ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల పట్టివేత
●రూ.6 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
కోలారు: వివిధ ప్రాంతాల్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలు పట్టుబడ్డారు. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా వాణియంబాడికి చెందిన మహమ్మద్ యాసిన్ (25), జీలన్ (24)అనే దొంగలను కోలారు నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్దనుంచి 6.25 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 21న నగరంలోని కరుబర పేటలో ఓ మహిళ కాలినడకన వెళ్తుండగా నిందితులు చైన్స్నాచింగ్కు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నగర పోలీసులు సుమారు 200కుపైగా సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల జాడ కనుగొని అరెస్టు చేశారు. తులపై ఆంధ్రలోని వి కోట అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.


