కర్ణాటక రోడ్డు ప్రమాదంపై వైఎస్‍ జగన్ దిగ్భ్రాంతి | Ys Jagan Mohan Reddy Reacts On Karnataka Accident Today | Sakshi
Sakshi News home page

ఏపీ కూలీలు మృతి.. వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి

Feb 8 2026 10:50 PM | Updated on Feb 8 2026 11:22 PM

Ys Jagan Mohan Reddy Reacts On Karnataka Accident Today

సాక్షి, తాడేపల్లి: కర్ణాటకలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. ఏపీకి చెందిన నలుగురు కూలీలు మరణించడం విషాదకరమని వైయస్‌ జగన్‌ అన్నారు. 

మృతులంతా అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందినవారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు కూడా. మృతుల కుటుంబాలకు జగన్.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement