breaking news
NTR district Latest News
-
కృష్ణానదిలో తప్పిన పడవ ప్రమాదం
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థాం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డివిజన్ పీఆర్ఓ వినయ్కాంత్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్–కాకినాడ టౌన్(07619) వయా గుంటూరు డివిజన్ మీదుగా ఈనెల 16వ తేదీన ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. ఎస్ఎంవీటి బెంగళూరు–భాగల్పూర్(06565) రైలు విజయవాడ డివిజన్ మీదుగా ఈనెల 15వ తేదీన కేటాయించినట్లు తెలిపారు. ఈ రైలు కృష్ణరాజపూరం, కాట్పడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, పలాస, భరంపూర్, కూర్ద్ రోడ్, భువనేశ్వర్, కటక్, భదర్కా, ఖరగ్పూర్, అన్దూల, భట్టానగర్, రామ్పూర్ హట్, బారహరవా, షిబన్జీ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. -
తీర్పుల్లో వయోవృద్ధుల చట్ట స్ఫూర్తి కనిపించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వయోవృద్ధుల సంక్షేమ చట్ట స్ఫూర్తి ట్రైబ్యూనళ్ల ఉత్తర్వుల్లో ఉట్టిపడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. పెద్దరికం ఎన్నటికీ చిన్నబోకూడదని.. వయోవృద్ధులకు నేడు మనం ప్రేమ ఆప్యాయతలను పంచితే భవిష్యత్తులో మన పిల్లల నుంచి కూడా అవే ఆత్మీయతానురాగాలను పొందుతామని ఆయన పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లాస్థాయి వయోవృద్ధుల సంక్షేమ కమిటీ సమావేశం జరిగింది. విజయవాడ, తిరువూరు, నందిగామ రెవెన్యూ డివిజన్లతో పాటు అప్పీలేట్ ట్రైబ్యూనల్కు వచ్చిన క్లెయిమ్ల పరిష్కారంతో పాటు వయోవృద్ధుల క్షేమం, సంక్షేమానికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. మొత్తం 433 క్లెయిమ్లకుగాను ఇప్పటికే 395 క్లెయిమ్ల పరిష్కారమైనట్లు చెప్పారు. మిగిలిన క్లెయిమ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. వయోవృద్ధుల సంక్షేమం విషయంలో రెవెన్యూ, పోలీస్, వయోవృద్ధుల సంక్షేమం తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో లాఫింగ్ క్లబ్లు.. వయోవృద్ధుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రతి గ్రామంలోనూ లాఫింగ్ క్లబ్ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో నెలలో ఒకసారి సీనియర్ సిటిజన్స్తో సమావేశాలు నిర్వహించాలన్నారు. డివిజన్, జిల్లా స్థాయిలోనూ ఇదే విధమైన చొరవ చూపాలన్నారు. వయోవృద్ధులు తమ అనుభవాల సారాన్ని చిన్నారులకు తెలియజెప్పి.. వారిలో నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు జెన్ ఆల్ఫాకు సరైన కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో డీసీపీ కేజీవీ సరిత, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్స్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వి.కామరాజు, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, ఉమ్మడి కృష్ణా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎం.వెంకటేశ్వరరావు, సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ల సభ్యులు హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
అనుమానమే.. పెనుభూతమై..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రేమించి పెళ్లాడారు. ముచ్చటగా మూడేళ్లయినా కాపురం సజావుగా సాగలేదు. ఇంతలోనే ఆ దంపతుల మధ్య కలతలు మొదలయ్యాయి. భార్య ప్రవర్తన నచ్చక కక్ష పెంచుకున్న భర్త ఆమెను పట్టపగలు అందరూ చూస్తుండగానే కత్తితో పీక కోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన గురువారం మధ్యాహ్నం విజయవాడ సూర్యారావుపేట పోలీస్స్టేషన్ పరిధిలోని స్వాతిప్రెస్ రోడ్డులోని ఓ ఆస్పత్రి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇవి.. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఆమెకు దుర్గాపురానికి చెందిన దీపాల విజయ్తో పరిచయం ఏర్పడింది. విజయ్ కూడా ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్గా పని చేస్తుండటంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లికి విజయ్ నిరాకరించడంతో పెద్దల రాజీతో 2022లో నూజివీడులోని బీఎస్పీ కార్యాలయంలో పెళ్లి చేశారు. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతో.. ప్రస్తుతం సరస్వతి విజయవాడ సూర్యారావు పేటలోని విన్స్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుండగా, విజయ్ భవానీపురంలోని ఎస్ఓఎస్ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. వీరి మధ్య కలతలు రావడం, భార్య ప్రవర్తనపై అనుమానంతో ఏడాదిగా విడిగా ఉంటున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఆమె తీరుపై మరింత కోపంతో చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సరస్వతి తాను పనిచేసే ఆస్పత్రిలో మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగించుకుని బయటకు వచ్చింది. అప్పటికే బైక్పై వచ్చి గేటు వద్ద కాపు కాచి, వేచిచూస్తున్న విజయ్, ఆమె రాగానే ఒక్కసారిగా పదుపైన కత్తితో దాడి చేసి గొంతు కోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. పోలీసులు వచ్చే వరకూ అక్కడే.. భార్యను పీక కోసి చంపేసిన విజయ్ పోలీసులు వచ్చే వరకూ భార్య మృతదేహం పక్కనే ఉన్నాడు. రక్తంతో తడిసిన కత్తి చేత్తో పట్టుకొని నిర్భయంగా అక్కడే నిలబడి ఉన్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరించనున్నట్లు సీఐ అహ్మద్ అలీ తెలిపారు. భార్యను హత్య చేసి, అక్కడే కత్తితో ఉన్న భర్తనిందితుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు భార్య గొంతు కోసి హత్య -
ఆగని కన్నీటి వరద
కంకిపాడు: మోంథా తుపాను వెళ్లిపోయినా.. అది మిగిల్చిన నష్టాన్ని చూసి అన్నదాతల్లో కన్నీటి వరద ప్రవహిస్తూనే ఉంది. చేతికి అందుతుందనుకున్న కొద్దిపాటి పంట కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పొలంలో ఉన్న తేమ కారణంగా వరి పనలు పాచిపోయి కుళ్లిపోతున్నాయి. వరి కంకులు నీటిలో నాని మొలకెత్తుతున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా చేతులెత్తేయడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.54లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. ప్రధానంగా ఎంటీయూ, బీపీటీ, ఇతర వంగడాలను రైతులు ఎంపిక చేసి సాగు చేపట్టారు. వరి పైర్లు చిరుపొట్ట, కంకులు గట్టి పడే దశలో ఉండగా మోంథా తుపాను రూపంలో ప్రకృతి విరుచుకుపడింది. జిల్లాలో 45,040 హెక్టార్లలో వరి పంట నేలవాలినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదించారు. తుపాను పోయి 14రోజులు గడిచి సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నా.. పంట పొలాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. వరి పనలు నేలవాలిపోయి ఉండటంతో పొలాల్లో మురుగు ఆరడం లేదు. భారీ వర్షాల కారణంగా పంట పొలాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. తుపాను వెలిశాక పొలాల్లో నీటిని అతికష్టం మీద పక్కనే ఉన్న పంట బోదెల్లోకి మళ్లించుకోగలిగారు. అయితే పొలాల్లో మురుగు మాత్రం నేటికీ అలాదే ఉంది. వరిపనలు పంట పొలంలో పడిపోయి ఉండటంతో బురద ఆరడం లేదు. దీంతో బురదకు తడిచిన వరి పనలు పాచిపోయి కుళ్లిపోతున్నాయి. కంకులు గట్టిపడే దశలోకి వస్తున్న పైర్లలో అయితే గింజలు మొలకెత్తిపోతున్నాయి. పాచిపోయి దెబ్బతింటున్న పనలు, మొలకెత్తుతున్న కంకులను చూసి రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే ఒక్కో రైతు ఎకరాకు రూ. 30వేల నుంచి రూ. 35వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. కౌలు ఒప్పందాలు 20–22 బస్తాలు వరకూ ఉన్నాయి. కౌలు ఎలా చెల్లించాలో కూడా అర్థం కావటం లేదని వారు వాపోతున్నారు. నేలవాలిన పంటను కొందరు రైతులు దుబ్బులు కట్టిస్తున్నారు. ఇందుకు ఎకరాకు రూ.5వేల వరకూ పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడి కూడా చేతిలో లేకపోవటంతో దుబ్బులు కట్టించేందుకు సైతం రైతులు వెనకాడుతున్నారు. మరో వైపు గత సీజన్లో ఇప్పటికే వరి కోతలు మొదలై ధాన్యం మిల్లులకు తరలించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ కోతలు ఊపందుకోలేదు. దీనికి తోడు పంట పొలాలు బురదగా ఉండటంతో రబీ సీజన్లో అపరాల సాగుకు ఆలస్యమై దిగుబడుల్లో వ్యత్యాసం వచ్చే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆపద సమయంలో ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కారు అన్నదాతల దీనస్థితితో ఆటలాడుతోంది. పరిహారం అందించే పేరుతో పరిహాసం చేస్తోంది. జిల్లాలో 1.12 లక్షల ఎకరాల్లో వరి పంట నేలవాలి పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. అయితే పంట నష్టం సర్వే సమయానికి ఆ విస్తీర్ణం పూర్తిగా తగ్గింది. కేవలం 75,781 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదిక సమర్పించారు. పెట్టుబడులు కోల్పోయి, దిగుబడులు నష్టపోయిన తరుణంలో చేయిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అరకొర సాయం అందించేందుకు పూనుకోవటం విడ్డూరమంటూ రైతులు పెదవి విరుస్తున్నారు. -
నిలబడి ఉన్న పంట నష్టం కూడా గుర్తించాలి
నేను కౌలురైతుని. తుపాను కారణంగా సాగు చేసిన వరి పంట రెండెకరాలకు పైగా నేలవాలింది. నిలబడ్డ పైరులో మడమ తాలు కనిపిస్తోంది. తాలు తప్ప వచ్చే శాతం ఎక్కువగా ఉంది. పైరు నిలబడి ఉంది అని సంతోషించేందుకు లేదు. ఆ నష్టం కూడా ఎక్కువే ఉంది. దాన్ని కూడా అధికారులు పరిశీలించాలి. నష్టపరిహారం దానికి కూడా ఇస్తేనే కోలుకుంటాం. ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలి. – వి.జాన్మోజెస్, కౌలురైతు, జగన్నాథపురం -
అయ్యా.. మాకో దారి చూపండి!
ఇబ్రహీంపట్నం: ఓ టీడీపీ నాయకుడి ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నామని, తమ తెల్లక్వారీకి ‘దారి’ చూపాలని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన వడ్డెర క్వారీ వర్కర్స్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఇబ్రహీంపట్నంలోని గనులు భూగర్భ శాఖ రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఉదయం తొమ్మిది గంటలకే కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని.. కార్యాలయం ఎదుట కొద్దిసేపు ఆందోళన చేశారు. టీడీపీ నాయకుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వ మాజీ మంత్రి కనుసన్నల్లో పేరేచర్ల టీడీపీ నాయకుడు పి. వెంకటేశ్వరరావు తమ క్వారీకి వెళ్లేందుకు ఉన్న దారిని పొక్లయినర్తో తవ్వేశారని మండిపడ్డారు. సుమారు 13నెలలుగా క్వారీలో పనులు చేసుకునే అవకాశం లేనందున కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వంద మందికి జీవనాధారం.. వడ్డెర ప్రజాగళం సంఘం అధ్యక్షుడు ఇడగొట్టు నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలోని సుమారు 50కుటుంబాలకు చెందిన వంద మంది వడ్డెర కులస్తులు క్వారీని నడుపుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. వడ్డెరలను తమ క్వారీ పైకి వెళ్లకుండా స్థానిక టీడీపీ నాయకుడు, ప్రముఖ కాంట్రాక్టర్ పి. వెంకటేశ్వరరావు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆయన 11ఎకరాల క్వారీని ఒక్కడే నడుపుకుంటున్నారని, 100మంది సొసైటీ కార్మికులు కేవలం రెండెకరాల్లో క్వారీని నడపుకొంటుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. గతంలోనూ ఇలానే.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దారిని 1973 నుంచి అందరూ వినియోగించుకుంటున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. గతంలో దారిని అడ్డుకున్న పి. వెంకటేశ్వరరావు ఆగడాలు అప్పట్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సమస్యకు పరిష్కారం చూపారని చెప్పారు. మరలా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దారిలో నడవకుండా అడ్డుకుంటున్నారని, తన అనుచరులతో క్వారీ కార్మికులపై దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. అన్ని అనుమతులతోనే.. అప్పులు తెచ్చి ప్రభుత్వానికి రూ.40లక్షలు లీజు కింద చెల్లించి క్వారీ నడుపుకొంటున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. 13నెలలుగా దారిలేక, క్వారీ నడవక వడ్డెర కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో పలువురు పెద్దలకు చెప్పినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. గత్యంతరం లేక క్వారీ పైకి వెళ్లేందుకు క్వారీలో నిలువునా తాడు సహాయంతో నిచ్చెన ఏర్పాటు చేసుకుని ప్రమాదం అంచున ఎక్కుతున్నామని, దానిని కూడా బడా కాంట్రాక్టర్ అడ్డుకుని వడ్డెరలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. -
మాతృమరణాల నివారణకు చర్యలు
మచిలీపట్నంఅర్బన్: గర్భిణులలో ఐఎఫ్ఏ సప్లిమెంటేషన్, డీ–వర్మింగ్, పోషక సలహాలు, హెమోగ్లోబిన్ స్థాయిల పర్యవేక్షణ వంటివి అమలు చేయడంతో మాత మరణాలను తగ్గించవచ్చని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్ తెలిపారు. గురువారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉప–జిల్లా స్థాయి మాతృ మరణాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్, ఫెసిలిటీ స్థాయిలలో గుర్తించిన లోపాలను సమీక్షించి, సంబంధిత ఆరోగ్య సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేయాలన్నారు. సంక్లిష్ట కేసులను ఉన్నత స్థాయి వైద్య సంస్థలకు రిఫర్ చేయడంతో పాటు బాధ్యతా వ్యవస్థలను బలపరచాలని సూచించారు. సమావేశంలో ఇటీవల నమోదైన రెండు మాతృ మరణ కేసు వివరాలను లోతుగా పరిశీలించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ శేషు కుమార్, డీఐఓ డాక్టర్ ప్రేమ్ చంద్, డాక్టర్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వంలో రాక్షస పాలన నడుస్తోందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. అక్రమంగా అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి జోగి శకుంతలమ్మ, వారి కుటుంబ సభ్యులను ఇబ్రహీంపట్నంలో కలసి పరామర్శించారు.జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే అన్నా రు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని నారావారి సారా అన్నందుకే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ డీసీఎం కమలాకర్బాబు విజయవాడకు గురువారం బదిలీ అయ్యారు. డీఆర్ఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో డివిజన్ అధికారులు ఆయన్ను సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఉద్యోగులంతా ఎంతో స్నేహభావంతో ఉంటూ, సహకారం అందించారని తెలిపారు. గుంటూరు డివిజన్ అధికారులకు, సిబ్బందికి సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. -
కార్తికేయుడి ఒక్క రోజు ఆదాయం రూ.11.65 లక్షలు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి మంగళవారం ఒక్క రోజే రూ.11,65,718 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. స్వామివారి సేవా టిక్కెట్ల ద్వారా రూ.7,92,078, లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా రూ.1,99,770, నిత్యాన్నదానానికి విరాళాలుగా రూ.1,46,842, వివిధ టిక్కెట్లు, ఇతర మార్గాల్లో వచ్చిన ఆదాయం రూ.27,028 కలిపి మొత్తం రూ.11,65,718 సమకూరిందని వివరించారు. విద్యాభివృద్ధికి బాటలు వేసిన అబుల్ కలాం ఆజాద్ లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు అబుల్ కలాం ఆజాద్ అని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మంగళవారం పోలీస్ కమిషనరేట్లో ఆయన చిత్రపటానికి సీపీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖర బాబు మాట్లాడుతూ.. విద్యారంగంలో అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషికి గౌరవంగా నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని పేర్కొన్నారు. ఆయన విద్యారంగానికి చేసిన సేవలకు గుర్తుగా 1992లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న‘ ఇచ్చి గౌరవించిందన్నారు. 2008 నుంచి ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్య్ర సమర ముఖ్యనాయకులలో ఒకరని, అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ వంటి అనేక భాషల్లో ప్రవీణుడ న్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ పోలీస్ కమిషనర్ కృష్ణకాంత్ పాటిల్, సీఎస్బీ, సీసీఆర్బీ, సీపీఓ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నదాతపై వివక్ష ఎందుకు?
చిలకలపూడి(మచిలీపట్నం): మోంథా తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ స్థాయీ సంఘ సమావేశంలో జెడ్పీ కో–ఆప్షన్ సభ్యుడు ఎండీ గౌసాని, గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు వేముల సురేష్ మాట్లాడుతూ పార్టీల పరంగా నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నారని అలా కాకుండా రైతులకు పార్టీలను అంటకట్టకుండా నష్టం భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చైర్ పర్సన్ హారిక మాట్లాడుతూ మోంథా తుపాను ప్రభావం వల్ల రైతులకు చాలా మంది పంట చేతికొచ్చే సమయానికి నేలవాలిపోవటం, నీటితో నిండి పోవటం వంటి నష్టాలు జరిగాయని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతును ఆదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై వ్యవసాయశాఖ అధికారి పద్మావతి స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము నష్టం అంచనాలను రూపొందిస్తున్నామని శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ప్రభుత్వానికి నివేదించి రైతులకు నష్టం పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కో–ఆప్షన్ సభ్యుడు గౌసాని మాట్లాడుతూ తాము ఎంతో దూరం నుంచి ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమావేశాలకు హాజరువుతుంటే సంబంధిత అధికారులు మాత్రం హాజరుకాకుండా కిందిస్థాయి సిబ్బంది పంపటం ఉపయోగం ఉండటం లేదన్నారు. దీనిపై సీఈవో కన్నమనాయుడు స్పందిస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్క అధికారి సమావేశానికి హాజరుకావాలని, లేకుంటే వారే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించి చర్చ జరిగిన సమయంలో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కొంత మంది వైద్యులు పథకం ద్వారా కాకుండా విడిగా డబ్బులు వసూలు చేసి ఆపరేషన్లు చేస్తున్నారని దీని కారణంగా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై ఎన్టీఆర్ జిల్లా డీఎంఅండ్హెచ్వో సుహాసిని స్పందిస్తూ ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయించుకుంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అటువంటి పరిస్థితులు ఎదురైతే ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్డినేటర్ 92810 68152 నంబర్ను సంప్రదించాలని ఆమె సభ్యులకు సూచించారు. సాంఘిక సంక్షేమ, సీ్త్ర శిశు సంక్షేమ, ఆర్థిక, పనుల స్థాయీ సంఘ సమావేశాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. సమావేశాల్లో జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మల్లవల్లి భూ నిర్వాసితులకు తీవ్ర నిరాశ
హనుమాన్జంక్షన్ రూరల్: జనసేన పార్టీ అధినేత, డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు తమ బాధను చెప్పుకొనేందుకు గుంటూరు జిల్లా మంగళగిరి వెళ్లిన మల్లవల్లి పారిశ్రామికవాడ భూనిర్వాసితులకు తీవ్ర నిరాశ ఎదురైంది. బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడ ఏర్పాటుతో భూములు కోల్పోయిన కృష్ణాజిల్లాలోని మల్లవల్లి, ఏలూరు జిల్లాలోని గొల్లపల్లి, పొలసానిపల్లె గ్రామాల రైతులు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళవారం తరలివెళ్లారు. అయితే అక్కడ డెప్యూటీ సీఎంను కలవలేకపోవడంతో ఉసురుమన్నారు. ‘పవన్కల్యాణ్ ఇప్పుడూ రారు.. జనవాణి నిర్వహిస్తున్న నాయకులకు మీ వినతిపత్రం అప్పగించి వెళ్లిపోండి’ అంటూ అక్కడి సిబ్బంది చెప్పటంతో భూ నిర్వాసితులు కన్నీటి పర్యంతమయ్యారు. 2024 ఎన్నికలకు ముందు పవన్కల్యాణ్ స్వయంగా మల్లవల్లి వచ్చి, అధికారంలోకి రాగానే పారిశ్రామికవాడ బాధితులకు న్యాయం చేస్తానని తమకు హామీ ఇచ్చారని, గంపెడు ఆశలో ఆయనను నమ్మామని బాధితులు వాపోయారు. ఈ భూములపైనే ఆధారపడి జీవనం సాగించే తమ కుటుంబాలకు పరిహారం దక్కకపోతే అత్మహత్యే శరణ్యమంటూ నిర్వాసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి కార్యాలయానికి వెళ్లిన వారిలో వీసం రామకృష్ణ, అక్కిలిశెట్టి బుజ్జి, ముక్కు శేఖర్, గోగినేని సావిత్రి, దోనేపూడి పద్మ, తదితరులు ఉన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో చంద్ర బాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన విరమించుకోవాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆ నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని, ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని స్పష్టంచేశారు. గుణదలలోని పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వైద్య విద్య చదవాలకునే పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ, 10 కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమంలో భాగంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంత కాల కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంతకాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారన్నారు. వాటిలో ఏడు కాలేజీల పనులు పూర్తి కాగా, ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యా యని తెలిపారు. మరో 10 కాలేజీల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. పేదలకువైద్యం దూరం.. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందవని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా రోగ నిర్ధారణ, ఇన్పేషెంట్, మెడిసిన్స్కు చార్జ్ చేస్తారని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల ఉచిత వైద్య సేవలు దూరమై పేద రోగులు.. మెడికల్ సీట్లు కోల్పోయి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తోందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరే కంగా వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం చేపట్టిందన్నారు. దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఇకనైనా చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
ఎన్టీఆర్ జిల్లాలో 217 డ్రగ్ హాట్స్పాట్లు గుర్తింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను చైతన్య పరచాలని, ఇందు కోసం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో ఎన్ కార్డ్ – నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమా వేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో 217 డ్రగ్ హాట్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించారు. గడచిన మూడు నెలల్లో జిల్లా ఈగల్ బృందం రైళ్లలో ఏడు, బస్సులు, బైకులు, గోడౌన్లలో పది సోదాలు నిర్వహించి డ్రగ్స్ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సుమారు 200 మంది డ్రగ్స్ బాధితులను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడ నగరానికి మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్న పరిస్థితిపై ప్రత్యేకదృష్టి సారించాలని ఆదేశించారు. ఒడిశా నుంచి విజయవాడ మీదుగా ఉత్తరభారతానికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాను ఆటోనగర్లో గుర్తించి ఐదు లారీలు, ఒక కారు సీజ్ చేసి, ఐదుగురిని అరెస్టు చేసిన ఈగల్ బృందానికి అభినందనలు తెలిపారు. డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని ఈగల్ నంబర్ 1972కు తెలపాలని కోరారు. డ్రగ్స్ బాధితులు ఆర్ఆర్ పేటలోని జిల్లా డీ–అడిక్షన్ కేంద్రం, విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స, కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చని సూచించారు. ప్రతినెలా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక అవగాహన ర్యాలీని నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్జీఓలు విద్యా సంస్థలపై దృష్టి సారించి యువతను చైతన్య పరచి, డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే దుష్పరిణామాలను తెలపా లని సూచించారు. డ్రగ్స్ వినియోగం, నిల్వ, రవాణా, అమ్మకం ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం నేరమని, వీరికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పారు. సామాజిక బాధ్యతగా మాదకద్రవ్యాల నిరోధానికి తమ వంతు కృషి చేస్తామని కమిటీ సభ్యుల చేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ కామరాజు, ఈగల్ సీఐ ఎం.రవీంద్ర, ఎస్ఐ ఎం.వీరాంజనేయులు, ఎస్ఆర్ఆర్ – సీవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ఎన్జీఓలు పాల్గొన్నారు. డ్రగ్స్ హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలి ఎన్ కార్డ్– నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ -
అన్నదానానికి రూ.3.50 లక్షల విరాళం
హనుమాన్జంక్షన్ రూరల్: హనుమాన్జంక్షన్లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి దాతలు రూ.3.50 లక్షల విరాళం సమర్పించారు. నూజివీడుకు చెందిన పి.వి.ఎన్.ఎస్. రాంప్రసాద్, తేజశ్రీ దంపతులు ఈ మొత్తాన్ని ఆలయ పాలకమండలి చైర్మన్ వేమూరి శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు స్వామి వారి శేషవస్త్రాలు, ప్రసాదాలను ఆలయ కార్యనిర్వాహణాధికారి పితాని తారకేశ్వరరావు అందించారు. -
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ను బలోపేతం చేద్దాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ను మరింత బలోపేతం చేయడంతో పాటు, వైఎస్సార్ సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేయాలని యూనియన్ నేతలు నిర్ణయించారు. గుణదలలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ రవి మాట్లాడుతూ.. ప్రజలతో పాటు, ఉద్యోగ, కార్మిక, కర్షకులకు చంద్రబాబు ప్రభుత్వం చేసే అన్యాయాలకు నిరసనగా పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 12న జరిగే ర్యాలీల్లో కూడా పాల్గొనాలన్నారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని జిల్లా యూనియన్ తరఫున ఖండించారు. ఈ సమావే శంలో జిల్లా మునిసిపల్ వింగ్ అధ్యక్షుడు గొట్టిపాటి హరీష్, జిల్లాలోని నియోజవర్గాల ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బోయళ్ల రాజేష్, పసుపులేటి కోటేశ్వరరావు, యరదేసి రామారావు, సూరిబాబు, మెండెం రామారావు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుంకర నారాయణ, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు ప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు. -
తుపాను నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
కంకిపాడు: మోంథా తుపానుతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అంతర మంత్రిత్వ కేంద్ర అధికారుల బృందం సోమవారం కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో పర్యటించింది. వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ కె.పొన్నుసామి నేతృత్వంలో జల్శక్తి మంత్రిత్వశాఖ ఎంఏడీటీఈ, సీడబ్ల్యూసీ డైరెక్టరు శ్రీనివాసు బైరీ, విద్యుత్ మంత్రిత్వశాఖ సీఈఏ డెప్యూటీ డైరెక్టర్ ఆర్తీసింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్కుమార్ మీనాతో కూడిన ఈ బృందం పంట నష్టాన్ని అంచనా వేసింది. పునాదిపాడులో కౌలురైతులు పిడికిటి భరత్బాబు, తూముల శ్రీనివాసరావు సాగు చేసిన 1318 రకం వరి పైరును బృందం సందర్శించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డైరెక్టర్, శాస్త్రవేత్త పాలడుగు సత్యనారాయణ తుపాను కారణంగా రైతులకు జరిగిన పంట నష్టాన్ని వివరించారు. రైతులతో ముఖాముఖీ.. కేంద్ర అధికారుల బృందం పునాదిపాడులో రైతులతో ముఖాముఖీ మాట్లాడింది. తుపానుకు పంట దెబ్బతినడంతో ఎకరాకు రూ.30 వేల కౌలు, రూ.30 వేల వరకూ పెట్టుబడులు నష్టపోయామని కౌలు రైతులు వివరించారు. ఎకరాకు 45 బస్తాలకు పైగా దిగుబడులు వస్తాయనుకుంటే పది బస్తాలు కూడా వచ్చేలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన పంట కోత కోయించేందుకు ఎకరాకు రూ.12 వేలకు పైగా ఖర్చవుతుందని వివరించారు. ధాన్యం రంగుమారినా, దెబ్బతిన్నా మద్దతు ధరకు కొనాలని విజ్ఞప్తిచేశారు. పెదకరాల వరకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరారు. పంట రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించామని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ వివరించారు. మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు, ఏపీ రైతు, కౌలురైతుల ఆర్గనైజేషన్ ప్రతినిధి ఎం.హరిబాబు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వి.వెంకటేశ్వర్లు, వి.శివనాగరాణి, పి.పవన్, ఎ.అప్పలస్వామి, పి.జమలయ్య తదితరులు రైతులకు జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకుడు, పౌరసరఫరాల సంస్థ ఎండీ ఎస్.ఢిల్లీరావు, జేసీ ఎం.నవీన్, తుపాను నోడల్ అధికారి పోతురాజు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, సివిల్ సప్లయీస్ జీఎం టి.శివరామ్, ఉయ్యూరు ఆర్డీఓ హెలా షారోన్, తహసీల్దార్ వి.భావనారాయణ, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ సుధారాణి, వ్యవసాయాధికారి ఉషారాణి పాల్గొన్నారు. -
ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం
ఇబ్రహీంపట్నం: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడంపై నిరసనగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమాలు విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రా ల్లో ర్యాలీలు, నిరసనలు జరపాలని కోరారు. వైఎస్సా ర్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ (దళిత ఫోర్స్) రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, డివిజన్, గ్రామ, వార్డు, స్థాయి దళిత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్బాబు -
ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన
గన్నవరం: మోంథా తుపానుకు కృష్ణాజిల్లాలో జరిగిన నష్టంపై ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సోమవారం కేంద్ర బృందం పరిశీలించింది. తొలుత కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ సంచాలకుడు డాక్టర్ కె. పొన్నుసామి నేతృత్వంలోని శ్రీనివాసు బైరి, ఆర్తిసింగ్, మనోజ్కుమార్ మీనాతో కూడిన కేంద్ర బృందానికి కలెక్టర్ బాలాజీ స్వాగతం పలికారు. అనంతరం తుపాను వల్ల జిల్లాలో దెబ్బ తిన్న వరి పొలాలు, ఉద్యాన తోటలు, ఇళ్లు, పడవలు, రహదారులు, విద్యుత్ స్తంభాల ఫొటోలను కేంద్ర బృందం పరిశీలించింది. అనంతరం కేంద్ర బృందం ఏలూరు జిల్లాకు వెళ్లింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, జిల్లా పశుసంవర్ధక అధి కారి చిన్ననరసింహులు పాల్గొన్నారు. -
రేటు తగ్గించిన
ప్రజాప్రతినిధి నియోజకవర్గ ప్రజాప్రతినిధి తన డంపింగ్ యార్డ్లో 40 టన్నుల లారీ బూడిదను అన్లోడింగ్ చేస్తే గతంలో రూ.4 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.3 వేలే ఇస్తున్నారు. కాంట్రాక్టర్ వద్ద రూ.3,500 ఇచ్చి లోడింగ్ చేసి, రూ.3 వేలకు అన్లోడింగ్ ఎలా చేయాలని లారీ ఓనర్లు వాపోతున్నారు. ఏమిచేయాలో దిక్కుతోచక మరలా బూడిద చెరువులో లోడింగ్ పనులు అడ్డుకున్నారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఏమిచేయాలో తెలియక లోడింగ్ ఆపేశారు. లోడింగ్ చార్జీ చెల్లించి ఇతర ప్రాంతాలకు రవాణాచేసి విక్రయించే ఇతర లారీల ఓనర్లు టీడీపీ వారి ఆగడాలతో ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి హామీ మేరకు నెలకు 12 లారీలకు ఉచితంగా బూడిద లోడు చేయాల్సిందేనని లారీ ఓనర్లు కోరుతున్నారు. -
బైక్లో దూరిన పాము
తప్పిన ప్రమాదం అవనిగడ్డ: పిల్లలను స్కూల్కు తీసుకెళుతున్న సమయంలో బైక్ లోపల పాము దూరడంతో స్థానికులు స్పందించి పామును చంపడంతో పెను ప్రమాదం తప్పింది. సేకరించిన వివరాలు ప్రకారం ఓ వ్యక్తి తన పిల్లలను స్థానిక సెయింట్ ఆన్స్ స్కూల్కు తీసుకెళుతుండగా గేటు ముందు సడన్గా బైక్ కిందకు పసికిరి పాము వచ్చింది. పక్కనున్న వారు చూసి కేకలు వేయడంతో, అతను పిల్లలను దించేసి బైక్ని పక్కకు పడేశాడు. అప్పటికే బైక్లోపలకు దూరిన పాము పలు డోముల్లోకి మారుతూ కంగారు పెట్టింది. కొంతమంది స్థానికులు కర్రలు తెచ్చి డోములను కదపడంతో బయటకు వచ్చిన పాముని వారు చంపేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
డిజిటలైజ్ కానున్న విద్యార్థుల సమాచారం
కోనేరుసెంటర్: విద్యార్థుల పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్ పర్సన్ ఆచార్య కె. రత్న షీలా తెలిపారు. సోమవారం కృష్ణా విశ్వవిద్యాలయంలో ‘అపార్ ఐడీ’ల మీద అవగాహన కోసం ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మొత్తాన్ని డిజిటలైజ్ చేసే క్రమంలో ఆధార్ తరహాలో వన్ నేషన్ – వన్ స్టూడెంట్ ఐడీ పేరుతో అపార్ ఐడీ అనే ఒక స్టూడెంట్ అకడమిక్ ఐడీని విద్యార్థుల ఫోన్ నంబర్తో అనుసంధానం చేసి రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా సర్టిఫికెట్లు డౌన్లోడ్.. కృష్ణా విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ అపార్ ఐడీని ఉపయోగించుకుని మున్ముందు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా విద్యార్థులు వాళ్ల సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుందన్నారు. ఈ అవగాహన సదస్సుకు ఆంధ్ర కేసరి, ఆచార్య నాగార్జున, కృషా విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ అటానమస్ కళాశాలల్లో అపార్ ఐడీలో పర్యవేక్షించే సమన్వయకర్తలు హాజరు కాగా, ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయకర్త రోహిత్ కశ్యప్, జోనల్ సమన్వయకర్త రవి పాండే పాల్గొని ఈ అపార్ ఐడీల మీద వివిధ కళాశాల నుంచి వచ్చిన వారి సందేహాలను నివృత్తి చేశారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నుంచి అనిల్ కుమార్, ఎల్లారెడ్డి పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ఏపీ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్ పర్సన్ రత్నషీలా -
జాతీయ ఈత పోటీలకు ఎస్ఆర్ఆర్ అధ్యాపకుడు
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ డి. యుగంధర్ జాతీయ ఈత పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్లో ఈనెల 9న జరిగిన 6వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆక్వాటిక్ చాంపియన్ షిప్–2025 పోటీలలో, డాక్టర్ డి. యుగంధర్ 55–59 ఏజ్ గ్రూపులో పాల్గొని నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. దీంతో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి అంతర్జాతీయ ఈత స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి అధ్యక్షతన స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో యుగంధర్ను ఘనంగా సత్కరించారు. వైస్ ప్రిన్సిపల్ పి. శైలజ, అధ్యాపకులు పాల్గొన్నారు. -
గిరాకీ ఉంది.. ప్రోత్సాహమే లేదు!
జి.కొండూరు: నాటుకోడి కూరకు మాంసాహార ప్రియుల్లో మంచి డిమాండ్ ఉంటుంది. విభిన్న రుచితో పాటు ఆరోగ్య దాయకం కావడంతో అంతా దానిని ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం ఆ నాటుకోడి కొండెక్కింది. ఇటీవల వచ్చిన వ్యాధుల ప్రభావంతో కోళ్లు భారీగా మృత్యువాత పడి.. కొరత ఏర్పడడంతో ధర ఆకాశాన్నంటుతోంది. మటన్ ధరను దాటి నాటుకోడి ధర పలుకుతుందంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నాటుకోళ్ల పెంపకానికి రాయితీలు అందించకపోగా.. కోళ్ల షెడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అందించిన రాయితీని సైతం నిర్లక్ష్యం చేసి అధిక రాయితీ ఉన్న పశువుల షెడ్ల నిర్మాణాలను ప్రోత్సహిస్తూ తమ అనుకూలస్తులకే షెడ్లను కేటాయించింది. కనుమరుగయ్యే ప్రమాదం.. మార్కెట్లో నాటుకోడికి డిమాండ్ పెరుగుతున్నా.. కోళ్ల పెంపకంపై రైతులు వెనకడుగు వేస్తుండటంతో దేశవాళీ నాటుకోడి భవిష్యత్తులో కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 70శాతం ఆర్థిక సాయం, రైతు వాటా 30శాతంతో కోళ్ల షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిని ప్రోత్సహించకుండా 90శాతం ఆర్థికసాయం ఉన్న పశువుల షెడ్లను మాత్రమే ప్రోత్సహించి తమ అనుకూలస్తులకు ఈ షెడ్లను కట్టబెట్టింది. ఎన్టీఆర్ జిల్లాలో 724షెడ్లు మంజూరు కాగా ఒకటి రెండు మినహా మొత్తం పశువుల షెడ్లనే నిర్మించింది. గతంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై నాటుకోడి పిల్లలను సరఫరా చేసి కోళ్ల పెంపకాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించేవి. ప్రస్తుతం ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో నాటుకోళ్ల పెంపకం తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం ప్రత్యేకంగా నాటుకోళ్ల పెంపకానికి రాయితీలు ఇచ్చి రైతులను, డ్వాక్రా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తే తప్ప ఉత్పత్తి పెరిగే అవకాశం కనిపించడంలేదు. సంకరజాతి నాటు కోళ్లు.. నాటుకోడి మాంసానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. దేశవాళీ నాటుకోడి ఇంటి వద్ద ధాన్యం, వివిధ రకాల గడ్డిజాతి మొక్కలు, పురుగులు, నత్తలు వంటి వాటిని ఆహారంగా తీసుకొని సాధారణంగా పెరుగుతుంది. వీటిని రైతులు తమ వ్యవసాయ అనుబంధంగా ఇంటి వద్ద అదనపు ఆదాయం కోసం పెంచుతుంటారు. అయితే కాలక్రమేణా నాటుకోడికి డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిని పెంచేందుకు కొందరు ప్రత్యేకంగా ఫారాలు ఏర్పాటు చేసి సంకరజాతి నాటుకోళ్లను పెంచి విక్రయిస్తున్నారు. వీటిలో వనరాజా, గిరి రాజా, రాజశ్రీ, కడక్నాథ్, స్వర్ణధార, సోనాలి, కారీ నిర్బిక్, కారీ శ్వామా, హితకారీ, ఉపకారి వంటి జాతులకు చెందిన కోళ్లను పెంచి విక్రయిస్తున్నారు. ఈ జాతులకు చెందిన కోడి మాంసం దేశవాళీ నాటుకోడి మాంసానికి సాటిరాదు. అయినప్పటికీ ఈ జాతులకు చెందిన కోళ్లను సైతం ఒరిజినల్ నాటుకోడి అని చెప్పి కేజీ మాంసం రూ.600నుంచి రూ.800వరకు విక్రయిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు తట్టుకోలేక.. సంకరజాతి నాటుకోళ్లను ఇళ్ల వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాలు, మామిడి తోటల్లో పెంచేందుకు ఏర్పాట్లు చేసి కొంతకాలం పాటు పెంచారు. అయితే ఈ కోడిపిల్లల కొనుగోలు, పెంపకం ఖర్చుతో కూడుకోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వ్యాధుల వల్ల కోళ్లు మృత్యువాత పడడంతో నష్టాలను చవిచూసి వదిలేశారు. ఇళ్ల వద్ద సాధారణంగా పెరిగే నాటుకోళ్లు సైతం ఇటీవల వచ్చిన రాణికట్, కొక్కెర వ్యాధులతో మృత్యువాత పడడంతో రైతులు కోళ్ల పెంపకానికి వెనకడుగు వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 2వేల నాటుకోళ్ల సామర్థ్యంతో ఎనిమిది ఫారాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. నాటు కోడి.. బలవర్థకం నాటుకోడి మాంసం కొవ్వు తక్కువగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో నాటుకోడి మాంసం పాత్ర వేరే లెవెల్లో ఉంటుంది. దీనిలో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్లు అధికంగా ఉంటాయి. అయితే మితంగా తింటేనే అది మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. -
మాస్టర్ అథ్లెట్ల పతకాల పంట
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చైన్నెలో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరిగిన 23వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2025లో ఎన్టీఆర్ జిల్లా తరఫున పాల్గొన్న క్రీడాకారులు ప్రతిభ చూపి పతకాలు సాధించారు. 22 దేశాల నుంచి 4వేల మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా నుంచి ఆరుగురు క్రీడాకారులు పాల్గొనగా, వారిలో ముగ్గురు వివిధ విభాగాల్లో ప్రతిభ చూపి పతకాలు సొంతం చేసుకున్నారు. 80ఏళ్ల వయస్సు విభాగంలో ఏవీ సుబ్బలక్ష్మి 4 పతకాలు సాధించారు. డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, ట్రిపుల్ జంప్లో స్వర్ణ పతకాలు, లాంగ్జంప్లో కాంస్య పతకం సాధించారు. 80ఏళ్ల విభాగంలో కనగల మల్లికార్జునరావు 5 కిలో మీటర్ల రన్నింగ్, రేస్వాక్లో రజత పతకాలు సాధించారు. 70ఏళ్ల వయస్సు విభాగంలో లింగం రవీంద్రరావు 10 కిలో మీటర్ల రోడ్ రేస్లో స్వర్ణ పతకం సాధించారు. అభినందన.. పతకాలు సాధించిన క్రీడాకారులను నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఉన్న మాస్టర్ అఽథ్లెటిక్ అసోసియేషన్ హాలులో సోమవారం అభినందించారు. మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్యోతి ప్రకాష్, కార్యదర్శి హర గోపాల్ మాట్లాడుతూ పతకాలు సాధించిన ఈ మాస్టర్ అథ్లెట్లు వచ్చే ఏడాది ఆగస్టులో సౌత్ కొరియాలో జరిగే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనడానికి అర్హత సాధించారని తెలిపారు. ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2025లో సత్తా -
పోలీస్ గ్రీవెన్స్కు 88 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి 88 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా నడవలేని దివ్యాంగులు, వృద్ధుల వద్దకే నేరుగా వెళ్లి సమస్యను తెలుసుకుని ఫిర్యాదులు అందుకున్నారు. అనంతరం ఆయా స్టేషన్ల ఎస్హెచ్ఓలతో మాట్లాడి సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. గ్రీవెన్స్లో భూ వివాదాలు, ఆస్తి తగాదాలపై 44, కుటుంబ కలహాలపై 5, కొట్లాటలపై 4, రోడ్డు ప్రమాదాలకు సంబంధించినవి 3, మహిళా సంబంధిత నేరాలపై 9, దొంగతనాలపై 7, ఇతర చిన్న వివాదాలు, ఇతర సమస్యలపై 16 ఫిర్యాదులు అందాయి. -
రైల్వేస్టేషన్లో ఫోన్ దొంగల ముఠా అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లల్లో ఫోన్లను కాజేస్తున్న దొంగల ముఠాను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే ఆలీబేగ్, జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి రమణ దీనికి సంబంధించిన వివరాలను జీఆర్పీ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవి.. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఆర్పీఎఫ్ పరిధిలో పెరుగుతున్న మొబైల్ దొంగతనం కేసులపై ఆర్పీఎఫ్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీసీ టీవీల దృశ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, పాత నేరస్తులను విచారించడం ద్వారా మొబైల్స్ చోరీలకు పాల్పడిన పాత నేరస్తులను గుర్తించారు. వారిలో నవజీవన్ బాలభవన్లో ఆశ్రయం పొందుతున్న బంగారు రాంబాబు, వైఎస్సార్ కాలనీకి చెందిన వంకూరి ప్రకాష్, కంసాలిపేటకు చెందిన బురదగంటి నవీన్ క్రాంతి ముఠాగా ఏర్పడి రైల్వేస్టేషన్, రైళ్లలో ప్రయాణికుల నుంచి మొబైల్స్ దొంగిలించి కదులుతున్న రైలు నుంచి దూకి తప్పించుకుంటున్నట్లు నిర్ధారించారు. రైల్వే సిబ్బందినంటూ.. వారిలో ఏ1 ముద్దాయి బంగారు రాంబాబు రైల్వేలో అనేక చోరీలకు పాల్పడ్డాడు. ఇతను చోరీ చేసిన మొబైల్ను స్వీచ్ఛాఫ్ చేయకుండా ఉంచుతాడు. మొబైల్ పొగొట్టుకున్న బాధితులు ఫోన్చేస్తే నిందితుడు ఫోన్ లిఫ్ట్చేసి తాను ఆర్పీఎఫ్, లేదా జీఆర్పీ కానిస్టేబుల్ అని నమ్మించి ఆర్పీఎఫ్ లేదా జీఆర్పీ స్టేషన్లో మొబైల్ అప్పగిస్తానని, అందుకోసం ఫోన్ నీదే అన్న నమ్మకం కోసం ఫోన్ లాక్, ఆధార్ కార్డును సేకరించి, వారి ఖాతాలోని నగదును ఖాళీ చేసేవాడు. పదో నంబర్ ప్లాట్ ఫాంపై.. కాగా నిందితులు ముగ్గురు సోమవారం విజయవాడ రైల్వేస్టేషన్ పదో నంబర్ ప్లాట్ఫాంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారు చోరీ చేసిన రూ.9లక్షల విలువ చేసే 45 మొబైల్స్ను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రూ. 9లక్షల విలువ చేసే 45 ఫోన్లు స్వాధీనం -
చట్టబద్ధ దత్తత ఒక వరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా ఈ ఏడాది నవంబర్ నెలలో దత్తతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి చట్టబద్ధంగా దత్తత తీసుకోవడం ఒక వరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, అధికారులతో కలిసి శ్రీ పింగళి వెంకయ్య హాల్లో దత్తత అవగాహన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ దత్తతకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ దళారీలను నమ్మవద్దని.. చట్ట పరంగా దత్తత తీసుకోవడం శ్రేయస్కరమని పేర్కొన్నారు. ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటే సమగ్ర బాలల సంరక్షణ పథకం, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖను సంప్రదించాలని కోరారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల దత్తత ఇతివృత్తంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఎంహెచ్వో ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
దౌర్జన్యంగా ఇండస్ట్రీ షెడ్డు కూల్చివేత
భవానీపురం(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వంలో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి పంచాయతీ పరిధిలోని నల్లకుంటలో ఒక పరిశ్రమకు సంబంధించిన షెడ్డును దౌర్జన్యంగా కూల్చివేసి, ఆపై భారీగా మట్టి డంపింగ్ చేయడం అందుకు నిదర్శనంగా నిలిచింది. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ టీడీపీ నాయకుడి బరితెగింపుపై స్థానికులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. స్థల వివాదంపై న్యాయపరంగా వెళ్లాల్సిందిపోయి జేసీబీతో కూల్చివేయడం ఏమి టని ప్రశ్నిస్తున్నారు. స్థల యజమాని మన్నె నాయుడు బాబు, భవానీపురం పోలీసుల కథనం మేరకు.. రాయనపాడు రోడ్డులో నల్లకుంటలో ఆర్ఎస్ నంబర్ 7/3లో మన్నె నాయుడుబాబు భార్య మన్నె చిలకమ్మకు ఎకరం 32 సెంట్ల స్థలం ఉంది. దానిని భవానీపురానికి చెందిన శిరిగిరి వెంకటేశ్వర్లురెడ్డికి నాలుగేళ్ల క్రితం లీజుకు ఇచ్చారు. వెంకటేశ్వరరెడ్డి ఆదిత్య ఎంటర్ప్రైజెస్ పేరుతో ఫొటో ఫ్రేమ్స్ తయారు చేసే ఇండస్ట్రీ నిర్వహిస్తున్నారు. దాని పక్కనే బొమ్మసాని బుల్లికోటయ్య స్థలంలో మెడికల్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ నడుపుతున్నారు. ఇద్దరి స్థలాల మధ్యలో దాదాపు 23 ఏళ్ల క్రితం బుల్లికోటయ్య సరిహద్దు గోడ నిర్మించారు. మూడు నెలల క్రితం ఆ గోడను ఆయనే కూల్చివేయగా మన్నె నాయుడుబాబు కోర్టుకు వెళ్లి యథాతథ స్థితి కొనసాగించాలని ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. వాచ్మన్ను బంధించి కూల్చివేత సోమవారం తెల్లవారుజాము మూడు గంటల సమయంలో బుల్లి కోటయ్య కుమారుడు సాంబశివరావు మనుషులు వచ్చి ఆదిత్య ఎంటర్ ప్రైజెస్లో నైట్ వాచ్మన్గా పని చేస్తున్న ఆర్.అర్జునరావును బలవంతంగా తీసుకువెళ్లి తమ షెడ్డులో బంధించిన అనంతరం సొంత జేసీబీ ఆదిత్య ఎంటర్ప్రైజెస్కు చెందిన షెడ్డును కొంతభాగం కూల్చి, వెనువెంటనే దానిపై టిప్పర్లతో తీసుకువచ్చిన మట్టిని డంప్ చేశారు. షెడ్డులో ఉన్న మెషినరీ, మెటీరియల్ మట్టికింద పూడిపోయాయి. ఈ తతంగం పూర్తయ్యాక వాచ్మన్ను వదిలేశారు. అనంతరం వాచ్మెన్ అర్జునరావు ఇండస్ట్రీ యజ మాని వెంకటేశ్వరరెడ్డి, నాయుడుబాబుకు సమాచారం ఇచ్చారు. దీనిపై తాము సోమవారం భవానీపురం పోలీస్లకు ఫిర్యాదు చేయటంతోపాటు కలెక్టర్ ఆఫీస్లో జరిగే పీజీఆర్ఎస్లోన్యాయం చేయాలని అర్జీ పెట్టుకున్నట్టు నాయుడుబాబు తెలిపారు. ఈ ఘటనపై వెంకటేశ్వరరెడ్డి కూడా భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.నాయుడుబాబు, బుల్లి కోటయ్య స్థలాల మధ్య ఉన్న 32 సెంట్ల స్థలం రోడ్డు కింద పోయిందని, అయితే రోడ్డు కింద పోయింది మీ స్థలమేనంటూ బుల్లికోటయ్య దౌర్జన్యంగా తమ స్థలంలోకి జొరబడి షెడ్డు కూల్చివేశారని మన్నె నాయుడు బాబు ఆరోపించారు. అసలు రోడ్డు కింద ఎవరి స్థలం ఎంత పోయిందనే విషయంలో వీఆర్ఓ, సర్వేయర్ తమకు వివరించలేదని, దీంతో ఆర్డీఓకు కూడా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. కూల్చివేత ఘటన గొల్లపూడికి చెందిన ఓ టీడీపీ నాయకుడి నేతృత్వంలోనే జరిగిందని ఆరోపిస్తున్నారు. -
యువ మేధకు చుక్కాని ‘ఆర్టీఐహెచ్’
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యువ మేధస్సుకు చుక్కాని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)అని.. యువ పారిశ్రామికవేత్తలను చేయిపట్టి నడిపించేందుకు, స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ఈ హబ్, స్పోక్ ద్వారా సరికొత్త చొరవ చూపుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగ ణంలో ఆర్టీఐహెచ్ ఇగ్నైట్ సెల్ను ఏర్పాటు చేసిన కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తదితరులు సందర్శించారు. అయిదు స్టార్టప్ల వ్యాపార నమూనాలను ప్రదర్శించగా.. ఆయా స్టార్టప్ల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణల రాష్ట్రాన్ని వేదికగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటుచేసిన ఆర్టీఐహెచ్ హబ్, స్పోక్లు విశేషంగా కృషిచేస్తున్నాయని.. ఇగ్నైట్ సెల్ ద్వారా ఈ హబ్ కార్యకలాపాలు, అందుబాటులో ఉన్న అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
పశుసంవర్ధక శాఖలో ఏహెచ్ఏ పోస్టులు భర్తీ చేయాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్(ఏహెచ్ఏ) పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ఏహెచ్ఏ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ లబ్బీపేటలోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే పశు సంపద, పశుపోషణలో ముందున్నామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం, పశువులను రక్షించే విషయంలో అదే స్థాయిలో చొరవ చూపాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సేవా కేంద్రాల్లో క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో దాదాపు యాభై వేలమంది నిరుద్యోగులు ఇందుకు సంబంధించిన కోర్సులు చేసి, శిక్షణ తీసుకుని ఉన్నారని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు కె. రమేష్, నగర అధ్యక్షుడు శివ, నాయకులు శీను, బసవ తదితరులు పాల్గొన్నారు. -
అసంబద్ధ ప్రశ్నలు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ కనబరుస్తోంది. వీలైనంతగా పంట నష్టాన్ని తగ్గించి, రైతుల నోట్లో మట్టి కొట్టే యత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే మోంథా తుపాను పంట నష్టం అంచనాల్లో ప్రభుత్వం కోత విధించింది. ప్రాథమిక అంచనాలకు, తుది జాబితా మధ్య భారీగా వ్యత్యాస్యం కనిపిస్తోంది. తొలుత వ్యవసాయ పంటలకు సంబంధించి ప్రాథమిక అంచనా 1.16లక్షల ఎకరాలు కాగా, సర్వే తరువాత తుది పంట నష్ట అంచనా 75వేల ఎకరాలకు పరిమితం అయ్యింది. అంటే 38వేల ఎకరాల్లో కోత విధించారు. ఉద్యాన పంటలకు సంబంధించి 3,540 ఎకరాల్లో పంటలకు నష్టం వాటినట్లు అంచనా వేయగా, సర్వే తరువాత తుదిపంట నష్ట అంచనా 1,715 ఎకరాలుగా లెక్క కట్టారు. ఈ లెక్కన 1825 ఎకరాల్లో కోత విధించారు. దీనికి తోడు పంట నష్టం పరిహారం వస్తే, ఆ పొలంలో పండిన ధాన్యం కొనుగోలు చేయబోమని మెలిక పెట్టి, రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. కౌలు రైతులకు రైతు భరోసా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సోమవారం కేంద్ర బృందం జిల్లాలోని పంట దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు రానుంది. భారీ నష్టమైనా.. మోంథా తుపాను అన్నదాతకు గుండెకోతను మిగిల్చింది. ఈదురుగాలులు, భారీ వర్షానికి వరి పొలాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఉద్యాన పంటలైన బొప్పాయి, అరటి, కూరగాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు చిరుపొట్ట దశ, గింజ గట్టి పడే దశలో ఉన్న వరి పంట నేలవాలింది. వరి దుబ్బులు మీదుగా వర్షపునీరు ప్రవహించింది. చిరుపొట్ట, గింజ గట్టిపడే దశలో వర్షం కురవటంతో తాలు తప్ప గింజ ఏర్పడుతుందని, మానుగాయ వచ్చి పంట దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు ఒక్కో ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ. 30వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. పంట చేలు కోతకు సిద్ధమయ్యే దశలో వచ్చి పడ్డ తుపానుతో పెట్టుబడులు పూర్తిగా నీటిపాలై నట్టేట మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పంటలు డెబ్బతింటే, ఎకరాకు రూ.25వేలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందని, ఇప్పుడు ఎకరాకు పంట నష్ట పరిహారం రూ.10వేలు ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. కంకిపాడు మండలం దావులూరులో మోంథా ధాటికి పడిపోయిన వరిని చూపుతున్న రైతు (ఫైల్)ఈ ఏడాది 35 ఎకరాల్లో వరిసాగు చేశా. వరి కంకులు పాలుపోసుకునే దశలో ఉండగా వచ్చిన తుపాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు ఎంతసేపు పడిందా, నిలబడిందా అని అడుగుతున్నారు, పడిన దానికంటే నిలబడిన పొలాల్లోనే కంకులు రాసుకుని గింజలు తప్పలుగా మారిపోతున్నాయి. దీనిని ఎవరూ గమనించడం లేదు. నిలబడిన పంటపొలాల రైతులకు పరిహారం అందించాలి. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. – వేమూరి రత్నగిరి, రైతు, ఘంటసాలఉద్యాన పంటల నష్టం వివరాలు.. దెబ్బతిన్న పంటల ప్రాథమిక అంచనా : 3,540.55 ఎకరాలు దెబ్బతిన్న పంటల తుది అంచనా : 1,715.07 ఎకరాలు పంట నష్టం ప్రాథమిక అంచనా : రూ.73.45 కోట్లు తుది అంచనా : రూ.23.43 కోట్లు జిల్లాలో వ్యవసాయ పంటల నష్టం ఇలా.. పంట రకం ప్రాథమిక అంచనా తుది అంచనా ఇన్పుట్ సబ్సిడీ (ఎకరాల్లో..) (ఎకరాల్లో..) (రూ.లక్షల్లో) వరి 1,12,600 75,781.5 7,878.15 ఇతర పంటలు 3,742.5 2,056.2 75.75 మొత్తం 1,16,342.5 77,837.7 7,953.90 -
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 1.40 గంటల సమయంలో విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి విజయవాడ నుంచి కన్యాకుమారి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరింది. ఆ సమయంలో రైల్వేస్టేషన్ దక్షిణ ప్రవేశ ద్వారం, పార్శిల్ కార్యాలయం గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తపు గాయాలతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై వచ్చిన సమాచారం మేరకు జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, బ్లాక్ కలర్ జీన్స్, వైట్ కలర్ ఫుల్హ్యాండ్ షర్ట్ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. -
రక్త నాళాల వ్యాధులపై అవగాహన అవసరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వ్యాధుల రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన పెంచుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. వాస్క్యూలర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో వాస్క్యూలర్ వాక్థాన్ నిర్వహించారు. గవర్నర్ పేటలోని ఐఎంఏ హాలు వద్ద ఈ వాక్థాన్ను కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. అక్కడి నుంచి చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ ఆఫీసు వరకూ వెళ్లి, తిరిగి ఐఎంఏ హాలుకు చేరుకుంది. నిర్లక్ష్యం వద్దు.. కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ వాస్క్యూలర్ వ్యాధులు, సర్జరీలు గురించి అవగాహన కల్పించేందుకు వాక్ థాన్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ప్రముఖ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ కిరణ్ మాకినేని మాట్లాడుతూ వాస్క్యూలర్ సొసైటీ ఆఫ్ ఇండియాలో 800 మంది వరకు సభ్యులు ఉన్నారని చెప్పారు. నేడు దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో అంప్యూటేషన్ ఫ్రీ ఇండియా నినాదంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాక్థాన్ నిర్వహించినట్లు తెలిపారు. అంప్యూటేషన్లు 80 శాతం మందిలో మందులు వాడటం, జాగ్రత్తలు పాటించడం, రక్తనాళాలకు చికిత్స చేయడం ద్వారా నివారించవచ్చన్నారు.. న్యూరోపతి, వాస్క్యూలోపతి, డయాబెటిస్ ఉంటే కాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు, వాస్క్యూలర్ సర్జన్స్ పాల్గొన్నారు. విజయవాడలో ఉత్సాహంగా వాస్క్యూలర్ వాక్థాన్ -
జిల్లాలో క్షేత్ర పర్యటనకు ట్రైనీ ఐఏఎస్లు
మార్గనిర్దేశం చేసిన కలెక్టర్ లక్ష్మీశగాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్షేత్ర పర్యటనలో భాగంగా ట్రైనీ ఐఏఎస్లు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవాలని.. ఈ అవగాహన మున్ముందు విధి నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందుతున్న 20 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు మూడు బృందాలుగా ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐఏఎస్లకు కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి సమావేశం నిర్వహించారు. అధికారులు సహకరించండి.. ఫీల్డ్ స్టడీ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ (ఎఫ్ఎస్ఆర్పీ) కింద ఆరు రోజుల క్షేత్ర పర్యటనను విజయవంతంగా పూర్తిచేసేందుకు మార్గనిర్దేశం చేశారు. జిల్లా భౌగోళిక పరిస్థితులు, మండలాలు, గ్రామాల వివరాలతో పాటు సాంస్కృతికంగా, పర్యాటకంగా కీలక ప్రాంతాల గురించి వివరించారు. టూర్ షెడ్యూల్కు అనుగుణంగా జరిగే క్షేత్ర పర్యటనలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, పోలీస్, విద్య, వైద్య ఆరోగ్యం.. ఇలా వివిధ శాఖల అధికారులతో సమావేశాలతో పాటు స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా క్షేత్రస్థాయిలో ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై అవగాహన పెంపొందించేలా నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్ఏ పీడీ ఏఎన్ఏవీ నాంచారరావు, డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు. -
తొమ్మిది మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్ర హాస్పిటల్స్లో హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో ఈ నెల 2 నుంచి 8 వరకూ నిర్వహించిన శిబిరంలో 9 మందికి ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పాతూరి వెంకట రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరంలో స్పెయిన్కు చెందిన పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బోస్కో మోస్కోసోతో పాటు పిడియాట్రిక్ కార్డియాక్ ఇంటెన్సివిస్ట్లు, డాక్టర్ ఫిలిప్, డాక్టర్ ఐతోర్ లోపెజ్, నటాలియా సొరొళ్ల, లారా పాల్గొని చిన్నారులకు సర్జరీలు చేశారని తెలిపారు. రిప్లేస్ మెంట్ ఆఫ్ మైట్రల్ వాల్వ్, సూడో ఎన్యూరిసం, డీఓఆర్వీ + టెట్రాలజి ఆఫ్ ఫాలో వంటి అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలున్న తొమ్మిది మందికి విజయవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు డాక్టర్ రామారావు తెలిపారు. సమావేశంలో పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.విక్రమ్, డాక్టర్ నాగేశ్వరరావులతో పాటు కార్డియాక్ ఎనస్థిస్ట్ డాక్టర్ రమేష్ పాల్గొన్నారు. మంత్రి పార్థసారథి ఎస్కార్ట్ ఎస్ఐ గుండెపోటుతో మృతి గుడివాడరూరల్/కోనేరుసెంటర్: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఎస్కార్ట్ ఎస్ఐ ఆర్.ఎస్.రంగనాథరావు(60) ఆదివారం గుడివాడలో గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి పార్థసారథి మచిలీపట్నం నుంచి నూజివీడు వెళ్తుండగా ఎస్కార్ట్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రంగనాథరావు ప్రయాణంలో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఆయనను సిబ్బంది తరలించగా వైద్యులు వైద్య సేవలు అందిస్తుండగా మృతి చెందారు. ఆయన స్వగ్రామం అవనిగడ్డ మండలం అశ్వరావుపాలెం. ఎస్ఐ రంగనాథరావుకు గతంలో ఓ సారి హార్ట్సర్జరీ జరిగిందని సిబ్బంది తెలిపారు. రంగనాథరావు మచిలీపట్నం పరిధిలోని చిలకలపూడి ఎస్ఐగా పని చేస్తూ మంత్రి ఎస్కార్ట్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్ఐ మృతి చెందారన్న సమాచారం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ వి.ధీరజ్ వినీల్, వన్టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎస్ఐ మృతి పట్ల జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు, డీఎస్పీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
మామూళ్ల వెంబడి!
ఎన్టీఆర్ జిల్లాలో ఎంఈవోల ఇష్టారాజ్యంవన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో మండల విద్యాశాఖాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యారంగంలో విద్యార్థులకు మేలు చేసేందుకు అవసరమైన పర్యవేక్షణ చేయాల్సిన మండల విద్యాశాఖాధికారులు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి ఒకవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి మరోవైపు తమకిష్టమైన రీతిలో లంచాలకు అలవాటుపడి మామూళ్ల మత్తులో ఉంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారిపై పదేపదే ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఎన్టీఆర్ జిల్లాలో 20 మండలాలకు ఎంఈవో–1లు తొమ్మిది మంది, ఎంఈవో–2లు 20 మంది కొనసాగుతున్నారు. 20 మండలాలకు కేవలం తొమ్మిది మంది మాత్రమే మండల విద్యాశాఖాధికారులు పని చేయటం సైతం వారి ఆదాయానికి అండగా నిలుస్తోంది. ఒక్కొక్క ఎంఈవో–1కు నాలుగైదు మండలాలు కేటాయించటంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారే విమర్శలు ఉన్నాయి. అందులోనూ ఎంఈవో–1లు బాధ్యతలు నిర్వర్తిస్తున్న మండలాలు చాలా సుదూర ప్రాంతాలు కావటంతో వారి పర్యవేక్షణ సైతం అంతంతమాత్రంగానే ఉంటుందనే వాదనలు ఉన్నాయి. ఉపాధ్యాయుల నుంచీ వసూళ్లు.. జిల్లాలో సుమారుగా 969 ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 5,160 మంది ఉపాధ్యాయులు వివిధ కేటగిరీల్లో కొనసాగుతున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి పనికి ఎంఈవోలు రేటు నిర్ణయించి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీస్ విషయాలు, బిల్లు తయారీ తదితర అంశాలకు సంబంధించి ఎంఈవోల వసూళ్లు మాములుగా ఉండదని పలువురు గురువులు వాపోతున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ల విషయంలోనూ ఎంఈవోలు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయా టీచర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోరు.. జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులపై ఫిర్యాదులు వస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. నగరంలోని ఒక ఎంఈవో ప్రైవేట్ విద్యాసంస్థకు వెళ్లి తనకు భారీగా ముడుపులు కావాలని బేరం పెట్టి విసిగించాడు. దాంతో ఆ విద్యాసంస్థ యాజమాన్యం నేరుగా అక్కడి నుంచే జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా చర్యలు చేపట్టడం లేదు. అంతేకాకుండా సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణలోనూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు సైతం బిల్లులు తయారు చేశారనే ఆరోపణలు గతంలో వచ్చాయి. ఆ ఆరోపణలపై విచారణకు అధికారులు ఆదేశించారు. అయితే ఆ తరువాత దానిని బుట్టదాఖలు చేశారని తెలిసింది. -
‘క్రీడలను కాపాడుకుందాం – యువతను రక్షించుకుందాం’
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇటీవల జరిగిన మహిళా క్రికెట్ ప్రపంచకప్లో మన జట్టు దేశానికి అద్భుతమైన విజయాన్ని అందించిందని, అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో క్రీడలను కాపాడుకుందాం – యువతను రక్షించుకుందాం అని వక్తలు పిలుపునిచ్చారు. గవర్నర్పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్లో డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము అధ్యక్షతన ఆదివారం మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతలను అభినందిద్దాం–క్రీడా అభివృద్ధిపై చర్చిద్దాం అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ ప్రపంచకప్లో ఒక్కో మహిళా అగ్గిపిడుగులై గర్జించారని కొనియాడారు. భవిష్యత్తులో మహిళా క్రీడాకారులకు ఇది ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. యువతను డ్రగ్స్, గంజాయి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో క్రీడలకు మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని, తగినంత కోచ్లు లేరని చెప్పారు. హర్యానా లాంటి రాష్ట్రంలో 400మంది కోచ్లు ఉంటే మన రాష్ట్రంలో నలుగురు మాత్రమే ఉన్నారన్నారు. మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు స్పోర్ట్స్ పాఠశాల, స్పోర్ట్స్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. మహిళా క్రీడాకారులకు రక్షణ కల్పించడంతో పాటు జీవో నంబర్ 74ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కోచ్ ప్రసాద్, లెక్చరర్ ఎస్.లెనిన్బాబు, జేవీవీ, డీవైఎఫ్ఐ నాయకులు శ్రీను, శోభన్, రవి, రమణ, శివ, పి.కృష్ణ, నరసింహ, ప్రసాద్, కృష్ణకాంత్ పాల్గొన్నారు. -
104 వాహనాల ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
పామర్రు: 104 వాహనాల ఉద్యోగులకు గత కాంట్రాక్ట్ కంపెనీ నుంచి రావాల్సిన గ్రాట్యూటీ, ఈఎల్ బకాయిలను ప్రభుత్వం వెంటనే ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వీఆర్ ఫణికుమార్ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం యూనియన్ కృష్ణా జిల్లా బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఫణికుమార్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రస్తుత యాజమాన్యం భవ్య హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఇప్పటి వరకు నియామక పత్రాలు, పే స్లిప్పులు ఇవ్వకుండా ఉద్యోగుల మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తూ పని చేయించుకుంటోందన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 104 సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు అదనపు పని భారం తగ్గించాలన్నారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు, జీవో 7 ప్రకారం వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐలను సక్రమంగా చెల్లించాలని కోరారు. వాహనాలకు ఇన్సూరెన్సు, ఫిట్నెస్లు వెంటనే చేయించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఓ గంగాధర్ మాట్లాడుతూ.. కార్మికుల పోరాటాలకు సీఐటీయూ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ ఆల్ ఇండియా మహాసభను జయప్రదం చేయాలని కోరారు. యూనియన్ జనరల్ సెక్రటరీ డి.విజయ్, యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు, 104 సిబ్బంది పాల్గొన్నారు. -
తృటిలో తప్పిన పెను ప్రమాదం
జి.కొండూరు: జి.కొండూరు మండల పరిధి కవులూరు గ్రామ శివారులో ఉన్న ఎన్సీఎల్ బ్రిక్స్ కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. కంపెనీలో ప్రధాన భాగమైన 250 టన్నుల బరువుతో ఉండే భారీ ఫ్లైయాష్ ట్యాంకు ఆదివారం మధ్యాహ్న సమయంలో కూలిపోయింది. భోజన విరామంలో ఈ ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ కంపెనీలో షిఫ్ట్కు 40 మంది చొప్పున మూడు షిఫ్ట్లలో రోజుకు 120 మంది కార్మికులు పని చేస్తూ ఉంటారు. ప్రమాద సమయంలో కూడా 40 మంది కార్మికులు విధులలో ఉన్నప్పటికీ భోజన విరామం కావడంతో పెను ప్రమాదం తప్పింది. గత ఆరేళ్లుగా ఇప్పటి వరకు ఇది మూడో ప్రమాదంగా తెలుస్తోంది. గతంలో జరిగిన రెండు ప్రమాదాల్లో ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. యాజమాన్య నిర్లక్ష్యంతో నిర్వహణ లోపం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. యంత్రాలను మెయింటెనెన్స్ చేయాలని సిబ్బంది చెప్పినప్పటికీ యాజమాన్యం వారి మాటలను పెడచెవిన పెట్టి ఉత్పత్తిపైనే దృష్టి సారించడం వల్లన ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్మికుల భద్రతను గాలికొదిలేసి ఉత్పత్తిపైనే దృష్టి సారించిన ఎన్సీఎల్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం ఇదే తీరు కొనసాగిస్తే కార్మికులతో కలిసి కంపెనీ ఎదుట ధర్నాకు దిగుతామని నాయకులు హెచ్చరించారు. ఎన్సీఎల్ బ్రిక్స్ కంపెనీలో కూలిన భారీ ఫ్లైయాష్ ట్యాంకు -
స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం స్ఫూర్తిదాయకం
చల్లపల్లి: స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని అందిపుచ్చుకుని స్వచ్ఛ చల్లపల్లిని ప్రారంభించి ఉద్యమంగా ముందుగు తీసుకువెళుతూ అందరికీ ఆదర్శంగా నిలవటం అభిందనీయమని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ పి.కృష్ణయ్య అన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాన్ని ప్రారంభించి 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం స్వచ్ఛ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కృష్ణయ్య, కలెక్టర్ బాలాజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కిమ్స్ సన్షైన్ ఆస్పత్రి(హైదరాబాద్) వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీ గురవారెడ్డి, విజయవాడకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు కాలేషావలి పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా 216 జాతీయ రహదారిలో స్వచ్ఛ సుందర చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద నూతనంగా జంక్షన్ పాయింట్లో ఫ్లడ్లైట్ల స్థంభాన్ని అతిథులచే ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా శ్మశానవాటిక, వర్మీ కంపోస్టును, డంపింగ్ యార్డును తిలకించారు. కొత్తగా ఏర్పాటుచేసిన బోర్డు వద్ద అందరూ గ్రూప్ ఫొటో దిగారు. గతంలో స్వచ్ఛ కార్యక్రమానికి ముందు తరువాత చల్లపల్లి పరిసరాల ఫొటోలను వైద్యులు డీఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులు చూపించారు. యువతను ప్రోత్సహించాలి.. అనంతరం స్వగృహ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి.కృష్ణయ్య మాట్లాడుతూ స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ సందర్భంగా డీఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులను, స్వచ్ఛ కార్యకర్తలను అభినందించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛ చల్లపల్లి సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. కిమ్స్ సన్షైన్ ఆస్పత్రి అధినేత డాక్టర్ ఏవీ గురవారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమాలలో యువతను ప్రోత్సహించాలని తద్వారా భవిష్యత్తులో కూడా ఈ స్వచ్ఛ కార్యక్రమాలు కొనసాగటానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు కాలేషావలి మాట్లాడుతూ.. సమాజంలో పేరుకుపోయిన చెత్తను తొలగించటం వల్ల దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త తన ప్రవచనాల్లో పేర్కొన్నట్లు వివరించారు. కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలె నాగమణి, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావు, స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ కృష్ణయ్య -
ప్రణాళిక విభాగంతోనే అభివృద్ధి
పటమట(విజయవాడతూర్పు): అభివృద్ధిలో పట్టణ ప్రణాళిక విభాగం కీలకమని, క్షేత్రస్థాయి విధుల నిర్వహణలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని ఏపీ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ టెక్నికల్ అఫీషియల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. టౌన్ప్లానింగ్కు క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ కావడం లేదని, పట్టణాల్లో ప్లానింగ్ సెక్రటరీలకు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు కలిపిస్తే క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. సభ్యులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలని సూచించారు. అలాగే గ్రామ/వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులకు నూతనంగా సర్వీస్ రూల్స్ ఏర్పాటుపై ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వాలని కోరారు. అసోసియేషన్ కార్యదర్శి మోహన్బాబు మాట్లాడుతూ.. అసోసియేషన్ను మరింత సమర్థంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామని, సభ్యుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ డైరీ రూపకల్పనపై సూచనలు చేశారు. జోనల్ అధ్యక్షుడు వసీంబేగ్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 20257గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్ లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీ ఆర్ఎస్) ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు.పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారిని ఆదివారం ట్రైనీ ఐఏఎస్లు ఏడుగురు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వారితో పలువురు అధికారులు ఉన్నారు.ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యభగవానుడికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సూర్యనమ స్కారాలు, సూర్యోపాసన సేవ జరిపించారు. -
అన్నను హత్య చేసిన తమ్ముడి అరెస్ట్
గుడివాడరూరల్: ఆస్తి తగదాల నేపథ్యంలో అన్నను హత్య చేసిన తమ్ముడిని అరెస్ట్ చేశామని గుడివాడ రైల్వే సీఐ ఎంవీ దుర్గారావు ఆదివారం తెలిపారు. రైల్వే పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. ఈ నెల 3న గుడివాడ రైల్వేస్టేషన్ సమీపంలోని ధనియాలపేట వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని సమాచారం వచ్చిందన్నారు. రైల్వే ఎస్ఐ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు. రైల్వే డీఎస్పీ రత్నరాజు ఆదేశాల మేరకు తన పర్యవేక్షణలో మచిలీపట్నం, గుడివాడ రైల్వే ఎస్ఐలు మహబూబ్ షరీఫ్, శివనారాయణలను తమ సిబ్బందితో విచారణ ప్రారంభించామన్నారు. రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరాలు, సెల్ టవర్ డంప్, సీడీఆర్, ఫోన్పేల ఆధారాలను సేకరించామన్నారు. బిహార్కు చెందిన సోనూకుమార్ సహనీ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి మందపాడు ఎల్ఐసీ కార్యాలయ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రైల్వే సిబ్బందికి అభినందన.. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం బిహార్లో తన అన్న పప్పుసహానీ(28)తో ఆస్తి విషయంలో మనస్పర్థలు ఉన్నాయన్నారు. ఈనేపథ్యంలో ఇటీవల గుడివాడ మండలం చిన ఎరుకపాడు వద్ద సీడ్ కంపెనీలో పనికి చేరానని, తన అన్న పనుల నిమిత్తం మైసూర్ వెళ్లాడన్నారు. ఈక్రమంలో తన అన్న మైసూర్లో పనులు చేసేందుకు కూలీలు అవసరమయ్యారని తెలపగా తాను గుడివాడలో కూలీలు ఉన్నారని తీసుకువెళ్లేందుకు తన అన్నను రావాలని కోరానన్నారు. ఈక్రమంలో ముందుగానే తాను వేసుకున్న పథకం ప్రకారం తన అన్న ఈ నెల 3న తెల్లవారు జామున గుడివాడ రాగానే ధనియాలపేట వద్దకు తీసుకెళ్లి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడన్నారు. వారం రోజుల్లోనే హత్య కేసును చేధించిన రైల్వే ఎస్ఐలు మహబూబ్ షరీఫ్, శివనారాయణ, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ షేక్ అక్బర్, సిబ్బందిని సీఐ ప్రత్యేకంగా అభినందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
వైద్య విద్యార్థులకు రక్షణ కల్పించాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): వైద్య విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని.. ఏలూరు మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థులను ఎలుకలు కరవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ అన్నారు. స్థానిక ముత్యాలంపాడులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం.ప్రభుదాస్తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలుకలు కరవటం వల్ల ఆరుగురు విద్యార్థులు రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైద్య విద్యార్థుల భద్రతపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం పరిపాలన, ప్రజా సంక్షేమంపై కాకుండా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని.. రాజకీయాలకు కాదని హితవు పలికారు. -
భక్త కనకదాస జీవితం ఆదర్శనీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తత్వజ్ఞానాన్ని పామరులకు అర్థమయ్యేలా సంగీత సాహిత్యాలతో చేరువ చేసిన తత్వవేత్త భక్త కనకదాస జీవితం నేటి తరానికి ఆదర్శదాయకమని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భక్త కనకదాస జయంతి వేడుకలు శనివారం జరిగాయి. కలెక్టర్ లక్ష్మీశ, 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ హాజరై కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రామధ్యాన చరిత్ర, మోహన తరంగిణి వంటి ప్రధాన రచనలు ఎంతో ప్రాచుర్యం పొందాయని, కనకదాస జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజ అభి వృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. 20 సూత్రాల పథకం చైర్మన్ లంక దినకర్ మాట్లాడుతూ సమాజంలో కుల వివక్షను రూపుమాప డంలో కనకదాస రచనలు ఎంతో దోహదపడతాయన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా బీసీ సంక్షేమ అధికారి డి.లక్ష్మీదేవి, డివిజనల్ సంక్షేమ అధికారులు ఆర్.రవిప్రసాదరావు, పి. శ్రీనివాసరావు, వార్డెన్లు ఎం.రజని, విజయదుర్గ, మేరి జాన్సన్, సూపరింటెండెంట్ పి.రాజకుమారి తది తరులు పాల్గొన్నారు. -
కూటమి నేతల్లో కోడి పందేల కోల్డ్ వార్
కంకిపాడు: సంక్రాంతికి మూడు నెలల ముందే కోడి పందేల లొల్లి మొదలైంది.. పండుగ మూడు రోజులూ జూద శిబిరాలు అడ్డగోలుగా నిర్వహించి పైసా వసూలు చేసుకునేందుకు టీడీపీ, జనసేన పక్షాలు రెడీ అయ్యాయి. ఎక్కడెక్కడ శిబిరాలు ఏర్పాటు చేయాలనే అంశంపై ఇరుపక్షాలు నడుమ ఒప్పందాలు కుదరకపోవటంతో కోల్డ్ వార్ నడుస్తోంది. పండుగ మూడు రోజుల్లో భారీ స్థాయిలో పందేలు నిర్వహించేందుకు అవసరమైన సన్నాహాల్లో నేతలు బిజీ అయ్యారు. సంక్రాంతి పండుగ అనగానే గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణాజిల్లా వ్యాప్తంగా నిర్వహించే జూద శిబిరాలు పోటీ పడుతున్నాయి. అందులోనూ పెనమలూరు నియోజకవర్గంలో భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసే కోడిపందేలు, జూద శిబిరాలు పందేల రాయుళ్లను ఆకర్షిస్తుంటాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కర్నాటకతో పాటుగా ఇతర దేశాలు, సినీరంగ ప్రముఖులు సైతం పాల్గొనేందుకు ఈప్రాంతానికి వస్తుండటం గమనార్హం. గత ఏడాది నియోజకవర్గం వ్యాప్తంగా నిర్వహించిన బరుల్లో సుమారు రూ.300 కోట్లు పైగా టర్నోవర్ జరిగినట్లు అంచనా. ఈ దఫా గత టర్నోవర్ను అధికమించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా ఏర్పాటు చేసే జూద శిబిరాలపై టీడీపీ, జనసేన పక్షాలు కన్నేశాయి. ప్రధానంగా పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో డిమాండ్ అధికంగా ఉన్న జూద శిబిరాలను చేజిక్కించుకుని పండుగ మూడు రోజులూ దండుకునేందుకు నేతలు స్కెచ్ గీసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా టీడీపీ, జనసేన పక్షాలు వేరువేరుగానే బరులు ఏర్పాటు చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి. స్టార్ హోటళ్లలో సిట్టింగులు.. కోడి పందేలు, జూద శిబిరాల నిర్వహణ అంశంపై టీడీపీ, జనసేనపక్షాలు జూదరులు, పందెం రాయుళ్లతో అప్పుడే ఒప్పందాలు మొదలు పెట్టారు. స్టార్ హోటళ్లలో సిట్టింగులు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ 2 లక్షలు నుంచి రూ 5 లక్షలుపైగా కోడి పందేలు బరుల్లో నిర్వహించటంపై ఒప్పందాలు చేసుకుంటున్నారు. అంతే కాకుండా కోత ముక్క, లోన–బయట, చిన్న బజారు–పెద్ద బజారు ఇతర జూదాలను హోల్సేల్గా విక్రయించేందుకు లక్షల్లో బేరాలు పెట్టారు. జూదరులను ఆకర్షించేందుకు వారికి పండుగ మూడు రోజులూ వసతి, ఇతర సదుపాయాలను కల్పిస్తామన్న హామీతో అగ్రిమెంట్లు చేసుకోవటం గమనార్హం. ఒక చోట జరిగిన ఒప్పందాలపై మరో చోట శిబిరం నిర్వాహకులు సమాచారం తెలుసుకుని తమ శిబిరంలో జూద నిర్వహిస్తే ఎక్కువ ప్రయోజనం కల్పిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారంటే పండుగ సందర్భంగా ఏ మేరకు డబ్బులు వెనుకేయాలనే ఆలోచనలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు కేంద్రంగా ఉన్న ప్రధాన హోటళ్లు, లాడ్జిల్లో పండుగ రూములు బుకింగ్ జరిగాయంటే ఈ దఫా బరుల నిర్వహణలో టీడీపీ, జనసేన పక్షాల నేతల ఆరాటం స్పష్టం చేస్తోంది. పెద్ద పండుగకు మూడు నెలల ముందే మొదలైన పందేల హడావుడి జూద శిబిరాల నిర్వహణకు నేతల ఆరాటం పైసా వసూల్కు స్కెచ్ రెడీ చేసుకుంటున్న టీడీపీ, జనసేన పక్షాలు బరుల ఒప్పందాలు కుదరక మల్లగుల్లాలు పెనమలూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఏటా పది నుంచి 15 వరకూ బరులు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ పక్షాలు వేరువేరుగా బరులు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ దఫా కూడా వేరుగానే బరులు ఏర్పాటు చేయాలనే తలంపు, పట్టుతో ఉన్నాయి. నియోజకవర్గ ముఖ్యనేతతో ఒప్పందం కూడా చేసుకుని ఎవరికి ముట్టచెప్పేది వారికి ముట్టజెప్పి బరులు ‘ఓకే’ చేయించుకుంటున్నారు. అందుకుగానూ పెట్టుబడులు సమకూర్చుకుంటున్నారు. ‘రాయల్టీ’ ఆశించిన ఆ ముఖ్యనేత, ఆయన ప్రధాన అనుచరులు పైస్థాయి పైరవీలు చేసుకుంటున్నారు. బరుల్లో తమ అనుచర వర్గమే పందేలు, జూద శిబిరాలు పెట్టి భారీ స్థాయిలో సంక్రాంతి మూడు రోజులూ దండుకునే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసుకుని పావులు కదుపుతున్నారు. -
జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకరన్ పేర్కొన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో కలిసి వైద్య–ఆరోగ్యం, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్పై ఆయా శాఖల అధికారులతో లంకా దినకర్ శనివారం సమీక్ష నిర్వహించారు. జననీ సురక్షా యోజన, జననీ శిశు సంరక్ష కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన తదితర పథకాలతో పాటు జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాలకు సంబంధించిన అంశాలపై సమీక్షించి, పురోగతికి అవసరమైన కార్యాచరణపై సూచ నలు చేశారు. బహుళ ప్రయోజనాల పీఎం సూర్యఘర్ పథకం అమల్లోనూ మరింత చొరవ చూపాలన్నారు. సమీక్షా సమావేశం అనంతరం లంకా దినకర్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 100 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. మాతా శిశు మరణాల రేటును తగ్గించడంపై అధికారులకు సూచనలు చేశామన్నారు. సిద్ధార్థ వైద్య కళాశాల అభివృద్ధి కార్యకలాపాలపైనా చర్చ జరిగిందన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, సీపీఓ వై.శ్రీలత, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎ.విద్యాసాగర్, విజయవాడ మునిసిపల్ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయ అధికారి డాక్టర్ జె.సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
భవానీ భక్తులకు త్వరితగతిన దుర్గమ్మ దర్శనం
లబ్బీపేట(విజయవాడతూర్పు): డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీ దీక్షల విరమణ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు చర్యలపై దుర్గగుడి అధికారులు, పోలీసు అధికారులతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. భవానీ మాలధారులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా త్వరితగతిన దుర్గమ్మ దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన ప్రదేశాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటుపై చర్చించారు. భవానీ భక్తులందరూ ప్రత్యేక యాప్లో పేర్లు నమోదు చేసుకునేలా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. దీక్ష విరమణకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారని, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రద్దీని నియంత్రించి.. హోల్డింగ్ ఏరియాలను ఉపయోగించి, క్యూలైన్లు, స్నానఘాట్లు, ప్రసాదం కౌంటర్ల వద్ద భక్తుల రద్దీని తగ్గించి త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. గిరి ప్రదక్షిణ సమయంలో భవానీ భక్తులకు ఆటంకాలు ఎదురవకుండా, సామాన్య ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై క్షుణ్ణంగా చర్చించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, గిరి ప్రదక్షిణ సమయంలో ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్ ఏర్పాట్లపై సమీక్షించారు. భవానీ భక్తుల సమాచారం కోసం గత ఏడాది రూపొందించిన ప్రత్యేక యాప్ ఆధునికీకరించి, దానిలో అమ్మవారి దర్శనం వివరాలు, ముందస్తు సమాచారం, ప్రసాదాలను ఆన్లైన్ ద్వారా ముందుగానే బుక్చేసుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పార్కింగ్ ప్రదేశాలు, మెడికల్ పాయింట్లు, తాగునీరు, సమాచార కేంద్రం, గిరి ప్రదక్షిణ, దర్శన సమయాలు, పూజా విధానం తదితర అంశాలన్నీ ఆ యాప్లో ఉండేలా చూడాలని దేవస్థానం ఐటీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈఓ శీనానాయక్, డీసీపీ కృష్ణకాంత్ పాటిల్, ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాష్, దేవస్థానం అధికారులు, ఐటీ, ఇంజినీరింగు అధికారులు పాల్గొన్నారు. -
సమ్మోహనం.. ధర్మ విజయం
విజయవాడకల్చరల్: గౌతమ బుద్ధుని జీవిత విశేషాల సమాహారంగా సాగిన నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. జయశ్రీ నృత్య కూచిపూడి నృత్యాలయం ఆధ్వర్యంలో నాట్యాచార్యుడు చదలవాడ ఆనంద్ నృత్య దర్శకత్వంలో విజయవాడ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో శనివారం ప్రదర్శించిన ధర్మవిజయం నృత్య రూపకం సమ్మోహనంగా సాగింది. భారతీయుల ఆధ్యాత్మిక గురువు బుద్ధుని జీవిత విశేషాలతో కూడిన ఈ కళా రూపానికి తియ్యగూర సీతారామిరెడ్డి కథా సహకారం అందించగా కుమార సూర్యనారాయణ సంగీత సహకారం అందించారు. సిద్ధార్థుని జననంతో ప్రారంభించి ఆయన బాల్యం, కౌమారం, యవ్వనం, వివాహం సిద్ధార్థుడు బుద్ధునిగా మారడం, ఆయన ధర్మబోధనలు అంశంగా ప్రదర్శన సాగింది. సిద్ధార్థునిగా నాదపద్మ, గౌతమునిగా ద్వారక జయలక్ష్మి, మహారాజుగా ద్వారక జయలక్ష్మి, మాయా దేవిగా భవ్యశ్రీ, యశోదరగా అమృత వర్షిణి, బింబిసారునిగా భవ్యశ్రీలు నటించారు. విద్యావేత్త గంధసిరి కల్పనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రచయితలు తియ్యగూర సీతారామిరెడ్డి, మెండెపు శ్రీనివాస్ గాయని సుధా శ్రీనివాస్, సంగీత విద్వాంసురాలు కందుల లక్ష్మీనరసమ్మ, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ సి.జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి వైఫల్యాలను నిలదీస్తున్నందుకే అక్రమ అరెస్టు
ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రతో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు శనివారం పరామర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల సమన్వయకర్తలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు జోగి రమేష్ సతీమణి శకుంతలమ్మ, కుమారులు జోగి రాజీవ్, రోహిత్కుమార్ను పరామర్శించారు. అక్రమ కేసులపై కోర్టుల్లో న్యాయ పోరాటం చేద్దామని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్నందునే.. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జోగి రమేష్ను కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్ట్ చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, పవన్కల్యాణ్ ఇతర నాయకులు తప్పుడు కేసులు సృష్టించి అన్యాయంగా జైలుకు పంపారని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీకి చెందిన వ్యక్తి నకిలీ మద్యం తయారు చేస్తుంటే, దానిని బయటపెట్టిన వ్యక్తి జోగి రమేష్ అని స్పష్టం చేశారు. బీసీ నాయకుడిగా ఎదిగిన జోగి రమేష్పై రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులు బనాయించారని, కుటుంబ సభ్యులపైనా తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. జోగి రమేష్ సతీమణి శకుంతలమ్మ కన్నీటిలో కూటమి నాయకులు కొట్టుకుపోయే రోజు త్వరలో వస్తుందన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు. కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాటలో దాదాపు పది మంది వరకు చనిపోయిన విషయాన్ని పక్కదోవ పట్టించడానికి జోగి రమేష్ను అరెస్ట్ చేసిందన్నారు. టీడీపీ నాయకులు తయారు చేస్తున్న నకిలీ మద్యం కేసుతో జోగి రమేష్కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ.. బీసీల ఎదుగుదలను ఓర్వలేక జోగి రమే ష్పై అక్రమ కేసులు పెట్టారని ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జోగి రమేష్ అక్రమ కేసులో పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వం దుర్విని యోగం చేసిందన్నారు. మోంథా తుపానుతో ఉమ్మడి కృష్ణాలో పంటలు దెబ్బతిని రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పోస్టర్ ఆవిష్కరణ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12న చేపట్టనున్న ప్రజా ఉద్యమం పోస్టర్ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, ఎంపీపీలు వేముల కొండ లక్ష్మీతిరుపతమ్మ, ఇస్లావత్ ప్రసన్నరాణి, చెన్ను ప్రసన్న కుమారి, జెడ్పీటీసీ సభ్యుడు మందా జక్రధరరావు, పార్టీ నాయకులు సర్నాల తిరుపతిరావు, వేములకొండ తిరుపతిరావు, అప్పిడి కిరణ్కుమార్రెడ్డి, పామర్తి శ్రీనివాసరావు, మేడపాటి నాగిరెడ్డి, పచ్చిగోళ్ల పండు, గుంజ శ్రీనివాసరావు, పోరంకి శ్రీనివాసరాజు, మిక్కిలి శరభయ్య, నల్లమోతు దయాకర్, కోమటి కోటేశ్వరరావు, కుంచం జయరాజు, కోల కాని శ్రీనివాసరావు, గోగులమూడి రాణి, సెశెట్టి ఈశ్వరి, ఉయ్యూరు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
తలనొప్పిగా వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్డు విస్తరణ ప్రచారం
గుంటూరు జిల్లాలోని చినకాకాని వద్ద వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్డు విస్తరణ ప్రచారం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెద్ద దెబ్బ కొట్టింది. కాజ నుంచి విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద హైదరాబాద్ – మచిలీపట్నం హైవేకు అనుసంధానం చేస్తూ నిర్మించిన పశ్చిమ బైపాస్ రోడ్డుతో వాహనాల రద్దీ తగ్గుతుందని ప్రజలు భావించారు. అయితే సర్వీస్ రోడ్డు ప్రతిపాదన ఒక రూపు దాల్చకపోయినా రోడ్డు విస్తరణ ప్రచారం విపరీతంగా జరిగింది. అదిగో పులి అంటే, ఇదిగో తోక అన్న చందంగా ఇన్ని మీటర్లు, కాదు అన్ని మీటర్ల భూమిని ప్రభుత్వం సేకరిస్తుందంటూ లెక్కలు కట్టి మరీ కొందరు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా సంబంధిత శాఖల్లో రోడ్డు విస్తరణ ప్రస్తావనే లేదు. అధికారులు సైతం తమకు ఈ విషయంలో అధికారి కంగా ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే భూ సేకరణపై దుష్ప్రచారం మాత్రం ఆగడం లేదు. అంతేకాకుండా మరి కొందరు ఫలానా సర్వే నంబర్లలో భూ రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసిందంటూ సరికొత్త ప్రచారానికి తెరతీశారు. పర్యవసానంగా మంచి ధరకు భూములు అమ్ముకుందామనుకుంటున్న రైతులు, ఇప్పటికే ఈ ప్రాంతంలో వెంచర్లు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. సర్వీస్ రోడ్డు విస్తరణ ప్రతిపాదనకు ముందు కొందరు రియల్టర్లు రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేశారు. కొంత అమ్ముడైన తర్వాత రింగ్ రోడ్డు వస్తోందన్న ప్రచారం మొదలవడంతో మిగతా ప్లాట్ల విక్రయాలు నిలిచిపోయాయి. కొంత కాలంగా ఈ ప్రాంతంలో ఒక్క భూమి కూడా అమ్మకం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. భూసేకరణ ఎక్కడ జరుగుతుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వ్యాపారాలు స్తంభించిపోవడానికి కారణమవుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ గందరగోళానికి తెర దించాలని రైతులు, రియల్ వ్యాపారులు కోరుతున్నారు. -
వన సమారాధనలకు అనువైన ప్రదేశం
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ క్షేత్రం.. పెనుగంచిప్రోలు: పవిత్ర కార్తీక మాసంలో శివాలయాల దర్శనంతో పాటు వన సమారాధనలకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆహ్లాదాన్ని పంచే పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రం వన సమారాధనలకు ఎంతో అనువైన ప్రదేశం. ఏటా కార్తీక మాసంలో మునేరు అవతల ఉన్న మామిడి తోటల్లో వన సమారాధనల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ప్రసిద్ధి చెందిన శ్రీ తిరుపతమ్మ ఆలయం, సమీపంల పవిత్ర స్నానాలు చేసేందుకు మునేరు, సామూహిక సహ పంక్తి భోజనాలు, ఆటపాటలకు అందమైన మామిడి తోటలు ఆహ్లాదాన్ని పంచుతాయి. విజయవాడ నగరానికి 70 కిలోమీటర్లు నందిగామ, జగ్గయ్యపేట పట్టణాల నుంచి 17 కిలో మీటర్ల దూరంలో ఉంది ఈ పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రం. విశాలంగా ఉండే ఆలయం. దీని చుట్టూ పచ్చని తోటలు ఎంతో ప్రశాంతత, ఆహ్లాదాన్ని ఇస్తాయి. తోటల్లో ఆట, పాటలతో సరదాతో పాటు ఉసిరి చెట్టు కింద కార్తీక మాస వ్రతాలు, కథలు చెప్పుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడపవచ్చు. -
గొప్పల డప్పు.. రియల్కు ముప్పు
సాక్షి, అమరావతి: వీసమెత్తు అభివృద్ధి కనిపించకపోయినా ఎంతో జరిగిపోయినట్లు కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా గొప్పల డప్పు మోగిస్తోంది. ప్రభుత్వ హడావుడితో రైతులు అల్లాడుతుండగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. హైవేలు, పోర్టులు, రింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయని హడావుడి చేయడమే తప్ప వాస్తవంలో అవేమీ ఆచరణకు చోచుకోవడం లేదు. ప్రభుత్వం మాత్రం అవి వచ్చేసినట్లు, ఆ ప్రాంతాల రూపురేఖలు సమూలంగా మారిపోయినట్లు ప్రచారం చేస్తూ ప్రజలను మాయ చేస్తోంది. ఈ ప్రచారంతో రైతులు తమ భూములు విక్రయించాలో, వద్దో తేల్చుకోలేక సతమతం అవుతున్నారు. భవిష్యత్లో భూములకు మంచి ధర వస్తుందని, ప్రస్తుతం ఉన్న రేట్లకు విక్రయిస్తే నష్టపోతామేమోననే భయం వారిని వెంటాడుతోంది. కొనుగోలుదారులు కూడా ఇప్పుడు భూములను కొంటే భూసేకరణ ఉచ్చులో చిక్కుకుంటామనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. మరో వైపు ఆ ప్రాంతాల్లో అప్పటికే ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలు జరగక వెలవెలబోతు న్నాయి. ప్రభుత్వ తీరుతో అటు రైతులు, ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిండా మునిగిపోయి ఆందోళన చెందుతున్నారు. ప్రచారంతో రియల్ ఎస్టేట్ దివాలా కూటమి ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు అత్యుత్సాహంతో చేస్తున్న ప్రకటనలు రియల్ ఎస్టేట్ రంగం కొంప ముంచుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం చెప్పేవన్నీ అమలు జరగడం సంగతి అటు ఉంచి, ఇప్పుడు ఎకరం భూమి ధర కోట్ల రూపాయలకు చేరడం, చదరపు గజం లక్షల రూపాయలు పలకడంతో అంతటా అయోమయం నెలకొంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం వచ్చే రెండు, మూడేళ్లలో పూర్తవుతుందని, దానికి ప్రధాన కనెక్టెవిటీగా ఉన్న మచిలీపట్నం – విజయవాడ హైవేను ఆరు లైన్లుగా విస్తరిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పోర్టు పూర్తయితే ఎంత ట్రాఫిక్ పెరుగుతుంది, దానికి ఎన్ని లైన్ల రోడ్డు కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించాలి, ఆరు లైన్లకు హైవే విస్తరణ అవసరమా అనే అంశాలపై స్పష్టత లేదు. అయినా విజయవాడ – మచిలీపట్నం రహదారిని ఆరు లైన్లుగా విస్తరిస్తారనే ప్రచారంతో ఆ ప్రాంతాల్లో భూముల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కానూరు, పెనుమలూరు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో కొద్దో గొప్పో జరిగే లావాదేవీలు కూడా ఇప్పడు భారీగా రేట్లు కారణంగా తగ్గిపోయాయి. ఎన్నికలకు ముందు గజం రూ.25 వేలు ఉన్న భూమి ఇప్పుడు రూ.50 వేలకుపైగా పెరిగిపోయింది. ఈడుపుగల్లు, గోసాల, వణుకూరు తదితర ప్రాంతాల్లో గతంలో రూ.10 వేలు ఉన్న గజం భూమి ధర ఇప్పుడు రూ.30 వేలకు పెరిగిపోయింది. దీంతో సామాన్యులు అటు వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండాపోయింది. ఉయ్యూరు, పామర్రు, నిమ్మకూరు తదితర ప్రాంతాల్లో రహదారి వెంబడి వెంచర్లు మొదలుపెట్టిన రియల్టర్లు కూడా ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ హడావుడితో ముందుకు వెళ్లలేక ఆగిపోయారు. -
ఉరేసుకుని వాచ్మేన్ మృతి
పెనమలూరు: అపార్టుమెంట్ వాచ్మేన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ రమేష్(42) భార్య సంజీవ, ఇద్దరు కుమార్తెలతో నాలుగు నెలల క్రితం పోరంకి వచ్చాడు. ఒక అపార్టుమెంట్లో వాచ్మేన్గా కుదిరాడు. దురలవాట్ల కారణంగా ఈ నెల 6న భార్యతో గొడవ జరిగింది. దీంతో ఆమె పెదకళ్లేపల్లి వెళ్లి పోయింది. ఈ క్రమంలో అపార్ట్మెంట్లో ఉండే సూర్యనారాయణ అనే వ్యక్తి రమేష్ ఫ్యాన్కు ఉరేసుకున్నాడని శుక్రవారం రాత్రి సంజీవకు ఫోన్ చేసి చెప్పాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమాన్జంక్షన్ రూరల్: నీట మునిగిపోతున్న ఎందరినో కాపాడిన గజ ఈతగాడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని కుమ్మరి కాలనీకి చెందిన కాల్వ ముత్యాలరావు(49) పెద్ద చెరువులో చేపల పెంపకం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చేపల మేత వేసేందుకు పడవలో మరో ఇద్దరుతో కలిసి రాత్రి వేళ చెరువులోకి వెళ్లాడు. ఆకస్మాత్తుగా పడవ ఒరిగిపోవటంతో ప్రమాదవశాత్తూ జారి చెరువులోకి పడ్డాడు. కేకలు వేయటంతో గ్రామస్తులు రక్షించేందుకు యత్నించారు. ముత్యాలరావును గుర్తించి బయటకు తీసేటప్పటికే ప్రాణాలొదిలాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పలుమార్లు చెరువులు, కాల్వల్లో పడిన వారిని బయటకు తీసిన ముత్యాలరావు నీట మునిగి మృతి చెందటంతో గ్రామస్తులు విషాదంలో మునిగారు. -
బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంధిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరగనున్న ఇళయరాజా మ్యూజికల్ కాన్సర్ట్ కార్యక్రమ బందోబస్తు ఏర్పాట్లు శుక్రవారం సీపీ ఎస్వీ రాజశేఖరబాబు పరిశీలించారు. ఇతర పోలీస్ అధికారులతో కలిసి స్టేడియంతో పాటు, పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ పరంగా సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట డీసీపీలు కృష్ణకాంత్ పాటిల్, షిరీన్ బేగం, ఎస్వీడీ ప్రసాద్, ఏడీసీపీలు, ఇన్స్పెక్టర్లు ఉన్నారు. విరిగిన రైల్వేగేటు.. తప్పిన ముప్పు మధురానగర్(విజయవాడసెంట్రల్): మధురానగర్ పప్పులమిల్లు రైల్వేగేటు శుక్రవారం సాయంత్రం విరిగిపోయింది. దీంతో విజయవాడ నుంచి గుడివాడ వైపు వెళ్లే రైలు పావు గంటకు పైగా నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి గుడివాడ వైపు రైలు వస్తుండటంతో గేటుమ్యాన్ రైల్వేగేటు వేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఒక్కసారిగా రైల్వేగేటు విరిగి పడిపోయింది. అదృష్టవశావత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఒక్కసారిగా రైలు గేటు విరిగిపడటంతో సిగ్నల్ లేక రైలు నిలిచిపోయింది. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైలును పంపించారు. అదృష్టవశాత్తూ రైల్వేగేటు ఎవరిమీద పడలేదని ఒకవేళ పడితే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుపాను బాధిత రైతాంగాన్ని ఆదుకుంటాం కంకిపాడు: తుపాను బాధిత రైతాంగాన్ని ఆదుకుంటామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మండలంలోని పునాదిపాడు గ్రామంలో కలెక్టర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. మోంథా తుపాను వల్ల దెబ్బతిని పడిపోయిన వరి పొలాలను పరిశీలించారు. తుపాను వల్ల పంట నష్టపోయామని, తమన ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని నిబంధనలతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని అభ్యర్థించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని రైతులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పర్యటనలో జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, ఉయ్యూరు ఆర్డీఓ హెలా షారోన్, పామర్రు ఏడీఏ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యుని సేవలో.. మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని కేరళ రాష్ట్రం అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ట్రస్టీ అశ్వతీ తిరునాళ్ గౌరీ లక్ష్మీభాయి శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆమె ప్రముఖ సినీనటులు కొల్లా అశోక్కుమార్తో కలసి నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, రావి రత్నగిరి పాల్గొన్నారు. -
జీవనశైలిలో మార్పులతో అసంక్రమిక వ్యాధులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): జీవనశైలిలో మార్పులతో అసంక్రమిక వ్యాధులు పెరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. అందులో భాగంగా మధుమేహం, అధిక రక్తపోటులతో పాటు, క్యాన్సర్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు ఆమె తెలిపారు. క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ సుహాసిని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యాధులు సోకకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదని, ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఇంధుమతి, డాక్టర్ మాధవి, డాక్టర్ నవీన్, డాక్టర్ భానూ నాయక్, డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
సైన్ బోర్డులపై ఆలయ సమాచారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆలయ సమాచారం అందరికీ అర్థమయ్యే రీతిలో సైన్బోర్డులు ఏర్పాటు చేయనున్నామని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ తెలిపారు. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు శుక్రవారం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డిలోని బోర్డు సమావేశ మందిరంలో సమావేశమైంది. చైర్మన్ రాధాకృష్ణ అధ్యక్షతన ఈవో శీనానాయక్, బోర్డు సభ్యులు, దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో భవానీ దీక్ష విరమణలలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తం 26 అంశాలు చర్చకు రాగా, 18 అంశాలకు ఆమోదం లభించింది. మిగిలిన ఎనిమిది అంశాలపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ రాధాకృష్ణ పేర్కొన్నారు. తొలి అంశం ఇదే.. దుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరల టెండర్ అంశం తొలి అజెండాగా సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ అంశాన్ని బోర్డు సభ్యులతో చర్చించి కౌంటర్ మరో ప్రాంతానికి మార్పు చేసే అంశంపై చర్చించేందుకు తదుపరి సమావేశంలో చేర్చాలని తీర్మానించారు. కొండపై ఓం టర్నింగ్ వద్ద రూ. 27.90లక్షలు పలికిన కూల్డ్రింక్ షాపు టెండర్ను భక్తుల భద్రత దృష్ట్యా రద్దు చేయాలని తీర్మానించారు. ఇక భవానీ దీక్ష విరమణలకు సంబంధించి పలు ఇంజినీరింగ్ పనులను బోర్డు సభ్యులు ఆమోదించారు. ప్రతి నిత్యం జరుగుతున్న అన్నదానంలో భక్తులకు రెండో దఫా కూరలు వడ్డించేందుకు దిట్టం పెంచాలని దేవస్థాన అధికారుల సూచనను బోర్డు సభ్యులు తిరస్కరించారు. అమ్మవారి సన్నిధిలో వేకువ జామున భక్తులకు అల్పాహారం అందించేందుకు చేసిన ప్రతిపాదనను బోర్డు ఆమోదం తెలిపింది. రానున్న ఉగాది పర్వదినం నుంచి దీనిని అమలు చేసే అవకాశం ఉందని బోర్డు సభ్యులు పేర్కొంటున్నారు. రానున్న కాలంలో కనకదుర్గనగర్ మీదుగానే భక్తులు రాకపోకలు సాగించేలా ఆలయ నిర్మాణ పనులు చేపట్టామని చైర్మన్ రాధాకృష్ణ పేర్కొన్నారు. బోర్డు సమావేశం అనంతరం చైర్మన్, ఈవోలు మీడియాతో మాట్లాడారు. ఘాట్రోడ్డుపై ఒత్తిడిని తగ్గించేలా భవిష్యత్తులో భక్తులందరూ కనకదుర్గనగర్ నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ల ద్వారానే కొండపైకి చేరుకుంటారన్నారు. ప్రముఖులు, వీఐపీలు మినహా మిగిలిన భక్తులను మహా మండపం మీదుగానే ఆలయానికి చేరుకునేలా మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తామన్నారు. కొండ దిగువన ఉన్న షాపులను మహా మండపం ఐదో అంతస్తుకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ కుంకుమ ప్యాకెట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు, ఎక్స్అఫిషియో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. -
నేడు ఏసు క్రీస్తు జయంతి జూబ్లీ వేడుకలు
పటమట(విజయవాడతూర్పు): దివంగత పోప్ ఫ్రాన్సిస్ 2025వ సంవత్సరాన్ని జూబ్లీ ఏడాదిగా ప్రకటించిన నేపథ్యంలో ఏసుక్రీస్తు జయంతి–2025 జూబ్లీ వేడుకలను నగరంలో నిర్వహిస్తున్నట్లు విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు తెలిపారు. శుక్రవారం పటమటలోని బిషప్ హౌస్లో విలేకరులతో మాట్లాడారు. వేడుకలను శనివారం ఉదయం 8.30 గంటలకు నగరంలోని లయోలా కళాశాల ప్రాంగణంలో ఉన్న ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామన్నారు విశాఖపట్నం ఆర్చ్ బిషప్ ఉడుముల బాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఆరు జిల్లాల బిషప్లు ముఖ్యఅతిథులుగా పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుత పోప్ లియో 14 ఆదేశాల మేరకు ఆరు జిల్లాల్లోకి కథోలిక మేత్రాసనాలు సంయుక్తంగా విజయవాడలో వేడుకలు నిర్వహిస్తున్నామని, ఇందులో 1600 మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. దేవునికి కృతజ్ఞతలు తెలిపేందుకే.. గుంటూరు కథోలిక పీఠం బిషప్ చిన్నాబత్తిన భాగయ్య మాట్లాడుతూ 2025 ఏళ్లక్రితం క్రీస్తు జననం ద్వారా ఈ ప్రపంచానికి వెలుగు వచ్చిందని, సర్వ జనులను ఏసుక్రీస్తు రక్షణగా నిలిచారని, ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకునేందుకు ఈ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. నెల్లూరు బిషప్ ఎండీ ప్రకాశం, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం. గాబ్రియేలు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ సునీల్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025సామ్రాజ్యవాద ఉడత ఊపులకు కాలం చెల్లింది పెనమలూరు: యనమలకుదురులోని లాకుల సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీకనకదుర్గమ్మ వారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి గాజుల అలంకరణ చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. లబ్బీపేట: విజయవాడ విచ్చేసిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాను మానసిక వైద్యులు ఇండ్ల రామసుబ్బారెడ్డి, ఇండ్ల విశాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు శుక్రవారం విరాళాలను అందజేశారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జరపల మంగ్యా(60). ఏ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు దీప్లానగర్ తండాకు చెందిన వ్యక్తి. ఈయనకు ఐదేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి సోకింది. చికిత్స నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా వ్యాధి తీవ్రత తగ్గలేదు. కూలిపనులు చేసి జీవించే మంగ్యా చికిత్స పొందుతూ నవంబర్ 2న చనిపోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ఇంటి పెద్ద మరణంతో ఆ కుటుంబ పోషణ ప్రశ్నార్థకమైంది. పరిస్థితి దయనీయంగా మారింది. సకాలంలో కృష్ణా నదీ జలాలు అందిస్తే మంగ్యా దక్కేవాడని ఆ కుటుంబసభ్యులు వాపోతున్నారు. పైలెట్ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరాయి. త్వరలోనే కృష్ణా నదీ జలాలు సరఫరా చేస్తాం. పైపులైను ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు రావలసి ఉంది. అన్ని హాబిటేషన్లలో ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి కావొచ్చింది. – లక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఏకొండూరు జాడలేని శుద్ధ జలం! గిరిజన తండాల ప్రజలు కిడ్నీవ్యాధి బారిన పడుతున్నందున కృష్ణా నదీ జలాలను సరఫరా చేసే పైలెట్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేయాలి. ఏకొండూరు మండలంలోని 30 గ్రామాల్లో శుద్ధి చేసిన జలాలను సరఫరా చేయాలి. కిడ్నీ రోగులకు పూర్తిస్థాయి చికిత్స అందించడానికి చర్యలు తీసుకోవాలి. – మేకల డేవిడ్, సీపీఐ నాయకుడు, ఏ.కొండూరు తిరువూరు: ఏ.కొండూరు మండలంలో గిరిజన తండాలకు కృష్ణా జలాలు సరఫరా చేసే నిమిత్తం రూ.50కోట్లతో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలోనే 75శాతం ప్రాజెక్టు పనులు పూర్తికాగా.. మిగిలిన పనులను కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర గడచినా ఓ కొలిక్కి తీసుకురాలేకపోయింది. మండలంలో 200 కిలోమీటర్ల నిడివి పైపులైన్ల నిర్మాణం చేపట్టగా, 14 ఓవర్ హెడ్ ట్యాంకులను అదనంగా నిర్మిస్తున్నారు. కిడ్నీ వ్యాధికి గురైన గిరిజనులు శుద్ధి చేసిన నీరందక మృత్యువాత పడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గత ఏడాది కాలంలో పలుమార్లు ఈ మండలంలో పర్యటించి త్వరలో కృష్ణా జలాలు వస్తా యని ప్రకటించడం మినహా పనులు పూర్తిచేయలేదు. గత 15 రోజుల్లోనే ముగ్గురు కిడ్నీరోగులు మృత్యువాత పడగా, 175 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకెన్నాళ్లీ నిర్లక్ష్యం.. ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న కారణంగా ఏ.కొండూరు మండలంలోని 38 గ్రామాలు, 21 హాబిటేషన్లలో గిరిజనులు కిడ్నీవ్యాధి బారిన పడుతున్నట్లు శాసీ్త్రయంగా నిర్ధారించినప్పటికీ.. యుద్ధప్రాతిపదికన కృష్ణాజలాల సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తోంది. మండలంలోని చీమలపాడు శివారు వెంకట తండా, పెద తండా, కేశ్యా తండా, గ్యామా తండా, కృష్ణారావుపాలెం తండా, మాన్సింగ్ తండా, దీప్లా నగర్, చైతన్యనగర్, మత్రియా తండా, ఏ.కొండూరు తండా, కుమ్మరికుంట్ల, రేపూడి తండా, పాల్తియా తండా, ఎల్ఐజీ తండా, గోపాలపురం తండా, వల్లంపట్ల, గొల్ల మందల తండాలలో కిడ్నీవ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. ట్రాక్టర్లతో అందిస్తున్న శుద్ధి చేసిన మంచినీటిని తాత్కాలికంగా అందిస్తున్నారు. మాధవరం, రేపూడి, కుమ్మరకుంట్ల గ్రామాలకు డైరెక్టు పంపింగ్ స్కీం ద్వారా తాగునీరందిస్తున్నారు. హామీలతో సరి.. ఏ.కొండూరు మండలంలో కిడ్నీ బాధితులున్న గ్రామాలు, తండాలకు కృష్ణా జలాల సరఫరా తాము అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచలేదు. తాను గెలిచిన వెంటనే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కృష్ణా జలాల సాధనకు పాదయాత్ర కూడా చేపట్టి అధిష్టానం హామీ ఇవ్వడంతో వెంటనే నిలిపివేశారు. వామపక్షాలు పలుమార్లు కిడ్నీ రోగుల సమస్యలపై ఆందోళనలు జరిపాయి. ఏ.కొండూరులో కిడ్నీ రోగులకు చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నా ఫలితం లేదు. మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశ, చిత్రంలో ఎమ్మెల్యే బొండా తదితరులు7ఇబ్రహీంపట్నం నుంచి ఏ.కొండూరు మండలానికి కృష్ణా నదీ జలాల సరఫరాకు పైపులైన్ల ఏర్పాటులో కొండపల్లి వద్ద రైల్వే శాఖ అనుమతి రావలసి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన ఇంతవరకు ఆమోదానికి నోచలేదు. వల్లంపట్లలో ఓవర్ హెడ్ రిజర్వాయర్ నిర్మాణం, కుమ్మరికుంట్ల వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. పైపులైన్ల నిర్మాణం కొన్ని తండాల్లో పూర్తి కాలేదు. -
పోలీస్ కమిషనరేట్లో సామూహిక వందేమాతర గీతాలాపన
లబ్బీపేట(విజయవాడతూర్పు): వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం విజయవాడ నగరంలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సామూహిక వందేమాతర గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబుతో పాటు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి వందేమాతరాన్ని ఏకస్వరంతో ఆలపించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వందేమాతరం అనేది దేశభక్తి నినాదం మాత్రమే కాదని, అది మన మనసుల్లో దేశమంటే ఏమిటో గుర్తుచేసే శక్తి అన్నారు. భారతీయుల మనసుల్లో దేశభక్తిని మేల్కొలిపిన ఆత్మీయ నినాదమని, 1875 నవంబర్ 7న మహాకవి బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గేయం తొలిసారిగా ’ఆనంద్ మఠ్’ నవలలో ప్రచురితమైందన్నారు. ఈ గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని, త్యాగస్ఫూర్తిని నింపింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కె.జి.వి. సరిత, పలువురు ఇన్స్పెక్టర్లు, సీపీవో సిబ్బంది పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారిని నిర్వహించిన ఖడ్గమాలార్చన మొదలు శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కళ్యాణంలో పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కానుకలను సమర్పించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని క్యూలైన్లు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. సర్వ దర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 టికెట్లు క్యూలైన్లోనూ రద్దీ కనిపించింది. సాయంత్రం పంచహారతుల సేవలోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మల్లేశ్వర స్వామి వారికి త్రికాల అర్చనలు, అభిషేకాలను నిర్వహించారు. సాయంత్రం సహాస్ర లింగార్చన సేవ, సహాస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవలు నిర్వహించారు. ఊంజల్ సేవలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
క్యాన్సర్పై విజయం స్క్రీనింగ్ పరీక్షలతోనే సాధ్యం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్క రూ అవగాహన కలిగి ఉండడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శా ఖ కమిషనర్ వీరపాండ్యన్ అన్నారు. క్రమం తప్పక స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వ్యాధి నియంత్రణకు దోహదపడుతాయని పేర్కొన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక సమాజంలో పెరుగుతున్న జీవన ప్రమాణాలతో పాటు జీవన శైలిలో మార్పుల వలన అసంక్రమిత వ్యాధుల నమోదు సంఖ్య నానాటికి పెరుగుతోందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఏడాది క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని తొలి దశలోనే వ్యాధిని గుర్తించగలిగితే చికిత్స ద్వారా వ్యాధిని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం క్యాన్సర్ వ్యాధి చికిత్సలను ఉచితంగా అందిస్తోందని, ప్రజలు ముందుకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా చైతన్యవంతులుగా చేయాలని సూచించారు. వ్యాయామంతో కాన్సర్ దూరం.. కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ జంక్ ఫుడ్స్ చక్కెర, ఉప్పు కొవ్వు పదార్థాలు అధిక క్యాలరీస్ వివిధ హర్మోన్లుపై ప్రభావం చూపి క్యాన్సర్ వ్యాధికి కారణమైయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. రోజూ వాకింగ్, రన్నింగ్, సైకిలింగ్, యోగా వంటివి ఆచరిస్తే క్యాన్సర్కు దూరంగా ఉండొచ్చన్నారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ కె.శ్యామల, డబ్య్లుహెచ్వీ కన్సల్టెంట్ డాక్టర్ జి.సురేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, ఎన్సీడీ నోడల్ అధికారి డా. మాధవి తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండ్యన్ -
వందేమాతరం స్ఫూర్తితో వికసిత్ భారత్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): స్వాతంత్య్ర ఉద్యమంలో విద్వాంసుల నుంచి విప్లవకారుల వరకు వందేమాతం గేయం కదిలించిందని ఆ స్ఫూర్తితోనే వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, కేబీఎన్ కళాశాల ఆధ్వర్యంలో ఆ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ప్రత్యేక వేడుకలు జరిగాయి. అందులో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు యలమంచిలి సుజనా చౌదరి, రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్మన్ తేజస్వి పొడపాటి, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తదితరులు కలిసి భరతమాత చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించారు. వందేమాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దాదాపు మూడువేల మంది విద్యార్థులతో వందేమాతరం గేయాలాపన చేశారు. ప్రధానమంత్రి సందేశాన్ని వర్చువల్గా వీక్షించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి టి.శ్రీనివాసు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఎండలో అల్లాడిన విద్యార్థులు... వందేమాతరం గేయ ఆలాపన కోసం వేలాది మంది విద్యార్థులను ఎండలో నిలబెట్టడంతో వారంతా అల్లాడిపోయారు. ఉదయం 9.30 నుంచి 11.00 గంటల వరకూ సుమారు గంటన్నర పాటు ఎండలో నిలబడటంతో గేయాలాపన పూర్తవగానే విద్యార్థులు అక్కడి నుంచి నీడలోకి వెళ్లిపోయారు. దీంతో సభా ప్రాంగణం ఖాళీ అయింది. విద్యార్థులు పక్కకు వెళ్లిపోవటంతో వచ్చిన అతిథులు ప్రసంగించకుండానే వెనుతిరిగారు. ప్రాంగణంలో ఎటువంటి టెంట్ వేయకపోవటం, ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో విద్యార్థులు తీవ్ర అసహనానికి గురయ్యారు. కనీసం మంచినీరు సైతం తొలుత అందుబాటలో ఉంచలేదు. గంటన్నర తరువాత తాగునీటిని పంపిణీ చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
వీఎంసీ మొబైల్ కోర్టులో కేసుల విచారణ
పటమట(విజయవాడతూర్పు): రోడ్లపై రాకపోకలకు అవరోధం కలిగేలా జంతువులను వదిలినా, డ్రైయిన్లలో మురుగునీటి పారుదలకు అడ్డంకి ఏర్పడేలా చెత్త, వ్యర్థాలు వేసినా వీఎంసీ మొబైల్ కోర్డుకు హాజరు కావాల్సిందేనని వీఎంసీ మొబైల్ కోర్టు, 8వ మెట్రోపాలిటిన్ అదనపు జ్యుడీషియల్ న్యాయమూర్తి గోలి లెనిన్బాబు హచ్చరించారు. వీఎంసీ ప్రజారోగ్య విభాగం శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన కేసులను ఆయన శుక్రవారం విచారించారు. పటమటలోని సర్కిల్–3 కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన ఈ విచారణలో ఆయన మొత్తం 8 కేసులను విచారించి వారికి రూ.8350 జరిమానా విధించారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్–3 డాక్టర్ గోపాల్ నాయక్, శానిటరీ సూపర్వైజర్స్ బాలాజీ శ్రీనివాస మూర్తి, సర్కిల్ –3 పరిఽధిలోని ఆయా డివిజన్ల శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. 11న యోగాసన పోటీలకు జట్ల ఎంపిక మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల యోగాసన (పురుషులు – మహిళలు) చాంపియన్షిప్–2025లో పాల్గొనే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యోగాసన (పురుషులు – మహిళలు) జట్ల ఎంపిక ఈ నెల 11న తమ యూనివర్శిటీ ఆవరణలో జరుగుతాయని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఈ.త్రిమూర్తి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 2025–2026 సంవత్సరానికి నిర్వహించే ఈ పోటీల్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కు అనుబంధంగా ఉన్న అన్ని మెడికల్, డెంటల్, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, బిఎన్వైఎస్, ఫిజియోథెరపీ, బీఎస్సీ (నర్సింగ్), బీఎస్సీ, (ఎంఎల్టి) కాలేజీల నుంచి పాల్గొనేవారు 11వ తేదీ మంగళవారం ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని తమ యూనివర్సిటీ ఆవరణలో జరిగే ఎంపికలకు హాజరు కావాల్సిందిగా కోరారు. -
విజయ డెయిరీ మాజీ చైర్మన్ జానకి రామయ్య కన్నుమూత
గన్నవరంరూరల్: విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకి రామయ్య(94) గురువారం ఉదయం చిన అవుటపల్లిలోని రుషివాటికలో ఉన్న స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, మండలి బుద్ధ ప్రసాద్, వర్లకుమార్ రాజా, బోడే ప్రసాద్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు, విజయడెయిరి ఛైర్మన్ చలసాని ఆంజనేయులు సందర్శించి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ సుదీర్ఘ కాలం విజయడెయిరి ఛైర్మన్గా పని చేసి సంస్థను అభివృద్ధి బాటలో నడిపించారని కొనియాడారు. పాల రైతులకు అనుకూలంగా నిర్ణయాలు, సంస్కరణలు రూపొందించి పాడి రైతుల సంక్షేమానికి బాటలు వేశారని ప్రశంసించారు. ఆయన కుమారుడు వెంకటరత్నం అంత్యక్రియలు దావాజీగూడెం శ్మశాన వాటికలో నిర్వహించారు. -
రోలర్ స్కేటింగ్లో నలంద విద్యార్థుల సత్తా
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకూ విశాఖపట్నంలో జరిగిన 37వ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్–2025 పోటీల్లో నలంద విద్యానికేతన్ విద్యార్థులు సత్తా చాటినట్లు ప్రిన్సిపాల్ మాదల పద్మజ తెలిపారు. తమ విద్యార్థులు 22 స్వర్ణ, 18 రజిత పతకాలు సాధించారని ఆమె తెలిపారు. సబ్ జూనియర్స్ బాలుర విభాగంలో వేమూరి కోవిద్ కృష్ణ, వాటిపల్లి వివేక్వర్మ, మట్లి యోక్షిత్రెడ్డి, సుర వెంకట గిరిథర్, కార్యంపూడి తేజేష్, ఆత్మకూరి హృదయ్ సిద్విక్, వంజరపు మోహన్ శ్రీమాన్ రిషి, సుంకర యాషన్ శరణ్, చిగురుపాటి శ్రీనాథ్, మద్దినేని గోపాల్ కౌషిక్, వేమూరి కిరణ్కుమార్, బంగారు పతకాలు సాధించినట్లు తెలిపారు. జూనియర్స్ బోయ్స్ విభాగంలో వెశ్చ జ్యోతి ప్రకాష్, అల్లూరి వెంకట జీతేష్, యర్రంశెట్టి చరిత్ శ్రీ వెంకట్, మిద్దె అరణ్యేష్, కోసూరు బాంధవ్ వెంకట శివసాయి. చింతల చేతన్ సాయిరెడ్డి, కార్యంపూడి డోలకార్తీక్, మేదరమెట్ల అఖిత్చౌదరి, కామినేని శ్రీకార్తీక్, కొరిసపాటి శివ శరణ్రెడ్డి, కోడె శశికర్ రజిత పతకాలు సాధించినట్లు తెలిపారు. 22 బంగారు, 18 రజిత పతకాల సాధన -
ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధంకండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్–ఎస్ఐఆర్) ప్రక్రియపై పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకొని సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. గురువారం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వివేక్ యాదవ్ వెలగపూడి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని కీలక సెక్షన్లు, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రాధాన్యత, గత ఎస్ఐఆర్ (2002), సమగ్ర సవరణ ప్రక్రియలో భాగస్వామ్య పక్షాలు, బూత్ లెవెల్ అధికారి (బీఎల్వో), బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ), ఈఆర్వోలు, ఏఈఆర్వోలు తదితరుల పాత్ర, ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్), ఇంటింటి సందర్శన, పరిశీలన తదితర అంశాలతో పాటు రాజకీయ పార్టీల భాగస్వామ్యం గురించి వివరించారు. వీసీ అనంతరం లక్ష్మీశ కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులతో మాట్లాడుతూ సన్నద్ధతలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియలోని ముఖ్య దశలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ అవగాహన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. వివిధ ఫారాల పరిష్కారం, ఎపిక్ కార్డుల జారీ తదితరాలపైనా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ పి.సలీమ్, డిప్యూటీ తహసీల్దార్ ఎ.గోపాలర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రెండో రోజూ తనిఖీలు
ఇబ్రహీంపట్నం: స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు రెండో రోజు గురువారం కూడా కొనసాగాయి. బుధవారం అర్థరాత్రి 12 గంటల వరకు రికార్డులు తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు గురువారం ఉదయం మరోసారి సబ్ రిజిస్టార్ కార్యాలయానికి చేరుకున్నారు. రెండోరోజు రిజిస్టార్ కార్యాలయం అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న పలువురు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లను ఏసీబీ అధికారి బీవీ సుబ్బారావు గుర్తించారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్యాలయం కార్యకలాపాలు, నగదు లావాదేవీలు అన్నీ వారి కనుసన్నలలోనే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి అనధికారికంగా డాక్యుమెంట్ రైటర్లకు రూ.లక్షల్లో ఫోన్ పే చెల్లింపులు జరిగినట్లు గమనించారు. పలు రికార్డులు పరిశీలించి అనుమానాస్పద రికార్డులు, పలు డాక్యుమెంట్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇన్చార్జ్ సబ్ రిజిస్టార్ ఎస్కే మహ్మద్తో పాటు ఇతర సిబ్బందిని కూడా విచారించారు. పూర్తి విచారణ జరిగిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని డీఎస్పీ సుబ్బారావు మీడియాకు వెల్లడించారు. పలువురు డాక్యుమెంట్ రైటర్లను విచారించిన ఏసీబీ పూర్తి తనిఖీల అనంతరం నివేదిక ప్రభుత్వానికి అందిస్తామన్న అధికారులు -
మునేరు ముంచేస్తోంది!
పెనుగంచిప్రోలు: వస్తే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి. ఈ రెండిటి మధ్య అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పండించే పంటకు అనుకూలంగా నిరంతర విద్యుత్ సౌకర్యం ఉంది. పక్కనే మునేరు ఉంది. అయినా ప్రకృతి పగ పట్టినట్లు రైతన్నపై కన్నెర్ర జేస్తోంది. నోటికాడికి వచ్చిన పంట ఏటా మునేరు వరదలకు నీటిపాలవుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో మునేరు పరివాహక ప్రాంతాలైన వత్సవాయి మండలం ఆల్లూరుపాడు, వేమవరం, పెనుగంచిప్రోలు మండలంలోని పెనుగంచిప్రోలు, ముచ్చింతాల, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, కె.పొన్నవరం తదితర గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాలు మాగాణి పొలాలు ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో మునేరుకు గతంలో ఎన్నడూ లేని విధంగా 3 లక్షలు క్యూసెక్కులు వరద నీరు వచ్చింది., ఈఏడాది కూడా సుమారుగా 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. రెండేళ్లుగా వరదలకు పంట పొలాలు ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతకు మందు కూడా మునేరుకు ప్రతి ఏడాది పంట చేతికొచ్చే సమయంలో వరదలు వచ్చి పంట మొత్తం వరద నీట మునిగి నష్ట పోతున్నామని రైతులు అంటున్నారు. దిక్చుతోచని స్థితిలో రైతులు... మునేరు వరద ముంచెత్తటంతో పంట మొత్తం నేలవాలింది. నీటిలో నాని మొలకలు వస్తున్నాయి. దీంతో చేసేది లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏటా రూ.వేలాది రూపాయిలు ఖర్చు పెట్టి పంటలు పండిస్తే ప్రకృతి విలయ తాండవం చేస్తుంటే చేతికొచ్చిన పంటటు నేలపాలవుతున్నాయని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యం, మొలకలు వచ్చిన ధాన్యం గురించి పట్టించుకునే నాధుడు కరువయ్యారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఏటా నీట మునుగుతున్న పరీవాహక పంట పొలాలు చేతికొచ్చిన పంట వరద పాలు తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలు -
వైఎస్సార్సీపీ నేత గౌతమ్రెడ్డిపై హత్యాయత్నం
సత్యనారాయణపురం (విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డిపై హత్యాయత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని ఆయన కార్యాలయం సెల్లార్లో నిలిపి ఉంచిన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం బయటపడింది. రోజూ గౌతమ్రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయం గమనించి ఈ దుశ్చర్యకు పాల్పడడం గమనార్హం. వివరాలు... గత నెల 12న ఉదయం 10.50 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి ఒకరు గౌతమ్రెడ్డి కార్యాలయ సెల్లార్లోకి వెళ్లాడు. అక్కడ కాసేపు అటుఇటు తిరిగాడు. అనంతరం వెంట తెచ్చుకున్న బ్యాగ్ నుంచి సీసా తీసి కారుపై పెట్రోల్ పోసి అగ్గిపెట్టెతో నిప్పంటించి పరారయ్యాడు. దీంతో కారు కాలిపోయింది. తాను రోజూ పనుల విషయమై బయటకు వెళ్లే సమయంలోనే ఇలా జరగడంతో ఇది హత్యాయత్నమేనని, ఆ సమయంలో లేకపోవడంతో కారు దగ్ధం చేసినట్లు గౌతమ్రెడ్డి ఆరోపిస్తున్నారు. మొత్తం ఉదంతంతో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపించానని చెప్పారు. కానీ, పోలీసులు ఇంతవరకు ఘటన గురించి విచారణ జరపకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రెండోసారి... కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తనపై రెండోసారి హత్యాయత్నం జరిగిందని గౌతమ్రెడ్డి తెలిపారు. గతంలోనూ గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, దీనిని పోలీసులు పట్టించుకోకపోవడం వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పెద్దలను మెప్పించేలా పోలీసులు నడుచుకుంటున్నారని, రాజ్యాంగం కల్పించిన కనీస హక్కులను కూడా విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, గత నెలలోనే గౌతమ్రెడ్డి ఫిర్యాదు చేసినా, దాన్ని చూడలేదని సీఐ లక్ష్మీనారాయణ చెప్పడం గమనార్హం. మరోవైపు హత్యాయత్నం ఉదంతం గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు హడావుడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గౌతంరెడ్డి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీపీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. పెట్రోల్ పోసి కారును దగ్ధం చేసిన గుర్తుతెలియని నిందితుడు రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలోనే ఈ ఘటన! ప్రాణహాని ఉందని గౌతమ్రెడ్డి ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హడావుడిగా ఎఫ్ఐఆర్ -
విద్యుత్ లో ఓల్టేజ్ సమస్య పరిష్కరించాలి
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ లో ఓల్టేజ్ సమస్య సమస్య పరిష్కరించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గురువారం విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ వద్ద గల ఏపీసీపీడీసిఎల్ సర్కిల్ కార్యాలయంలో అన్ని జిల్లాలో ఎస్ఈలు, ఈఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఎం సూర్య ఘర్ పథకం, మోంథా తుపాను నష్టాలు, రెవెన్యూ కలెక్షన్స్, ఆర్డీఎస్ఎస్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ కలెక్షన్స్, నూరు శాతం సాధించాలన్నారు. అలాగే ఎక్కడా లో ఓల్టేజ్ సమస్య లేకుండా చూడాలన్నారు. పీఎం సూర్య ఘర్ డ్రైవ్పై అధికారులకు ఆదేశాలిచ్చారు. సమీక్ష సమావేశంలో టెక్నికల్, ప్రాజెక్టు, ఫైనాన్స్ డైరెక్టర్లు మురళీ కృష్ణయాదవ్, వెంకటేశ్వర్లు, సీజీఎంలు పాల్గొన్నారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి -
ఏటా ఇదే పరిస్థితి
మునేరు ప్రాంతాన ఉన్న పొలాలకు ప్రతి ఏడాది అధిక వర్షాలు కురిసినప్పుడల్లా మునేరుకు వరద రావటం, పొలాలను ముంచెత్తటం జరుగుతోంది. పంట కోల్పోవటంతో ఏటా నష్టాలు తప్పటం లేదు. ప్రభుత్వం పంట నష్టం అందరికీ సక్రమంగా అందించి ఆదుకోవాలి. – మందడపు బ్రహ్మం, రైతు, పెనుగంచిప్రోలు వారం రోజుల్లో పంట ఇంటికొస్తుందనగా తుపాను వచ్చింది. దాని ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు మునేరుకు వరద రావటం, పంటలు మునిగిపోవటం జరిగిపోయింది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి అయింది. ఏటా వరదల నుంచి పంటలు ఎలా కాపాడుకోవాలో తెలియటం లేదు. – మురళి, రైతు, అనిగండ్లపాడు ● -
జనగణనతో సమగ్ర కులగణన నిర్వహించాలి
ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే జనగణనతో పాటు సమగ్ర కుల గణనను శాసీ్త్రయంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనగణనతో పాటు కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 9వ తేదీన నగంరలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో బీసీల సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. ఎన్నికల వాగ్దానాలైన చట్టసభల్లో 33 శాతం, స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే ముందుగా కులగణన అవసరమన్నారు. బీసీ రిజర్వేషన్లలో సమన్యాయం కోసం వర్గీకరణ (ఏ,బీ,సీ,డీ) చేయాలని, పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణలు చేయించి బీసీ రిజర్వేషన్లను షెడ్యూల్–9లో చేర్చాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల గడువు 2026 మార్చితో ముగుస్తున్నందున కుల గణన ప్రక్రియను వేగవంతం చేసి చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఓబీసీ సబ్ ప్లాన్ రూపొందించి బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.వి.వి.ఎస్. ఎన్.మూర్తి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సోము మహేశ్వరరావు, మేకా వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు చప్పిడి చందు పాల్గొన్నారు. -
పేదల ఇళ్లంటే చులకనా..?
మోంథా తుపాను తీరం దాటి పది రోజులవుతున్నా ఇంకా పేదల ఇళ్లకు ముంపు బెడద పోలేదు. మోకాలి లోతు వరద నీటిలో నానా అవస్థలు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఒక్క పూట అన్న క్యాంటీన్ భోజనం పెట్టి మమ అనిపించింది. ఆ తరువాత పాలకులు కాని, అధికారులు కాని అటువైపు కన్నెత్తిచూసిన పాపాన పోలేదు. ఎవరో వస్తారని...ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయి...చివరకు స్థానికులే తలా కొంత వేసుకుని మోటార్లు పెట్టి నీళ్లు తోడించుకుంటున్నారు. నందిగామరూరల్: నందిగామ పట్టణంలోని 18వ వార్డు శివారు ఉమా కాలనీలో సుమారు 15 కుటుంబాలకు చెందిన దాదాపు 70 మంది కొన్ని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. వారి గృహాలు లోతట్టు ప్రాంతంలో ఉండటంతో మోంథా తుపాను ధాటికి వరద నీరు ముంచెత్తింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కాలనీ వాసులు వరద ముంపులోనే కాలం వెళ్ల దీస్తున్నారు. వర్షపు నీటితో పాటు చుట్టుపక్కల పంట పొలాల్లోని నీరు, దూళ్ల వాగు పొంగి పొర్లటంతో వరద నీరు మొత్తం కలసి కాలనీలోని ఇళ్ల మధ్యకు చేరి దాదాపు ఐదారడుగుల మేర నిలిచి ఉండటంతో కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. తమ దీన పరిస్థితిని మున్సిపల్ అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించటం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి వరద నీటిలోనే... మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు తోడు దూళ్ల వాగు పొంగి పొర్లటంతో పక్కనే ఉన్న కాలనీని వరద నీరు ముంచెత్తింది. తుపాను తీరం దాటే రోజు అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు వచ్చి అన్న క్యాంటీన్లో నుంచి తీసుకొచ్చిన అన్నం పెట్టి మమ అనిపించారు తప్ప తమను పట్టించుకున్న పాపాన పాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాగునీటి కుళాయిలు కూడా వరద నీటిలోనే ఉండటంతో దాహార్తిని తీర్చుకునేందుకు సైతం అలమటించామని వాపోయారు. తమను ఆదుకోకపోయినా పర్వాలేదు కనీసం వరద నీటినైనా బయటకు పంపే చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడినా కన్నెత్తి కూడా చూడలేదని మండిపడుతున్నారు. రోడ్డు కూడా కనిపించనంతగా వరద నీరు చేరటంతో బయటకు రాలేని పరిస్థితి నెలకొందని కన్నీటి పర్యంతమవుతున్నారు. తురకపాలెం ఘటనను గుర్తు చేస్తున్న స్థానికులు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికే అధికారులు తామిక్కడ రోజుల తరబడి వరద నీటిలో ఉన్నా తమను పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు నిల్వ ఉండటంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని రోగాల బారిన పడాల్సివస్తుందేమోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరద నీరు, దోమల బెడదతో ఇటీవల గుంటూరు జిల్లా తురకపాలెంలో జరగిన ఘటనే తమకు గుర్తుకు వస్తోందని హడలిపోతున్నారు. ఏడాది లోపు చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు జీవనం సాగిస్తున్నామని పరిస్థితి చేయి దాటితే బాధ్యత వహించేదెవరని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలే ఆదుకున్నాయి.. తమ పరిస్థితిని చూసి స్వచ్ఛంద సంస్థలు స్పందించి బియ్యం, సరుకులు అందించి తమ వంతుగా అండగా నిలిచాయి తప్ప అధికారులు కానీ, ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోలేదని కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వరద నీటిని బయటకు పంపటంతో పాటు అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.మోంథా తుపాను నాటి నుంచి నేటి వరకు తొమ్మిది రోజుల పాటు వరద నీటిలోనే అవస్థలు పడుతున్నాం. మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు. అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైంది. ఒక్కపూట అన్నం పెట్టారు ఆ తరువాత తిన్నామా?.. ఉన్నామా?.. అని కూడా ఎవరూ కన్నెత్తి చూడలేదు. స్థానికులంతా చందాలు వేసుకుని రోజుకు రూ. రెండు వేలు వెచ్చింది ఆయిల్ ఇంజిన్ పెట్టి నీటిని తోడుకుంటున్నాం. ఇప్పటికై నా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పంధించి ఆదుకోవాలి. –బత్తుల వెంకటేశర్లు, స్థానికుడు ఇళ్ల మధ్యకు ఐదారడుగుల మేర వరద నీరు చేరింది. రోజుల తరబడి వరద నీటిలోనే కాలం వెళ్లదీస్తున్నాము, నీటి నిల్వ కారణంగా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. విష పురుగులు సంచరిస్తున్నాయి. చంటి పిల్లలు, వృద్దులున్నారు. దోమల బెడదతో రోగాల బారిన పడాల్సి వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నీటిని బయటకు పంపటంతో పాటు రోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. –పవన్, నివాసితుడు -
ముగిసిన యోగ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలు
గన్నవరం: స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి యోగ అండర్–14, అండర్–17 బాల, బాలికల ఎంపికలు గురువారం ముగిశాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బాల, బాలికలు ఈ ఎంపికలలో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన బాల, బాలికలను జిల్లా జట్లకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి జి. రాంబాబు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 24, 25 తేదీల్లో బాపట్లలో జరిగే రాష్ట్ర స్థాయి యోగ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గ క్రీడా సమన్వయకర్త డి.నాగరాజు, సెలక్షన్ కమిటీకి చెందిన పూర్ణచంద్రరావు, శిరీష, మల్లేశ్వరరావు, సుశీల తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి మైలవరం: పరీక్షల నిర్వహణ సమయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎన్టీఆర్ జిల్లా విద్యా శాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. మైలవరం మండల పరిధిలో ప్రతిపాదిత ఎస్ఎస్సీ–2026 పరీక్ష కేంద్రాలను జిల్లా ఏపీవోఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎస్.రాంబాబుతో కలిసి గురువారం ఆయన సందర్శించారు. ప్రతి పాఠశాలలోని సదుపాయాలు, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు తాగునీరు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, సీటింగ్ ఏర్పాట్లు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతం, పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యటనలో మైలవరం మండల విద్యాశాఖాధికారి ఎల్.బాలు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇతర విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. బహుముఖ ప్రతిభాశాలి సింగంపల్లి విజయవాడ కల్చరల్: బహుముఖ ప్రతిభాశాలి సింగంపల్లి అశోక్కుమార్ అని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెను గొండ లక్ష్మీనారాయణ అన్నారు. ఆలోచన సాహిత్యవేదిక ఆధ్వర్యంలో గవర్నర్పేట విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలోని కొల్లూరి స్మారక వేదికపై గురువారం రచయిత అశోక్కుమార్ సాహిత్యజీవితంపై పలువురు రచించిన వ్యాస సంకలనం అశోక చక్రం గ్రంథం ఆవిష్కరణ సభను నిర్వహించారు. ప్రజాసాహితి సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ అశోక్ సాహిత్యజీవితం తెరచిన పుస్తకమన్నారు. డాక్టర్ జ్వలిత గ్రంథాన్ని ఆవిష్కరించారు. జనసాహితి సాహిత్యవేదిక పక్షాన దివికుమార్, విప్లవ రచయితల సంఘం పక్షాన అరసవిల్లి కృష్ణ, సాహితీ స్రవంతి ప్రతినిధి సత్యాజీ తదితరులు అశోక్కుమార్ సాహిత్యజీవిత విశేషాలను వివరించారు. మోంథా బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మోంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోంథా తుపాను కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం పంట నష్టం తక్కువేనని చెప్పడం బాధాకరమన్నారు. వర్షానికి తడిసిపోయిన పత్తికి మద్దతు ధర కల్పించి రైతుల వద్ద ఉన్న పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న అఖిల భారత కిసాన్ మోర్చా, ఇతర వామపక్ష పార్టీలతో కలిసి అన్ని జిల్లా కేంద్రాలలో నిరసనలు, ర్యాలీలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దువ్వనపల్లి సురేందర్ రెడ్డి, ఎ.రామ్మోహన్ రావు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు, బి.సత్య నాయుడు, జి.రామ్ రెడ్డి, కోటా మధుసూదన్ రావు, పోతిన సంపత్ కుమార్ పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 46,280 క్యూసెక్కులు వచ్చి చేరు తోంది. దిగువకు 32,780 క్యూసెక్కులు వదులుతున్నారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీగా ఎస్కే షిరీన్ బేగం గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ –14, 17 బాలుర, బాలికల విభాగాలలో సాఫ్ట్ బాల్, బేస్బాల్ ఉమ్మడి కృష్ణాజిల్లా జట్ల ఎంపిక గురువారం గూడూరులో జరిగాయి. 7 -
మనసు మాయం.. యంత్రమయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నేటి పోటీ ప్రపంచంలో మనిషి యంత్రంలా మారిపోతున్నాడు. తాము పనిచేసే సంస్థ ఇచ్చిన, తాము ఎంచుకున్న టార్గెట్లను రీచ్ అయ్యేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉరుకుల పరుగుల జీవనానికి అలవాటు పడ్డాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చేదాకా సెల్ఫోన్లలో మాట్లాడటానికే కాలం సరిపోతోంది. నలుగురిలో కలిసి చెప్పుకునే ముచ్చట్లు లేవు, కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి, ఒకేచోట కూర్చుని భోజనం చేసే పరిస్థితులు అంతకంటే లేవు. రోజు రోజుకు మానసిక పరిస్థితి దిగజారిపోవడమే కాక, ఉత్పాదక శక్తి తగ్గిపోతోందని మానసిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరి కంటే కార్పొరేట్ ఉద్యోగులు తీవ్రమైన మానసిక వత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తమకు తెలియకుండానే డిప్రెషన్కు లోనవుతున్నారు. ఆ ఫలితంగా ఎక్కువ సేపు కార్యాలయంలోనే ఉన్నా ఉత్పాదక శక్తి తగ్గిపోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సంతృప్తి లేని జీవితాలు మనిషికి ఆశ, అత్యాశ పెరిగి, సంతృప్తి అనేది జీవితంలో లేకుండా పోయింది. చిన్న విపత్తు వచ్చినా అధిగమించలేక మానసికంగా కుంగిపోతున్నారు. ఆత్మనూన్యతా భావానికి లోనవుతున్నారు. భార్యభర్తలు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నా చెరొక గదిలో కూర్చుని ఫోన్లు, ల్యాప్టాప్లతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో దాంపత్య జీవితంపై పెను ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు. మొండి వైఖరి ఇగో ప్రాబ్లమ్స్ వంటివి భార్య భర్తల మధ్య గ్యాప్ను పెంచుతున్నట్లు చెపుతున్నారు. చిన్న విపత్తును సైతం ఎదుర్కోలేక... ఇలా వ్యక్తిగత విపత్తులు, ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారికి బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెపుతున్నారు. శారీరక అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారే కానీ, మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోక పోవడంతో పరిస్థితులు విషమిస్తున్నాయి. యంత్రంలా మారిపోతున్న మనిషి ప్రస్తుతం రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. మానసిక వత్తిళ్లకు గురవుతున్న వారిలో ఈ సమస్యలు మరింత అధికమయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన వత్తిళ్లు ఎదుర్కొనే వారిలో రక్తపోటు, మధుమేహం అదుపులో ఉండదు. అంతేకాకుండా నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ ఫలితంగా గుండెపోటు, మెదడుపోటుకు దారితీయవచ్చు. విపత్తులు ఎన్ని ఎదురైనా మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. –డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, మానసిక వైద్య నిపుణులు ప్రతి ఒక్కరూ సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. పకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆస్తులు కోల్పోవడం, సంబంధీకులను కోల్పోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో మానసిక దృఢత్వం అవసరం. ప్రభుత్వాలు సైతం మద్దతుగా నిలవాలి. శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలి. ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ కొంత సమయం గడపడం ద్వారా వత్తిడిల నుంచి ఉపశమనం పొందవచ్చు. యోగా, మెడిటేషన్, వ్యాయామంపై దృష్టి పెట్టాలి. –డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్ -
పోలీసుల అదుపులో ఎన్ఆర్ఐ సోషల్ మీడియా యాక్టివిస్టు
పెనమలూరు: కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా పోలీసుల తీరు మారటం లేదు. యూకేకు చెందిన ఎన్ఆర్ఐ మాలపాటి భాస్కర్రెడ్డి వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా ఉన్నారు. ఆయన తన తండ్రి మరణించటంతో అంత్యక్రియల కోసం కొద్ది రోజుల క్రితం మండలంలోని చోడవరం గ్రామానికి వచ్చారు. భాస్కర్రెడ్డి రాకను గమనించిన టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. భాస్కర్రెడ్డి గురువారం మెడికల్ చెకప్ కోసం కామినేని ఆస్పత్రికి వెళ్లగా పెనమలూరు పోలీసులు ఆస్పత్రికి వచ్చి భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో స్టేషన్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి, పార్టీ నేతలు భాస్కరరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పెనమలూరు పోలీస్స్టేషన్కు వచ్చారు. పోలీసుల వీరంగం... పెనమలూరు పోలీస్స్టేషన్కు వచ్చిన భాస్కర్రెడ్డి సోదరుడు ఓబుల్రెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు వీరంగం వేశారు. ఓబుల్రెడ్డి తన సోదరుడు భాస్కర్రెడ్డి ఆచూకీ చెప్పాలని పోలీసులను కోరారు. తన తండ్రి పెదకర్మ ఉందని, ఈ సమయంలో తన సోదరుడిని కనిపించకుండా చేయటం న్యాయం కాదని పోలీసులను ప్రాథేయపడ్డారు. అయితే పోలీసులు ఆయన మొర ఆలకించకపోగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాస్కర్రెడ్డిపై కేసు నమోదు చేస్తే ఎఫ్ఐఆర్ ఇవ్వాలని, బెయిల్ తీసుకుంటానని ఓబుల్రెడ్డి కోరినా పోలీసులు ఏ మాత్రం కనికరం చూపకుండా పోలీస్స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోమని హెచ్చరించారు. పోలీసుల తీరుపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి తీవ్ర అభ్యంతరం తెలిపారు. భాస్కర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నప్పుడు, ఎక్కడ ఉన్నాడో కుటుంబ సభ్యులకు తెలపాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.ఈ సందర్భంగా సీఐ వెంకటరమణ, చక్రవర్తి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీస్స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు మోహరించి పార్టీ నేతలను పోలీస్స్టేషన్ బయటే ఉండాలని ఆజ్ఞాపించారు. చట్టాన్ని అత్రికమించిన పోలీసులు పోలీసులు చట్టాన్ని అతిక్రమించి వ్యక్తి హక్కులను కాలరాశారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు అందితే భాస్కర్రెడ్డిపై విచారించాలన్నారు. అయితే పోలీసులు భాస్కరరెడ్డిని రహస్య ప్రాంతంలో దాచి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు చూపించకుండా వారిని ఆందోళనకు గురి చేశారని విమర్శించారు. తండ్రి పెదకర్మ కార్యక్రమం చేయనీయకుండా భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకోని వేఽధించడం దారుణమని ఖండించారు. తప్పుడు ఫిర్యాదులు చేయించటానికి పోలీసులు టీడీపీ నేతలతో చేతులు కలిపారని ఆరోపించారు. సీఐ వెంకటరమణ వివరణ కోసం యత్నించగా ఆయన ఫోన్లో స్పందించలేదు. రాత్రి వరకు భాస్కర్రెడ్డి ఆచూకీ గాని, ఎఫ్ఐఆర్ వివరాలు కాని కుటుంబ సభ్యులను పోలీసులు తెలుపలేదు. -
జనవరిలో ఎ.కొండూరుకు కృష్ణా జలాలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తిరువూరు: వచ్చే ఏడాది జనవరిలో ఎ.కొండూరు మండలానికి కృష్ణానదీ జలాలు సరఫరా చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఎ.కొండూరు మండలంలో గురువారం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవల పరిశీలనకు కలెక్టర్ విచ్చేశారు. కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, రోగులకు మందులు, పౌష్టికాహారం సరఫరాకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు. నెఫ్రాలజిస్టు వైద్య సేవలను విస్తృతం చేస్తామని, రోగులు వైద్యుల సూచనలు పాటిస్తే కిడ్నీ సమస్యల బారి నుంచి విముక్తులవుతారని కలెక్టర్ సూచించారు. తొలుత వైద్యాధికారులతో కలసి ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన కృష్ణారావుపాలెంలో ఓవర్ హెడ్ ట్యాంకు పైకెక్కి నీటి నాణ్యతను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సేవలు పొందుతున్న కిడ్నీ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఎ.కొండూరు మండలంలో 15 తండాలలో 267 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు వైద్యశాఖ సర్వేలో వెల్లడైందని, వీరిలో 26 మంది డయాలసిస్ రోగులుండగా, 241 మందికి సీకేడీ ఉన్నట్లు గుర్తించారన్నారు. ఇప్పటివరకు 41 మంది వైద్యసేవలతో కిడ్నీ వ్యాధి నుంచి విముక్తులయ్యారని కలెక్టర్ తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో ముగ్గురు కిడ్నీ బాధితులు మృతిచెందారని, జలజీవన్ మిషన్ పనులు త్వరితగతిన పూర్తి చేసి శుద్ధి చేసిన నీరందిస్తామన్నారు. జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ఎం.సుహాసిని, తిరువూరు ఆర్డీవో మాధురి, ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండింగ్ ఇంజినీర్ విద్యాసాగర్, ఎ.కొండూరు తహసీల్దారు లక్ష్మి కలెక్టర్ వెంట ఉన్నారు. -
సొంత ఖర్చుతో నీటిని తోడుతున్న కాలనీ వాసులు..
అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవటంతో చేసేది లేక తామే సొంతంగా ఆయిల్ ఇంజిన్ పెట్టుకుని వరద నీటిని తోడుతున్నామని నివాసితులు చెబుతున్నారు. తామంతా రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాల వారమని, అయినా రోజుల తరబడి వరద నీటిలో ఉండలేక తలా కొంత వేసుకుని ఆయిల్ ఇంజిన్ ఏర్పాటు చేసుకుని రెండు రోజులుగా వరద నీటిని బయటకు పంపుతున్నామని చెబుతున్నారు. ఆయిల్ ఇంజిన్ అద్దె, డీజిల్ కలిపి రోజుకు రూ.రెండు వేలు ఖర్చవుతోందని తెలిపారు. ఇళ్ల మధ్యకు చేరిన వరద నీటిని పూర్తిగా బయటకు పంపాలంటే మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని ఏం చేయాలో అర్ధం కావడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాండురంగడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
మచిలీపట్నంటౌన్: కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు సముద్ర స్నానాలు ఆచరించి నగరంలోని చిలకలపూడిలో వేంచేసి ఉన్న పాండురంగస్వామిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాగింది. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. తొలుత ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్ద భక్తులు పూజలు నిర్వహించి దీపారాధనలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల బొమ్మల, పాండురంగస్వామి వారి చిత్రపటాల దుకాణాలను ఏర్పాటు చేశారు. ఉదయం ఆలయ నిర్వాహకుడు టేకి నరసింహం పర్యవేక్షణలో స్వామి వారి పల్లకి ఉత్సవం, గోపాల కాల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
జిల్లా స్థాయి యోగాసన ఎంపికలు
గన్నవరం: స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, 17 విభాగాల్లో జిల్లా స్థాయి యోగాసన ఎంపికలు నిర్వహించారు. ఈ సెలక్షన్స్కు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బాల, బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడా ప్రాధికార సంస్థ యోగ శిక్షకురాలు శిరీష పర్యవేక్షణలో ఎంపికలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన బాల, బాలికలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి జి.రాంబాబు తెలిపారు. నియోజకవర్గ క్రీడా సమన్వయకర్త డి. నాగరాజు, యోగ శిక్షకులు కె. భూషణం, పలువురు వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
22 నుంచి ఇంటర్నేషనల్ చెస్ టోర్నీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఈ నెల 22నుంచి 24వ తేదీ వరకు ఈకార్న్ ఇంటర్నేషనల్ ఫిడో రేటింగ్ చెస్ టోర్నమెంట్–2025ను నిర్వహిస్తున్నామని ఆంధ్రా చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణి కుమార్ చెప్పారు. టోర్నమెంట్కు సంబంధించిన పోస్టర్ను మేరీస్ స్టెల్లా కళాశాల ఆవరణలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఫణి కుమార్ మాట్లాడుతూ ఆల్ ఇండి యా చెస్ ఫెడరేషన్, ఆంధ్రా చెస్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని, ఈ టోర్నమెంట్లో మన రాష్ట్రం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి చెస్ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఈ పోటీల్లో విజేతలకు రూ.8లక్షల విలువైన బహుమతులను అందజేయనున్నామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ జి.ఇన్యాసమ్మ, కళాశాల కోచ్ వి.రాజ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అక్బర్ బాషా, ఈకార్న్ సంస్థ ప్రతినిధి ఎం.సిగ్థ పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ఇబ్రహీంపట్నం: అవినీతి ఆరోపణలపై ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలమంలో ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారి బీవీ సుబ్బారావు పర్యవేక్షణలో 11.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సోదాలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని చెప్పారు. లోపల వారిని బయటకు రాకుండా బయటవారిని లోపలకు అనుమతించకుండా చూశారు. తనిఖీల్లో పలు రికార్డులు పరిశీలించారు. ఇన్చార్జ్ సబ్ రిజిస్టార్ ఎస్కే మహ్మద్తో పాటు ఇతర సిబ్బందిని విచారించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లుతో కుమ్మకై ్క అవినీతికి పాల్బడుతున్నారనే విషయాన్ని గుర్తించారు. దీంతో పాటు ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని గ్రామాల్లో భూముల విలువలు పెరగడంతో నిషేధిత భూములకు సైతం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే విషయంపై ఆరాతీశారు. ప్రభుత్వ భూములకు సైతం సర్వే నంబర్లు మార్పుచేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేపడుతున్నట్లు గుర్తించారు. ఏసీబీ అధికారి బీవీ సుబ్బారావు మాట్లాడుతూ తనిఖీల్లో లోటుపాట్లు గుర్తిస్తే వెల్లడిస్తామని తెలిపారు. డాక్యుమెంటేషన్కు నగదు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు అవినీతికి పాల్బడితే 1064 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. తనిఖీల్లో ఇన్స్పెక్టర్లు నాగరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 74 వేలు అదనంగా ఉన్నట్లు గుర్తింపు... స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రాత్రి 8 గంటలు అయినా తనిఖీలు కొనసాగిస్తున్నారు. తనిఖీల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లకు ఉండాల్సిన నగదు కంటే రూ.74 వేలు అదనంగా ఉన్నట్లు ఏసీడీ డీఎస్పీ బీవీ సుబ్బారావు గుర్తించినట్లు తెలిసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ డాక్యుమెంట్ రైటర్ను ప్రశ్నిస్తున్నారు. అక్రమ నగదు ఫోన్పే ద్వారా ఎక్కువగా చెల్లించినట్లు విచారణలో అధికారులు తేల్చారు. -
హైవే విస్తరణలో మార్పులు అవసరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ రహదారి–65ను విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఆరు వరుసలుగా విస్తరించే ప్రతిపాదనల్లో మార్పులు అవసరమని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లు జి. లక్ష్మీశ, డీకే బాలాజీ అన్నారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఇరు జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో ఎన్హెచ్–65 విస్తరణ ప్రతిపాదనలపై ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధులు, ఎన్హెచ్ఎఐ, మెట్రో రైల్ అధికారులతో సమావేశం జరిగింది. ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ మాట్లాడుతూ ఎన్హెచ్–65 విస్తరణకు సంబంధించి మెట్రో అధికారులతో కలిసి మూడు డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుత డిజైన్లో బెంజ్ సర్కిల్ నుంచి చినఓగిరాల వరకు ఉన్న ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించలేదని చెప్పారు. ప్రతిపాదించిన వెహికల్ అండర్ పాస్ (వీయూసీ)లు తక్కువగా ఉన్నాయని, వీటిని పెంచే అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. ● కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ కారిడార్ ఉత్తమమని పేర్కొన్నారు. విజయవాడ నగర శివారు ప్రాంతాల నుంచి ట్రాఫిక్ పెరుగుతోందని, పోర్టు ట్రాఫిక్ కూడా కలిస్తే మరింత రద్దీగా మారుతుందని, అందుకే ఎలివేటెడ్ కారిడార్పై దృష్టి సారించాలన్నారు. ఓఆర్ఆర్, మెట్రో ప్రాజెక్టులతో ఎన్హెచ్ 65 విస్తరణను ముడి పెట్టవద్దని సూచించారు. ● ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ ఎన్హెచ్–65ను, ఎన్హెచ్–16తో అనుసంధానించాలని, దీనికై మూడుచోట్ల రహదారులు నిర్మించాలని సూచించారు. సమావేశంలో ఇరు జిల్లాల జేసీలు ఎస్.ఇలక్కియ, ఎం.నవీన్, ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్డీఓ చైతన్య, ఎన్హెచ్ఏఐ పీడీ విద్యా సాగర్ పాల్గొన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లు లక్ష్మీశ, బాలాజీ -
జీవ ఎరువులతో భూమాతకు రక్ష
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రసాయన ఎరువుల స్థానంలో జీవ ఎరువులను (బయో ఫెర్టిలైజర్స్) ప్రోత్సహించాలని, వీటిని విరివిగా వాడేలా రైతుల్ని చైతన్య పరచాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి భూమాత రక్షణ కమిటీ (మదర్ ఎర్త్ ప్రొటెక్షన్ కమిటీ) సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం భూమాత రక్షణ కార్యక్రమాన్ని (మదర్ ఎర్త్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం) చేపట్టిందని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లా, సబ్ డివిజన్, గ్రామస్థాయిల్లో వివిధ శాఖల అధికారులతో భూమాత రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. 12వ తేదీ నాటికి కమిటీలను ఏర్పాటు చేసి గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల వారీగా, సొసైటీల వారీగా ఎరువుల వినియోగాన్ని పరిశీలించాలన్నారు. రైతులకు రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించాలని చెప్పారు. డ్రోన్లు వాడండి.. డ్రోన్లు ఉన్న గ్రామాలలో లిక్విడ్ యూరియా/నానో యూరియా వినియోగించాలని కలెక్టర్ చెప్పారు. ఎరువులు పక్కదారి పట్టకుండా ఈ కమిటీలు చర్యలు చేపట్టాలని, గతంలో కేసులు నమోదైన గ్రామాలు, సరిహద్దు గ్రామాలలో తప్పనిసరిగా కమిటీ సభ్యులు పర్యటించాలని ఆదేశించారు. జిల్లాస్థాయి భూమాత రక్షణ కమిటీ సభ్యులు జెడ్పీ సీఈవో కె.కన్నమ నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి, పోలీస్ అధికారి తిరుమలేశ్వర రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి త్రినాథ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రవి కిషోర్, ఏడీఏ అనిత, ఎరువుల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నూతన ఆర్జిత సేవా కౌంటర్ ఏర్పాటు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కనకదుర్గనగర్లో దేవస్థానం నూతన ఆర్జిత సేవా టికెట్, ప్రసాదాలు, లగేజీ కౌంటర్లను బుధవారం ప్రారంభించారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్లు ఆర్జిత సేవా కౌంటర్కు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లతో పాటు ప్రసాదాలు విక్రయించారు. ఇదే కౌంటర్లో అమ్మవారికి విరాళాలు సమర్పించే వీలు కల్పిస్తున్నట్లు అధకారులు పేర్కొన్నారు. నూతన ఆర్జిత సేవా కౌంటర్ నుంచి వృద్ధులు, వికలాంగుల కోసం బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేశామని చెప్పారు. తెల్లవారుజామున ఆలయం తెరిచినప్పటి నుంచి రాత్రి ఆలయం మూసే వరకు కౌంటర్ పని చేస్తుందని పేర్కొన్నారు. కౌంటర్లో రెండు షిఫ్టులలో సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు రాఘవరాజు, గూడపాటి సరోజినీదేవి, ఆలయ స్థానాచార్య శివప్రసాద్శర్మ, ఎఈవోలు చంద్రశేఖర్, ఎంఎస్ఎల్. శ్రీనివాస్, ఈఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దేవస్థానానికి నూతన అంబులెన్స్... శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మసీ కంపెనీ అంబులెన్స్ను అందించింది. అంబులెన్స్కు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ నూతన అంబులెన్స్ మహా మండపం దిగువన భక్తులకు అందుబాటులో ఉంటుందన్నారు. దేవస్థానానాకి విరాళంగా అంబులెన్స్ -
పుణ్యస్నానాలతో పులకించిన కృష్ణాతీరం
నాగాయలంక: కార్తిక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకునిఅత్యంత ప్రాశస్త్యం కలిగిన కృష్ణాతీరంలోని శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో ప్రజలు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. సముద్రపు బ్యాక్ వాటర్తో సాగర సంగమ విశిష్టత కలిగి ఉండటం, ఇక్కడ కృష్ణానది చెంతనే భారీ వాయుప్రతిష్ట శివలింగం భక్తులకు అందుబాటులో ఉన్నందున స్వీయ అభిషేకాలకు భక్త జనం బారులు తీరడంతో కోలాహలం నెలకొంది. నది ఒడ్డున ఉన్న మండపంలో రామలింగేశ్వరస్వామి శివలింగానికి భక్తులు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేశారు. నాగాయలంక, కోడూరు మండలాల నుంచి పలు గ్రామాల భక్తులు, అయ్యప్ప స్వాములు వచ్చి కార్తిక పుణ్య స్నానాలు చేసారు. స్నానాల తదుపరి భక్తులు నది ఒడ్డున ఘాట్లో ప్రమిదల్లో కార్తిక వత్తులు వెలిగించుకుని పెద్దల ఆశీర్వచనాలు పొందారు. గజ ఈతగాళ్ళ, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది భక్తులకు సేవలందించారు. క్షేత్రం చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, ఉప్పల బుజ్జి, తలశిల రఘుశేఖర్, కనిగంటి నారాయణ పర్యవేక్షించారు. ముందు జాగ్రత్త చర్యగా హెచ్చరిస్తూ స్థానిక ఎస్ఐ కె.రాజేష్ నది ఒడ్డున ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టించారు. దుర్గాఘాట్లో కార్తిక పౌర్ణమి పుణ్యస్నానాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని దుర్గాఘాట్లో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన పుణ్యస్నానాలు ఉదయం పదిగంటల వరకు కొనసాగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో లోపలకు ఎవరు దిగి స్నానాలు చేయకుండా ఐరన్ మెష్ ఏర్పాటు చేశారు. ఇక స్నానఘాట్లోని మూడు ప్రదేశాల్లో పెద్ద ఎత్తున షవర్లు ఏర్పాటు చేయడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మహిళలు అరటి డొప్పలలో నేతి దీపాలను వెలిగించారు. హైవేపై కేశఖండనశాల ఎదురు మెట్ల మార్గం ద్వారా స్నానఘాట్లోకి ప్రవేశించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఘాట్లో దేవస్థానం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి నిరంతరం మైక్ ద్వారా ప్రచారం చేయడంతో పాటు వన్టౌన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
వైద్య శిబిరాలు తనిఖీ చేసిన డీఎంహెచ్వో
కోడూరు: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని హంసలదీవిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను జిల్లా వైద్యాధికారి పి.యుగంధర్ తనిఖీ చేశారు. పాలకాయతిప్ప బీచ్, హంసలదీవి వేణుగోపాలుడి ఆలయం వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలు బుధవారం నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను డీఎంహెచ్ఓ ప్రత్యేకంగా పరిశీలించారు. అత్యవసర సేవలు అందించేందుకు వినియోగించే మందులతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 108 వాహనాన్ని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలిచ్చారు. అనంతరం డీఎంహెచ్ఓ కూడా శిబిరంలో బీపీ కట్టించుకొని మిషన్ పనితీరును పరిశీలించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రేమ్చంద్, వైధ్యాధికారి అరుణ పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): మండలంలోని చిన్నాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి యుగంధర్ బుధవారం తనిఖీ చేశారు. తొలుత ఆయన హాజరుపట్టికను పరిశీలించారు. ముఖ ఆధారిత హాజరును తప్పనిసరిగా వారికి కేటాయించిన హెడ్క్వార్టర్స్లో మాత్రమే వేయాలని అలాగే అటెండన్స్ రిజిష్టర్లో సంతకాలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు -
గుర్తు తెలియని వాహనం ఢీకొని కిరాణా వ్యాపారి మృతి
కంచికచర్ల: పచారి సరుకులు తీసుకుని స్కూటీపై ఇంటికి వెళుతున్న కిరాణా వ్యాపారిని వెనుకనుంచి వేగంగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాఽథ్ కథనం మేరకు ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామానికి చెందిన కామా ముత్యాలరావు(46) కంచికచర్లలో పచారి సరుకులు కొనుగోలు చేసి స్కూటీపై గ్రామానికి బయలుదేరాడు. మండలంలోని పరిటాల సమీపంలోని కాళీమాత ఆలయం సమీపంలోకి వెళ్లగానే నేషనల్ హైవేపై ముందు వెళుతున్న స్కూటీని హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న గుర్తు తెలియని వాహనం వెనుకనుంచి వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో వ్యాపారి తలకు తీవ్రగాయాలవటంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య ఇద్దరు సంతానం ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రూ.2లక్షలు మోసం చేసిన డ్రైవర్పై కేసు నమోదు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సంస్థను మోసం చేసిన డ్రైవర్పై భవానీపురం స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు...చీతిరాల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫుడ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో దేవత్ వీరన్న డ్రైవర్గా పనిచేశాడు. కంపెనీకి సంబంధించి 10 వాహనాలు ఉన్నాయి. వీటన్నింటికి కార్డు ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆయిల్ వినియోగిస్తుంటారు. ఈ సంస్థలో వీరన్న కొంత కాలం డ్రైవర్గా పనిచేసి మానేశాడు. ఆ తర్వాత మరలా వచ్చి తనకు ఉద్యోగం కావాలంటూ రోజూ సంస్థ ప్రతినిధులను బతిమాలడం ప్రారంభించాడు. ఆలా రోజూ సంస్థ కార్యాలయానికి వస్తూ నమ్మకంగా సంస్థ వాహనాల్లోని ఆయిల్ కార్డును వినియోగించి ఇతర వాహనాలకు డీజిల్ కొట్టించి వారి వద్ద డబ్బులు వసూలు చేశాడు. ఆ విధంగా రూ.2లక్షలకు పైగా వసూలు చేసి సంస్థను మోసం చేశాడు, దీనిపై సంస్థ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి గన్నవరం: మండలంలోని దావాజిగూడెంలో ఉన్న మద్యం దుకాణం సమీపంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం... వైన్షాపు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పిచ్చిమొక్కల మధ్య ఓ మహిళ మృతదేహం పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ బీవీ శివప్రసాద్ నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకుని మృతురాలు రాజీవ్నగర్కు చెందిన నక్క వెంకటేశ్వరమ్మ(48)గా గుర్తించారు. ఆమె భర్త చనిపోవడంతో పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ హోటల్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే గత మూడు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైన్షాపునకు సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఉబ్బిపోయి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో రెండు రోజుల క్రితమే ఆమె మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మద్యం తాగేందుకు తరుచూ సదరు వైన్షాపునకు వస్తుంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే వెంకటేశ్వరమ్మ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి ఒంటిపై దుస్తులు సరిగ్గా లేకపోవడంతో ఎవరైనా లైంగికదాడికి పాల్పడి హత్య చేసి ఉండవచ్చని అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఇరువురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల అనుమానం మేరకు పోలీసులు క్లూస్ టీమ్ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. -
మాజీ సైనికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సుముఖత తెలియజేసిందని, కానీ 16 నెలలు గడుస్తున్నా కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. కొత్త జిల్లాలకు పేర్లు ఖరారు చేసే సమయంలో యుద్ధాలలోనూ, దేశ రక్షణలోనూ బలిదానాలు చేసిన వీర సైనికుల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అర్హులైన మాజీ సైనికులకు ప్రభుత్వ రంగాలలో అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు శాతం మాత్రమే ఉన్న రిజర్వేషన్ను గతంలో మాదిరి 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి వలన మాజీ సైనికులకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. ఈ పద్ధతిని ఎత్తివేసి సాధారణ పద్ధతిలో మాజీ సైనికులకు రిజర్వేషన్ లు అమలు చేయాలన్నారు. మాజీ సైనికులు రిటైర్మెంట్ తర్వాత 3 ఏళ్ల లోపు మాత్రమే ప్రభుత్వ భూముల కేటాయింపునకు దరఖాస్తు చేసుకునే విధానానికి స్వస్తి పలికి, జీవిత కాలంలో ఎప్పుడైనా ప్రభుత్వ భూములకు దరఖాస్తు చేసుకునే విదంగా జీవో సవరించాలన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ సూరెడ్డి శివకుమార్ (అడ్వకేట్), గౌరవాధ్యక్షుడు అన్నే రామారావు, కోశాధికారి కె.ఉమామహేశ్వరరావు, గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, బాపట్ల అసోసియేషన్ సెక్రటరీ షేక్ మొయినుద్దీన్, మాజీ సైనికులు డి.వెంకటేశ్వర్లు, టి. రుక్మాంగధరరావు పాల్గొన్నారు. ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బ అనేష్బాబు కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో తిరిగే ప్రైవేట్ టూరిస్ట్ బస్సులకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బ అనేష్బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్మిట్లు తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో బస్సులు నడిపే వారి వలన టూరిస్ట్ బస్సు ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వాహన సాఫ్ట్వేర్లో లోపాలను సవరించాలని కోరారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనేష్బాబు మాట్లాడుతూ టూరిస్ట్ బస్సు ఆపరేటర్లు ప్రతి ఏడాది రూ.8 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్మిట్లు తీసుకొని సంవత్సరానికి రూ.50 వేల టాక్స్ చెల్లించి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా టాక్స్ కట్టకుండా స్టేట్ క్యారేజ్ నిర్వహిస్తూ ప్రైవేట్ టూరిస్ట్ బస్ ఆపరేటర్ల వ్యాపారాన్ని గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ అధికారులు ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మురళీమోహన్, కార్యదర్శి కె.శివరాం మాట్లాడుతూ టూరిస్ట్ బస్సు ఆపరేటర్లు ఏ విధమైన నియమ నిబంధనలు అతిక్రమించడం లేదన్నారు. గ్రీన్ టాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆరు నెలల క్రితం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ను కలిసి విన్నవించినా, ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు అశ్విన్రెడ్డి, సత్యప్రసాద్, వేములపల్లి వెంకటేశ్వర్లు, కేతన సాయి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
బెదిరింపులకు, అరెస్టులకు భయపడేది లేదు
పమిడిముక్కల(పామర్రు): పోలీసుల బెదిరింపులకు, కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం వద్ద ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు సరికాదన్నారు. కార్యకర్తలను రానివ్వకుండా రోప్లు అడ్డుపెట్టడం, పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని, ప్రస్తుతం కూటమి పాలనలో తుపాన్ వల్ల దెబ్బతిన్న పంట నష్టం నమోదు చేయాలంటే టీడీపీ వారికే చేస్తున్నారని ఆరోపించారు. పంట నష్ట పరిహారం, దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని, మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ అక్రమ అరెస్టు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ -
ప్రగతి సూచికల లక్ష్యాలను సాధించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర విజన్ @ 2047కు సంబంధించిన కీలక ప్రగతి సూచికల లక్ష్యాలను అన్ని శాఖలు పూర్తిస్థాయిలో సాధించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర విజన్–కేపీఐల లక్ష్యాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొన్ని శాఖలు బీ,సీ గ్రేడులలో ఉన్నాయని, ఇవి తప్పనిసరిగా ఏ–గ్రేడ్లోకి రావాలని ఆదేశించారు. వీఎంసీ, పోలీస్, ఆరోగ్య, విద్యా, సహకార శాఖలు మరింత పురోగతి సాధించాల్సి ఉందన్నారు. సాధించిన ప్రగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డులను (ఈ–హెచ్ఆర్) పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు వారానికి ఒకసారి అంగన్వాడీలను తనిఖీ చేయాలని, అందరికీ పోషకాహారం అందేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ముఖ్య ప్రణాళిక అధికారి వై. శ్రీలత తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి/పెదకళ్లేపల్లి(మోపిదేవి): ప్రసిద్ధ శైవక్షేత్రాలుగా విరాజిల్లుతున్న మోపిదేవిలోని శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, దక్షిణకాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లిలోని శ్రీదుర్గాపార్వతీ సమేత నాగేశ్వరస్వామివారిని దేవదాయ ధర్మదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్ సతీసమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి ఆయా దేవస్థానాలలో ఘనస్వాగతం లభించింది. తొలుత మోపిదేవిలో ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డుప్రసాదం అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ఇంద్రకీలాద్రిపై విశేష పూజలతో పాటు పలు కార్యక్రమాలు జరగనున్నాయి. బుధవారం తెల్లవారుజామున 5.55గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులతో పాటు దేవస్థాన ప్రచార రథంతో భక్తులు, సేవా సిబ్బంది గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ఇక సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం నిర్వహించేందుకు వైదిక కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కోటి దీపోత్సవంలో భక్తులు పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం నిలిసివేసింది. కోటి దీపోత్సవం అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే మల్లేశ్వర స్వామి వారికి త్రికాల అర్చనలు, సహస్ర లింగార్చన, పంచహారతుల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవలు జరుగుతాయి. నాగాయలంక: ఢిల్లీ సైన్స్ ఎక్స్పోజర్ ఎడ్యుకేషనల్ టూర్కు నాగాయలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ పదో తరగతి విద్యార్థులు చాపల మోక్షజ్ఞ, సనకా తేజసాయి ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం అలపర్తి సత్యనారాయణ మంగళవారం తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకత, ఆవిష్కరణలు పెంపొందించే క్రమంలో ఏసీ సైన్స్ సిటీ సహకారంతో ప్రతి జిల్లా నుంచి ఇద్దరేసి చొప్పున ఎంపిక చేసిన 52మందిలో కృష్ణాజిల్లా తరఫున ఈ ఇద్దరు విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఈనెల 6, 7, 8 తేదీల్లో ఢిల్లీలోని రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చరల్, నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియంలను సందర్శిస్తారని.. అలాగే నాసా, ఇస్రో సంస్థలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలతో చర్చాగోష్టిలో పాల్గొంటారని ఆయన వివరించారు. -
బూడిద లోడింగ్ను అడ్డుకున్న లారీ ఓనర్లు
ఇబ్రహీంపట్నం: ఖిల్లా రోడ్డులోని బూడిద చెరువు వద్ద బూడిద లోడింగ్ పనులను లారీ ఓనర్లు అడ్డుకున్నారు. స్థానిక లారీ ఓనర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు లారీలకు లోడింగ్ ఆపివేయాలని కోరుతూ మంగళవారం ఆందోళనకు దిగారు. లారీ ఓనర్లకు తోడుగా టీడీపీ నాయకులు జత కలవడంతో లోడింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న రెఫెక్స్ సంస్థ ప్రతినిధులు ఏమీ చేయలేక మిన్నకుండి పోయారు. ఈ ప్రాంతంలో బూడిద లోడింగ్ వలన భారీగా కాలు ష్యం పెరిగిందని తెలుసుకున్న కేంద్రం సూచనల తో ఏపీ జెన్కో సంస్థ ఇటీవల స్థానిక బూడిద లో డింగ్ కాంట్రాక్ట్ను రెఫెక్స్ అనే సంస్థ టెండర్ ద్వా రా దక్కించుకుంది. ఈ విధానంతో ఇప్పటివరకు ఉచితంగా లోడింగ్ చేయించుకున్న లారీ ఓనర్లు ఇప్పుడు లారీ లోడింగ్కు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. లారీ ఓనర్లు నష్టపోతున్నందున కాంట్రాక్ట్ టెండర్ రద్దు చేయాలని కోరుతూ ఎన్టీటీపీఎస్ ప్రధాన గేటు సమీపంలో 38రోజుల పా టు లారీ ఓనర్లు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఎ మ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఒక్కొక్క లారీకి నెలకు 12 ట్రిప్పులు ఉచితంగా లోడింగ్ చేసేలా మాట్లాడామని హామీ ఇస్తూ దీక్షను విరమింపచేశా రు. అయితే ఎమ్మెల్యే హామీని తుంగలో తొక్కుతూ ఒక్కొక్క ట్రిప్పుకు రూ.850 నగదు డిమాండ్ చేయడంతో లారీ ఓనర్లు లోడింగ్ పనులు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన లారీ ఓనర్లు డబ్బులు చెల్లించి లోడింగ్ చేసుకుంటున్నారు. టీడీపీకి చెందిన లారీ ఓనర్లు ఉచితంగా ఇవ్వాలని రెఫెక్స్ సంస్థ ప్రతినిధులపై బెదిరింపు ధోరణికి దిగారు. ప్రభుత్వ మాది, మాకు ఉచితంగా లోడింగ్ ఇవ్వాలని కాంట్రాక్టర్ ప్రతినిధులపై బెదిరింపులకు దిగారు. సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ భువనగిరి రాజు సిబ్బందితో అక్కడకు చేరుకుని చైన్నెలో ఉన్న టెండర్దారుడికి సమాచారం చేరవేశారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు లోడింగ్ పనులు నిలిపివేశారు. -
అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ రెజ్లింగ్ టోర్నీ ప్రారంభం
విజయవాడరూరల్: చదువుతో పాటు క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని, అందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీనే చక్కని ఉదాహరణ అని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఐపీఈ) డాక్టర్ ఎస్కే మహబూబ్ బాషా అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, సమగ్ర శిక్ష, ఎన్టీఆర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే అండర్–14,17 బాల,బాలికల రెజ్లింగ్ టోర్నమెంట్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. విజయవాడ రూరల్ మండలం నున్న జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధ్వర్యంలో స్థానిక అశోక్ ఫంక్షన్హాల్లో అంతర్ జిల్లాల అండర్–14,17 బాల బాలికల ఫ్రీస్టైల్, అండర్–17 బాలుర గ్రీకోరోమన్ రెజ్లింగ్ (కుస్తీ) పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి సుమారు 750 మంది క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాబూబ్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఎస్.రవిప్రసాద్, టోర్నమెంట్ పరిశీలకుడు సీహెచ్ రమేష్, సొసైటీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ గడ్డం కుమార్, ఏపీ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.భూషణం, టెక్నికల్ ఇన్చార్జి పి.ఆనంద్, శాప్ రెజ్లింగ్ కోచ్ కె.మనోహర్, ఎస్జీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, ఫిజికల్ డైరెక్టర్ టి.విజయవర్మ, హైస్కూల్ ఫస్ట్ అసిస్టెంట్ గోపీనాఽథ్ పాల్గొన్నారు. -
9న హరివిల్లు చిత్రకళా పోటీలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో హరివిల్లు చిన్నారుల రంగుల పండుగ పేరుతో చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నామని ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ అధ్యక్షుడు అనుమకొండ సునీల్కుమార్ అన్నారు. గవర్నర్పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్లో పండుగకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్కుమార్ మాట్లాడుతూ చిత్రకళా పోటీలు మూడు విభాగాల్లో జరుగుతాయని, ప్రవేశం ఉచితమన్నారు. సాయంత్రం 3.30 నుంచి 5.30 గంటల వరకు పోటీలు జరుగుతాయన్నారు. సబ్ జూనియర్స్ విభాగంలో 3,4,5 తరగతుల విద్యార్థులకు మీకు నచ్చిన చిత్రం అనే అంశంపై, జూనియర్స్ విభాగంలో 6,7 తరగతులకు నచ్చిన సంప్రదాయ క్రీడ అనే అంశంపై, సీనియర్స్ విభాగంలో 8,9,10 తరగతులకు నచ్చిన సైన్స్ ఆవిష్కరణ అనే అంశంపై పోటీలు జరుగుతాయని వివరించారు. పోటీల అనంతరం మ్యాజిక్ షో, తరువాత బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. పోటీలలో పాల్గొనాలనుకునే వారు ఈ నెల 7వ తేదీ లోపు 9347950085 నంబర్కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఉపాధ్యక్షుడు ఎ.గిరిధర్, కోశాధికారి రమేష్, సంధ్య, సౌజన్య, సుధారాణి, శ్రావణ్, సుష్మ తదితరులు పాల్గొన్నారు. -
నూతన టెర్మినల్ నిర్మాణం వేగవంతం చేయాలి
ఎయిర్పోర్ట్(గన్నవరం): విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేసేందుకు పనులను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. స్థానిక విమానాశ్రయంలో మంగళవారం ఆయన నూతన టెర్మినల్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు, భూసమీకరణ సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. నూతన టెర్మినల్ భవన నిర్మాణానికి సంబంధించి మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తిచేయాల న్నారు. విమానాశ్రయ విస్తరణలో నెలకొన్న భూసమస్యలు, కోర్టు వివాదాలు, ఏలూరు కాలువపై వంతెన నిర్మాణం, రైతులకు పరిహారం చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ నూతన టెర్మినల్ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్ రామాచారి, డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రమణ్యం, తహసీల్దారు కేవీ శివయ్య, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, ఆర్అండ్బీ ఈఈ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాలు మచిలీపట్నం అర్బన్: కృష్ణాజిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆరు ప్రాంతాల్లో ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష కృష్ణాజిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆర్.కుముదిని సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6న మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు మండలాల పిల్లల కోసం మచిలీపట్నంలోని పాండురంగ మున్సిపల్ హైస్కూలో, 7న గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు, పెదపారుపూడి మండలాలకు గుడివాడలోని శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్లో, 10న గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాలకు గన్నవరంలోని జెడ్పీ గరల్స్ హైస్కూల్లో శిబిరాలు ఉంటాయన్నారు. నవంబరు 11న అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాలకు చల్లపల్లిలోని జెడ్పీ హైస్కూల్లో శిబిరాలు నిర్వహిస్తామన్నారు. నవంబరు 12న పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలకు కంకిపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్ వేదికగా నవంబరు 13న పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల పిల్లల కోసం పామర్రులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శిబిరాలు ఉంటాయన్నారు. -
విజయవాడ నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా మార్చాలి
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చాలని పార్లమెంట్ సభ్యుఢు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో మంగళవారం కమిషనర్ ధ్యానచంద్ర, శాప్ చైర్మన్ ఎ.రవి నాయుడు, ఎం.డి ఎస్.భరణితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విద్యాధరపురం స్టేడియం, మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో క్రీడా ప్రాంగణాలని జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ విజయవాడ క్రీడా ప్రాంగణాలన్నీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ జరిగితే విజయవాడ ఆర్థికంగా బలపడుతుందని అన్నారు. డిసెంబర్లో జరగనున్న షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు వీలుగా ఇండోర్ స్టేడియంలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి.చంద్రశేఖర్, ఇన్చార్జి చీఫ్ ఇంజినీర్ పి.సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఎ.శ్రీనాథ్, శాప్ అధికారులు పాల్గొన్నారు. -
అధికారులు సూచికలు ఏర్పాటు చేసినా...
వర్సిటీ భూములు అక్రమంగా అమ్మేసుకుంటున్నారన్న సమాచారం రావడంతో గూడూరు తహసీల్దారు డి.రాజ్యలక్ష్మి సిబ్బందితో అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. అయితే బోర్డులు పెట్టిన ఒకటి, రెండు రోజుల్లోనే వాటిని తొలగించి యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీనిపై యూనివర్సిటీ అఽధికారులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించడం లేదని, తాము ఏం చేయగలమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఇప్పటికై నా కృష్ణా యూనివర్సిటీ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకుని వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
కొండపల్లి కీర్తికి ఎస్పీఏ చేయూత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా లోని కొండపల్లి ప్రాంతంలో హస్తకళలు, పర్యాటక రంగ అభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగంగా కొండ పల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్ అభివృద్ధిలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ–విజయవాడ) సంస్థ భాగస్వామ్యానికి చొరవ చూపుతున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ లక్ష్మీశ ఎస్పీఏ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంతో పాటు దేశ, విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా, భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించేలా చేపట్టిన ఎక్స్పీరియన్స్ సెంటర్ తోరణం (ఆర్చ్) అభివృద్ధి చేయాలన్నారు. కొండపల్లిని ఒక మోడల్ గ్రామీణ సృజనాత్మక ఆర్థిక కేంద్రంగా మార్చడానికి అవసరమైన ఆర్కిటెక్చర్, ప్లానింగ్కు సంబంధించి సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లా అధికార యంత్రాంగం, ఎస్పీఏ భాగస్వామ్యం కొండపల్లి బొమ్మలకు కొత్త వైభవం తేవడంతో పాటు యువత నేతృత్వంలోని కొత్త ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన, బ్రాండింగ్, ఎస్హెచ్జీ వ్యవస్థాపకత వంటి వాటికి ఉపయోగపడుతుందన్నారు. వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ (ఓడీపీడీ) కింద కొండపల్లి బొమ్మల కళాకారుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు ఈ కళను తరతరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు కృషిచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనిపై ఎస్పీఏ ప్రతినిధులు స్పందిస్తూ తమ సంస్థ డైరెక్టర్ సలహాలు సూచనలు, మార్గనిర్దేశనం మేరకు నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు, డీపీఆర్ రూపకల్పనకు కృషిచేస్తామని చెప్పారు. కొండపల్లి కోటను కూడా పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేయడంపైనా సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఎస్పీఏ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆర్ఎన్ఎస్ మూర్తి, డి.జగత్ కుమారి పాల్గొన్నారు. -
కళ్ల ముందు నష్టం కనిపిస్తున్నా..
ఆకుమర్రు గ్రామంలో నాలుగున్నరఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. తుపానుకు పంటంతా నీటిలో నానుతున్నా పంట నష్టం నమోదు చేయడం లేదు. పొలంలోనుంచి నీరు బయటకు వెళ్లకపోవడంతో పొట్టదశలో ఉన్న పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వాటిల్లిన రైతులందరికీ పరిహారం అందేలా చూడాలి. –ఓడుబోయిన బ్రహ్మకృష్ణ, రామరాజుపాలెం మద్దిపట్ల గ్రామంలో ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నా. మోంథా తుపానుకు పంటంతా నేలకొరిగింది. కళ్లముందు పంట నష్టం కనిపిస్తున్నా నమోదు చేయలేదు. ఎందుకు నమోదు చేయడం లేదని అడిగితే ఏఓ గారిని అడగమంటున్నారు. –డొక్కు నాగమల్లేశ్వరరావు, తరకటూరు -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025మోంథా తుపానుతో అన్నదాతకు గుండె కోత పంట నమోదు చేయలేదుఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి సోమవారం విజయవాడకు చెందిన ముగ్గురు భక్తులు విరాళాలను అందజేశారు.కోడూరు: ప్రముఖ ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సోమవారం 250 మంది శిష్య బృందంతో కలిసి కృష్ణా సాగరసంగమ ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లాలోపంట నష్టం ఇలా... (ప్రాథమిక అంచనా ఎకరాల్లో) తుపాను ప్రభావితమైన గ్రామాలు : 427 మొత్తం పంట నష్టం : 1,16,342.5 బాధిత రైతులు : 56040 వరి పంట : 1,12,600 బాధిత రైతులు : 54180 వేరుశనగ పంట : 720.5 బాధిత రైతులు : 586 మినుము పంట : 2462.5 బాధిత రైతులు : 1249 పత్తి పంట : 107.5 బాధిత రైతులు : 43 మొక్క జొన్న : 01 బాధిత రైతులు : 02 ఉద్యాన పంటలు : 3540.55 బాధిత రైతులు : 2229 ఉద్యాన పంట నష్టం అంచనా : రూ.73.45 కోట్లు గూడూరు మండలంలో నేలవాలిన వరి పైరు ప్రకృతి ప్రకోపానికి వరికంకులు తలలు వాల్చాయి. అన్నదాతకు గుండెకోతే మిగిలింది. ఆరుగాలం పడిన శ్రమ చేతికందే సమయంలో మోంథా తుపాను గద్దల్లే తన్నుకుపోయింది. సర్కారు నుంచి భరోసా లేకపోగా పంట నష్టం సర్వేలోనూ అడ్డగోలు నిబంధనలు పెడుతోంది. దీంతో అన్నదాత కష్టాల సుడి గుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు.7 -
చంద్రమౌళీశ్వరుని సేవలో కలెక్టర్ లక్ష్మీశ దంపతులు
విజయవాడ కల్చరల్: కంచి కామకోటి పీఠస్థ లబ్బీపేటలోని శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం కార్తిక మాసం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్షీశ దంపతులు పాల్గొన్నారు. దేవాలయంలో నిర్వహించిన మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చనలో పాల్గొన్నారు. దేవాలయ ప్రాంగణంలోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేవాలయ వేదపండితులు లక్ష్మీశ దంపతులకు వేదపండితులు వేదాశీర్వాదం, మహాప్రసాదం అందించారు. దేవాలయ కార్యనిర్వాహకుడు డాక్టర్ రామ్మోహనరావు దేవాలయంలో జరిగే సేవలను వివరించారు. మేనేజర్ శర్మ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తిక మాసం రెండవ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఐదు గంటలకు, 6.30 గంటలకు, 8 గంటలకు, 10.30 గంటలకు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఉదయం 11 గంటలకు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి శాంతి కల్యాణం చేశారు.స్వామివారిని ఆలయ ప్రాంగణంలో పల్లకీలో ఊరేగించారు. కొండపైకి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని దీపారాధన చేశారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. రాత్రి పంచహారతులు, పల్లకీసేవ జరిగింది. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పెనమలూరు: కృష్ణా జిల్లా వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేసినట్టు జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుర్రాల రవి తెలిపారు. విజయనగరం జిల్లాలో ఈ నెల 14,15,16 తేదీలలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల నేపథ్యంలో పోరంకిలో ఎంపికలను నిర్వహించినట్టు చెప్పారు. 48 కేజీల విభాగంలో ఎన్వీవీ నాగఅను, 63 కేజీలలో ఒ.గాయత్రి, 77 కేజీల విభాగంలో బి.ఝాన్సీ, 101 కేజీల విభాగంలో బీఎస్డీ విష్ణువర్థన్లను ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వెయిట్లిఫ్టింగ్ అధ్యక్షుడు కె.దామోదర్, జిల్లా మాజీ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ పీబీబీ లింగేశ్వరరావు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అశోక్, ఎస్.తినాథ్, జి.వినోద్ పాల్గొన్నారు. కోడూరు: కృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర కృష్ణా సాగరసంగమం వద్ద పుణ్యస్నానాలకు అనుమతి లేదని అవనిగడ్డ సీఐ యువకుమార్ తెలిపారు. కార్తికమాసాన్ని పురస్కరించుకుని హంసలదీవి బీచ్కు పర్యాటకుల తాకిడి పెరగడంతో కోడూరు పోలీసు, పాలకాయతిప్ప మైరెన్ పోలీసులతో కలిసి తీరంలో పర్యటించారు. కార్తిక పౌర్ణమి నేపథ్యంలో తీరంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. బీచ్లో ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్తో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. పుణ్యస్నానాలు, పూజా కార్య క్రమాలు నిర్వ హించే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, నడుమ లోతు దాటి సముద్రంలో వెళ్లకూడదని స్పష్టం చేశారు. పిల్లలు, వృద్ధులతో పాటు ఫిట్స్ ఉన్న వ్యక్తుల విషయంలో కుటుంబసభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అలలు ఉధృతంగా ఉన్న నేపథ్యంలో సిబ్బంది, గజ ఈతగాళ్ల సూచనలు కచ్చితంగా పాటించాలన్నారు. అనంతరం బీచ్ పరిసరాలతో పాటు సారగ సంగమ ప్రాంతాన్ని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలిచ్చారు. పాలకాయతిప్ప మైరెన్ సీఐ సురేష్రెడ్డి, ఎస్ఐలు చాణిక్య, పూర్ణమాధురి పాల్గొన్నారు. -
వర్సిటీ భూములు కృష్ణార్పణం
గూడూరు: ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో కృష్ణా యూనివర్సిటీకి అంకురార్పణ చేశారు. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో మహానేత శిలాఫలకం ఆవిష్కరించగా, తర్వాతి కాలంలో నేషనల్ కాలేజీలో తాత్కాలికంగా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. యూని వర్సిటీకి సొంత భవనాలు సమకూర్చడానికి ప్రభుత్వం 2010లో యూనివర్సిటీకి భూములు కేటాయించింది. మచిలీపట్నం మండలం రుద్రవరంలో 102 ఎకరాలు కేటాయించగా, గూడూరులో 44.92 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బందరు మండలం రుద్రవరంలో కేటాయించిన భూముల్లో యూనివర్సిటీ నిర్మాణం చేపట్టడంతో ప్రస్తుతం అక్కడి నుంచే పరిపాలన, తరగతుల నిర్వహణ సాగుతున్నాయి. గూడూరులో 44.92 ఎకరాల కేటాయింపు గూడూరు పటాన్పేటలోని సర్వే నంబరు 443/3లో 25.58 ఎకరాలు, కోకనారాయణపాలెం వెళ్లే రోడ్డు వెంబడి సర్వే నంబరు 393/1లో 19.00 ఎకరాలు వెరసి మొత్తం 44.92 ఎకరాలు యూనివర్సిటీకి కేటాయిస్తూ 2010లో అప్పటి కలెక్టర్ ఎలినేషన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వాస్తవానికి యూనివర్సిటీకి కేటాయించిన భూములన్నీ రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూములుగా నమోదయి ఉన్నప్పటికీ అనాది నుంచి స్థానిక రైతులు వాటిని సాగు చేసుకుని జీవనం సాగిస్తూ వచ్చారు. దీంతో తమ భూములను యూనివర్సిటీకి కేటాయించడంపై సర్వే నంబరు: 393/1లో అనుభవంలో ఉన్న రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం కోర్టులో వాయిదాలు నడుస్తున్నాయి. అన్యాక్రాంతం అవుతున్న భూములు ఇదిలావుండగా యూనివర్సిటీకి గూడూరు పటాన్పేటలోని 443/3లో కేటాయించిన భూములను అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. కనీసం భూముల చుట్టూ ఫెన్సింగ్ గానీ, సూచికలు గానీ, హద్దులు గానీ ఏర్పాటు చేయలేదు. దీంతో అనాది నుంచి భూములను సాగు చేసుకుంటున్న వారు ఇతరులకు అమ్మేసుకుంటున్నారు. 443/3 సర్వే నంబరులో మొత్తం 93.22 ఎకరాలు ఉండగా, దానిలో నుంచి యూనివర్సిటీకి 25.58 ఎకరాలు కేటాయించారు. మిగిలినవి ప్రైవేటు భూములు. దీంతో యూనివర్సిటీ భూములు సులువుగా రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. కొందరు పక్కా భవనాలు కూడా నిర్మించేసుకుంటుండటం గమనార్హం. వెంచర్లు వేసి మరీ విక్రయాలు వర్సిటీ అధికారులు ఈ భూముల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో కొందరు వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయించేస్తున్నారు. ఈ వ్యవహారంలో కింది స్థాయిలో ఉండే రెవెన్యూ సిబ్బంది ప్రత్యక్ష పాత్ర పోషిస్తుండగా ఆ శాఖలోనే ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు మరికొందరికి పరోక్షంగా సహాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారికి సమీపంలో... మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారికి ఈ భూములు 100 మీటర్ల పరిఽధిలోనే ఉండటంతో ప్రస్తుతం వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఎకరం రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు సాగుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. -
అర్జీల పరిష్కారంలో అలసత్వం సహించం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్జీల పరిష్కారంలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను హెచ్చరించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఇతర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అనుమతి లేకుండా గ్రీవెన్స్కు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పునరావృతం కాకుండా అర్జీలకు పరిష్కారం చూపాల్సిందేనన్నారు. గ్రీవెన్స్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని అధికారులను కలిసేందుకు ఎంతో శ్రమతో, ఆశతో వస్తున్నారన్నారు. అర్జీదారుడు పెట్టుకున్న నమ్మకానికి వమ్ము చేయకూడదన్నారు. నిర్దేశించిన సమయానికి సమస్యలకు పరిష్కారం చూపాల్సిందేనని, ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా సహించబోనని కలెక్టర్ హెచ్చరించారు. సానుకూలతతో సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలన్నారు. అర్జీల పరిష్కారంపై తాను ప్రతి రోజు సమీక్ష నిర్వహిస్తానని, సరైన కారణం లేకుండా జాప్యం చేసినా, నాణ్యత లేకున్నా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ ద్వారా ప్రజల నుంచి 194 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్డీఏ పి.డి ఏఎన్వీ నాంచారరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్ జగన్ పర్యటన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మోంథా తుపాను కృష్ణాడెల్టాకు తీరని నష్టం మిగిల్చింది. ఈదురుగాలులు, భారీ వర్షాలకు వరి పొలాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఉద్యాన పంటలైన బొప్పాయి, అరటి, కూరగాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. వరి దుబ్బులు మీదుగా వర్షపునీరు ప్రవహించింది. చిరుపొట్ట, గింజ గట్టిపడే దశలో వర్షం కురవటంతో తాలు,తప్ప గింజ ఏర్పడుతుందని, మానుగాయ వచ్చి పంట దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు ఒక్కో ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. పంట చేలు కోతకు సిద్ధమయ్యే దశలో వచ్చి పడ్డ తుపానుతో పెట్టుబడులు పూర్తిగా నీటిపాలైనట్టేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పంటలు డెబ్బతింటే ఎకరాకు రూ.25 వేలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందని, ఇప్పుడు ఎకరాకు పంట నష్ట పరిహారం రూ.10వేలు ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. పంట నష్టం సర్వే లోనూ మెలిక ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలతో అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. సబ్సిడీ ఎగ్గొట్టడమే లక్ష్యంగా కుట్రలు సాగుతున్నాయి. పంట నష్టం పరిహారానికి సంబంధించి రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద నమోదు కోసం వెళితే నష్ట పరిహారం కావాలంటే మీ ధాన్యం మేము కొనేది లేదని అధికారులు చెబుతున్నారని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు రోజుల్లో పంట నష్టం అంచనాలు రూపొందించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అమలు కాలేదని రైతులు వాపోతున్నారు. తమకు రైతు భరోసా అందలేదని కౌలు రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లడిల్లుతున్న రైతులు తమ కళ్ల ముందే నేల వాలిన పంటను చూసి తల్లడిల్లిపోతున్నారు. ఎకరానికి కౌలు రూ.30 వేలు, పంట పెట్టుబడి రూ.35 వేలు మొత్తం గంగ పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పది రోజుల్లో చేతికొచ్చే పంట పూర్తిగా నీళ్లలో నాని కుళ్లిపోతోందని, గింజలు మొలకెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. అరకొర మిగిలిన పంట కోయాలన్నా, మామూలు సమయంలో పంట కోతకు ఎకరాకు 2 గంటల సమయం పడితే, ఇప్పుడు 4 గంటల సమయం పడుతుందని, పైగా గింజలు రాలిపోతాయని, మిగిలిన అరకొర దిగుబడులు పంటకోత ఖర్చులకు కూడా రావని మథనపడుతున్నారు. ఒక వేళ కొంత మంది రైతులు ధైర్యం చేసి నేలకు వాలిన పంటను పైకి లేపి కట్టాలన్నా ఎకరాకు 100 మంది కూలీలు అవుతున్నారని, కూలీ రూ.330 చొప్పున రూ.33వేలు అవుతుందని వాపోతున్నారు. నిలబడిన వరి పంటకూ నష్టమే... మోంథా తుపాను వివిధ దశల్లో ఉన్న వరి పంటకు తీవ్ర నష్టం చేకూర్చింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈనిక, చిరుపొట్ట దశలో ఉన్న పంటకు కనపడని నష్టాన్ని కలిగించింది. ఈదురు గాలులకు కంకులు ఒక దానికొకటి రాసుకుని తాలు..తప్ప కంకులు వస్తున్నాయి. చిరుపొట్ట మీద ఉన్న వరి కర్రలు పొట్టలు పగిలి దిగుబడులపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణంగా సరాసరి ఎకరాకు పది నుంచి 15 బస్తాలు దిగుబడి తగ్గి పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావానికి వరి పంట నేల వాలి పడిపోకుండా నిలబడి ఉన్న పంటకు కూడా నష్టం తప్పదని, పడిపోకుండా నిలబడిన వరి పంటకు ప్రభుత్వం నుంచి నష్టం కూడా రాదని రైతులు వాపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గంలోని గూడూరు చేరుకుంటారు. మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. అక్కడ నుంచి హైవే మీదుగా తాడేపల్లి చేరుకుంటారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సుబ్బన్న, చిటికెన నాగేశ్వరరావు పరిశీలించారు. జగన్ పర్యటన సాగే రామరాజుపాలెం నుంచి గొల్లపాలెం వరకు వరకు ప్రయాణించారు. -
వన్ హెల్త్ అవగాహన కార్యక్రమం ప్రారంభం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జంతువుల నుంచి సంక్రమించే వివిధ వ్యాధులను నివారించాలన్న లక్ష్యంతో ఒకే ఆరోగ్యం(వన్ హెల్త్) అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఒకే ఆరోగ్యం(వన్ హెల్త్) కార్యక్రమాన్ని పోస్టర్ ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నవంబర్ మూడో తేదీన వన్ హెల్త్ డేగా జరుపుకుంటారని చెప్పారు. బర్డ్ ఫ్లూ, రేబీస్ తదితర వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తాయని, అలాంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వైద్య, ఆరోగ్య, పశుసంవర్ధక, వ్యవసాయ, పర్యావరణ, విద్యా శాఖలతో సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు, సదస్సులు, పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, జంతువుల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామన్నారు. పర్యావరణానికి ప్రయోజనం.. జంతువుల నుంచి వ్యాధులు సంక్రమించకుండా చేపట్టవలసిన నివారణ చర్యలను కలెక్టర్ వివరించారు. పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా టీకా మందులు ఇప్పించడం, వారానికి ఒకసారి స్నానం చేయించడం, కుక్కలకు తప్పనిసరిగా నట్టాల మందులు తాగించాలన్నారు. ఎలుకలను ఇంటి పరిసరాల్లో లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, చిలుకలతో, పక్షులతో అతి సన్నిహితంగా మెలగరాదని చెప్పారు. పశువులకు టీకా మందులు వేయించడం, చనిపోయిన పశువులను సున్నపు గుంతలలో లోతుగా పాతిపెట్టాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మానవులకు, జంతువులకు, పర్యావరణానికి ప్రయోజనం జరుగుతుందని చెప్పారు. మానవులకు మెరుగైన ఆరోగ్యం, వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉంటుందన్నారు. జంతువులకు మెరుగైన ఉత్పాదకత, సురక్షితమైన ఆహారం, జీవవైవిద్యంతో పాటు పర్యావరణానికి ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు, స్థిరమైన సహజ వనరులు, వ్యాధుల వ్యాప్తి తగ్గుదల వంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో జేసీ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఎంహెచ్వో సుహాసిని, డీఈవో సుబ్బారావు, డాక్టర్ సమీర తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
జి.కొండూరు: కారు ఢీ కొనడంతో సైకిల్పై వెళ్తున్న వృద్ధుడు దుర్మరణం చెందిన ఘటన జి.కొండూరు మండల పరిధి విద్యానగరం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జి.కొండూరు మండల పరిధి పినపాక గ్రామానికి చెందిన కోసూరి బాబూరావు(57) సైకిల్పై జి.కొండూరు వైపు నుంచి 30వ నంబర్ జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలో పినపాక వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో విద్యానగరం వద్ద పినపాక గ్రామం వైపు యూటర్న్ తీసుకుంటుండగా విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు సైకిల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన బాబూరావు తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయాడు. క్షతగాత్రుడిని ఢీ కొట్టిన కారులోనే చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. గూడూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై రామరాజుపాలెం అడ్డరోడ్డు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గూడూరుకు చెందిన పెద్దిపోయిన వెంకటరాజు(38) కొన్నేళ్ల క్రితం మచిలీపట్నం సుకర్లాబాదలో ఇల్లు కట్టుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడూ గూడూరు వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గూడూరు వచ్చిన వెంకట్రాజు గూడూరు మసీదు సెంటరులో తారసపడిన గొరిపర్తి నాగేంద్రంను కూడా తన ద్విచక్రవాహనం ఎక్కించుకుని బందరు బయలుదేరాడు. రామరాజుపాలెం అడ్డరోడ్డు దాటిన తర్వాత వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో వెంకటరాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి వెంటనే ప్రైవేటు అంబులెన్స్లో బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటరాజుకు భార్య, ఇద్దరు సంతానం. నాగేంద్రం స్వల్పగాయాలతో బయట పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెనమలూరు: తాడిగడప గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతా మల్లిఖార్జునరావు(49) అరటి ఆకులు కోసి మార్కెట్లో విక్రయిస్తాడు. ఈ నేపథ్యంలో ఆదివారం అరటి తోటకు వెళ్లాడు. అయితే మల్లిఖార్జునరావు అరటి తోటలో పడి పోయి ఉండటాన్ని కొమ్మునాగరాజు చూసి వెంటనే అతని కుటుంబ సభ్యులను సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు అక్కడకు వద్ద వచ్చి చూడగా అప్పటికే మల్లిఖార్జునరావు మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు లిఖిల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెండు లారీలు ఢీ : ముగ్గురికి గాయాలు
కొణకంచి క్రాస్రోడ్స్(పెనుగంచిప్రోలు): రెండు లారీలు ఢీ కొనడంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలైన ఘటన మండల పరిధిలోని కొణకంచి క్రాస్ రోడ్స్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ కొణకంచి గ్రామంలో నుంచి జాతీయ రహదారి పైకి వస్తున్న లారీని ప్రమాదవశాత్తూ వెనుక వైపు నుంచి ఢీ కొంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీడ్రైవర్ నల్గొండ జిల్లా మునగాలకు చెందిన పాలకూర శ్రీశైలం తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో నందిగామ ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి విజయవాడ తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూచిపూడిలో చాగంటికి నాట్య నీరాజనాలు
కూచిపూడి(మొవ్వ): ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు సోమవారం నాట్య క్షేత్రం కూచిపూడిలో ఘన స్వాగతం లభించింది. కోలాట భజనలు, మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో వేదపండితుల ఆశీర్వచనాల నడుమ శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు సోమవారం సాయంత్రం ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నూతన వస్త్రాలతో సత్కరించారు. ఆలయ సమీపంలోని శ్రీ సిద్ధేంద్రయోగి కళా వేదికపై జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి చాగంటి కోటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు. కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.మునిరత్నం నాయుడు, గ్రామ సర్పంచ్ కొండవీటి వెంకటరమణ విజయలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, ఎంపీడీవో డి.సుహాసిని, దేవాలయ పాలక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న నాట్య ప్రదర్శనలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠం విద్యార్థులతో పాటు హైదరాబాద్, కాకినాడకు చెందిన కూచిపూడి కళాకారులు ప్రదర్శించిన నాట్యాంశాలు ఆకట్టుకున్నాయి. అలాగే చాగంటి కోటేశ్వరరావు మనుమరాలు శ్రీకరి (కాకినాడ) ప్రదర్శించిన రామాయణ శబ్దం చక్కని హావభావాలతో ప్రదర్శించి ప్రేక్షకులను అబ్బురపరిచింది. శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠం ఉప ప్రధానాచార్యులు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ నృత్య దర్శకత్వంలో నిర్వహించిన మోహిని భస్మాసుర నృత్య రూపకం ఆశీనులను భక్తి భావంలోకి తీసుకువెళ్లింది. -
సెపక్తక్రా ఓవరాల్ చాంపియన్ కృష్ణా
ఉరవకొండరూరల్: రెండు రోజులుగా ఉరవకొండ సెంట్రల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అండర్ –14, 19 రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా బాలబాలికల క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 280 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ –19 బాలబాలికల విభాగంలో కృష్ణా జిల్లా మొదటి స్థానం, రెండో స్థానంలో అనంతపురం, మూడో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్లు నిలిచాయి. అండర్– 14 బాలుర విభాగంలో మొదటి స్థానంలో తూర్పు గోదావరి, రెండో స్థానంలో పశ్చిమ గోదావరి, మూడో స్థానంలో కర్నూలు, బాలికల విభాగంలో మొదటి స్థానంలో నెల్లూరు, రెండో స్థానంలో పశ్చిమ గోదావరి, మూడో స్థానంలో అనంతపురం జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు ఆల్ ఇండియా సెపక్ తక్రా పెడరేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కృష్ణా జిల్లా ఏపీ స్కూల్ గేమ్స్ పరిశీలకుడు రమేష్, ఉరవకొండ ఎంఈఓలు ఈశ్వరప్ప, రమాదేవి, పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి, ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ ట్రోఫీ, మెడల్స్ ప్రదానం చేశారు. పోటీలను పీడీలు మారుతీ ప్రసాద్, పుల్లా రాఘవేంద్ర, ప్రభాకర్, చంద్రశేఖర్ రెడ్డి, నాగరాజు, ముద్దలాపురం శివ తదితరులు పర్యవేక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే ఏపీ జట్టుకు ఎంపిక చేశారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): బీరువా పగలగొట్టి బంగారు, వెండి, నగదు చోరీకి గురైన ఘటన సోమవారం జక్కంపూడి కాలనీలో చోటుచేసుకుంది. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి కాలనీలో బ్లాక్ నంబర్ 208లో షేక్.నాగూర్బీ, మస్తాన్ దంపతులు నివాసం ఉంటున్నారు. మస్తాన్ ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్ షాపులో పని చేస్తుంటాడు. సోమవారం ఉదయం భార్యాభర్తలు పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన మస్తాన్కు తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో ఇంటి లోపలకు వెళ్లి చూడగా, బీరువా తాళాలు పగలగొట్టి అందులోని వస్తువులను చిందర వందరగా పడేసి ఉన్నాయి. బీరువాలో దాచిన 12 గ్రాముల బంగారపు వస్తువులు, 15 తులాల వెండి పట్టీలు, రూ.10 వేల నగదు కనిపించలేదు. దీంతో వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పెనమలూరు: పోరంకిలో గంజాయి కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ ఉషారాణి తెలిపిన వివరాల ప్రకారం పోరంకి బీజేఆర్ నగర్ వద్ద పోలీస్ సిబ్బంది పర్యటిస్తుండగా సంచితో ఉన్న ఏడుగురు వ్యక్తులు పారిపోయే యత్నం చేశారు. వారిలో నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకోగా ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. దొరికిన వ్యక్తుల వద్ద సంచి స్వాధీనం చేసుకోని తనిఖీ చేయగా అందులో కేజీన్నర గంజాయి గుర్తించారు. నిందితులపై కేసు నమో దు చేసి అరెస్ట్ చేశారు. పరారైన ముగ్గురు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కార్తిక శోభ
మండల దీక్షల స్వీకరణకు తరలివస్తున్న భక్తులు విజయవాడ దుర్గా ఘాట్లో కార్తిక శోభ నెలకొంది. కార్తిక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారు జామునే పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి, పూజలు చేసి నదిలో దీపాలను వదిలారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ వారి మండల దీక్షల స్వీకరణ కొనసాగుతోంది. ఏకాదశి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ బుధవారం వరకు కొనసాగుతుంది. మూడో రోజైన సోమవారం మహా మండపం ఆరో అంతస్తులోని ఉత్సవ మూర్తి వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి భవానీ దీక్షలను స్వీకరించారు. దీక్షల స్వీకరణకు విచ్చేసిన భక్తులతో దీక్షా మండపం అరుణ వర్ణాన్ని సంతరించుకుంది. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకుని ఉత్సవ మూర్తి వద్ద దీక్షలను స్వీకరించారు. బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు భవానీ దీక్షలను స్వీకరించే అవకాశం ఉందని ఆలయ అర్చకులు పేర్కొంటున్నారు. దుర్గమ్మ సేవలో మంత్రి సంధ్యారాణి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా సోమవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగ తం పలికారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగ తం పలకగా, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ లు జరిపించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. అన్నదానం, లడ్డూ పోటులను పరిశీలించిన ట్రస్ట్ బోర్డు దుర్గగుడి అభివృద్ధి పనుల్లో భాగంగా మహా మండపం వద్ద నిర్మాణంలో ఉన్న లడ్డూపోటు, అన్నదాన భవనాలను దుర్గగుడి ట్రస్ట్బోర్డు చైర్మన్ రాధాకృష్ణ, సభ్యులు, ఆలయ అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ నెల 7వ తేదీన ట్రస్ట్ బోర్డు సమావేశం నేపథ్యంలో ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్న బుద్దా వారి గుడి సమీపంలోని ప్రసాదాల వంటశాలను పరిశీలించారు. అనంతరం మహామండపం ఎదుట నిర్మాణంలో ఉన్న లడ్డూపోటును, అన్నదా నం భవనాలను పరిశీలించారు. కనకదుర్గనగర్, గోశా ల వద్ద ఉన్న దుకాణాలను పరిశీలించారు. ఆయా దుకాణాలలో భక్తులకు విక్రయిస్తున్న పేపరు ముక్క చీరలను ట్రస్ట్బోర్డు సభ్యులు, చైర్మన్ పరిశీలించారు. భక్తులను ఈ విధంగా మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చీరలను విక్రయించే వారి పై కఠిన చర్యలు తీసుకునేలా బోర్డు సమావేశంలో చర్చించాలని సూచించారు. గోశాల వద్ద దుకాణాలు ఫుట్పాత్లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేయడంపై ట్రస్ట్బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసు కోవడం లేదని ప్రశ్నించారు. పర్యటనలో దేవస్థాన అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి సోమవారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. విజయవాడ విద్యాధరపురానికి చెందిన ఎం.అప్పాజీరావు దంపతులు నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని ఆలయ ఈవో శీనానాయక్కు అందించారు. విజయవాడ అయోధ్యనగర్కు చెందిన కె.వెంకటరత్న సుబ్రహ్మణ్య శర్మ, అరుణకుమారి దంపతులు నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని, భవానీపురానికి చెందిన రామలింగేశ్వరరావు, సీతాలక్ష్మి దంపతులు బి.పవన్హర్షిత్ శ్రీరామ్ కుటుంబం ఆలయ అధికారులను కలిసి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
నేటి నుంచి స్కూల్ గేమ్స్ సెలక్షన్స్
గూడూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ క్రీడా విభాగాలలో ఉమ్మడి కృష్ణాజిల్లా అండర్–14, 17 బాలుర, బాలికల జట్ల ఎంపికలు ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ కృష్ణాజిల్లా సెక్రటరీ మత్తి అరుణ తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 4న గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో చెస్, అథ్లెటిక్స్ సెలక్షన్స్, 5న గన్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో యోగా సెలక్షన్స్, గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో వాలీబాల్, ఖోఖో సెలక్షన్స్ జరుగుతాయన్నారు. 6న గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సాఫ్ట్బాల్, బేస్ బాల్ సెలక్షన్స్, 7న గూడూరు జెడ్పీ హైస్కూల్లో కబడ్డీ సెలక్షన్స్ నిర్వహిస్తామని అరుణ చెప్పారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 124 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే డీసీపీ ఉదయరాణి వెళ్లి సమస్యను తెలుసుకుని ఫిర్యాదులు తీసుకున్నారు. అనంతరం ఆయా ఫిర్యాదులపై సంబంధిత ఎస్హెచ్ఓలతో పాటు సిబ్బంది తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూవివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 70, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 10, కొట్లాటకు సంబంధించినవి 1, వివిధ మోసాలపై 4, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి 14, దొంగతనాలపై 3, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించి 22 ఇలా మొత్తం 124 ఫిర్యాదులను డీసీపీ ఉదయరాణి స్వీకరించారు. -
ఎస్జీఎఫ్ తైక్వాండో పోటీల్లో అక్కాచెల్లెళ్ల ప్రతిభ
ఇబ్రహీంపట్నం: రాష్ట్ర స్థాయి స్కూల్గేమ్స్ ఫెడరేషన్ తైక్వాండో పోటీల్లో ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఉత్తమ ప్రతిభ చాటి బంగారు, రజత పతకాలు సాధించారు. ఈ నెల 1, 2 తేదీల్లో ఏలూరులో జరిగిన అండర్–17 పోటీలో చెల్లెలు కలతోటి దామిని బంగారు పతకం సాధించింది. గత 26, 27 తేదీల్లో రైల్వే కోడూరులో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో అండర్–19 పోటీల్లో అక్క కలతోటి హాసిని రజత పతకం కై వసం చేసుకుంది. బంగారు పతకం సాధించిన దామిని జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికై ంది. దామిని గుణదల డాన్బాస్కో పాఠశాలలో తొమ్మిదో తరతగతి చదువుతుండగా, అక్క హాసిని గుంటూరులో ఇంటర్మీడియెట్ చదువుతున్నట్లు తల్లిదండ్రులు రమేష్బాబు, స్నేహలత తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి ఎం.అంకమ్మరావు, పసుపులేటి గౌరీశంకర్ కోచింగ్లో తైక్వాండో పోటీల్లో తమ పిల్లలు రాణిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. దామిని అరుణాచలప్రదేశ్లో జరుగనున్న జాతీయస్థాయిలో పాల్గొని రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రజత పతకం సాధించిన హాసినిని అభినందిస్తున్న నిర్వాహకులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న దామినికి బంగారు పతకం అందజేస్తున్న నిర్వాహకులు రాష్ట్ర స్థాయిలో బంగారు, రజత పతకాలు సొంతం -
చరిత్రలో ఇదే మొదటిసారి..
వసూళ్ల ‘వాణిజ్యం’లో వీరిదే హవాఅటెండ్ల దందా ఇలా.. అధికారులూ ఏం తక్కువ కాదు.. బదిలీలు లేకపోవటమే కారణమా? వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్ల దందా కుటుంబ సభ్యులను అధికారులుగా చూపి ముడుపులు దండుకుంటున్న వైనం అధికారులు సైతం ముడుపుల వసూళ్లకు వీరినే వినియోగిస్తున్న పరిస్థితి దీనిని అలుసుగా తీసుకొని రెచ్చిపోతున్న అటెండర్లు ఒక అటెండర్ను ఏసీబీ పట్టుకోవటం మొదటిసారి అంటున్న అధికారులు సస్పెండ్ అవుతున్నా వెనుకకు తగ్గని వైనం -
తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే
రాష్ట్రంలో ప్రజలకే కాదు.. ఆలయాల్లో భక్తులకూ భద్రత కరువైంది● కాశీబుగ్గ ఘటనలో మృతులకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి ● ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ ● విజయవాడలో కాశీబుగ్గ మృతులకు సంతాపంగా వైఎస్సార్ సీపీ క్యాండిల్ ర్యాలీ లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ప్రజలకే కాదు.. ఆలయాలకు వచ్చే భక్తులకూ భద్రత కరువైందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. చంద్రబాబు పాలన అంటే అన్ని వర్గాలు భయాందోళనతో బతకాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతులకు సంతాపకంగా.. వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు అంటూ నినాదాలు చేశారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన చేతకాని తనం, నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎంత మంది మృతి చెందారో చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఒకవైపు పాలన గాలికొదిలేసి, లా అండ్ ఆర్డర్ను పట్టించుకోకపోవడం వల్ల ప్రజల భద్రత, ముఖ్యంగా దేవాలయాలకు వెళ్లే భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ చేసి విష ప్రచారం మొదలుకొని, దేవుళ్ల పేరుతో చంద్రబాబు తన రాక్షస రాజకీయంతో అనేక విషాదాలు, ఘోరా లు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రచార పిచ్చితో గోదా వరి పుష్కరాల్లో 20 మంది మృతి చెందారన్నారు. సనాతన ధర్మం అని చెప్పిన పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. పార్టీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ హోం మంత్రి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, భక్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. రాజకీయాలకు తిరుపతి లడ్డూని వాడుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జగ్గయ్యపేట వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరావు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నత్తా యోనారాజు, ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు విజిత, నేతలు రవిచంద్ర, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆలయాల్లో జరిగిన అపచారాలు, ఘోరాలు అన్నీ ఇన్నీ కావన్నారు. శ్రీకూర్మంలో తాబేళ్లపార్కు నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంతో తాబేళ్లు మృత్యువాత, టీటీడీ బోర్డులో క్రిమినల్ కేసులున్న వారికి సభ్యత్వం, తిరుమలలోని గోశాలలో వందకు పైగా గోవులు మృతి వంటి అనేక అపచారాలు జరిగాయన్నారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏకాదశి సందర్భంగా భక్తులు వస్తారని తెలిసినా కాశీబుగ్గలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పుడు ప్రైవేటు ఆలయం, ఎలాంటి సమాచారం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రొద్దుటూరు శ్రీ వాసవీ పరమేశ్వరి ఆలయం, అనకాపల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, సీతానగరంలో విజయకీలాద్రి, ద్వారంపూడిలో అయ్యప్పస్వామి ఆలయం వంటి అనేక ప్రైవేటు ఆలయాలు ఉన్నాయని, పర్వదినాలు, వేడుకల సమయంలో భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. తిరుమల తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలంలో జరిగిన ఘటనలో ఏడుగురు భక్తులు బలయ్యారన్నారు. ఇప్పుడు కాశీబుగ్గలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్కు మరో ముగ్గురు డీసీపీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్కు మరో ముగ్గురు డీసీపీలు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా కృష్ణకాంత్ పటేల్ను విజయవాడ సిటీ డెప్యూటీ కమిషనర్గా, షేక్ షిరీన్ బేగంను ట్రాఫిక్ డీసీపీగా నియమించారు. అలాగే జిల్లా రూరల్ డీసీపీగా లక్ష్మీనారాయణను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో డిసెంబర్ 13న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తాల గోపీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ లోక్అదాలత్ను నిర్వహిస్తున్నామని సివిల్, క్రిమినల్, కాంపౌండబుల్ కేసులతో పాటు అన్ని రకాల కేసులు పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు తమతమ న్యాయవాదులను సంప్రదించి లోక్అదాలత్కు సిఫార్సు చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. మచిలీపట్నంటౌన్: పాండురంగ స్వామి వారి కార్తిక శుద్ధ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారి రథోత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం ఆలయం వద్ద ప్రారంభమైన ఈ రథోత్సవం పురవీధుల గుండా ముందుకు సాగి తెల్లవారు జామున ఆలయానికి చేరింది. స్వామివారి దర్శనం కోసం ప్రజలు గుంపులు గుంపులుగా ఎదురొ చ్చి హారతులు ఇచ్చి టెంకాయలు కొట్టి మొక్కు లు తీర్చుకున్నారు. రథోత్సవం ముందు భాగా న డోలు సన్నాయి వాయిద్యాలతో పాటు మహిళల కోలాటం, డప్పు కళాకారుల విన్యాసాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆలయంలో ఉదయం స్వామివారికి ద్వాదశి పారాయణ, శ్రీ లక్ష్మీ సుదర్శన హోమం వంటి పూజా కార్యక్రమాలను ఆలయ నిర్వాహకుడు టేకి నరసింహం పర్యవేక్షణలో నిర్వహించారు. రథోత్సవంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కిట్టు, గోల్డ్ ప్రిన్స్ అధినేత తిరుమలశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు: కార్తిక మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పెనుగంచిప్రోలులో వేంచేసి ఉన్న తిరుపతమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని పూజలు నిర్వహించారు. షేక్ షిరీన్ బేగం కృష్ణకాంత్ పటేల్ -
అవినీతిపై పోరాటానికి ముందుకు రావాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజాభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని, దాన్ని పారదోలాల్సిన అవసరం ఉందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్–2025లో భాగంగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీజీ అతుల్ సింగ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభమైన విజిలెన్స్ అవేర్ నెస్ వీక్ నవంబర్ రెండో తేదీతో ముగుస్తుందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీని చేపట్టామన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతిల్లో కూడా సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫిర్యాదు చేయండి.. అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేయాలనుకుంటే 1064కు కాల్ చేయవచ్చని ఏసీబీ డీజీ చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ బెంజ్ సర్కిల్ మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వరకూ వెళ్లి తిరిగి ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుంది. ఏసీబీ డైరెక్టర్ ఆర్. జయ లక్ష్మి, హెడ్ క్వార్టర్స్ అడిషనల్ ఎస్పీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ -
భక్తుల్లేకుండా కోటి దీపోత్సవం
ప్రభుత్వ ఆదేశాలతో ఇంద్రకీలాద్రి దేవస్థాన నిర్ణయం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక పౌర్ణమిన నిర్వహించే కోటి దీపోత్సవంలో భక్తులు పాల్గొనే అవకాశం లేదని దుర్గగుడి అధికారులు ప్రకటించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైగల శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 5వ తేదీ బుధవారం కార్తిక పౌర్ణమి కోటి దీపోత్సవం జరుగుతుంది. ఏటా కోటి దీపోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలను వెలిగిస్తారు. అయితే ఇటీవల రాష్ట్రంలోని కొన్ని ఆలయాల్లో చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశమైన ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ వైదిక కమిటీ, ముఖ్య అధికారులు, పోలీసు అధికారులు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్గత కార్యక్రమంగానే.. 5వ తేదీ బుధవారం కార్తిక పౌర్ణమిన ఆలయంలో జరిగే దీపోత్సవాన్ని అంతర్గత కార్యక్రమంగా నిర్వహించాలని అధికారులు సూచించగా, వైదిక కమిటీ అంగీకారం తెలిపింది. ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు మాత్రమే దీపోత్సవాన్ని ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వహించాలని నిర్ణయించారు. భద్రత రీత్యా ఈ కార్యక్రమంలో భక్తులెవరినీ అనుమించడం లేదని ఆలయ అధికారులు ప్రకటించారు. అదే విధంగా డిసెంబర్ 4న జరిగే కలశజ్యోతి ఊరేగింపు, దీక్ష విరమణలపై కూడా చర్చ సాగింది. అయితే ఆలయ అధికారుల నిర్ణయం, ప్రభుత్వ తీరుపై భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదాయం రూ. 9.25 లక్షలు
మోపిదేవి:శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆదివారం ఒక్కరోజు ఆదాయం రూ. 9,25,419 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. సేవా టిక్కెట్ల ద్వారా రూ. 4,89,208, లడ్డూ ప్రసాదం రూ.2,30,820, నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా రూ. 95,521, స్వామివారి దర్శనం టెక్కట్ల ద్వారా రూ. 41,200, శాశ్వత అన్నదానం నిమిత్తం రూ. 31,450, వంటి తదితర సేవా టిక్కెట్ల ద్వారా మొత్తం రూ. 9,25,419 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లన్నీ భక్తజనంతో కళకళలాడాయి. ఆలయం వెలుపల భారీ ట్రాఫిక్ ఏర్పటింది. మోపిదేవి గుడి వద్ద ప్రధాన రహదారికి ఇరువైపుల భక్తుల వాహనాలు నిలిచాయి. పెనమలూరు:గోసాల వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందటంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... గోసాల పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి (65)ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి తెల్ల చొక్కా, గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. మృతుడి సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలపాలని కోరారు. బస్సు ఢీకొని వ్యక్తి...కృష్ణలంక:ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యకి దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన కట్టా గురవయ్య(55) ఓల్డేజ్ హోమ్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం ఉదయం గురువయ్య తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇబ్రహీపట్నంలో ఉంటున్న పెద్ద కుమార్తె వద్దకు వెళ్లారు. తిరిగి ప్రకాశం బ్యారేజీ మీదుగా నరసరావుపేటకు వెళ్లే క్రమంలో రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. దీంతో గురవయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు. -
కిడ్నీవ్యాధితో వృద్ధుడి మృతి
తిరువూరు: ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు దీప్లానగర్ తండాలో కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం జరపల మంగ్యా (60) మృతి చెందాడు. గత ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మంగ్యా వైద్య ఖర్చుల నిమిత్తం లక్షలాది రూపాయలు వెచ్చించినా ప్రయోజనం లేకపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం. మంగ్యా మృతదేహాన్ని సీపీఎం మండల కార్యదర్శి పానెం ఆనందరావు, స్థానిక నాయకులు ఆళ్ల అమ్మిరెడ్డి తదితరులు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కృష్ణా నదీ జలాల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో కిడ్నీరోగుల సంఖ్య పెరుగుతోందని, మండలంలో కిడ్నీ రోగులకు వైద్యసేవలందించడంలో కూడా ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని వారు విమర్శించారు. -
గొంతు వినపడకూడదనే అరెస్ట్
లిక్కర్ స్కామ్లో జోగి రమేష్కు ఎలాంటి సంబంధం లేదు. ఎలాగైనా రమే ష్ను అరెస్ట్ చేయాలని, తప్పుడు కేసులు పెట్టి కాశీబుగ్గ విషయాన్ని డైవర్ట్ చేయాలని అరెస్ట్ చేశారు. జనార్దన్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు విడుదల చేసిన తర్వాత తాను ఎలాంటి పరీక్షకై నా సిద్ధమేనని, బహిరంగంగా ప్రకటించారు. అయినా కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే జోగిని అరెస్ట్ చేసింది. జోగి రమేష్ సచ్చీలుడిగా బయటకు వస్తారు. – వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి -
సర్కారు కొర్రీ.. రైతన్న వర్రీ..
కంకిపాడు: కూటమి సర్కారు రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలు ఈ ఆరోపణలు, విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఆపదలో ఆదుకోవాల్సిన సర్కారు నిర్లక్ష్యం కనబర్చటంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. తుపానుతో పంట నష్టపోయి పెట్టుబడులు కోల్పోయి ఆందోళన చెందుతున్న తరుణంలో రైతులపై మరో పిడుగు పడినట్లయింది. పంట నష్టపరిహారం నమోదు చేస్తే ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదంటూ అధికారులు చెబుతున్న మాటలే ఇందుకు కారణం. పంటపై పెట్టిన పెట్టుబడులతో పోలిస్తే అరకొర సాయంతో చేతులు దులుపుకుంటూ ఆఖరికి ధాన్యం కొనుగోలు చేయకపోతే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా..... కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.54 లక్షల హెక్టార్లలో వరి, 24 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగయ్యాయి. అరటి, కంద, పసుపు, తమలపాకు, కూరగాయలు, బొప్పాయి, ఇతర పంటలు సైతం ఉన్నాయి. ప్రధానంగా వరి పంట ప్రస్తుతం చేతికొచ్చే తరుణం. మరో పది రోజుల్లో వరి కోతలు ప్రారంభమై ధాన్యం మార్కెట్కు చేరుతుంది. ఇప్పటికే ఒక్కో రైతు ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకూ పెట్టుబడులు పెట్టి దిగుబడి కోసం ఆశగా ఉన్న తరుణం. అకాల వర్షాలు, తుపానుతో నష్టం.... ఈ ఏడాది అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా నష్టపరిచాయి. దీనికి తోడు పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుపాను విరుచుకుపడింది. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 427 గ్రామాల్లో 56,040 మంది రైతులు 46,357 హెక్టార్లలో పంటలు దెబ్బతిని తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ప్రత్యేకించి 54,180 మంది రైతులకు చెందిన 45,040 హెక్టార్లలో వరి పంట నేలవాలింది. వరిపైరు చిరుపొట్ట, కంకులు గట్టిపడే దశలో ఉన్నాయి. ఈ సమయంలో తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పైర్లు నేలవాలి కంకులు రాలి, సుంకు దెబ్బతినటంతో పాటుగా మడమ తాలు, తాలు, తప్ప ఏర్పడ్డాయి. మానుగాయ, పాకుడుతో పంటకు నష్టం వాటిల్లుతోంది. పంటపై పెట్టిన పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 45 బస్తాల వరకూ దిగుబడులు వస్తాయని ఆశించిన రైతులు నేడు కనీసం 20 బస్తాలైనా చేతికొస్తాయో? లేదో? అన్న ఆందోళనలో మునిగిపోతున్నారు. ఆ దిగుబడులతో కౌలు డబ్బులే కట్టాలో?, పెట్టుబడులే చూసుకోవాలో అర్థం కావటం లేదంటూ వాపోతున్నారు. అప్పుడే నిబంధనల కొర్రీ.... తుపాను గాయం నుంచి రైతులు ఇంకా కోలుకోకముందే ప్రభుత్వం విధించే నిబంధనల కొర్రీతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పంట నష్టపరిహారం నమోదు చేయించుకునే రైతుల నుంచి రానున్న ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉండదంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. అంతకు ఇష్టమైతేనే పేర్లు నమోదుచేయించుకోమంటూ చెప్పటం గమనార్హం. దీంతో పంటలో సగం దిగుబడి వచ్చినా ఆ పంటను ఎక్కడ అమ్ముకోవాలనే ప్రశ్న తలెత్తటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాలు తప్ప వచ్చి పంట పోయినా మిగిలిన పంటకై నా మద్దతు ధర దక్కితే పెట్టుబడులు చేతికి రాకపోయినా కౌలు చెల్లింపు సజావుగా సాగుతుందన్న ఆశాభావంతో అన్నదాతలు ఉన్నారు. నష్టపరిహారం నమోదు సమయంలోనే నిబంధనల పేరుతో తిరకాసు పెట్టడం, వ్యవసాయ సహాయకులు గ్రామస్థాయిలో ఈ విషయాన్ని ఘంటాపథంగా చెప్పటంతో రైతులకు దిక్కుతోచటం లేదు. ప్రభుత్వం అందించే అరకొర సాయంతో సరిపెట్టుకునేందుకు కొందరు రైతులు వెనుకాడుతున్నారు. వచ్చిన కాస్త దిగుబడిని మద్దతుకు అమ్ముకుంటామని చెబుతున్నారు. పంట నష్టపరిహారం అందించిన తరువాత పంట దిగుబడులు కొనుగోలు సాధ్యం కాదు. గతంలోనూ ఇదే జరిగింది. ఈ సీజన్లో ఆ సమస్య తలెత్తకుండా ముందుగానే క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంట దెబ్బతిన్నాక దిగుబడులు ఊసే ఉండదు. అయినా ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధిస్తుందో తెలీదు. నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. –ఎన్.పద్మావతి, జిల్లా వ్యవసాయాధికారి, కృష్ణాజిల్లా ప్రభుత్వం ఇచ్చే సాయం అరకొరే. అది కనీసం కూలీ ఖర్చులకు కూడా సరిపోదు. తుపాను నుంచి బయటపడ్డ మిగిలిన పంటను అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలి. రైతులకు మద్దతు ధర దక్కేలా చేయాలి. లేకపోతే కౌలుచెల్లింపులు ఎలా సాధ్యం. ఇప్పటికే పెట్టుబడులు పూర్తిగా కోల్పోతున్నాం. రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. – యలమంచిలి సత్యమోహన్, కౌలురైతు, గొడవర్రు, కంకిపాడు మండలం -
ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్
పాయకాపురం(విజయవాడ రూరల్): క్యోఇకు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ –2025 శాంతినగర్ లోని కరాటే డోజోలో ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో వివిధ జిల్లాల నుంచి 200 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యఅతిఽథులుగా ఆదిత్య డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ ఎస్.జగదీశ్వరి, శ్రీవిద్య కాలేజి ప్రిన్సిపాల్ ఆర్.దామోదర్ రావు, మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ జయ ప్రకాష్ పాల్గొని కరాటే ప్రాధాన్యతను వివరించారు. గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్, బ్రాంచ్ మెడల్స్ని అందచేశారు. కరాటే మాస్టర్లు సెన్సాయ్ ఎస్.దుర్గారావు, పి.మురళి, ఎం.కరుణాకర్, వీటి బద్రినాఽథ్, డి.ప్రభాకర్, శేఖర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. నిర్వాహకులు బల్లం కిషోర్ టోర్నమెంట్ను విజయవంతం కావడానికి సహకరించినవారికి ధన్యవాదాలు తెలియచేశారు. -
స్మృతివనం నిర్వహణపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): స్మృతివనం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మహనీయునికి విశిష్ట గౌరవం కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్.మల్లికార్జునరావు, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంలతో కలిసి సమన్వయ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించిన అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ స్మృతివనం నిర్వహణలో ఎలాంటి అలసత్వానికి చోటులేదని చెప్పారు. ఇప్పటివరకు నిర్వహణ బాధ్యతలు చూసిన కాంట్రాక్టు సంస్థను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ సంస్థను ఆదేశించామని తెలిపారు. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే బ్లాక్లిస్ట్లో పెడతామని హెచ్చరించారు. స్మృతివనం నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలకు అప్పగించిందని వెల్లడించారు. ఈ శాఖల ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా నిరంతర కృషి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో విజయవాడ నగర పాలక సంస్థ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు, ఏపీఐఐసీ, సాంఘిక సంక్షేమం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం
గన్నవరం: సమస్యల పరిష్కారం కోసం పోరాటామే ఏకై క మార్గమని ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక చింతపల్లి పాపారావు భవన్ ప్రాంగణంలో ఆదివారం యూనియన్ 9వ మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ధ్వజమెత్తారు. కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కాగితాలకే పరిమితమవుతున్నాయని చెప్పారు. కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో కార్మికులు నిరంతరం సమస్యలతో సహజీవనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాలు పెంచుతామనే హామీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. తొలుత యూనియన్ పతకాన్ని సంఘ నాయకులు నాగమణి అవిష్కరించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం. పోలినాయుడు, బుద్దవరం సర్పంచి బడుగు బాలమ్మ, సీఐటీయూ నేతలు బెజవాడ తాతబ్బాయి, కె. రామరాజు, సీపీఎం నేతలు ఎం. ఆంజనేయులు, సూరగాని సాంబశివరావు, కై లే ఏసుదాసు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక.... అనంతరం జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా కె. శ్రీనివాసరావు, ఎం. పోలినాయుడు, ఆఫీస్ బేరర్స్గా ఎం. గణేష్, పి. కృష్ణకుమారి, ఎం. ప్రభుశేఖర్, టి. అబ్రహం, కె.రాజేష్, వి.శ్రీనివాసరావు, ఎం.జగన్, ఎం.రామకృష్ణ, మరో 18 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆది దంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, శాంతి కల్యాణంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. మరోవైపున అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనం క్యూలైన్తో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెటు క్యూలైన్లలో భక్తుల తాకిడి కనిపించింది. భక్తుల రద్దీతో అమ్మవారి దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. దుర్గాఘాట్లో రద్దీ... కార్తిక మాసం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన యాత్రికులు, భక్తులు దుర్గాఘాట్లో పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కొంత మంది భక్తులు దేవస్థాన కేశకండనశాలలో తలనీలాలు సమర్పించిన అనంతరం నదీతీరంలో స్నానాలు ఆచరించి అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థాన ఘాట్రోడ్డుతో పాటు మహామండపం మెట్లు, లిప్టు మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా మహా మండపం 5వ అంతస్తు వరకే లిప్టులను అనుమతించారు. అక్కడి నుంచి భక్తులు క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకున్నారు. లోక కళ్యాణార్ధం సూర్యోపాసన సేవ దుర్గగుడిలో లోక కళ్యాణార్ధం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్యభగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా, పలువురు ఉభయదాతలు సేవలో పాల్గొన్నారు. -
చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్టు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్):దేవాలయంలో హుండి పగులకొట్టి నగదు చోరీతో పాటుగా ఆటో, ద్విచక్ర వాహనం దొంగిలించిన నిందితుడిని ఎస్ఎన్పురం పోలీసులు అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎస్వీవీ లక్ష్మీనారాయణతో కలసి నార్త్జోన్ ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్ వివరాలు వెల్లడించారు. దాసాంజనేస్వామి ఆలయంలో గత నెల 27న హుండీ పగులకొట్టి నగదు చోరీకి గురైనట్లు వచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరానికి పాల్పడింది ప్రకాశం జిల్లాకు చెందిన రామనబోయిన శ్రీనుగా గుర్తించి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు ఆదివారం రైల్వేస్టేషన్ సమీపంలోని బొగ్గులైన్ క్వార్టర్స్ వద్ద ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. విచారణలో నిందితుడు హుండీలో చోరీ చేసిన నగదులో కొంతభాగం బొగ్గు లైన్ క్వార్ట్ర్స్ వద్ద పొదల్లో దాచినట్లు చెప్పారు. మరికొంత సొమ్ముతో కర్నూలు బస్సు ఎక్కి వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. తన వద్ద ఉన్న సొమ్ము అయిపోవడంతో దాచిపెట్టుకున్న సొమ్మును తీసుకువెళ్లేందుకు బొగ్గు లైన్ క్వార్టర్స్కు రాగా పోలీసులు పట్టుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి రూ. 18వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆటో, ద్విచక్ర వాహనం చోరీ కేసులో ఎనికేపాడుకు చెందిన పెనుగోతు మురళిగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. చోరీకి గురైన ఒక ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
వెలకట్టలేని త్యాగం.. వెలుగులు నింపిన ప్రాణం
గుడివాడరూరల్: అవయవ దానం ద్వారా నలుగురు జీవితాల్లో చిరు వ్యాపారి వెలుగులు నింపి సజీవంగా నిలిచారు. పట్టణంలోని బంటుమిల్లిరోడ్డు పెద్ద మసీదు వద్ద నివసించే చిరు వ్యాపారి హరి విజయకుమార్ (46) బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానమిచ్చి ఆదర్శంగా నిలిచారు. మూత్రపిండం, కాలేయం మణిపాల్ ఆసుపత్రికి అందచేయగా విజయవాడలో అవసరమైన వారికి అవయవ మార్పిడి నిర్వహించారు. మరో కిడ్నీ విజయవాడ కామినేని హాస్పటల్కు, నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించారు. గత నెల 30వ తేదీన హరి విజయ్కుమార్ గుడివాడ నుంచి బ్యాంక్ పని నిమిత్తం మంగళగిరి వెళ్లారు. ఈక్రమంలో ఆయనకు ఆకస్మికంగా ఫిట్స్ రావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్లో తీవ్ర రక్తస్త్రావం అయిందని గుర్తించి మెరుగైన వైద్యం కోసం మణిపాల్ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు అవసరమైన పరీక్షలు చేసి బ్రెయిన్డెడ్ అని నిర్థారించారు. ఈ నేపధ్యంలో భార్య యోగవిష్ణు ప్రియ, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఏపీ జీవన్ దాన్ చైర్మన్ డాక్టర్ రాంబాబు, మణిపాల్ వైద్యశాల డైరెక్టర్ రామాంజనేయరెడ్డి పర్యవేక్షణలో అవయవదానం చేశారు. దాత కుటుంబానికి మణిపాల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. మరణించిన తర్వాత కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపిన విజయ్కుమార్ కుటుంబ సభ్యులను గుడివాడకు చెందిన సేవాతత్పరులు పలువురు ఆదివారం అభినందించారు. నేత్రదానం, రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజయ్కుమార్ కుటుంబ సన్నిహితుడు దాసరి మహేష్ తెలిపారు. కష్టకాలంలో 10 మందికి మంచి చేయాలని మిత్రుడు విజయ్ కుటుంబ సభ్యులు చేసిన గొప్ప పనిని ఆయన అభినందించారు. జనసేన కార్యకర్త అయిన విజయ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఆయన కుటుంబ పరిస్థితి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని మహేష్ చెప్పారు. బ్రెయిన్డెడ్ వ్యక్తి అవయవాల దానం చేసిన కుటుంబ సభ్యులు -
షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్లు ఎంపిక
గన్నవరం: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ అండర్–17 బాల, బాలికల ఉమ్మడి కృష్ణా జిల్లా జట్ల ఎంపిక ప్రకియ ఆదివారం ముగిసింది. స్థానిక కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ సెలక్షన్స్కు ఉమ్మడి జిల్లాలోని ఆరు డివిజన్లకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాల, బాలికలు ఐదుగురు చొప్పున జిల్లా జట్లకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి జి.రాంబాబు తెలిపారు. అలాగే అండర్–14 గుడివాడ డివిజన్ ఎంపికలు కూడా నిర్వహించినట్లు చెప్పారు. ముగింపు వేడుకల్లో స్రవంతి హైస్కూల్ ప్రిన్సిపాల్ కొమ్మినేని రామకృష్ణ పాల్గొని ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటి పతకాలతో తిరిగిరావాలని ఆకాంక్షించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి.ఆర్. కిషోర్, నియోజకవర్గ క్రీడా సమన్వయకర్త డి. నాగరాజు, హీల్ సంస్థ ప్రతినిధి బి.సత్యనారాయణరావు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాలుర జట్టు... టి. శేషసాయిశ్రీనివాస్(ఎన్ఆర్ఎస్వీఆర్ కళాశాల, మైలవరం), ఇ. చరణ్(శ్రీచైతన్య స్కూల్, విజయవాడ), షోయాబ్ఖాన్(డీఏవీ స్కూల్, ఇబ్రహీంపట్నం), పి.తేజస్విన్(లయోలా కళాశాల, విజయవాడ), పి. షాషిష్(ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నిడమానూరు) స్టాండ్బై: వి.ఓంకార్(శ్రీచైతన్య స్కూల్, విజయవాడ). బాలికల జట్టు... ఐ.తన్వి(ఎట్కిన్సన్ స్కూల్, విజయవాడ), కె. తనూజ(కృష్ణవేణి కళాశాల, విజయవాడ), ఆర్. యస్వితసాయి(శ్రీచైతన్య స్కూల్, విజయవాడ), డి. తేజస్విని(నారాయణ స్కూల్, భవానిపురం), బి. వర్షిణి(ఎన్ఎస్ఎం స్కూల్, విజయవాడ) స్టాండ్ బైః వి. ఆస్థ(స్టాన్రాక్ స్కూల్) -
తాలుతో పెట్టుబడులు నీటిపాలు..
మంతెన పరిసరాల్లో పైర్లు ఇంకో 20 రోజుల్లో చేతికి అందుతాయి. మొన్న తుపానుతో పైర్లు నేలమట్టం అయ్యాయి. కంకులు ఇప్పడే సుంకు పోసుకుంటున్నాయి. వర్షం దెబ్బకు తాలు తప్ప ఏర్పడ్డాయి. మడమతాలు వచ్చేసింది. ఇక గింజ కూడా గట్టిపడే పరిస్థితి లేదు. ఎకరాకు పెట్టిన రూ. 30 వేలు పెట్టుబడి నీటిపాలైనట్టే. రైతుల గోడు పట్టించుకునే నాథులు లేరు. – కొండవీటి వెంకట సుబ్బారావు, రైతు, మంతెన, కంకిపాడు మండలం కృష్ణాజిల్లా -
రైతుకు పరిహారం అందేవరకు పోరాడుతాం
పెనుగంచిప్రోలు: మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించేంత వరకు పోరాడుతామని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండి తోక జగన్మోహనరావు, పార్టీ జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి శనివారం ఆయన నందిగామ మండలంలోని మాగల్లు, పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదుర్రు, అనిగండ్లపాడు, ముచ్చింతాల, పెనుగంచిప్రోలులో వరద ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతుల ముఖాల్లో ఆనందం చూశామని, ప్రభుత్వమే పంటల బీమా చేసి ఆపత్కాలంలో వారిని ఆదుకుందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పంటలకు బీమా చెల్లించకుండా చేతులెత్తేసిందన్నారు. గండ్లు పూడ్చకపోవడంతోనే... మునేరు తువ్వకాలువకు గత ఏడాది సెప్టెంబర్ నెలలో వచ్చిన తుపానుకు 50 గండ్లు పడితే ఏడాది దాటినా ఆ గండ్లు పూడ్చక పోవటంతో పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో 2,500 ఎకరాల్లో వరి నీట మునిగి రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తువ్వ కాలువకు గండ్లు పడితే వెంటనే పూడ్చామని గుర్తు చేశారు. తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ వరికి కౌలుతో కలుపుకొని ఎకరానికి రూ.50 వేలు రైతులు పెట్టుబడి పెట్టారని, పంట చేతికొచ్చే సమయంలో రైతులు నష్టపోయారన్నారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ జగనన్న పాలనలో పంట నష్టపోతే నష్టపరిహారం వెంటనే ఇచ్చి రైతులను ఆదుకుందన్నారు. పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరుమామిళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తువ్వ కాలువ గండ్లు ఏడాదైనా పూడ్చని అసమర్ధ ప్రభుత్వం పంటల బీమా చెల్లించకుండా చేతులెత్తేసిన సర్కారు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
దుర్గమ్మ నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు శనివారం విరాళాలను అందజేశారు. విజయవాడ సమీపంలోని పోరంకికి చెందిన బండి మౌనిక కుటుంబం రూ.1.03 లక్షలు, అజిత్ సింగ్నగర్కు చెందిన కె. రామారావు దంపతులు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించే లక్ష్యంతో నగదు ప్రోత్సాహక పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, క్రీడల అభివృద్ధి అధికారి కె. కోటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడా పతక విజేతల నుంచి శాప్ (ఎస్ఏఏపీ) క్రీడా యాప్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని అర్హత కలిగిన క్రీడాకారులు ఈనెల 4వ తేదీ రాత్రి 11.59 గంటల లోగా స్పోర్ట్స్.ఏపీ.జీవోవి.ఇన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించాలని ఆయన వివరించారు. గుడివాడ టౌన్: ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి ఓపెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. శనివారం విజేతలకు బహుమతులు అందజేశారు. మొత్తం 120మంది క్రీడాకారులు పాల్గొనగా 19 కేటగిరీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. పురుషుల విభాగంలో సీహెచ్ లితీష్ అనిల్ సాయి స్టాంగ్మ్యాన్గా.. ఎన్. వీర నాగు అను స్ట్రాంగ్ ఉమెన్గా ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు. స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి రంగప్రసాద్, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. వెంకట్రావు, కార్యదర్శి వి. మల్లేశ్వరరావు పాల్గొన్నారు. -
పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి
నా సొంత పొలంతో పాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని 10 ఎకరాలు పత్తి, 9 ఎకరాలు మిర్చి, 15 మొక్కజొన్న, వరి 8 ఎకరాలు చేశా. పత్తి ఎకరానికి రూ. 35 వేలు, మొక్కజొన్న ఎకరానికి రూ.30వేలు, మిర్చి ఎకరానికి ఇప్పటికి 65వేల, వరి సాగుకు ఎకరానికి రూ.25వేలు అయ్యింది. తుపాను దెబ్బతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. చేసిన అప్పులు ఏ విధంగా తీర్చాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – కొండపల్లి శ్రీకాంత్ రైతు, గొట్టుముక్కల, కంచికచర్ల మండలం -
దుర్గమ్మ మండల దీక్షలు ప్రారంభం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న దుర్గమ్మ వారి మండల దీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం అమ్మవారి ప్రధాన ఆలయంలోని మూలవిరాట్కు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం పగడాల మాలను అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా పూలతో అలంకరించిన పల్లకీపై ఊరేగింపుగా మహా మండపం ఆరో అంతస్తుకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తీసుకొచ్చారు. మహామండపం ఆరో అంతస్తులో వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తి అధిరోహించిన అనంతరం కలశస్థాపన, గణపతి పూజ, అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు. అమ్మవారి ఉత్సవ మూర్తికి అలంకరించిన ఎరుపురంగు పూసల దండలను భక్తుల మెడలో వేసి దీక్షలను ప్రారంభించారు. పూజా కార్యక్రమాలను ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించగా, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఏఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు. కార్తిక ఏకాదశిన ప్రారంభమైన మండల దీక్షల స్వీకరణ కార్యక్రమం కార్తిక పౌర్ణమి 5వ తేదీ వరకు కొనసాగుతాయని అర్చకులు పేర్కొన్నారు. భవానీ మండల దీక్షల ప్రారంభాన్ని పురస్కరించుకొని అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆరో అంతస్తులోని వేదిక, ఆలయంలోకి ప్రవేశించే అన్ని మార్గాలను రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఏకాదశి పుణ్య స్నానాలు.. అమ్మవారి దీక్షలు స్వీకరించే భక్తులు తెల్లవారుజామునే దుర్గాఘాట్కు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం దుర్గగుడి ఘాట్ రోడ్డులోని కామథేను అమ్మవారితో పాటు మహా మండపం ఆరో అంతస్తుకు తరలివచ్చి ఆలయ అర్చకుల చేతుల మీదుగా దీక్షలను స్వీకరించారు. కార్తిక ఏకాదశి నేపథ్యంలో మహిళలు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం కార్తిక దీపాలను వెలిగించారు.చిన్నారులకు మాలధారణ చేయిస్తున్న గురుస్వామి -
గిరిజన యోధుల త్యాగాలు చిరస్మరణీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రాణాలను పణంగా పెట్టి భావితరాలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందించాలనే మహోన్నత లక్ష్యంతో ఎందరో గిరిజన యోధులు గొప్ప పోరాటాలు చేశారని, వారి త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఈ నెల 15న జన జాతీయ గౌరవ దినోత్సవం (బిర్సా ముండా జయంతి) సందర్భంగా ఆ రోజు వరకు గిరిజన స్వాభిమాన ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం జరిగింది. గిరిజన సంక్షేమం కోసం విశేష కృషి చేస్తున్న వారితో కలిసి బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, గాం గంటం దొర తదితర యోధుల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సద్వినియోగం చేసుకోవాలి.. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం, ఆరోగ్యం కోసం వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎ.కొండూరు, గిరిజన తండాల్లోని గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన స్వాభిమాన ఉత్సవాల ప్రాధాన్యతను జిల్లా గిరిజన సంక్షేమం, సాధికారత అధికారి ముదిగొండ ఫణి ధూర్జటి వివరించారు. గిరిజనుల విద్యకు, నైపుణ్యాభివృద్ధికి బాల భవన్ చేస్తున్న కృషిని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోసఫ్ తంబి వివరించారు. బ్రిటీష్ వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న యోధునిగా గుర్తింపు సాధించిన భగవాన్ బిర్సా ముండా పోరాట పటిమను, ఆయన ఆశయాలను డాక్టర్ బి.జ్యోతిలాల్ నాయక్ వివరించారు. -
అన్నదాత ఆశలను చిదిమేసిన ‘మోంథా’
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మోంథా తుపాను అన్నదాతలకు గుండె కోతను మిగిల్చింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు రైతుల ఆశలు నేలకు వాలాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో పంట నీటి పాలై, తీవ్ర నష్టాలు మిగిలాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. కోతకు వచ్చిన వరితోపాటు, చిరుపొట్ట, కంకి, గింజ గట్టి పడే దశలో ఉన్న పైరు నేలకొరిగింది. పత్తి, మిరప, మొక్కజొన్న, వేరుశనగ అరటి, బొప్పాయి, కూరగాయల పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం కృష్ణా జిల్లాలో వ్యవసాయ పంటలు 1,15,692.5లక్షల ఎకరాలు, ఉద్యాన పంటలు 3540.55 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ జిల్లాలో వ్యవసాయ పంటలు 42,483 ఎకరాలు, ఉద్యాన పంటలకు 586.5 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. క్షేత్ర స్థాయిలో పంట సర్వే ఇంకా పూర్తి కాలేదు. దీంతో పంట నష్టం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎంత కష్టం.. ఎంత నష్టం.. ‘సాక్షి’ బృందం తుపాను ప్రభావితమైన కొన్ని గ్రామాల్లోకి వెళ్లి, వాస్తవ పరిస్థితిని పరిశీలించింది. రైతన్నలను ఎవరిని కదిలించినా.. కన్నీళ్లే కనిపిస్తున్నాయి. తమ కళ్ల ముందే నేల వాలిన పంటను చూసి తల్లడిల్లిపోతున్నారు. ఎకరానికి కౌలు రూ.30వేలు, పెట్టుబడి రూ.35వేలు గంగ పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల్లో చేతికొచ్చే పంట పూర్తిగా నీళ్లలో నాని కుళ్లి పోతుందని, గింజలు మొలకెత్తుతాయని ఆందో ళన చెందుతున్నారు. అరకొరగా మిగిలిన పంట కొయాలన్నా, మామూలు సమయంలో పంట కోతకు ఎకరానికి 2 గంటల సమయం పడితే.. ఇప్పుడు వరి కోయాలంటే 4 గంటల సమయం పట్టే అవకాశం ఉండటంతోపాటు, గింజలు రాలిపోతాయని మదన పడుతున్నారు. ఒక వేళ కొంత మంది రైతులు ధైర్యం చేసి నేలవాలిన పంటను పైకి లేపి కట్టాలన్నా ఎకరాకు 100 మంది కూలీలు అవుతున్నారని, కూలీ రూ.330 చొప్పున రూ.33వేలు అవుతుందని పేర్కొంటున్నారు. అయితే పది బస్తాలు వచ్చే పంట, దీని వల్ల 20 బస్తాలు మాత్రమే వస్తుందని దీని వల్ల ఉపయోగం పెద్దగా లేదని వాపోతున్నారు. పెట్టే పెట్టుబడి డబుల్ అవుతుండగా, దిగుబడిలో మాత్రం సగమే వస్తోందని బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు నేలకు వాలిన వరి పంటను పైకి లేపి కట్టడానికి వీలు కాక అలానే వదిలేస్తున్నారు. కొన్ని చోట్ల పాలు, సుంకు దశలో ఉందని, గాలికి కంకులు రాసుకొని సుంకు రాలి పోయిందని, నేలకు వాలకుండా అక్కడ ఉన్న పైరుకూడా ఉపయోగం లేదని తప్ప, తాలు అవుతుందని భారీగా పంట దిగుబడులు తగ్గుతాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఎకరానికి ఇచ్చే పదివేలు ఏమూలకూ సరిపోవని, పంట నష్ట పరిహారం పెంచి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ముక్త కంఠంతో పేర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పంట నష్టపోతే ఎకరానికి రూ.25వేల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కనీసం యూరియా కూడా దొరకక రూ.275 యూరియా బస్తాను రూ.600–రూ.800లకు బ్లాక్లో కొన్నామని, దీని కోసం పగలూ రాత్రిళ్లు పడిగాపులు కాయాల్సి వచ్చిందని తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. పంట నష్ట పరిహారం వచ్చినా, పొలాల్లో పండిన అరకొర ధాన్యాన్ని కొనమని ప్రభుత్వం మెలిక పెడుతోందని.. ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. రైతులకు రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం, పంటలు సాగు చేసే కౌలు రైతుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తోందని, రెండేళ్లుగా రైతు భరోసా అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఎకరాకు రూ.30 వేలు చొప్పున రూ.60 వేలు చెల్లించి రెండెకరాలు కౌలుకు తీసుకుని టమాటా సాగు చేపట్టా. రెండెకరాలకు సుమారు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మొక్కలు సుమారు 4 అడుగుల మేర ఎత్తు పెరగడంతో ఎదురు కర్రలతో పందిరి ఏర్పాటు చేసి తీగలకు పాకించా. పంట ఏపుగా పెరిగి, తొలి కాపు కోసే సమయానికి ఓ వైపు వరదలు, మరోవైపు తుపానుతో పూత పిందె రాలిపోయింది. పొలంలో వర్షం నీరు నిలవడంతో మొక్కలు వడబడిపోయాయి. చేను బతికేలా కనిపించడం లేదు. నష్టపోయిన పొలాలు పరిశీలించి పరిహారం చెల్లిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నా. – పెయ్యల నాగేశ్వరరావు, రైతు, కొటికలపూడి -
నష్టపోయిన రైతులందరికీ పరిహారం
కంచికచర్ల: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. కంచికచర్ల మండలం కీసరలో మునేరు వంతెన వద్ద గురువారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబుతో కలసి వరద ఉధృతిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. కృష్ణానది, మున్నేరు, కట్టలేరు, వైరా, పాలేరు వాగుల్లో వరద ప్రవాహంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు. మున్నేరుకు అటు, ఇటు ఉన్న 40 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు. జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో పనిచేస్తున్నట్లు తెలిపారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి కూడా ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. పంట నష్టాల తుది అంచనాల నివేదికలకు అనుగుణంగా బాధిత రైతులు అందరికీ పరిహారం అందిస్తామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కృష్ణా నదికి వరద పోటెత్తిన నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహారావు, ఎంపీ డీఓ డి.వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ చవాన్, ఆర్ఐ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
జిల్లాలో 42 వేల ఎకరాల్లో పంట నష్టం
●17 మండలాలు, 235 గ్రామాలపై మోంథా తుఫాన్ ప్రభావం ● వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్కు వివరించిన దేవినేని అవినాష్ ● కూటమి ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటమే లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో మోంథా తుఫాను ప్రభావం 17 మండలాల్లోని 235 గ్రామాలపై చూపిందని, 42 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ వివరించారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో గురువారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో దేవినేని అవినాష్ జిల్లాలో తుఫాన్ బాధిత ప్రాంతాలకు సంబంధించి నష్టాన్ని వివరించారు. పంటలకు సంబంధించి వరి, పత్తి, మొక్కజొన్న, ఉద్యాన పంటలు బాగా దెబ్బతిన్నాయని, వాటి వివరాలను తెలియజేశారు. మంచి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు.. అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. వరదలు, తుఫాన్ల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలువ ప్రజలకు తెలుస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పబ్లిసిటీ కాకుండా ప్రజలకు నేరుగా న్యాయం జరిగేదని, ఈ విషయాన్ని స్వయంగా ప్రజలే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. వైఎస్ జగన్ తలపెట్టిన సచివాలయం వ్యవస్థ తుఫాన్ సమయంలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిందన్నారు. నాడు– నేడు ద్వారా అభివృద్ధి చేసిన పాఠశాలలు పునరావాస కేంద్రాలుగా ప్రజలకు ఉపయోగపడ్డాయని చెప్పారు. కూటమి ప్రభుత్వ మీడియా చానళ్లలో ఏదో చేస్తున్నారని పబ్లిసిటీ చేశారని, తుఫాన్ బాధితులకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గతేడాది వరదలు కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వచ్చాయని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. ఏడాది దాటినా వరద బాధితులందరికీ నష్ట పరిహారం అందించలేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ తరుఫున బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ధర్నాలు చేసిన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గతంలో రైతులు పండించిన మిర్చిని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం రైతుల గోడు పట్టించుకునే నాయకుడు లేరని వాపోతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు పార్టీలు, కుల మతాలు చూడకుండా న్యాయం చేశామన్నారు. వరదలు, తుఫాన్లు టీడీపీ నాయకులకు ఆదాయంగా మారాయని చెప్పారు. గతేడాది వరదల సమయంలో అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని అబద్ధపు లెక్కలు చూపారని అవినాష్ ఆరోపించారు. నష్టపోయిన ప్రజలకు మంచి చేసే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో తుఫాన్ బాధిత, కొండ ప్రాంతాల్లో నియోజకవర్గ సమన్వయకర్తలు, స్థానిక జెడ్పీటీసీలు, నాయకులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. -
కురుమద్దాలిలో రేపు మెగా జాబ్మేళా
పామర్రు: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నవంబర్ 1న కురుమద్దాలి గ్రామంలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్కుమార్ గురువారం తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో జపనీస్ ఎంఎస్సీ–ఎన్ఎస్ ఇన్స్రూమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమెరికన్ ఎంఎన్సీ–కొల్గేట్ పల్మోలివ్ లిమిటెడ్, ఫాక్స్కా ఎంఎన్సీ, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీవీఎస్ లేబోరేటరీస్ లిమిటెడ్, ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, క్రైడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్, వరుణ్ గ్రూప్, శ్రీనివాస ట్రాక్టర్స్(ఎస్కార్ట్స్ లిమిటెడ్) వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బి–ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువత అర్హులన్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ముందుగా హెచ్టీటీపీఎస్://ఎన్ఏఐపీయూఎన్వైఏఎం.ఏపీ.జీవోవీ.ఐఎన్//యూఎస్ఈఆర్–ఆర్ఈజీఐఎస్టీఆర్ఏటీఐఓఎన్ లింక్ నందు రిజిష్టర్ కావాలన్నారు. జాబ్ మేళాకు రెజ్యూమ్ లేదా బయోడేటా ఫామ్లతో పాటు ఆధార్, ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 80743 70846, 96767 08041 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ఇబ్రహీంపట్నం: కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగినప్పటికీ ఇసుక తవ్వకాలు ఆగలేదు. కాసుల కక్కుర్తితో నదిలో నుంచి ఇసుకను ఒడ్డుకు చేర్చుతున్న పడవ నీటి ప్రవాహానికి నదిలో మునిగిపోయింది. ఈప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అదే సమయంలో వరద ప్రవాహం పరిశీలించడానికి వచ్చిన ఆర్డీవో కావూరి చైతన్య పడవ నదిలో కొట్టుకుపోయిన విషయం రెవెన్యూ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. పడవ ప్రమాదంపై ఆరా తీశారు. నదిలో మునిగిన ఇసుక పడవ బయటకు తీయాలని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో పడవ వెతికేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మునిగిన ప్రాంతానికి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని తుమ్మలపాలెం వద్ద నదిలో ఉన్న పడవను గుర్తించారు. బలమైన తాళ్లు కట్టి పొక్లెయిన్, జేసీబీల సహాయంతో ఇసుక పడవను ఒడ్డుకు తీశారు. నదిలో నుంచి ఇసుక తరలించేందుకు ఇసుక రేవుకు గానీ, పడవలకు గానీ ఎటువంటి అనుమతులు లేవు. పడవ యజమానిపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. -
డెప్యూటీ సీఎం పవన్ పర్యటనలో సర్పంచ్కు అవమానం
అవనిగడ్డ: అవనిగడ్డలో డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటన సందర్భంగా ప్రథమ పౌరురాలైన సర్పంచ్ లక్ష్మీ తిరుపతమ్మకు అవమానం జరిగింది. అవనిగడ్డ మండల పరిధిలోని రామకోటిపురం పంచాయతీ పరిధిలోకి వచ్చే విద్యుత్ సబ్స్టేషన్ వద్ద గురువారం తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటల ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా రామకోటిపురం సర్పంచ్ లక్ష్మీ తిరుపతమ్మ ఫొటో ఎగ్జిబిషన్ వద్దకు వెళ్లగా పోలీసులు ఆమెను అనుమతించలేదు. సర్పంచ్ అని చెప్పినా వినకుండా ప్రొటోకాల్లో మీరు లేరని ఆమెను మహిళా పోలీస్ సిబ్బంది బయటకు పంపించటం తీవ్ర చర్చనీయాంశమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ కావడం వల్లనే బయటకు పంపించేశారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఏ పదవీ లేని కొంతమంది నాయకులు మాత్రం దర్జాగా లోపల తిరగటం కొసమెరుపు. మంగళగిరి టౌన్: బుల్లెట్ వాహనం బాగుందంటూ..ఒకసారి ఫొటో దిగుతానని, ట్రయల్ రన్ వేస్తానని చెప్పి, బండితో పరారైన సంఘటన మంగళగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు.. విజయవాడకు చెందిన నరిశెట్టి మురారి అనే యువకుడు మంగళగిరి నగర పరిధిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతూ.. కళాశాల సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. ఈనెల 28 సాయంత్రం తన స్నేహితుడితో మంగళగిరి నగర పరిధిలోని ఓ సూపర్ మార్కెట్ వద్దకు వచ్చాడు. సరుకులు కొనుగోలు చేసి తన వాహనం వద్దకు వచ్చాడు. అదే సమయంలో ఓ యువకుడు బుల్లెట్ బాగుందంటూ మాట కలిపాడు. ఈ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నానని, బుల్లెట్పై ఫొటో దిగుతానని నమ్మబలికాడు. బైక్ మీద కూర్చుని, ఒక రౌండ్ వేసి వస్తానని చెప్పడంతో మురారి సరేనంటూ తాళం ఇచ్చాడు. ఆ యువకుడు బుల్లెట్ స్టార్ట్ చేసి కొంతదూరం వెళ్లి అటు నుంచి అటు ఉడాయించాడు. ఎంతకూ రాకపోయే సరికి మురారి సూపర్మార్కెట్లోకి వెళ్లి మీ దగ్గర పనిచేసే వ్యక్తి బుల్లెట్ తీసుకువెళ్లాడని, తిరిగి రాలేదని చెప్పడంతో ఆ యువకుడు తమకు తెలియదంటూ చల్లగా చెప్పడంతో.. తాను మోసపోయానని గ్రహించాడు. మంగళగిరి, విజయవాడ ప్రాంతాల్లో ఎంత వెతికినా నిందితుడి సమాచారం తెలియకపోవడంతో మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పోలీసుల ఆంక్షలు.. ప్రజలకు అవస్థలు
కోడూరు: డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన పేరుతో పోలీసులు విధించిన ఆంక్షలు ప్రజలను అవస్థలకు గురి చేశాయి. పవన్కల్యాణ్ గురువారం ఉదయం 10.30 గంటలకు కోడూరు చేరుకుంటా రని ప్రకటించారు. అయితే ఆయన 11.40 గంటలకు వచ్చారు. డెప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు ఉదయం ఏడు గంటల నుంచే ఆంక్షలు విధించారు. కోడూరు వంతెన సెంటర్, ఇస్మాయిల్బేగ్పేట రహదారి, రామచంద్రాపురం వద్ద ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిలిపి వేశారు. కోడూరు నుంచి అవనిగడ్డ వరకు 13 కిలోమీటర్లు ఉండగా, ఈ రహదారి మొత్తం ఎలాంటి వాహనాలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు అవనిగడ్డ నుంచి కోడూరు అన్ని ఆర్టీసీ సర్వీసులను అధికారులు రద్దు చేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2025గుడ్లవల్లేరు: స్థానిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో గురువారం శిఖర ప్రతిష్టా మహోత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. 7కంకిపాడు: సీఎం చంద్రబాబు శుక్రవారం కంకిపాడు రానున్నారు. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్నాయుడు గురువారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నాగాయలంక: స్థానిక శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్ వద్ద శ్రీరామలింగేశ్వర స్వామికి గురువారం మహాభిషేకం నిర్వహించారు. కోటి వత్తులతో దీపాలు వెలిగించారు. -
కూటమి ప్రభుత్వంలో రైతులకు భరోసా కరువు
పమిడిముక్కల: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాతో రైతులకు భరోసా ఉండేదని, నేడు కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు భరోసా కరువైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ తెలిపారు. మండలంలోని మేడూరు, కృష్ణాపురం, నారాయణపురం పరిధిలో నేలవాలిన వరి పంటను పార్టీ నాయకులు, రైతులతో కలిసి గురువారం పరిశీలించారు. తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటంతా ఆంక్షలు లేకుండా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 20 శాతం, 50 శాతం అని ఆంక్షలు పెట్టి పంట నమోదు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలి.. రైతులు భీమనబోయిన సుబ్బారావు, వీర్ల నాగేశ్వరరావు, ముచ్చు పిచేశ్వరరావు, ముచ్చు రాంబాబులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు రూ.30 వేలు ఖర్చయిందని, గింజ గట్టి పడే దశలో పంటంతా నేలవాలిందని, తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గింజ గట్టిపడదని రైతులు చెప్పారు. గతంలో కోత దశలో తుఫాన్లు, వర్షాల వల్ల పంట దెబ్బతిన్న కొద్దిగానే నష్టపోయేవారమని, నేడు పూర్తిగా నష్టపోయామని తెలిపారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు యలమంచిలి గణేష్, వైస్ ఎంపీపీలు కొడమంచిలి మహేష్, గంజాల సీతారామయ్య, ఎంపీటీసీ గుర్విందపల్లి వంశీ, నాయకులు పోలిమెట్ల వంశీకృష్ణ, గొర్కెపూడి బుజ్జి, మర్రి బాబూరావు, ముళ్లపూడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనిల్కుమార్ -
ఇంద్ర ఏసీ బస్సుకు తప్పిన ప్రమాదం
హనుమాన్జంక్షన్రూరల్: హనుమాన్జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్లో ఇంద్ర ఏసీ బస్సుకు గురువారం సాయంత్రం పెనుప్రమాదం తప్పింది. ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రహదారి నుంచి బస్టాండ్ ఇన్గేట్ ద్వారా లోనికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇన్గేట్ మార్గం పక్కనే ఉన్న పాత బస్టాండ్ రేకుల షెడ్ పైకప్పును ఇంద్ర బస్సు ఢీకొంది. ఐరన్ రేకులను గీసుకుంటూ బస్సు ముందుకు రావటంతో బస్సు, పాత బస్టాండ్ పైకప్పు దెబ్బతిన్నాయి. పాత బస్టాండ్ రేకుల పైకప్పును ఢీ కొడుతూ బస్సు ముందుకు వెళ్లటంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ బస్సు కావటంతో మంటలు చెలరేగితే మరింత ముప్పు వాట్లిలేదంటూ మండిపడ్డారు. అంతేకాక బస్సు అదుపు తప్పి ఇన్గేట్ మార్గం నుంచి పక్కనే ఉన్న పాత బస్టాండ్ లోతట్టు ప్రాంతంలోకి బస్సు బోల్తా కొడితే పెనుప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
దివిసీమ నష్టాన్ని వ్యక్తిగతంగా సమీక్షిస్తా
●ఏపీ డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ●అవనిగడ్డలో అరటి తోటలు, పంట నష్టం ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన అవనిగడ్డ: అవనిగడ్డ నియోజకవర్గ నష్టాన్ని వ్యక్తిగతంగా సమీక్షించి సీఎం చంద్రబాబుకు నివేదిక పంపుతానని ఏపీ డెప్యూటీ సీఎం కొణిదెల పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా కోడూరు శివారు కృష్ణాపురంలో తుఫాన్తో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ఎదురుమొండి – గొల్లమంద రోడ్డుకు రూ.13.8 కోట్లతో నిర్మాణ పనులకు టెండర్లు ఖరారయ్యాయన్నారు. డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ దివిసీమలో గురువారం పర్యటన సందర్భంగా అవనిగడ్డలో దెబ్బతిన్న అరటి తోటలు పరిశీలించారు. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నియోజకవర్గంలో జరిగిన మోంథా తుఫాన్ నష్టం వివరాల ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అద్భుతమైన సహాయక చర్యలు అందించారని ప్రశంసించారు. మేకలు తోలుకుని లంకకు వెళ్లి తుఫాన్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను గుర్తించి రెస్క్యూ బృందాలు కాపాడినట్లు తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో 1,523 గ్రామాలు నష్టపోయాయని, 274 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయన్నారు. కేంద్ర సహాయం కోరుతాం రాష్ట్రంలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సూపర్ శానిటేషన్ కోసం 20 వేల మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నట్లు పవన్కళ్యాణ్ తెలిపారు. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులను ఆదుకుంటున్నామన్నారు. పంట నష్టం అంచనాలు సాధ్యమైనంత వేగంగా రూపొందించి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి కేంద్ర సహాయం కోరుతామని చెప్పారు. నియోజకవర్గంలోని తీర గ్రామాల్లో కీలకంగా ఉన్న ఔట్ ఫాల్ స్లూయీజ్ల పునర్నిర్మాణానికి నాబార్డ్ లేక ప్రత్యామ్నాయ నిధులు సమకూర్చుతామని ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధికి, మోంథా తుఫాన్ నష్టం తీర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి ఆమ్రపాలి, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జేసీ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, వివిధ విభాగాల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
వరి పంటను రక్షించుకోండిలా
గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లాలో 1.54 లక్షల హెక్టారుల్లో వరి సాగు చేపట్టారు. అందులో 45,040 హెక్టారుల్లో వరి మోంథా తుఫాన్కు దెబ్బ తింది. తుఫాన్కు దెబ్బతిన్న వరి పంటను రక్షించుకునే విధానాన్ని జిల్లాలోని రైతులకు జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి గురువారం సూచించారు. వరి పంట పెరుగుదల దశలో వరిపైరు వర్షపునీటి ముంపునకు గురైతే పొలంలో ముుంపు నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి. తుఫాన్కు పొలంలోకి వర్షపునీరు చేరినప్పుడు చీడపీడలు కూడా పంటను పీడిస్తాయి. ఎకరానికి 30 కిలోల యూరియా, 15 కిలోల పోటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి. ఈ తరుణంలో వరిలో పాముపొడ తెగులు ఉధృతి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు వరిలో దుబ్బు చేసే దశ నుంచి ఆకులపై మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవిగా పాముపొడ మచ్చలుగా మారతాయి. ఉధృతి ఎక్కువైతే మొక్కలు ఎండిపోతాయి. నివారణకు ప్రొపికోనజోల్ ఒక మిల్లీలీటర్లు లేక వాలిడామైసిన్ రెండు మిల్లీలీటర్లు లేక హెక్సాకొనజోల్ రెండు మిల్లీలీటర్లు నీటిలో కలిపి దుబ్బుకు తగిలేలా 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. గ్రామాల్లో పోస్టర్ల ద్వారా అవగాహన.. అలాగే వరిలో అగ్గి తెగులు ఉధృతికి ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అగ్గి తెగులు సోకినప్పుడు ముదురు ఆకులపై నూలుకుండి ఆకారంలో గోధుమ రంగు మచ్చలు వచ్చి ఆకులు ఎర్రబడతాయి. క్రమేపీ మచ్చలు కలిసిపోయి పంట ఎండిపోయినట్లు కనిపిస్తుంది. నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా కాసుగామైసిన్ రెండు మిల్లీలీటర్లు లేదా ప్యాజివన్ రెండు మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పొలంలో అధిక నీటి ప్రవాహం తర్వాత దోమ ఆశించే అవకాశం ఉంది. దోమ ఉధృతి ఎక్కువైనప్పుడు నివారణకు ఇతోపెన్హాక్స్ రెండు మిల్లీలీటర్లు లేదా 1.5గ్రాములు ఎసిపేట్ లేదా 0.25 మిల్లీలీటర్లు అమిడాక్లోప్రిడ్ లేదా 0.20 గ్రాములు దయోమిదో కామ్ లేదా డైనెటో ఫ్యురాన్ 0.25 గ్రాములు లేదా బిప్రొఫ్యూజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ౖపైమెట్రోజన్ 0.6 మిల్లీలీటర్లు లేదా రెండు మిల్లీలీటర్లు బీపీఎంసీ లేదా మోనోక్రోటోఫాస్ 2.2మిల్లీలీటర్లు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలాన్ని అడపా తడపా ఆరబెట్టాలని జిల్లాలోని రైతులకు జేడీఏ పద్మావతి సూచించారు. అలాగే తుఫాన్కు దెబ్బతిన్న పంటల్ని ఎలా కాపాడాకోవాలనేది జిల్లాలోని ప్రతి మండలంలోని గ్రామాల్లో పోస్టర్ల ద్వారా రైతులకు ఏడీఏలు, ఏవోలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కలిగిస్తున్నారని పద్మావతి పేర్కొన్నారు. జేడీఏ పద్మావతి -
ఊపిరిపోయని వెంటిలేటర్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయ స్థితితో ఉన్న రోగికి ప్రాణ వాయువును అందించే వెంటిలేటర్ల తీవ్ర కొరత ఏర్పడింది. ఐసీయూలో ఉన్న రోగిని వెంటిలేటర్పై పెట్టాలంటేనే వైద్యులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటిలేటర్లు సరిగా పనిచేయక ప్రాణాలుపోతే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఎంతో కాలంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. ప్రాణ వాయువును అందించే వెంటిలేటర్లను కొనుగోలు చేయాలనే ఆలోచనే చేయడం లేదు. దీంతో నిరుపేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కోసారి వెంటిలేటర్ అవసరమైన రోగులు బయట ఆస్పత్రులకు తరలి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో కొన్న వాటితోనే... కోవిడ్ సమయంలో గత ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రులకు పెద్ద ఎత్తున వెంటిలేటర్లను సరఫరా చేసింది. అందులో భాగంగా విజయవాడ ఆస్పత్రికి అప్పట్లో 200 వరకూ వెంటిలేటర్లు సమకూరాయి. రెండు విడతల కోవిడ్లో ఆ వెంటిలేటర్లు చాలా మందికి ఊపిరిపోశాయి. వాటినే ఇప్పటి వరకూ వినియోగిస్తూ వస్తున్నారు. పనిచేయని కొన్నింటిని పక్కన పెడుతూ ఉన్న వాటితోనే నెట్టుకొస్తున్నారు. క్రమేణా పనిచేసే వెంటిలేటర్లు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల అవసరాలకు అనుగుణంగా వెంటిలేటర్లు చాలడం లేదు. కొంతకాలంగా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. ప్రభుత్వం మొండిచేయి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వాస్పత్రికి ఆధునిక పరికరాలు అందించిన సందర్భాలు లేదు. గత ప్రభుత్వంలో అన్ని విభాగాల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. వాటితోనే వైద్యులు నెట్టు కొస్తున్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో కొలనోస్కోపీ పరికరం పనిచేయడం లేదు. న్యూరాలజీ విభాగంలో ఈఈఎజీ పరికరం మూలన పడింది. న్యూరోసర్జరీలో ఆధునిక మైక్రోస్కోప్ ఊసే లేదు. హెర్నియాకు ల్యాపరోస్కోపీ సర్జరీలు చేయాలంటే అవసరమైన మెష్లు కొనుగోలు చేయడం లేదు. ఇలా అనేక లోపాలున్నా సరిచేయడంతో ప్రభుత్వం నుంచి స్పందన లోపించడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి నెల కొంది. వెంటిలేటర్లు కొనుగోలు విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన కొరవడంతో ఆస్పత్రికి వచ్చిన పీజీ గ్రాంట్స్ నుంచి కొనుగోలు చేసే ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రాణాపాయంలో ఉన్న రోగికి ప్రాణవాయువు అందించేందుకు వెంటిలేటర్పై పెట్టాలంటే వైద్యులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ వెంటిలేటర్ పనిచేయక మధ్యలో రోగి ప్రాణాలు పోతే పరిస్థితి ఏమిటని వైద్యులు సైతం ఆందోళన చెందిన ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రిలో చేసే మేజర్ జనరల్ సర్జరీలు, బ్రెయిన్ సర్జరీలు, క్లిష్టతరమైన వాస్క్యులర్ సర్జరీలు, రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రంగా గాయపడిన వారిని, నిమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి శ్యాస తీసుకోలేని సందర్భాల్లో వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే వెంటిలేటర్లు చాలా వరకూ పనిచేయక పోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచన పరిస్థితి నెలకొంది. ఒకవేళ వాటిపై ఉంచిన తర్వాత పనిచేయక రోగి ప్రాణాలు పోతే ఏమిటని ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. విజయవాడ జీజీహెచ్లో వెంటిలేటర్ల కొరత కోవిడ్ సమయంలో ఇచ్చిన పరికరాలతోనే వైద్య సేవలు చాలా వరకూ పనిచేయక మూలకు చేరిన వైనం ఐసీయూల్లో రోగులకు వెంటిలేటర్లు లేక ఇక్కట్లు కొత్తవి కొనాలన్న ఆలోచన చేయని ప్రభుత్వం కొత్త వెంటిలేటర్లు రెండు వారాల్లో రానున్నాయి. వైద్య కళాశాలకు సంబంధించి డీఎంఈ వద్ద ఉన్న పీజీ గ్రాంట్ నుంచి వెంటిలేటర్లు కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ వెంటిలేటర్ల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. కోవిడ్లో వచ్చిన వెంటిలేటర్లలో చాలా వరకూ పక్కన పడేశాం. ఉన్న వాటినే వాడుతున్నాం. – డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్, ప్రభుత్వాస్పత్రి -
రేపటి నుంచి భవానీ మండల దీక్షలు
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని డెప్యూటీ సీఎం కె.పవన్ కల్యాణ్ గురువారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేసిన పవన్కల్యాణ్ పుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలను డెప్యూటీ సీఎంకు అందించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా తుపాను ప్రత్యేక అధికారి కాటా ఆమ్రపాలి, కలెక్టర్ బాలాజీ, జేసీ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా దేవదాయశాఖ పరిధిలోని వివిధ దేవస్థానాల్లో బేసిక్ వేతనంపై పని చేస్తున్న సిబ్బందికి హెచ్ఆర్ఏ, డీఏ, వార్షిక ఇంక్రిమెంట్లు, ఐఆర్ వంటి అలవెన్సులు మంజూరు చేయాలని పవన్ కల్యాణ్కు ఆలయ సిబ్బంది వినతిపత్రం అందజేశారు. పెనమలూరు: మండలంలోని యనమలకుదు రులో వేంచేసి ఉన్న శ్రీపార్వతి సమేత శ్రీ రామ లింగేశ్వరస్వామి ఆలయాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం సందర్శించారు. మంత్రి ఆలయంలో శ్రీరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ ప్రధాన అర్చకుడు జి.ఆర్.వి.సాగర్ పూజలు నిర్వహించారు. అనంతరం హోం మంత్రి అనితకు ఆలయ నిర్మాణ దాత సంగా నరసింహారావు ఆలయ ఫొటోను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.భవాని, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎన్యు(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. నవంబర్ 12వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. యూజీ కోర్సులకు పేపర్కు రూ.770 చొప్పున, పీజీ కోర్సులకు పేపరుకు రూ.960 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్ శివరాంప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల విభాగం కోఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్, డెప్యూటీ రిజి స్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు పి. కృష్ణవేణి, డి.కోదండపాణి, సూపరింటెండెంట్ టి.వెంకటేశ్వర్లు, జవ్వాజి శ్రీనివాసరావు, మాధురి, దూర విద్య ఐసీటీ డివిజన్ డైరెక్టర్ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.


