందుకు రావాలన్నారు. సమావేశంలో సంతోష్ రాణి, జైపాల్, కృష్ణ కట్టిమనిలున్నారు. వైద్య పరీక్ష శిబిరం రాయచూరు రూరల్: నగరంలోని నిజలింగప్ప కాలనీ ఉద్యానవనంలో లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పరిటాల రాము నేతృత్వంలో 80 మంది సీనియర్ సిటిజన్లకు ఉచితంగా వైద్య సేవలందించారు. వైద్యుడు నాగభూషణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో గోవిందరాజులు, గురురాజ్లున్నారు. ఠాణాలో రౌడీ హల్చల్ మైసూరు: తనపై బనాయించిన రౌడీషీట్ను తొలగించాలని మైసూరు నగరంలోని విజయనగర ఠాణాలోనే ఒంటిపై డీజిల్ పోసుకుని రౌడీషీటర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన జరిగింది. మైసూరు బోగాది నివాసి ఎస్.స్వామిపై పలు కేసులు ఉండడంతో విజయనగర పోలీసు స్టేషన్లో రౌడీషీట్ను తెరిచారు. రానున్న గణేష్ పండుగ, దసరా పండుగల నేపథ్యంలో రౌడీషీటర్ల నుంచి హామీ పత్రాలు రాయించుకోవాల్సిన నిబంధనలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. దీంతో ఆగ్రహించిన స్వామి డీజిల్ తీసుకుని ఠాణాకు వచ్చాడు, తనపై ఉన్న రౌడీషీట్ను తీసేయాలని హంగామా చేస్తూ పోలీసుల ఎదుటే ఒంటిపై పోసుకున్నాడు. పోలీసులు అతనిని అడ్డుకున్నారు. ఇలా ప్రవర్తించి పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించాడని స్వామిపై మరో కేసును నమోదు చేశారు. -
డిమాండ్లు పరిష్కరించరూ
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేల చొప్పున వేతనం చెల్లించాలని ఆశా కార్యకర్తల సంఘం జిల్లాధ్యక్షుడు అయ్యాళప్ప డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మానవహారంగా ఆందోళన చేపట్టి మాట్లాడారు. వేతనం, అదనపు ఇన్సెంటివ్ భత్యాలు చెల్లిస్తామని చెప్పి 8 నెలలు గడుస్తున్నా నేటికీ సర్కార్ స్పందించక పోవడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.వెయ్యి పెంచి ఆశా కార్యకర్తలకు పెంచక పోవడాన్ని తప్పుబట్టారు. కేంద్రం ఇచ్చే ఇన్సెంటివ్ భత్యాలు, రాష్ట్ర ప్రభుత్వం అందించే వేతనం, పదవీ విరమణ చేసిన వారికి రూ.50 వేలు పింఛను చెల్లించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. -
యువకుడు దుర్మరణం
గుమ్మఘట్ట: రాయదుర్గం పరిధిలోని గుమ్మఘట్ట మండలంలోని గలగల గ్రామానికి చెందిన హర్షద్ (17) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వివరాల మేరకు.. గ్రామానికి చెందిన హుస్సేన్, షాహినా దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు హర్షద్ ఉన్నారు. కర్ణాటకలోని బట్రళ్లి గ్రామంలో తన మేనమామ దగ్గర టైల్స్ పని నేర్చుకునేందుకు హర్షద్ వెళ్లేవాడు. బుధవారం రాత్రి పని ముగించుకుని స్వగ్రామానికి బైక్లో వస్తూ ఉండగా కోనసాగర వద్ద ఏదో వాహనం ఢీకొని వెళ్లిపోయింది. హర్షద్ తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియచేసి సమీపంలోని రాంపుర ఆసుపత్రికి తరలించారు. ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్కు తరలించగా అక్కడ మరణించాడు. ఒక్కగానొక్క కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. చర్చి పాస్టర్గా బాధ్యతల స్వీకరణ హుబ్లీ: నవనగర్లోని ఈసీఐ చర్చి కొత్త పాస్టర్గా కొప్పళ ఈసీఐ చర్చిలో చాన్నాళ్లుగా పని చేస్తున్న రాయచూరు వాస్తవ్యులు, తెలుగు ప్రముఖులు రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొప్పళలో దైవ సేవలతో పాటు నిర్భాగ్యులు, నిరాశ్రయులకు బైబిల్ బోధనలు అనుసారంగా పరిచర్యలు చేశానన్నారు. హుబ్లీ నవనగర్లో కూడా నిర్భాగ్యులు, నిరాశ్రయుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు, పరిచర్యలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా సమాజంలో పెరిగిపోయిన అసంతృప్తి, యువత చెడుమార్గం పట్టడం పెరిగిపోతున్నాయని, బైబిల్ వ్యాఖ్యల అనుసారంగా అందరినీ శాంతి, సమాధాన బాటలో నడపడానికి కృషి చేస్తానని రవికుమార్ తెలిపారు. వ్యవసాయ పనిముట్ల సంఘానికి ఎన్నికసాక్షి,బళ్లారి: కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ పనిముట్ల డీలర్ల సంఘం రాష్ట్ర కోశాధికారిగా బళ్లారికి చెందిన తిమ్మనగౌడ ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం సంఘం కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లోకికెరె నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు బసవనగౌడ మాలిపాటిల్, ప్రధాన కార్యదర్శి మహంతేష్ తదితర ఆఫీస్ బేరర్లు సమావేశం నిర్వహించి బళ్లారికి చెందిన తిమ్మనగౌడను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రైతుల సమస్యల పరిష్కారానికి తన పరిధిలో ఉన్న అధికారులను ఉపయోగించుకుని రైతులకు మేలు చేస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సౌకర్యాలు కల్పించండిరాయచూరు రూరల్: జిల్లాలోని అంగన్వాడీల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాలూకా, గ్రామ స్థాయిల్లో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాల కొరత అధికంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలన్నారు. 14–18 ఏళ్ల లోపు యువతులకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పౌష్టికాహారం, పోషణ్ ట్రాక్, పోషణ్ అభియాన్ వంటి అంశాలపై పర్యవేక్షణ చేయాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి నవీన్ కుమార్, టీపీ ఈఓ చంద్ర శేఖర్ పవార్, నందిత, బడిగేర, గిరిజా, భాగ్యవతి, పార్వతిలున్నారు. 17న మా మసీదును సందర్శించండిబళ్లారి అర్బన్: నగరంలోని కౌల్బజార్ జాగృతి నగర్లో వెలసిన మసీదులో ఈనెల 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అన్ని మతాల వారికి సందర్శన ఏర్పాటు చేశామని, ఈనేపథ్యంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ చైర్మన్ సౌహిద్బాషా తెలిపారు. ఆయన గురువారం పత్రికా భవన్లో విలేకరులతో మాట్లాడారు. మానవ స్ఫూర్తిని నిలబెట్టేలా సందర్శన, పరస్పర ప్రేమ, సోదర సందేశాన్ని వ్యాప్తింపజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.పురుషులకు, మహిళలకు కూడా సందర్శన ఉంటుందన్నారు. సమాజంలో శాంతి, సౌహార్ధతను కాపాడేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మసీదులో జరిగే ఈ కార్యక్రమానికి సామరస్య ఐక్యత సృష్టించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వచ్ఛందంగా పాల్గొని మతసామరస్యాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో నిసార్ అహమ్మద్, మునీర్ అహమ్మద్, ఇలియాస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాదీ పతాకాలకు ఆదరణ ఏదీ?
హుబ్లీ: ఆగస్టు నెల వచ్చిందంటే చాలు హుబ్లీలోని దేశంలో ఏకై క బీఐఎస్ ప్రామాణీకృత ఖాదీ త్రివర్ణ పతాకాల ఉత్పత్తి కేంద్రంలో రాత్రింబగళ్లు జాతీయ జెండాలను కుట్టే పనిలో మహిళా ఉద్యోగినులు మునిగి పోయే వారు. అయితే ఈ ఏడాది ఆ కళ సందడి కనిపించడం లేదు. కార్మికుల సంఖ్య కూడా తగ్గిపోయింది. జాతీయ పతాకాలను తయారు చేసే హుబ్లీలోని బెంగేరి కర్ణాటక గ్రామోద్యోగ సంయుక్త ఈ ఏడాది తన లాభాల్లో 75 శాతం తగ్గిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతోంది. స్వాతంత్య్ర దినోత్సవం ముందు రోజు సంఘం సుమారు రూ.2.7 కోట్లను గడించేది. అయితే కేవలం రెండు, మూడు రోజులు మిగిలి ఉండగా రూ.49 లక్షలు విలువ చేసే ఆర్డర్లను పొందడం గమనార్హం. 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా పాలిస్టర్ పతాకాలను ఎగరవేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటి నుంచి సంఘం నష్టాలను అనుభవిస్తోంది. పాలిస్టర్ కంపెనీలకు లాభాలు గత రెండేళ్ల నుంచి మార్కెట్లలో గుజరాత్ పాలిస్టర్ కంపెనీలు భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయి. కేంద్రం జాతీయ పతాక నియమావళిని సవరించడంతో వివిధ ప్రభుత్వ కట్టడాలు, సంస్థలు కూడా పాలిస్టర్ పతాకాలను ఎగరవేస్తున్నాయి. ఎక్కువ ఖరీదు చేసే ఖాదీ పతాకాలు సహజంగానే విక్రయాలకు దూరం అయ్యాయి. ఖాతీ పతాకాలు సుదీర్ఘకాలం మన్నిక కలిగి ఉన్నా కూడా వాటి డిమాండ్ కోల్పోతుంది. కేంద్రం జాతీయ పతాక నియమాలను మార్చడమే మన హుబ్లీ సుప్రసిద్ధ జాతీయ పతాక యూనిట్లోని యంత్రాలు కళావిహీనం అవుతున్నాయి. సంఘం ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ఆర్డీపీఆర్ మంత్రి ప్రియాంక్ ఖర్గేకు లేఖ రాసి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల్లో ప్రభుత్వ సంస్థలు ఖాదీ త్రివర్ణ పతాకాలను ఎగరవేసేలా సూచించాలని సంఘం విజ్ఞప్తి చేసిందని హుబ్లీ ఖాదీ సమాఖ్య కార్యదర్శి శివానంద మఠపతి తెలిపారు. ఉద్యోగాల కల్పనకు బ్రేక్ నియమావళిలో మార్పులతో తయారీ కేంద్రంపై ఆధారపడిన కార్యకర్తలపై తీవ్రమైన ప్రభావం చూపిందన్నారు. తమకు తక్కువ ఆర్డర్ ఉన్నందు వల్ల ఈ సారి పలువురికి ఉద్యోగాలు ఇవ్వడానికి సాధ్యం కాలేదు. బెంగేరి జాతీయ పతాక తయారీ కేంద్రంలో మహిళా కార్మికులను మాత్రమే నియమించుకొని ఈ సీజన్లో పలువురికి పని లేదని చెప్పడం ఆవేదన కలిగించే విషయం. ఇలాగే కొనసాగితే సమాఖ్య, ఖాదీని ఆదరించే ప్రయత్నాలకు వెనుకబాటు తప్పదని చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశం ఉన్నా కూడా అనేక ప్రభుత్వ సంస్థలు ఇంకా జాతీయ పండుగలకు ఖాదీ పతాకాలను సిద్ధం చేసుకోలేదు. ఖాదీ పతాకాలను తప్పని సరిగా వాడాలని ప్రభుత్వ సంస్థలకు జీఓ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా ఈ యూనిట్లో జాతీయ పతాకాలతో పాటు ప్రస్తుతం సంచులు ఇతర రెడీమేడ్ దుస్తులు, రగ్గులు వంటి ఖాదీ వస్తువుల తయారీతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. తయారీ కేంద్రానికి 75 శాతం మేర పతనమైన లాభాలు హుబ్లీలోని జాతీయ జెండాల తయారీ యూనిట్ వెలవెల -
దొంగ ఓట్లదారులూ.. దిగిపోండి
సాక్షి,బళ్లారి: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ సర్కార్ దొంగ ఓట్లతో అఽధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. నగరంలోని రాయల్ సర్కిల్ సమీపంలోని గాంధీ భవన్లో మహాత్మాగాంధీజీ ప్రతిమకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత మహాత్మా మీరైనా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ కొవ్వొత్తులతో ర్యాలీ, నిరసన ప్రకటించారు. తర్వాత అక్కడ నుంచి రాయల్ సర్కిల్ వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ చేశారు. ఓట్ల దొంగతనం చేసిన నేతలు తక్షణం తమ అధికారాన్ని వదులుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. నిష్పక్ష పాతంగా ఎన్నికలు జరిపించాలని కేపీసీసీ మీడియా ప్రతినిధి వెంకటేశ్ హెగ్డే డిమాండ్ చేశారు. సమగ్ర తనిఖీ చేసి దొంగ ఓట్లదారులకు తగిన శిక్ష వేయాలన్నారు. నేడు పెద్ద ఎత్తున నిరసన దేశంలో కేంద్రంలో దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని కాపాడాలని, ప్రజాప్రభుత్వానికి గొడ్డలిపెట్టుగా మారిన దొంగ ఓట్లపై తనిఖీ చేయాలనే ఉద్దేశ్యంతో నగరంలోని గవియప్ప సర్కిల్ నుంచి 150 మీటర్ల పొడవైన జాతీయ జెండాను పట్టుకుని నగరంలో ర్యాలీ చేపడతామని, ప్రజాస్వామ్యవాదులందరూ ఏకం కావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రి రహీంఖాన్తో పాటు డీసీసీ నాయకులు, కార్యకర్తలు, నగర వాసులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు హుమయూన్ఖాన్, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్, గ్యారెంటీ సమితి జిల్లాధ్యక్షుడు చిదానందప్ప, డీసీసీ కార్యాధ్యక్షుడు బోయపాటి విష్ణువర్ధన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో వరుసగా మూడు సార్లు బీజేపీకి అధికారం ఓట్ల చౌర్యంతోనే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్డీఏ సర్కార్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనాగ్రహం -
నిరంతర వర్షాలు.. తప్పని తిప్పలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో మూడు గంటల పాటు నిరంతర వర్షాలు కురిశాయి. గురువారం జడి వాన కురిసింది. జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు బురదమయంగా మారాయి. కురిసిన వానలకు రంగ మందిరం వెనుక, జహీరాబాద్ కాలనీలో పెద్ద చెట్లు కూలిపోవడంతో విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూరగాయల మార్కెట్ బురదమయం కావడంతో పాటు నీరు చేరడంతో కాయగూరలు తడిసి పోయాయి. విద్యా భారతి రైల్వే వంతెన కింద వాన నీరు నిలబడడంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. విజయపురలో రాత్రి భారీ వర్షం కురువడంతో దేవర హిప్పరిగి తాలూకా యళవాడ వద్ద వాగు వంతెనపై భారీగా నీరు ప్రవహించగా టెంపో వ్యాను కూడా వరద నీటిలో వాగును దాటడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. బురదమయంగా రోడ్లు చెట్లు కూలి విద్యుత్ కోత -
గడువులోగా పనులు పూర్తి చేయండి
సాక్షి, బళ్లారి: నిర్ణీత గడువులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి రహీంఖాన్ పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో అధికారుల సమక్షంలో ప్రగతి పరిశీలన సమావేశం నిర్వహించారు. నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసం నాలుగో దశలో రూ.65 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఇందులో రూ.31 కోట్లు ఖర్చు కాగా మిగిలిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి నగరాభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు. కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు అధికారులు సమావేశం నిర్వహించుకొని వారికి దిశానిర్ధేశం చేయాలన్నారు. నగరంలో మంజూరైన 104 అభివృద్ధి పనుల్లో 48 ప్రగతిలో ఉన్నాయని, మిగిలిన పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. టెండర్ ప్రక్రియ చూసుకొని సంబంధిత కాంట్రాక్టర్లతో చర్చించాలన్నారు. కాంట్రాక్టర్లను కార్యాలయం చుట్టూ తిప్పుకోకూడదన్నారు. జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ మహానగర పాలికె పరిధిలో అభివృద్ధి పనులతో పాటు మంచినీటి పనులకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. -
పరిశ్రమల స్థాపనతో పురోగతి
హొసపేటె: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రాసెసింగ్ పరిశ్రమలు ప్రారంభిస్తే పురోగతి సాధ్యమని జిల్లాధికారి ఎంఎస్.దివాకర్ అభిప్రాయపడ్డారు. నగరంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రధానమంత్రి చిన్న ఆహార ప్రాసెసింగ్ సంస్థల నియంత్రణ పథకంపై జిల్లా స్థాయి సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. రైతుల తక్కువ భూమిలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. పండించిన పంటను సంరక్షించడంలో ప్రాసెసింగ్ ఒక సవాలుగా మారింది. ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద చిన్న ఆహార ప్రాసెసింగ్ సంస్థల అభివృద్ధికి రైతులకు అవకాశాలు కల్పించారన్నారు. ఈ పథకం కింద 50 శాతం లేదా గరిష్టంగా రూ.15 లక్షల సబ్సిడీ పొందే అవకాశం ఉందన్నారు. రైతులు పండించిన పంటలను ప్రాసెస్ చేయడానికి, వారి స్వంత బ్రాండ్ ద్వారా మార్కెట్కు చేరుకోవడానికి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రైతులు పండించే పంటలకు మంచి బ్రాండింగ్, మార్కెట్ అందించడంలో ప్రాసెసింగ్ ముఖ్యమైందని అన్నారు. జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహ్మద్ అక్రమ్ అలీషా, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ డీటీ మంజునాథ్, కేపీఈసీ అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్ చంద్రకుమార్, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నయీం పాషా, లీడ్ బ్యాంక్ మేనేజర్ కే.వీరేంద్రకుమార్, నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి విజయకుమార్, అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్ మనోహర్గౌడ, హగరి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డైరెక్టర్ శిల్పా తదితరులు పాల్గొన్నారు. -
ధర్మస్థల మీద కుట్ర తగదు
● కోలారులో ఆందోళన కోలారు: ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని నిలిపివేయాలంటూ గురువారం బీజేపీ కార్యకర్తలు, భక్తులు, అభిమానుల వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు భారీ నిరసన నిర్వహించారు. ధర్మస్థలకు, వీరేంద్ర హెగ్డేకు చెడ్డ పేరు తీసుకురావాలని కొందరు కుట్రలు చేస్తున్నారు. భక్తుల మనోభావాలను కించపరిచేలాగా ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి విచారణ చేయించడం సమంజసం కాదన్నారు. దుష్ప్రచారం చేసేవారు విదేశాలు, పాకిస్తాన్ ఏజెంట్లతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని దుయ్యబట్టారు. కలెక్టరేటులో వినతి పత్రం సమర్పించారు. ప్రతిఘటనలో ఎంపీ మల్లేష్బాబు, మాజీ ఎంపీ మునిస్వామి, కెవి శంకరప్ప, ఓం శక్తి చలపతి, సిఎంఆర్ శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు. -
ధర్మస్థలలో మరిన్ని చోట్ల తవ్వకాలు
యశవంతపుర: ధర్మస్థలలో మృతదేహాలను పాతిపెట్టారనే కేసులో ఫిర్యాదుదారు (ముసుగు మనిషి) ఎస్ఐటీ అధికారులకు మరో జాగాను చూపించాడు. ధర్మస్థల కన్యాడి సమీపంలో కొత్త ప్రదేశాన్ని చూపడంతో అక్కడ గురువారం తవ్వకం చేపట్టారు. నేత్రావతి నది పక్కలోని ప్రైవేట్ వ్యక్తుల వక్క తోటలో ఈ ప్రదేశముంది. మరో పక్క అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పాతి పెట్టినట్లు ముసుగుమనిషి చెప్పగా, అక్కడా గాలింపు జరుగుతోంది. పుత్తూరు సబ్ కలెక్టర్ సైల్లా వర్గీస్, సిట్ ఎస్పీ జితేంద్ర కుమార్ దయామ నేతృత్వంలో తవ్వకాలు నిర్వహించినా సాయంత్రం వరకు ఏమీ దొరకలేదు. కీచక అధ్యాపకుడు ● 17 ఏళ్ల విద్యార్థినితో పరారీ దొడ్డబళ్లాపురం: విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ అధ్యాపకుడు కీచకునిగా మారాడు. విద్యార్థినిని ప్రేమపేరుతో మభ్యపెట్టి కిడ్నాప్ చేసి తీసికెళ్లిన అతన్ని దొడ్డ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని కొంగాడియప్ప కళాశాలలో కన్నడ లెక్చరర్గా గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రవీణ్ (45) నిందితుడు. ప్రవీణ్కి 10 ఏళ్ల క్రితం పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో భార్య పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు కాలేజీలోనే చదివే విద్యార్థినితో (17) ప్రేమాయణం సాగించిన ప్రవీణ్ ఆమెను 2వ తేదీన తీసికెళ్లిపోయాడు. ఢిల్లీలో కొన్ని రోజులు ఉండి తరువాత నంజనగూడుకు వచ్చారు. విద్యార్థిని తల్లిదండ్రులు, ప్రవీణ్ భార్య ఫిర్యాదుల మేరకు పోలీసులు గాలించి ప్రవీణ్ని అరెస్టు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. -
గుండెల నిండా జెండా
మండ్య: రోటరీ మండ్య, నెగిలయోగి సమాజ సేవాట్రస్టు తదితర పలు సంఘ సంస్థల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా గురువారం మండ్య నగరంలో బృహత్ త్రివర్ణ ర్యాలీ సాగింది. నగర శక్తి దేవత అయిన శ్రీకాళికాంబ దేవాలయం వద్ద మూడు రంగుల యాత్రను జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి ప్రారంభించారు. ఆలయం నుంచి మొదలైన ర్యాలీలో యువతీ యువకులు, ప్రజలు 790 అడుగుల పొడవైన జెండాను పట్టుకుని భరతమాతకు జైకారాలు కొడుతూ ముందుకు సాగారు. 800 మందికిపైగా విద్యార్థులు, వందలాది ప్రజలు పాల్గొన్నారు. అలాగే బెళగావిలో భారీ ఎత్తున త్రివర్ణ ర్యాలీ జరిగింది. పలుచోట్ల బృహత్ తిరంగా ర్యాలీలు -
బస్టాండులో నగల చోరీ
మైసూరు: బస్సు ఎక్కేటప్పుడు ఓ మహిళ వ్యానిటీ బ్యాగ్లోని రూ.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగలు దోచేశారు. ఈ ఘటన మైసూరు సిటీలోని గ్రామీణ బస్టాండ్లో జరిగింది. నగరంలోని అగ్రహార నివాసి ఎస్జీ వీణా 7న సాయంత్రం సాలిగ్రామలోని తమ పుట్టినింటికని బయల్దేరింది. వరమహాలక్ష్మి పండుగ రోజున పూజ చేసేందుకు 90 గ్రాముల బంగారు నగలను బాక్సులో పెట్టి వ్యానిటీ బ్యాగ్లో ఉంచింది. రూరల్ బస్టాండ్లో రద్దీ తోపులాటలో అలాగే బస్సు ఎక్కింది. తర్వాత బ్యాగ్ చూడగా దాని జిప్ తెరిచి ఉంది, నగల పెట్టె కనబడలేదు. బాధితురాలు వెంటనే లష్కర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు మెడల్స్ బనశంకరి: రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి ఎస్.బదరీనాథ్ రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. పోలీస్శాఖలో ఉత్తమ సేవలు అందించినందుకు ఆయనతో పాటు మొత్తం 20 మంది వివిధ మెడల్స్కు ఎంపికయ్యారు. ఇందులో ముగ్గురు ఫైర్ సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎస్పీ నుంచి పోలీసు కానిస్టేబుల్ వరకూ ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా అవార్డులను ప్రకటించారు. చెరసాలలో ప్రజ్వల్ దిగులు యశవంతపుర: ధనవంత కుటుంబీకునిగా, పార్లమెంటు సభ్యునిగా సకల రాజభోగాలను అనుభవించిన హెచ్డీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో బెంగళూరు పరప్పన జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. ఆ బాధతో అతడు తీవ్ర మనోవ్యాకులతకు గురైనట్లు తెలిసింది. కారాగారంలో ఎవరితోను మాట్లాడటం లేదు. సరిగా తిండి తినడం లేదు. దీంతో రెండు రోజులకు ఒక్కసారి వైద్యులు ఆయనకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ శిక్షే ఫైనల్ కాదు, ఇంకా హైకోర్టు, సుప్రీంకోర్టులున్నాయి. పెరోల్ వచ్చి విడుదల కావచ్చు అని ఊరడించే మాటలు చెబుతున్నారు. బీటెక్ చదివిన ప్రజ్వల్ జైల్లో ఏదైనా సాంకేతిక విభాగంలో పనిచేయాలని వైద్యులు సూచించారు. వ్యవసాయం, లైబ్రరీ నిర్వహణ, బేకరీ, గార్మెంట్స్ పని, జైలు ఫైళ్ల శాఖలో పని చేయడం తదితరాలను సూచించారు. పనిలో మునిగిపోతే బాధను మరిచిపోయి హుషారుగా ఉండవచ్చని తెలిపారు. జాడ లేని ఎమ్మెల్యే సతీష్ యశవంతపుర: అక్రమ గనులు, ఆస్తుల కేసులో కార్వార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ సైల్ ఇంటిపై బుధవారం ఈడీ అధికారులు దాడి చేసిన తరువాత ఆయన ఆచూకీ లేదు. మొబైల్ ఫోన్ స్విచాఫ్ అయి ఎవరికీ అందుబాటులో లేరు. ఈడీ అధికారులు ఇంటిలో సోదాలు చేసి అనేక రికార్డులను సీజ్ చేశారు. ఆయన అజ్ఞాత స్థలంలో ఉన్నట్లు తెలిసింది. ఈడీ అధికారులు కూడా ఆయన కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం వరకు సోదాలు సాగాయి. నకిలీ పసిడితో టోకరా శివమొగ్గ: ఓ వ్యక్తికి నకిలీ బంగారం ఇచ్చి లక్షలాది రూపాయల మేర వంచించిన ఇద్దరిని భద్రావతి తాలూకా హొళెహొన్నూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. డీఎస్పీ నాగరాజ్ మార్గదర్శనంలో ఇన్స్పెక్టర్ శివప్రసాద్, ఎస్ఐ రమేష్ గాలింపు జరిపి శివమొగ్గ తాలూకా హాడోనహళ్లి గ్రామ నివాసి యల్లప్ప(48), కరిబసప్ప(48)లను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.05 లక్షల నగదును స్వాధీనపరచుకున్నారు. నిందితులు బెళగావి జిల్లా రాయభాగ తాలూకా ముగళఖోడకు చెందిన మారుతీ భీమ్శ్రీ అనే డ్రైవర్కు కాల్చేసి తమ వద్ద బంగారం ఉందని, తక్కువ ధరకే ఇస్తామని చెప్పారు. దీంతో మారుతికి ఆశ పుట్టింది. వారిని కలవగా లక్షలాది రూపాయలను తీసుకుని నకిలీ బంగారాన్ని ముట్టజెప్పి పరారయ్యారు. బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు విచారణ చేపట్టారు. -
పుణ్యక్షేత్రాలకు మసి పూయొద్దు
బనశంకరి: రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన ధర్మస్థలలో మృతదేహాల కోసం తవ్వకాల కేసులో గురువారం విధానసభ దద్దరిల్లింది. ధర్మస్థల మీద అసత్య ప్రచారం చేస్తున్న ప్రభుత్వం కూకటి వేళ్లతో కూలిపోతుందని బీజేపీ, జేడీఎస్ నాయకులు శాపాలు పెట్టారు. 69వ నిబంధన కింద చర్చ సాగింది. బీజేపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ మాట్లాడుతూ ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి 10, 15 ఏళ్ల క్రితం ధర్మస్థల లో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పడం ద్వారా పవిత్ర ధర్మక్షేత్రానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అస్థికల కోసం తవ్వకాలంటూ హిందూ ధార్మిక కేంద్రాలపై జరుగుతున్న అసత్య ప్రచారం సహించడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, ప్రజలు ఆవేశం చెంది పోరాటం చేసే స్థితి తీసుకురాకూడదన్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది దర్యాప్తా, హిందూ పుణ్యక్షేత్రంపై జరుగుతున్న కుట్రలో అసత్య ప్రచారంలో కాంగ్రెస్ యూట్యూబర్లు, ఇతర మతస్తుల చేతిలో కీలుబొమ్మగా మారుతోందా అని ధ్వజమెత్తారు. సిట్ దర్యాప్తు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ధర్మస్థలను టార్గెట్ చేయడం సరికాదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మాటలు విని గుంతలు తవ్వే పనిచేస్తున్నారని, ధర్మస్థల పవిత్రతను కాపాడటానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్ని రోజులు ఎన్ని గుంతలు తవ్వారు, ఎన్ని అస్థిపంజరాలు దొరికాయి అనేది చెప్పాలని సునీల్కుమార్ డిమాండ్ చేశారు. 15–16 గుంతలు తవ్వినప్పటికీ ఏమీ లభించలేదని తెలిసింది. ప్రభుత్వం దీనికి ముగింపు పలకాలని కోరారు. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడారు. మంజునాథుని భక్తున్ని: డీసీఎం నేను ఇప్పటికీ ధర్మస్థల మంజునాథస్వామి భక్తున్ని, భక్తునికి– దేవునికి ఉన్న సంబంధానికి మనం భంగం కలిగించరాదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ధర్మస్థల వీరేంద్రహెగ్డే చేసిన సేవలను గౌరవిస్తామని చెప్పారు. దర్యాప్తు జరుగుతోంది: హోంమంత్రి హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ అందిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఆ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు జూన్ 19 సిట్ ను ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించామని తెలిపారు. ఇది పూర్తి కావడానికి కాలపరిమితి ఉంటుందని, సిట్ కు సభలో ఇబ్బందికలిగేలా చర్చ జరపవద్దని సూచించారు. ధర్మస్థలలో తవ్వకాలంటూ అసత్య ప్రచారం మీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది విధానసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల ధ్వజం -
మువ్వన్నెల గజరాజులు
● మైసూరులో స్వచ్ఛత, త్రివర్ణ ర్యాలీ మైసూరు: 79వ స్వాతంత్య్ర దినోత్సవం, ఇంటింటా మువ్వన్నెల జెండా యాత్ర సందర్భంగా గురువారం మైసూరులో మహానగర పాలికె, దసరా గజపడె ఆధ్వర్యంలో స్వచ్ఛతపై జాగృతి జాతా నిర్వహించారు. ఏనుగుల మీద త్రివర్ణ పతాకాలను పట్టుకుని సాగుతూ ఉంటే నగరవాసులు ఆశ్చర్యంగా వీక్షించారు. ప్యాలెస్ కోటె ఆంజనేయ స్వామి గుడి నుంచి బయల్దేరి కేఆర్ ఆస్పత్రి సర్కిల్ వరకు సాగి తిరిగి ప్యాలెస్కు చేరుకున్నాయి. గజపడెతో పాటు పాలికె, అటవీ, పోలీసు సిబ్బంది, ప్రజలు త్రివర్ణ పతాకాలతో పాల్గొన్నారు. -
దర్శన్, పవిత్ర మళ్లీ జైలుకు
తీర్పునకు ముందు పవిత్ర పోస్టు.. నిందితురాలు పవిత్రాగౌడ సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందే సత్యం అన్నింటికంటే శక్తిశాలి, న్యాయం అందిస్తుందని పవిత్రాగౌడ పోస్ట్పెట్టారు. ఈ ప్రపంచంలో అన్నింటి కంటే అధిక శక్తి సత్యానికి ఉంటుంది. ఎంత సమయం తీసుకున్నప్పటికీ న్యాయం ఎప్పుడూ తన దారి చూపుతుందని ప్రస్తావించారు. ఆమె తీర్పు అనుకూలంగా వస్తుందని ఊహించి ఈ పోస్టు పెట్టారని భావిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన బెయిలును రద్దు చేసిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పోరాట ఫలితం ఆగమేఘాలపై నిందితుల అరెస్టు, పరప్పనకు తరలింపు టాప్ హీరోని వీడని రేణుకాస్వామి హత్య కేసు బనశంకరి: క్రైం థ్రిల్లర్ సినిమాలను మించిన మలుపులు ప్రముఖ నటుడు దర్శన్ జీవితంలో జరుగుతున్నాయి. చిత్రదుర్గవాసి రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీప, ఆయన ప్రియురాలు, నటి పవిత్రగౌడ, తదితర 15 మంది నిందితులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వారి బెయిలు రద్దు కావడంతో మళ్లీ చెరసాల దర్శనం ఎదురైంది. గురువారం ఏం జరిగింది? దర్శన్ టీంకి హైకోర్టు ఇచ్చిన బెయిలును సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నటుడు దర్శన్ ను బెంగళూరులో హొసకెరెహళ్లి వద్ద సతీమణి విజయలక్ష్మీ నివాసం ఉండే ప్రెస్టీజ్ సౌత్రిడ్జ్ అపార్టుమెంట్లో గురువారం సాయంత్రం 4 గంటలప్పుడు కామాక్షిపాళ్య, బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు మఫ్టీలో గాలిస్తూ అపార్టుమెంటు వద్దకు వచ్చారు. అపార్టుమెంట్ వద్ద ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోగా, గొడవలు జరగకుండా దర్శన్ను పోలీసులు తీసుకెళ్లారు. దర్శన్ను అన్నపూర్ణేశ్వరినగర పోలీస్స్టేషన్ కు తీసుకెళ్లారు. దర్శన్ తో పాటు 7 మందిని నిర్బంధించారు. దర్శన్ ఆప్తుడు ఏ 14 ప్రదోశ్, ఏ11 నాగరాజు, కారుడ్రైవరు ఏ12 లక్ష్మణ ఉన్నారు. ఏ1 నిందితురాలు పవిత్రాగౌడను ఆర్ఆర్ నగరలోని ఆమె ఇంటిలో అరెస్ట్ చేశారు. తరువాత సాయంత్రం వారిని జడ్జి నివాసంలో ప్రవేశపెట్టగా, ఆ మేరకు ఆదేశాలతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో పోలీసులు సుమారు 4 వేల పేజీలతో చార్జిషీటును ఇదివరకే సమర్పించారు. కొడగు టూర్లో ఉన్న దర్శన్ సుప్రీం తీర్పు వినగానే బెంగళూరుకు వచ్చేశాడని తెలిసింది. అందరూ సమానమే: రమ్యా పోస్ట్ బెయిల్ రద్దుకాగానే నటి రమ్యా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చట్టం ముందు అందరూ సమానం అనే స్పష్టమైన సందేశం వచ్చింది. మన పని మనం చేయాలి. చివరిలో ఆశ, వెలుగు ఉంటుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు, న్యాయం అందరికీ లభిస్తుంది అని రేణుకాస్వామి కుటుంబానికి మద్దతుగా పేర్కొన్నారు. రేణుకాస్వామి హత్య కేసు వివరాలు... 2024 జూన్ 8న చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి బెంగళూరులో పట్టణగెరెలోని ఓ షెడ్డులో హత్య 2024 జూన్ 11న హత్య ఆరోపణలపై దర్శన్, పవిత్రగౌడ, ఇతరులు అరెస్ట్ దర్శన్ స్నేహితురాలు పవిత్రా గౌడకు రేణుకాస్వామి అశ్లీల మెసేజ్లు పంపించడం వల్ల ఆమె ప్రోద్బలంతో దర్శన్, అనుచరులు హత్య చేసినట్లు ఆరోపణ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు నిందితుల తరలింపు ఆ జైల్లో దర్శన్ కు రాచమర్యాదలు కల్పించినట్లు ఆరోపణలు. అక్కడి నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు దర్శన్ తరలింపు వెన్నునొప్పి కారణంతో గతేడాది అక్టోబరు 30 నుంచి 6 వారాల పాటు మధ్యంతర బెయిల్ డిసెంబరులో దర్శన్ తో పాటు ఇతర నిందితులకు హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు ఈ తీర్పును ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది -
వారికి శిక్ష పడాల్సిందే
● రేణుకాస్వామి భార్య సహన బనశంకరి: ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష పడాలని, చట్ట ప్రకారం జరగాలని హత్యకు గురైన రేణుకాస్వామి భార్య సహన డిమాండ్ చేశారు. నటుడు దర్శన్ తో పాటు 7 మందికి సుప్రీంకోర్టు బెయిల్ను రద్దు చేయడం గురించి చిత్రదుర్గలో తన ఇంట్లో సహన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. రేణుకాస్వామి చిన్నాన్న షడక్షరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పు ఇచ్చింది, వారి బెయిలును రద్దు చేయడం హర్షణీయమన్నారు. న్యాయం దక్కింది: తల్లి తమ కుమారుని హత్య కేసులో న్యాయం లభించిందని, చట్టం పై నమ్మకం ఉందని రేణుకాస్వామి తల్లి రత్నమాల అన్నారు. గురువారం తీర్పు వస్తుందని తమకు తెలియదని, మంచి తీర్పు వచ్చిందని, కుమారుని ఆత్మకు శాంతి లభించాలని ఆమె చెప్పారు. ఇంటిదేవునికి అభి షేకం చేయడానికి వెళుతున్నామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుద్వారా నిందితులకు తగిన గుణపాఠం జరిగింది. రేణుకాస్వామి భార్య సహన పిన్న వయస్కురాలు, ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని తల్లి డిమాండ్ చేశారు. -
మంత్రి రాజణ్ణ తొలగింపుపై దుమారం
బనశంకరి: సహకార శాఖ మంత్రి కేఎన్.రాజణ్ణను కేబినెట్ నుంచి తొలగించిన విషయంపై అసెంబ్లీలో ఉభయసభలు దద్దరిల్లాయి. రాజణ్ణను మంత్రి పదవి నుంచి తొలగించడానికి కారణం ఏమిటి? దీనిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభకు సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు శాసనసభలో పట్టుబట్టాయి. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత ప్రభుత్వం సమాధానమిస్తుందని మంత్రి హెచ్కే.పాటిల్ హామీ ఇచ్చి ప్రతిపక్ష సభ్యులను సమాధానపరిచారు. మరో పక్క శాసన మండలిలో మంత్రి కేఎన్.రాజణ్ణ రాజీనామా అంశంపై అధికార, విపక్షాల మధ్య గందరగోళం, వాగ్వాదం చేసుకోవడంతో కొద్దిసేపు సభాపతి సభను వాయిదా వేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే విపక్షనేత ఆర్.అశోక్ మంత్రి రాజణ్ణను మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించారు? దీనిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం సభలో మేం ఈ విషయం ప్రస్తావించగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్కే.పాటిల్ మీడియాలో వచ్చిన విషయాన్ని చర్చించడం సాధ్యం కాదని తెలిపారు. సోమవారం గవర్నర్ కేఎన్.రాజణ్ణను మంత్రివర్గం నుంచి తొలగించిన ఆదేశాలపై సంతకం చేశారు. దీంతో సభకు దీనిపై తెలుసుకునే హక్కు ఉందని ఆర్.అశోక్ ప్రతిపాదించారు. సభకు తెలపడం సర్కారు కర్తవ్యం శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రిని తొలగించడంపై సభకు తెలియజేయడం ప్రభుత్వ కర్తవ్యం. మంత్రిని తొలగించిన విషయం మీడియా ద్వారా తెలుసుకోవాలా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? మమ్మల్ని చీకట్లోకి నెట్టేశారు, తక్షణం సమాధానం ఇవ్వాలన్నారు. మంత్రి రాజణ్ణను ఏ కారణానికి మంత్రివర్గం నుంచి తొలగించారు? అనే దానిపై ప్రభుత్వం కారణం తెలియజేయాలని అశోక్ డిమాండ్ చేశారు. ఈ దశలో అధికార, విపక్ష సభ్యుల మధ్య పరస్పరం వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో స్పీకర్ యూటీ.ఖాదర్ మాట్లాడుతూ అంతర్గత విషయాన్ని చర్చించరాదని తెలపడంతో విపక్ష సభ్యులు సురేశ్కుమార్, సునీల్కుమార్తో పాటు పలువురు సభ్యులు లేచి నిలబడి స్పీకర్ వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని పట్టుబట్టడంతో సభలో మరింత గందరగోళం తలెత్తింది. గందరగోళం మధ్య తన ప్రసంగాన్ని కొనసాగించిన విపక్షనేత ఆర్.అశోక్ మంత్రి రాజణ్ణను మంత్రివర్గం నుంచి తొలగించిన విషయంపై ప్రభుత్వం సోమవారం తెలపాలి కానీ మౌనంగా ఉందని సమాధానం ఇవ్వాలని, ఏ కారణానికి రాజణ్ణను తొలగించారు? నిజం చెప్పినందుకు ఆయనను బలిపశువును చేశారా? అని ప్రశ్నించారు. అది అంతర్గత విషయం కాదు దీనికి మద్దతునిచ్చిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్ర రాహుల్గాందీ బెంగళూరుకు వచ్చి ఓట్ల చోరీకి పాల్పడ్డారని ధర్నా చేపట్టారు. రాజణ్ణను తొలగించిన విషయం అంతరిక విషయం పరిధిలోకి రాదని, ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. విపక్ష సభ్యులు తమ స్థానాల్లో నుంచి లేచి నిలబడి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా కొనసాగించడాన్ని గమనించిన స్పీకర్ ప్రభుత్వ పరంగా సమాధానం ఇవ్వాలని మంత్రి హెచ్కే.పాటిల్కు సూచించారు. స్పీకర్ సూచనతో లేచి నిలబడి మాట్లాడిన మంత్రి హెచ్కే.పాటిల్ ముందు ప్రశ్నోత్తరాల సమయం జరగాలని, అనంతరం మంత్రి రాజణ్ణను మంత్రివర్గం నుంచి తొలగించిన విషయంపై ప్రభుత్వం సమాధానమిస్తుందని తెలిపి విపక్ష సభ్యులను శాంతపరిచే ప్రయత్నం చేశారు. మంత్రి సమాధానం అనంతరం విపక్ష సభ్యులు ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సమాధానం ఇవ్వాలని తెలిపిన అనంతరం సభ కాస్త సద్దుమణగడంతో స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. శాసన మండలి విపక్ష నేత చలవాది నారాయణస్వామి మాట్లాడుతూ మంత్రి కేఎన్.రాజణ్ణను మంత్రి పదవి నుంచి తొలగించడం గురించి రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి సంతకం చేసిన లేఖ చదవడానికి ప్రయత్నించారు. అధికార పార్టీ విప్ అభ్యంతరం దీనికి అధికార పార్టీ విప్ సలీం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన అనంతరం మాట్లాడాలని సభాపతి సూచించారు. ఇది అత్యవసర విషయమని రాజణ్ణను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారు? అని చలవాది ప్రశ్నించారు. దీనికి బీజేపీ సభ్యులైన సీటీ.రవి, రవికుమార్తో పాటు పలువురు మద్దతు పలికారు. విపక్షసభ్యులు వ్యాఖ్యలను వ్యతిరేకించిన అధికార పార్టీ సభ్యుడు రాజణ్ణపై ఎప్పటి నుంచి ప్రేమ పుట్టిందని వ్యంగ్యమాడారు. సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని సభలో గందరగోళం తలెత్తడంతో సభాపతి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభం కాగానే రాజణ్ణను తొలగించిన విషయం మీడియాలో వచ్చిందని, తొలగించడానికి కారణం ఏమిటి, అవినీతిలో నిమగ్నమయ్యారా? అని విపక్ష నేత చలవాది నారాయణస్వామి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి లేదా సభాపక్ష నేత సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. సభాపక్ష నేత సభకు రాలేదని, సభకు హాజరైన అనంతరం ఆయనతో సమాధానం ఇప్పిస్తామని సభాపతి హామీ ఇవ్వడంతో విపక్ష నేతలు సంతృప్తి చెందగా సభాపతి ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. రాజణ్ణ మద్దతుదారుల నిరసన తుమకూరు : కే.ఎన్.రాజణ్ణను మంత్రి పదవి నుంచి తొలగించడంతో అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం మధుగిరిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని దుకాణాలను బంద్ చేయించారు. సీఎం, డీసీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మద్దతుదారులు మాట్లాడుతూ రాజణ్ణను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో దద్దరిల్లిన ఉభయ సభలు సభకు జవాబివ్వాలని విపక్షాల పట్టుసభకు ఆలస్యంగా వచ్చిన సీఎం మంత్రి రాజణ్ణను మంత్రివర్గం నుంచి తొలగించడంపై ప్రభుత్వం సభలో సమాధానం ఇవ్వాలని, తొలగింపునకు కారణం తెలపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన సమయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభలో లేరు. మంగళవారం ఉదయం విధానసౌధ కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య విధానసౌధ మూడో అంతస్తులో గత తన కార్యాలయంలో ఉండి సభకు కాస్త ఆలస్యంగా హాజరయ్యారు. మంత్రి రాజణ్ణ తొలగింపు చర్చ సమయంలో ముఖ్యమంత్రి హాజరు కాలేదు. -
ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం
హుబ్లీ: రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథ పాలకుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గ్రంథాలయాల పితామహుడిగా వాసికెక్కిన ఎస్ఎన్ రంగనాథ్ 133వ జయంతిని పురస్కరించుకొని బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో ప్రధాన కార్యక్రమం నిర్వహించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా, నగర, శాఖా గ్రంథాలయాల్లో ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా నవనగర శివానంద మఠంలోని శాఖ గ్రంథాలయంలో అక్కడి సీనియర్ ఉద్యోగి హిరేమఠ, పలువురు పాఠకులతో కలిసి రంగనాథ్ జయంతి వేడుకలను ఆయన చిత్రపటానికి పూజలు చేసి ఘనంగా జరిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు బెంగళూరు రవీంద్ర కళా క్షేత్రంలో జరిగిన గ్రంథ పాలకుల దినోత్సవంలో పాల్గొన్నారు. -
మీరు దివ్యాంగులు కాదు, దివ్య శక్తివంతులు
బళ్లారిఅర్బన్: మీరు దివ్యమైన శక్తి కలిగిన వారని, మీకు ప్రత్యేకమైన జ్ఞానం, శక్తి ఉన్నాయని, వాటిని వాడుకొని సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా ఎస్పీ శోభారాణి దివ్యాంగులకు సూచించారు. సమర్థనం దివ్యాంగుల సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె దివ్యాంగులకు వివిధ పరికరాలను పంపిణీ చేసి మాట్లాడారు. వీటిని ఉపయోగించుకొని జీవితంలో ఎదగాలన్నారు. మిమ్మల్ని దివ్యాంగులు అని పిలవడానికి తన మనసు ఒప్పుకోవడం లేదన్నారు. జెడ్పీ సీఈఓ మహ్మద్ హ్యారీస్ మాట్లాడుతూ ఎస్పీ పేర్కొన్నట్లుగా మీరెవరూ శక్తి లేని వారు కాదన్నారు. మీలోని ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన శక్తి యుక్తులు ఉన్నాయన్నారు. మీకు ఎవరి సానుభూతి అక్కర లేదన్నారు. అవకాశం లభిస్తే మీ జీవితాలను మీరే తీర్చిదిద్దుకోవడానికి మానసికంగా దృఢంగా ఉన్నారన్నారు. ఎంతో మంది శారీరకంగా బలవంతులు అయినా కూడా సోమరితనంతో కాలహరణం చేస్తుంటారన్నారు. ఈ విషయంలో అలాంటి వారికి మీరే ఆదర్శం అన్నారు. ప్రముఖులు పోలా రాధాకృష్ణ, నితీష్ కటారియా, సంగీత్ శర్మ, రేణుకాదేవి, గౌతమి, దివ్యాంగుల సంక్షేమ అధికారి గోవిందప్ప, శివరాం దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు క్యాబిపర్స్ వీల్చైర్, ఊతకర్రలు, కుర్జీలు, ఊతకర్ర కుర్చీలు తదితర పరికరాలను సమర్థనం సంస్థ పంపిణీ చేసింది. -
కోర్టుకు హాజరైన దర్శన్
యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ఏ–2గా ఉన్న నటుడు దర్శన్, ఏ–1గా ఉన్న నటి పవిత్రాగౌడ మంగళవారం బెంగళూరు నగరంలోని సీసీహెచ్ 63వ కోర్టులో హాజరయ్యారు. విచారించిన కోర్టు కేసును సెప్టెంబర్ 9కి వాయిదా వేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పుట్టస్వామి, రాఘవేంద్ర, నందీశ్, రవిశంకర్, నాగరాజు, లక్ష్మణ్, దీపక్కుమార్లు కోర్టులో హాజరయ్యారు. వినయ్, కార్తీక్, కేశవమూర్తి, నిఖిల్లు గైర్హాజరయ్యారు. వచ్చే వాయిదాకు తప్పని సరిగా అందరూ హాజరు కావాలని న్యాయమూర్తి సూచనలు చేశారు. విచారణ ముగిసిన తర్వాత పవిత్రాగౌడ కోర్టు ఆవరణలోనే వేచి ఉండగా దర్శన్ ఆమె వైపు చూడకుండానే వెళ్లిపోయాడు. దర్శన్ జతలో నటుడు ధన్వీర్ ఉన్నారు. -
అడ్డుగా ఉన్నాడని కడతేర్చారు
దొడ్డబళ్లాపురం: అక్రమ సంబంధం బయట పడటంతో ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ఓ వ్యక్తి తన ప్రియురాలి భర్తను కడతేర్చాడు. ఈ ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా మాచోహళ్లిలో చోటుచేసుకుంది. మాచోహళ్లిలో విజయ్కుమార్(35), ఆశ దంపతులు నివాసం ఉంటున్నారు. విజయ్కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆశ ఆటోడ్రైవర్ ధనంజయ్(35)తో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం తెలిసి విజయ్కుమార్ గొడవ పడగా పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. సర్దిచెప్పి రాజీ చేసి పంపించారు. అయినప్పటికీ ఆశ ధనంజయ్తో సంబంధం కొనసాగించింది. మరో వైపు ధనంజయ్ని చంపేస్తానని విజయ్కుమార్ చెప్పుకుని తిరుగుతుండేవాడు. దీంతో విజయ్కుమార్ని హత్య చేయాలని ధనంజయ స్కెచ్ వేశాడు. పథకం ప్రకారం సోమవారం రాత్రి విజయ్కుమార్ ఇంట్లోంచి బయటకు రాగానే తన గ్యాంగ్తో కలిసి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు మాదనాయకనహళ్లి పోలీసులు నిర్ధారించారు. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి భార్య ఆశను అదుపులోకి తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య -
ఏనుగుతో సెల్ఫీనా.. రూ.25 వేల జరిమానా కట్టు
మైసూరు : ఏనుగునుకు సమీపంలో నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించి గజరాజు దాడిలో గాయపడిన బసవరాజు వ్యక్తికి అటవీ శాఖ అధికారులు రూ.25వేల జరిమానా విధించడంతోపాటు వన్యప్రాణులకు ఇకపై ఇబ్బందులు కలిగించనని హామీ పత్రం రాయించుకున్నారు. చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బండీపుర అరణ్యం నుంచి ఆహారం కోసం రోడ్డుపైకి వచ్చిన ఏనుగు ఓ వాహనంలోని బస్తా నుంచి క్యారెట్ లాక్కుంటుండగా కారులో వచ్చిన బసవరాజు కిందకు దిగి సెల్ఫీ తీసుకుంటుండగా ఏనుగు అతన్ని తరిమివేసి స్వల్పంగా గాయపరిచిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు బసవరాజు అడ్రస్ తెలుసుకొని అతని ఇంటికి వెళ్లి హెచ్చరికలు జారీ చేసి జరిమానా విధించారు. మెట్రో పట్టాలపైకి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం దొడ్డబళ్లాపురం: ఓ వ్యక్తి మెట్రో రైలు పట్టాలపైకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మెజెస్టిక్ మెట్రో రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. 35 ఏళ్ల వయసున్న వ్యక్తి గ్రీన్ లైన్ మెట్రో ప్లాట్ఫార –1లో మెట్రో ట్రైన్ వస్తున్న సమయంలో పట్టాలపై దూకాడు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని తక్షణం ఆస్పత్రికి తరలించారు. తరచూ ఇలాంటి సంఘటనలు మెట్రో స్టేషన్లలో చోటుచేసుకుంటుండంతో బీఎంఆర్సీఎల్ భద్రత కట్టుదిట్టం చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గున్న ఏనుగులకు నామకరణంశివమొగ్గ : శివమొగ్గ తాలుకాలోని సక్రైబెలులో ఉన్న బిడారలోని ఏనుగుల శిబిరంలో మంగళవారం ఏనుగుల దినోత్సవాన్ని అటవీశాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. శిబిరంలోని 23 ఏనుగులను మావటిలు, కాపలాదారులు అందంగా సింగారించి వేడుకలు నిర్వహించారు. ఇటీవల జన్మించిన రెండు ఆడ గున్న ఏనుగులకు నామకరణం చేశారు. ఒకదానికి చాముండి అని, మరో గున్న ఏనుగుకు తుంగ అని నామకరణం చేశారు. ఎన్ఈపీ అమలుపై పిల్ తిరస్కృతి బనశంకరి: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వేసిన పీఐఎల్(పిల్)ను హైకోర్టు తిరస్కరించింది. మంగళవారం జాతీయ విద్యా విధానం పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఎన్ఈపీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం సాధ్యం కాదని తెలుపుతూ ఆ పిల్ను తిరస్కరించింది. -
చెరువులో పడి ఇద్దరు బాలల మృతి
హొసపేటె: తాలూకాలోని బిజకల్ గ్రామ శివార్లలోని చెరువులో పడి ఇద్దరు పిల్లలు మరణించిన విషాద సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. మృతులను గ్రామానికి చెందిన మల్లమ్మ(11), శ్రావణ్కుమార్(8)గా గుర్తించారు. కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వెళ్లిన పిల్లలు ఎవరూ లేని సమయంలో చెరువు వద్దకు వెళ్లారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువు నీటితో నిండింది. ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పిల్లలు నీటిలో పడిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే గాలించి పిల్లలను బయటకు తీసి కుష్టగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుడు డాక్టర్ మనోజ్ వారు అప్పటికే మరణించినట్లు నిర్థారించారు. నీలప్ప తెగ్గినమని, సంగప్ప తెగ్గినమని అనే ఇద్దరు సోదరుల పిల్లల మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఆస్పత్రిని సందర్శించిన అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లోపాలు సవరించండిరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణకు జిస్టిస్ నాగమోహన దాస్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో లోపదోషాలను నివారించి అసెంబ్లీ సమావేశాల్లో జారీకి తీర్మానం చేసుకోవాలని ఎస్సీ వర్గీకరణ చలువాది పోరాట సమితి సంచాలకుడు రవీంద్రనాథ్ పట్టి పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణకు కాంగ్రెస్ సర్కార్ జిస్టిస్ నాగమోహన దాస్ అందించిన నివేదికపై విధానసభ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలన్నారు.రాజీవ్ జ్యోతి సద్భావన యాత్రకు స్వాగతం రాయచూరు రూరల్: నగరంలో సోమవారం రాజీవ్ జ్యోతి సద్భావన యాత్రకు ఘనస్వాగతం లభించింది. బెంగళూరు కేపీసీసీ నుంచి బయలు దేరిన జ్యోతి యాత్రకు రాయచూరులో జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు బసవేశ్వర సర్కిల్ వద్ద స్వాగతం పలికారు. 34వ ఏడాది రాజీవ్ జ్యోతి యాత్ర తమిళనాడులోని పెరంబదూరుకు చేరనుంది. కార్యక్రమంలో నిర్మల, రుద్రప్ప, అరుణ్ తదితరులున్నారు. సర్వోత్తమ సేవా అవార్డులకు ఎంపిక రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో ప్రభుత్వ సేవల్లో కొలువు దీరిన అధికారుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సర్వోత్తమ సేవా అవార్డులను ప్రకటించింది. ప్రజలతో మమేకమై వారి ఈతిబాధలను అర్థం చేసుకొని సేవలందించిన అంశాన్ని గుర్తించి 2025లో అవార్డులకు ఎంపిక చేశారు. రాయచూరు తహసీల్దార్ సురేష్ వర్మ, స్టాటికల్ ఉద్యోగి సంతోష్ నందిన్ని, సిరవార సీడీపీఓ నాగరత్న, జిల్లా ఖజానాలో లెక్కాధికారి వెంకటాచల, మాన్వి ఆయుష్ వైద్యాధికారి రాజేంద్ర, విద్యా శాఖ ఉద్యోగి హనుమంతరాయ, సింధనూరు గ్రంథాలయం ఉద్యోగి యల్లప్ప, మిస్కి ఉద్యోగి గురునాథ్, దేవదుర్గ టీపీ ఎఫ్డీసీ అమీదా బేగం, మాన్వి వ్యవసాయ శాఖాధికారి యంకణ్ణ యాదవ్లకు అవార్డులను అందించారు. ధర్మస్థలపై అపప్రచారం అరికట్టండిరాయచూరు రూరల్: ధర్మస్థలలో సామూహిక కిడ్నాప్, అత్యాచారాలు, హత్యలపై వస్తున్న అపప్రచారాన్ని అరికట్టాలని ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం భక్త బృందం డిమాండ్ చేసింది. మంగళవారం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనలో భక్తులు మాట్లాడారు. దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా ధర్మస్థలలో జరిగిన సామూహిక మరణాలపై న్యాయాంగ శాఖచే విచారణ చేపట్టాలని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అపప్రచారాన్ని నిలపాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. -
ఏటీఎం దోపిడీ దొంగ అరెస్ట్
సాక్షి,బళ్లారి: నగరంలోని కాళమ్మ సర్కిల్ సమీపంలో యాక్సిస్ బ్యాంక్ వద్దనున్న ఏటీఎంలో ఉన్న డబ్బులను దొంగలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారు జామున నగరంలోని కాళమ్మ స్ట్రీట్ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి సీడీఎంను ఓపెన్ చేస్తున్న సందర్భంలో బ్యాంక్ వద్ద డ్యూటీ చేస్తున్న నింగప్ప అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో బ్రూస్పేట్ ఏఎస్ఐ మల్లికార్జున హుటాహుటిన ఏటీఎం వద్దకు చేరుకోవడంతో ఏటీఎంను దొంగలిస్తున్న వ్యక్తిని పట్టుకొని కాసేపు ఇద్దరు తోపులాడుకున్నారు. వెంటనే మరో పోలీస్కు సమాచారం అందించడంతో మల్లికార్జునతో పాటు రాత్రి గస్తీ తిరుగుతున్న అనిల్, సిద్దేశ్ ఏటీఎం వద్దకు చేరుకుని ఏటీఎంను దొంగలిస్తున్న వెంకటేష్ అనే వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేశారు. సదరు దొంగ అనంతపురం నగరంలోని సాయినగర్ వాసి అని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఏటీఎం దొంగను పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ శోభారాణి, డీఎస్పీ నందారెడ్డి అభినందించారు. -
కొనసాగిన వర్షాలు.. లోతట్టులోకి నీరు
హొసపేటె: గత మూడు రోజులుగా నిరంతరం కురుస్తున్న వర్షం కారణంగా నగరంలో రోడ్లపై పెద్దగా ట్రాఫిక్ లేదు. మార్కెట్లు కూడా గందరగోళంగా ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రజలు నిలబడటానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో, బస్సు ఎక్కేటప్పుడు వర్షంలో నిలబడి ఉండటం సర్వసాధారణంగా మారింది. అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు ఏరులా ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టీబీ డ్యాం పీఎల్సీ ప్రభుత్వ పాఠశాలతో పాటు అనేక పాఠశాలల ఆవరణల్లో వర్షం నీరు నిలబడటంతో విద్యార్థులకు కష్టంగా మారింది. వర్షంలో తడిసిన హంపీ ప్రపంచ ప్రఖ్యాత హంపీలో కురిసిన వర్షం హంపీ వైభవాన్ని మరింత పెంచింది. వర్షంలో స్మారక చిహ్నాల దృశ్యాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వర్షపు జల్లుల మధ్య పర్యాటకులు హంపీ స్మారకాలను వీక్షించారు. శ్రీకృష్ణ ఆలయం, పాన్ సుపారీ బజార్, ఉగ్రనరసింహ, విజయవిఠల్ ఆలయ ప్రాంగణంలో నీరు నిలిచింది. వర్షపు నీటిలో స్మారకాల చిత్రాలు మరింత ఆకర్షణగా కనిపిస్తుండటంతో పర్యాటకులు, చూపరుల దృష్టిని ఆకట్టుకుంటోంది. కళ్యాణ కర్ణాటకలో నిరంతర వర్షాలు రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగాయి. ఎక్కడ చూసినా రహదారులు, ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. మూడు రోజుల నుంచి వర్షాలు పడ్డాయి. మంగళవారం తెల్లవారు జామున 2 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు భారీ వర్షం కురిిసింది. మాన్వి, దేవదుర్గ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, పంట పొలాలు జలమయమయ్యాయి. మాన్వి తాలూకా వల్కందిన్ని, ముస్టూరు, ఉప్పరాళ, సంకనూరు గ్రామాలకు సంబంధాలు తెగి పోయాయి. వంతెనలపై నీరు ప్రవహించడంతో ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లడానికి వీలు లేక రాకపోకల సంబంధాలు తెగి పోయాయి. పత్తి, మిరప, వరి, కందులు, పొద్దు తిరుగుడు పంటలు నీటిలో మునిగాయి. రహదారిలో నీరు నిలిచి ప్రజలకు, వాహనాలకు ఇబ్బందులు కలిగాయి. సింధనూరు, మస్కి మధ్య రహదారి కోతకు గురైంది. -
అధ్వానంగా ఏపీఎంసీ మార్కెట్
సాక్షి,బళ్లారి: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉండేందుకు మనం తీసుకునే ఆహారం కూడా దోహదపడుతుంది. ఆహారంలో ప్రతి నిత్యం ప్రతి ఒక్కరూ కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాంటి కూరగాయలు అమ్మే మార్కెట్ అధ్వానంగా ఉండటమే కాకుండా బురదయమంగా మారుతోంది. నగరంలో ఏపీఎంసీ మార్కెట్ అంటే బళ్లారి నగర ప్రజలందరికీ కూరగాయాలు అందించే పెద్ద మార్కెట్టే కాదు, ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకెళ్లి అమ్మకాలు సాగిస్తుంటారు. ఏపీఎంసీకి బళ్లారితో పాటు పొరుగున ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి రైతులు తాము పండించిన కూరగాయలను ఇక్కడికి తీసుకుని వచ్చి అమ్మకాలు సాగిస్తుంటారు. ప్రతి నిత్యం తెల్లవారు జామున 4 గంటల్లోపు పెద్ద ఎత్తున వాహనాల్లో కూరగాయలు, ఆకుకూరలు తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. రైతులు నేరుగా ఇక్కడ దళారులకు కూరగాయల అమ్మకాలు చేస్తుంటారు. చినుకు పడితే చిత్తడే.. పెద్ద కూరగాయల మార్కెట్గా పేరొందిన బళ్లారి ఏపీఎంసీ వర్షం వస్తే చిత్తడిగా తయారవుతోంది. అందులో పందులు, పశువులు కూడా తిరుగుతుండటంతో ఆ బురదలోనే కూరగాయలను, ఆకుకూరలను అమ్ముతుండటంతో గత్యంతరం లేక వాటినే జనం కొనుగోలు చేస్తున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా వారం రోజులకు పైగా బురదలోనే కూరగాయల అమ్మకాలు చేస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి భారీ వర్షాలు అప్పుడప్పుడూ పడుతూనే ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడల్లా బురదలోనే వ్యాపారులు కూరగాయల అమ్మకాలు చేస్తుండటం సర్వసాధారణం. ప్రస్తుతం నాలుగు రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో షరా మామూలుగానే ఏపీఎంసీ బురదమయంగా మారిపోయింది. ఆ బురదలోనే కూరగాయల అమ్మకాలు చేస్తుండటంతో చిన్న చిన్న వ్యాపారులు ఉదయాన్నే ఏపీఎంసీకి వెళ్లి బురదలోనే కూరగాయలు కొనుగోలు చేసుకుంటున్నారు. అభివృద్ధిపై మీనమేషాలు.. ఏపీఎంసీ అధ్వానంగా ఉందని పాలకులకు, అధికారులకు కళ్లకు కట్టినట్లు తెలిసినా అభివృద్ధి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని రైతులు, వ్యాపారులు, వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎంసీ మార్కెట్లో వర్షం వస్తే వారం రోజులకు పైగా బురదలో కూరగాయల అమ్మకాలు చేస్తుండటంతో స్థానికులు పాలకుల తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఏపీఎంసీ మార్కెట్లో నిత్యం పెద్ద ఎత్తున కూరగాయల అమ్మకాలు జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాల నుంచి రైతులు, వ్యాపారులు నేరుగా ఏపీఎంసీకి తీసుకు వచ్చి ఇక్కడ వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. రైతులతో హోల్సేల్గా కొనుగోలు చేసిన వాటిని రీటైల్గా ఇక్కడ వ్యాపారాలు చేస్తుంటారు. రైతులు, వ్యాపారుల నుంచి నగరంలోని చిరు వ్యాపారులు, హోటల్ యజమానులు ఏపీఎంసీకి వచ్చి కొనుగోలు చేయడం పరిపాటి. అయితే వర్షం కారణంగా ఏపీఎంసీ బురదమయంగా మారడంతో బురదలోనే కూరగాయల అమ్మకాలు చేస్తుండటంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వాసులు శాపనార్థాలు.. ఏపీఎంసీలో ఒక్క కూరగాయల అమ్మకాలతో పాటు నిత్యావసర వస్తువులు కూడా ఇక్కడ వ్యాపారాలు చేస్తుంటారు. దీంతో ఏపీఎంసీకి ప్రతి నిత్యం వేలాది మంది జనం వచ్చి ఎవరికి కావాల్సిన వాటిని వారు కొనుగోలు చేసుకుంటున్నారు. పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల అమ్మకాలకు పెట్టింది పేరుగా నిలిచిన ఏపీఎంసీ అస్తవ్యస్తంగా మారడంతో బురదలోనే కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని నగర వాసులు వాపోతున్నారు. ఏపీఎంసీ మార్కెట్తో పాటు వర్షం వస్తే నగరంలో నిత్యం అధిక జన సంచారం కలిగిన కార్యాలయాలు బురదగా మారడంతో జనం బురదలో ద్విచక్ర వాహనాలు, కాలినడకన వెళుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీఎంసీతో పాటు పలు రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల ఆవరణలు కూడా బురదమయంగా మారుతున్నా సంబంధిత అధికారులు, పాలకులు ముందు చూపుతో గట్టి చర్యలు చేపట్టకపోవడంపై నగర వాసులు శాపనార్థాలు పెడుతున్నారు. వర్షం వస్తే బురదమయంగా మారుతున్న వైనం రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు కూడా -
నకిలీ రికార్డులతో ఖాతా మార్పిడి
రాయచూరు రూరల్: నగరంలో నిజమైన అస్తులు కలిగిన వారు ఒక్కసారి నగరసభ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు తమ పేరు మీద ఉన్నాయో, లేదో అని విచారణ జరపాల్సిన పరిస్థితి నగర ప్రజలకు దాపురించింది. మధ్యవర్తులు, అధికారులు ఏకమై నకిలీ రికార్డులతో ఖాతా తయారు చేసి అక్రమంగా ఇతరులకు విక్రయించిన ఘటన నగరంలో వెలుగు చూసింది. సంతోష్ అనే వ్యక్తి స్థలంలో నకిలీ రికార్డులు తయారు చేసి ఇతరులకు విక్రయించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. రాయచూరు, సిరవార, లింగసూగూరు తాలూకాలో ఇలాంటి అక్రమాలు జరిగాయి. ఈ విషయంలో 36 మందిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అక్రమంగా కొనుగోలు చేసిన ఆంజనేయ, సంతోష్ శాన్బాగ్, సబ్ రిజిస్ట్రార్, ఎఫ్డీసీ నారాయణ, రాజు, నగరసభ ఎస్డీసీ నరసింహులు, డీడీ, రైటర్ లోక్నాథ్రెడ్డి, రామప్ప, మారెప్ప, ప్రసాద్, మసూద్ వలి, అక్షయ్ భండారి, మహ్మద్ ముజాహిద్, విద్యా, సురేష్ ఇలా 21 మందిపై కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు ప్రస్తుతం జావిద్, ఎహసాన్ అహ్మద్లను అరెస్ట్ చేిసినట్లు జిల్లాధికారి నితీష్ తెలిపారు. 15 రోజుల్లో పూర్తి నివేదిక అందించాలని ఎస్పీని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ 36 మందిపై కేసు నమోదు -
రాష్ట్రంలో పెరిగిన కుక్క కాటు కేసులు
రారా కృష్ణయ్యాశ్రీకృష్ణజన్మాష్టమి సమీపిస్తుండటంతో వెన్నదొంగ నల్లనయ్య విగ్రహాలు మార్కెట్లో కొలువు దీరాయి. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న విగ్రహాలను బెంగళూరులోని మల్లేశ్వరంలో విక్రయానికి సిద్ధం చేసిన దృశ్యం ● కుక్కకాటుకు ఈ ఏడాది 26 మంది బలి శివాజీనగర: ఢిల్లీలో వీధి కుక్కల బెడదకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రాష్ట్రంలో ఆరోగ్యశాఖ రూపొందించిన నివేదికలోని అంశాలు ఆందోళనకు గురి చేశాయి. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 2.81 లక్షల కుక్క కాటు కేసులు నమోదు కాగా, ఇది గత సంవత్సరం కంటే 37 శాతం అధికమని నివేదిక వెలుగు చూసింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 26 మంది మృతి చెందినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం 2024లో 3.6 లక్షల కుక్క కాటు కేసులు నమోదు కాగా పిచ్చి కుక్క కాటుతో 42 మంది మరణించారు. విజయపుర జిల్లాకు అగ్రస్థానం కుక్క కాటు కేసులకు సంబంధించి విజయపుర జిల్లా 15,527 కుక్క కాటు కేసులతో అగ్రస్థానంలో ఉంది. బెంగళూరు 13,821 కేసులతో రెండో స్థానం, హాసన (13,388), దక్షిణ కన్నడ (12,524) బాగలకోట (12,392) ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి. ధారవాడ, బెళగావి, ఉత్తర కన్నడ, గదగ్ జిల్లాల్లో 7 వేల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. గుంపుగా వచ్చి రక్కేశాయిమండ్య : మండ్య జిల్లా శ్రీరంగపట్టణలో వీధి శునకాలు స్వైర విహారం చేశాయి. ఒలెకుయ్యో వీధిలో నివాసం ఉంటున్న మంజునాథ్ కుమార్తె భవ్య(7), శివు కుమార్తె కీర్తన(8)లు మంగళవారం ఆడుకుంటుండగా గుంపుగా వచ్చిన శునకాలు దాడి చేశాయి. తప్పించుకునేందుకు వీలు లేకుండా చుట్టుముట్టి కడుపు, తల, ముఖం, కళ్లపై ఇష్టానుసారంగా కరిచాయి. చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కుక్కలను తరిమేశారు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. -
జీఎస్టీ నుంచి మినహాయించాలని ధర్నా
రాయచూరు రూరల్: విద్యా శాఖ ఆధీనంలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర సర్కారు ప్రవేశ పెట్టిన జీఎస్టీ నుంచి మినహాయించాలని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల సంఘం అధ్యక్షుడు మనోహర్ మస్కి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. విద్యా రంగంలో వెనుక బడిన కళ్యాణ కర్ణాటక భాగంలోని విద్యా సంస్థలకు ఆరోగ్య బీమా పథకం, ఆర్టీఈ ద్వారా చేర్చుకున్న విద్యార్థుల బకాయి నిధులను విడుదల చేయాలన్నారు. 25 ఏళ్ల నుంచి ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు మైదానాలు సమకూర్చాలని, అగ్నిమాపక కేంద్రం వాహనం వచ్చే విధంగా స్థలం వదలాలని నూతనంగా జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఎన్నికల వేళలో పాఠశాల వాహనాలను వినియోగిస్తున్నందున డీజిల్, డ్రైవర్ భత్యాన్ని చెల్లించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా సీఎంకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో దరూరు బసవరాజ్, కేశవరెడ్డి, రవి, శ్రీనివాస్, థామస్, రజాక్ ఉస్తాద్లున్నారు. రాజణ్ణను కేబినెట్లోకి తీసుకోవాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మంత్రి రాజణ్ణను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని హైదరాబాద్ కర్ణాటక వాల్మీకి నాయక్ సంఘ్ కార్యదర్శి రఘువీర్ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ అధిష్టానం మంత్రివర్గం నుంచి తొలగించడం తగదన్నారు. వాల్మీకి మండలిలో నిధుల గోల్మాల్పై బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్రను తొలగించారని గుర్తు చేశారు. ఎస్టీ వర్గాలపై కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూడడం తగదన్నారు. యాదగిరి జిల్లాలో అధిక శాతం నకిలీ నాయక్(ఎస్టీ) కుల ప్రమాణ పత్రాలు పొందడంపై బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. డిమాండ్లు తీర్చాలని ఆశా కార్యకర్తల ధర్నారాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేల చొప్పున వేతనాలు చెల్లించాలని ఆశా కార్యకర్తల సంఘం జిల్లాధ్యక్షుడు అయ్యాళప్ప డిమాండ్ చేశారు. మంగళవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు ఆందోళనలు కొనసాగించనున్నట్లు తెలిపారు. గతంలో రూ.10 వేలు వేతనం, అదనపు ఇన్సెంటివ్ భత్యాలు చెల్లిస్తామని చెప్పి 8 నెలలు గడుస్తున్నా నేటికీ సర్కార్ స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.వెయ్యి పెంచి ఆశా కార్యకర్తలకు పెంచలేదన్నారు. కేంద్రం ఇచ్చే ఇన్సెంటివ్ భత్యాలు, రాష్ట్ర సర్కార్ రూ.10 వేల వేతనం, పదవీ విరమణ చేసిన వారికి రూ.50 వేలు చెల్లించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. డిమాండ్లు పరిష్కరించకుంటే పోరాటం హొసపేటె: ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల అశాసీ్త్రయ కేడర్, నియామక నియమాలకు తగిన సవరణలు చేయాలనే ప్రధాన డిమాండ్తో సహా ఇతర డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లాధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లా యూనిట్ అధ్యక్షుడు శివానంద విలేకరులకు ఈ విషయాన్ని తెలియజేశారు. 2017 వరకు 1 నుంచి 7 వరకు నియమితులైన ఉపాధ్యాయులను ఉపాధ్యాయులుగా పరిగణించాలని, కొత్త కేడర్, నియామక నియమాలను (1) 2017 తర్వాత నియమించబడిన ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని సంఘం ప్రధాన డిమాండ్ అన్నారు. డిప్యూటీ కమిషనర్, జెడ్పీ సీఈఓ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం పంపుతామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తమ సహనాన్ని కూడా పరీక్షించకూడదని, రాబోయే రోజుల్లో పోరాటం తీవ్రతరం అవుతుందని అన్నారు. జాయింట్ సెక్రటరీ పి.గణేష్, ప్రముఖులు హిరే నాయక్, కుబేర ఆచార్, మల్లయ్య, విజయకుమారి, సిద్దమ్మ, నగేష్, జాకీర్ లోకప్ప తదితరులు పాల్గొన్నారు. -
దివంగత ప్రముఖులకు సంతాపం
బనశంకరి: రాష్ట్ర అధికార కాంగ్రెస్లో ఆకస్మికంగా రాజకీయ సంక్షోభం వంటిది తలెత్తింది. అది కూడా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజునే. సీనియర్ నేత, సహకారశాఖ మంత్రి కేఎన్.రాజణ్ణ సోమవారం మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. విధానసౌధలో మధ్యాహ్నం సీఎం సిద్దరామయ్యకి క్లుప్తంగా రాసిన రాజీనామా లేఖను అందజేశారు. సీఎం ఆమోదం తెలిసినట్లు సమాచారం. పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓట్ల చోరీ వ్యతిరేక పోరాటం గురించి రాజణ్ణ చులనకగా మాట్లాడడమే ఉద్వాసనకు కారణమని తెలుస్తోంది. ప్రముఖ నేతలు, కార్యకర్తలు రాజణ్ణను మంత్రివర్గం, పార్టీ నుంచి బహిష్కరించాలని హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు గతంలో రాజణ్ణ కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ తో పాటు పలువురిపై బహిరంగ విమర్శలు చేశారు. మరో డిప్యూటీ సీఎం పదవిని సృష్టించాలని కోరేవారు. సిద్దరామయ్య ఐదేళ్లూ సీఎం అని ముందు నుంచీ రాజణ్ణ చెబుతూ వచ్చారు. సోమవారం శాసనసభ సమావేశాల ప్రారంభంలో రాజణ్ణ కనబడలేదు. విధానసౌధలో సీఎం సిద్దరామయ్య ఉన్నా కూడా రాజణ్ణ కలవకుండా దూరంగా ఉన్నారు. సిద్దరామయ్య ఆప్తుడైన రాజణ్ణ కు ఈ పరిణామాలలో రక్షణ కరువైంది. మధ్యాహ్నం సిద్దరామయ్యతో చర్చించారు, రాజీనామా చేయాలని హైకమాండ్ చెప్పినట్లు సీఎం తెలిపారు. ఆ మేరకు రాజీనామా పత్రం అందజేయడంతో సిద్దరామయ్య అంగీకరించారు. విధానసభలో రగడ మంత్రి రాజణ్ణ రాజీనామా చేశారనేది విధానసభలో రగడకు కారణమైంది. భోజన విరామం తరువాత సభ సమావేశం కాగానే బీజేపీ పక్షనేత ఆర్.అశోక్ మాట్లాడుతూ టీవీలలో రాజణ్ణ రాజీనామా వార్తలు వస్తున్నాయి, దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన ఆయన మంత్రులు కూర్చునే చోట ఎలా కూర్చుంటారని కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. స్పీకర్ తనకు సీటు కేటాయించారని, నేను కూర్చున్నానని చెప్పడం సరికాదని అన్నారు. మంత్రి కానీ వారు అక్కడ కూర్చోరాదని అశోక్ అన్నారు. మంత్రి హెచ్కే.పాటిల్ మాట్లాడుతూ మీడియాలో వస్తోందని ఇక్కడ చర్చించడం సరికాదని, దీనిపై ముఖ్యమంత్రి సభలో ప్రకటన చేస్తారని తెలిపారు. ఇదొక నిర్లక్ష్య సర్కారు: విపక్షాలు శివాజీనగర: అసెంబ్లీ ఆరంభానికి ముందుగానే బీజేపీ, జేడీఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధానసౌధ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు. ఈ ఆందోళనలో బీజేపీ నాయకులు బీ.వై.విజయేంద్ర, అశోక్, జేడీఎస్ నేత సీ.బీ.సురేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద తొక్కిసలాట, ఎరువుల సరఫరాలో విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. స్టేడియం తొక్కిసలాటకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం, డీసీఎంలే కారణం. ఇదొక నిర్లక్ష్య సర్కారు అని ధ్వజమెత్తారు. తొక్కిసలాట కేసులో అమాయక పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్నారన్నారు. ఈ సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఫోటోల పిచ్చి కోసం తొక్కిసలాట ద్వారా అమాయకులను హత్య చేశారని , దుర్ఘటన జరుగుతుంటే సీఎం దోసెలు తినడానికి వెళ్లారని అశోక్ ఆరోపించారు. శివాజీనగర: రాష్ట్ర విధానసభ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కాగా, నటీమణి బీ.సరోజాదేవి తదితర ఇటీవల మరణించిన పలు రంగాల ప్రముఖులకు సంతాపం తెలిపారు. వారిని స్మరిస్తూ సభాపతి యూ.టీ.ఖాదర్ పేర్లను చదివి ఒక నిమిషం పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. దీంతో పాటుగా పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో బలైనవారు, ఆర్సీబీ జట్టు విజయోత్సవంలో తొక్కిసలాటతో చనిపోయినవారికి, గుజరాత్లో ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనలో మృతులకు సంతాపం తెలిపారు. వీరందరి ఆత్మకు శాంతి కలగాలని కోరారు. సంతాప తీర్మానంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రతిపక్ష నేతలు, మంత్రుల మాట్లాడారు. స్పీకర్ ఆగ్రహం సంతాప తీర్మానంపై సీఎం సిద్దరామయ్య మాట్లాడుతున్న సమయంలో కన్నడ సంస్కృతి మంత్రి శివరాజ తంగడగి పక్కనున్న ఎమ్మెల్యే సీటు వద్ద ముచ్చటిస్తూ ఉన్నారు. ఇది చూసిన సభాపతి ఖాదర్.. సభలో సంతాప కార్యక్రమం జరుగుతోంది. ఇది పవిత్రమైనది, తమరు ఇలా మాట్లాడటం సరికాదు. బయటకు వెళ్లి మాట్లాడాలని కోపంగా అన్నారు. సిద్దరామయ్య సైతం మంత్రి తంగడగికి వచ్చి సీట్లో కూర్చోవాలని సూచించారు. -
తిరంగా అభియాన్తో దేశభక్తి వృద్ధి
బళ్లారి అర్బన్: హర్ ఘర్ తిరంగా అభియాన్ ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తుందని సేవారత్న ప్రశస్తి గ్రహీత, మాజీ సైనికుడు పీ.ప్రహ్లాదనాథరెడ్డి తెలిపారు. తంజావూరులోని దక్షిణ వలయ సాంస్కృతిక కేంద్రం తిప్పేరుద్ర విద్యా సంస్థ, మనుకుల ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా ప్రచారం– 2025 సందర్భంగా సాంస్కృతిక, తోలుబొమ్మలాట ప్రదర్శన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జాతీయ పతాకంలోని మూడు రంగులైన కేసరి, తెలుపు, పచ్చరంగులు త్యాగం, శాంతి, సమృద్ధికి సంకేతమన్నారు. ఏ కులమైనా, మతమైనా ముందుగా మనమందరం భాతీయులమన్న అంశాన్ని మరువరాదన్నారు. జాతీయ పండుగలు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి పండుగలా జెండా పండుగను జరుపుకోవాలని సూచించారు. కళ్యాణస్వామి మఠం కళ్యాణస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ వసతులు ప్రయోజనం పొందే ప్రతి ఒక్క పౌరులు తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం సమర్పించి దేశ భక్తిని చాటాలన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నగర కన్వీనర్ డీకే.నిర్మలక్క, కసాపా మాజీ జిల్లా అధ్యక్షుడు రామకల్మఠ, అధికారి సుందర్ భాస్కర్తో పాటు ఎస్జీటీ సమూహ విద్యా సంస్థల అధ్యక్షుడు ఎస్ఎన్.రుద్రప్ప, ఎస్జీటీ సమూహ సంస్థ కార్యదర్శి జీ.నాగరాజు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదిరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. హర్ ఘర్ తిరంగాకు ఎమ్మెల్యే శ్రీకారం రాయచూరు రూరల్: హర్ ఘర్ తిరంగాకు రాయచూరు నగర ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ శ్రీకారం చుట్టారు. ఆదివారం రాయచూరు నగర శాసన సభ్యుడి కార్యాలయం నుంచి బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీని పచ్చజెండా ఊపి ఆయన ప్రారంభించారు. ప్రజలకు తిరంగా(జాతీయ జెండా) ప్రాధాన్యత గురించి వివరించారు. -
కాయక వర్గ పెన్నిధి నులియ చందయ్య
హొసపేటె: విశ్వగురు బసవణ్ణ వచన ఉద్యమంలో ప్రముఖ దార్శనికుడు, వచన రచయిత నులియ చందయ్య దేశ కాయక వర్గానికి ప్రతినిధిగా నిలిచారని, ప్రగతిశీల మేధావి అని అనంతనాయక్ అభివర్ణించారు. నగరంలోని అమరావతి పర్యాటక మందిరంలో జరిగిన శరణ నులియ చందయ్య జయంతిలో ఆయన మాట్లాడారు. నులియ చంద్రయ్య ఆదర్శాలు మనందరికీ అనుసరణీయమన్నారు. నులియ చందయ్య కేవలం ఒక సమాజానికే పరిమితం కాకుండా ఈ భూమి మొత్తం కాయక మతానికి ప్రతిబింబం అన్నారు. అహింద ఉద్యమ దృక్పథం ఇప్పుడు మనందరికీ గతంలో కంటే చాలా అవసరం. ఆ విషయంలో మనమందరం చురుకుగా ఉండాలని ఆయన అన్నారు. వెనుకబడిన తరగతుల మహాకూటమి నాయకులు గాళి భరమణ్ణ, ఇర్ఫాన్, ముదగల్ గౌడ, సోమశేఖర్, రామచంద్రప్ప, బాణద గణేష్, శివకుమార్, స్లం వెంకటేష్, వీరభద్రప్ప నాయక, సన్న మారప్ప, ప్రమోద్ పుణ్యమూర్తి, చలవాది మహాసభ సన్న మారెప్ప, జయప్ప, జేసీ ఈరన్న, జేసీఈ ఈరన్న గిరీష్, కే.తిమ్మారెడ్డి, గాయకుడు యల్లప్ప భండారి, యాదవ సంఘం నాయకుడు మధుసూదన్, మహిళా నాయకురాలు హులిగెమ్మ, హరూన్ షేక్, ఇంతియాజ్ పాల్గొన్నారు. -
డ్యాం గేటు ఊడి నేటికి ఏడాది పూర్తి
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర డ్యాం 19వ గేటు తెగిపోయి నేటితో ఏడాది పూర్తయింది. డ్యాం 19వ గేటుతో పాటు మిగతా మొత్తం 32 గేట్లను తొలగించి అదే స్థానంలో నూతన గేట్లు ఏర్పాటు చేయాలని జలవనరుల నిపుణుల సమితి సూచించింది. లేకుంటే డ్యాం మొత్తానికే ముప్పు తప్పదని హెచ్చరించారు. తుంగభద్ర డ్యాంకు గేట్లు అమర్చే సమయంలో డ్యాంలోకి ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వలన వరద పోటు ప్రారంభం కావడంతో డ్యాంలో నూతన గేట్ల ఏర్పాటుకు ఆటంకంగా మారింది. కానీ ఈ పనిని డ్యాంలోకి వరద నీటి ప్రవాహం రాక ముందే బోర్డు అధికారులు ప్రారంభించాల్సిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. డ్యాంకు నూతన గేట్ల ఏర్పాటు విషయంలో టెండర్ ప్రక్రియ ఆలస్యం కావడంతో వేసవిలో డ్యాంకు నూతన గేట్ల ఏర్పాటు పనులు జరగలేదు. వరద ప్రారంభంతో నిలిచిన పనులు కానీ బోర్డు అధికారులు నూతన గేట్ల ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నూతన గేట్ల మరమ్మతు పనులు ప్రారంభించి 19వ నూతన గేట్ను తయారు చేసి సిద్ధంగా ఉంచిన సమయంలో వర్షం వల్ల డ్యాంలోకి ఇన్ఫ్లో పెరగడంతో గేట్ ఏర్పాటు పనులు నిలిచి పోయాయి. గుడిలో దేవుడు వరమిస్తే పూజారి వరం ఇవ్వని చందంగా మారింది పరిస్థితి. అత్యాధునిక డిజైన్లతో డ్యాం గేట్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది ఆగస్టులో 19వ నెంబరు గేటు కొట్టుకు పోయింది. ఈ నేపథ్యంలో స్టాప్లాగ్ ఎలిమెంట్స్ను ఏర్పాటు చేశారు. కానీ డ్యాంను పరిశీలించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం మొత్తం 33 గేట్లు మార్చాలని సూచించింది. డ్యాంను పరిశీలించిన కేంద్ర జల సంఘం( సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) బృందం డ్యాం గేట్ల జీవిత కాలం తీరిపోయింది. మరమ్మతులతో కాలయాపన చేయడం సరికాదు. అత్యాధునిక డిజైన్తో 33 గేట్లు కొత్తవి ఏర్పాటు చేయడమే ఉత్తమం అని నివేదిక ఇచ్చింది. అయినా టీబీ డ్యాంకు కొత్త గేట్ల ఏర్పాటులో జాప్యం మొత్తం 33 గేట్లు మార్చాలని నిపుణుల కమిటీ సూచన నెలలు గడిచినా గేట్ల మార్పు దిశగా చర్యలు శూన్యం -
కొంగుబంగారం.. మల్లణ్ణ ఆలయం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో ఆలయాలకు కొదవ లేదు. నదులు, అడవులు, కొండలు, పొదల మధ్య దేవుళ్లు, దేవతలు వెలవడం ఆనవాయితీ. బీదర్ జిల్లా భాల్కి తాలూకా ఖానాపుర వద్ద ప్రకృతి సౌందర్యాల నడుమ వెలసిన శనేశ్వర, గాయముఖ గుప్త లింగేశ్వర, మల్లణ్ణ దేవాలయం అనే మూడు ఆలయాలు ఒకే ప్రాంతంలో ఉండడంతో ప్రజలకు, భక్తులకు దర్శనానికి అనుకూలంగా ఉంది. దేవాలయానికి సమీపంలో 50 అడుగుల లోతు ఉన్న ఆకళబావి పుష్కరణిలో 365 రోజులు నీటితో నిండి ఉంటుంది. మల్లణ్ణ దేవాలయం పక్కనే గాయముఖ గుప్త లింగేశ్వర ఆలయం వద్ద మినీ జలపాతం ఉండడం ఆశ్చర్యంగా భావిస్తున్నారు. సమీపంలోనే ఉన్న శనేశ్వర ఆలయం ప్రకృతి సౌందర్యాలను మరిపిస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. మూడు దేవాలయాల్లో ముగ్గురికి కొబ్బరి, భండారం నైవేద్యంగా సమర్పిస్తారు. పచ్చని చెట్లు, వనాల మధ్య దేవాలయాలుండడంతో శ్రావణ మాసంలో భక్తుల సందడి అధికంగా ఉంది. భక్తులు ప్రకృతి సౌందర్యాల మధ్య తమ ఇష్టదైవాలను భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. దేవాలయాలకు నెలవు కళ్యాణ కర్ణాటక శ్రావణ మాసంలో భారీగా భక్తుల సందడి -
చిన్న కారణానికి ఘర్షణ.. ఒకరి మృతి
హుబ్లీ: జిల్లాలోని కుందగోళ తాలూకా కరబట్టి గ్రామంలో చిన్న కారణంతో రెండు కుటుంబాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన ఒకరు చికిత్స పొందుతూ కేఎంసీ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ ఘటనలో వచ్చిన ఆరోపణలతో ముగ్గురిపై కుందగోళ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సదరు గ్రామానికి చెందిన రుద్రప్ప అవారి(70) హత్యకు గురైన వ్యక్తి. ప్రశాంత అవారి, మల్లికార్జున, దారవ్వలపై కేసు దాఖలైంది. నిందితుడు మల్లికార్జున, ఆయన భార్య మధ్య జరిగిన ఘర్షణ విషయమై జోక్యం చేసుకున్న రుద్రప్పపై ఇటుకతో మల్లికార్జున దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రుద్రప్పకు కుందగోళ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం కేఎంసీలో చేర్పించినా ఫలితం దక్కక రుద్రప్ప మృతి చెందాడు. ఘటనపై కుందగోళ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ధర్మస్థల మిస్టరీపై సమగ్ర విచారణకు వినతి రాయచూరు రూరల్: పవిత్ర క్షేత్రమైన ధర్మస్థలలో సామూహిక కిడ్నాప్, అత్యాచారాలు, హత్యలపై విచారణ జరిపి ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలని ఏఐడీవైఓ డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు చెన్నబసవ మాట్లాడారు. దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా ధర్మస్థల మంజునాథుని క్షేత్రంలో జరిగిన సామూహిక మరణాలపై న్యాయాంగ విచారణ చేపట్టాలన్నారు. రాజకీయ ప్రభావంతో సిట్(ఎస్ఐటీ) అనే దర్యాప్తు సంస్థ కేసును దారి తప్పిస్తోందన్నారు. 400 మందికి పైగా విద్యార్థినులు, మహిళల కిడ్నాప్, అత్యాచారం వంటి నర మేధాలు జరిగిన విషయాన్ని బహిరంగ పరిచిన బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. సౌజన్య కేసును మూసి వేసి నిందితుల పరంగా నిలవడాన్ని తప్పుబట్టారు. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. యువత రక్తదానం చేయాలి రాయచూరు రూరల్ : సమాజంలో ఆపద, అత్యవసర సయమంలో రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాలని నగర శాసనసభ సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. నగరంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం పట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో శ్రీశైల అమరఖేడ, శ్యామణ్ణ, వెంకణ్ణ, కేశవరెడ్డి, రాజణ్ణ, అరుణ, నాగరాజ్లున్నారు. ట్రాక్టర్కు జీపు ఢీకొని బోల్తా మాలూరు: ముందు వెళుతున్న ట్రాక్టర్ను వెనుక నుంచి జీపు ఽఢీకొని బోల్తాపడిన ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న వ్యక్తికి చిన్నపాటి గాయాలైన ఘటన తాలూకాలోని టీకల్ ఫిర్కా చిక్కశివార గేట్ సమీపంలో చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తిని లక్కూరు గ్రామానికి చెందిన మనోజ్గా గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్ సామలబండె గ్రామానికి చెందిన మంజునాథ్కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఘటనలో జీపు నుజ్జయింది. మాలూరు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
ఆరోగ్య శిబిరాల లబ్ధి పొందండి
హొసపేటె: నగరంలోని 12వ వార్డు చిత్తవాడిగిలోని జామియా మసీదు షాదీమహల్ ప్రాంగణంలో ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని సప్తగిరి ఆస్పత్రి అధికారి విశ్వనాథ్ రెడ్డి, డాక్టర్ విక్రమ్, సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వరుణ్, కార్డియాలజిస్ట్ డాక్టర్ నీలేష్, న్యూరాలజిస్ట్ డాక్టర్ షైనేష్ శిబిరంలో పాల్గొన్న దాదాపు 455 మందిని పరీక్షించారు. వారికి కిడ్నీలలో రాళ్లు, గుండె జబ్బులు, న్యూరోపతి, క్యాన్సర్, అనేక ఇతర వ్యాధుల కోసం పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. అవసరమైన వారికి తదుపరి చికిత్సకు సిఫార్సు చేశారు. అంతకు ముందు శిబిరాన్ని హుడా చైర్మన్, అంజుమన్ ఇస్లాం కమిటీ అధ్యక్షుడు హెచ్ఎన్ మహమ్మద్ ఇమాం నియాజీ మాట్లాడుతూ ఆరోగ్య శిబిరాలతో పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు. బీపీఎల్ కార్డు, ఆరోగ్య కార్డు, యశస్విని కార్డుదారులకు ఉచిత పరీక్ష ఉంటుందన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు అస్లాం మాళిగి, ఖాజా హుస్సేన్, వేదికపై నియాజీ, మళగి కాఖా సబా, ఇస్మాయిల్, హఫీజ్సాబ్ హనీఫ్, చిత్తవాడగి జామియా మసీదు కమిటీ మేనేజ్మెంట్ బోర్డు ఆఫీస్ బేరర్లు కెరెనళ్లి నజీర్ అహ్మద్, కోల్కి జాకీర్ హుస్సేన్, మళగి గౌస్, ఆజం, వి.చాంద్ బాషా, అంజుమన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం
రాయచూరు రూరల్: గ్రామాల్లో అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ పేర్కొన్నారు. ఆయన యరగేర, సగమకుంట, బ్రహ్మిదొడ్డి, మామడ దొడ్డి, కొర్తుకుందలో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడానికి పాటుపడతామన్నారు. ప్రతి ఒక్కరూ విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలపై జాగ్రత్త వహించాలన్నారు. హంపీలో పర్యాటకుల సందడి హొసపేటె: ప్రపంచ ప్రఖ్యాత హంపీకి సోమవారం భారీగా పర్యాటకులు తరలివచ్చారు. శని, ఆది, సోమవారాల్లో 50 వేలకు పైగా పర్యాటకులు స్మారకాలను సందర్శించారు. హంపీలోని విరుపాక్షేశ్వరాలయం, ఎదురు బసవణ్ణ ఆలయం, వేరుశేనగ గణపతి, ఆవాల గణపతి, శ్రీకృష్ణ ఆలయం, ఉద్దాన వీరభద్రేశ్వర ఆలయం, బడవిలింగ, ఉగ్రనరసింహ, నెలస్తార శివాలయం, అక్క తంగి రామన్న గుడి, కమల మహల్, హజారరామ దేవస్థానం, మహానవమి దిబ్బ, రాణిస్నాన గృహం, కోట ఆంజనేయ, సరస్వతి ఆలయం, పట్టాభిరామ ఆలయం, మాల్యవంత రఘునాథ ఆలయం, భీమ ద్వారం, గెజ్జల మంటపం, విజయ విఠల ఆలయం, రాతిరథం, సీతాసెరుగు, పురందరదాస మంటపం, విష్ణు మంటపం, కోదండ గోరంబ ఆలయం, కోదండ గోరంబ ఆలయం, కంప భూప మార్గ్, పాన్సుపారీ బజార్ తదితర స్మారకాలను వీక్షించారు. పిడుగుపాటుకు మహిళ దుర్మరణం రాయచూరు రూరల్: గత రెండు రోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో పిడుగుపాటుకు గురై మహిళ దుర్మరణం పాలైన ఘటన యరగేరలో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం రాయచూరు తాలూకా యరగేర వద్ద పొలంలో పనులు చేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుతో భవాని(26) అనే మహిళ అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. -
అల్లుడు.. అత్తకు యముడు
తుమకూరు: జిల్లాతో పాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి అనేకచోట్ల విసిరివేసిన భయానక హత్యాకాండలో మిస్టరీ వీడింది. సొంత అల్లుడే అత్తను అంతమొందించాడని తేలింది. తుమకూరు సిటీ కువెంపు నగరలో నివాసం ఉంటున్న ఆమె అల్లుడు, దంత వైద్యుడు డాక్టర్. ఎస్.రామచంద్రయ్య (47) సూత్రధారి కాగా, ఊర్డిగెరె సమీపంలో కళ్లహళ్ళివాసి సతీష్ కే.ఎన్.(38), కిరణ్ కే.ఎస్. (32) అనే ఇతర నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ అశోక్ మీడియాతో తెలిపారు. ఏం జరిగిందంటే వివరాలు... తుమకూరు తాలూకాలోని బెళ్ళావి గ్రామానికి చెందిన బసవరాజు భార్య లక్ష్మీదేవమ్మ (42) ఈ నెల 3వ తేదీన కూతురి తేజస్వినిని చూడాలని తుమకూరుకు వచ్చింది. ఆ తరువాత ఆమె ఆచూకీ లేదు. కూతురి ఇంటికి వచ్చిన అత్తను అల్లుడు, ఇతర దుండగులు కిడ్నాప్చేశారు. హత్య చేసి సుమారు 10 ముక్కలుగా చేసి చింపుగానహళ్లి పరిసరాలలో పడేశారు. గ్రామస్తుల సమాచారం ఎస్పీ, పోలీసులు గాలింపు జరిపి శరీర భాగాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మిదేవమ్మగా భర్త బసవరాజు, పిల్లలు గుర్తించారు. బంధువులను పిలిచి విచారణ చేసే సమయంలో అల్లుడు, డెంటిస్టు రామచంద్ర కనిపించలేదు. ధర్మస్థలలో అల్లుడు అల్లుడు ధర్మస్థలకు వెళ్లాడు. పోలీసులు అక్కడికే వెళ్లి నిర్బంధించి కొరటిగెరె స్టేషన్కు వచ్చి గట్టిగా విచారించగా జరిగింది వివరించాడు. తన భార్యను చెడుదారిలో తీసుకెళ్లేందుకు ఒత్తిడి చేసిందని, అందుకే హత్య చేశానని చెప్పాడు. శరీరాన్ని ముక్కలు చేసి 10 చోట్ల పడేశామని తెలిపాడు. కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కేసులో ఇంకా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ తెలిపారు. మహిళను హత్య చేసి ముక్కలు చేసిన కేసు.. తన భార్యను చెడుతోవ పట్టిస్తోందని దంతవైద్యుని పగ తుమకూరులో వీడిన మిస్టరీ -
అతి వేగం.. అనర్థం
మండ్య: వేగంగా వచ్చిన బైకు ఎదురుగా వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో బైకిస్టు అక్కడే దుర్మరణం చెందాడు. మండ్య తాలూకాలోని గుడిగెనహళ్ళి వద్ద జరిగింది. హునగనహళ్ళి వాసి గుండ (30), మండ్య వైపునుంచి స్వగ్రామానికి బైకులో అతి వేగంగా వెళ్తున్నాడు. ఘటనాస్థలిలో ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఎగిరి పడి ప్రాణాలు కోల్పోయాడు. బసరాళు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఐటీలో విస్తృత ప్రగతి: సీఎం శివాజీనగర: దేశంలోనే కర్ణాటక అతిపెద్ద స్థాయిలో ఐటీ సాఫ్ట్వేర్ ఎగుమతి చేస్తోందని, మన వాటా 44 శాతమని సీఎం సిద్దరామయ్య చెప్పారు. రాష్ట్ర ఆర్థికతలో సాంకేతిక పరిజ్ఞాన రంగం వాటా వాటా 26 శాతం ఉందని చెప్పారు. సోమవారం ఆయన టెక్ సమ్మిట్ గురించి మాట్లాడుతూ సిలికాన్ సిటీలో 2029 నాటికి ఐటీ రంగాన్ని మరింత విస్తరించి మూడున్నర లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యమన్నారు. 50 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక ప్రగతిని సృష్టిస్తామన్నారు. ఏఐ లోనూ ప్రవంచంలో బెంగళూరు 5వ స్థానంలో ఉందని అన్నారు. విష్ణు అభిమానుల ధర్నా యశవంతపుర: బెంగళూరు కెంగేరి రింగ్రోడ్డులో దివంగత ప్రముఖ నటుడు విష్ణువర్ధన్ సమాధిని నేలమట్టం చేయడంపై అభిమానులు ఆక్రోశానికి గురవుతున్నారు. ఫిలిం చాంబర్ ముందు ఆందోళన చేశారు. కూల్చిన జాగాలోనే సమాధిని నిర్మించాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల కిందట స్థల యజమానులు విష్ణు సమాధిని తొలగించారు. మైసూరులో 2.75 ఎకరాలలో స్మారకం ఉన్నందున బెంగళూరులో మళ్లీ సమాధి అవసరం లేదని చెప్పడం సరికాదని అన్నారు. -
అతి వేగం.. అనర్థం
మండ్య: వేగంగా వచ్చిన బైకు ఎదురుగా వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో బైకిస్టు అక్కడే దుర్మరణం చెందాడు. మండ్య తాలూకాలోని గుడిగెనహళ్ళి వద్ద జరిగింది. హునగనహళ్ళి వాసి గుండ (30), మండ్య వైపునుంచి స్వగ్రామానికి బైకులో అతి వేగంగా వెళ్తున్నాడు. ఘటనాస్థలిలో ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఎగిరి పడి ప్రాణాలు కోల్పోయాడు. బసరాళు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఐటీలో విస్తృత ప్రగతి: సీఎం శివాజీనగర: దేశంలోనే కర్ణాటక అతిపెద్ద స్థాయిలో ఐటీ సాఫ్ట్వేర్ ఎగుమతి చేస్తోందని, మన వాటా 44 శాతమని సీఎం సిద్దరామయ్య చెప్పారు. రాష్ట్ర ఆర్థికతలో సాంకేతిక పరిజ్ఞాన రంగం వాటా వాటా 26 శాతం ఉందని చెప్పారు. సోమవారం ఆయన టెక్ సమ్మిట్ గురించి మాట్లాడుతూ సిలికాన్ సిటీలో 2029 నాటికి ఐటీ రంగాన్ని మరింత విస్తరించి మూడున్నర లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యమన్నారు. 50 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక ప్రగతిని సృష్టిస్తామన్నారు. ఏఐ లోనూ ప్రవంచంలో బెంగళూరు 5వ స్థానంలో ఉందని అన్నారు. విష్ణు అభిమానుల ధర్నా యశవంతపుర: బెంగళూరు కెంగేరి రింగ్రోడ్డులో దివంగత ప్రముఖ నటుడు విష్ణువర్ధన్ సమాధిని నేలమట్టం చేయడంపై అభిమానులు ఆక్రోశానికి గురవుతున్నారు. ఫిలిం చాంబర్ ముందు ఆందోళన చేశారు. కూల్చిన జాగాలోనే సమాధిని నిర్మించాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల కిందట స్థల యజమానులు విష్ణు సమాధిని తొలగించారు. మైసూరులో 2.75 ఎకరాలలో స్మారకం ఉన్నందున బెంగళూరులో మళ్లీ సమాధి అవసరం లేదని చెప్పడం సరికాదని అన్నారు. -
భీమా.. 5,465 కేజీలు
● దసరా ఏనుగుల తూకం ప్రక్రియ ● భీమా అత్యధిక బరువు మైసూరు: దసరా ఉత్సవాల కోసం మైసూరుకు వచ్చిన దసరా ఏనుగులకు సోమవారం బరువు తూచారు. వర్షం పడుతున్నా కూడా అటవీ సిబ్బంది, పోలీసులు ప్యాలెస్ నుంచి ఏనుగులను కేఆర్ సర్కిల్ మీదుగా ధన్వంతరీ రోడ్డులో ఉన్న సాయిరామ్ ఎలక్ట్రికల్ కాటాకు తీసుకెళ్లారు. అక్కడ ఒక్కో గజరాజును బరువు కొలిచారు. 25 ఏళ్ల భీమ పేరుకు తగినట్లుగా ఎక్కువ బరువు తూగింది. కెప్టెన్ అభిమన్యు రెండవ స్థానంలో ఉంది. ఏనుగులు నగర వీధుల్లో వరుసగా వెళ్తుంటే ప్రజలు ఉత్సాహంగా చూశారు. పుష్టిగా ఆహారం పెట్టడం వల్ల దసరా ముగిసేనాటికి ఏనుగుల బరువు కొన్ని వందల కేజీల మేర పెరుగుతుంది. -
బెళగావిలో మరాఠీల ధర్నా
యశవంతపుర: బెళగావి జిల్లాలో కన్నడను అధికార భాషగా అమలు చేయరాదు, మరాఠీకి పెద్దపీట వేయాలని మరాఠా ఏకీకరణ సమితి కార్యకర్తలు సోమవారం ధర్నా చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన సాగించారు. బెళగావితో పాటు ఖానాపుర, నిప్పాణి తాలూకాల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. బెళగావిలో కన్నడ భాషను కాకుండా మరాఠీ భాషనే మాట్లాడాలని డిమాండ్ చేశారు. గొడవలు జరగకుండా పోలీసులు మోహరించారు. జనారణ్యంలో అరుదైన సర్పం కోలారు: అడవులలో మాత్రమే కనిపించే విషపూరిత గ్రీన్ పిట్ వైపర్ పాము కోలారు నగరంలోని ఓ ఇంట్లో కనిపించింది. జయనగరలో ఉన్న ఆగ్రో కార్యాలయం వెనుక ఉన్న ఓ ఇంట్లో పామును చూసిన నివాసితులు స్నేక్ క్యాచర్ నాగరాజ్ను పిలిపించారు. నాగరాజ్ చేరుకుని దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. చెట్ల మీద జీవించే ఈ అరుదైన పాము జనావాసాలలో కనిపించడం అరుదు. కొందరు దీనిని పసరిక పాముగా పొరబడుతారు. త్రికోణాకారంలో తల, నున్నటి దేహం , పెద్ద కళ్లు కలిగిన ఈ పాము రాత్రి సమయాలలో ఎక్కువగా సంచరిస్తుంది. ఈశాన్య భారతదేశంతో పాటు కర్ణాటకలోని పశ్చిమ ఘాట్లలోనూ జీవిస్తుంటుంది. ఇది విషపూరితం కావడం వల్ల కాటేస్తే ప్రమాదమని నిపుణులు తెలిపారు. బయట హోటల్.. లోపల హుక్కా బార్ దొడ్డబళ్లాపురం: అనుమతులు లేకుండా రెస్టారెంట్ పేరుతో నడుపుతున్న హుక్కా బార్పై పోలీసులు దాడి చేసి సీజ్ చేసిన సంఘటన రామనగరలో జరిగింది. రామనగర శివారులో మాదాపుర గేట్ వద్ద బెంగళూరు–మైసూరు రహదారి పక్కన ఫిల్టర్ కెఫె అండ్ కిచెన్ రెస్టారెంట్లో పోలీసులు సోదాలు చేశారు. లోపల హుక్కాబార్ నిర్వహిస్తున్నట్టు తేలింది. కస్టమర్లుగా వెళ్లిన పోలీసులు హుక్కాబార్ను సీజ్ చేసి నిర్వాహకుడు అరుణ్ కుమార్, హుక్కా మేకర్ అరుణాచల్ప్రదేశ్వాసి అనిల్ నజరి, యజమాని హేమంత్లపై కేసు నమోదు చేశారు. 11 హుక్కాలు, పొగాకు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నవంబరులో టెక్ సమ్మిట్ శివాజీనగర: నవంబర్ 18 నుండి 20 వరకు బెంగళూరులో టెక్ సమ్మిట్ జరగనుంది. ఐటీ–బీటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడుతూ ఆసియాలో అతిపెద్ద సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శనగా ఉంటుందన్నారు. బెంగళూరులోని అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రంలో ఈ సమ్మిట్ జరుగుతుంది. దేశ విదేశాల నుంచి ఐటీ, విజ్ఞాన కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు పాల్గొంటారని, 600 మందికి పైగా నిపుణులు ప్రసంగిస్తారని చెప్పారు. నూతన ఆవిష్కారాలతో వందలాది కంపెనీల స్టాళ్లు ఏర్పాటవుతాయని చెప్పారు. -
రద్దీ మార్గంలో సులభ ప్రయాణం
బనశంకరి: బెంగళూరు నగరంలో మెట్రో రైలు ఎల్లో మార్గం సోమవారం నుంచి ఆరంభమైంది. నగరవాసులు సంతోషంతో ప్రయాణించారు. ఆర్వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు ఈ మార్గం సుమారు 19 కిలోమీటర్లకు పైగా ఉంది. ప్రతి 25 నిమిషాలకు ఒకరైలు సంచరిస్తుంది. ఆ మూల నుంచి ఈ మూలకు వెళ్లడానికి సుమారు 35 నిమిషాలు పడుతుంది. 16 మెట్రో స్టేషన్లు ఈ మార్గంలో ఉన్నాయి. రాత్రి 11.15 గంటలకు చివరి సర్వీసు ఉంటుంది. సమయం ఆదా ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటోంది. దీని వల్ల భారీగా సమయం వృథా అవుతోంది. మెట్రో రైలు రాకతో ఈ ఇబ్బందులు తప్పినట్లు ప్రయాణికులు ఆనందం వ్యక్తంచేశారు. కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. జయనగర ఆర్వీ.రోడ్డు నుంచి ఎలక్ట్రానిక్సిటీ కి కేవలం 24 నిమిషాల్లో చేరుకోవచ్చని చెప్పారు. తొలి రోజు భారీ రద్దీ కనిపించింది. బోగీలన్నీ కిటకిటలాడాయి. ఈ మార్గంలో ఎక్కువ రైళ్లను నడపాలని కొందరు నెటిజన్లు కోరారు. మెట్రో అధికారులు స్పందిస్తూ అదనపు బోగీలు రాగానే ట్రిప్పులు పెంచుతామని తెలిపారు. -
కళ్యాణ కర్ణాటకలో కుంభవృష్టి
రాయచూరురూల్: కళ్యాణ కర్ణాటకను కుంభవృష్టి వర్షాలు కుదిపేశాయి. రాయచూరు, యాదగిరి, గుల్బర్గా జిల్లాల్లో శనివారం రాత్రి ప్రారంభమైన వర్షం ఏకధాటిగా ఆదివారం ఉదయం వరకు కురిసింది. దీంతో అనేక జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చొరబడటంతో పేదల ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఇడపనూరు, పుచ్చలదిన్ని, మిడగలదిన్ని, గదార్, యరగేర గ్రామాల మధ్య వంతెనలు నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక గ్రామాలు వరద గుప్పెట చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. చించోళి, విజయపుర మధ్య రహదారిలో నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక గ్రామాల్లో పొలాలు జలావృతం అయ్యాయి. పత్తి, మిరప, పెసలు, కందులు, పొద్దు తిరుగుడు, జొన్న పంటలు నీట మునిగి రైతులు లక్షల రూపాయల మేర నష్టపోయారు. పొంగిపొర్లిన వంకలు, వాగులు ఇడపనూరు, పుచ్చలదిన్నె మధ్య నీట మునిగిన వంతెనలు ఐదు గ్రామాలకు రాకపోకలు బంద్ పంట పొలాలు జలమయం -
వర్షం వచ్చిందా.. వేదవతి వేదన
కణేకల్లు: మండలంలోని వివిధ గ్రామాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వేదవతి– హగిరినదికి వరద పోటెత్తింది. దీంతో కణేకల్లు–మాల్యం మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా ఉరవకొండ–రాయదుర్గం వయా కణేకల్లు మీదుగా నడిచే ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. ఉరవకొండ నుంచి కణేకల్లుకు వచ్చే బస్సులన్నీ మాల్యం గ్రామంలోనే ఆగి, అటు నుంచి అటే ఉరవకొండకు వెళ్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వేదవతి హగిరిపై ఉన్న హెచ్చెల్సీ అక్విడెక్ట్ దుస్థితికి చేరుకోవడంతో హెచ్చెల్సీ అధికారులు వాహనాల రాకపోకలను అనుమతించలేదు. దీంతో ఇన్నాళ్లూ బస్సులన్నీ కణేకల్లు–మాల్యం మార్గంమధ్యలో ఉన్న వేదవతి హగిరి మీదుగా వచ్చి వెళ్లేవి. చిన్నపాటి వర్షానికి వరదనీరు రోడ్డుపైకొస్తుండటంతో బస్సులు, ఇతరాత్రా వాహనాలు వెళ్లలేని పరిస్థితి. హెచ్చెల్సీ అక్విడెక్ట్కు సమానంగా రూ.48 కోట్లతో బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జి పూర్తయ్యే వరకు ప్రయాణికులు కష్టాలను భరించాల్సిందే. వంతెన పనులను వేగవంతం చేసి త్వరగా ముగించాలని ప్రజలు కోరుతున్నారు. పొంగిప్రవహిస్తున్న వేదవతి–హగరి నది కణేకల్లు–ఉరవకొండకు మళ్లీ రాకపోకల బంద్ -
కొనసాగుతున్న ఆరాధనోత్సవాలు
రాయచూరు రూరల్ : మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వాముల మఠంలో స్వామివారి ఆరాధనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పూర్వారాధనలో భాగంగా మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీ పాదంగల్ రాఘవేంద్రస్వామి బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం తమిళనాడులోని రంగనాథ ఆలయం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలను గురురాఘవులకు సమర్పించారు. రాఘవేంద్ర మూలవిరాట్కు ఊంజల్ సేవలు నిర్వహించారు. స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించారు. రాష్ట్ర చిన్న నీటి పారుదుల శాఖ మంత్రి బోసురాజ్ పాల్గొన్నారు. బళ్లారిలో... సాక్షి బళ్లారి: బళ్లారి బళానగరంలోని శ్రీసత్యనారాయణపేటలో వెలిసిన శ్రీగురు రాఘవేంద్రస్వామి ఆలయంలో మంత్రాలయం శ్రీగురు రాఘవేంద్ర 354వ ఆరాధన మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం ఆలయ కమిటి ఆధ్వర్యంలో స్వామివారి బృందావనానికి పంచామృత అభిషేకం, పూలాభిషేకం, కనకాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ముఖ ద్వారం నుంచి లోపల వరకు ప్రత్యేక పూలతో అలంకరణ చేయడంతో ఆలయం శోభాయమానంగా రూపుదిద్దుకుంది. ఆలయం లోపల స్వామి సన్నిధికి ఏర్పాటు చేసిన ప్రత్యేక పూల అలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకోంది. -
ఉత్సాహంగా10కే రన్
సాక్షి,బళ్లారి: నగరంలో మోకా రోడ్డులోని కేఆర్ఎస్ ఫంక్షన్ హాల్ నుంచి బీసీఆర్ఎఫ్సీ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10కే రన్ ఉత్సాహంగా సాగింది. వారం రోజులు క్రితం ఏర్పాటు చేసిన పరుగు కార్యక్రమంలో సభ్యులు, ప్రముఖులు వాలంటీర్లుగా వ్యవహరించిన నేపథ్యంలో అందులో పాల్గొనలేకపోయారు. వారి కోసం 5 కిలోమీటర్లు,10 కిలోమీటర్ల రన్ చేపట్టారు. విక్రం అనే వ్యక్తి 21 కిలోమీటర్ల రన్నింగ్తో పాటు 5 కిలోమీటర్ల సైక్లింగ్ విభాగంలో సత్తా చాటాడు. మిగిలిన సభ్యులందరూ 5,10 కిలోమీటర్ల రన్నింగ్లో పాల్గొన్నారు. బీసీఆర్ఎఫ్ సభ్యలు సోమనాథ్, చంద్రశేఖర్, తిప్పారెడ్డి, గిరీష్కుమార్ గౌడ పాల్గొన్నారు. జీఎస్టీ నుంచి మినహాయించాలి రాయచూరు రూరల్: విద్యాశాఖ అధీనంలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను జీఎస్టీ నుంచి మినహాయించాలని ప్రైవేటు పాఠశాలలు, కళాశాల సంఘం అధ్యక్షుడు మనోహర్ మస్కి డిమాండ్ చేశారు. అదివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. విద్యారంగంలో వెనుక బడిన కళ్యాణ కర్ణాటక భాగంలోని విద్య సంస్థలకు అరోగ్య బీమా పథకం, ఆర్టీఈ ద్వారా ప్రవేశాలు కల్పించిన విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిల విడుదల చేయాలన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు మైదానాల సదుపాయాలు కల్పించాలని కోరారు. ఎన్నికల సమయంలో పాఠశాలల వాహనాలను తీసుకున్నారని, వాటికి డీజిల్, డ్రైవర్ భత్యాన్ని చెల్లించాలన్నారు. కేశవ రెడ్డి, రవి.శ్రీనివాస, థామస్, రజాక్ ఉస్తాద్ పాల్గొన్నారు. డయట్ ప్రిన్సిపాల్ ఇందిర సేవలు అనన్యం రాయచూరు రూరల్: రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయంలో డయట్ ప్రిన్సిపాల్ ఇందిర అందించిన సేవలు అనన్యమని శిఖర మఠం మఠాధిపతి కిపిల సిద్దరామేశ్వర స్వామీజీ అన్నారు. ఇందిర ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో స్వామీజీ పాల్గొని మాట్లాడారు. అధ్యాపక వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఆ రంగంలో పనిచేసేవారు సమాజాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఇందిరను ఘనంగా సన్మానించారు. శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, బీఈఓ ఈరణ్ణ, ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పాల్గొన్నారు. భర్త బెదిరింపులపై భార్య ఫిర్యాదు హుబ్లీ: భర్త బెదిరింపులపై భార్య నగరంలోని దర్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరు కాటన్ పేట వద్ద నివసించే రితేష్ నాగరాజ్ జైన్కు ధార్వాడ తాలూకా లక్ష్మాపుర గ్రామానికి చెందిన సావిత్రితో వివాహమైంది. వారికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే పెళ్లి సమయంలో కులం పేరు చెప్పకుండా వివాహం చేశారని రితేష్ జైన్ తరచూ గొడవకు దిగేవాడు. అనంతరం అత్త కూడా వేధింపులకు దిగింది. దీంతో సావిత్రి పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడకు వచ్చిన రితేష్జైన్, తల్లి రేఖా జైన్, పూజాకిషోర్లు తనను బెంగళూరు రావాలని డిమాండ్చేస్తూ కులం పేరుతో దూషించి ప్రాణాలు తీస్తామని బెదిరించిట్లు బాధితురాలు సావిత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పీడీఓను నియమించాలని కార్యాలయం ముట్టడి రాయచూరు రూరల్: పీడీఓను నియమించాలని డిమాండ్ చేస్తూ లింగసూగురు తాలుకా కోఠా గ్రామ పంచాయతీ ప్రజలు కార్యాలయాన్నిముట్టడించి తాళం వేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ రెండు నెలలుగా పీడీఓ లేక పోవడంతో అభివృద్ధి పనులు స్తంభించాయన్నారు. గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా మారిందన్నారు. తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. పీడీఓ లేకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు. వెంటనే పీడీఓను నియమించాలని డిమాండ్ చేశారు. -
ప్రామాణికంగా న్యాయ సేవలు అందించాలి
రాయచూరు రూరల్: కక్షిదారులకు ప్రామాణికతతో న్యాయ సేవలు అందించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యం.జి.ఎస్.కమాల్ పిలుపునిచ్చారు. మాన్విలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయవాదుల భవనాన్ని న్యాయమూర్తి శనివారం ప్రారంభించి మాట్లాడారు. న్యాయవాదులు చొరవ చూపితే ఎక్కువ కేసులు పరిష్కారం అవుతాయన్నారు. తమను నమ్మి వచ్చిన కక్షిదారులకు న్యాయం చేయాలన్నారు. కేసులను రాజీమార్గంలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తులు దయానంద బేలూరు, స్వాతిక్ పాల్గొన్నారు. -
రోడ్ల సొగసు చూడతరమా?
సాక్షి,బళ్లారి: పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో.! వందల, వేల కోట్ల రూపాయల నిధులు జిల్లా అభివృద్ధికి ఉన్నాయని ఎమ్మెల్యేల నుంచి మంత్రులు, అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారే కాని నగరంలోని ప్రతి రోడ్డును సుందరంగా తీర్చిదిద్దేందుకు సీసీ రోడ్లు, తారు రోడ్లు వేయడం మాట అటుంచితే కనీసం నగరంలో ఉన్న రోడ్లలో పడిన గుంతలను పూడ్చేందుకు సమయం కేటాయించకపోవడం, వాటి గురించి పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు తోడు వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. వాహనాలు నిత్యం రోడ్లలో పెద్ద ఎత్తున సంచరిస్తుండటంతో గుంతలయమంగా మారిన రోడ్లలో ద్విచక్ర వాహనాలు, కార్లలో వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతుల రోడ్లతో తరచు ప్రమాదాలు గుంతలమయంగా రోడ్లు ఉండటంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. నగరంలో ఇటీవల అంటే నెలలోపు వేసిన సీసీ రోడ్లు, తారు రోడ్లు మినహా మిగిలిన రహదారులన్నీ దాదాపు గుంతలమయమే. బెంగళూరు రోడ్డు, విశాల్నగర్, కప్పగల్ రోడ్డు, హవంబావిలో పలు రోడ్లు, దొణప్ప స్ట్రీట్, కార్స్ట్రీట్, రెడ్డిస్ట్రీట్, కణేకల్లు బస్టాండు రోడ్డుకు అటు, ఇటు వైపుల ఉన్న పలు రోడ్లు, రూపనగుడి రోడ్డు, గణేష్ కాలనీ, సత్యనారాయణపేట, మిల్లార్పేట, రామయ్య కాలనీ ఇలా చెప్పుకుంటే పోతే నగరంలో ప్రతి రోడ్డు గుంతలమయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కనక దుర్గమ్మ గుడి నుంచి గాంధీనగర్ మీదుగా మోకా రోడ్డుకు వెళ్లే రహదారిలో నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, నగర మేయర్ ముల్లంగి నందీష్లకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు కూడా ఇదే రహదారిలో ఉన్నాయి. ఈ రోడ్డు కూడా గుంతలయయంగా మారిందంటే నగరంలో మిగిలిన రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1200కు పైగా గుంతలు ఉన్నట్లు అంచనా అధికార లెక్కల ప్రకారం నగరంలో దాదాపు 1200కు పైగా గుంతలు ఉన్నట్లు తేల్చారు. ప్రతి రోడ్డు దాదాపు గుంతలమయంగా మారడంతో బళ్లారి స్టీల్ సిటీనా లేక గుంతల సిటీనా అనే అనుమానం కలుగుతోందని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి మాట అటుంచితే కనీసం నగరంలోని రోడ్లను గుంతలు లేకుండా చేయాలని స్థానికులు ఒత్తిడి చేస్తున్నారు. నగరంలో రోడ్ల దుస్థితి గురించి సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి సంబంధిత అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని సాక్షికి తెలిపారు. నగరంలోని రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చేందుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారని, అయితే ఎప్పుడు గుంతలు పూడుస్తారో వారికే తెలియాలని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ప్రతి రహదారిలోనూ గుంతలు దర్శనమిస్తున్న వైనం ఎమ్మెల్యే, మేయర్ ఇల్లు, కార్యాలయాల రోడ్లలో కూడా గోతులే -
వానాకాలం.. చర్చల యుద్ధం
శివాజీనగర: రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది, నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అనేక నీటి ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోయాయి, ఈ తరుణంలో నేడు సోమవారం నుంచి రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్లు కత్తులు నూరుతున్నాయి. అభివృద్ధి కార్యాలకు నిధుల కొరత, ఎమ్మెల్యేల నిధుల విడుదల్లో తారతమ్యం, చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద తొక్కిసలాట, కులగణన సర్వేల గొడవలు, రైతులకు ఎరువుల కొరత వంటి అనేక అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి. సై అంటే సై అనేలా ఇక కాంగ్రెస్ మంత్రులు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి జరిగిన అన్యాయాలను ప్రస్తావించి ప్రతిపక్షాలను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఓట్ల దొంగతనం, మహదాయి, మేకదాటు ప్రాజెక్టులకు ఆమోదం రాకపోవడం, కేంద్రం రాష్ట్రానికి అధిక నిధులు ఇవ్వకపోవడం, బీజేపీ ఎంపీల మౌనం తదితరాలను అస్త్రాలుగా వాడుకోనున్నారు. సభల్లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం చెలరేగే అవకాశం ఉండడంతో వర్షాకాల సమావేశాలు వేడెక్కడం ఖాయం. ఈ శాసనసభ సమావేశాలు ఆగస్టు 21వ వరకు జరుగుతాయి. ఒక సెలవు పోను 9 రోజులు చర్చలు సాగుతాయి. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ గురించి 16న ప్రత్యేకంగా చర్చిస్తారు. చిన్నస్వామి మైదానంలో తొక్కిసలాటపై మైకేల్ కున్హా నివేదిక సహా పలు ముఖ్య అంశాలు చర్చకు రానున్నాయి. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అధికార, ప్రతిపక్షాల చేతిలో అస్త్రాలు 21వ వరకు శాసనసభ తొక్కిసలాట కేసు నేపథ్యంలో కర్ణాటక జన రద్దీ బిల్లు, ద్వేష ప్రసంగం, ద్వేష నేరాల నిరోధక బిల్లు, అబద్ధాల వార్తల నియంత్రణ బిల్లు లాంటి ప్రధాన బిల్లులు ఈ సమావేశాల్లో సర్కారు ప్రవేశపెట్టనుంది. గ్రేటర్ బెంగళూరు– పాలికెల విభజన, ఎన్నికల గురించి చర్చకు రావచ్చు. కర్ణాటక నగర, పట్టణ పథకాలు, ఇతర న్యాయ సవరణ బిల్లు, రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు, టూరిజం వ్యాపార సవరణ బిల్లు, దేవదాసీ వ్యవస్థ నిషేధ పరిహార, పునరావసతి బిల్లు, అత్యవసర సేవల నిర్వహణా సవరణ బిల్లుతో పాటుగా మొత్తం 23 బిల్లులను ప్రవేశపెట్టి అనుమతి పొందేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. ప్రధాన బిల్లులకు అవకాశం -
ఒకే వేదికపై 200 రకాల బియ్యం
మైసూరు: మైసూరు నగరంలోని నంజరాజ బహద్దూర్ చత్రంలో సహజ సమృద్ధ, వరిని కాపాడుదాం అనే నినాదంతో రెండు రోజుల దేశీయ వరి మేళా ఆరంభమైంది. వివిధ జాతులకు చెందిన బియ్యంతో పాటు ఔషధ గుణాలున్న బియ్యం కూడా ప్రదర్శనలో ఉన్నాయి. దేశీయ బియ్యంతో చేసిన అన్నం తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు తెలిపారు. పాలిష్ బియ్యం ప్రమాదం ప్రస్తుతం చేతుల్లో నుంచి జారిపోయే పాలిష్ చేసిన బియ్యంనే ప్రజలు వాడుతున్నారు. ముడి బియ్యాన్ని ఎవరూ తినడం లేదు. దీని వల్ల త్వరగా షుగర్, ఊబకాయం, కీళ్లనొప్పులు వంటి అనేక జబ్బులు వస్తున్నాయని నిపుణులు హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో ఉన్న పలు రకాల దేశీయ బియ్యం గురించి వివరించారు. పాలిష్ చెయ్యని ముడి బియ్యాన్ని ఉపయోగించడం ఆరోగ్యానికి ఉత్తమమని చెప్పారు. అలాగే పలు ప్రాంతాల రైతులు సాగు చేసిన ఔషధ విలువలున్న బియ్యం కూడా అందుబాటులో ఉన్నాయి. ఎరుపు, పసుపు, నలుపు, గోధుమ రంగుల బియ్యాలను చూడవచ్చు. అమ్మో ఎన్ని రకాలో పాత మైసూరు ప్రాంతంలో పేరుపొందిన రాజముడి, రత్నచూడి, రాజభోగ, పుట్ట వరి, ఏనుగు కొమ్ముల వరి, బంగారం కడ్డీ, ముండుగ, పాలుబ్బులు, ఇలా అనేక రకాల జాతుల బియ్యం బస్తాలు కొలువుతీరాయి. కన్నడనాట ప్రసిద్ధి చెందిన బియ్యం అయిన కరిగజిలివి, రాజముడి, దొడ్డగ, దొడ్డబైరనెల్లు, సిద్దసణ్ణ, సేలం సన్న, రాజభోగ, ఆందనూరు సన్న, ఉదురు సాలి, గిణిసాలి రకాలను కూడా చూడవచ్చు. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, యూపీ, ఒడిశా, అసోం, కేరళ ప్రాంతాల నుంచి ఉత్తమ జాతి వరిని తీసుకొచ్చారు. మేళా సుమారు 200 కుపైన వివిధ జాతుల బియ్యాన్ని రైతులు, వ్యాపారులు ప్రదర్శనలో ఉంచారు. కొనుగోళ్లు కూడా బాగానే జరిగాయి. నగరం నలుమూలల నుంచి సందర్శకులు తరలివచ్చారు. ఇన్ని రకాల బియ్యం ఉన్నాయా? అని అబ్బురపడ్డారు. మైసూరులో దేశీయ బియ్యం మేళా -
ఉత్సాహంగా ప్రధాని మోదీ టూర్
బనశంకరి: బెంగళూరులో ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఒక్కరోజు పర్యటన ఉత్సాహంగా సాగింది. బెంగళూరు– బెళగావి మధ్య వందే భారత్ రైలుకు పచ్చజెండా ఊపారు. బెంగళూరు నగరవాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నమ్మ మెట్రో ఎల్లో మార్గంలో సర్వీసులకు నాంది పలికారు. మెట్రో ఫేజ్–3కి శంకుస్థాపన చేశారు. ఘన స్వాగతం తొలుత ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో హెచ్ఏఎల్ విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మేఖ్రి సర్కిల్కు వచ్చి అక్కడి నుంచి కార్ల కాన్వాయ్లో మెజెస్టిక్ సంగోళ్లి రాయణ్ణ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. దారిపొడవునా బీజేపీ కార్యకర్తలు, జనం కాషాయ జెండాలు పట్టుకుని స్వాగతించారు. మోదీ కూడా చేతులు ఊపుతూ నమస్కరించారు. ప్రముఖ రోడ్లు, సర్కిల్స్లో మోదీ బృహత్ ఫ్లెక్సీలు వెలిశాయి. నగరమంతా కాషాయమయంగా మారిపోయింది. మెట్రో రైలులో ప్రయాణం మోదీతో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రులు హెచ్డీ.కుమారస్వామి, మనోహర్లాల్ ఖట్టర్, వీ.సోమణ్ణ, శోభా కరంద్లాజే, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీసీఎం డీకే.శివకుమార్, మంత్రులు ఉన్నారు. మెజెస్టిక్ నుంచి ఆర్వీ.రోడ్డు రాగిగుడ్డ మెట్రోస్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ప్రధాని మెట్రో ఎల్లో లైన్లో రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. అదే రైలులో ఎలక్ట్రానిక్ సిటీ వరకు ప్రముఖులతో కలిసి ప్రయాణించారు. ప్రజలు, బాలలతో ముచ్చటించారు. కర్ణాటకకు భారీగా రైల్వే నిధులు కర్ణాటకలో రైల్వే వసతుల పెంపునకు బడ్జెట్లో 9 రెట్లు పెరిగిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. మెట్రో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2014 కు ముందు కర్ణాటకకు వార్షిక రైల్వే కేటాయింపులు రూ.835 కోట్లు, కానీ 2025–26లో అది రూ.7,564 కోట్లకు చేరుకుందన్నారు. అమృత భారత్ స్టేషన్ కింద 61 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు, 123 ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు నిర్మాణదశలో ఉండగా, విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మెట్రోలో మా నిధులే ఎక్కువ: సీఎం మెట్రో రైలు పథకంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 50: 50 చొప్పున ఖర్చును భరించాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వమే అధికంగా వ్యయం చేసిందని సీఎం సిద్దరామయ్య అన్నారు. మెట్రో ఎల్లో లైన్ ప్రారంభోత్సవం సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎల్లో మార్గానికి రూ.7,160 కోట్లు ఖర్చుచేశామని అన్నారు. 2030 నాటికి 220 కిలోమీటర్లు పొడవునా మెట్రో మార్గాలు ఉండాలని, ఇది పూర్తయితే నిత్యం 30 లక్షల మంది ప్రయాణించవచ్చునని తెలిపారు. మూడో దశ మెట్రో పనుల డీపీఆర్ను కేంద్రానికి కూడా పంపించామని, అనుమతి రాగానే పనులు ప్రారంభించవచ్చునన్నారు. నిధులలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లే కర్ణాటకకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానిని డిమాండ్ చేశారు. బెంగళూరులో మెట్రో రైలు ఎల్లో లైన్ ప్రారంభం బెంగళూరు– బెళగావి వందే భారత్కు పచ్చజెండా మెట్రో మూడో దశకు శంకుస్థాపనమూడో దశ 44 కిలోమీటర్లు ఎలక్ట్రానిక్ సిటీ ఐఐఐటీ సభాంగణంలో మెట్రో మూడో దశకు మోదీ శంకుస్థాపన చేశారు. మూడో స్టేజ్ పథకం 44.65 కిలోమీటర్లు పొడవు కాగా, రూ.15 వేల కోట్ల వ్యయం కానుంది. మెట్రో 3స్టేజ్లో జేపీ.నగర నుంచి కెంపాపుర వరకు, హొసహళ్లి నుంచి కడబగరె వరకు మెట్రో మార్గం నిర్మాణమవుతుంది. ఫ్రీ బస్ కంటే మెట్రోనే ఇష్టం! మెట్రో రైలులో ప్రయాణంలో ప్రధాని మోదీ, సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే.శివకుమార్ సరదాగా నవ్వుకున్నారు. రైలులో మహిళలతో మోదీ మాట్లాడుతూ మీకు ఉచిత బస్సు ఇష్టమా, మెట్రో రైలు ఇష్టమా అని అడిగారు. మహిళలు మాకు మెట్రో ప్రయాణమే ఇష్టమని చెప్పారు. దీంతో మోదీ , సీఎం, డీప్యూటీ సీఎం వైపు చూసి సిద్దరామయ్య గారు, మీ ఫ్రీ బస్ను ఇష్టపడటం లేదని చెప్పడంతో అందరూ నవ్వారు. -
జై కనకదుర్గ
కేజీఎఫ్: నగరంలోని గణేష పురంలో వెలసిన శ్రీ దుర్గా దేవి ఆలయంలో ఆదివారం 154 వ శ్రావణ జాతర మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు కంకణధారణతో పూజలు ఆరంభమై మధ్యాహ్నం 12 గంటలకు మహామంగళారతి వరకు జరిగాయి. గంగమ్మ, దుర్గా దేవికి విశేష అలంకరణ చేశారు. ధర్మకర్తలు వి.మోహన్, పి.దయానంద. తదితరులు పాల్గొన్నారు. రాఘవుల ఆరాధన మండ్య: శ్రీరాఘవేంద్ర గురు సార్వభౌమ 354వ ఆరాధనా మహోత్సవాలను జిల్లాలోని వివిధ రాయల మఠాల్లో, ఆలయాలలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరుగుతాయి. మండ్య నగరంలోని శ్రీవ్యాసరాజ మఠంలోని రాఘవేంద్రుల బృందావనానికి అలంకరించి పూజలు చేశారు. నగరంలో ఉన్న కావేరి నగరలో ఉన్న రాయల మఠంలోనూ ఆరాధనా వేడుకలు జరిగాయి. ఆర్సీబీ సంబరాలపై మరో కేసు శివాజీనగర: జూన్ 4 తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాలలో విధానసౌధ ముందు, కబ్బన్పార్క్లో జనం రాక వల్ల పచ్చిక మైదానం, మొక్కలు, చెట్లు దెబ్బతిన్నాయని, దీంతో కోట్లాది రూపాయలు నష్టమైందని కబ్బన్ పార్కు అసోసియేషన్ హైకోర్టులో కేసు వేసింది. కబ్బన్పార్కుకు ఎక్కువ నష్టం కలిగిందని, దీనికి ఆర్సీబీ, కేఎస్సీఏ దే బాధ్యత అని ఆరోపించింది. ఈ నష్టాన్ని ఆ సంస్థలే భరించాలని కోరింది. ఆ రోజు ఆర్సీబీ సంబరాలలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోగా, 60 మందికి పైగా గాయపడడం తెలిసిందే. ఈ కేసులకు తోడు పార్కు నష్టం కేసు దాఖలైంది. పాము కాటుకు స్నేక్ క్యాచర్ బలి హుబ్లీ: అతను పాములు పట్టడంలో నేర్పరి. ఇప్పటి వందల పాములను బంధించి, సురక్షితంగా అడవుల్లోకి వదిలాడు. అలా చాలా మంది ప్రజలను పాము కాట్ల నుంచి కాపాడాడు. కానీ విధి వక్రించి పాముకే బలయ్యాడు. ఈ విషాద ఘటన ధార్వాడలోని గిరినగర్లో చోటు చేసుకుంది. స్థానికు సయ్యద్ హసన్ అలీ (50), ధార్వాడలో ప్రముఖ స్నేక్ క్యాచర్గా పేరుపొందాడు. ఎలాంటి సర్పాన్నయినా లాఘవంగా పట్టేస్తాడు. ప్రజలు ఎక్కడ పాము కనిపించినా అలీకి ఫోన్ చేసేవారు. అదే మాదిరిగా శనివారం గిరినగరలో ఓ ఇంట్లో పాటు కనిపించగా పట్టుకునే బయటకు తెచ్చే క్రమంలో అది చేతికి కాటు వేసింది. విష ప్రభావంతో కొంతసేపటికే అలీ మరణించారు. -
రాజధానిలో జోరు వర్షం
శివాజీనగర/ దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ప్రధాన నరేంద్ర మోదీ ఆదివారం పర్యటన ముగిసిన వెంటనే భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలలో వాన ముంచెత్తింది. ప్రస్తుతం భారీ వర్షం కురిసింది. లాల్బాగ్, శాంతినగర, జయనగర, జేపీ నగర, మెజిస్టిక్, కే.ఆర్.మార్కెట్, సదాశివనగర, హెబ్బాళ, బసవనగుడి, బనశంకరి, చంద్రాలేఔట్, కోరమంగల, కోణనకుంటతో పాటుగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వర్షం వల్ల పలు రోడ్లలో నీరు చేరింది. కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ప్రజల వీకెండ్ సందడికి వరుణుడు ఆటంకం కల్పించాడు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం -
నులి చందయ్య వచనాలు ఆచరణీయం
రాయచూరు రూరల్: శరణుల్లో ఒకరైన కాయకయోగి నులిచందయ్య వచనాలు సమాజానికి దారిదీపాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ అన్నారు. శనివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ.నగర సభ, సాంఘిక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల అధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన నులి చందయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నులి చందయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. నులి చందయ్య బసవన్న, ఇతర శరణుల బోధనలను అనుసరించారన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని తన వచనాల ద్వారా తెలియజేశారన్నారు. జాతి, కుల, వర్గ, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు అప్పట్లోనే శ్రమించారన్నారు. నులి చందయ్య వచనాలను ప్రతి ఒక్కరూ ఆచరించి జీవితాలను చక్కబెట్టుకోవాలన్నారు. తహసీల్దార్ సురేష్ వర్మ, సమాజం నేతలు నరసింహులు, మల్లికార్జున, ఈరణ్ణ, మాల భజంత్రి, నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, అమరే గౌడ, రుద్రప్ప, శివ మూర్తి, శ్రీనివాస రెడ్డి, లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో బాలిక ప్రాణాలు తీశాడు
హొసపేటె: ప్రేమ ముసుగులో బాలికను పెళ్లి చేసుకొని హత్య చేసిన భర్త ఉదంతం నగరంలో వెలుగు చూసింది. ఈ హత్యోదంతానికి సంబంధించి పోలీసులు ఆమె భర్తతోపాటు అతనికి సహకరించిన తల్లి, ఇద్దరు యులకులను అరెస్ట్ చేశారు. చెప్పరదహళ్లికి చెందిన 17 ఏళ్ల బాలికను నగరానికి చెందిన హమాలీ కార్మికుడు మంజునాథ్ ప్రేమించినట్లు చెప్పి కొన్ని నెలల క్రితం మరో ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ వివాహం చేసుకొని హొసపేటకు వచ్చాడు. అయితే మంజునాథ్ మద్యానికి అలవాటు పడి ఇంటికి ఆలస్యంగా రావడం ప్రారంభించాడు. గతంలో దొంగతనాలు చేసినట్లు ఆ బాలిక తెలుసుకుంది. ఈ విషయాలపై ప్రశ్నించగా బాలికను మానసికంగా వేధింపులకు గురి చేశాడు. వేధింపులు తాళలేక బాలిక ఎదురు తిరగడంతో మంజునాథ్ ఆమెను రెండు నెలల క్రితం అంతమొందించాడు. ఇద్దరు స్నేహితులు తరుణ్, అక్బర్ సహాయం తీసుకొని మృతదేహాన్ని బైక్పై పెట్టుకొని మునీరాబాద్ శ్మశానవాటికకు తీసుకెళ్లి పూడ్చి పెట్టారు. అనంతరం ముగ్గురూ మందు పార్టీ చేసుకున్నారు. మరో వైపు తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు గురై ఈనెల 6న పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మంజునాథ్ను అదుపులోకి తీసుకొని విచారణచేపట్టగా హత్యోదంతం వెలుగు చూసింది. మంజునాథ్ (24), అతని తల్లి లక్ష్మి, అతని స్నేహితులు తరుణ్, అక్తర్లను అరెస్టు చేశారు. మృతదేహం వెలికితీత విజయనగర ఎస్పీ అరుణంగ్లు గిరి, కూడ్లిగి డివైఎస్పీ మల్లేష్ దొడ్డమణి, టౌన్స్టేషన్ పీఐ లఖన్ మసగుప్పి, కోప్పళ్ రూరల్ స్టేషన్ పీఐ సురేష్, కొప్పళ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ మహేష్ శ్మశానవాటికకు వెళ్లి బాలిక మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. పార్టీ చేసుకోవడానికి తరచుగా ఈ ప్రదేశానికి వచ్చేవారమని, దీంతో ఇక్కడ మృతదేహాన్ని పూడ్చి పెట్టామని నిందితులు పేర్కొన్నారు. హత్యకేసులో నలుగురి అరెస్ట్ -
రాయచూరులో భారీ వర్షం
రాయచూరురల్: రాయచూరు నగరంలో వర్షం దంచి కొట్టింది. శుక్రవారం పగలంతా విపరీతమైన ఎండలు కాశాయి. రాత్రి సమయంలో ప్రారంభమైన వర్షం గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో రోడ్లు వంకలను తలపించాయి. మోకాలి లోతు నీరు ప్రవహించింది. హైదరాబాద్ గోశాల రహదారి, మంత్రాయం రహదారి, బసవన బావి సర్కిల్ జలమయం అయ్యాయి మూన్నూరు వాడి, గాంధీ చౌక్, మహవీరచౌక్ ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చొరబడింది. దీంతో పేదలు జాగారం చేయాల్సి వచ్చింది. -
ధర్మడ గుడ్డ వద్ద చిరుత సంచారం
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా ధర్మడగుడ్డ వద్ద చిరుత సంచరిస్తోంది. దీంతో భక్తులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కొండపైన కొంతకాలంగా చిరుత తిరుగుతున్న దృశ్యాన్ని స్థానిక యువకులు ఇప్పటికే తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. తాజాగా కొండ దిగువన చిరుత సంచరిస్తుండటాన్ని కొందరు గమనించి ఆ పరిసరాలనుంచి వెనక్కు వచ్చారు. బసవన్దుర్గ, నాగేనహళ్లితో సహా అనేక గ్రామాల భక్తులు ధర్మడగుడ్డ వద్ద ఉన్న ఆలయానికి రావడం సర్వసాధారణం. ప్రస్తుతం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించడంతో స్థానికులు, భక్తులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు.అన్నా చెల్లెలి బంధానికి ప్రతీక రాఖీ పండుగరాయచూరురూరల్: రాఖీ పండుగ అన్నా చెల్లెలి బంధానికి ప్రతీక అని కిల్లే బృహన్మఠం మఠాధిపతి శాంతమల్ల శివాచార్యలు అన్నారు. శనివారం రాఖీ పండుగను పురస్కరించుకొని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత మఠానికి వచ్చి స్వామీజీకి రాఖీలు కట్టారు. రాఖీ పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందన్నారు.విద్యతోనే సముదాయ అభివృద్ధిరాయచూరు రూరల్: విద్యకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సోమవారి పేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యలు అన్నారు. మూన్నూరు కాపు సమాజం కళ్యాణ మంటపంలో పది, ఇంటర్, డిగ్రీలో ప్రతిభ చాటిన ఆ సముదాయం విద్యార్థులకు శనివారం ప్రతిభాపురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ మాట్లాడుతూ విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి ఆటంకమని, వాటిని అరికట్టి పిల్లలను పాఠశాలలకు పంపి విద్యావంతులను చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ అరోగ్య, పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, మాజీ శాసనసభ్యుడు పాపారెడ్డి, నరసా రెడ్డి, తిమ్మారెడ్డి, శ్రీనివాస రెడ్డి, క్రిష్ణమూర్తి, లక్ష్మిరెడ్డి, శంకర్ రెడ్డి పాల్గొన్నారు. -
మాదిగలకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలి
సాక్షిబళ్లారి: రాష్ట్రంలో ఎస్సీ కులాల్లో ఒకటైన మాదిగలకు 6 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, ఇందుకు సంబంధించి ఈ నెల 16న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక మాదిగ, ఉపకులాల సంఘటన ఐక్య రాష్ట్ర కన్వినర్ హనుమంతప్ప డిమాండ్ చేశారు. ఆయన శనివారం నగరంలోని పత్రికా భవనంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ అంతర్గత రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మినమేషాలు లెక్కిస్తున్నారన్నారు. న్యాయమూర్తి నాగమోహన్ దాస్ నివేదిక సమర్పించిన తర్వాత మాదిగలకు ప్రత్యేక రిజర్వేషన్ వ్యతిరేకించే వారికి సానుకూలంగా ముందుకు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట మాదిగలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై మాట్లాడే మంత్రులు ఎందుకు మంత్రి వర్గంలో వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అంతర్గత రిజర్వేషన్ వ్యతిరేకించే వారికి 11 శాతం రిజర్వేషన్ కల్పించి మిగిలిన 6 శాతం మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 16న జరిగే మంత్రి వర్గం సమావేశంలో సరైన నిర్ణయం తీసుకోక పోతే ఆగస్టు 18న ఫ్రీడమ్ పార్క్ బెంగళూరులోఆందోళన చేసి, ధర్నా చేసి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కార్యాలయాన్ని, ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రూ.39 వేల కోట్ల నిధులు ఎస్సీ,ఎస్టీ సంక్షేమానికి కేటాయించి, వాటిని గ్యారెంటీ పథకాలకు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీలను అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ప్రముఖులు హులుగప్ప, ఈశ్వరప్ప, సోమశేఖర, తిప్పేస్వామి, తదితరులు పాల్గొన్నారు. 6 శాతం రిజర్వేషన్ ఇవ్వక పోతే పోరాటం కర్ణాటక మాదిగ, ఉపకులాల సంఘటన ఐక్య రాష్ట్ర కన్వినర్ హనుమంతప్ప -
భిక్షాటనతో ఆలయానికి విరాళం
రాయచూరు రూరల్: ఆలయ జీర్ణోద్ధరణకు ఓ వృద్ధురాలు భిక్షాటన చేపట్టి భారీ మొత్తంలో విరాళం సమర్పించింది. రాయచూరు తాలూకా బిజినగేరకు చెందిన మహిళ చిన్న షెడ్డులో నివాసం ఉంటోంది. 40 సంవత్సరాలుగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెకు తెలుగు భాష తప్ప ఇతర భాషలు తెలియవు. భిక్షాటన ద్వారా వచ్చిన మొత్తాన్ని గోనె సంచిలో దాచి ఉంచేది. గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయ జీర్ణోద్ధరణ జరుగుతుండగా విరాళం ఇచ్చేందుకు ఆ వృద్ధురాలు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఆలయ కార్యదర్శి బసవరాజ యాదవ్కు తెలియజేసి తాను నివాసం ఉంటున్న షెడ్డుకు తీసుకొని వచ్చింది. గోనె సంచిలో ఉన్న చిల్లర డబ్బును అందజేసింది. ఆ మొత్తాన్ని లెక్కించగా లక్షా83వేల రూపాయలుగా తేలింది. ఇందులో కొన్ని నోట్లు చెల్లనవిగా ఉన్నాయి. వృద్ధురాలి దాతృత్వం -
నమో నారసింహా
● కంబద ఆలయంలో శ్రావణ శనివార పూజలు మండ్య: నమో నారసింహా.. నమో భక్తపాల అని భక్తులు స్తుతించారు. శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా మండ్య నగరంతో పాటు జిల్లాలో ఉన్న విష్ణుమూర్తి, వెంకటేశ్వరస్వామి ఆలయాలలో విశేష పూజలు జరిగాయి. మండ్య తాలూకాలోని సాతనూరు బెట్ట కంబద నరసింహస్వామి గుడిలో తెల్లవారుజాము నుంచే పూజలు చేశారు. నరసింహ స్వామివారి విగ్రహానికి వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయం వెనుక భాగంలో ఉన్న మహాలక్ష్మి మందిరంలో కరెన్సీ నోట్లతో అమ్మవారికి సుందరంగా తీర్చిదిద్దారు. వందలాదిగా భక్తులు దేవీ దేవతలను దర్శించుకున్నారు. -
ముంచెత్తిన కుండపోత వానలు
● ఉత్తర కర్ణాటకలో అధికం యశవంతపుర: రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతున్నాయి. దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తరకన్నడ, శివమొగ్గ, హాసన్, బెంగళూరు గ్రామాంతర, కలబుర్గి, బాగలకోట, కొప్పళ, గదగ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల పొలాలు నీటమునిగాయి. మైసూరు జిల్లా హెచ్డీ కోట తాలూకాలో అనేక కాలనీలు పాక్షికంగా మునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. సవదత్తి జాతరకు ఆటంకం బెళగావి జిల్లా సవదత్తిలో కుండపోత వర్షాలు కురిశాయి. స్థానిక గుట్టపై నుంచి వరద నీరు ప్రవహించింది. ఎల్లమ్మ గుడికి వెళ్లే రోడ్డు మునిగిపోయింది. వాహనాలు బంద్ అయ్యాయి. సవదత్తి నుంచి ఎల్లమ్మ గుడికి వేరే మార్గాల్లో వెళ్లాలని అధికారులు తెలిపారు. శనివారం నుంచి నూల పౌర్ణమి జాతర ప్రారంభమైంది. మహారాష్ట్ర, గోవా నుంచి భక్తులు వస్తుండగా వర్షాలతో ఆటంకం ఏర్పడింది. విజయపుర జిల్లా వ్యాప్తంగా భారీ వానలు పడ్డాయి. సహాయక చర్యల పై మంత్రి హెచ్కే పాటిల్ అధికారులతో చర్చించారు. విజయపుర పట్టణంలో అనేక కాలనీలలో నీరు చేరింది. రోడ్లు చెరువుల్లా మారాయి. అనేక చోట్ల పశువులు చనిపోయాయి, పొలాలు, తోటలు మునిగాయి. -
భయానక ఘటన.. వీడిన మిస్టరీ!
తుమకూరు: జిల్లాలో కొరటగెరె తాలూకాలో చింపుగానహళ్ళి వద్ద గుర్తుతెలియని హంతకులు ఓ మహిళ శరీరం ముక్కలు ముక్కలు చేసి చుట్టుపక్కల ప్రాంతాలలో విసిరేసిన భయానక సంఘటనలో హతురాలి ఆచూకీ లభ్యమైంది. తుమకూరు తాలూకాలోని బెళ్ళావి గ్రామానికి చెందిన లక్ష్మిదేవమ్మ (42)గా పోలీసులు గుర్తించారు. ఎవరో ఆమెను హత్య చేసి శరీర భాగాలను కవర్లలో చుట్టి విసిరేశారు. గురువారం రోజున కొందరు జనం చూసి పోలీసులకు చెప్పడంతో దారుణం బయటపడింది. చింపుగానహళ్ళి పరిధిలో 8 చోట్ల 10 నల్ల కవర్లలో శరీర భాగాలు లభించాయి. జిల్లా ఎస్పీ అశోక్, పోలీసులు జిల్లాలోని అందరు డీఎస్పీలు గాలింపులో పాల్గొన్నారు. హంతకుల కోసం వేట సాగిస్తున్నారు. 3న కూతురి ఇంటికి వెళ్లి.. మహిళ చేతిపై ఉన్న పచ్చ బొట్టు, దుస్తులు, ఇతరత్రా గుర్తుల గురించి గ్రామాల్లో సమాచారం ఇచ్చారు. ఆమె లక్ష్మిదేవమ్మగా తేలింది. కుటుంబ సభ్యులు కూడా గుర్తించారు. ఆమె భర్త బసవరాజు, 4వ తేదీన తుమకూరు రూరల్ ఠాణాలో మిస్సింగ్ కేసు పెట్టాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఊర్తిగెరె దగ్గర సిద్దలింగపాళ్యలో ఉండే కుమార్తెను చూసి వస్తానని 3వ తేదీన వెళ్లిందని తెలిపాడు. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరింది, కానీ ఇంటికి చేరలేదు. కేసును అతి త్వరలోనే ఛేదిస్తామని ఎస్పీ తెలిపారు. హతురాలు తుమకూరు తాలూకావాసి హంతకుల కోసం ఖాకీల వేట -
లారీకి నవ వివాహిత బలి
బనశంకరి: వరమహాలక్ష్మీ పండుగనాడు బంధువుల ఇంటికి వెళుతున్న నవ వివాహిత ప్రమాదంలో ప్రాణాలు వదిలింది. ఈ ఘటన బెంగళూరు రాజాజీనగర ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. గీత (23) అనే యువతికి రెండునెలల క్రితం సునీల్ అనే వ్యక్తితో పెళ్లయింది. శుక్రవారం వరమహాలక్ష్మీ పండుగ కావడంతో పసుపు కుంకుమ తీసుకోవడానికి నందిని లేఔట్లోని బంధువుల ఇంటికి దంపతులు బైకులో బయలుదేరారు. లగ్గెరె బ్రిడ్జి వద్ద బైకు ను లారీ ఢీకొనగా తలకు తీవ్రగాయం కావడంతో గీతా అక్కడే చనిపోయింది. భర్తకు గాయాలయ్యాయి. పోలీసులు లారీడ్రైవరు సురేశ్ను అరెస్ట్ చేశారు. -
మైసూరు జూలో సివంగి కన్నుమూత
మైసూరు: ౖమెసూరు చామరాజేంద్ర మృగాలయంలో ఉన్న రక్షిత అనే ఆడ సింహం కన్నుమూసింది. ఈ సింహం వయసు 21 సంవత్సరాలు, శనివారం ఉదయం 7 గంటల సమయంలో వృద్ధాప్య సమస్యలతో చనిపోయిందని జూ అధికారులు చెప్పారు. ఇది 2004 ఏప్రిల్ 1వ తేదీన ఇదే జూలో నరసింహ, మానిని అనే సింహాల జంటకు జన్మించింది. జూలో ఎంతో ఆకర్షణీయమైన సివంగిగా పేరుబడింది. గత వారం రోజుల నుంచి ఆహారం సరిగా తీసుకోక నీరసంగా ఉండింది. రక్షిత మృతితో జూ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. కాంతార కంబళ దున్న మృతి యశవంతపుర: కన్నడ హిట్ సినిమా కాంతారలో నటుడు రిషబ్ శెట్టితో కలిసి నటించిన దున్నపోతు అప్పు కన్నుమూసింది. ఇది కరావళి భాగంలో అనేక కంబళ పోటీలలో పాల్గొని పతకాలను గెల్చుకుంది. బెంగళూరులో జరిగిన కంబళ పోటీలలో ప్రథమస్థానంలో నిలిచింది. కంబళ దున్నలను యజమానులు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు. మంచి ఆహారంతో పాటు సకల వసతులు కల్పిస్తారు. దీని పేరు అప్పు కాగా, కాంతార సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. రిషబ్తో కలిసి అనేక సన్నివేశాలలో కనిపిస్తుంది. వయోభారంతో మరణించడంతో యజమానులు, అభిమానులు విషాదానికి లోనయ్యారు. శనివారం ఘనంగా అంత్యక్రియలు జరిపించారు. రూ.3 కోట్లు తీసుకుని సినిమా చేయలేదు యశవంతపుర: సినిమాలో నటిస్తానని చెప్పి రూ.3.15 కోట్ల డబ్బులు తీసుకుని సినిమా చేయలేదని కన్నడ నటుడు ధ్రువ సర్జాపై ముంబైలో అంబోలి పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవేంద్ర హెగ్డే అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు.. ధ్రువ సర్జా తనతో సోల్జర్ అనే సినిమా తీయడానికి ఒప్పుకుని రూ.3.15 కోట్లు తీసుకున్నాడు. 2019 ఫిబ్రవరి 21న ఒప్పందం జరిగింది. ఆ డబ్బులతో అపార్ట్మెంట్ తీసుకున్న ధ్రువ సర్జా సినిమాలో నటించలేదు. డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని, న్యాయం చేయాలని అంబోలి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. -
మూడుముళ్లు.. ఆర్థిక చిక్కుముళ్లు
సాక్షి, బెంగళూరు: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. గతంలో ఇళ్ల దగ్గరే పెళ్లిళ్లు జరిపించేవారు. ఊరంతా పెళ్లికి సహకారం ఇచ్చేది. పెద్ద ఆడంబరం కూడా ఉండేది కాదు, ఖర్చు కూడా తక్కువే. నేటి డిజిటల్ యుగంలో పెళ్లి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. హంగు ఆర్భాటాలతో పెళ్లి ఒక విలాసం, ఖరీదైన కార్యక్రమంగా మారింది. చూడడానికి పైకి బాగానే ఉన్నా, లోపల అనేక ఇబ్బందులూ ఉన్నాయి. బెంగళూరుతో పాటు రాష్ట్రంలో అన్ని నగరాలు, జిల్లాల్లో ఈ తరహా వ్యయ సంస్కృతి వెర్రితలలు వేస్తోంది. ప్రతి దశలో ఖర్చే ఖర్చు ఫంక్షన్ హాల్ కోసం లక్షలాది రూపాయల బాడుగలు చెల్లించాలి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫంక్షన్ హాళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మామూలుగా ఫంక్షన్ హాల్కు రూ. 30 నుంచి గరిష్టంగా రూ. లక్ష వరకు అద్దెలను చెల్లిస్తున్నారు. పెద్ద హాళ్లు, ఏసీ హాళ్లు అయితే రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు కూడా వసులు చేస్తున్నారు. పెళ్లి వేదిక కోసం సుమారు రూ. 5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. గొప్పల కోసం తిప్పలు భోజనాల కోసం క్యాటరింగ్ సర్వీసెస్ వారికి ఇస్తున్నారు. మేళతాళాలు, ఫోటోలు, వీడియోలు.. ఇలాంటివాటికి మంచినీళ్లలా వ్యయమవుతుంది. పెళ్లికి ముందు, తరువాత రిసెప్షన్లకు సైతం విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. అనేకమంది సమాజంలో గొప్పను చాటుకోవడానికి స్తోమతకు మించి ఖర్చు చేయడం పరిపాటైంది. పెళ్లి ఖర్చులు ఒక ఎత్తు అయితే బహుమతులు, కట్నాల రూపంలో మరింతగా ఆడపిల్లల తరఫు వారు ఖర్చు చేస్తున్నారు. ఫోటోలు, క్యాటరింగ్.. పెళ్లి జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఫోటోలు, వీడియోలు, డ్రోన్ కవరేజీ చేయిస్తుంటారు. ఆల్బంల తయారీకి రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల దాకా ఖర్చవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రీ, పోస్టు వెడ్డింగ్ షూట్ల పేరుతో మరింత వెచ్చిస్తున్నారు. క్యాటరింగ్స్లో ప్లేట్ భోజనానికి కనీసం రూ. 250 నుంచి రూ. 5 వేల వరకు వెచ్చిస్తున్నారు. చిన్న కుటుంబాలకు అయితే రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు భోజనాల ఖర్చు అవుతోంది. పెళ్లిళ్ల కోసం రూ. లక్షల ఖర్చు చేస్తున్న ప్రజలు స్టేటస్ అంటూ అప్పుల పాలవుతున్న కుటుంబాలు ఆపై ఆర్థిక ఇబ్బందులు ఎంత గొప్పగా పెళ్లి చేస్తే సమాజంలో అంత పేరు ప్రతిష్టలని అనుకుంటున్నారు. స్టేటస్ అనే భ్రమలో చాలా మంది స్థాయికి మించి ఖర్చు పెడుతున్నారు. దీంతో అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పిల్లల పెళ్లిళ్ల కోసం, చేసిన అప్పులు తీర్చడం కోసం ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారు. సామాన్యులైతే అప్పులు తీర్చే మార్గం కనపడక, కుటుంబాల్లో కలహాలు జరుగుతుంటాయి. అందుకే అనేకమంది స్వామీజీలు పెళ్లిళ్ల ఖర్చును తగ్గించుకోవాలని, సరళంగా ఆచరించాలని బోధిస్తూ ఉన్నారు. ఈ దిశగా ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నారు. పెళ్లి ఎంత ఆడంబరంగా జరిగింది అనే కంటే ఆ జంట ఎంత సజావుగా కాపురం చేస్తున్నారనేదే ముఖ్యమని స్వామీజీలు తెలిపారు. -
నేడు బెంగళూరుకు ప్రధాని మోదీ
శివాజీనగర: బెంగళూరు – బెళగావి మధ్య వందేభారత్ రైలు, మెట్రో ఎల్లో మార్గం ప్రారంభం, మెట్రో 3వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొంటారు. ప్రధాని పర్యటన కోసం సిలికాన్ సిటీలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోదీ టూర్ ఇలా ● ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మేఖ్రి సర్కిల్ వద్ద ఉన్న హెలిప్యాడ్కు హెలికాప్టర్లో వస్తారు. ● అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11.40కి మెజెస్టిక్లోని సంగొళ్లి రాయణ్ణ రైల్వేస్టేషన్కు చేరుకొని బెంగళూరు– బెళగావి మధ్య వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపుతారు. అలాగే అమృత్సర్– శ్రీమాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్, నాగపూర్–పూణె మధ్య వందేభారత్ రైలు సేవలను ప్రారంభిస్తారు. ● ఆ తరువాత ఆర్వీ రోడ్డు రాగిగుడ్డ మెట్రో స్టేషన్కు చేరుకొని మెట్రో ఎల్లో మార్గం ప్రారంభించి మెట్రో రైలులో ఎలక్ట్రానిక్ సిటీ వరకు ప్రయాణిస్తారు. ● ఎలక్ట్రానిక్ సిటీలో ఐఐఐటీ సభా మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెట్రో 3వ దశకు శంకుస్థాపన నెరవేర్చి ప్రసంగిస్తారు. ● తరువాత పర్యటన ముగించి ఢిల్లీకి బయల్దేరుతారు. ప్రధాని టూర్తో నగరంలో పలు రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. వందే భారత్ సర్వీసు బెంగళూరు– బెళగావి వందే భారత్ రైలు సంచారంతో కళ్యాణ కర్ణాటకకు రవాణా వసతి మరింత మెరుగుపడుతుంది. ఈ రైలు బుధవారం తప్ప వారంలో అన్ని రోజులు సంచరిస్తుంది. రోజూ ఉదయం 5.20కి బెళగావిలో బయలుదేరి మధ్యాహ్నం 1.50కి బెంగళూరు రాయణ్ణ రైల్వే స్టేషన్కు చేరుకొంటుంది. మధ్యాహ్నం 2.20కి రాయణ్ణ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి బెళగావికి రాత్రికి 10.40కి బెళగావి చేరుకొంటుంది. యశ్వంతపుర, తుమకూరు, దావణగెరె, హావేరి, హుబ్లీ–ధారవాడ స్టేషన్లలో నిలుస్తుంది. ప్రధాని పర్యటనల్లో రాష్ట్ర, కేంద్ర మంత్రులు పాల్గొంటారు. బెళగావి వందే భారత్, ఎల్లో లైన్ మెట్రో రైలు ప్రారంభం మెట్రో రైలులో ప్రయాణం -
కై వార రథోత్సవం
చింతామణి: తాలూకాలోని పుణ్యక్షేత్రమైన కై వార సద్గురు యోగి నారేయణ మఠంలో శ్రావణ మాస పౌర్ణమి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అమర నారేయణస్వామి, సద్గురు తాతయ్య ఉత్సవమూర్తులకు అభిషేకం, అష్టావధాన సేవలను చేపట్టారు. మఠం ఆవరణలో తేరు ఉత్సవం జరిపారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. మా అక్క ఐపీఎస్ తెలుసా? దొడ్డబళ్లాపురం: మద్యం మత్తులో ఐపీఎస్ అధికారి తమ్ముడు పోలీస్స్టేషన్లో హల్చల్ చేసిన సంఘటన గదగ్ జిల్లా బెటగేరి వద్ద జరిగింది. ఐపీఎస్ అధికారిణి అనితా హద్దణ్ణవర్ తమ్ముడు అక్షత్ హద్దణ్ణవర్ మద్యం మత్తులో అర్ధరాత్రి బెటగేరి ఠాణాకు కారులో వచ్చారు. తాను లాయర్నని, తన అక్క ఐపీఎస్ అని, తనని ఎవరూ ఏమీ చేయలేరని కేకలు వేయసాగాడు, అడ్డుకోబోయిన స్టేషన్ సిబ్బందిని దుర్భాషలాడాడు. చివరకు పోలీసులు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి పంపించారు. అతని కారు మీద నో పార్కింగ్ చలానా రాశారని గొడవ చేసినట్టు సమాచారం. ర్యాగింగ్కు డిగ్రీ విద్యార్థిని బలి దొడ్డబళ్లాపురం: తోటి విద్యార్థుల వేధింపులకు ఓ విద్యా కుసుమం బలైన సంఘటన బాగలకోట జిల్లా గుళేదగుడ్డ పట్టణంలో చోటుచేసుకుంది. అంజలి ముండాస (21) మృతురాలు, ఈమె పట్టణంలోని భండారి కళాశాలలో బీఏ చివరి ఏడాది చదువుతోంది. తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో ఆవేదన చెందిన అంజలి డెత్నోట్ రాసి ఉరివేసుకుంది. డెత్ నోట్లో ఇద్దరి పేర్లతోపాటు వారి ఫోన్ నంబర్లు రాసింది. వర్ష, ప్రదీప్ నన్ను మానసికంగా వేధించి చనిపోయేలా చేశారు, వీరిని కఠినంగా శిక్షించాలి, గుడ్ బై.. అంటూ రాసింది. గుళేదగుడ్డ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 13 ఏళ్లకే పెళ్లి.. కిడ్నాప్ ●● బెళగావిలో అమానుషం దొడ్డబళ్లాపురం: సంరక్షణ కేంద్రంలో ఉన్న బాలికను కిడ్నాప్ చేసిన సంఘటన బెళగావి జిల్లా మాళమారుతి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాలికకు 13 ఏళ్లు ఉండగా నిందితునితో బలవంతంగా పెళ్లయింది. ఆమెకు అనారోగ్యం కలగడంతో ఆస్పత్రికి తీసికెళ్లగా నాలుగు నెలల గర్భంతో ఉన్నట్టు తేలింది. దీంతో బాలికను మహంతేశ్ నగరలో ఉన్న సృష్టి పిల్లల సంరక్షణ కేంద్రంలో వదిలారు. ఈ సంరక్షణ కేంద్రంలో ఎటువంటి సీసీ కెమెరాలు,సెక్యూరిటీ గార్డులు లేవు. బాలికకు మందులు ఇవ్వాలని చెప్పుకుని ఓ వ్యక్తి లోపలకు వచ్చి కత్తితో బెదిరించి బాలికను తీసుకెళ్లాడు. సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితున్ని గుర్తించి బాలికను రక్షించారు. అతనిపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక భర్తే ఈ నేరానికి పాల్పడినట్లు తెలిసింది. కొమ్మ పడి వృద్ధునికి గాయాలు బనశంకరి: బెంగళూరు నగరంలోని అన్నపూర్ణేశ్వరి నగర పరిధిలో రోడ్డు పక్కన వాకింగ్ చేస్తున్న వృద్ధునిపై చెట్టు కొమ్మ విరిగి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్.విశ్వనాథ్ బాధితుడు కాగా, నడుము విరిగింది, బాధితున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పాలికె అటవీ సిబ్బంది చేరుకుని విరిగిపడిన చెట్టుకొమ్మలను తొలగించి వెళ్లిపోయారు. బీబీఎంపీ తీరుపట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీబీఎంపీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బాధితుడు అన్నపూర్ణేశ్వరినగర ఠాణాలో ఫిర్యాదు చేశాడు. -
వెంటాడిన వెబ్సిరీస్
మొబైల్ఫోన్, అందులోని ఇంటర్నెట్, సోషల్ మీడియా, గేమ్స్ అనేవి డ్రగ్స్ మాదిరిగా వ్యసనమవుతున్నాయి. ఎంతోమంది జీవితాలను బలిగొంటున్నాయి. ముఖ్యంగా బాలలు, యువకులు మొబైల్ గేమ్స్ మాయలో పడి విలువైన జీవితాలను పోగొట్టుకుంటున్నారు. అటువంటి రెండు విషాద సంఘటనలు బెంగళూరులో సంభవించాయి.బనశంకరి: సిలికాన్ సిటీలో చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్స్టేషన్ పరిదిలో 14 ఏళ్లుబాలుడు గాంధార్ డెత్నోట్రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తల్లిదండ్రులు జి.గంగాధర్, సవిత గాన సంగీత కళాకారులు కాగా, ఘటన సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. బాలుడు పద్మనాభనగరలో ప్రైవేటు స్కూలులో 7వ తరగతి చదివేవాడు. ఇంట్లో ఎలాంటి సమస్య లేదు, తల్లిదండ్రులు, సోదరునితో అన్యోన్యంగా ఉండే గాంధార్ ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబానికి షాక్ ఇచ్చింది.స్వర్గంలో ఉంటానురాత్రి అందరితో కలిసి భోజనం చేసి తన పెంపుడు శునకంతో నిద్రకు ఉపక్రమించిన గాంధార్ తెల్లవారుజామున తన గదిలో ఉరివేసుకునే ముందు డెత్నోట్ను రాశాడు. తల్లిదండ్రులను ఉద్దేశించి.. మీరు నన్ను 14 ఏళ్లు బాగా పెంచారు. మీతో చాలా సంతోషంగా ఉన్నాను, కానీ నేను వెళ్లే సమయం వచ్చింది. మీరు ఈ లేఖ చదివేలోగా నేను స్వర్గంలో ఉంటాను అని రాశాడు. అందులో కొన్ని బొమ్మలను కూడా గీశాడు.ఆ వెబ్ సిరీసే..బాలుడు చిన్న వయసులో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనే ప్రశ్న తలెత్తింది. పోలీసులు విచారణ జరపగా కలవరపరిచే అంశాలు బయటపడ్డాయి. గాంధార్ జపనీస్ భాషలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన డెత్నోట్ వెబ్ సిరీస్ను క్రమం తప్పకుండా చూసేవాడు. అంతేగాక వెబ్సీరీస్లో వచ్చే ఒక పాత్రను గాంధార్ తన రూమ్లో గీశాడు. ఈ వెబ్సీరీస్లో ఒక పాత్ర ఉంది. ఈ పాత్ర చెప్పినట్లు హీరో నడుచుకుంటాడు. ఆ మాయా బుక్లో ఎవరిపేరు రాసి వారు ఎలా చనిపోవాలి అనే ఊహించుకుంటే ఆ వ్యక్తి ఆ విధంగా చనిపోతాడు. చెడ్డవారు ఎవరూ కూడా భూమిపై ఉండరాదు, వారందరినీ అంతం చేయాలి అనేది ఈ వెబ్ సిరీస్ కథ. ఈ డెత్నోట్ వెబ్సిరీస్ను నిరంతరం చూసి దీని ప్రభావానికి లోనైన గాంధార్ ఆ మాదిరిగా ప్రాణాలు తీసుకున్నాడనే అనుమానం వ్యక్తమవుతోంది. బాలుని మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
బళ్లారిలోనే మెగా డైరీ నిర్మాణం
సాక్షి, బళ్లారి: బళ్లారిలో మెగా డైరీ నిర్మించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని కేఎంఎఫ్ కార్యాలయంలో జరిగిన రాబకొవి పాలక మండలి సర్వసభ్య సమావేశంలో రాబకొ అధ్యక్షుడు రాఘవేంద్ర హిట్నాల్, నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి తదితరులతో కలిసి ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. బళ్లారి తాలూకా కొళగల్లు ప్రాంతంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం రూ.84 కోట్ల కేఎంఆర్సీ నిధులతో దేశంలోనే పేరుగాంచే విధంగా మెగా పాలడైరీని నిర్మిస్తామని అన్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని బళ్లారిలో మెగా డైరీని అత్యద్భుతంగా నిర్మించి, ఈ ప్రాంతంలో రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పాడి రైతులకు ఇతోధికంగా మేలు జరుగుతుందన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. గుజరాత్లో అమూల్ కంపెనీకి దీటుగా ఇక్కడ మెగా డైరీ చేపడతామన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి ఊతం బళ్లారిలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో పాటు రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా చూస్తామన్నారు. పశుసంవర్ధక శాఖ నుంచి 11 వేల ఆవులను, గేదెలను రైతులకు పంపిణీ చేస్తామన్నారు. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాబకొవి పరిధిలో 2 లక్షల పాల సేకరణే లక్ష్యంగా పని చేస్తామన్నారు. బళ్లారి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా జమీర్ఖానే ఉంటారని, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున మంత్రి రహీంఖాన్ జెండా ఎగర వేస్తారన్నారు. అనంతరం రాయచూరు, బళ్లారి, కొప్పళ, విజయనగర(రాబకొవి) పాల సమాఖ్య అధ్యక్షుడు రాఘవేంద్ర హిట్నాళ్ మాట్లాడుతూ రాబకొవి పాల సమాఖ్య ఉత్పత్తులను పెంచి ఈ ప్రాంతంలో రైతులకు మేలు చేయడంతో పాటు నాణ్యమైన, నమ్మకమైన పాలను అందజేస్తామన్నారు. ఈసందర్భంగా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యం మాజీ మంత్రి, ఎమ్మెల్యే బీ.నాగేంద్ర -
రాజీ ప్రక్రియతో కేసుల సత్వర పరిష్కారం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో చిన్న, చిన్న తప్పులకు వివాదాలు రావడంతో కేసులు అధికమవుతున్న తరుణంలో రాజీ ప్రక్రియతో కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చని జిల్లా అదనపు న్యాయమూర్తి స్వాతిక్ పేర్కొన్నారు. శుక్రవారం ఏపీఎంసీ సమీపంలోని బసవేశ్వర కాలనీలో జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవా ప్రాధికారల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. కక్షిదారులు, ప్రత్యర్థులు ఏకమై రాజీ సంధాన మార్గంలో కేసులను త్వరితగతిన పరిష్కారానికి న్యాయ సేవా ప్రాధికార పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఉచితంగా న్యాయం చేకూర్చడానికి వీలు కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు పవన్, లక్ష్మికాంతరెడ్డి, అమరేష్రెడ్డిలున్నారు. బర్త్ డే పార్టీకని పిలిచి జల్సా.! ● హాస్టల్ వార్డెన్, వంట మనిషికి నోటీసులు హుబ్లీ: బర్త్ డే పార్టీ అని హాస్టల్ విద్యార్థులను హోటల్కు పిలిపించుకొని విందు, చిందుతో పాటు జల్సా చేసిన కేసుకు సంబంధించి హాస్టల్ వార్డెన్తో పాటు వంట మనిషికి కూడా నోటీసులు ఇచ్చిన ఘటన విజయపురలో చోటు చేసుకుంది. సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆ మేరకు వారిద్దరికీ నోటీసులు జారీ చేశారు. విజయపుర రాజ్కుమార్ లేఅవుట్లోని మెట్రిక్ అనంతర వృత్తి పర బాలికల హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంఘీక సంక్షేమ శాఖ పరిధిలోని ఈ హాస్టల్ వార్డెన్ శకుంతల రాజ్పుత్, ఎటువంటి అనుమతి తీసుకోకుండా హాస్టల్ విద్యార్థినులను పుట్టిన రోజు విందుకు అని హోటల్కు తీసుకెళ్లారు. ఆ మేరకు హాస్టల్ విద్యార్థినులతో చిందు, మందు వేసి జల్సా చేయడం ద్వారా హాస్టల్ నియమాలను ఉల్లంఘించారు. ఘటన వివరాలను అందుకున్న వెంటనే సదరు శాఖ డీడీ బాధ్యురాలైన హాస్టల్ వార్డెన్ శకుంతల, వంట మనిషి రిజ్వాన్ ముల్లాకు నోటీసులను జారీ చేశారు. వంట మనిషి గతంలో ఇండి తాలూకాలోని హాస్టల్లో కూడా ఇదే విధంగా బర్త్డే పార్టీ చేసి సస్పెండ్కు గురైనట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. అగ్నిపథ్ సేనా ర్యాలీకి శ్రీకారం రాయచూరు రూరల్: అగ్నిపథ్ సేనా ర్యాలీకి నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ శ్రీకారం చుట్టారు. శుక్రవారం వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సేనా నియామక ర్యాలీని ప్రారంభించి ఆయన మాట్లాడారు. దేశసేవకు యువత ముందుకు రావాలన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులకు బంజార సేవా సంఘం భవన్, వాల్మీకి భవన్, సంతోష్ హబ్, కేఈబీ కళాశాలల్లో మౌలిక సౌకర్యాలను కల్పించడం అభినందనీయమన్నారు. ఉచిత వసతి, భోజనం, రవాణా సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు నగరంలోని సంఘ సంస్థలు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు. సేనా ర్యాలీలో సుమారు 20 వేల మంది యువత పాల్గొన్నారన్నారు. నగరసభ ఇంచార్జి అధ్యక్షుడు సాజిద్ సమీర్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, కృష్ణ, తహసీల్దార్ సురేష్ వర్మ, చంద్రశేఖర్, మల్లనగౌడ, పురుషోత్తంలున్నారు. రోడ్డు ప్రమాదంలో భిక్షకుడి మృతి హుబ్లీ: హుబ్లీ తాలూకా అంచటగేరి వద్ద జాతీయ రహదారి–63 పక్కన నిలబడిన భిక్షకుడిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సదరు వ్యక్తి మృతి చెందారు. అతివేగంతో వచ్చిన వాహనం భిక్షకుడిని ఢీకొంది. వాహనంతో పాటు డ్రైవర్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన భిక్షకుడిని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదని పోలీసులు తెలిపారు. హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి అదృశ్యం ఇంటి నుంచి చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ వ్యక్తి నెలన్నర రోజులైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జిల్లాలోని కుందగోళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కుందగోళ తాలూకా కమడొళ్లికి చెందిన చంద్రశేఖర్(35) కనిపించకుండా పోయిన వ్యక్తి. 5.6 అడుగుల ఎత్తు, గోధుమ రంగు శరీరఛాయ కలిగిన ఈయన గత జూన్ 22 నుంచి కనిపించడం లేదని, ఇతని ఆచూకీ తెలియజేయాలని బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిధుల మళ్లింపుపై నిరసన రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం బోవి సమాజం అభివృద్ధి మండలి నిధులను సమాజాభివృద్ధికి వ్యయం చేయకుండా పంచ గ్యారెంటీలకు మళ్లించడం తగదని బోవి సమాజం నేతలు పేర్కొన్నారు. శుక్రవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో లింగసూగూరు శాసన సభ్యుడు వజ్జల్ మానప్ప మాట్లాడారు. 2025–26లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన రూ.13,43,384ల నిధులను పంచ గ్యారెంటీలకు వినియోగించారన్నారు. బోవి సమాజానికి కేటాయించిన స్వావలంబి సారథి, గంగా కళ్యాణ, స్వయం ఉపాధి, ఉద్యమ శీలత, భూ పథకం, బోర్వెల్, కుట్టు మిషన్లు వంటి వాటికి సబ్సిడీలు లేకుండా చేశారని ఆరోపించారు. బోవి సమాజం నిధులు మండలికి కేటాయించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, వీరనగౌడ, నారాయణ స్వామి, బీవీ నాయక్, రవీంద్ర జాలదార్, గంగాధర నాయక్, బసనగౌడ, కొట్రేశ్లున్నారు. -
హుబ్లీ రైల్వే జోన్లో రైళ్లు మరింత వేగిరం
హుబ్లీ: ప్రతి రైల్వే స్టేషన్లో ముఖ్యమైన రైలు మార్గాలు, లూప్లైన్లు, అదనపు లైన్లు ఉంటాయి. వీటి కార్య సామర్థ్యం వృద్ధి చేయడం ద్వారా రైళ్ల సంచార కార్యాచరణ, దక్షత వేగం పెంపులో నైరుతి రైల్వే దూసుకుపోతోంది. ఇప్పటికే వెయ్యికి పైగా కిలోమీటర్ల మేర ట్రాక్ల్లో రైలు సంచార వేగాన్ని పెంచింది. ఓ గంట పాటు సమయం దీంతో అదా కానుంది. వీటితో పాటు మార్గాల్లో రైలు వేచి ఉండటం వల్ల సంచారంలో జాప్యం ప్రమాణాలు తగ్గనున్నాయి. జోన్ పరిధిలో ఇప్పటి వరకు లూప్లైన్లలో వేగ పరిమితి గంటకు 15 కిలో మీటర్లు ఉండేది. ప్రస్తుతం గంటకు 30 కిలో మీటర్లకు పెంచారు. అలాగే బెంగళూరు విభాగంలో 591 కిలోమీటర్ల మేర ట్రాక్ల ఆధునీకరణ, లూప్లైన్లో వేగం పరిమితి పెంపు ఫలితంగా 41 నిమిషాల సమయం ఆదా అయింది. ఆ మేరకు 281 కిలోమీటర్ల ఆధునిక ట్రాక్లో వేగాన్ని గంటకు 110 నుంచి 130 కిలో మీటర్లు, అలాగే 495 కిలో మీటర్ల ట్రాక్లో 100 నుంచి 110 కిలోమీటర్లకు పెంచారు. హుబ్లీ విభాగంలోని ప్రముఖ 10 స్టేషన్లలో 12 లూప్లైన్లు, అలాగే 135 కిలో మీటర్ల సామర్థ్య వృద్ధి ఫలితంగా 12 నిమిషాల సమయం ఆదా అయింది. మైసూరు డివిజన్లో కూడా.. మైసూరు విభాగంలో 135 కిలోమీటర్లలో వేగ పరిమితిని గంటకు 70 నుంచి 80 కి.మీ.లకు పెంచడానికి దోహద పడింది. దీంతో సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల సంచారం రెండింటికీ ప్రయోజనం అయింది. ఈ విషయమై రైల్వేజోన్ సీపీఆర్ డాక్టర్ మంజునాథ కనుమడి మాట్లాడుతూ 2024–25వ సంవత్సర గడువులో 835 కిలో మీటర్ల మేర ట్రాక్ 110–130 కిలోమీటర్ల వేగానికి ఆధునికీకరించారు. దీంతో 24 నిమిషాల సమయం ఆదా కానుంది. 2024లో సుమారు 60 నిమిషాల పాటు ఆదా చేశారు. హుబ్లీ విభాగంలో 13 నిమిషాలు, బెంగళూరులో 40 నిమిషాలు, మైసూరు విభాగంలో 6 నిమిషాలు సమయం ఆదా అయింది. మొత్తం మీద నైరుతి రైల్వే జోన్లో 384 రైల్వే స్టేషన్లు ఉండగా 3,692 కిలో మీటర్ల నెట్వర్క్ కలిగి ఉంది. వీటిలో రోజు సుమారు 400 ప్యాసింజర్ రైళ్లు సంచరిస్తున్నాయి. లూప్లైన్లలో వేగ ప్రమాణం వృద్ధి చేయడంతో ప్రధాన మార్గాల్లో గరిష్టంగా అనుమతించిన వేగాన్ని పెంచడానికి సహాయ పడింది. అలాగే గూడ్స్ రైళ్లు అత్యధిక వేగంతో సంచరించడం ద్వారా నిర్ధిష్ట సమయానికి సరుకు చేరవేయడానికి, ఆర్థిక పురోగతికి ఉత్తేజాన్ని ఇచ్చింది. లూప్లైన్, ట్రాక్ల కార్య సామర్థ్య వృద్ధి వెయ్యికి పైగా కి.మీ.మేర రైళ్ల వేగం పెంపు -
10న ప్రతిభా పురస్కారాల ప్రదానం
రాయచూరు రూరల్: జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ నెల 10న సింధనూరులోని సత్యగార్డెన్లో ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెన్త్, ఇంటర్లో 90 శాతానికి పైగా మార్కులు పొందిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో హంపీ మఠాధిపతి వామదేవ మహంత శివాచార్య మహాస్వామి, భీమవ్వ దొడ్డబాళప్ప, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడాక్షరి, మహేష్, నాగరాజ్, ఆసిఫ్, మల్లికార్జునగౌడ, చంద్రశేఖర్, గిరిగౌడ, శివరుద్రయ్య పాల్గొంటారన్నారు. ఈసందర్భంగా శంకరగౌడ, యంకప్ప తదితరులు పాల్గొన్నారు. శ్మశాన స్థలం కేటాయించరూ రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకా ముక్కుందా గ్రామంలో అంత్యక్రియలకు గ్రామస్తులు నానాపాట్లు పడుతున్నారనే వార్తపై స్పందించిన దళిత సేన నేతలు గ్రామంలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జావిద్ ఖాన్ మాట్లాడారు. సింధనూరు తాలూకా ముక్కుందాలో మృతదేహాలకు అంత్య సంస్కారాలు చేయాడానికి తుంగభద్ర నదిలోకి దిగి అవతలి ఒడ్డును చేరుకొని ఖననం చేయాల్సిన దీన స్థితిలో ఉన్నారని, మృతదేహాన్ని మోసుకొని నీటిలో తీసుకెళ్లిన చిత్రాలను చూపించారు. అనంతరం వారు అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వమే చేనేత చీరలు కొనాలి రాయచూరు రూరల్: చేనేత కారులు మగ్గాలపై నేసిన చీరలను సర్కారు కొనుగోలు చేయాలని జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ నగరసభ అధ్యక్షురాలు లలితా ఆంజనేయ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ఖాదీ గ్రామీణ భండార్ కేంద్రంలో జాతీయ చేనేతకారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. విద్యుత్ ధరలు పెంచడంతో కష్టాలు తప్ప లాభాలు లేవన్నారు. ప్రభుత్వం విద్యుత్ బిల్లుల తగ్గింపుపై పునరాలోచించాలన్నారు. చేనేత కార్పొరేషన్ మండలికి చైర్మన్ను నియమించాలన్నారు. ఈ విషయంలో ముఖ్య మంత్రి సిద్దరామయ్య ఉత్తర కర్ణాటక ప్రాంతంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలన్నారు. ఉచిత విద్యుత్ భాగ్యకు నోచుకోని చేనేతకారులకు దౌర్భాగ్యం పట్టిందన్నారు. కార్యక్రమంలో శరణమ్మ, సులోచన, సుమ గస్తీలున్నారు. పాలనలో కన్నడకు ప్రాధాన్యత ఇవ్వండి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పాలనా వ్యవహారాల్లో కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని జయ కర్ణాటక సంఘం అధ్యక్షుడు శివకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు రికార్డులను, రిజిస్టర్లను, చేసిన పనుల పేర్లను కూడా కన్నడలోనే రాయించాలని అధికారులను కోరారు. జిల్లాలోని వివిధ శాఖాధికార్లు కన్నడ భాషకు బదులుగా ఆంగ్లంలో రాయడాన్ని వదిలి పెట్టాలన్నారు. ప్రభుత్వ పనులను చేసినప్పుడు కన్నడలోనే నామఫలకాలను ఏర్పాటు చేసేలా అధికారులకు, కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని జిల్లాధికారికి విన్నవించారు. బంగారు, వెండి ఆభరణాల చోరీ హుబ్లీ: నగరంలోని సంతోష్నగర్ మధుర పార్క్లోని ఓ ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి లోనికి వెళ్లిన దొంగలు 120 గ్రాముల బంగారు ఆభరణాలు, డైమండ్తో కూడిన జుమ్కీలు, అలాగే ఒక కేజీ వెండి సామానులను చోరీ చేశారు. ఇంటికి తాళం వేసి బెంగళూరుకు వెళ్లిన క్రమంలో రూపా జయకర్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఈ నెల 4న తిరిగి వచ్చి చూడగా చోరీ వెలుగు చూసింది. అలాగే బ్యాంక్ రికార్డులు, రూ.8 వేల నగదు, పలు వివరాలతో ఉన్న నాలుగు హార్డ్డిస్క్లు కూడా చోరీ అయినట్లు అశోక్ నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రూపా జయకర్ తెలిపారు. -
యువనిధి ప్లస్తో యువతకు సాధికారత
హొసపేటె: యువతను ప్రోత్సహించడానికి, యువనిధి పథకం ద్వారా వివిధ నైపుణ్య ఆధారిత శిక్షణను అందించడానికి, స్వతంత్ర జీవితాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం యువనిధి ప్లస్ పథకాన్ని అమలు చేసిందని, యువత, మహిళలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పథకం అమలు ప్రాధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు కురి శివమూర్తి తెలిపారు. గురువారం నగరంలోని టీఎంఏఈఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన యువనిధి, యువనిధి ప్లస్ పథకాలపై ఒక రోజు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువనిధి పథకం కింద విద్యార్థులు పేర్లు నమోదు చేసుకుని ఆర్థిక సహాయం పొందేందుకు మాత్రమే కాకుండా నిరుద్యోగ సమస్యను తొలగించి వారు స్వంత ఉద్యోగాలను సృష్టించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలతో యువనిధి ప్లస్ను ప్రారంభించిందన్నారు. జిల్లాలో 8,007 మంది పేర్ల నమోదు ఇప్పటికే జిల్లాలో 8,007 మంది లబ్ధిదారులు యువనిధి పథకం కింద పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ప్రస్తుతం 109 మంది అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థలు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయన్నారు. దశల వారీగా అభ్యర్థులందరికీ నైపుణ్య శిక్షణ అందిస్తారన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం అధికారి పీఎన్.హట్టప్ప, జిల్లా స్థాయి హామీ పథకాల అమలు ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ హెచ్.జాండీసాహెబ్, సంస్థ సభ్యుడు పీహెచ్.దేవరాజ్, టీఎంఏఈఎస్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ హెచ్.శంకరానంద, టీఎంఏఈఎస్ ఐటీఐ కళాశాల వైస్ ప్రిన్సిపల్ టీ.నజీరుద్దీన్, ప్రిన్సిపాల్ రేవణ సిద్దప్ప, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతుల డిమాండ్లు నెరవేర్చండి
హొసపేటె: విజయనగర జిల్లాలోని కూడ్లిగి తాలూకా రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తహసీల్దార్ వీకే.నేత్రావతి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జేఎం.వీరసంగయ్య మాట్లాడుతూ పేద రైతులు దున్నిన భూమికి ఫారం నెంబర్– 53, 57లో భూమి కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే భూమి పట్టాలు ఇవ్వాలని అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రైతుల పేర్లను ఉపయోగిస్తున్నారని, ఇప్పుడు వారు మీనమేషాలను లెక్కించి భూమి పట్టాలు ఇస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. కూడ్లిగి తాలూకాలో రైతు నిరసనలు, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించడానికి రైతు భవన్ నిర్మించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతుల పంపుసెట్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయకూడదన్నారు. తాలూకాలోని రైతులు తమ పొలాలకు రోడ్డు నిర్మించడానికి చొరవ తీసుకోవాలని, కూడ్లిగి తాలూకాలోని ఏపీఎంసీ మార్కెట్ను బ్రోకర్లు వ్యాపారం చేయడానికి వీలుగా అభివృద్ధి చేయాలని, రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి అనుమతించాలని ఆయన అన్నారు. తాలూకాలోని 74 చెరువులను నింపే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు. బీపీఎల్ కార్డుల్లోని వ్యత్యాసాలను సరిదిద్దే నెపంతో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని, దీనిని త్వరగా సరిదిద్దాలని కూడా పిటిషన్లో డిమాండ్ చేశారు. మైక్రోఫైనాన్స్ నుంచి రుణాలు తీసుకొని రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా నిరోధించాలని, రైతులకు యూరియా ఎరువులను సకాలంలో సరఫరా చేయాలని కూడా పిటిషన్లో డిమాండ్ చేశారు. తహసీల్దార్ వీకే.నేత్రావతి ఆ అభ్యర్థనను అంగీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బీ.గోణి బసప్ప, కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం తాలూకా అధ్యక్షుడు ఎన్.రమేష్, గౌరవాధ్యక్షుడు ఎన్ఎల్.పాండురంగ నాయక్, మంజునాథ్, బి.కొడ్లప్ప, చెన్నబసప్ప బణకార, యూ.దురుగప్ప, హనుమంతప్ప, ఎస్.బాషాసాబ్ తదితరులు పాల్గొన్నారు. -
వరమహాలక్ష్మీ నమోస్తుతే
సాక్షి, బళ్లారి: ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే వరమహాలక్ష్మి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శుక్రవారం వరమహాలక్ష్మి పండుగ పౌర్ణమి రోజున రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వరమహాలక్ష్మి అమ్మవారిని ఇంటింటా అలంకరణ చేసుకుని, వివిధ రకాల నైవేద్యాలను సమర్పించుకుని, ఎవరికి వారు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పండుగను చేసుకున్నారు. వరమహాలక్ష్మీ వ్రత మంత్రాలను జపిస్తూ అమ్మవారిని కొలిచారు. మహిళలు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ అమ్మవారిని తమ ఇళ్లలో అలంకరించుకుని పూజలు చేయడంతో నగరంలో వరమహాలక్ష్మి పండుగ కళ ఉట్టిపడింది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిని వరమహాలక్ష్మిద పండుగ రోజున భక్తిశ్రద్ధలతో పూజిస్తే ధనప్రాప్తి పొందడమే కాకుండా ప్రతి రంగంలోను విజయం సొంతమవుతుందని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం, నమ్మకం ఉండటంతో వరమహాలక్ష్మిద పండుగను వేడుకగా జరిపారు. నగర ఆదిదేవత శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసి, అలంకరణలు చేయడంతో ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రావణ శుక్రవారం అందులోనూ వరమహాలక్ష్మిద పండుగ రోజున శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో క్యూకట్టి అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. విజయనగరలో.. హొసపేటె: ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నగరంలో వరమహాలక్ష్మి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇంట్లో సాంప్రదాయబద్ధంగా అలంకరణలు, పూలదండలు, రంగురంగుల రంగోలీలతో పండుగ వాతావరణం నెలకొంది. మహాలక్ష్మి దేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజించారు. మంత్రాలు పఠించారు. హారతి ఇచ్చారు. పండుగలో భాగంగా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి పూజల్లో పాల్గొన్నారు. ఇరుగు పొరుగువారు, బంధువులు, స్నేహితులు హాజరై దేవి కృప కోసం ప్రార్థించారు. పూజ తర్వాత మహా ప్రసాదం పంపిణీ చేశారు. భక్తి సంప్రదాయం, సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ పండుగ ఇంటికి ఆనందాన్ని వేడుకను తెచ్చి పెట్టింది. మార్కెట్లో పండుగ సందడి విజయనగర జిల్లా అంతటా వరమహాలక్ష్మి పండుగ వేడుకగా జరిగింది. పండుగ షాపింగ్ జోరుగా సాగింది. జిల్లా ప్రధాన కార్యాలయం, హొసపేటె, హగరిబొమ్మనహళ్లి, హువిన హడగలి, కూడ్లిగి, హరపనహళ్లి తాలూకాల్లో వర మహాలక్ష్మి పండుగకు సన్నాహాలు మిన్నంటాయి. పూలు, పండ్లు, అరటి పిలకలు, చెరుకు వంటి పూజా సామగ్రిని కొనుగోలు చేయడంలో ప్రజలు బిజీగా గడిపారు. మహిళలు ఇళ్లలో వరమహాలక్ష్మి దేవిని ప్రతిష్టించి, చీరలు, రవికలు, దుస్తులు, ఆకుపచ్చ రంగు గాజులు, పసుపు, కుంకుమ, దేవత ముఖ కిరీటం, దేవతకు అలంకార వస్తువులను కొనుగోలు చేశారు. నగరంలోని మూరంగడి సర్కిల్, గాంధీ చౌక్, మదకరి నాయక సర్కిల్, కూరగాయల మార్కెట్ వద్ద పూలు, పండ్ల వ్యాపారం జోరుగా జరిగింది. మార్కెట్తో పాటు ఇతర ప్రదేశాల్లో పూలు, పండ్లు, అరటిపండ్లు, చెరుకు గడలు అమ్ముడు పోయాయి. వాటిని కొనడానికి వచ్చిన ప్రజలతో నగరంలోని ప్రధాన రహదారులు నిండిపోయాయి. ట్రాఫిక్ సమస్యను నివారించడానికి పోలీసులు చర్యలు తీసుకున్నారు. నగరంలోని గాంధీచౌక్లో పూలు, పండ్ల వ్యాపారం జోరుగా జరిగింది. భక్తిశ్రద్ధలతో వరమహాలక్ష్మి పండుగ ఆచరణ ఇంటింటా అమ్మవారికి అలంకరణలు, పూజలు కనక దుర్గమ్మ ఆలయంలో కిటకిటలాడిన భక్తులు -
కళ్యాణ కర్ణాటకలో కుండపోత వర్షం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో గురువారం రాత్రి భారీ వర్షం కురిిసింది. ఎక్కడ చూసినా రహదారులు బురద గుంటలుగా మారాయి. ఉదయం ఎండలు వేడిని పుట్టించాయి. మంత్రాలయం రహదారిలో నీరు నిలిచిపోయి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగాయి. మున్నూరు వాడి, గాంధీచౌక్, మహావీర్ చౌక్లోకి వర్షపు నీరు చొరబడ్డాయి. కలబుర్గి జిల్లా చించోళిలో ముల్లామారి పథకం కింద నిర్మించిన నాగరాళ జలాశయం నుంచి నీరు వదలడంతో వాగులో నీరు అధికంగా ప్రవహించాయి. ముదగల్లో వాన నీటితో వాగులో నీరు పొంగి ప్రవహిస్తున్నాయి. పొంగిపొర్లుతున్న వాగులు కాలనీలు, రోడ్లు జలమయం -
ఆల్మట్టి ఎత్తు పెంపునకు అడ్డుకోవద్దు
రాయచూరు రూరల్: కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక సర్కార్ సిద్ధంగా ఉండగా, ఈ విషయంలో మహారాష్ట్ర సర్కార్ డ్యాం ఎత్తు పెంచరాదంటూ కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించి మోకాలొడ్డిన నేపథ్యంలో రాష్ట్ర నేతలు కేంద్ర మంత్రులను కలిశారు. గురువారం కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సీ.అర్.పాటిల్ను ఢిల్లీలో కలసిన మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణ పలు అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. -
మైసూరు టు తిరుపతికి రైళ్లను పెంచాలి
మైసూరు: ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి, తిరుమలకు మైసూరు, మండ్య, చామరాజనగర జిల్లాల నుంచి అతి ఎక్కువ మంది భక్తులు వెళ్తుంటారు, వారి కోసం తిరుపతికి అదనపు రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను మైసూరు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ కోరారు. శుక్రవారం ఢిల్లీలో ఆయనను కలిసి తిరుపతి–బెంగళూరు మధ్య వందేభారత్ రైలు ఉందని, దానిని మైసూరు సిటీ వరకు విస్తరించాలని కోరారు. అలాగే మైసూరు చుట్టుపక్కల జిల్లాలవారి కోసం తిరుపతికి అదనంగా రైళ్లను నడపాలని డిమాండ్ చేశారు. అన్నదాత బలవన్మరణం మైసూరు: అప్పులబాధను తట్టుకోలేక అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని దాసనపుర గ్రామంలో జరిగింది. రైతు వెంకటేష్ (45), వ్యవసాయ సేవా సహకార బ్యాంకులో రూ. 5 లక్షలకు పైగా అప్పులు చేశాడు. అలాగే కొటక్ మహేంద్ర బ్యాంకులో రూ.10 లక్షలు తీసుకుని ట్రాక్టర్ను కొన్నాడు, కుటుంబం, ఇతరత్రా ఖర్చుల కోసం కూడా రుణాలు తీసుకున్నాడు. పొలంలో పంట పండినా సరైన ధర లేక నష్టపోయాడు. రూ. 20 లక్షల అప్పులను తీర్చే మార్గం లేక తోటలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హుణసూరు గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. విష్ణువర్ధన్ సమాధి ధ్వంసం యశవంతపుర: ప్రముఖ కన్నడ దివంగత నటుడు, సాహససింహ విష్ణువర్ధన్ సమాధిని ఎవరో దుండగులు ధ్వంసం చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. అభిమాన్ స్టూడియోలో ఆయన సమాధి ఉంది. గురువారం సాయంత్రం వరకు సమాధి బాగానే ఉండగా శుక్రవారం ఉదయానికి మాయమైంది. అక్కడి స్థలం గురించి బాలణ్ణ కుటుంబం, విష్ణువర్ధన్ అభిమానుల మధ్య కొన్ని రోజుల నుంచి వివాదం నడుస్తోంది. ఇటీవల విష్ణు పుణ్యతిథి నిర్వహించడానికి కూడా బాలణ్ణ కుటుంబం అవకాశమివ్వలేదు. వారే ఈ సమాధిని ధ్వంసం చేశారని అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ధర్మస్థల గొడవల్లో ఒకరి అరెస్టు బనశంకరి: ధర్మస్థలలో యూట్యూబ్ చానెళ్ల విలేకరులు, మీడియా సిబ్బందిపై దాడులు చేసిన కేసుల్లో స్థానికుడు సోమనాథ సపల్య (50) అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ పీ.అరుణ్కుమార్ తెలిపారు. శుక్రవారం మంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ... బెళ్తంగడి నివాసి చరణ్శెట్టి అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు గిరీశ్ మట్టణ్ణవర్, మహేశ్ తిమరోడి పై కేసు నమోదైందని తెలిపారు. వీరు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా భయం పుట్టించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేశారని చెప్పారు. పునీత్కెరెహళ్లి పై బెళ్తంగడి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అతడు కూడా ఫేస్బుక్లో అశ్లీలంగా మాట్లాడినట్లు తేలిందన్నారు. శరీర భాగాల కోసం గాలింపు ● అపరిచిత మహిళ హత్య కేసు... తుమకూరు: తుమకూరు జిల్లాలో మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసి శరీర భాగాలను ముక్కలుగా ఖండించి దూరదూరంగా విసిరేసిన కేసులో సస్పెన్స్ వీడుతోంది. కొరటిగెరె తాలూకాలో కోలాల సమీపంలో దొడ్డసాగరె గ్రామపంచాయతీ పరిధిలో చింపుగానహళ్ళి ముత్యాలమ్మ గుడి వద్ద గురువారం మహిళ చేతులు, జుట్టు, కొంత దూరంలో కాళ్లు లభించాయి. దొగ్గెనహళ్ళి వద్ద తల పడి ఉంది. మరెనాయకనహళ్ళి దగ్గర వెనుక భాగం ఉంది. మహిళ ఎద భాగంతో పాటు లో దుస్తులు కూడా అక్కడ దొరికాయని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 60 శాతం అవయవాలు లభించాయని, 40 శాతం దొరకాలని చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాలలో పోలీసులు పగలూ రాత్రి వెతుకుతున్నారు. చింపుగానహళ్ళి దగ్గర రెండు రోజుల కింద ఓ కారు తిరిగినట్లు కొన్ని సీసీ కెమెరాలలో రికార్డయింది. ఆ క్లూ తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ మిస్సింగ్ కేసులు ఆరా తీస్తున్నారు. కేసు కొలిక్కి వచ్చినట్లు, మృతురాలు మధ్యవయస్కురాలని తెలిసింది. -
మహిళలకు అండగా మాతృవందన
హొసపేటె: తల్లుల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం మాతృవందన పథకాన్ని మహిళలకు బహుమతిగా ఇచ్చిందని మహిళా శిశు అభివృద్ధి పథకం అధికారిణి సింధు అంగడి తెలిపారు. తాలూకాలోని హళే మలపనగుడి అంగన్వాడీ–2వ కేంద్రంలో నిర్వహించిన మాతృవందన శిబిరాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. పాలిచ్చే తల్లులు పౌష్టికాహారం తినాలని, ఆరోగ్య సంరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అవగాహన కల్పించారు. మలపనగుడి పీడీఓ హనుమంతప్ప, అంగన్వాడీ కార్యకర్త మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మూర్ఖపు మాటలవి: విజయేంద్ర
శివాజీనగర: రాహుల్గాంధీ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయి ఓట్ల దొంగతనం అని మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ఆరోపించారు. మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాహుల్ మాటలతో ఓటర్లను అవమానించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన సమాచారాన్ని రాహుల్గాంధీ సాక్ష్యాలు అనుకొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మూర్ఖుల మాదిరిగా ప్రధాని రాజీనామాను కోరుతున్నారు అని విమర్శించారు. చెట్లేం పాపం చేశాయ్? ● వక్క తోట నరికివేత పావగడ: విద్వేషాలకు పచ్చని చెట్లు బలయ్యాయి. తాలూకాలోని విష సంస్కృతి వ్యాపిస్తోంది. చిత్తగానహళ్ళి గ్రామ రైతు సీఆర్ రంగణ్ణ కు చెందిన సుమారు 120 వక్క చెట్లను గుర్తు తెలియని దుండగులు నరికి వేసిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. 4 సంవత్సరాల నుంచి పెంచిన వక్క చెట్లను నరికివేయడం తో రైతు రంగణ్ణ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అప్పులు చేసి తోటను సాగు చేశానని, పంట పండే సమయంలో దుండగులు నరికివేశారని వాపోయాడు. ఈ సంఘటనపై గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. గ్రామంలో ఎవరికీ హాని తలపెట్టని రంగణ్ణకు తీవ్ర నష్టం చేకూర్చారని మండిపడ్డారు. లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు విలపించాడు. ఇలాంటి దారుణాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలన్నారు. స్థానికులతో కలిసి సీఐ సురేశ్కు ఫిర్యాదు చేశారు. -
హస్తం.. నిరసన గళం
శివాజీనగర: ఓట్లను దొంగిలించారంటూ ఎన్నికల కమిషన్కు, కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో శుక్రవారం భారీ ఎత్తున నిరసనను నిర్వహించింది. ఫ్రీడం పార్కులో ధర్నా, బహిరంగ సభ సాగింది. రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్, సీనియర్ నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తరలివచ్చారు. బెంగళూరు సెంట్రల్ లోక్సభా నియోజకవర్గంలోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలోనే 1 లక్ష ఓట్లను అక్రమంగా చేర్చారని రాహుల్గాంధీ ఆరోపించారు. రాహుల్ సహా ముఖ్యనేతలు మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై ఆరోపణలు సంధించారు. దొంగ సర్కారు: ఖర్గే 2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఓట్లు దొంగిలించి ఈ దేశ ప్రధాని అయ్యారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తూ గత ఎన్నికలు ప్రజలకు ద్రోహం చేసిన ఎన్నికలు. మోదీ, అమిత్ షాకు ప్రజలు ఓటు వేయకపోయినా కూడా ఓట్లు చోరీ చేసి గెలిచామంటున్నారు. ఇందుకు ఎన్నికల కమిషన్ను వాడుకుంటున్నారు. ఇది దొంగ ప్రభుత్వం. వీరికి నైతిక బలం లేదు. ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదు అని దుయ్యబట్టారు. 2019లో తాను తొలిసారిగా ఓడినప్పుడే బోగస్ ఓటింగ్ అని అనుమానం వచ్చిందన్నారు. మోదీకి హక్కు లేదు: సీఎం సిద్దు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల దొంగతనం చేసిన నరేంద్ర మోదీకి ప్రధాని కుర్చీలో కూర్చునే నైతిక హక్కు లేదని, తక్షణమే రాజీనామా చేయాలని సీఎం సిద్దరామయ్య అన్నారు. సభలో ఆయన ప్రసంగిస్తూ ఎన్నికల కమిషన్ బీజేపీ ఆఫీసుగా మారిందన్నారు. మనువాదులు, రాజ్యాంగ వ్యతిరేకులు రాజ్యాంగ వ్యవస్థనే తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. కర్ణాటకలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లను గెలవాల్సి ఉంది, అయితే ఓట్ల దొంగిలింపుతో అనేకచోట్ల ఓడిపోయామని ఆరోపించారు. ఈవీఎంలు వచ్చిన తరువాత దుర్వినియోగం జరుగుతోందన్నారు. స్వతంత్ర పార్కులో బృహత్ ఆందోళన ఈసీ, ప్రధాని మోదీపై రాహుల్గాంధీ, ఖర్గే ఆరోపణలు -
ధర్మస్థలలో వివాహిత ఆత్మహత్య
యశవంతపుర: సంచలనాలు జరుగుతున్న ధర్మస్థలలో వినుత (26) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. బుధవారం రాత్రి తన నివాసంలో ఉరి వేసుకొది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. ముళిక్మారుకు చెందిన రమేశ్తో పెళ్లి కాగా ధర్మస్థళలో నివాసం ఉంటున్నారు. వినుత ఓ షాపులో పని చేస్తున్నట్లు ధర్మస్థల పోలీసులు తెలిపారు. ధర్మస్థలలో ఇటీవల అసహజ మరణాలు, శవాల తవ్వకాల సమయంలో ఈ ఆత్మహత్య జరగడం చర్చనీయాంశమైంది. మరో యువతి.. కడుపునొప్పి తట్టుకోలేక ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శివనసముద్ర వద్ద జరిగింది. రామనగర తాలూకా హంగరపాళ్య గ్రామానికి చెందిన నాగేష్ భార్య శకుంతల (23), అనారోగ్యం కారణంగా గత మూడు నెలలుగా శివనసముద్రలోని పుట్టింటిలో ఉంది. కడుపునొప్పి తీవ్రం కావడంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కార్మికుల పేరుతో రూ.కోట్లు స్వాహా: ఎమ్మెల్సీ యశవంతపుర: రాష్ట్రంలో వాల్మీకి అభివృద్ధి మండలి, ముడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఇబ్బంది ఎదురైంది. కార్మికుల కోసం ఆరోగ్య శిబిరాలను నిర్వహించిన్నట్లు తప్పుడు లెక్కలు చూపించి కోట్ల రూపాయిలను దండుకున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ కేఎస్ నవీన్ ఆరోపించారు. బెంగళూరులో పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. కార్మికశాఖ మంత్రి సంతోష్లాడ్పై ఆరోపణలు చేశారు. కట్టడ కార్మికులకు అరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు తప్పులు లెక్కలు చూపి కోట్ల రూపాయలను లూటీ చేశారని ఆరోపించారు. మంత్రి సంతోష్లాడ్ నేరుగా అవినీతికి పాల్పడినట్లు చెప్పారు. తాను సమాచార చట్టం ద్వారా వివరాలను అడిగితే ఇవ్వడం లేదన్నారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్ర ఖాతాల సీజ్ బనశంకరి: మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసులో ప్రముఖ నిందితుడు సయ్యద్ యాసిన్.. బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ.29 వేల నగదును ఈడీ అధికారులు జప్తు చేశారు. కొందరు ఉగ్రవాదులు ధర్మస్థల దేవస్థానంలో బాంబుపెట్టి పేల్చివేయడానికి కుట్రపన్నారని ఈడీ తేల్చింది. గతంలో మహమ్మద్ షారిక్ బాంబును ధర్మస్థల మంజునాథస్వామి మందిరంలో పెట్టి పేల్చివేయడానికి కుట్ర చేశాడు. బాంబును ఆటోలో తీసుకెళ్తున్నాడు, బాంబుటైమర్ ను 90 నిమిషాలకు బదులు 9 సెకండ్లకు మార్చడంతో ఆటోలో పేలిపోయి గాయపడడం తెలిసిందే. అతనికి మద్దతుగా హజ్ మునీర్, కల్నల్ అనే కొందరు బ్యాంకు అకౌంట్లను నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. నగదు బదిలీ, బాంబుల తయారీలో మెళకువలు నేర్చుకున్నారు. అనధికార బ్యాంకు అకౌంట్లు, క్రిప్టో కరెన్సీ ద్వారా ఆర్థిక సాయం పొందారు. ఇలా రూ.2.86 లక్షలు నగదు అందింది. ఈ డబ్బుతో బాంబుల తయారీ, ఉగ్రవాద పనులు చేపట్టారు. నిందితులు జైల్లో ఉన్నారు. నేడు నగరంలో రాహుల్ సభశివాజీనగర: ఓటరు జాబితా అక్రమాలకు వ్యతిరేకంగా శుక్రవారం బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ జరుపనుంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ ధర్నా జరుగుతుంది. లక్ష మంది పాల్గొనేలా ఫ్రీడంపార్క్లో సభకు ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ ఈ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాంగ్రెస్ ఎమ్మల్యేలు, ఎంపీలు, మంత్రులు, నేతలకు జనాన్ని తరలించాలని ఆదేశించారు. పార్టీలోని అన్ని స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం సిద్దరామయ్య, డీసీఎం శివకుమార్ ఆదేశించారు. దీంతో ఫ్రీడంపార్క్తో సహా పరిసర ప్రాంతాలు జనంతో నిండిపోయే అవకాశముంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు పాల్గొంటారు. ఎన్నికల అక్రమాల ఆధారాలను విడుదల చేస్తానని రాహుల్గాంధీ ప్రకటించారు. -
మహిళను హత్య చేసి.. ముక్కలు ముక్కలు..
తుమకూరు: మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అక్కడక్కడా పడేశారు. అత్యంత హేయమైన ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలూకాలో దొడ్డసాగ్దెరె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చింపుగానహళ్ళిలో జరిగింది. ముత్యాలమ్మ దేవాలయం వద్ద మృతదేహం ముక్కలు కనిపించాయి. లింగాపుర వంతెన వద్ద కడుపు భాగం, చింపుగానహళ్ళి వంతెన వద్ద జుట్టు, చేతులు, ముత్యాలమ్మ గుడి ముందు చెయ్యి, గరుడాచల నది పక్కన మూడు శరీర భాగాలు కనిపించాయి. గురువారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు నల్లని కవర్ల నుంచి దుర్వాసన వస్తుండడంతో పరిశీలించగా మహిళ శరీర భాగాలు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. హంతకులు మహిళను చంపి నరికివేసి ముక్కలను విసురుతూ వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మొదట పురుషుడా, మహిళా అని సందేహం వచ్చింది. తల వెంట్రుకలు చూసి మహిళే అని నిర్ధారించారు. మిగతా అనేక శరీర భాగాల జాడ లేదు. కొంచెం దూరం గాలిస్తూ వెళ్లగా, తల, మొండెం, గుర్తుపట్టకుండా నుజ్జు చేసిన ముఖం ఒక నల్ల కవరులో కట్టి పడేసి ఉన్నాయి. హతులు ఒక్కరు కాదు.. ఇద్దరా? రెండు చోట్ల దొరికిన చేతులను పరిశీలించగా వేరు వేరు రంగుల్లో ఉన్నాయని, దీనిని బట్టి ఒకరివి కాదు ఇద్దరివి అయి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. దీనిని బట్టి హంతకులు ఇద్దరు సీ్త్రలను చంపి ముక్కలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుర్ఘటన గురించి తెలియగానే చుట్టుపక్కల గ్రామస్తులు రావడంతో రద్దీ ఏర్పడింది. జనం రాకుండా చుట్టూ కంచె వేసి పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం వరకు ఘటనాస్థలిలో అవశేషాల సేకరణ కొనసాగింది. జిల్లా ఎస్పీ అశోక్, తిపటూరు డీఎస్పీ కుమారశర్మ పరిశీలించారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల పల్లెల్లో భయాందోళన అలముకొంది. తుమకూరు జిల్లా కొరటగెరె వద్ద దారుణం -
వ్యక్తిగత ద్వేషంతో పంటకు నష్టం
హొసపేటె: రైతు పండించిన పంటను దుండగులు వ్యక్తిగత ద్వేషంతో నాశనం చేసిన ఘటన విజయనగర జిల్లా హూవిన హడగలి తాలూకాలోని హొళగుందిలో జరిగింది. గ్రామానికి చెందిన మెళ్లి హాలప్ప పొలంలో పండించిన మొక్కజొన్న పంట నాశనమైనట్లు వెలుగులోకి వచ్చింది. హడగలి తాలూకాలో మంచి వర్షాలు కురవడంతో మొక్కజొన్న పంట బాగా పండింది. అయితే దుండగులు రాత్రి పూట మొక్కజొన్న కంకులను కోసి, మొక్కలను పెకలించి పారిపోయారు. ఎవరో దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కష్టపడి, అప్పులు చేసి పండించిన పంటను నాశనం చేశారని రైతులు కన్నీరు పెట్టారు. హూవినహడగలి స్టేషన్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ సంఘంలోని కొంత మంది సభ్యులు ద్వేషంతో ఇలా చేసి ఉండవచ్చు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసినట్లు హువిన హడగలి పోలీసులు తెలిపారు. -
రాజధానిలో రాత్రంతా వర్షం
శివాజీనగర: బెంగళూరులో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రదేశాలు జలమయం అయ్యాయి. గుంతల రోడ్లలో నీరు చేసి వాహనదారులు అవస్థలు పడ్డారు. అనేకచోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. రోడ్లలో నీరు నిలవడంతో వడ్డరపాళ్య నుంచి హెణ్ణూరు వైపు, గెద్దలహళ్లి వైపు వాహన సంచారం ఆలస్యంగా సాగుతోంది. రామమూర్తి నగర నుంచి కస్తూరి నగర వైపుకు సర్వీస్ రోడ్డులో వాననీరు నిలిచి వాహనాలకు ఇబ్బంది కలిగింది. పలు మార్గాలలో సంచార ఇబ్బందులు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు ఎక్స్లో తెలిపారు. వారం రోజులు వాన అలర్ట్ ఈ వారం రోజులు బెంగళూరులో అధిక వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బెంగళూరు గ్రామీణ, తుమకూరు, చిత్రదుర్గ, దావణగెర, కొప్పళ, బాగలకోట, బెళగావితో పాటుగా పలు ప్రాంతాలకు భారీ సూచన చేసింది. ఉత్తర కన్నడ, హావేరి, శివమొగ్గ, ఉడుపి, దక్షిణ కన్నడ, గదగ్, ధారవాడ, చిక్కమగళూరు, బెళగావి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు -
సేంద్రియ సాగు.. ఆరోగ్యం బాగు
సాక్షి, బళ్లారి: గతంలో రైతులు సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేసి వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు సాగు చేసేవారు. ముఖ్యంగా వరినాట్లు వేసే ముందు కానుగ ఆకు, తంగేడు ఆకు తదితర ఆకులు, అలములు వరినాట్లలో వేసి ఆవు పేడ, పశువుల పేడను వేసి అద్భుతంగా వరి పంటను పండించే వారు. వాటిని ఆహారంగా తీసుకొన్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కాదు. అయితే ఏటేటా మారుతున్న కాలానుగుణంగా జనాభా పెరుగుదలతో పాటు నీటి పారుదల వసతి భూమి కూడా ఏటేటా పెరుగుతూ వచ్చింది. గతంలో గ్రామాల్లో ఎక్కువగా నీటిపారుదల సౌకర్యం కలిగిన భూములు ఉండగా ప్రస్తుతం బోరు బావులు పెరగడంతో పాటు తుంగభద్ర ఆయకట్టు భూముల సంఖ్య పెరగడంతో రైతులు రసాయనిక ఎరువుల వాడకంపై ఆసక్తి చూపుతూ పంటలను పండిస్తున్నారు. వివిధ రకాల క్రిమి సంహారక మందులు వాడుతూ తాము పండించిన పంటలు అనారోగ్యకరమైనవని తెలిసినప్పటికీ గత్యంతరం లేక పంట దిగుబడిని పెంచుకునేందుకు క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువులను వాడుతూ వారికి వారే అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య కోకొల్లలు. సేంద్రియ సాగుతో అధిక దిగుబడి ఇటీవల వారం రోజుల క్రితం రాయచూరు జిల్లాలో ఓ రైతు కూరగాయలకు క్రిమి సంహారక మందు పిచికారీ చేసి వాటిని తీసుకెళ్లి మరుసటి రోజు ఇంటిలో వంట చేసుకోవడంతో వాటిని ఆహారంగా తిన్న కుటుంబ సభ్యులు ముగ్గురు మృతి చెందడం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి దయనీయ పరిస్థితులు ఏర్పడుతుండగా రసాయనిక, క్రిమిసంహారక మందుల వాడకంపై రైతుల నుంచి ఏటేటా డిమాండ్ కూడా పెరుగుతుండటం బాధాకరం. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా యూరియా, రసాయనిక ఎరువులకు తీవ్ర డిమాండ్ కూడా ఏర్పడి రైతులు వాటిని తీసుకోవడానికి ధర్నాలు, ఆందోళనలు చేపడుతున్నారు. సులభమైన పద్ధతిలో పంటలు పండించుకోవాలన్న సంకల్పం ఉండటంతో సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు చాలా మంది రైతులు దూరమవుతూ వచ్చారు. ఈనేపథ్యంలో సహజంగానే రసాయనిక, క్రిమి సంహారక మందులకు డిమాండ్ ఏర్పడుతూ వచ్చింది. అయితే తుంగభద్ర ఆయకట్టు కింద పలువురు రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ మంచి దిగుబడిని సాధించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను కూడా పండిస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్నారు. పాతికేళ్లుగా సేంద్రియ వ్యవసాయమే.. సిరుగుప్ప తాలూకా బైరాపుర గ్రామంలో బీఎం.ఈరప్పయ్య అనే రైతు గత 25 ఏళ్ల నుంచి సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన వరి పంటను పండిస్తూ పలువురు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. పంట పండించిన తర్వాత ముందుగా దుక్కి దున్ని మళ్లీ పంటను వేసే వరకు సేంద్రియ ఎరువులతో సమానంగా వివిధ రకాల గింజలను వేస్తూ నైసర్గికంగా భూమిని సిద్ధం చేసుకుంటారు. మన పూర్వీకులు ఏ విధంగా వరి పండించేటప్పుడు దుక్కిలోకి ఆకులు, అలుములు, పేడ తదితర సేంద్రియ పద్ధతులను అవలంభిస్తుండేవారో అదే తరహాలో పంటలను సాగు చేస్తూ అధిక లాభాలను గడిస్తున్నారు. వరికి రోగం వచ్చినప్పుడు క్రిమి సంహారక మందులకు బదులుగా గోమూత్రం తదితరాలను అనుసరిస్తున్నారు. సేంద్రియ ఎరువులతో సగం ఖర్చు ఆదా యూరియా, డీఏపీ తదితర రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడటం ద్వారా ఒక ఎకరాకు రూ.20 వేలు ఖర్చు అవుతుండగా సేంద్రియ ఎరువులతో వరి సాగుకు ముందుగా ప్రణాళికతో రూ.10 వేలు మాత్రమే ఖర్చవుతుందని రైతు పేర్కొంటున్నారు. సేంద్రియ(ఆర్గానిక్) పద్ధతిలో పంటలను సాగు చేయడం సులభతరంగా, ఖర్చు కూడా తక్కువగా ఉంటుందన్నారు. మార్కెట్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వరి, కూరగాయలకు డిమాండ్ కూడా ఉందన్నారు. సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేస్తున్న ఈరప్పయ్య తరహాలో జిల్లా వ్యాప్తంగా పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇలానే కొనసాగితే ఈ ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల సాగు విప్లవం సృష్టించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా రైతులను కూడా మరింత చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్గానిక్ ఎరువుతో పండించిన ఆహార ఉత్పత్తులే మేలు పాత పద్ధతిలో సాగుతో అధిక లాభాలు గడిస్తున్న వైనం -
ఎరువుల కోసం రైతన్న బారులు
రాయచూరు రూరల్: వ్యవసాయ రంగంలో ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల ఇబ్బంది కలగకుండా చూడాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కళ్యాణ కర్ణాటక జిల్లాల్లోని కలబుర్గి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, బీదర్, యాదగిరి, విజయ నగర, బాగల్కోట జిల్లాల్లో ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల కొరత అధికమైంది. సోమవారం కొప్పళలో రైతులు ఎరువుల దుకాణాల ముందు నిలబడినా ఫలితం లేకపోవడంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. యూరియా, డీఏపీ కోసం 44 సహకార సంఘాల్లో రైతులు ఎదురు చూస్తున్నారు. రాయచూరు ఏపీఎంసీకి 50 టన్నుల యూరియా వచ్చినట్లు వచ్చి రాగానే ఖాళీ అయింది. రాయచూరు జిల్లాకు 72 వేల మెట్రిక్ టన్నుల యారియా అవసరం కాగా కేవలం 900 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశారు. జిల్లాలో యూరియా లభించక పోవడంతో రైతులు వాటి కోసం వలస వెళుతున్నారు. క.క.భాగంలో తీవ్రమైన ఎరువుల కొరత రైతులకు ఇబ్బందులు కల్గిస్తున్న ఎరువులు -
దొంగతో స్నేహం, పోలీసు సస్పెండ్
దొడ్డబళ్లాపురం: ఓ దొంగ చేష్టలు కానిస్టేబుల్కు కష్టాలను తెచ్చిపెట్టాయి. దొంగతో కలిసి ఒకే రూంలో బస చేసిన కానిస్టేబుల్ సస్పెండ్ అయిన సంఘటన బెంగళూరులోని గోవిందరాజపుర ఠాణా పరిధిలో జరిగింది. అదే ఠాణాలో కానిస్టేబుల్ హెచ్ఆర్ సోనార్ బాధితుడు. మోస్ట్ వాంటెడ్ దొంగ బాంబే సలీంను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతని మొబైల్లో పోలీస్ డ్రెస్ ధరించిన ఫోటోలు, వీడియోలు లభించాయి. ఇదెలా సాధ్యమని విచారించగా అసలు సంగతి చెప్పాడు. కానిస్టేబుల్ సోనార్ అద్దెకు ఉంటున్న గదిలో తాను కొన్ని రోజులు ఉన్నట్టు తెలిపాడు. సోనార్ యూనిఫాంను తాను ధరించి భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడినట్టు చెప్పాడు. దీంతో దొంగకు ఆశ్రయం ఇచ్చి విధి నిర్వహణకు ద్రోహం చేశాడని సోనార్ను డీసీపీ దేవరాజ్ సస్పెండ్ చేశారు. కాగా సలీం దొంగతనాలలో ఈ పోలీసు పాత్ర కూడా ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి. వ్యాపారిని బెదిరించి రూ.10 లక్షలు దోపిడీ మైసూరు: రాగి, ఇత్తడి వస్తువుల గుజరీ వ్యాపారిని నలుగురు దుండగులు బెదిరించి రూ.10 లక్షల నగదు దోచేసిన ఘటన మైసూరులోని ఎన్ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. బెంగళూరులోని జయనగర నివాసి అబ్దుల్ ఆసిఫ్ బాధితుడు. తరచుగా మైసూరుకు వచ్చిన గుజరీని కొంటూ ఉంటాడు. ఇటీవల అఫ్సర్ఖాన్ పరిచయమయ్యాడు. 800 కేజీల స్క్రాప్ ఉంది, తక్కువకే ఇస్తామని ప్రలోభ పెట్టాడు. దీనిని నమ్మిన అబ్దుల్ లతీఫ్ బంధువు ముక్తియార్ పాషాను వెంట తీసుకుని ఓమ్ని వ్యాన్లో రూ.10 లక్షలతో మైసూరుకు వచ్చాడు. అఫ్సర్ఖాన్, అని ముఠా అతనిని తీసుకెళ్లి డబ్బు దోచుకున్నారు. బాధితుడు ఎన్ఆర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.మగ్గంపై ఆపరేషన్ సింధూర్ చీర దొడ్డబళ్లాపురం: పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడికి గుర్తుగా గదగ్ జిల్లాలో ఒక చేనేత కార్మికుడు తన నైపుణ్యాన్ని మేళవించి ఆపరేషన్ సింధూర్ పేరుతో చీర నేశాడు. గజేంద్రగఢ పట్టణ నివాసి. చేనేత కళాకారుడు చిన్నూర్ తన మగ్గం మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో పట్టు చీరను తయారు చేశాడు. ఈ చీర అందరినీ ఆకర్షిస్తోంది. చీరమీద త్రివర్ణ పతాకంలోని మూడు రంగులతో యుద్ధ విమానాలను కూడా మలిచాడు. విషయం తెలిసి అనేకమంది మహిళలు తమకూ చీరలు కావాలని ఇక్కడికి వస్తున్నారు. ఒక చీరను రూ.2 వేల నుంచి రూ.5వేల వరకూ విక్రయిస్తున్నాడు. -
ఎస్సీ వర్గీకరణ కోసం ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అమలుకు నిర్ణయం చేసుకోవాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సంచాలకుడు మారెప్ప డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ గత 30 ఏళ్లుగా ఆందోళనలు చేపడుతున్నామని గుర్తు చేశారు. వర్గీకరణకు కాంగ్రెస్ సర్కార్కు జిస్టిస్ నాగమోహన్దాస్ అందించిన నివేదికపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సర్కార్ అంగీకరించాలన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు లేని అడ్డంకి కర్ణాటకకు ఎందుకని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సర్కార్లే ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో అమలు చేసిన ఆర్డినెన్సును చూడాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో హేమరాజ్, ఆంజనేయ, శ్రీనివాస్, నరసింహులు, తాయప్ప, కృష్ణలున్నారు. -
వ్యవసాయ శాఖ జేడీపై చర్యలకు డిమాండ్
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో పండించే వరి ధాన్యం నుంచి వచ్చిన బియ్యంతో భోజనం చేస్తే మనిషికి క్యాన్సర్ వస్తుందని ప్రకటించిన కొప్పళ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు(జేడీ)పై చర్యలు చేపట్టాలని కర్ణాటక అన్నదాత రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు నాగనగౌడ డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు, బళ్లారి, కొప్పళ, విజయ నగర జిల్లాల్లో అధిక శాతం వరి పండిస్తున్న రైతులకు ఆ అధికారి ప్రకటన వల్ల ఈ ఏడాది రైతుల నుంచి వరి ధాన్యం, బియ్యం కొనుగోలు చేయడం కష్టకరమవుతుందన్నారు. రసాయనిక పదార్థాలతో కూడిన ఎరువులు, క్రిమి సంహారక మందులు అధికంగా వినియోగించడం వల్ల క్యాన్సర్ వ్యాధి సోకుతుందని అసత్య ప్రచారం చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని సర్కార్ను డిమాండ్ చేశారు. -
46 పీఓపీ గణేష్ విగ్రహాల జప్తు
హుబ్లీ: జిల్లాలోని అణ్ణిగేరి హాలదూటర వీధిలో అక్రమంగా తయారు చేస్తున్న ముత్తణ్ణ కుర్తకోటికి చెందిన 46 పీఓపీ(ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) గణపతులను సంబంధిత అధికారులు స్వాధీన పరుచుకున్నారు. ఆ తాలూకా తహసీల్దార్ మంజునాథ దాసప్పనవర నేతృత్వంలో బుధవారం రాత్రి తనిఖీ చేసి విగ్రహాలను జప్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పర్యావరణ అధికారి జగదీశ్ గద్దిగౌడర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రెండు బైక్ల ఢీ.. ఒకరి మృతి హుబ్లీ: ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకా అంచటగేరి గ్రామ సమీపంలోని పంజాబీ ధాబా వద్ద రెండు బైక్లు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఓ బైక్ చోదకుడు మృతి చెందాడు. చెన్నపుర గ్రామానికి చెందిన కిరణ్ (24) మృతుడు. మరో బైక్ చోదకుడు అఖిల్ షిండేకర్ కలఘటిగి నుంచి హుబ్లీ వైపునకు వస్తుండగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కిరణ్ బైక్ను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదు. ఘటనపై హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. మైక్రోఫైనాన్స్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య సాక్షి బళ్లారి: ఓ ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకున్న యువకుడు సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు గురి చేయడంతో సదరు అప్పు తీసుకొన్న యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. వివరాలు.. దావణగెరె జిల్లాకు చెందిన యశ్వంత్ నాయక్(24) అనే యువకుడు శివమొగ్గ ఫైనాన్స్ కంపెనీలో రూ.5 లక్షలను అప్పు తీసుకొన్నాడు. అయితే సరిగా కంతులు చెల్లించలేక పోవడంతో తీసుకున్న అప్పు కట్టకపోతే ఇంటిని జప్తు చేస్తామని మైక్రో ఫైనాన్స్ సిబ్బంది బెదిరించారు. మరో వైపు బైక్ను తాకట్టు పెట్టి రూ.40 వేలు అప్పు తీసుకొన్న నేపథ్యంలో అది కూడా తిరిగి ఇవ్వకపోవడంతో వారు కూడా వేధించడంతో యశ్వంత్ నాయక్ తాను అప్పుల వారి వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను క్షమించాలని తండ్రికి రాసిన డెత్ నోటులో కన్నీటి గాథ వివరించాడు. ఆర్టీఐ దరఖాస్తు చేసిన న్యాయవాదిపై దాడి హుబ్లీ: ఆర్టీఐ(సమాచార హక్కు) చట్టం ద్వారా వీధి పశువుల టెండర్ ప్రక్రియ గురించి వివరాలు అడిగాడన్న కోపంతో ఇద్దరు వ్యక్తులు న్యాయవాది చంద్రకాంత్పై దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అపరాధ కేసులను వాదించినందుకు, వీధి పశువుల టెండర్ ప్రక్రియ గురించి ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగిన కాశప్ప బిజవాడ, మంజుల బిజవాడ దాడి చేశారని బాధిత న్యాయవాది చంద్రకాంత్ బెండిగేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.250 చెల్లించనందుకు దాడి హుబ్లీ: కేవలం రూ.250 కోసం ఓ వ్యక్తి తన స్నేహితుడిని బాటిల్తో పొడిచి దాడి చేసిన దారుణ ఘటన ధార్వాడ తాలూకా హెబ్బళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రాయాసాబ్ నదాఫ్ తన స్నేహితుడు ప్రవీణ్ వద్ద రూ.250 అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులను వాపస్ ఇవ్వాలని రాయాసాబ్ను ప్రవీణ్ అడిగాడు. దీనికి ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని రాయాసాబ్ బదులిచ్చాడు. దీంతో కోపగించుకున్న ప్రవీణ్ ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమంటే డబ్బులు లేవని సాకు చెబుతావా? అంటూ గాజు బాటిల్ పగలగొట్టి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాయాసాబ్ను హుబ్లీ కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినట్లు, నిందితుడు ప్రవీణ్ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టినట్లు ధార్వాడ గ్రామీణ పోలీసులు తెలిపారు. రైలు పట్టాలపై వృద్ధుడి ఆత్మహత్యాయత్నం ●● అర నిమిషంలో రక్షించిన వైనం హుబ్లీ: రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన వృద్ధుడిని ఓ వ్యక్తి రక్షించిన ఘటన దావణగెరెలోని దేవరాజ అరసు లే అవుట్ వద్ద చోటు చేసుకుంది. దావణగెరెలోని వినాయక నగర్కు చెందిన వృద్ధుడు కుటుంబ సభ్యులతో విసిగి జీవితంపై విరక్తి చెంది రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని గమనించిన స్థానికుడు విరుపాక్ష బెళగుత్తి ఆయన్ను రక్షించారు. కాగా వృద్ధుడిని రక్షించిన 30 సెకన్లలో ఆ మార్గంలో రైలు దూసుకెళ్లడం గమనార్హం. రోడ్లలో గుంతలు పూడ్చరూ రాయచూరు రూరల్: నగరంలో వివిధ రోడ్లలో పడ్డ గుంతలను పూడ్చాలని ఎస్యూసీఐ డిమాండ్ చేసింది. గురువారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు చంద్ర గిరీష్ మాట్లాడారు. నగరసభకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.కోట్లాది మేర నిధులు వచ్చినా రోడ్లలో పడిన గుంతలను పూడ్చడంలో అధికారులు, కౌన్సిలర్లు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. నగరంలో వివిధ వార్డుల్లో పడిన పెద్ద గుంతల మరమ్మతులకు ముందుకు రావాలన్నారు. నగరంలో రక్షిత మంచి నీటి ఽశుద్ధీకరణ చేయాలన్నారు. వీధి కుక్కల బెడద నివారించాలని, మురుగు కాలువల్లో పేరుకున్న పూడికను తీయాలని కోరుతూ మహానగర పాలికె కమిషనర్ జుబిన్ మహాపాత్రోకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో చెన్నబసవ, వీరేష్, మహేష్, సోమశేఖర్లున్నారు. -
పూజా సామగ్రి కోసం రద్దీ
తుమకూరు: మహిళలకు అష్టైశ్వరాలు ఇవ్వాలని పూజలు చేసే వర మహాలక్ష్మి పండుగ నేడు శుక్రవారమే. ఈ నేపథ్యంలో సామగ్రి కొనుగోళ్లతో అన్ని నగరాలు, పట్టణాలలో బజార్లు కిటకిటలాడాయి. పూలు పండ్ల ధరలు భగ్గుమంటున్నా వెనుకాడకుండా కొనుగోలు చేశారు.తుమకూరు అంతరసంతహళ్లిలో ఉన్న పూలు పండ్ల మార్కెట్ ఉదయం నుంచి రాత్రి వరకు కిక్కిరిసింది. మహిళలు, యువతులు పెద్దసంఖ్యలో వచ్చి పూజా సామగ్రిని కొనుగోలు చేశారు. అమ్మవారి విగ్రహాలను, కొత్త బట్టలను, మిఠాయిలను కొన్నారు. -
నటికి అశ్లీల సందేశం.. యువకుడి అరెస్టు
హొసపేటె: కొప్పళ జిల్లా కారటగి తాలూకా సిద్దాపుర ఫిర్కాలోని సింగనాళ గ్రామానికి చెందిన యువకుడిని బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం నటి రమ్యకు ఈ యువకుడు సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశం పంపాడు. దీంతో విసిగిన నటి రమ్య బెంగళూరు పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసి, అసభ్యకరమైన సందేశం పంపిన వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని ఒత్తిడి చేశారు. తరువాత కేసును సైబర్ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసులో నిందితుడిని కనుగొనడానికి బెంగళూరు సైబర్ పోలీసులు వల పన్ని సింగనాళ గ్రామానికి చెందిన మంజునాథ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
గడియారం కోసం విద్యార్థుల గొడవ
సాక్షి బళ్లారి: నమ్మశక్యం కాని ఓ అమానుష ఘటన విజయపుర జిల్లాలో జరిగింది. ఈ దారుణం పలువురిని కలచివేసింది. గడియారం కోసం జరిగిన గొడవలో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఐదో తరగతి విద్యార్థిపై దాడి చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. విజయపుర నగర శివార్లలోని యోగాపురలో బిహార్కు చెందిన సునీల్, శృతి దంపతుల కుమారుడు హన్స్ అనే ఐదో తరగతి విద్యార్థిపై తొమ్మిదో తరగతి విద్యార్థులు దాడి చేశారు. అక్కడి సత్యసాయిబాబా పాఠశాలలో చదువుతున్న హన్స్పై తోటి విద్యార్థులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ముగ్గురు విద్యార్థులు హన్స్పై దారుణంగా దాడి చేయడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా విజయపురలో తీవ్ర కలకలం రేపింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని పలువురు పాఠశాల గేటు ముందు విద్యార్థి మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఐదో తరగతి విద్యార్థి దారుణ హత్య విజయపుర జిల్లాలో పెను విషాదం -
నిండుకుండలా పెద్ద చెరువు
హొసపేటె: విజయనగర జిల్లాలోని కూడ్లిగితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కూడ్లిగి తాలూకాలోని పెద్ద చెరువు పొంగి మరువ పారింది. మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ పండించే రైతులకు అవసరమైన వర్షం కురిసింది. దీంతో రైతుల ముఖాల్లో హర్షం వ్యక్తమవుతోంది. చెరువు పొంగి ప్రవహించడాన్ని చూడటానికి పట్టణ ప్రజలు గుమికూడుతున్నారు. నీరు పారుతున్న చోట నిలబడి మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ యువత సంబరాలు చేసుకుంటున్నారు. ఆగస్టు నెలలో చెరువు పొంగి ప్రవహించడంతో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. తహసీల్దార్ నేత్రావతి, ఏపీఎంసీ అధ్యక్షుడు కావలి శివప్పనాయక్, చీఫ్ ఆఫీసర్ హెచ్.దాదాపీర్, చిన్న నీటిపారుదల శాఖ ఏఈ కోటేశ్వరరావు, రెవెన్యూ అధికారి ప్రభు చెరువును సందర్శించారు. కలబుర్గి పాలికె కాంగ్రెస్ కై వసం ●● అధ్యక్షురాలిగా వర్శజాన్ ● ఉపాధ్యక్షురాలిగా తృప్తిలాఖ్ రాయచూరు రూరల్: కలబుర్గి సిటీ కార్పొరేషన్ 23వ అధ్యక్షురాలిగా వర్శజాన్, ఉపాధ్యక్షురాలిగా తృప్తిలాఖ్లను ఎన్నుకున్నారు. గురువారం కలబుర్గి సిటీ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీల మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసి అధికారం చేజిక్కించుకుంది. ఇందిరాగాంధీ స్మారక భవన్లో జరిగిన ఎన్నికకు ప్రాంతీయ కమిషనర్ జహీరా నసీమా ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ తరపున అధ్యక్షురాలిగా వర్శజాన్, ఉపాధ్యక్షురాలిగా తృప్తిలాఖ్ నామినేషన్లు వేశారు. బీజేపీ తరఫున అధ్యక్ష పదవికి గంగమ్మ, ఉపాధ్యక్ష పదవికి పార్వతి, జేడీఎస్కు చెందిన విజయలక్ష్మిరెడ్డి పోటీ పడ్డారు. అధ్యక్షురాలు వర్శజాన్ 36 ఓట్లు, ఉపాధ్యక్షురాలు తృప్తిలాఖ్ 33 ఓట్లుతో విజయం సాధించారు. ఆశా కార్యకర్తల డిమాండ్లు తీర్చండి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేల చొప్పున వేతనం చెల్లించాలని ఆశా కార్యకర్తల సంఘం రాష్ట్రాధ్యక్షుడు సోమశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరిలో జరిగిన ఆందోళనలో రూ.10 వేల వేతనంతో పాటు అదనపు ఇన్సెంటివ్ భత్యాలు చెల్లిస్తామని చెప్పి 8 నెలలు గడుస్తున్నా నేటికీ సర్కార్ స్పందించక పోవడాన్ని తప్పు బట్టారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.వెయ్యి చొప్పున పెంచి ఆశా కార్యకర్తలకు పెంచక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం ఇచ్చే ఇన్సెంటివ్ భత్యాలకు తోడు రాష్ట్ర సర్కార్ రూ.10 వేల వేతనం, పదవీ విరమణ చేసిన వారికి రూ.50 వేల డిపాజిట్ మొత్తం చెల్లించాలని కోరారు. బార్ అసోసియేషన్కు ఎన్నిక సాక్షి, బళ్లారి: జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శిగా అన్సార్ బాషా ఎన్నికయ్యారు. గురువారం నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయంలో జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శిగా అన్సార్ బాషాను ఎన్నుకొన్నారు. గత ఏడాది జరిగిన జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సెక్రటరీ స్థానానికి పోటీ చేసిన అన్సార్ బాషాకు, బసవరాజుకు సమాన ఓట్లు రావడంతో మొదటి ఏడాది బసవరాజు జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శిగా కొనసాగేందుకు ఆమోదముద్ర వేసుకొని రెండో ఏడాది అన్సార్ బాషాను సెక్రటరీగా కొనసాగించాలని తీర్మానం చేయడంతో ఆమేరకు జిల్లా బార్ అసోసియేషన్, ప్రముఖ న్యాయవాదులు అందరూ కలిసి నూతన సెక్రటరీని ఎన్నుకొన్నారు. నూతన సెక్రటరీ అన్సార్ బాషా మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈసందర్భంగా సీనియర్ న్యాయవాది పాటిల్ సిద్దారెడ్డి, యూ.బసవరాజు తదితరులు పాల్గొని అభినందించారు. -
పరిశ్రమల బకాయిల చెల్లింపునకు చర్యలు
రాయచూరు రూరల్: నగరంలోని కాటన్ జిన్నింగ్ పరిశ్రమల్లో పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని చిన్న పరిశ్రమల శాఖ మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్ హామీ ఇచ్చారు. గురువారం బెంగళూరు వికాససౌధలో రాయచూరు కాటన్ జిన్నింగ్ పరిశ్రమల సంఘం పదాధికారులు హరివి నాగనగౌడ ఆధ్వర్యంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజును కూడా కలిసి చర్చించారు. జిల్లాలో 11 కాటన్ జిన్నింగ్ పరిశ్రమలు 2021–22 నుంచి పెండింగ్లో ఉన్న బకాయి డబ్బులను త్వరితగతిన ఇవ్వాలని శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. 2020–2025 నూతన పారిశ్రామిక చట్టం ప్రకారం కూడా నిధులను విడుదల చేస్తామని తెలిపారు. -
మార్కెట్లకు వరమహాలక్ష్మి పండుగ కళ
దసరా గజరాజులకు రూ.2 కోట్ల బీమా మైసూరు: ఈసారి విజృంభణగా జరుగనున్న నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవంలో పాల్గొనేందుకు అడవి నుంచి రాచనగరి మైసూరుకు విచ్చేసిన కెప్టెన్ అభిమన్యు నేతృత్వంలోని ఏనుగులు, మావటీలు, కాపలాదారులు, అటవీ సిబ్బందికి రూ.2.04 కోట్ల బీమాను చేయించారు. దసరా మహోత్సవంలో పాల్గొననున్న 14 ఏనుగులు, మొత్తం 43 మందికి బీమా సౌకర్యం కల్పించారు. గజపయనతో జంబూసవారీని పూర్తి చేసి మళ్లీ అడవికి వెళ్లేవరకు బీమా సౌకర్యం అమలులో ఉంటుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి రూ.67 వేల ప్రీమియంని చెల్లించింది. కెప్టెన్ అభిమన్యుతో పాటు అన్ని మగ ఏనుగులకు మొత్తం రూ.50 లక్షల బీమా చేయించారు. ఆడ ఏనుగులకు రూ.18 లక్షలు బీమా చేయించారు. మావటీలు అటవీ సిబ్బంది, పశువైద్యాధికారులకు కలిపి రూ.86 లక్షల బీమా చేయించారు. ఇంకా దసరా ఏనుగులతో ప్రజలకు ఇబ్బందులు కలిగితే, ఆస్తిపాస్తులకు నష్టం వాటిల్లితే బాధితులకు రూ.50 లక్షల బీమా పరిహారం లభిస్తుంది. బనశంకరి: శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాలలో ఒకటైన వర మహాలక్ష్మీ పండుగకు బెంగళూరు, మైసూరు తదితర నగరాలలో సందడి నెలకొంది. అమ్మవారి విగ్రహాలు, అలంకార సామగ్రి, పూలు పండ్లు, వస్త్రాలు తదితరలకు గిరాకీ ఏర్పడింది. షాపులు, మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. బుధవారం బెంగళూరు నగర బజార్లు సందడిగా మారాయి. వరమహాలక్ష్మీ పండుగ సందర్బంగా ఇళ్లలో లక్ష్మీ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయడం ఆనవాయితీ. మార్కెట్లు కిటకిట ధరలు భగ్గుమంటున్నా పూజా సామగ్రి కొనుగోళ్ల కోసం బుధవారం బెంగళూరు నగరంలోని వివిధ మార్కెట్లకు నగరవాసులు తరలివచ్చారు. కేఆర్ మార్కెట్ జనసంద్రమైంది. మల్లేశ్వరం, గాంధీబజార్, యశవంతపుర, మడివాళ, బనశంకరి, సారక్కి, మాగడి రోడ్డు, కృష్ణరాజపురం మార్కెట్లు జనంతో నిండిపోయాయి. పూలు, పండ్లు, అరటి పిలకలు, పూజా సామాగ్రి, అలంకరణ వస్తువులకు గిరాకీ ఉంది. కనకాంబరాలు కేజీ రూ.2 వేలు సేమంతి పూలు మూర రూ.100 నుంచి 180, యాపిల్ పండ్లు కిలో రూ.120 నుంచి 160, ద్రాక్ష రూ.200, సీతాఫలం రూ.120, దానిమ్మ రూ.120, అరటి పిలకలు జత రూ.20 , యాలక్కీ అరటిపండ్లు కిలో రూ.120–140 వద్ద ఉన్నాయి. కనకాంబరాలు కిలో రూ. 2 వేలు, మల్లెలు రూ.500 నుంచి 800, కాకడాలు రూ.700, తామరలు రూ.100, సునామి రోజ్ రూ.150, సుగంధరాజ రూ.250 వరకూ పలుకుతున్నట్లు కేఆర్.మార్కెట్ వ్యాపారులు తెలిపారు. రమ్య పోస్టుల కేసులో కొప్పళవాసి అరెస్టు యశవంతపుర: శాండల్వుడ్ నటి, మాజీ ఎంపీ రమ్యకు అశ్లీల సందేశాలు పంపిన కేసులో కొప్పళకు చెందిన మంజునాథ్ను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఇదివరకే రాజేశ్, ఓబణ్ణ, గంగాధర్, భువన్ అనేవారిని అరెస్ట్ చేశారు. 43 మందిపై ఆమె ఫిర్యాదు చేయగా, 15 అకౌంట్లను గుర్తించి ఐదు మందిని అరెస్ట్ చేశారు. చిక్కమగళూరు, కోలారు జిల్లా నుంచి ఎక్కువ మంది అశ్లీల సందేశాలను పంపినట్లు తేలింది. కొందరు నిందితులు ఐపీ అడ్రస్లను బ్లాక్ చేసి ఇళ్లు వదిలి పరారయ్యారు. అసభ్య పోస్టులకు మద్దతుగా కామెంట్లు చేసినవారందరూ రమ్యకు క్షమాపణలు చెప్పారు. నలుగురికి వీధికుక్కల కాట్లు మైసూరు: ఎక్కడ చూసినా వీధికుక్కల గోల ఎక్కువైంది. ఒకే రోజులో నలుగురిని కరిచిన ఘటన చామరాజనగర జిల్లా హనూరు తాలూకా చెన్నాలింగనహళ్లి గ్రామంలో జరిగింది. గ్రామ నివాసులు మహేష్ (44), వెంకటయ్య (70), సిద్దయ్య (50), బాలుడు చందన్ (12)లు వీధికుక్కల కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. గ్రామంలో వీధికుక్కల బెడద అధికం కావడంతో పిల్లలు, వృద్ధులు భయం భయంగా తిరగాల్సి వస్తోంది. వాటి బెడదను నివారించాలని గ్రామస్తులు కోరారు. మావటీలు, అటవీ సిబ్బందికి సైతం డీసీఎం నడిపిన స్కూటర్ చలానాల పుట్టశివాజీనగర: డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ మంగళవారం హెబ్బాళ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సమయంలో కొత్త వంతెనపై స్కూటీలో వెళ్లారు. అయితే ఆ స్కూటర్పై 34 చలానాలు, రూ.18,500 జరిమానా ఉందని తెలిసింది. అలాంటి స్కూటర్ను డీసీఎం ఉపయోగించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి స్కూటర్ని డీసీఎం పర్యటనలో ఎవరు ఉంచారనేది తేలాల్సి ఉంది. అమ్మవారి ప్రతిమలకు, పూలు పండ్లకు గిరాకీ -
ఈ ఏడాదిలోనే జెడ్పీ, టీపీ ఎన్నికలు
హుబ్లీ: జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలను ఈ ఏడాదిలో గ్యారెంటీగా నిర్వహిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే హామీ ఇచ్చారు. స్థానిక విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సదరు ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ జరుగుతోంది. రెండు, మూడు నెలల్లో నోటిఫికేషన్ వెల్లడిస్తామని ఆయన తెలిపారు. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు చేసిన ప్రతిపాదనను అంగీకరించాం. అయితే అంతర్గత ప్రక్రియ సాగుతోంది. ఈ ఏడాదిలోనే తాలూకా పంచాయతీ, జిల్లా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. సవదత్తి పాఠశాలలో నీటి ట్యాంకర్లో విషం కలిపిన ఘటనపై ఆయన మాట్లాడుతూ యూజీపీ, ఆర్ఎస్ఎస్ విష బీజాలు నాటే పనిని చేస్తున్నాయి. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి బదిలీ కోసం విషం కలిపారన్నారు. విషం కలిపింది ఎవరో తెలుసు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. వారు ఎక్కడ దాక్కున్నారు? మత విష బీజాలు నాటిన ఫలితంగా పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చిన్నారులను బలి తీసుకుంటున్నారు. అసలు వీరు మనుష్యులేనా? ఈ విషయంలో బీజేపీ నేత ఆర్.అశోక్, బసవరాజ్ బొమ్మై, అరవింద బెల్లదలనే ప్రశ్నించండి అంటూ ఆయన మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నులు వేసినా కాంగ్రెస్ సమాధానం ఇవ్వాలి. సుప్రీంకోర్టు ప్రకటనపై కూడా కాంగ్రెస్ సమాధానం ఇవ్వాలి. శ్రీరామ సేన, ఆర్ఎస్ఎస్ ఏమి చేసినా కాంగ్రెస్ సమాధానం ఇవ్వాలంటే బీజేపీ నేతలు నోటికి తాళం వేసుకున్నారా? అని బీజేపీ నేత తీరుపై ఖర్గే నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు మండిపడిన విషయమై మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీలే చెబుతున్నారు. చైనా 50, 60 కిలోమీటర్ల మేర మనదేశంలోకి ఆక్రమించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా ఇదే చెబుతున్నారు. అయినా కూడా నమ్మడం లేదన్నారు. దేశద్రోహులు ఎవరు అన్న సర్టిఫికెట్ తీసుకోవాలా? అని నిలదీశారు. బాగలకోటె జిల్లాలో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయిని చేసిన కులదూషణ కేసులో ప్రభుత్వ ఉద్యోగులే అయినా వేరే ఎవరైనా కానీ కులదూషణకు పాల్పడే హక్కు ఎవరికీ లేదన్నారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే భరోసా