ప్రేమికుల రోజున నందిహిల్స్ బంద్
దొడ్డబళ్లాపురం: రాబోయే ప్రేమికుల రోజున ప్రఖ్యాత నంది హిల్స్కు వెళ్లాలి అనుకునే ప్రేమజంటలు, యాత్రికులకు నిరాశే. సాధారణంగా నందికొండకు అత్యధికంగా వచ్చేది ప్రేమికులే. అయితే ఈ వాలెంటైన్స్డే కి నంది కొండపైకి టూరిస్టులను నిషేధిస్తూ జిల్లాధికారి ఆదేశాలిచ్చారు. వాలెంటైన్స్ డేకి నందికొండని మూసివేయడం చరిత్రలో ఇదే తొలిసారి. ప్రేమికుల రోజున నంది కొండపై నుంచి భగ్న ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. దీంతో పాటు గొడవలు జరుగుతాయనే అనుమానంతో ఆ రోజున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఎవరినీ కొండపైకి అనుమతించరని తెలిపారు.


