అసభ్యంగా దూషిస్తున్నారు.. ఆయన తరగతికి వెళ్లం! | Students file complaint against math teacher: Anantapur District | Sakshi
Sakshi News home page

అసభ్యంగా దూషిస్తున్నారు.. ఆయన తరగతికి వెళ్లం!

Jul 20 2025 5:47 AM | Updated on Jul 20 2025 5:47 AM

Students file complaint against math teacher: Anantapur District

ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో దూషించడంతో కన్నీటి పర్యంతమవుతున్న విద్యార్థినులు

గణిత ఉపాధ్యాయునిపై విద్యార్థినుల ఫిర్యాదు

అనంతపురం జిల్లాలో కలకలం

వజ్రకరూరు: ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో దూషిస్తుండడంతో ఆయన క్లాసుకు వెళ్లేది లేదని విద్యార్థినులు తెగేసి చెప్పారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని చిన్నహోతురు జిల్లా పరిషత్‌ ఉన్నత పా­ఠశాలలో గణిత ఉపాధ్యాయుడు సతీష్ కుమార్‌ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, అందువల్ల ఆయన తరగతికి వెళ్లబోమని వి­ద్యా­ర్థినులు కన్నీరు పెట్టుకోవడంతో విద్యా­ర్థి­నుల తల్లిదండ్రులు శనివారం ఉదయం పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని నిలదీశా­రు. ఈ సందర్భంగా వా­గ్వా­దానికి దిగిన ఉపాధ్యాయునిపై తల్లిదండ్రులు ఒక దశలో చేయిచేసుకోబోయారు. తోటి ఉపాధ్యా­యులు అతికష్టం మీద తల్లిదండ్రులను ఆపారు. కా­గా, గణితం తరగతికి వెళ్లబోమని హెచ్‌ఎంకు విద్యార్థినులు ఈ సందర్బంగా లేఖ అందించారు.

చర్యలకు ఉన్నతాధికారుల సిఫారసు
వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి, ఎంఈఓ ఎర్రిస్వామి తదితరులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడి ప్రవర్తన బాగోలేదని విచారణలో తేలడంతో చర్యల కోసం డీఈఓ ప్రసాద్‌బాబుకు సిఫారసు చేసినట్లు ఎంఈఓ తెలిపారు. కాగా, సతీష్ కుమార్‌ గతంలో చా­బాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేసినప్పుడు, ఆయన వ్యవహారశైలి బాగోకపోవడంతో అక్కడి ప్రధానోపాధ్యాయుడు డీవైఈఓకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అప్పటి ఘటనలపైనా అధికారులు దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement