కొండపల్లి రైల్వే స్టేషన్ పరిశీలించిన డీఆర్ఎం
ఇబ్రహీంపట్నం: మండలంలోని కొండపల్లి రైల్వే స్టేషన్ను డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సొనాకియా శనివారం పరిశీలించారు. రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫారాల ఎత్తు పెంచడం, రైల్వే ట్రాక్ల వెంట డ్రెయినేజీ సదుపాయం, తదితర అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పలు సమస్యలను డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగులు, వృద్ధుల నిమిత్తం లిఫ్ట్ సదుపాయం కల్పించాలని, శాతవాహన ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ స్టాప్ ఇవ్వాలని, నిలిపేసిన ప్యాసింజర్ రైలు స్టాఫ్ను పునరుద్ధరించాలని, ప్లాట్ ఫారాల ఎత్తు పెంచాలని కోరారు.


