
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కొడంగల్ రూరల్: ఎదురెదురుగా వస్తున్న బొలెరో..కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అయినన్పల్లి స్టేజ్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన రామారావు(51) హైదరాబాద్లోని కేపీహెచ్పీ కాలనీలో ఏడాది కాలంగా నివాసం ఉంటున్నారు. ఇతనికి భార్య శారద, కుమారుడు అనిష్ ఉన్నారు. శనివారం పని మనిషి శ్రీలత(42), ఆమె మూడో కూతురు శ్రుతి(12)తో కలిసి కారులో కర్ణాటకలోని గానుగాపూర్లో గల దత్తాత్రేయస్వామి ఆలయానికి వెళ్లారు. ఆదివారం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కొడంగల్ మండలం అయినన్పల్లి గేటు సమీపంలోకి రాగానే కొడంగల్ నుంచి లక్ష్మీపల్లికి వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీలత అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులు శ్రుతి, రామారావును హైవే అంబులెన్సులో కొడంగల్లోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా రామారావు మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రుతి మృతి చెందింది. ఇదిలా ఉండగా కొడంగల్ మండలం పర్సాపూర్కు చెందిన శ్రీలతకు పెద్దేముల్ మండలం మంబాపూర్కు చెందిన కృష్ణప్పతో వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని హబ్సిగూడలో నివాసముంటూ ఇళ్లలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రామారావు ఇంటో శ్రీలత పని చేస్తోంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామారావు, శ్రీలత, శ్రుతి మృతి చెందారు. బొలెరో వాహన డ్రైవర్కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్రెడ్డి తెలిపారు.
బొలెరో.. కారు ఢీకొని ముగ్గురు దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం