హొసపేటె: ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు, పోలీసులు దాడి చేసి తాలూకాలోని కాకుబాళు గ్రామంలోని కరియమ్మన గుడి సమీపంలో ఒక ఇంటి ముందు అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో నిర్ధిష్ట సమాచారం ఆధారంగా దాదాపు 60.80 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.2,10,368 ఉంటుందని అంచనా వేశారు. ఈ విషయంపై హొసపేటె గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్ అన్నారు. ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాల గురించి ప్రజలు సమాచారం అందించాలని ఆయన కోరారు.


