ఆకట్టుకున్న ఎద్దుల ప్రదర్శన పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ఎద్దుల ప్రదర్శన పోటీలు

Feb 14 2026 7:24 AM | Updated on Feb 14 2026 7:24 AM

ఆకట్టుకున్న ఎద్దుల ప్రదర్శన పోటీలు

ఆకట్టుకున్న ఎద్దుల ప్రదర్శన పోటీలు

హొసపేటె: కమలాపూర్‌లోని హంపీ వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (హవామా) కార్యాలయం వెనుక జిల్లా యంత్రాంగం, పశుసంవర్ధక, పశువైద్య సేవల విభాగం నిర్వహించిన ఎద్దుల ప్రదర్శన పోటీలు ఆకట్టుకున్నాయి. గృహ నిర్మాణం, వక్ఫ్‌, మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీజెడ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఎద్దులకు పూజలు చేసి ప్రదర్శనను ప్రారంభించారు. హొస్పేట్‌ రైతు మంజునాథ్‌.ఆర్‌ హాలికర్‌ జాతి ఎద్దులు పోటీలో మొదటి స్థానంలో నిలవడంతో రూ.10,000, సర్టిఫికెట్‌ అందజేశారు. గడినగనూర్‌ గ్రామానికి చెందిన బి.బసవ ఎద్దులు రెండవ స్థానంలో నిలిచి రూ.7500, సర్టిఫికేట్‌ అందుకున్నాయి. బాలాపూర్‌కు చెందిన శంకరప్ప ఎద్దులు మూడవ స్థానంలో నిలవడంతో రూ.5,500, సర్టిఫికెట్‌ అందజేశారు. హోస్పేట్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ ఎద్దులు రూ.2,500 అందుకుని నాలుగో స్థానం దక్కించుకున్నాయి. అవార్డు గెలుచుకున్న నాలుగు జతల గుర్రాలకు మంత్రి బీజెడ్‌ జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ సొంతంగా రూ.2 లక్షల నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో బళ్లారి లోక్‌సభ ఎంపీ తుకారాం, హోస్పేట్‌ ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌ గవియప్ప, డిప్యూటీ కమిషనర్‌ కవితా మన్నికేరి, సీఈఓ నోంగ్‌జోయ్‌ మహమ్మద్‌ అలీ అక్రమ్‌ షా, నందిపుర మఠం మహేశ్వర స్వామిజీ, పశుసంవర్ధక, పశువైద్య సేవల విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇమ్రాన్‌, డాక్టర్‌ యుగంధర్‌ మాన్వి, డాక్టర్‌ ప్రశాంత్‌, డాక్టర్‌ అజయ్‌ కుమార్‌, డాక్టర్‌ సురేష్‌, డాక్టర్‌ రాఘవేంద్ర, డాక్టర్‌ మల్లికార్జున, డాక్టర్‌ చంద్రనాయక్‌, డాక్టర్‌ శివకుమార్‌, డాక్టర్‌ లోహిత్‌, డాక్టర్‌.సతీష్‌, డాక్టర్‌ నేమినాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement