breaking news
NTR district Latest News
-
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
గుడివాడరూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ మహబూబ్ షరీఫ్ మంగళవారం తెలిపారు. గుడివాడ రైల్వే స్టేషన్ పరిధిలోని దోసపాడు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మరణించినట్లు తెలిపారు. మృతుని వయస్సు 60ఏళ్లు ఉంటుందని, బ్లూబై కంపెనీ తెలుపు, నీలం రంగు గడులు గల చొక్కా(రెడీమేడ్ షర్ట్), తెలుపు, నలుపు, నీలం రంగు గడుల లుంగి ధరించి ఉన్నాడన్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9440627570, 9866221412లో సంప్రదించాలని రైల్వే ఎస్ఐ కోరారు. -
కార్మికుల సత్తా చాటుదాం
● 9న సమ్మెను విజయవంతం చేద్దాం ● రాష్ట్ర కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు పిలుపు కృష్ణలంక(విజయవాడతూర్పు): కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేసి, కార్మిక వర్గ సత్తా చాటుదామని రాష్ట్ర కార్మిక ఉద్యోగ ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, 10గంటల పని విధానాన్ని, అధిక గంటల పని విధానాన్ని, రాత్రి సమయంలో మహిళలు పని చేసే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ సమ్మెను చేపడుతున్నట్లు సంఘాలు ప్రకటించాయి. గవర్నర్పేటలోని బాలోత్సవ్ భవన్లో ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రాంపల్లి రవీంద్రనాథ్ అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల, రైతుల, వ్యవసాయ కూలీ చేతివృత్తులు, మహిళా, యువజన, విద్యార్థి రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. ‘ఉపాధి’లో సంస్కరణలు అవసరం.. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నూతన మార్కెట్ విధానాన్ని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించాలని, రుణాలు రద్దు చేయాలని, రైతులకు అన్ని వేదాల సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని, రోజుకు రూ.800 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్లకు వ్యతిరేకంగా, బీజేపీ దాని అనుబంధ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం సత్తా చాటేందుకు జూలై 9న జరిగే సమ్మెలో కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు, శ్రామిక మహిళా నాయకులు వెంకట సుబ్బారావమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు జల్లి విల్సన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు వై.కేశవరావు, పి.జమలయ్య, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి పాల్గొన్నారు. -
రుణాలను సద్వినియోగం చేసుకోండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి తదితరాల ద్వారా పొందిన రుణాలను తప్పనిసరిగా జీవనోపాధి కార్యకలాపాలకు ఉపయోగించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. సంపద సృష్టికి రుణాలు వాడుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన వార్షిక రుణ–జీవనోపాధి ప్రణాళిక నుంచి సూక్ష్మ రుణ ప్రణాళిక – జీవనోపాధులపై సమావేశం జరిగింది. స్వయం సహాయక సంఘాల మహిళలు పొందే రుణాలపై పర్యవేక్షణ చేసి.. ఆ రుణాలను కుటుంబాల ఆర్థిక సాధికారతకు ఉపయోగపడేలా చేయిపట్టి నడిపించాలని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. రూ.1,266 కోట్లతో కార్యాచరణ.. జిల్లాలో 16 మండల సమాఖ్యలు, 767 గ్రామ సమాఖ్యలు, 24,880 స్వయం సహాయక సంఘాలు, 2,47,611మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. 2024–25లో 1,93,691మంది ఎస్హెచ్జీ సభ్యులకు రూ. 1,147.59 కోట్ల మేర రుణ మద్దతు లభించిందన్నారు. 2025–26కు సంబంధించి స్వయం సహాయక సంఘాల సభ్యుల వ్యక్తిగత జీవనోపాధి అవసరాలు ఆధారంగా దాదాపు రూ.1,266 కోట్ల వార్షిక రుణ–జీవనోపాధి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు వివరించారు. కుటుంబ స్థాయి సర్వే ఆధారంగా ఈ వార్షిక రుణ ప్రణాళికకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 30 వరకు ప్రచారం.. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎల్డీఎం కె.ప్రియాంక వివరించారు. బ్యాంక్ లింకేజీపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, యూఎల్బీల్లో కనీసం ఒక శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న సారె సంబరం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారె సమర్పిస్తున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ను దర్శించుకుని తమ కుటుంబం పిల్లాపాపలతో సంతోషంగా ఉండేలా దీవించమని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి తాము సారెగా తీసుకువచ్చిన చీరలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, మిఠాయిలను సమర్పిస్తున్నారు. సారె తీసుకువచ్చిన భక్త బృందాలకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందిస్తున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్త బృందాలు సారెను అమ్మవారి ప్రసాదంగా భక్తులకు అందిస్తూ సంతోషాలను పంచుకుంటున్నారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు దేవస్థానం ఉచిత ప్రసాదంతో పాటు అన్న ప్రసాదాలను అందజేస్తోంది. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఈవో శీనానాయక్ అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దుర్గగుడికి తరలివస్తున్న భక్తబృందాలు -
పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటించాలి
డీసీజీ సమావేశంలో ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటించాలని, ప్రజల భద్రతకు తొలి ప్రాధాన్యమివ్వాల్సిందేనని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. పరిశ్రమల భద్రతా ప్రమాణాల్లో రాజీపడే ప్రసక్తే లేదని, నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ అప్రమత్తంగా ఉండా లని పరిశ్రమల యాజమాన్యాలు, అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా క్రై గ్రూప్ (డీసీజీ) సమావేశం జరిగింది. మాక్డ్రిల్స్ నిర్వహించండి.. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్సైట్, ఆఫ్సైట్ మాక్డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా కర్మాగారాలు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి, వైద్య ఆరోగ్యం తదితర శాఖలను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని తొమ్మిది మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్నారు. వాటిల్లో గ్యాస్ లీకేజ్, అగ్ని ప్రమాదాలు వంటివి జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతినెలా లెవెల్–1 మాక్డ్రిల్స్, ఆర్నెల్లకోసారి లెవెల్–2 మాక్డ్రిల్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా తప్పనిసరిగా సేఫ్టీ ఆడిట్ నివేదికలు పంపాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి చోళ మండలం ఎంఎస్ రిస్క్ సర్వీసెస్ సంస్థ రూపొందించిన ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ముసాయిదాపై భాగస్వామ్య పక్షాలు సలహాలు, సూచనలు చేయాలని.. వాటిని పరిగణనలోకి తీసుకొని తుది ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు. పరిశ్రమల్లో భద్రతా చర్యలపై విద్యార్థి దశలోనే అవగాహన పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వ ఐటీఐల్లోని 240 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, కర్మాగారాల డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు తదితరులు హాజరయ్యారు. -
ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6,400కోట్లు
తక్షణం విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు బకాయిపడిన ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ దాసరి భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బందెల నాసర్ జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పేరిట రూ.6400 కోట్లు బకాయిపెట్టిందన్నారు. టీడీపీ యువగళం పాదయాత్రలోనూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా కేవలం రూ.600కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకొందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కానందున యాజమాన్యాలు వేధిస్తున్నాయని, విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని ఫీజులు చెల్లించలేక కళాశాలల్లోనే సర్టిఫికెట్లు ఉన్నాయని, విద్యార్థులు ఉన్నత విద్య చదవలేక, మరో పనికి వెళ్లలేక, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నాలుగో తేదీ నుంచి ధర్నాలు.. బకాయిలు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 4 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. 11న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కార్తీక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యశ్వంత్, శరత్, అమర్నాథ్, ప్రణీత్, డేవిడ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
కొండచిలువ హతం
మైలవరం: మైలవరం మండలం జంగాలపల్లి గ్రామంలో పాడుబడిన బావి వద్ద పేరుకుపోయిన చెత్తలో ఉన్న కొండచిలువను గమనించిన గ్రామస్తులు మంగళవారం కర్రలు, కత్తులతో హతమార్చారు. గ్రామానికి చెందిన రైతు వేల్పులకొండ ప్రసాద్కు పాము కన్పించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కేకలు పెట్టడంతో యువకులు పరుగున వెళ్లి దానిని హతమార్చారు. కొండ చిలువ సుమారు 10 అడుగుల పొడవు, 15కిలోలు బరువు ఉందని యువకులు తెలిపారు. కాగా జంగాలపల్లి గ్రామం నుంచి బయటికి రావాలంటే దారి మార్గం సరిగా ఉండకపోగా, కొద్దిపాటి వర్షానికి రహదారికి గండ్లు పడి కనీసం నడవడానికి కూడా గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యం పట్ల అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం గృహావసరాలకు బావి నీటిని వాడుకుంటూ ఉంటారని, అదే విధంగా అక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటారని గ్రామస్తులు తెలిపారు. బావి పాడైపోయి ఉండటంతో గ్రామస్తులు చెత్తా చెదారం తీసుకువచ్చి అక్కడే పడేస్తున్నారని దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, ప్రమాదకరమైన పాములు తిరుగుతూ భయానక వాతావరణం నెలకొంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగునకు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
4 వరకు హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత
కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హంసలదీవి సాగరతీరం బీచ్ గేట్లను మూసివేసినట్లు ఇన్చార్జి ఫారెస్ట్ ఆఫీసర్ మోహిని విజయలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో పాటు ఈదురుగాలులు తీవ్ర కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీ వరకు బీచ్ గేట్లను మూసి వేస్తామని వివరించారు. పర్యాటకులు సహకరించి ఈ మూడు రోజుల పాటు బీచ్కు రాకుండా ఉండాలని కోరారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచే బీచ్ గేట్లకు అటవీ అధికారులు తాళాలు వేశారు. త్వరలో ఎ.కొండూరుకు కృష్ణా జలాలు తిరువూరు: మరో 45 రోజుల్లో ఎ.కొండూరు మండలానికి కృష్ణా నదీజలాలను సరఫరా చేస్తా మని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఎ.కొండూరులో జల్జీవన్ మిషన్ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. త్వరితగ తిన పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా రక్షిత తాగు నీరందించే లక్ష్యంతో జల్ జీవన్మిషన్ అమలవుతోందన్నారు. కిడ్నీబాధిత తండాలకు కృష్ణా నదీ జలాలు ఇచ్చే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి జరుగుతోందని, ఇప్పటికే ప్రధాన పైపులైను పనులు పూర్తయ్యాయని వివరించారు. అనంతరం కంభంపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పరిశీలించారు. డెంగీపై విస్తృత అవగాహన కల్పించాలిలబ్బీపేట(విజయవాడతూర్పు): వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగీ నివారణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం డెంగీ డే సందర్భంగా వ్యాధిపై అవగాహన కల్పించే రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను డాక్టర్ మాచర్ల సుహాసిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెలరోజులు యాంటీ డెంగీ, యాంటీ మలేరియా మాసంగా పాటిస్తామని తెలిపారు. డెంగీ, మలేరియా ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా వ్యాధులపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రంలో తప్పనిసరిగా ఈ నెల రోజులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతి బాబు, డీపీఎంఓ డాక్టర్ నవీన్, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ బాలాజీ, డాక్టర్ కార్తీక్, డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
వరి సాగుకు విపత్తు
అవనిగడ్డ: ఖరీఫ్ సాగు ప్రారంభంలోనే కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతోంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 40 శాతానికి పైగా విత్తనాలను రైతులకు వారి గ్రామాల్లోనే అందించి ఆదుకుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పదిశాతం విత్తనాలు మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకొంది. దీంతో కృష్ణాజిల్లా రైతులు వరి వంగడాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అరకొరగా విత్తనాలు కృష్ణాజిల్లాలో ఈ ఖరీఫ్లో 1.64 లక్షల హెక్టార్లలో రైతులు వరిసాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఎక్కువగా ఎంటీయూ 1061, బీపీజీ 5204 రకాలను రైతులు సాగుచేస్తారు. గతేడాది ఎంటీయూ 1262, 1318 రకాలను పలుచోట్ల సాగుచేయగా కొనేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. ఈ సంవత్సరం రైతులు ఆ రకాల జోలికెళ్లడం లేదు. సాధారణంగా ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనాలు అవసరం. ఈ సీజన్లో 1.02 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా ప్రభుత్వం 10,650 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేసింది. దీంతో విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వచ్చిన లోడులు వచ్చినట్టు అయిపోతున్నాయి. రైతులు పనులు మాను కుని గంటల తరబడి ఎదురు చూసినా కొన్ని చోట్ల విత్తనాలు దొరకడం గగనంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 40 నుంచి 45 శాతం విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేసింది. అవసరమైతే డిమాండ్ను బట్టి మరో ఐదు శాతం విత్తనాలు సరఫరా చేసింది. ఈ ప్రభుత్వం పదిశాతం మాత్రమే సరఫరా చేయడంతో రైతులు విత్తనాలు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం కూడా విత్తనాల కోసం రైతులకు ఇబ్బందులు తప్పలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయిందని రైతులు తమకు తామే సర్దిచెప్పుకొన్నారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కొనసాగడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. కృష్ణాజిల్లాలోని బందరు, కేఈబీ కెనాల్కు ఇటీవల సాగునీరు విడుదల చేశారు. గతంలో బోర్ల కింద అక్కడక్కడా రైతులు నారుమళ్లు పోసుకున్నారు. పంట కాలువకు సాగునీరు విడుదల చేయడంతో ఇప్పుడే నారుమళ్లు పోసుకునే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఆదిలోనే విత్తనాలకు ఈ విధంగా డిమాండ్ ఉంటే సాగు పనులు ముమ్మరం చేస్తే పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 65 శాతం మంది కౌలు రైతులున్నారు. ఏటా పంట చేతికందగానే 85 శాతం కౌలు రైతులు విత్తనాలకు తీయకుండానే ధాన్యం విక్రయిస్తారు. వీరంతా ప్రస్తుతం ఎక్కడో ఒకచోట విత్తనాలు కొనుగోలు చేసి సాగుచేయాల్సిందే. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సరిపడా విత్తనాలు ఇవ్వాలి గత ప్రభుత్వం సబ్సిడీపై అవసరమైనన్ని వరివిత్తనాలు సరఫరా చేసేది. ఇప్పుడు చాలా తక్కువ వచ్చాయని చెబుతున్నారు. బయట షాపుల్లో రేటు ఎక్కువ. కల్తీ విత్తనాలు వచ్చే ప్రమాదముంది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాల సరఫరా పెంచాలి. – చిరివేళ్లే యానాదిరావు, పిట్టల్లంక తనిఖీలు చేస్తున్నాం అవనిగడ్డ సబ్ డివిజన్కు బీపీటీ 5204 రకం 515 క్వింటాళ్లు, ఎంటీయూ 1061 రకం 154 క్వింటాళ్లు, 1318 రకం 110 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయి. ప్రస్తుతం వీటిని రైతులుకు సబ్సిడీపై అందిస్తున్నాం. ప్రైవేటు విత్తన షాపులను తనిఖీ చేస్తున్నాం. ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. – జయప్రద, ఏడీఏ, అవనిగడ్డ కృష్ణా జిల్లాలో 1.64 లక్షల హెక్టార్లలో వరిసాగు 1.02 లక్షల క్వింటాళ్ల వరి వంగడాలు అవసరం ప్రభుత్వం సరఫరా చేసింది 11,650 క్వింటాళ్లే.. విత్తనాల కోసం రైతులకు తప్పని ఇబ్బందులు గత ప్రభుత్వంలో 40 శాతానికి పైగా విత్తనాల పంపిణీ -
గూడూ పోయే..
రోడ్డు విస్తరణ పేరుతో వెల్వడంలో ఉన్న నా ఇంటిని కూల్చి పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు అడిగితే మీ స్థలం రోడ్డు విస్తరణకు అవసరం లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు మా ఇంటిని ఎందుకు కూల్చారు? అధికారులు సమాధానం చెప్పాలి. – అడ్డగిరి జమలయ్య (గ్రామస్తుడు, వెల్వడం) నాలుగు నెలల క్రితం రోడ్డు తవ్వి వెట్మిక్స్ వేసి వదిలేశారు. ఎండొచ్చినప్పుడు దుమ్ము, వానొస్తే రోడ్డుపై గుంతలలో నీరు చేరి నరకయాతన అనుభవిస్తున్నాం. రోడ్డు బురదమయంగా మారి అడుగు బయట పెట్టలేకపోతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారిని అభివృద్ధి చేయాలి. – శివదానం శివకృష్ణ (గ్రామస్తుడు, వెల్వడం)నా ఇంటిని కూల్చి పరిహారం ఇవ్వలేదు రోడ్డును వెంటనే బాగు చేయాలి -
వంతెన నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): పెనమలూరు మండలం పోరంకిలో బందరు కాలువపై వంతెన నిర్మాణానికి సంబంధించి అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సమీక్షించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ బాలాజీ బంద రులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోరంకి వద్ద బందరు కాలువపై వంతెన నిర్మాణం గురించి సమీక్షించారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సమీ పంలో వంతెన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆయన చర్చించారు. బందరు కాలువ కట్టపై ఇరువైపులా ఉన్న ఆక్రమణలు, భూసేకరణ, పరిహారం, నిర్మాణానికి పట్టే సమయం తదితర అంశాలపై అధికారులతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఉయ్యూరు ఆర్డీఓ బి.ఎస్.హేలా షారోన్, ఇరిగేషన్ ఎస్ఈ మోహన్రావు, రహదారులు భవనాలు ఎస్ఈ భాస్కరరావు, ఈఈ లోకేష్, కంకిపాడు తహసిల్దార్ గోపాలకృష్ణ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రాజ్ ప్రియాసింగ్ నేతృత్వంలోని బృందం మంగళవారం పరిశీలించింది. తొలుత రేమల్లె గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు పండ్లతోటల సాగు, బంద్రీ చెరువు పూడికతీత, పశువుల షెడ్ల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ చానల్ పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మామిడి మొక్కలు పెంచుతున్న రైతు సంగీతరావుతో మాట్లాడారు. సాగు వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మడిచర్ల గ్రామంలో పంట కుంట, బీటీ రోడ్డు, రజక చెరువులో పూడిక తీత, పశువుల షెడ్డు నిర్మాణం, మ్యూజిక్ సోక్ పిట్ పనులను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. పీఎంఏవై–జీ పథకం కింద గ్రామంలో చేపట్టిన గృహ నిర్మాణాలను సందర్శించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద కానుమోలు నుంచి రంగయ్య అప్పారావు పేట, రామ శేషాపురం గ్రామాల మీదగా రామన్నగూడెం వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ సీఈఓ కన్నమ్మ నాయుడు, డ్వామా పీడీ శివ ప్రసాద్ యాదవ్, డీఆర్డీఏ పీడీ హరహరినాథ్, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాసరావు, ఎంపీడీఓ జోగేశ్వరరావు, ఏపీఓ అశోక్కుమార్, పంచాయతీ కార్యదర్శులు, పలువురు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర కీలకం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజల ఆరోగ్య పరిరక్షణకు శ్రమించే వైద్యులను సమాజంలోని అన్ని వర్గాల వారు గౌరవించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ సూచించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు వైద్యులను మంగళవారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లా డుతూ.. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమన్నారు. నిరంతరం ప్రజాసేవపై చిత్త శుద్ధి, అంకితభావంతో పనిచేసే వైద్యులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఎంతో ప్రయాస పడి వైద్య విద్యను అభ్యసించి వ్యక్తిగత, కుటుంబ పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచటానికి కృషి చేస్తున్న వైద్యులపై ప్రజలు, నాయకుల ధోరణిలో మార్పు రావాలన్నారు. ఆఖరి క్షణం వరకు రోగుల ప్రాణాలు కాపాడేందుకు శ్రమించే వైద్యులపై దాడులు సరి కాదని పేర్కొన్నారు. విశిష్ట సేవలందించిన వైద్యులకు సత్కారం జాతీయ డాక్టర్స్ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన పది మంది వైద్యులను మంత్రి సత్య కుమార్ యాదవ్ సత్కరించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మశ్రీవాత్సవ, ప్రస్తుత డీఎంఈ, శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ డి.ఎస్.వి.ఎల్.నరసింహం, జనరల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ ఎ.అశ్విని కుమార్, కార్డియాలజిస్ల్టు డాక్టర్ ఎ.శ్రీనివాసరావు, డాక్టర్ పి.భాస్కరనాయుడు, డాక్టర్ జి.భవానీప్రసాద్, న్యూరోసర్జన్ డాక్టర్ కె.సత్యవరప్రసాద్, డాక్టర్ ఎం. కృష్ణనాయక్, డాక్టర్ ఆర్.మురళీబాబూరావు, ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ టి.భారతిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి, హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, డీఎంఈ అకడమిక్ డాక్టర్ జి.రఘునందనరావు, మానసిక వైద్యుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ డాక్టర్స్ డే సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులకు సత్కారం -
దుర్గమ్మకు భక్తుల ఆషాఢ సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు. సోమవారం రికార్డు స్థాయిలో భక్తులు, భక్తబృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. సోమవారం ఉదయం నుంచి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో భక్తులు విశేషంగా తరలిరావడం కనిపించింది. ఉదయం నుంచి ప్రారంభమైన సారె సంబరం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఆలయ వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్ కుటుంబం అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించింది. నగరంతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి భక్తులు సారె సమర్పించేందుకు తరలివవచ్చారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పిస్తున్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. -
డివైడర్ను ఢీకొని ఇరువురు యువకులు దుర్మరణం
కోనేరుసెంటర్: రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు మృతి చెందారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసుల విచారణలో తేలింది. జరిగిన సంఘటనపై ఇనకుదురుపేట పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బందరు మండలం చిన్నాపురం గ్రామానికి చెందిన దాలిపర్తి పవన్కళ్యాణ్ (23), కోడూరు గ్రామానికి చెందిన మేడా రవీంద్ర (22) మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు ట్రావెల్స్లో క్లీనర్లుగా పనిచేస్తున్నారు. సోమవారం చిన్నాపురం గ్రామంలోని మద్యం దుకాణంలో వారిద్దరూ పూటుగా మద్యం తాగి బైక్పై మితిమీరిన వేగంతో మచిలీపట్నం వస్తుండగా శారదానగర్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇరువురి తలలు పగిలిపోయి మెదళ్లు బయటికి వచ్చి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు ఇనకుదురుపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఇరువురి కుటుంబాలకు అందజేసినట్లు సీఐ పరమేశ్వరరావు తెలిపారు. పొట్టకూటి కోసం వెళ్లి అనంతలోకాలకు..! కోడూరు: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన మేడ రవీంద్ర(25) తల్లిదండ్రులు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో రవీంద్ర మచిలీపట్నంలోని బంధువుల ఇంటి వద్ద ఉంటూ ఓ ప్రయివేటు ట్రావెల్స్లో క్లీనర్గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం స్నేహితుడితో కలిసి మచిలీపట్నం వెళ్తుండగా శారదనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. రవీంద్ర మృతితో రామకృష్ణాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గొల్లపూడిలోని గోదావరి రుచులు హోటల్ సమీపంలో జరిగింది. ఆదివారం అర్థరాత్రి సమయంలో ఓ వ్యక్తి విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే రోడ్డులో గొల్లపూడి గోదావరి రుచులు హోటల్కు ఎదురుగా నడుచుకుంటూ వెళుతున్నాడు. వెనుక నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ఆ వ్యక్తిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో మృతుని తలకు బలమైన గాయమైంది. స్థానికులు అతనిని అంబులెన్స్లో ఎక్కించారు. అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు నలుపు రంగు టీషర్టు, నలుపు రంగు నైట్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీఆర్వో పవన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ దుర్మరణం యలమర్రు(పెదపారుపూడి): విద్యుత్ మోటారు నుంచి వచ్చిన విద్యుత్ సరఫరా కారణంగా ఓ వలస కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని యలమర్రులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కలుపుకూరి సూరి(18) పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం ముండ్రువారిపాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలుడు. సూరి తన తల్లి పాకీరమ్మతో కలిసి రెండు రోజుల క్రితం యలమర్రు గ్రామంలోని మూల్పూరి నరేంద్ర అనే రైతు పొలంలో పనులకు వచ్చారు. సోమవారం ఉదయం పొలంలో గట్లు పని చేస్తుండగా పక్కనే విద్యుత్ మోటారు నుంచి విద్యుత్ సరఫరా కావటంతో షాక్ తగిలి అక్కడికక్కడే పడి పోయాడు. తోటి కూలీలు స్థానిక పీహెచ్సీకి తరలించగా పరీక్షలు చేసిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించామని ఎస్ఐ ప్రవీణ్కుమార్ రెడ్డి తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అపార్ట్మెంట్ పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మానసిక స్థితి బాగాలేని ఓ వృద్ధురాలు అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గొల్లపూడి సాయిపురం కాలనీలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గొల్లపూడి సాయిపురం కాలనీ ఇంద్రాణి టవర్స్లో రిటైర్డ్ ఇంజినీర్ కుంటముక్కల వెంకటేశ్వరరావు, అతని భార్య భానుమతి(65) నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు శ్రీకాంత్ 12 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాడు. భానుమతి గత ఐదేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతూ మానస సైకియాట్రిక్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. మందులు వాడుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆమె అపార్ట్మెంట్ పైనుంచి దూకింది. పెద్ద శబ్దం రావడంతో వాచ్మెన్ గమనించి ఆమె భర్తకు తెలియజేశాడు. తన భార్య మానసిక క్షోభ తట్టుకోలేక అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త వెంకటేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రత్యక్ష దైవాలు వైద్యులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ప్రాణాపాయంతో ఆస్పత్రికి వచ్చిన రోగికి సత్వర వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించిన వైద్యుడిని దైవంతో సమానంగా భావిస్తారు. రోగులకు సేవలు అందించే క్రమంలో పలువురు వైద్యులు ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అయినప్పటికీ తమ వృత్తి ధర్యాన్ని నెరవేరుస్తూనే ఉంటారు. కరోనా సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వైద్యుడు కరోనా బారినపడి చావు అంచులదాకా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఒకప్పుడు రోగి లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స చేసే వాళ్లు. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందు బాటులోకి వచ్చింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి వ్యాధినైనా నిర్ధారించడమే కాదు. ముందుగా లక్ష ణాలు గుర్తించే పరికరాలు వచ్చాయి. ఎంఆర్ఐ, సీటీ, పెట్సీటీలు ఉన్నాయి. దీంతో కచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించగలుగుతున్నారు. చికిత్సలో సత్ఫలితాలు సాధించగలుగుతున్నారు. గర్భస్థ పిండానికి సైతం వైద్యం చేసే స్థాయికి మన వైద్యులు ఎదిగారు. అరుదైన జబ్బులకు విజ యవంతంగా చికిత్సలు అందిస్తున్నారు. జబ్బు చేసి వచ్చిన వారు నయం అయిన తర్వాత ఆస్పత్రి నుంచి వెళ్లేటప్పుడు రోగి తెలిపే కృతజ్ఞతలే వైద్యులకు సంతృప్తినిస్తాయి. ప్రాణాపాయంతో వచ్చిన వారికి పునర్జన్మ సేవలు అందిస్తూ ఇన్ఫెక్షన్స్ బారిన పడిన డాక్టర్లు ఎందరో... ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రాణం పోస్తున్నారు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం... -
బీడీసీ రిటైనింగ్ వాల్ పరిశీలించిన మంత్రి నిమ్మల
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): గతేడాది బుడమేరు కట్టకు గండ్లు పడిన ప్రాంతంలో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను సోమవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. మిగులు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణం పూర్తి చేస్తున్నామని, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద పాతగేట్ల స్థానంలో రూ.1.8 కోట్లతో నూతన గేట్లు అమర్చినట్లు తెలిపారు. బుడమేరు కట్ట పటిష్టత కోసం వెలగలేరు– ఈలప్రోలు మధ్య 7 కిలోమీటర్ల పొడవునా గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 57 కిలోమీటర్ల పొడవునా డ్రైన్లో పూడికతీత పనులు జరుగుతున్నట్లు తెలిపారు. కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా బుడమేరు నీరు సముద్రంలో కలిసేలా రూ.9 కోట్లతో డీసిల్టింగ్ పనులు జరుగుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మంత్రితో పాటు జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీలో అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకంలో అవినీతి రాజ్యమేలుతోందని వైఎస్సార్ సీపీ ఎంపీపీల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ అన్నారు. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే న్యాయ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పంచాయతీరాజ్ విభాగంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, వారందరికీ సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం నిబంధనలకు విరుద్ధంగా పనులను వెండార్లకు కేటాయించారని, ఇది సరికాదన్నారు. ఈ పథకాన్ని టీడీపీ నేతల జేబులు నింపుకొనే పథకంగా మార్చివేసిందన్నారు. ఉపాధి హామీ పనులు పంచాయతీల ద్వారానే జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన సమస్యల పరిష్కారానికి పూనుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులను సైతం దారి మళ్లిస్తోందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను ఆగౌరవపరస్తూ చట్టాలను తుంగలోకి తొక్కుతోందన్నారు. 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు రూ.1150 కోట్లు స్థానిక సంస్థలకు వెంటనే జమచేయాలని డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపులో రాజకీయ జోక్యం నివారించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74, సవరణల మేరకు సర్పంచులకు ఉన్న అధికారాలను వర్తింపజేయాలని మాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని రవిశంకర్ మాట్లాడుతూ 1320 మంది పంచాయతీ సెక్రటరీలకు తక్షణమే పోస్టింగ్స్ ఇచ్చి పెండింగ్లో ఉన్న 9 నెలల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్లందరికీ తల్లికి వందనం పథకంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు వెంటనే పెంచాలని, సకాలంలో చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం ప్రతినిధులు పి.రమేష్, వి.వెంకట నారాయణరెడ్డి, సీహెచ్ బుచ్చిరెడ్డి, జె.ప్రేమ్రాజ్, సీహెచ్ రమేష్, సీహెచ్ వేమనరావు, బండారు ఆంజనేయులు, జి.అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను కాపాడాలి జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం -
మానసిక నిపుణుల అవసరం పెరిగింది
త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి లబ్బీపేట (విజయవాడతూర్పు): ప్రస్తుత సమాజంలో జీవనశైలి, దురలవాట్ల కారణంగా మానసిక రుగ్మతలు పెరిగాయని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. అందువల్ల మానసిక నిపుణుల అవసరం కూడా సమాజంలో పెరిగిందన్నారు. విజయవాడలోని ఇండ్లాస్ హాస్పిటల్స్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఎం.ఫిల్ క్లినికల్ సైకాలజీ, పీడీసీపీ కోర్సులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ఆయన విజయవాడలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి ఆయా కోర్సుల్లో అడ్మిషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మానసిక రుగ్మతలను సైతం ఆరోగ్య సమస్యలు గానే పరిగణించి చికిత్సనందించాలని సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, మానసిక వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇండ్లాస్ హాస్పిటల్స్ క్లినికల్ సైకాలజీ విభాగం డైరెక్టర్లు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్ ఇండ్ల మాట్లాడుతూ మానసిక వైద్యాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ బోర్డును అమలు చేసే వరకు పోరాటం
ఆటోనగర్(విజయవాడతూర్పు): కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు తగ్గాయి. వేతనాలు విపరీతంగా తగ్గాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ గౌవర అధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెన్సీ నగర్లోని ఓ ప్రయివేట్ కల్యాణ మండపంలో సోమవారం ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ నిర్మాణరంగ సంక్షేమ బోర్డును అమలు చేయాలని, లేకుంటే పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి సంక్షేమ బోర్డును అమలుచేస్తామని కార్మికులకు మాట ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక దానిని పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు తక్కువయ్యాయని, అపార్ట్మెంట్ల నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వారంతా కార్మికులను ఒడిశా, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల వారితో పనులు చేయించుకుంటున్నారన్నారు. స్థానిక కార్మికులకు పనులు దొరకక కార్మిక కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పుట్టెపు అప్పారావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు డీవీ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ వెంకటేశ్వరరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ ఎ.కమల పాల్గొన్నారు. ఎన్నికల హామీని తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం వేతనాలు తగ్గాయి.. ధరలు పెరిగాయి కార్మిక కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 10వ జిల్లా మహాసభ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు -
క్యాన్సర్ను జయించేలా చికిత్సలు
ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే జీవితం ముగిసినట్లేనని భావించేవాళ్లు. కానీ నేడు ఎంతోమంది క్యాన్సర్ రోగులకు స్వస్థత చేకూర్చి సాధారణ జీవితం గడిపేలా చేయగలుగుతున్నాం. అదే మాకు సంతృప్తినిస్తుంది. క్యాన్సర్పై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉంది. ఇంకా కొందరు నాలుగో దశలో చికిత్సకోసం వస్తున్నవారు ఉన్నారు. ప్రస్తుతం అత్యాధునిక నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో సూక్ష్మదశలోనే క్యాన్సర్ను నిర్ధారించి సత్ఫలితాలు సాధించగలుగుతున్నాం. రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వంటి వాటిని అత్యుత్తమ చికిత్సా పద్ధతుల ద్వారా నయం చేయగలుగుతున్నాం. – డాక్టర్ ఎన్.సుబ్బారావు, క్యాన్సర్ వైద్య నిపుణుడు జీవనశైలి వ్యాధులు పెరిగాయి సమాజంలో జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మూడు పదుల వయస్సులోనే మధుమేహం, రక్తపోటు, ఒబెసిటీలకు గురవుతున్నారు. దీంతో హార్ట్ ఎటాక్, పక్షవాతం వంటి జబ్బుల బారిన పడుతున్నారు. ప్రతి వైద్యుడు బాధ్యతగా వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి. – డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి, మధుమేహ వ్యాధి నిపుణుడు ●రోగి కృతజ్ఞతే మాకు సంతృప్తి నిత్యం ఎంతో మంది ఆయాసం, శ్యాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో వస్తుంటారు. వారికి సరైన చికిత్స అందిస్తే వారు తర్వాత ఓపీకి వచ్చినపుడు మా పట్ల ఎంతో కృతజ్ఞతా భావం కనపరుస్తుంటారు. అదే మాకు కొండంత సంతృప్తి నిస్తుంది. కోవిడ్ సమయంలో వందలాది మందికి సేవలు అందించాం. ఆ సమయంలో మాకు కోవిడ్ సోకే అవకాశం ఉంటుందని తెలిసినా, రోగులకు చికిత్స అందించడమే లక్ష్యంగా పనిచేశాం. అదే మాకు సంతృప్తి నిస్తుంది. –టి.కార్తీక్, శ్యాసకోశ వ్యాధుల నిపుణుడు విలువలతో కూడిన సేవలు అందించాలి వైద్యుడు సమాజ సేవకునిగా పనిచేయాలి. వైద్యాన్ని వ్యాపారంగా పరిగణించకూడదు. రోగులతో మంచిగా మెలగాలి. విసుక్కోకూడదు. సమయపాలన, కమిట్మెంట్, డిసిప్లేన్ అనేది చాలా ముఖ్యం. ప్రభుత్వాస్పత్రిలకు పేదలే వస్తుంటారు. పేదలకు వైద్య సేవలు అందించే అదృష్టం ప్రభుత్వ వైద్యులకు మాత్రమే ఉంటుంది. అలాంటి చోట విద్యనభ్యసించే వారు సైతం సేవా భావాన్ని అలవర్చుకోవాలి. –డాక్టర్ ఆలపాటి ఏడుకొండలు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల -
ప్రభుత్వాలు కృషి చేయాలి..
పెడన: వస్త్ర ప్రపంచంలో ఎన్ని ఆధునిక డిజైన్లు అవతరిస్తున్నా వన్నెతగ్గనిదిగా సహజసిద్ధ కలంకారీ నిలుస్తోంది. ఈ ప్రాచీన కళకు సరికొత్త హంగులు అద్దుతున్న తరుణంలో మరింత ప్రాచుర్యం కోసం కలంకారి పరిశ్రమలు చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇస్తోంది. ఆఫ్లైన్ బిజినెస్తో పాటు ఆన్లైన్ షాపింగ్ కూడా ఉండటంతో.. ఫ్యాషన్ డిజైన్ యూనివర్సిటీలు, కళాశాలలు దీనిపై దృష్టిసారిస్తున్నాయి. ఈ క్రమంలోనే డెహ్రాడూన్లోని గ్రాఫిక్ ఏరా హినియన్ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైన్ చేస్తున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ప్రాజెక్టు వర్క్కు కలంకారీని ఎంపిక చేసుకున్నారు. వర్సిటీలో మొత్తం 45 మంది వివిధ ప్రాంతాల్లో, ముగ్గురు ముగ్గురు చొప్పున 15 బ్యాచ్లుగా విడిపోయి ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఊటీ, వెస్ట్ బెంగాల్, బెనారస్ తదితర ప్రాంతాల్లో ప్రాజెక్టు చేస్తున్నారు. వారిలో ఒక బ్యాచ్ కృష్ణా జిల్లాలోని పెడనలో శ్రీనివాస కోరమండల్ కలంకారీ అండ్ హ్యాండ్ లూమ్స్ హౌస్ను ఎంపిక చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే వీరు ప్రాజెక్టు వర్క్ మొదలు పెట్టి 15 రోజులు అయింది. ప్రాసెసింగ్ నుంచి ప్రింటింగ్ వరకు.. ప్రాజెక్టు వర్క్ చేసేందుకు వచ్చిన విద్యార్థినులు కోరా క్లాత్ను ఏ విధంగా సిద్ధం చేయాలి, సహజ సిద్ధ రంగులు ఏ విధంగా తయారు చేస్తున్నారు.. ఏయే రంగులు వేటి ద్వారా వస్తున్నాయి.. వంటి వివరాలను తెలుసుకోవడంతో పాటు లిఖితపూర్వకంగా నమోదు చేసుకుంటున్నారు. రికార్డులు రాసుకుంటూ స్వయంగా క్షేత్రస్థాయిలో ప్రాసెసింగ్లో భాగస్వాములవుతున్నారు. కలంకారీపై తొలిసారిగా ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న డెహ్రాడూన్ వర్సిటీ విద్యార్థినులు కళకు సరికొత్త హంగులద్దడమే లక్ష్యమంటున్న విద్యార్థినులు సహజ సిద్ధ కలంకారీ కళను బతికించడానికి, మరింత ప్రాచుర్యం చెందేలా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టు వర్క్లను చేసుకునేలా విద్యార్థులను ప్రొత్సహించేలా అడుగులు వేస్తే బాగుంటుంది. విద్యార్థినులు స్వతహాగా ప్రాజెక్టు వర్క్ చేయాలని రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వారికి చేయగలిన సహాయం చేస్తాం. – పిచ్చుక వరుణ్కుమార్, శ్రీనివాస కోరమండల్ అధినేత, పెడన -
సహజ సిద్ధ రంగులు ఆకట్టుకున్నాయి..
కలంకారీ డిజైన్లను ఆన్లైన్, ఇన్స్టాగ్రామ్లలో చూశా. స్వయంగా పరిశీలించి తెలుసుకోవడం కోసం ఈ ప్రాజెక్టును ఎంపిక చేసుకున్నా. సహజ సిద్ధ రంగులతో డిజైన్లు ముద్రించడం, పర్యావరణానికి ఎటువంటి హానీ కలుగకుండా ఉండేలా ఈ పరిశ్రమలుండటం వల్ల ఈ రంగంపై దృష్టిపెట్టాను. ట్రెడిషనల్గా ఉండే ఈ కలంకారీ డిజైన్లను వెస్ట్రన్ డిజైన్వైపు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ఎంపిక చేసుకున్నా. – కుషుబుకుమారి, డెహ్రాడూన్ యూనివర్సిటీ -
కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
ఇఫ్టూ భవన నిర్మాణ కార్మిక సంఘాల విలీన సభ డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని ఇఫ్టూ రాష్ట్ర నాయకుడు కె. పోలారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఇఫ్టూ అనుబంధ.. ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం, ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం విలీన సభ జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో పోలారి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో హామీలను ఇచ్చారన్నారు. బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారానికి వచ్చి ఏడాది అయినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు అట్టడుగు స్థాయిలో ఉండడం బాధాకరమన్నారు. నూతన కమిటీ ఎన్నిక.. ఇఫ్టూ ఉపాధ్యక్షుడు ఆర్.మోహన్ మాట్లాడుతూ రెండు సంఘాలను ఒకే సంఘంగా విలీనం చేశామని, ఇకపై ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం పేరుతో పనిచేస్తుందని ప్రకటించారు. ఈ మేరకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు. నూతన సంఘానికి అధ్యక్షుడిగా ఆర్.మోహన్, ప్రధాన కార్యదర్శిగా కె.వి రమణ, ఉపాధ్యక్షుడిగా ఏసురత్నం, సహాయ కార్యదర్శిగా ఎం. నాగరాజు, కోశాధికారిగా గుబ్బల ఆదినారాయణ, మరో 12 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ఏఎన్ఎం బదిలీలకు కౌన్సెలింగ్
మచిలీపట్నం అర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏఎన్ఎం గ్రేడ్–3 ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ సోమవారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. శర్మిష్ఠ కౌన్సెలింగ్ను పర్యవేక్షించారు. ఉద్యోగులు సేవా రిజిస్టర్, ప్రాధాన్యతలు, విద్యార్హతల జిరాక్స్, పారామెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఒరిజినల్స్తో ఉదయం 8గంటల నుంచి కార్యాలయంలో కౌన్సెలింగ్కు హాజరయ్యారు. సోమవారం పొద్దుపోయేవరకు సాగిన కౌన్సెలింగ్లో 368 మంది ఎన్టీఆర్, 329మంది కృష్ణా, 94మంది ఏలూరు జిల్లాలోని ఉద్యోగులు బదిలీ అయ్యారు. మునిసిపాలిటీలతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు సీనియారిటీ జాబితాల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి, బదిలీ ఉత్తర్వులను అందజేశారు. -
జగన్మాతకు తెలంగాణ బంగారు బోనం
కిక్కిరిసిన బ్రాహ్మణ వీధి.. బోనాలతో ఊరేగింపుగా వస్తున్న భక్తులుసాదర స్వాగతం.. కళాకారులు, కమిటీ ప్రతినిధులు, భక్తులతో ఘాట్రోడ్డుపై పండుగ వాతావరణం కనిపించింది. ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వద్ద బంగారు బోనానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో శీనానాయక్, అర్చకులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం బంగారు, వెండి బోనంతో పాటు పూజా సామగ్రి, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను ఆలయ ఈవో, ఆలయ అర్చకులకు అందజేశారు. అమ్మవారి దయతో ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఉత్సవ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో ఎన్. రమేష్బాబు, వెంకటరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపపశ్చిమ): హైదరాబాద్ లోని భాగ్యనగర్ శ్రీమహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ తరఫున ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం తెలంగాణ బంగారు బోనాన్ని సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషా లతో ఉండాలని కోరుతూ గత 16 ఏళ్లుగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి బోనాల కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 500 మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. భక్తుల బారులు.. జోగిని శ్యామలాదేవి బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా.. వెండి తదితర బోనాలతో మిగిలిన వారు ముందుకు నడిచారు. బంగారు బోనాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రి పరిసరాలకు తరలివచ్చారు. దుర్గాఘాట్కు చేరుకున్న ఊరేగింపు కృష్ణమ్మకు గంగ తెప్పను సమర్పించిన పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం దుర్గాఘాట్, ఘాట్రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఇంద్రకీలాద్రికి తరలివచ్చిన భాగ్యనగర్ బోనం 500మందితో భారీ ఊరేగింపు ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు -
మేమింతే.. మారమంతే!
వక్ఫ్ భూములపై మళ్లీ వాలిన ‘పచ్చ’గద్దలు!పెనమలూరు: తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో ఉన్న కొండపల్లి ఖాజీ వక్ఫ్ భూములను పచ్చగద్దలు ఆక్రమించే పనిలో ఉన్నాయి. ఈ భూములకు గత కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్ గోపాలకృష్ణ బహిరంగ కౌలు వేలం నిర్వహించారు. వక్ఫ్ అధికారులు భూముల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టారు. అయితే అత్యంత విలువైన వక్ఫ్ భూములు ఆక్రమించటానికి కొంతమంది రంగంలోకి దిగారు. దీనిపై కొండపల్లి ఖాజీ సర్వీస్ ఇమామ్ ఎస్హెచ్ హుస్సేనీ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. తాడిగడప, పెదపులిపాక గ్రామాలలో వక్ఫ్ భూములు దాదాపు 40 ఎకరాలకు పైగానే ఉన్నాయి. ఈ భూములు చాలా ఏళ్లుగా కొంత మంది ‘పచ్చ’నేతలు ఆక్రమించి నయాపైసా కౌలు చెల్లించకుండా సాగు చేశారు. దీనిపై ‘సాక్షి’ దిన పత్రికలో కథనాలు రావటం, వక్ఫ్ అధికారులు స్పందించటంతో ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో కౌలు బహిరంగ వేలం తహసీల్దార్ గోపాలకృష్ణ సమక్షంలో ఇటీవల నిర్వహించారు. కౌలు వేలంలో పలువురు రైతులు పాల్గొని రూ.25 లక్షలకు కౌలువేలం పాడారు. ఇక కోర్టు అనుమతులతో కౌలు పాట పాడిన వారు వక్ఫ్ భూములు సాగు చేయాల్సి ఉంది. అదును చూసి.. చొరబడి.. కొంతమంది కోర్టు ఉత్వర్వులకు వ్యతిరేకంగా, తహసీల్దార్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ వక్ఫ్ భూముల్లోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించి భూములు దున్నారని కొండపల్లి ఖాజీ సర్వీస్ ఇమామ్ ఎస్హెచ్ హుస్సేనీ పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోడవరానికి చెందిన టి.శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురు వ్యక్తులు చట్ట విరుద్ధంగా వక్ఫ్ భూముల్లోకి ప్రవేశించి భూములు దున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇమామ్ ఎస్హెచ్ హుస్సేనీ కోరారు. ఈ ఆక్రమణలపై ఇక పోలీసులు చిత్తశుద్ధితో ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కౌలు వేలం నిర్వహించినా ఆగని వైనం పోలీసులకు ఫిర్యాదు -
సత్తా చాటిన బాడీ బిల్డింగ్ క్రీడాకారులు
పెనమలూరు: రాష్ట్ర స్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ చాటి పతకాలు సాధించారు. ఈ నెల 22వ తేదీన కావలిలో నిర్వహించిన సింహపురి మిస్టర్ ఆంధ్ర రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో స్పోర్ట్స్ ఫిజిక్లో ఎం.దినేష్ బంగారు పతకం గెలిచాడు. బాడీ బిల్డింగ్ 55 కేజీల విభాగంలో వి.సూర్యదేవరవరప్రసాద్, కాంస్య పతకం, 85 కేజీల విభాగంలో ఏ.నాగ అభినవ్ కాంస్య పతకం సాధించారు. క్రీడాకారులను కానూరు అశోక్ జిమ్లో ఆదివారం అభినందించి మెమెంటోలు అందజేశారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి తాల్లూరి అశోక్, కోచ్ అల్లూరిరెడ్డి, ఎమ్మెల్యే బోడెప్రసాద్, డాక్టర్ వెలినేని పవన్, యువజన సర్వీసుల శాఖ అధికారి రఘురామ్ తదితరుల అభినందించారు. ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేయండి: డీఈవో వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను విక్రయిస్తున్న విద్యాసంస్థల్లో తనిఖీలు చేసి నివేదికలు సమర్పించాలని ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ దినపత్రికలో ఇటీవల ప్రచురితమైన ‘ప్రైవేటు’ దోపిడి కథనానికి డీఈవో స్పందించారు. అలాగే వివిధ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావటంతో ఆయన మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలను తక్షణమే తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ను అధిక ధరలకు విక్రయించటం, అధిక ఫీజుల వసూలు చేసిన వారి పాఠశాలల గుర్తింపు రద్దు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ముగిసిన నాట్య ప్రాక్టికల్ పరీక్షలు కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళా పీఠంలో మూడు రోజులుగా జరుగుతున్న సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. పరీక్షలకు 21 మంది విద్యార్థులు హాజరయ్యారని పరీక్షలకు అధికారిగా వ్యవహరించిన సుధీర్రావు తెలిపారు. కళా పీఠం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాల కృష్ణ నట్టువాంగంతో, టీచింగ్ అసిస్టెంట్ పసుమర్తి హరినాథ శాస్త్రి మృదంగంపై సహకరించారు. ఫొటోగ్రఫీలో జిల్లాస్థాయి పోటీలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 19న ఫొటోగ్రఫీలో విశేష ప్రతిభ కనబరిచిన ఫొటోగ్రాఫర్లకు జిల్లా స్థాయిలో పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఫొటో జర్నలిస్టులు, ఫొటో గ్రాఫర్లు పోటీలలో పాల్గొనవచ్చన్నారు. జూలై 31వ తేదీలోగా తమ ఎంట్రీలు పంపాల్సి ఉంటుందని తెలిపారు. మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నామని.. మొదటి విభాగంలో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, స్వచ్ఛాంధ్ర/స్వచ్ఛ ఎన్టీఆర్, యోగాంధ్ర అంశాలకు సంబంధించి ఫొటో ఎంట్రీలు పంపొచ్చన్నారు. రెండో విభాగంలో తల్లికి వందనం/విద్య, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం – 2 ఉన్నాయని, మూడో విభాగంలో అత్యుత్తమ న్యూస్ ఫొటో పోటీ ఉంటుందన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ (రూ. 10 వేలు), ద్వితీయ (రూ. 7వేలు), తృతీయ (రూ. 4 వేలు) బహుమతులతో పాటు రూ. 2 వేలు చొప్పున ఆరుగురికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు వివరించారు. ఒరిజినల్ ఫొటో ఎంట్రీలను డీపీఆర్వో కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్, విజయవాడ–520002 చిరునామాకు నేరుగా లేదా పోస్టల్ ద్వారా సమర్పించవచ్చని, ఇతర వివరాలకు 9121215373లో సంప్రదించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. -
జగజ్జననికి జేజేలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల్లో భక్తులు జగజ్జననికి జేజేలు పలుకుతున్నారు. దుర్గమ్మకు సారె సమర్పణ కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం తరలివస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు 70 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారిని దర్శించుకునేందుకు మూడు గంటల సమయం పట్టగా, సామాన్య భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఉదయం నుంచే అంతరాలయ దర్శనం పూర్తిగా నిలిపివేశారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పణకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు ఆపేశారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే అంతరాలయ దర్శనం కల్పించారు. ఉత్సవమూర్తికి సారె సమర్పణ తెలంగాణ నుంచి అమ్మవారికి సమర్పించే బంగారు బోనంను చూసేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలోనే వేచి ఉండటంతో మరింత రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. సారె ఇవ్వడానికి వచ్చిన భక్తులు తొలుత ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారెను సమర్పించారు. అనంతరం భక్తబృందంలోని సభ్యులకు సారెలోని పసుపు, కుంకుమతో పాటు ప్రసాదాలను పంపిణీ చేశారు. రద్దీ నియంత్రణకు దేవస్థానంలోని ఇంజినీరింగ్, పరిపాలనా విభాగం, ఇతర విభాగాల సిబ్బందికి అదనపు విధులను కేటాయించారు. సూర్యోపాసన సేవ దుర్గగుడిలో ఆదివారం సూర్యోపాసన సేవ చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్యభగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దుర్గమ్మకు సారె, బోనాలు సమర్పణ 70 వేల మందికి పైగా భక్తులకు అమ్మ దర్శనం అంతరాలయ దర్శనం రద్దు సర్వ దర్శనానికి మూడు గంటలు -
నిరంతర యోగాతో సత్ఫలితాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. ఆదివారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జరిగిన యోగాభ్యాసన కార్యక్రమం కలెక్టర్ పాల్గొన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ తదితరులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం యోగా సాధన చేయాలన్నారు. యోగా సాధనను ఏ ఒక్క రోజుకో, నెలకో పరిమితం చేయకూడదన్నారు. నిత్యం జీవితంలో భాగం చేసుకొని సాధన చేయడం ద్వారా దాని ఫలితాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆయుష్ అధికారి డాక్టర్ రత్న ప్రియదర్శిని, యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. క్రీస్తు మార్గం అనుసరణీయంగుణదల(విజయవాడ తూర్పు): సర్వమానవాళి రక్షణ ప్రణాళికలో భాగంగా ఏసుక్రీస్తు ఈ లోకానికి అరుదెంచారని, ఆయన అనుసరణీయమని గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజ్ అన్నారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయంలో ఆదివారం ఉదయం సమష్టి దివ్య బలి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఈ లోకానికి వెలుగన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. అనుదిన ప్రార్థనతో పాటు భక్తి విశ్వాసాలను కొనసాగించాలని వివరించారు. దేవుడు బోధించిన ప్రేమ, జాలి, దయ వంటి సద్గుణాలను కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. -
శ్రీమన్నారాయణుడి ఆలయంలో కోటి అష్టాక్షరీ మహాయజ్ఞం
కోడూరు: అభినవ మేల్కోటగా పేరుగాంచిన ఉల్లిపాలెం గోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణస్వామి ఆలయంలో కోటి అష్టాక్షరీ మహాయజ్ఞాన్ని (శ్రీమన్నారాయణ యజ్ఞం) భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజీయర్ స్వామి తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో మహాయజ్ఞం నిర్వహణపై వివిధ వర్గాల ప్రముఖులతో స్వామీజీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 16 నుంచి 28 వరకు 13 రోజుల పాటు మహాయజ్ఞం నిర్వహించేందుకు పండితులు ముహూర్తాన్ని నిర్ణయించినట్లు స్వామిజీ చెప్పారు. దీనికి13 ప్రత్యేక యాగశాలలను నిర్మించడంతో పాటు అందులో 108 హోమగుండాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ కోటి సార్లు అష్టాక్షరీ మంత్రాన్ని జపించనున్నట్లు స్వామీజీ తెలిపారు. ఆలయంలో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు శ్రీమన్నారాయణుడి ఆలయంలో ప్రస్తుతం రూ.2 కోట్లతో అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నట్లు అష్టాక్షరీ స్వామి చెప్పారు. రూ.కోటితో గాలిగోపురం నిర్మాణం జరుగుతుండగా పనులు తుదిదశకు చేరినట్లు తెలిపారు. ఆలయం ఉత్తర, దక్షిణ ద్వారాలకు ఆర్చిల నిర్మాణాలు చేస్తున్నట్లు చెప్పారు. మహాయజ్ఞం సమయానికి అభివృద్ధి పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మహాయజ్ఞంపై రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆలయంలో ప్రతి శని, ఆదివారాలు అన్నదానం ఏర్పాటుకు కృషి చేస్తున్న దాతలను సత్కరించారు. బృందావనం పీఠాధిపతి అష్టాక్షరీ బృందావనం స్వామీజీ, అనంతపురానికి చెందిన వ్యాపారవేత్త దామోదర్దాస్, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 16 నుంచి 28 వరకు నిర్వహణ అష్టాక్షరీ స్వామి ఆధ్వర్యంలో సమావేశం -
ప్రభుత్వ పాఠశాలలో టేకు చెట్లు నరికివేత
చౌటపల్లి గ్రామస్తుల ఆగ్రహం వీరులపాడు: ప్రభుత్వ పాఠశాలలోని చెట్లను నరికి కలపను కాజేయడానికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని చౌటపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో 20 ఏళ్ల నాటి 30 టేకు చెట్లు ఉన్నాయి. వాటిలో ఐదు చెట్లు ఎండు దశకు చేరుకున్నాయి. దీంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా విద్యుత్ మిషన్తో చెట్లను కట్ చేసి తొలగించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లను తొలగించాలంటే ఉన్నతాధికారుల ఆదేశాలతో పాటు మండల పరిషత్లో తీర్మానం చేసి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాల ఆవరణలో ఉన్న కలపను స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఎంఈవో పాల్ కెనడీని వివరణ కోరగా పాఠశాల ఆవరణలో చెట్ల తొలగించేందుకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు ఆయన చెప్పారు. అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్ ఘంటసాల: అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని పౌరహక్కుల సంఘం కృష్ణా జిల్లా కమిటీ సభ్యుడు జక్కా కేశవరావు అన్నారు. ఘంటసాల గోటకంలో కేశవరావు ఆదివారం మాట్లాడుతూ శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు నాయకత్వం పదేపదే ప్రకటిస్తున్నా, మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారన్నారు. మోదీ, షా ప్రభుత్వం మే 21 నుంచి మావోయిస్టు అగ్ర నాయకుల నుంచి కార్యకర్తలను పెద్ద సంఖ్యలో బూటకపు ఎన్కౌంటర్లతో కాల్చి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్లో మన పౌరులను దారుణంగా చంపిన పాకిస్తాన్ పాలకులతో శాంతి చర్చలు జరపగలిగిన కేంద్రం మావోయిస్టులతో చర్చలకు నిరాకరించి నరమేథాన్ని కొనసాగించడం కుటిలనీతి కాదా అని ప్రశ్నించారు. చత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలోని సహజవనరులను పాలకులు బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలపై మావోయిస్టులు ఆప్రాంత ప్రజలను చైతన్యం పర్చడంతో గిరిజనలు, ఆదివాసీలు ఎదురిస్తుండటంతో దీనికి ప్రతిగా ఆపరేషన్ కగార్ మొదలైందన్నారు. ఈ దోపిడీకి అడ్డుపడుతున్న అటవీ చట్టాన్ని మార్చివేసి అటవీ సంరక్షణ నిబంధనలు 2022 చట్టాన్ని పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల మధ్య అప్రజాస్వామికంగా తీసుకొచ్చారన్నారు. దోపిడీ ఉన్నంతకాలం ప్రజలు హక్కుల కోసం పోరాడతారని చెప్పారు. -
ఎత్తిపోతలు.. ఉత్తమాటలు
జి.కొండూరు: ఎత్తిపోతల పథకాల విషయంలో ప్రజాప్రతినిధివి ఉత్తిమాటలుగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చింతలపూడి పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని ఎన్నికల ప్రసంగాల్లో ఎమ్మెల్యే ఊదరగొట్టారు. చింతలపూడి సంగతి దేవుడెరుగు మైలవరం నియోజకవర్గానికి జీవనాడిగా ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణను సైతం గాలికొదిలేశారు. దశాబ్దాల చరిత్ర ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణ లోపం కారణంగా ప్రస్తుతం మోటార్లు పని చేయడం లేదు. కాలువంతా తూడు కాడతో నిండిపోయింది. పని చేస్తున్న ఒకటి, రెండు మోటార్లు ఎత్తిపోసినా నీరు ముందుకు కదలకు రైతులు నరకయాతన పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికీ నిర్లక్ష్యం నీడలోనే తారకరామ ఎత్తి పోతల పథకం ఉండటంతో ఈ ఏడాది కూడా సాగునీరందడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్వహణను గాలికొదిలేశారు తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణను స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు గాలికొదిలేశారు. తారకరామ కుడి కాల్వపై ఉన్న నాలుగు పంప్హౌస్లలో మోటార్లు సరిగా పనిచేయని పరిస్థితి నెలకొంది. 9.25 కిలోమీటర్ల మేర ఉన్న తారకరామ కుడి కాల్వలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, తుమ్మ, జమ్ము, తూడు, మొదలైన వాటితో నిండిపోయాయి. దీంతో కాల్వలో నీరు ముందుకు నడవక పంపు హౌస్లలో ఉన్న మోటార్లకు నీరందడంలేదు. ఈ నాలుగు పంపు హౌస్లలో 14 మోటార్లు ఉండగా 8 పూర్తిగా పని చేయడంలేదు. మిగిలిన ఆరు మోటార్లు కూడా విద్యుత్ లోఓల్టేజీ కారణంగా, తూడు కాడతో మోటార్లకు నీరందక, మరమ్మతులు జరగక అంతంతమాత్రం పని చేస్తున్నాయి. ఆయకట్టు కింద 4,820 ఎకరాలు తారకరామ ఎత్తిపోతల పథకం మొదటి పంప్ హౌస్ నుంచి రెండో పంప్ హౌస్కి మధ్య ఆయకట్టు సాగు భూమి 850 ఎకరాలు ఉంది. కట్టుబడిపాలెం సమీపంలో రెండో పంపుహౌస్ నుంచి మూడవ పంపు హౌస్కు మధ్య ఆయకట్టు 980ఎకరాలు ఉంది. పినపాక గ్రామం సమీపంలోని మూడవ పంప్ హౌస్ నుంచి నాలుగో పంప్హౌస్కు మధ్య ఆయకట్టు 1,123ఎకరాలు ఉంది. జి.కొండూరు సమీపంలో నాలుగో పంప్హౌస్ కింద ఆయకట్టు 1,867ఎకరాలు ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పంప్ హౌస్ల నిర్వహణను గాలికి వదిలి వేయడంతో మోటార్లు సరిగా పని చేయడం లేదు. ఈ నాలుగు పంప్ హౌస్ల కింద ఉన్న 4,820 ఎకరాల వ్యవసాయ భూమికి నీరందడంలేదు. ప్రారంభం నుంచి 6.6కిలోమీటర్లు వద్దనే నిలిచిపోయిన ఎడమ కాల్వలో సైతం తూడుకాడ పెరిగి నీరు అంతం మాత్రంగానే ప్రవహిస్తోంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ ఎత్తిపోతల పథకంపై దృష్టిసారిస్తే రైతులకు కష్టాలు తొలగిపోతాయి. చింతలపూడి పూర్తి చేసి ఆరునెలల్లో నీరందిస్తానన్న ప్రజాప్రతినిధి! తారకరామ ఎత్తిపోతల నిర్వహణను గాలికొదిలేసిన వైనం మోటార్లు పనిచేయక, తూడుకాడతో నీరు ముందుకు కదలక రైతుల గగ్గోలు ఆయకట్టులో 4,820 ఎకరాల సాగు ప్రశ్నార్థకంతారకరామ కుడికాల్వపై ఉన్న నాలుగు పంపుహౌస్ల వివరాలు అంశాలు మొదటి లిఫ్ట్ రెండవ లిఫ్ట్ మూడవ లిఫ్ట్ నాల్గవ లిఫ్ట్ మోటార్లు సంఖ్య 4 4 3 3 పనిచేయని మోటార్లు 2 2 2 2 మోటార్ల కెపాసిటీ ఎచ్పీ 120 120 120 75 నీటి సామర్థ్యం క్యూసెక్లు 57.84 57.84 38.56 30.36 ఆయకట్టు ఎకరాలు 850 980 1123 1867 మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం తారకరామ ఎత్తిపోతల పథకంలో మోటార్ల మరమ్మతులకు రూ.3.57 కోట్ల వ్యయ అంచనాలతో ప్రతిపాదనలను సిద్ధం చేశాం. ఏపీ జెన్కో అధికారులు ఇటీవల పరిశీలించారు. ప్రతిపాదనలు పంపిన తర్వాత నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తాం. తారకరామ కుడి, ఎడమ కాల్వల్లో తూడుకాడ తొలగించడానికి రూ.8.9 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. –జి.వెంకటేశ్, తారకరామ ఏఈ -
గజిబిజి.. గందరగోళం!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో గజిబిజి గందరగోళంగా తయారయ్యాయి. జూన్ మాసంలో ప్రభుత్వం చేపట్టిన ఈ బదిలీల పర్వం ముగిసినప్పటికీ ఇంకా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులోకి రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఇంకా అనేక సమస్యలు వెంటాడుతున్నా ఇప్పటి వరకూ వాటిని పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టలేదని ఆయా సంఘాల నేతలు మండిపడుతున్నారు. బదిలీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అమలు చేసిన నియమ నిబంధనలు మొదటి నుంచి గందరగోళంగా తయారు కావటంతో చివరి వరకూ ఉపాధ్యాయులు వాటిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చాలా రోజులు నిరసనలతో ఉపాధ్యాయులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినా ఇంకా సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వాటిని భర్తీ చేయరా? ఉమ్మడి కృష్ణాజిల్లాలో సగానికి పైగా మండలాల్లో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో భారీగా ఖాళీలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రెడ్డిగూడెం, చాట్రాయి, జి.కొండూరు, వత్సవాయి, జగ్గయ్య పేట, గంపలగూడెం ఇలా దాదాపుగా సగానికి పైగా మండలాల్లో ఉన్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవటంతో విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. విజయవాడ అర్బన్లోనూ మునిసిపల్ విద్యాసంస్థల్లో ఖాళీలు కనిపిస్తున్నాయి. ఇటీవల 150 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించటంతో ఆ మేర ఆయా పోస్టుల్లో భర్తీ చేయాల్సిన అధికారులు దృష్టి పెట్టకపోవటంతో ఖాళీలు అలాగే కొనసాగుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీ, ఎంటీఎస్ సిబ్బందికి సంబంధించి సుమారు ఐదారు వందల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. పోస్టింగ్ ఇచ్చినా బదిలీ కానీ వైనం.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికారులు పెద్ద సంఖ్యలో బదిలీలు నిర్వహించారు. అయితే ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్న పాఠశాల నుంచి బదిలీ అయిన విద్యాసంస్థకు వెళ్లకుండా వందల సంఖ్యలో అక్కడే కొనసాగుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. బదిలీ అయిన చోటకు వేరే ఉపాధ్యాయుడు రాకపోవటంతో అక్కడి నుంచి పోస్టింగ్ ఇచ్చిన పాఠశాలకు వెళ్లలేక పలువురు ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. ఈ విధమైన పరిస్థితులు ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా శివారు ప్రాంతాల్లో ఉన్న చాలా పాఠశాలల నుంచి బయటకు వచ్చిన ఉపాధ్యాయులు వారి స్థానంలో అక్కడకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భాషా పండితులు సమస్యలతో సతమతం.. తెలుగు భాషా పండితులు, అలాగే తెలుగు బోధించే ఇతర ఉపాధ్యాయుల మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారి బదిలీల విషయంలో సందిగ్ధం నెలకొంది. వీరిలో కొంతమందికి పోస్టింగ్ ఇచ్చినా మొత్తం మీద వివాదంతో గజిబిజిగా తయారైంది. ఉర్దూ ఉపాధ్యాయుల అంశంలోనూ ఆ సంఘ నేతలు సమస్యలు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో టీచర్ల బదిలీల్లో అయోమయం సరైన కసరత్తు చేయకుండా బదిలీలు చేపట్టడంతో సమస్యలు ఇంకా సగానికి పైగా మండలాల్లో భర్తీ కాని ఖాళీలు పోస్టింగ్ ఇచ్చినా బదిలీ కాని వైనం అధికారుల తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయులుసమస్యలు తక్షణం పరిష్కరించాలి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి చాలా సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దీని వల్ల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సైతం అవస్థలు పడుతున్నారు. అధికారులు త్వరితగతిన సమస్యలను పరిష్కరించి ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలి. –ఎ.సుందరయ్య, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, ఎన్టీఆర్ జిల్లా ప్రణాళిక లేకపోవటంతోనే సమస్యలు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి సరైన ప్రణాళిక లేకపోవటంతో అన్ని మండలాల్లోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకా చాలా మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖ అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలి. – ఎంవీ మహంకాళేశ్వరరావు, అధ్యక్షుడు, వైఎస్సార్ టీఏ, కృష్ణాజిల్లా కొరవడిన కసరత్తు.. విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేయకుండా, సరైన ప్రణాళిక లేకుండా బదిలీల ప్రక్రియను నిర్వహించడంతో అనేక సమస్యలు తలెత్తాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు అవగాహనా రాహిత్యంతో నిబంధనలు ఏర్పాటు చేసి బదిలీలు చేయాలని ఆదేశించటం వల్ల కూడా సమస్యలు తలెత్తాయని విద్యాశాఖ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
ముగిసిన జగన్నాథ రథయాత్ర
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీజగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పూరిలో జరుగుతున్న జగన్నాథ స్వామి రథయాత్ర తరహాలో ఇక్కడ విజయవాడ ఇస్కాన్ మందిరం అధ్యక్షుడు శ్రీమాన్ చక్రధారి దాసు నేతృత్వంలో జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు నిర్వహించడంపై భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా లోక కల్యాణార్థం సుదర్శన నారసింహ యజ్ఞం నిర్వహించారు. పూలతో అలంకరించిన ఎడ్లబండిలో శ్రీసుభద్ర మహారాణి వేంచేసి ఉండగా.. సీతానగరం వీరాంజనేయ స్వామి గుడి నుంచి ప్రారంభమైన శోభా యాత్ర ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతమ్మవారి పాదాల సమీపంలో ఏర్పాటు చేసిన గుండిచ మందిరం వరకు సాగింది. ఇందులో భాగంగా మహిళలు జగన్నాఽథ, బలభద్ర – సుభద్రల మూర్తులకు సారె సమర్పించారు. ఆలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సవాల్లో భాగంగా భరత నాట్య కళాకారులు శ్రీజ, డాక్టర్ గౌతమి, సత్యవతి చక్రవర్తి ప్రదర్శించిన నృత్యాలు భక్తులను అలరించాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన ఇస్కాన్ భక్త బృందం, రాక్ బాండ్ గానం చేసిన హరినామ సంకీర్తనలు ఆధ్యాత్మిక డోలికల్లో ముంచెత్తాయి. అలాగే మహిళల కోలాటం, పురుషుల విలువిద్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలంకరించిన ఎడ్లబండిపై శోభాయాత్రమహిళల సాంస్కృతిక ప్రదర్శనలుసీతానగరం వద్ద సారె సమర్పణకు వస్తున్న మహిళలులోక కల్యాణార్థం సుదర్శన నారసింహ యజ్ఞం భక్తజనం సారె సమర్పణ -
కనులపండువగా కల్యాణం
గుడ్లవల్లేరు: డోకిపర్రు భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కల్యాణాన్ని మెయిల్ అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఆధ్వర్యంలో వైభవోపేతంగా కనులపండువగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు పురిటిపాటి వీరారెడ్డి, విజయలక్ష్మి దంపతులు, బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు ఉన్నారు. వ్యక్తిపై గొడ్డలితో దాడి మైలవరం: రెడ్డిగూడెం మండలం బూరుగగూడెంలో భూ వివాదం శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బూరుగుగూడెంలో మట్టకొయ్య శ్రీను(55) తండ్రి వెంకయ్య కు కె.మనోజ్, అతని తండ్రి జయరాజు కుబుంబ సభ్యులకు ఇంటి సరిహద్దు వివాదముంది. దీంతో మనోజ్ కుటుంబసభ్యులు మట్టకొయ్య శ్రీను ఇంటిపై దాడికి దిగారు. రెండువైపులా గొడవలు పెరగగా మనోజ్ గొడ్డలితో శ్రీను తలపై బలంగా నరికాడు. దీంతో శ్రీను ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. శ్రీను కుటుంబం భయాందోళనకు గురై హుటాహుటిన రెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి స్థానిక వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. అక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అనంతరం కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గతేడాది నుంచి మమ్మల్ని చంపేందుకు అనేక సార్లు ప్రయత్నించారని, ఈ రోజు తెగించి గొడ్డలితో దాడి చేశారన్నారు. తమకు మనోజ్ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, ప్రాణ రక్షణ కల్పించాలని మీడియా ద్వారా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
ప్రభుత్వ బడిని కాపాడుకుందాం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనా ఉందని, సర్కార్ బడుల్లో అడ్మిషన్ల పెంపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆ సంఘ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయుల దగ్గర చదివించాలని కోరారు. ప్రభుత్వం ఉపాధ్యాయులని బోధనకి ఎక్కువ సమయం కేటాయించే విధంగా చూడాలని, ఆన్లైన్ పనులను ప్రభుత్వం చెప్పటం మానుకోవాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్కుమార్ మాట్లాడుతూ మోడల్ ప్రైమరీ కాన్సెప్ట్ను వినియోగించుకుని, ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రాథమిక పాఠశాలల రోల్ పెంచాలని కోరారు. ఐక్యంగా పోరాటం.. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ సుందరయ్య మాట్లాడుతూ గతకాలం సంఘం కార్యకలాపాల రిపోర్ట్ను ప్రవేశపెట్టారు. జరిగిన బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాలను ఐక్యంగా నడిపి ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వంతో మాట్లాడి అనేక సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, నాయకులు మచ్చా శ్రీనివాస్, ఎం. కృష్ణయ్య, పి. నాగేశ్వరరావు, హరిప్రసాద్, కె. గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు -
విద్యార్థుల భవితను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
కోనేరుసెంటర్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులకే ఉంటుందని, అటువంటి ఉపాధ్యాయులు తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. కృష్ణాజిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కృష్ణా విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు వ్యక్తిత్వ వికాసం, ప్రేరణ తరగతులను నిర్వహించారు. ఈ తరగతులకు కలెక్టర్ హాజరై ఉపాధ్యాయులకు స్వయంగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్న వనరులు ఉంటే సరిపోదని సరైన ప్రజలు కూడా ఉండాలన్నారు. ఆ ప్రజలను మంచి వారిగా తీర్చిదిద్దాలంటే ఒక ఉపాధ్యాయునికే సాధ్యమవుతుందన్నారు. హను మంతుడికి తన శక్తి ఏమిటో తనకు తెలియదని, అలాగే విద్యార్థులలో ఉండే సృజనాత్మక శక్తిని గుర్తించి ప్రేరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయు లదేనన్నారు. విద్యార్థుల జీవితాలను వారి తలరాతలను మార్చగలిగే శక్తి సామర్థ్యం ఒక్క ఉపాధ్యాయుడికే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జపాన్, ఉక్రెయిన్ దేశాలు ప్రపంచ పటంలో ఎలా ఎదిగాయనే విషయాన్ని సోదాహరణంగా వివరించారు. జిల్లా విద్యాధికారి పీవీజే రామారావు మాట్లాడుతూ ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో జిల్లా 82.32 శాతం ఫలితాలను సాధించిందని, 161 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ గా నిలిచారని తెలిపారు. ఈసారి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం సాధించాలన్నారు. రిసోర్స్ పర్సన్లు గంపా నాగేశ్వరరావు, నండూరి సుబ్బారావు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చారు. ఈ ప్రేరణ తరగతుల్లో విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.రాంజీ, రిజిస్ట్రార్ ఉష, ఉపవిద్యాధికారులు, జిల్లాలోని హెచ్ఎంలు పాల్గొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఉపాధ్యాయులకు స్వయంగా శిక్షణ ఇచ్చిన కృష్ణా కలెక్టర్ బాలాజీ -
ధాన్యం.. దైన్యం
వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు గ్రామానికి చెందిన రైతు వి.సూర్యప్రకాష్ నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. వెల్లంకి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మే నెలాఖరులో ధాన్యం విక్రయించాడు. మొత్తం 465 టిక్కీలు ధాన్యం కాటా వేసి పది రోజులకు పైగా పొలంలోనే ఉంచారు. లారీలు లేవని చెప్పి ధాన్యం తీసుకెళ్లలేదు. వర్షాలు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోలేదు. పన్నెండు రోజుల తర్వాత పొలంలోని ధాన్యం తరలించారు. 24 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు వేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు జమ కాలేదు. ఖరీఫ్కు సమాయత్తం కావడానికి చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్నాడు. పెట్టుబడికి డబ్బులు లేవు కొనుగోలు కేంద్రంలో మే నెలలో 185 టిక్కీల ధాన్యం విక్రయించాను. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామన్నారు. రెండు నెలలైనా డబ్బులు రాలేదు. సుమారు రూ.2లక్షలు రావాల్సి ఉంది. మళ్లీ సీజన్ ప్రారంభమైంది. పెట్టుబడికి డబ్బులు లేవు. ఽతక్షణమే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. – కె.మల్లికార్జున రావు, ఇబ్రహీంపట్నం రైతుల పక్షాన ఆందోళన చేస్తాం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. రైతులకు రెండు నెలలుగా డబ్బులు చెల్లించలేదు. మొత్తం కౌలు రైతులే ఉన్నారు. కౌలు చెల్లింపు, పెట్టుబడులకు డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఎండీని కలిస్తే త్వరలో చెల్లిస్తామన్నారు. ఇప్పటికే 15 రోజులు గడిచింది. రైతుల పక్షాన ఈనెల 30న ఆందోళన చేపడతాం. రైతుల బకాయిలు చెల్లించాలి. – జమలయ్య, కౌలు రైతు సంఘం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ఏ వర్గాన్నీ వదలకుండా అందరికీ బకాయిలు పెడుతోంది. విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగులకు డీఏ బకాయిలు పెట్టినట్లే ....రైతులకు ధాన్యం సొమ్ము బకాయి పడింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోగా, వారి నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడం లేదు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. ధాన్యం విక్రయించిన రైతులు డబ్బుల కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం, వర్షాలు కురుస్తుండడంతో విత్తనాలు, ఎరువులు, దుక్కులు, కౌలు చెల్లించేందుకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి వస్తే అన్నదాత సుభీభవ పథకం కింద ఇస్తామన్న రూ.20వేలు ఆర్థిక సహాయం అందించలేదు. కొన్ని కేంద్రాల వద్ద సిబ్బంది రేపు మాపు అంటూ రైతులను తిప్పుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. రెండు నెలలు గడిచినా... ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ప్రభుత్వం 824 మంది రైతులకు రూ.30.27 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీరంతా ధాన్యం విక్రయించి రెండు నెలలు కావస్తోంది. వీరిలో 60 శాతానికి పైగా కౌలు రైతులు ఉన్నారు. ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులతో కౌలు, ఎరువులు, పురుగుమందుల షాపుల్లో అప్పులు తీర్చాల్సి ఉంది. అప్పుల వాళ్లు, భూమి యజమానులు రైతుల ఇళ్ల చుట్టూ తిరుగుతు న్నారు. కానీ ధాన్యం విక్రయించినా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ సమాధానం చెప్పే వారు లేకపోవడంతో ఎవరిని అడగాలో కూడా తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొందరు అధికారులు మాత్రం ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏప్రిల్ చివరి వారం నుంచి ఏ ఒక్క రైతుకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు. ఇటీవల రైతు సంఘాల నాయకులు కార్పొరేషన్ ఎండీని కలిసి రైతులకు బకాయిలు చెల్లించాలని వినతిపత్రం అందించారు. త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అతీ గతీ లేదు.అప్పుల కోసం అన్నదాతల తిప్పలు జిల్లాలో 824 మంది రైతులకు రూ.30.27 కోట్లు బకాయి రెండు నెలలుగా అవస్థలు పెట్టుబడుల కోసం ఎదురు చూపులు ఖరీఫ్ సాగు పనులు మరింత భారం -
ముగిసిన పాలిసెట్–2025 సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ద్వారా నిర్వహించిన పాలిసెట్–2025 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ నెల 21వ తేదీన మొదలైన సర్టిఫికెట్ల పరిశీలన శనివారం సాయంత్రం ముగిసింది. సర్టిపికెట్ల పరిశీలన కోసం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆంధ్రా లయోలా డిగ్రీ కళాశాల, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులకు తేదీలను కేటాయించి వాటి ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలన చేసి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ సోమవారం నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోవచ్చునని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. 492 మంది సర్టిఫికెట్ల పరిశీలన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 84 మంది స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 217 మంది, ఆంధ్రా లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 191 మంది సర్టిఫికెట్లను శనివారం పరిశీలించారు. మొత్తం 492 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి ధ్రువీకరణ పత్రాలను అందజేశామని విజయసారథి చెప్పారు. కృష్ణాజిల్లాలో... గన్నవరం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తొలిసారిగా నిర్వహించిన పాలీసెట్–2025 కౌన్సెలింగ్ శనివారంతో ముగిసినట్లు కోఆర్డినేటర్ వీవీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్లో మొత్తం 1,075 మంది అభ్యర్థులు పాల్గొని తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకున్నట్లు వివరించారు. కౌన్సెలింగ్ నిమిత్తం కళాశాలలో ఏర్పాటుచేసిన సదుపాయాలపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన కళాశాల అధ్యాపక బృందం, సిబ్బందిని ఆయన అభినందించారు.రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్కు అవకాశం -
సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్ మోసాల అదుపు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల ఆన్లైన్ మోసాలు బాగా పెరిగాయని, మనకు తెలియకుండానే బ్యాంక్ ఖాతాలో డబ్బులు కూడా దోచే పరిస్థితులున్నాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు నేరాలను అరికట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి వీధి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సురక్షా 360ను హోంమంత్రి అనిత శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి ఆలయం, చర్చి, మసీదులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా సురక్ష డివైన్ ఏర్పాటు, 28 స్టేషన్ అధికారులకు సురక్ష డివైన్ కిట్లు అందజేశారు. జిల్లాలోని ప్రజల భద్రత కోసం 321 గ్రామాలు, 20 మండలాలు, నాలుగు మునిసిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థలోని 64 వార్డులు మొత్తం 1211 చదరపు కిలోమీటర్లు అంతా నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. దాతల సహకారంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ గుణదలలోని వెన్యూ కల్యాణ మండపంలో జరిగిన సురక్ష 360 ప్రారంభోత్సవంలో పాల్గొన్న హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉందన్నారు. ఎక్కడ నేరం జరిగినా, ట్రాఫిక్ స్తంభించినా, అసాంఘిక శక్తుల అడ్డాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేస్తున్నారని, ఈ యాప్ని విశాఖ పోలీసులు స్ఫూర్తిగా తీసుకుని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నేరాలు తగ్గించేందుకు పోలీసులు సమష్టిగా కృషి చేయాలి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలి సురక్ష 360 ప్రారంభోత్సవంలో హోంమంత్రి వంగలపూడి అనిత ప్రతి గ్రామంలో 4 సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖరబాబు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామంలో కనీసం నాలుగు సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, ఎమ్మెల్యే సుజనా చౌదరి సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, బొండా ఉమా, సుజనాచౌదరి, కొలికపూడి శ్రీనివాసరావు, శ్రీరాం రాజగోపాల్, కలెక్టర్ జి.లక్ష్మీశ, డీసీపీ సరిత తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక దందా
పచ్చనేతల కూటమి ప్రభుత్వం కొన్ని నెలల తర్వాత ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టింది. దీంతో అధికార పార్టీ చోటా మోటా నాయకులకు ఇది వరంగా మారింది. ఉచిత ఇసుకను కృష్ణానది, మున్నేరు, కట్టలేరు ఉపనదుల్లో ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు చేర్చి రాత్రి సమయంలో పెద్ద లారీలకు లోడింగ్ చేసి తెలంగాణలోని మధిర, ఖమ్మం, వైరా తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసరలో ఓ చోటా నాయకుడు మాత్రం ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నాడని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇసుకకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. కంచికచర్ల మండలం వేములపల్లిలో లారీల్లో తరలివెళ్తున్న ఇసుక సాక్షి ప్రతినిధి, విజయవాడ: పచ్చనేతలు జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా చేస్తున్నారు. ప్రస్తుతం గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు నదుల్లో ఇసుత తవ్వకాలపై నిషేధం ఉంది. వాటిని తుంగలో తొక్కి నదుల నుంచి యథేచ్ఛగా తెలంగాణకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దందా అంతా పార్లమెంటు ప్రజాప్రతినిధి, నియోజక వర్గ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోంది. చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పడం తప్ప, ఆచరణలో అమలు కావడం లేదు. పర్యవేక్షించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు మామూళ్లు తీసుకొంటూ పచ్చ జెండా ఊపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. తోడేస్తున్నారు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇసుక లబ్ధిదారులకు అందుబాటులో ఉండేది. దీంతో ప్రతిఒక్కరూ సకాలంలో ఇళ్లు నిర్మించుకునేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి కానరావడం లేదు. రీచ్ల్లో కాంట్రాక్టర్కు నగదు చెల్లిస్తే చాలు ఎంత కావాలంటే అంత ఇసుకను లోడ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. నో చలానా... ఓన్లీ క్యాష్ అంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా లేకుండా విజయవాడ పార్లమెంట్ ప్రజాప్రతినిధి అనుచరులు, ఒక్కో లారీకి రూ.10వేలు ఇస్తే చాలు ఎన్ని టన్నులైనా లారీలకు నింపుతామని బహిరంగంగానే అంటున్నారు. కూటమి నేతలకు ఎవరికీ సంబంధం లేకుండా ఏకపక్షంగా పార్లమెంటు ప్రజాప్రతినిధి అనుచరులు మూడు రీచ్ల నుంచి ఇసుకను తోడేస్తున్నారు. అధికారుల వత్తాసు జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో ఇసుక రీచ్ నుంచి రోజుకు 300 నుంచి 400 లారీల వరకు ఇసుకను విక్రయిస్తున్నారు. వాటిలో కొన్ని లారీల ఇసుకను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడ లారీ ఇసుక ధర లక్ష రూపాయలు పలుకుతోంది. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించే సమయంలో పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు సైతం ఈ దందాకు వత్తాసు పలుకుతున్నారు. పార్లమెంటు ప్రజా ప్రతినిధి కార్యాలయంలో ఉండే అవినీతి‘ కిశోరం’ ఈ దందాకు రింగ్ మాస్టర్గా వ్యవహరిస్తున్నారు. ‘జగ్గయ్యపేట’లో వత్సవాయి మండలంలో ఇందుగు పల్లి, ఆళ్లూరుపాడు, పోలంపల్లి వద్ద మునేరు నుంచి ఇసుక అక్రమంగా టిప్పర్లో తెలంగాణకు తరలి పోతోంది. టిప్పర్లకు జేసీబీ ద్వారా ఇసుక లోడింగ్ చేస్తున్నారు. పెనుగంచిప్రోలు శివారులో వెంచర్లో ట్రాక్టర్లతో మునేరు నుంచి ఇసుక డంప్చేసి అర్ధరాత్రి తర్వాత లారీల్లో లోడ్ చేసి తెలంగాణకు తరలిస్తున్నారు. అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు మునేరు ఇసుక రీచ్ల నుంచి ట్రాక్టర్లలో శివాపురం, జొన్నలగడ్డ మీదుగా తెలంగాణకు తరలిపోతోంది. ఇదంతా కూటమి నేతల కనుసన్నల్లో సాగుతోంది. చెక్పోస్టులున్నా దాటిపోతోంది జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి, రావిరాల, మల్కాపురం, అన్నవరం, గ్రామాల్లోని కృష్ణానది, మునేరు, పాలేరు నుంచి రాత్రి వేళల్లో అక్రమంగా పక్క రాష్ట్రానికి వెళ్లిపోతోంది. చందర్లపాడు మండలం కాసరబాద నుంచి కృష్ణానది నుంచి ఇసుక లారీల్లో అక్రమంగా సరిహద్దులోని చెక్పోస్టులు సూర్యాపేట మీదుగా తెలంగాణాకు వెళ్తోంది. చెక్పోస్టులు ఉన్నా అధికారుల అండదండలతో సరిహద్దు దాటుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాలేరు, మునేరులలో నీరు ఉండటంతో ఇసుకను ఖాళీ ప్రదేశాలతో డంపింగ్ చేస్తున్నారు. తెలంగాణకు అక్రమ రవాణా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బుట్ట దాఖలు నదుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు తెలంగాణలో లక్ష రూపాయలు పలుకుతున్న లారీ ఇసుక ధర కోట్లలో దోచుకుంటున్న ఇసుక, మట్టి మాఫియా రింగ్ మాస్టర్గా అవినీతి ‘కిశోరం’ తిరువూరు టు తెలంగాణ తిరువూరు నియోజకవర్గ పరిసరాల్లోని తెలంగాణ సరిహద్దు గ్రామాలకు కృష్ణా నది ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీ నుంచి ఇసుకను టిప్పర్లలో తిరువూరు శివారులోని మర్లకుంట–తోకపల్లి, అక్కపాలెం, గంపలగూడెం మండలంలోని ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామాల్లో దళారులు డంప్ చేస్తున్నారు. అక్కడ నుంచి ట్రాక్టర్లలో ఇసుకను కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాలకు తరలిస్తున్నారు. ట్రాక్టరు ఇసుక రూ.6వేల చొప్పున విక్రయిస్తున్నారు. మూడు రోజుల క్రితం తిరువూరు మీదుగా తరలుతున్న రెండు ఇసుక టిప్పర్లను తెలంగాణ టాస్క్ఫోర్స్ అధికారులు పెనుబల్లి మండలంలో స్వాధీనం చేసుకున్నారు. -
జగన్నాథ రఽథయాత్ర
వైభవంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇస్కాన్ ఆధ్వర్యాన శుక్రవారం సాయంత్రం నిర్వహించిన జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. విద్యాధరపురంలోని లేబర్కాలనీ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన రథయాత్ర స్వాతి థియేటర్ రోడ్, జాతీయ రహదారి మీదుగా బ్యాంక్ సెంటర్, కుమ్మరిపాలెం సెంటర్, రథం సెంటర్కు చేరుకుంది. అక్కడ నుంచి సీతమ్మవారి పాదాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుండిచ మందిరం వద్దకు చేరుకుంది. దాదాపు 6 కిలోమీటర్ల మేర రథయాత్ర జరిగింది. వేలాది మంది భక్తుల నడుమ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి వేంచేసి ఉన్న రథం పురవీధుల్లో కొనసాగింది. రథయాత్ర కొనసాగినంత మేర రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు, భక్తులు చీపుళ్లతో వీధులను శుభ్రం చేస్తూ పూలు చల్లారు. రథంపై ఇస్కాన్ అధ్యక్షుడు చక్రధారి దాస్, లైలా గ్రూప్ సీఈఓ గోకరాజు గంగరాజు ఆశీనులయ్యారు. తొలుత పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్వామివారికి మొదటి హారతి ఇచ్చి రథం ముందు బంగారు చీపురుతో ఊడ్చారు. ముఖ్యఅతిథులుగా ఇస్కాన్ జీబీసీ శ్రీమాన్ రేవతి రమణ్ ప్రభుజీ, పారిశ్రామికవేత్త తొండెపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
పేరుకే డివిజనల్ రైల్వే ఆస్పత్రి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పేరుకే డివిజనల్ రైల్వే ఆస్పత్రి.. కానీ వసతులు మాత్రం కానరావు. విజయవాడ రైల్వే డివిజన్ దువ్వాడ నుంచి గూడూరు వరకు విస్తరించి ఉంది. ఈ పరిధిలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రధాన కేంద్రమైన విజయవాడ రైల్వే డివిజనల్ ఆస్పత్రికి వస్తుంటారు. ఇటువంటి ఆస్పత్రిలో సరైన మౌలిక సదుపాయాలు అందడం లేదని రోగులు, వారి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వసతులు ఏవీ? డివిజన్లోని దువ్వాడ, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ, ఏలూరు, గుడివాడ, మచిలీపట్నం, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, బిట్రగుంట, కావలి, నెల్లూరు, గూడూరు తదితర ప్రాంతాల నుంచి అనారోగ్యంతో బాధపడే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తెల్లవారుజాము నుంచే ఆయా ప్రాంతాల నుంచి రైళ్లలో ప్రయాణించి విజయవాడ రైల్వే ఆస్పత్రికి వస్తుంటారు. కానీ సౌకర్యాలు లేకపోవడమే ఇక్కడ సమస్యగా మారింది. వృద్ధుల పరిస్థితి మరింత దయనీయం ముఖ్యంగా రైల్వే ఆస్పత్రికి వచ్చే వారిలో ఎక్కువగా వయోభారంతో బాధపడే విశ్రాంత ఉద్యోగులు ఉంటున్నారు. వారిలో ఎవరైనా ఒకరు అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే రోగిని వీల్చైర్లో కుర్చోపెట్టుకుని వృద్ధులే వైద్యుల వద్దకు, అక్కడ నుంచి వార్డుకు, ఎక్స్రేతో పాటు పలు రకాల పరీక్షల కోసం ల్యాబ్లకు కూడ తీసుకు వెళ్లాల్సి వస్తుంది. వయోభారంతో వీల్చైర్, స్ట్రెచ్చర్లను తోసుకుంటూవారు పడే బాధలు నిత్యం రైల్వే ఆస్పత్రిలో కనిపిస్తుంటాయి. డబ్బు కడుతున్నా అందని సదుపాయాలు ప్రతి నెలా ఉద్యోగులు జీతంలోను, విశ్రాంత ఉద్యోగులు తమ పెన్షన్లో మెడికల్ ఎలవెన్స్ రూపంలో ఏటా లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారు. అయినా తమకు సరైన వైద్య సదుపాయాలు విజయవాడ డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కష్టమైనా తాముండే ప్రాంతంలోనే ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. పట్టించుకోని ఉన్నతాధికారులు రైల్వే అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సరైన వైద్యసేవలు అందించకుండా సిబ్బంది చిన్నచూపు చూస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఆస్పత్రిలో వార్డు బాయ్స్ కూడా అందుబాటులో ఉండటం లేదని.. ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని విభాగాలకు వైద్యులు లేరని, సిబ్బంది కూడా అంతంతమాత్రంగా ఉన్నారు. ఇప్పటికై నా డీఆర్ఎం, ఏడీఆర్ఎం, సీఎంఎస్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి రోగులకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ర్యాంపు మార్గంలో వీల్చైర్లో రోగిని తీసుకెళుతున్న కుటుంబ సభ్యులు విజయవాడ ఆస్పత్రిలో దివ్యాంగులు, వృద్ధులకు కనీస సౌకర్యాలు కరవు పట్టించుకోని రైల్వే ఉన్నతాధికారులు రైల్వే ఆస్పత్రిలో 10 విభాగాలు ఉన్నాయి. నిత్యం సుమారు 500 మంది ఓపీ వస్తారు. రైల్వే ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే దివ్యాంగులు, నడవలేని వృద్ధులు వసతుల్లేక తిప్పలు పడుతున్నారు. రోగుల అనారోగ్య పరిస్థితి మేరకు ఆస్పత్రి సిబ్బంది వీల్చైర్లు, స్ట్రెచ్చర్లలో క్యాజ్వాల్టీ, సంబంధిత వైద్యుల వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి రైల్వే ఆస్పత్రిలో కానరాదు. అత్యవసర పరిస్థితిలో కూడా రోగులు అంబులెన్స్లు, ప్రైవేటు వాహనాల్లో రైల్వే ఆస్పత్రులకు వస్తే అక్కడ రోగులను వెంటనే క్యాజువాల్టీకి తరలించేందుకు వార్డుబాయ్స్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండటంలేదు. దీనిపై సిబ్బందిని అడిగితే బయట వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు ఉంటాయని వాటిపై రోగిని మీరే తీసుకు రావాలని చెబుతున్నారు. రోగుల సహాయకులే అవి ఎక్కడున్నాయో వెతుక్కుని వాటిలో క్యాజ్వాల్టీకి తీసుకెళ్తున్నారు. అక్కడ వైద్యులు పరీక్షించిన అనంతరం వారికి ఎక్స్రే, రక్తపరీక్షలకు వెళ్లాలన్నా బంధువులే రోగులను వీల్చైర్లు, స్ట్రెచ్చర్లలో తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రణమిల్లిన భక్తజనం
అమ్మవారికి సారె సమర్పణకు తరలివస్తున్న భక్త బృందాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తజనం ప్రణమిల్లారు. ఆషాఢ మాసోత్సవాలు, శుక్రవారం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారెను సమ ర్పించారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఆలయ ఈవో వి. సుబ్బారావు దంపతులు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి పట్టుచీర, సారెను సమర్పించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ● ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. దీంతో మహా మండపం ఆరో అంతస్తులో పండుగ వాతావరణం నెలకొంది కిటకిటలాడిన క్యూలైన్లు ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. మహా మండపం, లిప్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్డులో కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో సర్వ దర్శనం క్యూలైన్తో పాటు రూ. 100, రూ. 300 టికెట్ క్యూలైన్లు కిటకిటలాడాయి. సాయంత్రం 4 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా, సేవలో పాల్గొనే టికెట్లకు డిమాండ్ కనిపించింది. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. మౌలిక వసతుల పరిశీలన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై నోడల్ అధికారి టి.చంద్రకుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. నోడల్ అధికారి వెంట దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ సమర్పణ
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి దర్శి వాస్తవ్యులు యారాశి శ్రీకాంత్ రెడ్డి, చంద్రిక కుటుంబ సభ్యులు వెండి నాగపడగను శుక్రవారం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్నవారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణకు 550 గ్రాములు.. సుమారు రూ. 60 వేలతో చేయించిన నాగపడగను స్వామివారి కానుకగా అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో అధికారులు సత్కరించారు. దాతలకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. సచివాలయ కార్యదర్శుల బదిలీలు షురూ మచిలీపట్నంటౌన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, 8 మున్సిపాలిటీల పరిధిలో వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న పలు విభాగాల కార్యదర్శుల బదిలీ ప్రక్రియను శుక్రవారం మచిలీపట్నం మునిసిపల్ కార్యాలయంలోని పాత కౌన్సిల్ హాల్లో ప్రారంభించారు. బదిలీ కమిటీ చైర్మన్, నగర కమిషనర్ సీహెచ్వీవీఎస్ బాపిరాజు, డీఎంఏ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నాగభూషణం పర్యవేక్షణలో ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో జరిగింది. కార్యదర్శులుగా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసిన వారిని తప్పని సరిగా బదిలీ చేయడానికి జాబితాలు సిద్ధం చేశారు. సీనియారిటీ, వయసు, ప్రజాప్రతినిధుల సిఫార్సులు, రిక్వెస్టులను పరిశీలించి శుక్రవారం రాత్రికి బదిలీ జాబితాను పూర్తిచేయడానికి కసరత్తు చేస్తున్నారు. కార్యదర్శులు ప్రస్తుతం పని చేస్తున్న వార్డు, నివసించే వార్డు కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయనున్నారు. ఐసీఈయూ ప్లాటినం జూబ్లీ లోగో ఆవిష్కరణ మచిలీపట్నంటౌన్: భారత దేశ బీమా రంగ ట్రేడ్ యూనియన్ అల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ను ఏర్పాటుచేసి జూలై 1వ తేదీ నాటికి, 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ సంఘ ప్లాటినం జూబ్లీ లోగోను నాయకులు శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. స్థానిక ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆ సంఘ మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి కిషోర్, నేతలు జె.సుధాకర్, డి.వాసు, ఎల్.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఉరుసు కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కాలేషా వలి బాబా ఉరుసు మహోత్సవం గురువారం రాత్రి ముగిసింది. బాబా వారికి చాదర్, గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముజావర్ల ఇళ్ల నుంచి బయలు దేరిన గంధం మహోత్సవం ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొన సాగింది. అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మత పెద్దలు హాజరయ్యారు. గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించండి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రామ, వార్డు సచివాలయాల్లోని సర్వేయర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ కోరారు. సమస్యల పరిష్కారానికి విజయవాడ ధర్నా చౌక్లో సర్వేయర్లు చేపట్టిన మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు శుక్ర వారంతో ముగిశాయి. ఆయన మాట్లాడుతూ జీవో నంబరు 5లో మార్పులు చేసి.. అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టాలని కోరారు. నిబంధనలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయన్నారు. బదిలీల ప్రక్రియలో సొంత మండలం నిబంధన సవరించాలని సూచించారు. దీక్షలో గ్రామ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. -
బంగారం రికవరీలో పోలీసుల చేతివాటం
గన్నవరం: చోరీకి గురైన బంగారం రికవరీ విషయంలో ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు చేతివాటం ప్రదర్శించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సదరు బంగారం కొనుగోలు చేసిన నగలు దుకాణం యాజమానిని కేసు నుంచి తప్పించేందుకు పెద్ద మొత్తంలో పోలీసులు వసూలు చేశారు. అంతే కాకుండా తక్కువ నాణ్యత కలిగిన బంగారంతో చోరీకి గురైన వస్తువులను తయారు చేయించి రికవరీ చూపించారు. ఈ ఘటనకు సంబంధించి సదరు నగల వ్యాపారితో ఎస్ఐ, ఓ కానిస్టేబుల్ ఫోన్లో జరిపిన సంభాషణలు బయటకు రావడంతో పోలీసుల నిజస్వరూపం బట్టబయలైంది. వివరాలిలా వున్నాయి. ఇటీవల ఆత్కూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నలుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఐదు బైక్లు, బంగారం, వెండి వస్తువులను రికవరీ చేశారు. వీరిని ఈ నెల 17న గన్నవరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆత్కూరు పోలీసులు అరెస్ట్ చూపించిన విషయం తెలిసిందే. రెండు కాసుల రికవరీలో... నిందితుల్లో ఒకరు చోరీ చేసిన రెండు కాసుల బరువైన రెండు బంగారు గొలుసులను ఏలూరులోని ఓ నగల వ్యాపారికి మాయమాటలు చెప్పి విక్రయించాడు. పట్టుబడిన దొంగ ఇచ్చిన సమాచారం మేరకు ఆత్కూరు పోలీసులు సదరు నగల వ్యాపారిని విచారించారు. అయితే సదరు వ్యాపారి నుంచి చోరీకి గురైన 22 క్యారెట్ బంగారు గొలుసులను రికవరీ చేయకుండా, అతనిని బెదిరించి తక్కువ నాణ్యత కలిగిన 18 క్యారెట్ బంగారంతో సదరు గొలుసులను తయారు చేయించారు. దీనికి ప్రతిఫలంతో పాటు నగల వ్యాపారిని కేసులో ఇరికిస్తామని భయపెట్టి రూ.30 వేలు నగదును పోలీసులు ముందుగానే వసూలు చేశారు. మరో రూ.10 వేలు నగదును ఆత్కూరు పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లో పనిచేసే ఉద్యోగి ఖాతాకు ఫోన్పే ద్వారా జమ చేయించి వసూలు చేశారు. నగదు లావాదేవీలు, బంగారం నాణ్యత, తయారీ గురించి స్వయంగా ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ మహేష్ సదరు నగల వ్యాపారితో జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులు బయటపడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా డబ్బుల కోసం ఆత్కూరు పోలీసులు డిమాండ్ చేస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సదరు నగల వ్యాపారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు నగల వ్యాపారితో ఎస్ఐ, కానిస్టేబుల్ మహేష్ జరిపిన ఆడియో రికార్డులతో ఫిర్యాదులు ఇప్పటికే ఉన్నతాధికారులకు చేరాయి. రాష్ట్ర డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్, ఏలూరు రేంజ్ డీఐజీ, కృష్ణాజిల్లా ఎస్పీకి కొంత మంది ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే ఈ ఫిర్యాదుపై విచారణ కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఆరోపణలు అవాస్తవం... రికవరీ చేసిన బంగారం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఎస్ఐ సురేష్ వివరణ ఇచ్చారు. మొదట రికవరీ చూపించాల్సిన బంగారం కంటే తక్కువ బంగారం ఇవ్వడంతో మందలించామనే అక్కసుతో సదరు వ్యాపారి తమపై ఫిర్యాదు చేసి ఉండవచ్చన్నారు. చోరీ కేసుల విచారణ, దొంగలను పట్టుకునేందుకు అయ్యే ఖర్చులను రాబట్టేందుకు నగల వ్యాపారిని తమ సిబ్బంది నగదు అడిగి ఉండవచ్చని అన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం
చందర్లపాడు(నందిగామ టౌన్): విద్యుదాఘాతంతో ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన చందర్లపాడు గ్రామంలో జరిగింది. సేకరించిన సమాచారం మేరకు చందర్లపాడు గ్రామానికి చెందిన బూతుకూరి గోపాలరెడ్డి (37) రోజూ మాదిరిగా శుక్రవారం కూలి పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో పంట పొలంలో ట్రాక్టర్లోని పసుపు కొమ్ముల లోడు దిగుమతి చేస్తుండగా ఒక్క సారిగా 33 కేవీ విద్యుత్ వైర్లను తాకటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరా లు సేకరించి మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నివాళులు.. చందర్లపాడు గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన గోపాలరెడ్డి మృతదేహాన్ని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ముక్కపాటి నరసింహారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఎన్ ప్రసాద్, వెలగపూడి వెంకటేశ్వరరావు, కోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు -
ప్రజలకు ముఖాలు చూపలేకపోతున్నాం
జగ్గయ్యపేట అర్బన్: జగ్గయ్యపేటలో శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో అత్యవసర సేవలైన తాగునీరు, వీధిలైట్లు, పారిశుద్ధ్య నిర్వహణపై కౌన్సిల్ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు. పార్టీలకు అతీతంగా టీడీపీ, జనసేన, వైఎస్సార్ సీపీ సభ్యులు సమస్యలపై పాలకవర్గాన్ని ఏకపక్షంగా నిలదీశారు. ఒకానొక సందర్భంలో కూటమి పాలకవర్గానికి చెందిన టీడీపీ మహిళా కౌన్సిలర్ కంచేటి గీతారాణి తన వార్డులో పనులు చేయడం లేదని, వార్డులో తనను గెలిపించిన ప్రజలకు ముఖాన్ని చూపించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తనకు చివరి సమావేశం అని, వచ్చే సమావేశానికి తాను రానని, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ మీటింగ్ హాల్లో శుక్రవారం కౌన్సిల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన జరిగింది. చైర్మన్ రాఘవేంద్ర మాట్లాడుతూ 15 వ ఆర్థిక సంఘానికి సంబంధించి వివిధ ప్రాజెక్టుల ద్వారా రూ.11.27 కోట్లు మంజూరయ్యాయని, వాటితో పట్టణంలోని పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ప్రజల్లో అసంతృప్తి తొలగించలేకపోతున్నాం జనసేనకు చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ మాట్లాడుతూ ఈ కూటమి పాలనలో కోట్ల నిధులు మంజూరవుతున్నప్పటికీ ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తిని తొలగించలేకపోతున్నామన్నారు. పారిశుద్ధ్య పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కాలువల్లో వారాల తరబడి చెత్త తొలగించడంలేదని, వార్డుల్లో వీధిలైట్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. జనసేన కౌన్సిలర్ కొలగాని రాము మాట్లాడుతూ తన వార్డులో పాఠశాల వద్ద 4 స్పీడుబ్రేకర్లు వేయాలని కొన్ని నెలలుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో జనసేన సభ్యుడు గింజుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ వీధిలైట్లు లేక ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నామన్నారు. కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తా : కంచేటి గీతారాణి టీడీపీ మహిళా కౌన్సిలర్ కంచేటి గీతారాణి మాట్లాడుతూ తన వార్డులో ఎర్రకాలువ, వేపలవాగు అభివృద్ధిని ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ముఖం చూపింలేకపోతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సిలర్గా కొనసాగలేనని, రాజీనామా చేస్తానని అన్నారు. టీడీపీ కౌన్సిలర్ వెంకట్ మాట్లాడుతూ శానిటేషన్ ఉద్యోగులు 144 మంది ఉన్నారని, వచ్చేది 80 మంది మాత్రమేనన్నారు. జనసేన కౌన్సిలర్ పందుల రోశయ్య మాట్లాడుతూ కోదాడ రోడ్లో ఎస్బీఐ వద్ద ఇప్పటికి 20 సార్లు పైపులైన్ మరమ్మతులు చేశారని, ఆ ఖర్చుతో కొత్త పైపులైన్ వేయించవచ్చునన్నారు. వివక్ష చూపిస్తున్నారు: వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ మనోహర్... తన వార్డులో వేపలవాగు బ్రిడ్జి కోసం ఏడాదిగా ప్రయత్నిస్తున్నా చేయడం లేదన్నారు.మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజున్నీసా(వైఎస్సార్ సీపీ) మాట్లాడుతూ తన వార్డులో 10 రోజుల నుంచి తాగునీరు రావడంలేదని, కనీసం వాల్వ్ తిప్పే ఆపరేటర్ కూడా లేడని వాపోయారు. వార్డుల్లో తిరగలేకపోతున్నాం చైర్మన్ను నిలదీసిన టీడీపీ, జనసేన సభ్యులు రాజీనామా చేస్తానన్న టీడీపీ మహిళా కౌన్సిలర్ పాలకవర్గ సభ్యులే ప్రతిపక్షంగా మారిన వైనం -
9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9న జరపతలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. గాంధీనగర్ ప్రెస్క్లబ్లో శుక్రవారం రాష్ట్ర కార్మిక సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందే తడవుగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల, కార్మికుల పని గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. 8 గంటల పని విధానం కార్మికుల పోరాటాల ఫలితమని ప్రభుత్వానికి గుర్తు చేశారు. యాజ మాన్యాలకు సంపద సృష్టించాలనే పేరుతో 10 గంటలకు పని పెంచడం, మహిళలు కూడా రాత్రులు విధులు నిర్వహించవచ్చని నిర్ణయాలు చేయటం ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు. ఏఐటీయూసీ డెప్యూటీ కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి, ఏఐఎఫ్టీయూ(న్యూ) రాష్ట్ర కార్యదర్శి జాస్తి కిషోర్ బాబు, సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు వెంకట సుబ్బరావమ్మ మాట్లాడుతూ కూటమి పార్టీలు ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, నూతన మార్కెట్ విధానానికి వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అసంఘటితరంగ కార్మికుల కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు ప్రసాద్ బాబు, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు త్రినాథ్ కుమార్, ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల పిలుపు -
వాణిజ్య బ్యాంకులకు దీటుగా కేడీసీసీబీ సేవలు
చిలకలపూడి(మచిలీపట్నం): వాణిజ్య బ్యాంకులకు దీటుగా కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా సేవలు అందిస్తున్నామని బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. బ్యాంకు మహాజన సభ సమావేశం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లా రైతాంగానికి, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు, మత్స్యకార్మికులకు, ఉద్యోగులకు అర్హతను బట్టి రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఈ ఏడాది రూ.13,500 కోట్లు టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 7,500 డ్వాక్రా సంఘాలకు ఇప్పటివరకు రుణాలు ఇచ్చామని, దీనిని 10 వేల సంఘాల వరకు పెంచి రుణాలు విస్తృతం చేయడానికి నిర్ణయించామన్నారు. వ్యవసాయ అవసరాల నిమిత్తం జిల్లా రైతాంగానికి రూ.2 వేల కోట్ల వరకు రుణాలు ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. గృహా లు, వాహన కొనుగోలు, విద్యా రుణాలు, ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు రూ.100 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.3,200 కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నాయని, దీనిని రూ.3,700 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బ్యాంకు ఖాతాదారులకు ఫోన్పే, గూగుల్పే, పేటీఎం సౌకర్యం కల్పించామన్నారు. త్వరలో రిజిస్ట్రార్ ఆఫీస్ ఉన్న ప్రదేశాల్లో ఉన్న తమ బ్యాంకు బ్రాంచ్లలో ఈ–స్టాంపింగ్ బిజినెస్ ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది రూ.13,500 కోట్ల టర్నోవర్ లక్ష్యం బ్యాంకు ఖాతాదారులకు యూపీఐ సేవలు చైర్మన్ నెట్టెం రఘురాం -
పాలిసెట్ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025 పరీక్షలో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం కొనసాగింది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో స్పెషల్ కేటగిరి అభ్యర్థులు 148, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్రంలో 213 మంది, ఆంధ్ర లయోలా డిగ్రీ కళాశాల ఆవరణలో 170 మంది జనరల్ కేటగిరి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైంది. 531 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను శుక్రవారం పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. నేటి షెడ్యూల్ శనివారం ఉదయం 9 గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో స్పెషల్ కేటగిరి అభ్యర్థులు ఆంగ్లో ఇండియన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ మొదటి నుంచి చివరి ర్యాంకు వరకు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 120001 నుంచి 127000 లోపు ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 127001 నుంచి చివరి ర్యాంకు పొందిన జనరల్ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం పొందిన అభ్యర్థులు ఈ నెల 30వ తేది సోమవారం నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. -
సజావుగా పాలిసెట్ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పక్రియ సజావుగా కొనసాగుతోంది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో కేంద్రంలో ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు 166 మంది, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్రంలో 220 మంది, ఆంధ్రా లయోల డిగ్రీ కళాశాల ఆవరణలో 202 మంది జనరల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. మొత్తం 588 మంది సర్టిఫికెట్లను గురువారం పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలను అందచేశామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. -
అప్రకటిత ఎమర్జెన్సీ కోరల్లో ప్రజాస్వామ్యం
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మచిలీపట్నంటౌన్: దేశంలో 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పోకడల కారణంగా ఎమర్జెన్సీ విధిస్తే నేడు దేశంలో ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలతో అప్రకటిత ఎమ ర్జెన్సీ రూపంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ఆందో ళన వ్యక్తం చేశారు. బుట్టాయిపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రంలో గురువారం ‘ఎమర్జెన్సీ నాడు – నేడు’పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. నాడు ఇందిరాగాంధీ తనకు ఎదురులేదని నిరూపించుకోవడానికి ఎమర్జెన్సీ విధిస్తే, నేడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల్లో హిందువులు, ముస్లింలు పాతిపదికన విభజన తీసుకురావడానికి నిరంకుశ విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజలను చైతన్య పరుస్తున్న గౌరీ లంకేష్, నరేంద్ర దంబుల్కర్ గోవింద పనసరే తదితరులను ఆర్ఎస్ఎస్ ముష్కరులు చంపేశారని ఆందో ళన వ్యక్తంచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ సాయిబాబాకు కోర్టులో బెయిల్ ఇచ్చినా కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్ షా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అత్యవసరంగా సమావేశ పరిచి బెయిల్ రద్దు చేయించి ఆయన జైలులో మగ్గిపోయేలా చేశారన్నారు. కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా ఇష్టం వచ్చినట్లుగా రాజ్యాంగ సవరణలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఈ సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, పార్టీ నగర కమిటీ సభ్యుడు బూర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మకు ఆషాఢ సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు దుర్గమ్మకు తొలి సారె సమర్పించారు. తొలుత ప్రధాన ఆలయంలోని మూలవిరాట్కు, ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆరో అంతస్తులో వేదికపై దుర్గమ్మ ఉత్సవ మూర్తిని ప్రతిష్టించిన ఆలయ అర్చకులు పూజలు జరిపించారు. అనంతరం దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, మిఠాయిలు అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు తరలివచ్చిన భక్త బృందాలు, భక్తుల కుటుంబ సభ్యులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకుంది. సారె సమర్పించిన అనంతరం భక్తులు తమ బంధువులు, స్నేహితులకు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్ పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఏసీ సీహెచ్.రంగారావు, ఏఈఓలు ఎన్.రమేష్బాబు, వెంకటరెడ్డి, తిరుమలరావు, జంగం శ్రీనివాస్, కె.గంగాధర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సారె సమర్పించిన హోం మంత్రి రాష్ట్ర హోం శాఖ మంత్రి వి.అనిత కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న హోం మంత్రి అనితకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను జరిపించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఈఓ శీనానాయక్ హోం మంత్రికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలు అందజేశారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని దర్శించుకున్న హోం మంత్రి పట్టుచీర, పూజా సామగ్రి సమర్పించారు. సారె సమర్పించిన పలు భక్త బృందాలు ఆషాఢ మాసం తొలి రోజున అమ్మవారికి పలు భక్త బృందాలు సారె సమర్పించాయి. విజయవాడ చిట్టినగర్లోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కమిటీ తరఫున అమ్మవారికి సారె సమర్పించారు. తాళ్లాయిపాలెం శివస్వామి, భక్త బృందం అమ్మవారికి సారెను సమర్పించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారికి సారెను సమర్పించగా, వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, ప్రసాదాలను అందజేశారు. ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి వారాహి నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. మల్లేశ్వరాలయం సమీపంలోని యాగశాలలో ఆలయ అర్చకులు గణపతి పూజ, కలశస్థాపన, రుత్విక్ వరుణ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, అంకురార్పణ వంటి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై ఆరంభమైన ఆషాఢ మాసోత్సవాలు తొలి సారె సమర్పించిన ఆలయ ఈఓ దంపతులు అమ్మకు సారె సమర్పించేందుకు తరలివచ్చిన భక్తులు వారాహి నవరాత్రుల నేపథ్యంలో పూజలు -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై గురువారం కలెక్టర్ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరి గింది. ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షుడు, కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు రూపొందించిన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. 18 ఏళ్లలోపు బాలలతో పనిచేయించే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టచేశారు. పనుల్లో గుర్తించిన బాలలను బడిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టాస్క్ఫోర్స్ దాడుల్లో గుర్తించిన బాల కార్మికులకు వృత్తి విద్యాకోర్సులు, ఒకేషనల్ కోర్సుల్లో చేర్పించి వారికి ఆసరా కల్పించాలన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఫ్యాన్ ఇండియా చైల్డ్ లేబర్ స్పెషల్ డ్రైవ్లో గుర్తించిన 13 మందికి కనీస వేతనాల చెల్లింపుతో పాటు బాలకార్మిక వ్యతిరేక చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహం, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సీహెచ్ ఆషారాణి, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రామచంద్రరావు, డెప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జె.ఇందుమతి, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేట్ జి.మహేశ్వరరావు, వాసవ్య మహిళ మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి.కీర్తి, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కో ఆర్డినేటర్ అరవ రమేష్, దిశ స్టేషన్ ఆఫీసర్ కె.వాసవి, కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
చిలకలపూడి(మచిలీపట్నం): మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణ లక్ష్యం కోసం అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం బందరులో నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీ నిర్వ హించారు. ర్యాలీలో మంత్రితో పాటు ఐజీ అశోక్ కుమార్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ ఆర్.గంగాధరరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మత్తుకు దూరంగా ఉందాం, కుటుంబానికి దగ్గరగా ఉందాం.. అంటూ నినాదాలు చేశారు. కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకుని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాయన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఐజీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న గంజాయి వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ టీములను ఏర్పాటు చేసిందన్నారు. మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. దేశానికి యువతే శక్తి అని, యువత మత్తు పదార్థాల జోలికి పోకుండా తల్లిదండ్రులు వారితో స్నేహపూర్వకంగా మెలగాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖర రావు, బందరు ఆర్డీఓ కె.స్వాతి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కామరాజు, మెప్మా పీడీ సాయిబాబు, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, పశు సంవర్ధక శాఖ అధికారి చిన నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యం కోసం ఉద్యోగులు, పెన్షనర్లకు ఇబ్బందులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందని ద్రాక్షగా మారింది. వారికి నగదు రహిత వైద్యం అందించే ఈహెచ్ఎస్ (ఎంప్లా యీస్ హెల్త్ స్కీమ్) సేవలు నిలిచి ఆరు నెలలు దాటింది. ఈ పథకం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఉద్యోగులకు నగదు రహిత వైద్యం మిథ్యగానే మారింది. ఉద్యోగులు, పెన్షనర్లు ఏదైనా అనారోగ్యం బారినపడితే అప్పులు చేసి వైద్యం పొందాల్సిన దయనీయ స్థితి నెలకొంది. సుస్తీ చేసిన ఉద్యోగులు ఈహెచ్ఎస్ కార్డు తీసుకుని ఆస్పత్రికి వెళ్తే అది చెల్లదని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పేస్తున్నారు. నెలనెలా తమ జీతం నుంచి డబ్బులు మినహాయిస్తున్నా కార్డు చెల్లక పోవడం ఏమిటని అడిగితే.. డబ్బులు ఇస్తేనే వైద్యం, లేదంటే మరో ఆస్పత్రి చూసుకోండని ముఖంపైనే చెప్పేస్తున్నారు. చేసేదేమీ లేక చాలా మంది అప్పులు చేసి వైద్యం పొందక తప్పడంలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సుమారు లక్ష మందికి పైగానే ఉన్నారు. గజిటెడ్ ర్యాంక్ ఉద్యోగుల నుంచి రూ.400, ఇతరుల నుంచి రూ.225 చొప్పున ఈహెచ్ఎస్ కింద వారి జీతాల్లో నెలనెలా ప్రభుత్వం మినహాయించుకుంటోంది. నెలకు రూ.2.5 కోట్లకు పైగానే నిధులు ఉమ్మడి జిల్లా నుంచి ప్రభుత్వానికి సమకూరుతున్నాయి. వైద్య సేవలు అందించడంలో మాత్రం చేతులెత్తేసింది. ఆరు నెలల నుంచి అందని సేవలు ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించే ఈహెచ్ఎస్ పథకంలో వైద్యం చేయలేమంటూ రాష్ట్రంలోని స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు గత ఏడాది డిసెంబర్లోనే తేల్చి చెప్పారు. దీంతో నాటి నుంచి ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ పథకాన్ని నిలిపివేశారు. అంతేకాదు గతంలో నిర్వహించిన ఉచిత ఓపీ సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో జిల్లాలోని వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే అప్పులు చేయలేక సర్జరీలను సైతం ఆరు నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్నారు. రీయింబర్స్మెంట్ 50 శాతమే.. ఉద్యోగులు, పెన్షనర్లు డబ్బులు చెల్లించి వైద్యం పొందిన సందర్భంగా ఆ మొత్తాన్ని రీయింబర్స్మెంట్ పొందే వెసులు బాటు ఉంది. అయితే ఆస్పత్రిలో అయిన ఖర్చు మొత్తంలో 50 శాతం కూడా రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ ఉద్యోగికి గుండె పోటుతో నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అక్కడ వైద్యానికి రూ.3 లక్షలు బిల్లయింది. రీయింబర్స్మెంట్ వస్తుందిలే అను కుని అప్పులు చేసి చెల్లించాడు. తీరి బిల్లు పెడితే అతనికి కేవలం 50 శాతం కూడా రాక పోవడంతో అప్పు సగం కూడా తీరని పరిస్థితి నెలకొంది. ఇలా ఎంతో మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి వైద్యం పొందుతూ ఇబ్బందుల పాలవుతున్న వారు కూడా ఎందరో ఉన్నారు. ఈహెచ్ఎస్ సేవలు నిలిచి ఆరు నెలలు దాటిన వైనం అప్పులు చేసి వైద్యం పొందాల్సిన దయనీయ స్థితి రీయింబర్స్కు బిల్లు పెడితే 50 శాతం కూడా ఇవ్వని పరిస్థితి ఇరిగేషన్ శాఖలో పనిచేసే ఉద్యోగి ఒకరు పదిహేను రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో ఛాతీలో నొప్పిగా ఉంటే విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్ష చేసి హార్ట్ ఎటాక్ వచ్చిందని, వెంటనే ఆస్పత్రిలో చేరి వైద్యం పొందా లని సూచించారు. తనకు ఈహెచ్ఎస్ కార్డు ఉందని ఆ ఉద్యోగి చెప్పగా దానిపై వైద్యం చేయలేమని ఆస్పత్రి నిర్వాహకులు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక అర్ధరాత్రి సమయంలోనే మరో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవడంతో రూ.3 లక్షలు అప్పు చేసి వైద్యం పొందా ల్సిన పరిస్థితి నెలకొంది. ఆగిరిపల్లికి చెందిన 65 ఏళ్ల విశ్రాంత ఉద్యోగికి ఇటీవల హార్ట్బీట్ తగ్గింది. ఆస్పత్రికి వెళ్లగా పేస్మేకర్ వేయాలని వైద్యులు చెప్పారు. ఒకప్పుడు ఈహెచ్ఎస్ పథకంలో పేస్ మేకర్ వేసేవారమని, అయితే ఇప్పుడు ఆ పథకం నిలిచిందని వైద్యులు తెలిపారు. దీంతో రూ.1.80 లక్షలు అప్పుచేసి వైద్యం పొందాల్సి వచ్చిందని ఆ విశ్రాంత ఉద్యోగి పేర్కొన్నాడు. వీరిద్దరే కాదు జిల్లాలోని అందరు ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి ఇలాగే ఉంది. అమలయ్యేలా చూడాలి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలి. ఈహెచ్ఎస్ కార్డు తీసుకుని ఆస్పత్రికి వెళితే, ఇది పనికి రాదని డబ్బులు చెల్లించాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. మా జీతాల నుంచి డబ్బులు మినహాయిస్తుండగా ఈ పరిస్థితి ఎందుకు వస్తోందో అర్థం కావడం లేదు. వెంటనే ప్రభుత్వం ఈహెచ్ఎస్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. – కె.శ్రీనివాసరావు, ఉద్యోగి -
గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఉద్యోగోన్నతులు కల్పించాలని ఏపీ గ్రామ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో సర్వేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన మూడు రిలే నిరాహార దీక్ష బుధవారం ప్రారంభమైంది. దీక్షలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుబాబు, ప్రధాన కార్యదర్శి పి. సాయికిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పర్యాయాలు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. గ్రామ సర్వేయర్ల హేతుబద్ధీకరణ తర్వాతే ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టాలన్నారు. బదిలీల్లో స్థానిక మండలం నిబంధనను తొలగించాలని కోరారు. ఇప్పటికే పిల్లలకు పాఠశాలలు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు బదిలీలు చేస్తే స్కూల్స్ మారడం ఇబ్బందికరంగా, ఆర్థికంగా భారంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రక్షాళన చేయాలని భావిస్తే పై క్యాడర్ నుండి కింది స్థాయి క్యాడర్ వరకూ వారి పరిధిని బట్టి స్థానిక నిబంధన వర్తింపజేయాలని కోరారు. హేతుబద్ధీకరణ ప్రక్రియ చేసే ముందు ప్రమోషన్ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలియజేయాలని డిమాండ్చేశారు. ఎటువంటి సిఫార్సులను అనుమతించకుండా పారదర్శకంగా బదిలీలు చేయాలని విజ్ఞప్తిచేశారు. అసోసియేషన్ ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ -
గుర్తుతెలియని యువకుడి ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఓ ఇంటి ముందు గేటుకు గుర్తు తెలియని యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆందోళన చెందిన స్థానికులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల కథనం మేరకు.. నైజాంగేటు నుంచి ఫ్లోర్మెన్ బంగ్లాకు వెళ్లే మార్గంలో ఓ రేకుల ఇంటి ముందు ఇనుప గేటుకు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువకుడు కండువాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచిన మహిళలు గేటుకు వేళాడుతున్న మృతదేహాన్ని చూసి కేకలు వేశారు. దీంతో చుట్టు పక్కల వారితో పాటు యువకులు అక్కడికి చేరి మృతుడిని గుర్తించేందుకు ప్రయత్నించారు. అయితే ఎవరికీ అతని ఆచూకీ తెలియలేదు. మృతుడి కుడి చేయి మణికట్టుపై పెద్ద పుట్టుమచ్చ ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వీఆర్వో నుంచి ఫిర్యాదు తీసుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
గవర్నర్కు ఘన స్వాగతం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్నజీర్కు విశ్వవిద్యాలయంలో ఘనస్వాగతం లభించింది. బుధవారం మధ్యాహ్నం ఆయన వర్సిటీకి చేరుకోగా.. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, వర్సిటీ వైస్ చాన్స్లర్ రాంజీ పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత రూ.3.20 కోట్లతో నిర్మించిన వంటశాలను ప్రారంభించారు. కార్యనిర్వాహక మండలి సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అకడమిక్ బ్లాక్ చేరుకుని స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ కార్యదర్శి హరిజవహర్లాల్, సంయుక్త కార్యదర్శి పీఎస్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల్లో నిరాశ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య, విశిష్ట అతిథుల చేతుల మీదుగా పట్టాలు పొందవచ్చని ఎంతో ఆశగా వచ్చిన పీహెచ్డీ, పీజీ పట్టాదారులు నిరాశ పడ్డారు. గవర్నర్ గౌరవ డాక్టరేట్, గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు మాత్రమే ఆయన చేతుల మీదుగా అందజేశారు. మిగిలిన వారికి వర్సిటీ వీసీ, కింది స్థాయి అధికారుల చేతుల మీదుగా అందజేయడంలో వారు పెదవి విరిచారు. -
రైల్వే సమగ్రతలో టీటీఈల పాత్ర కీలకం
సీనియర్ డీసీఎం రాంబాబు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారతీయ రైల్వే సమగ్రతను నిలబెట్టడంలో టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్లు (టీటీఈలు) కీలక పాత్ర పోషిస్తారని విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు పేర్కొన్నారు. విజయ వాడ డివిజన్లో టికెట్ తనిఖీ తీరుపై సీనియర్ డీసీఎం అధ్యక్షతన డీఆర్ఎం కార్యాలయంలోని కాన్పరెన్స్ హాలులో బుధవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యాప్తంగా స్క్వాడ్ ఇన్చార్జ్లు, ఎమినిటీస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. సీనియర్ డీసీఎం రాంబాబు మాట్లాడుతూ.. టీటీఈలు విధుల్లో అవలంబించే అంకితభావం, వృతి నైపుణ్యం, మంచి ప్రవర్తన సంస్థపై నేరుగా ప్రతిబింబిస్తాయని తెలిపారు. వారు విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తు రాయితీ కోటా దుర్వినియోగం, టికెట్ లోని పేరు మార్పులు, సరైన ఐడీ కార్డులు లేకుండా ప్రయాణించే వారిని నివారించాలని ఆదేశించారు. వారు విధుల్లో ఎదుర్కోనే ఇబ్బందుల గురించి అడిగి తెలసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అత్యుత్తమ పనితీరు కనపర్చిన టీటీలను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో కమర్షియల్ మేనేజర్ బి.వి.ఎన్.ఎస్.రవి ప్రసాద్, పీఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్, కమర్షియల్ అధికారులు పాల్గొన్నారు. అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమెరికా సామ్రా జ్యావాదాన్ని, యుద్ధోన్మాదాన్ని ఖండించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని ఖండించా లని కోరుతూ సీపీఐ, సీపీఎం ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ప్రదర్శన జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యుద్ధం ముగిసిందని కొందరు అనుకుంటున్నారని, కాల్పుల విరమణ కేవలం తాత్కాలికమేనని అన్నారు. మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అమెరికా, ఇజ్రాయిల్ తమ ఇష్టానుసారం ఏ దేశం మీద పడితే ఆ దేశం మీద అడ్డగోలుగా దాడులు చేస్తున్నాయని విమర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్ తప్ప మరే దేశం అణ్వాయుధాలే కాదు అణుశక్తి కూడా కలిగి ఉండకూడదని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్లు నిర్ధారణ కాకున్నా అమెరికా, ఇజ్రాయిల్ భయంకర ఆయుధాలు ప్రయోగించి వందల మందిని పొట్టనబెట్టుకున్నాయని వివరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయిల్కు కొమ్ముకాస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నగర కార్యదర్శి కె.కోటేశ్వరరావు, వామపక్ష నాయకులు వై.వెంకటేశ్వరరావు, కె.వి.వి.ప్రసాద్, పెన్మత్స దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జ్ఞానమణి
హనుమాన్జంక్షన్ రూరల్: వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాపులపాడు మండలం శేరినరసన్నపాలెంనకు చెందిన కైలే జ్ఞానమణి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధ వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలం పనిచేస్తున్న జ్ఞానమణి గతంలో బాపులపాడు జెడ్పీటీసీ సభ్యు రాలిగా, మహిళా విభాగం ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షురాలిగా సేవలు అందించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని, మహిళల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడతానని జ్ఞానమణి తెలిపారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానమణికి పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. స్వయం సహాయక బృందాలకు రుణ మంజూరు లేఖ పటమట(విజయవాడతూర్పు): మహిళలు ఆర్థి కంగా బలోపితం అయ్యేందుకు ప్రభుత్వం, బ్యాంకులు కృషి చేస్తున్నాయని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తృప్తి క్యాంటీన్ లబ్ధిదారులకు బుధవారం రుణ మంజూరులేఖను ఆయన అందించారు. ఈ సందర్భంగా తేజ్భరత్ మాట్లాడుతూ.. నగరంలో నాలుగు క్యాంటీన్లను మంజూరు చేశామని, వీటిలో కంటెయినర్ల సమీకరణ, కిచెన్ ఎక్విప్మెంట్ మొదలగు ఏర్పాటు చేయటానికి ఒక్కో క్యాంటీ న్కు రూ.14.51 లక్షలు రుణం మంజూరు చేశామని తెలిపారు. ఈ క్యాంటీన్లు జన సాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే పంజా సెంటర్లో భారత ఓవర్సీస్ బ్యాంక్, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ద్వారా తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ పట్టణ సాధికార విభాగం ప్రాజక్ట్ అధికారి పి.వెంకటరమణ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచిరేషన్ సరుకుల పంపిణీ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో రేషన్షాపుల ద్వారా జూలై నెల రేషన్ను ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన రేషన్ కార్డుదారులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే సంబంధిత డీలర్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. -
200 కిలోల గంజాయి పట్టివేత
లబ్బీపేట(విజయవాడతూర్పు): విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి చైన్నెకు అక్రమంగా రవాణా చేస్తున్న 200 కిలోల గంజాయిని విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, ఒకకారు, మినీ గూడ్స్ వ్యాన్ను సీజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఈ కేసు వివరాలను బుధవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్ల డించారు. సీపీ కథనం మేరకు.. గంజాయి అక్ర మంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని గీతానగర్ కట్ట ప్రాంతంలో ఎస్ఐ భానుప్రసాద్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేసి గంజాయి బ్యాగులను గుర్తించారు. డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో మినీ గూడ్స్ వ్యాన్ డ్రైవరు పోలీసుల తనిఖీలను గమనించి వాహనం ఆపి, పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాల నుంచి రూ.15 లక్షల విలువగల 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విశాఖపట్నం జిల్లా తగరపు వలస, భీమునిపట్నం ప్రాంతాలకు చెందిన అండి నాగరాజు, తమిళనాడులోని ఉత్తమ పలయాన్, కక్కిసింగయన్పట్టి గ్రామానికి చెందిన అనబలగన్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నాగరాజును ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతను మధురై ప్రాంతానికి వలస వెళ్లి ఆ ప్రాంతంలో గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉండటంతో విశాఖ ఏజెన్నీ ప్రాంతాల నుంచి తక్కువ రేటుకు కొనుగోలుచేసి, చైన్నెలో ఎక్కువ ధరకు విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాగరాజు తనకు తెలిసిన అనబలగన్కు విషయం చెప్పి, అతని గూడ్స్ వాహనాన్ని ప్రత్యేక అరలుతో తయారు చేయించి గంజాయి తరలిస్తున్నారు. ఇలా రెండుసార్లు పట్టుబడి జైలుకు కూడా వెళ్లివచ్చారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కారు ముందు, వెనుక గూడ్స్ వాహనం వెళ్తుండగా రెండింటినీ పోలీసులు పట్టుకున్నారు. ఒక్కొక్క వాహనం నుంచి 100 కిలోల చొప్పున 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సమావేశంలో సౌత్ ఏసీపీ డి.పావన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు నిందితుల అరెస్టు కారు, మినీ గూడ్స్ వ్యాన్ సీజ్ -
సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లా యీస్ యూనియన్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మునిసిపల్ కార్మికులు సమ్మో చేశారు. ఈ సమ్మెలో వాటర్, పార్క్, వెహి కల్ డిపో మెకానికల్, డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్, డ్రెయినేజీ, మలేరియా విభాగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. 36 జీఓ ప్రకారం ఇంజినీరింగ్ కార్మికులకు, 12వ పీఆర్సీ ప్రకారం మునిసిపల్ కార్మికులకు జీతాలు పెంచాలని, తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో జూలై నాలుగో తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి దళిత శోషణ ముక్తి మంచ్ జాతీయ కన్వీనర్ వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి కార్మికులకు రావాల్సిన పథకాలు ఏవీ అందడంలేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం రాబోయే రోజుల్లో మునిసిపల్ కార్మికులు చేసే సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. మునిసిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ.. కార్మికులంతా కలిసికట్టుగా పోరాడి హక్కులు సాధించుకోవాలన్నారు. సమ్మెకు 50వ డివిజన్ కార్పొరేటర్ బి.సత్యబాబు మద్దతు తెలిపారు. ఈ సమ్మెలో సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా కార్య దర్శి ఎన్సీహెచ్ శ్రీనివాసరావు, నగర ఆధ్యక్షుడు ఎస్.జ్యోతిబస్, నాయకులు టి.ప్రవీణ్, డి.స్టీఫెన్బాబు, టి.తిరుపతమ్మ, విజయలక్ష్మి, శీలం దాసు, వి.సాంబులు, కృష్ణవేణి, ఆదిశేషు, వాటర్ సెక్షన్, డ్రెయినేజీ, మెకానిక్, వర్క్ సెక్షన్ బాధ్యులు, వెహికల్ డిపో ప్రధాన కార్యదర్శి జలసూత్ర నాగరాజు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ -
విద్యాశాఖ నిద్ర పోతోంది..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో వందలాది ప్రైవేట్ పాఠశాలలు బహిరంగంగానే పుస్తకాలు విక్రయిస్తూ కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. కళ్ల ముందే అంత పెద్ద దందా జరుగుతున్నా విద్యాశాఖ పట్టించుకోవటం లేదు. అధికారులు నిద్ర పోతున్నారు. ప్రధానంగా పుస్తకాల ధరలు బహిరంగ మార్కెట్ కన్నా రెట్టింపు వసూలు చేస్తున్నారు. అలాగే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ ధరలతోనూ దారుణంగా దోచుకుంటున్నారు. – సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ, ఎన్టీఆర్ జిల్లా● -
యాజమాన్యాలపై వస్త్ర వ్యాపారుల ఫిర్యాదు
పాఠశాలలు అక్రమంగా దుస్తుల విక్రయాలు జరుపుతున్నాయని వస్త్ర వ్యాపారులు సైతం అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కంచికచర్ల వస్త్ర వ్యాపారులు ఇటీవల ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను కలిసి పాఠశాలల్లో అత్యధిక ధరలకు పాఠశాల యూనిఫామ్ క్లాత్లు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. బయట తమ దుకాణాలు చాలా తక్కువకు విక్రయిస్తున్నా తమ వద్దనే కొనుగోలు చేయాలని పాఠశాలలు పట్టుబట్టి విద్యార్థులతో కొనుగోలు చేయిస్తున్నాయని వివరించారు. ప్రైవేట్ పాఠశాలలు జరుపుతున్న యూనిఫామ్ల అక్రమ వ్యాపారం వల్ల తమ విక్రయాలు పూర్తిగా పడిపోయాయంటూ ఆ ఫిర్యాదులో పేర్కొనటం విశేషం. -
ప్రైవేటు దోపిడీ!
పుస్తకాల పేరుతో బడి తెగించి వ్యాపారంవన్టౌన్(విజయవాపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో పలు ప్రైవేట్ విద్యాసంస్థలు పుస్తకాల పేరుతో విద్యార్థులను దోపిడీ చేస్తున్నాయి. జూన్ మాసం విద్యాసంస్థలు పునఃప్రారంభం కాగానే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాల వ్యాపారాన్ని ప్రారంభించాయి. ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఈ పుస్తకాల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రైవేట్ పాఠశాలలో చేరిన ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా అదే విద్యాసంస్థలో పుస్తకాలు కొనుగోలు చేయాల్సిందే. లేకుంటే ఆ విద్యార్థి ఆ విద్యాసంస్థలో చదువుకోడానికి అనర్హుడిగా మారిపోతాడు. విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేసినప్పుడే ఆ యజమాన్యం సైతం వారిని పాఠశాలలోకి అనుమతిస్తున్నట్లుగా పలువురు విమర్శిస్తున్నారు. రూ. 25వేల వరకూ వసూళ్లు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారుగా 933 ప్రైవేట్ విద్యాసంస్థలు పని చేస్తున్నాయి. అందులో సుమారుగా 3,47,271మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. దాదాపు అన్ని విద్యాసంస్థల్లో ఈ పుస్తకాలు, స్టేషనరీ వ్యాపారాన్ని ఆయా యాజమాన్యాలు బహిరంగంగానే నిర్వహిస్తున్నాయి. ఒక్కొక్క విద్యార్థి నుంచి నోటు పుస్తకాలు, టెక్ట్స్ బుక్స్, వర్క్ పుస్తకాలు, ఇతర స్టేషనరీ పేర్లతో ఆయా యాజమన్యాలు ఆరు వేల నుంచి రూ.20 వేల వరకూ.. అదే స్కూల్ యూనిఫామ్, బూట్లు ఇతర వస్తువులతో కలిపి అయితే రూ.25 వేల వరకూ కొన్ని విద్యాసంస్థలు విక్రయాలు చేస్తున్నాయి. పాఠశాల స్థాయి, తరగతిని బట్టి ఆయా మొత్తాలను పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. పెద్ద విద్యాసంస్థల్లో మరీ దారుణం.. జిల్లాలోని కొన్ని విద్యాసంస్థల్లో కేవలం పుస్తకాల విక్రయాలపైనే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. జిల్లాలో రెండు, మూడు వేలకు పైగా విద్యార్థులు ఉన్న విద్యాసంస్థల్లో ఒక్కొక్కరి నుంచి పది వేల చొప్పున పుస్తకాల విక్రయాలు జరిగితే కోట్లాది రూపాయల మేర వ్యాపారం జరిగినట్లేనని విద్యార్థులు తల్లిదండ్రులు వ్యాఖ్యానిస్తున్నారు. పుస్తకాలపై సుమారుగా 30 నుంచి 50 శాతం లాభం ఉంటుందని పలువురు వివరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు మూడు వందలకు పైగా విద్యాసంస్థల్లో సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఉన్న సంస్థలు ఉన్నట్లుగా విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ఇంత పెద్ద వ్యాపారం జరుగుతుంటే ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టకపోవటంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాదంటే వెళ్లిపోండి.. ‘మా పాఠశాలలో చదివే విద్యార్థులకు మేమే పుస్తకాలు అమ్ముతాం. లేదంటే మీ పిల్లలను తీసుకువెళ్లిపోండి’ అంటూ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరింపులకు పాల్పడుతున్నాయి. దాంతో చేసేది లేక అప్పులు చేసి మరి తల్లిదండ్రులు పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ఇటీవల విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు వారిని అక్కడి నుంచి తరిమేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఇదే తరహా వ్యాపారం జరుగుతోంది. చిన్నచిన్న విద్యాసంస్థలు సాధారణ ధరలకు విక్రయిస్తున్నా, పాఠశాల గుడ్విల్, స్థాయి పెరిగే కొద్దీ ఈ ధరలు పెరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.మామూళ్ల మత్తులో అధికారులు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంత పెద్ద తరహాలో విద్యాసంస్థల్లో అనధికారికంగా కోట్లాది రూపాయల మేర పుస్తకాల విక్రయాలు జరుగుతుంటే విద్యాశాఖ ఏ మాత్రం స్పందించటం లేదు. విద్యాశాఖ ఆయా యాజమాన్యాలు అందించే మామూళ్ల కోసం నిబంధనలను పక్కన పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎవరైనా అధికారి దృష్టికి తీసుకువెళ్తే తమకు ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. అయితే జూన్ మాసంలో ఏ ప్రైవేట్ విద్యాసంస్థలోకి వెళ్లినా పుస్తకాల విక్రయాలు బహిరంగంగానే కనిపిస్తాయని వారు వివరిస్తున్నారు. తనిఖీ చేయాల్సిన స్థానిక మండల విద్యాశాఖ అధికారులు ఈ దందాకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రైవేటు విద్యా సంస్థల వివరాలు.. ఎన్టీఆర్ జిల్లా: ప్రాథమిక: 16 ప్రాథమికోన్నత:156 ఉన్నత: 337 మొత్తం పాఠశాలలు: 509 మొత్తం విద్యార్థులు: 2,21,914 మంది కృష్ణా జిల్లా: ప్రాథమిక: 114 ప్రాథమికోన్నత: 103 ఉన్నత: 207 మొత్తం పాఠశాలలు: 424 మొత్తం విద్యార్థులు: 1,25,357 మంది ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో దందా రూ.6 నుంచి రూ.25 వేల వరకూ వసూళ్లు పెద్ద విద్యాసంస్థల్లో కోట్ల రూపాయల్లో వ్యాపారం తమ దగ్గరే తీసుకోవాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు -
నాట్లలోనే నీటి గోస
నీళ్లు రావటం లేదు.. మా ఉప్పలూరు, వేల్పూరు, పునాదిపాడు, కోలవెన్ను ప్రాంతాలు కోమటిగుంటకు ఎగువన ఉన్నాయి. లాకులు వద్ద ఏడు అడుగులు లెవల్ మట్టం ఉండేలా చూడాలి. అప్పుడే పంట కాలువల్లోకి నీరు చేరుతుంది. జూన్ ఆఖరు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. వరి నారుమడులను బతికించుకోవటానికి కాలువలు, మురుగు కాలువల్లో ఉన్న నీటిని ఆయిల్ ఇంజిన్లతో మళ్లిస్తున్నాం. ఎకరాకు రూ. 5 వేలు పైగా ఖర్చులు అవుతున్నాయి. మా బాధలు గుర్తించి సాగునీటి సమస్యను తీర్చాలి. – నెరుసు రమేష్, రైతు, ఉప్పలూరు కంకిపాడు: ఖరీఫ్ ఆరంభంలోనే సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహం ఉన్నా, సరైన లెవల్ నిర్వహణ జరగకపోవటంతో ఎగువ ప్రాంత పంట కాలువలకు నీరు ఎక్కడం లేదు. దీంతో ఆయా కాలువల పరిధిలోని వ్యవసాయ భూముల్లో సాగు ప్రశ్నార్థకంగా తయారైంది. కాలువల్లో ఉన్న అడుగు బొడుగు నీటిని ఆయిల్ ఇంజిన్ల ద్వారా పొలాలకు మళ్లించి నారుమళ్ల సంరక్షణకు అన్నదాతలు నానా పాట్లు పడుతున్నారు. సాగుకు సన్నద్ధం.. కంకిపాడు లాకులు పరిధిలో 35వేల ఎకరాల్లో సాగు భూమి ఉండగా కోమటిగుంట రెగ్యులేటర్ పరిధిలో 3.43లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ప్రస్తుతం ఈ రెండు లాకులు నుంచి దిగువకు సాగునీటి సరఫరా అవుతోంది. బోర్ల సదుపాయం ఉన్న రైతులు మాత్రం నారుమడులు పోయటంతో పాటుగా, దమ్ములు పూర్తి చేసి వరి నాట్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక్కట్లు వర్ణనాతీతం.. లాకులకు ఎగువ ప్రాంత రైతులు మాత్రం సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువ నీటిపై ఆధారపడి సాగుకు ఉపక్రమించే అన్నదాతలు కాలువల్లో నీరు సమృద్ధిగా లేక వరి నారుమడుల సంరక్షణ, భూములను దమ్ము చేసేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. కంకిపాడు, కోమటిగుంట రెగ్యులేటర్కు ఎగువన ఉన్న పంట కాలువలకు నీరు ఎక్కకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రధానంగా పెనమలూరు, కంకిపాడు మండలాల్లోని అనేక గ్రామాల్లో పంట కాలువలు సాగునీరు లేక, జమ్మి, తూటికాడతో అధ్వానంగా కనిపిస్తున్నాయి. అడుగుబొడుగున ఉన్న నీటిని ఆయిల్ ఇంజిన్లతో వరి నారుమడులకు, భూముల దమ్ములకు మళ్లిస్తూ వరి నాట్లకు అతి కష్టం మీద సన్నద్ధమవుతున్న పరిస్థితి. సాగు మొదట్లోనే భారం.. ఖరీఫ్ సాగు మొదట్లోనే రైతులపై భారం మీద భారం పడుతోంది. వ్యవసాయశాఖ నుంచి విత్తనాలు పంపిణీ కూడా అరకొరగానే సాగింది. తొలకరి పలకరింపుతో పొలాలు అదును తప్పకుండా ఉండేందుకు బయటి మార్కెట్లో 30 కిలోల వరి విత్తనం బ్యాగులు రూ.1100–రూ.1200 చొప్పున కొనుగోలు చేసి వరి నారుమడులు పోసుకున్నారు. ప్రస్తుతం నారుమడులు సంరక్షించుకోవటానికి, భూములను దమ్ము చేసుకోటానికి సాగునీటికి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఎకరం పొలం ఆయిల్ ఇంజిన్లతో తడిపేందుకు 10 గంటల సమయం పడుతోంది. ఇందుకోసం ఎకరాకు రూ. 4500 నుంచి రూ.5500 వరకూ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. పంట కాలువల్లో సాగునీరు అందుబాటులో ఉంటే తూములు, గండ్లు ద్వారా పొలాలకు సమృద్ధిగా నీరు అందించుకునే వాళ్లమని రైతులు వాపోతున్నారు. అవసరమైన లెవెల్ లేక తెరచుకోని పంట కాలువల గేట్లు ఆయిల్ ఇంజిన్లపై ఆధారపడుతున్న రైతులు ఖరీఫ్ ఆరంభంలోనే సాగుకు అన్నదాతల తంటాలు -
ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష
జి.కొండూరు: ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా గురుకుల బాలికల పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు కుంటముక్కల సాంఘి క సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షను జి.కొండూరు మండల విద్యాశాఖ అధికారి వీరాస్వామి పర్యవేక్షించారు. పాఠశాల హెచ్ఎం కె.బ్యూలా మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొమ్మిది గురుకుల బాలికల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఆరో తరగతిలో ప్రవేశానికి 604 మంది విద్యార్థినులు దరఖాస్తు చేయగా 419మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. అదేవిధంగా ఏడో తరగతిలో ప్రవేశం కోసం 513 మంది దరఖాస్తు చేయగా 425మంది, ఎనిమిదో తరగతిలో ప్రవేశానికి 480మంది దరఖాస్తు చేయగా 460 మంది, తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి 472మంది దరఖాస్తు చేయగా 412మంది విద్యార్థినులు పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. విశ్వనాథరెడ్డికి డాక్టరేట్ ప్రదానం చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం 6, 7, 8 స్నాతకోత్సవ కార్యక్రమంలో ‘సాక్షి’ స్టేట్ బ్యూరో చీఫ్ మల్లు విశ్వనాథరెడ్డి పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగంలో ఆయన పలు పరిశోధనలు చేసి విశ్వవిద్యాలయంలో వాటిని నివేదికలను అందజేసి పీహెచ్డీను సాధించారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ పీహెచ్డీ సర్టిఫికెట్ను గౌరవ డాక్టరేట్ ప్రధానకర్తలు మండవ ప్రభాకరరావు, ఎంఎన్వీ రవికుమార్, చలమలశెట్టి అనిల్కుమార్, యూనివర్సిటీ రెక్టార్ బసవేశ్వరరావు చేతుల మీదుగా విశ్వనాథరెడ్డి అందుకున్నారు. 5న జాతీయ లోక్అదాలత్ చిలకలపూడి(మచిలీ పట్నం): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదా లత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తల గోపీ తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లయిమ్లు అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. సంబంధిత కక్షిదారులు తమ న్యాయవాదులను సంప్రదించి లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కై కలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు, మొవ్వ కోర్టుల్లో ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తామన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్లో కేసులు సిఫార్సు చేయించుకుని సమయం వృఽథా కాకుండా చూసుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీలో నియామకాలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాలలో నియమించారు. పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శులుగా నంబూరి రవి (జగ్గయ్యపేట), వెన్నం రత్నారావు (విజయవాడ సెంట్రల్), రాష్ట్ర ఆర్టీఐ విభాగం కార్యదర్శిగా మల్లెల వెంకట చిన్నారెడ్డి(విజయవాడ ఈస్ట్), రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ ప్రధాన కార్యదర్శి షేక్ హసన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నేటి నుంచి మహిళా సర్పంచ్లకు శిక్షణ హనుమాన్జంక్షన్రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, గ్రామ పరిపాలన విధానాలపై మహిళా సర్పంచ్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బాపులపాడు ఇన్చార్జి ఎంపీడీవో త్రినాథ తిరుమలరావు బుధవారం తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి 28 వరకు బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని మహిళా సర్పంచ్లకు గుడివాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శిక్షణ ఉంటుందని చెప్పారు. -
లెవల్ నిర్వహిస్తేనే..
కోమటిగుంట లాకులు వద్ద లాకులు బిగించి ఏడు అడుగులు నీటి మట్టం నిర్వహించాలి. అప్పుడే రెగ్యులేటర్కు ఎగువన ఉన్న భూములకు సాగునీరు అందుతుంది. పంట కాలువల షట్టర్లు తెరచుకోవటంతో పాటుగా తూములు ద్వారా పంట కాలువల్లోకీ నీరు మళ్లుతుంది. అయితే ప్రస్తుతం ఈ రెగ్యులేటర్ వద్ద నీటి మట్టం ఆరు అడుగులు మాత్రమే ఉంది. దీంతో రెగ్యులేటర్కు ఎగువన ఉన్న పంట కాలువలకు నీరు ఎక్కక, సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడు అడుగులు లెవల్ నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. లేనిపక్షంలో నాట్లకు సిద్ధమవుతున్న నారుమడులు ఎండుముఖం పట్టే ప్రమాదం ఉందని అన్నదాతలు వాపోతున్నారు. -
‘ప్రాజెక్ట్ కామధేను’లో పంజాబ్ డెయిరీ ప్రతినిధులు
హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం వీరవల్లిలోని ‘ప్రాజెక్టు కామధేను’ పాల ఉత్పత్తుల కర్మాగారాన్ని పంజాబ్కు చెందిన వెర్కా మిల్క్ యూనియన్ (డెయిరీ) ప్రతినిధులు బుధవారం సందర్శించారు. దేశంలోనే అత్యాధునిక సాంకేతికతతో పూర్తి ఆటోమేషన్ మిల్క్ ప్లాంట్గా రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ కామధేను ఫ్యాక్టరీని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు సూచనల మేరకు వెర్కా డెయిరీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. పాలు, పాల ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్లో అధునాతన మిషనరీ పనితీరును పంజాబ్ ప్రతినిధులకు ప్రాజెక్టు కామధేను ప్లాంట్ హెడ్ ఎం.సరిత వివరించారు. రోజుకు సగటున పది లక్షల లీటర్ల మిల్క్ ప్రొసెసింగ్ సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించినట్లు తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రగతిని వివరించారు. వెర్కా మిల్క్ యూనియన్ వైస్ చైర్మన్ ఉపేందర్ సింగ్, డైరెక్టర్ రమణదీప్ సింగ్, జనరల్ మేనేజర్ హర్మేందర్ సింగ్ సందు, ఇంజినీరింగ్ మేనేజర్ హజూర్ సింగ్ పాల్గొన్నారు. -
వీఎంసీ కౌన్సిల్లో టీడీపీ దాష్టీకం
ప్రధానాంశాలు ఇవీ.. పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాభివృద్ధిపై చర్చించేందుకు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. అరుపులు, కేకలు, బెదిరింపులతో అలజడి సృష్టించారు. దీంతో సభలో సుమారు గంటపాటు గందరగోళ వాతావరణం నెలకొంది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం జరిగింది. 156 అంశాలను అజెండాలో పొందుపరచగా మూడు అంశాలను కౌన్సిల్ తిరస్కరించింది. మరో రెండు అంశాలను ఆఫీస్ రిమార్కులకు పంపింది. మొత్తం 149 అంశాలను ఆమోదిస్తూ తీర్మానం చేసి, ఒక అంశాన్ని ధ్రువపరచగా మరో అంశాన్ని రికార్డు చేసింది. రాద్ధాంతం చేసిన టీడీపీ కార్పొరేటర్లు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో ఉన్న జవహర్ ఆటోనగర్ మ్యూచువల్ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ స్టోర్స్ (జమాక్) గృహ సముదాయానికి నగర పాలక సంస్థ నుంచి తాగునీరు సరఫరా చేయాలని వచ్చిన ప్రతిపాదనపై చర్చిస్తుండగా టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేశారు. ఐలా కూడా స్థానిక సంస్థేనని, ఆ సంస్థ సమస్యలను వారే పరిష్కరించుకోవాలని వైఎస్సార్ సీపీ సభ్యులు సూచించారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ పాలనలో సైతం వీఎంసీ నీటిని ఇవ్వలేదని గుర్తుచేశారు. ఐలా నుంచి బకాయిలు రావాలని సభ్యులు చర్చిస్తుండగా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ఓ క్రమంలో మేయర్ పోడియం వద్దకు వచ్చి మరీ కౌన్సిల్కు వ్యతిరేకంగా పార్టీల ప్రస్తావన తీసుకొచ్చారు. సెక్షన్ 89 ప్రకారం మేయర్ ఆదేశాలను ధిక్కరించినందుకు, సభను సజావుగా నిర్వహించేందుకు టీడీపీ సభ్యులు ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణిని సస్పెండ్ చేస్తునట్లు మేయర్ భాగ్యలక్ష్మి ప్రకటించారు. వారిని సభ నుంచి వెళ్లాలని సూచించారు. వారు వెళ్లకపోవడంతో మార్షల్స్ను పిలిపించారు. అయితే మార్షల్స్పై టీడీపీ సభ్యులు బెదిరింపులకు దిగారు. ఉద్యోగాలు ఊడతాయని, తమ ప్రభుత్వంలో విధులు ఎలా నిర్వర్తిస్తారో చూస్తామని బెదిరించారు. జమాక్ గృహ సముదాయానికి వీఎంసీ తాగునీరు సరఫరా చేయాలన్న అంశాన్ని తిరస్కరిస్తూ కౌన్సిల్ తీర్మానించింది. అరుపులు.. కేకలు.. బెదిరింపులతో గందరగోళం సృష్టించిన టీడీపీ కార్పొరేటర్లు ఏపీఐఐసీ కాలనీలోని జమాక్ గృహ సముదాయానికి తాగునీటి సరఫరాపై వివాదం ఐలా పరిధిలోని అంశాన్ని ఆ లోకల్ బాడీనే పరిష్కరించుకోవాలని కౌన్సిల్ సూచన కౌన్సిల్కు ఆటంకం కలిగించిన చెన్నుపాటి ఉషారాణి, ముమ్మినేని ప్రసాద్ సస్పెన్షన్ వారిని బయటకు తీసుకెళ్లేందుకు వచ్చిన మార్షల్స్పై బెదిరింపులకు దిగిన టీడీపీ కార్పొరేటర్లు జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన గృహ సముదాయాల్లో 2,053 గృహాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని, లబ్ధిదారులకు పంపిణీ చేయలేదని ప్రశ్నోత్తరాల్లో సభ్యులు ప్రస్తావించారు. దీనిపై అధికారులు సమాధానమిస్తూ.. ఇప్పటి వరకు 803 మంది లబ్ధిదారులను గుర్తించామని, కొంతమంది లబ్ధిదారులకు పేర్లు, అడ్రస్లు, ఫోన్ నంబర్లు సక్రమంగా లేకపోవడంతో అర్హుల జాబితాలో సీనియారిటీలో ఉన్న వారికి కేటాయింపులు చేస్తామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై ఏ చర్యలు తీసుకుంటారని సభ్యులు ప్రశ్నించారు. దీనిపై డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) రూపొందించి రెండు–మూడు రోజుల్లో కన్సల్టెన్సీకి అప్పగించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మని అధికారులు బదులిచ్చారు. వీఎంసీలో అధికారుల కొరత వేధిస్తోందని, సీఎంఓహెచ్, ఎస్టేట్స్ అధికారి, కింది స్థాయిలో ఇంజినీరింగ్ విభాగంలో ఏఈలు, ఇతర అధికారులు లేకపోవడంతో అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు సక్రమంగా చేరడం లేదని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ప్రతిపాదనకు సభ్యులు ఆమోదం తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మరింతగా గ్రీనరీ అభివృద్ధి చేయాలని, సెంట్రల్ డివైడర్లు, పార్కులు, కామన్ సైట్లలో గ్రీనరీ పెంపొందించాలని వచ్చిన అంశం ఆమోదం పొందింది. ఇటీవల వీఎంసీ కార్పొరేటర్లు దక్షిణ భారత విజ్ఞాన యాత్రలో భాగంగా కేరళలో పర్యటించారు. అక్కడి మాదిరిగా నగరంలోనూ మల్టీస్టోర్డ్ పార్కింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించొచ్చని డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజరెడ్డి చేసిన ప్రతిపాదనకు సభ్యులు ఆమోదం తెలిపారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో మల్టీ స్టోర్డ్ కాంప్లెక్స్ నిర్మించాలని తీర్మానం చేశారు. -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను కలిసిన డీఐపీఆర్ఓ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్ ): సమాచార పౌర సంబంధాల శాఖ ఎన్టీఆర్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కె.వి.రమణారావు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ జి.లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలూరు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న రమణారావును ఎన్టీఆర్ జిల్లాకు బదిలీ చేస్తూ సమాచార డైరెక్టర్ ఉత్వర్తులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న యు.సురేంద్రనాథ్ నుంచి రమణరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ శాఖల్లో అత్యంత కీలకమైన సమాచార పౌరసంబంధాల శాఖలో డీఐపీఆర్ఓగా సమర్థంగా పని చేసి ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల మధ్య సమన్వయం చేస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రమణరావుకు జిల్లా లక్ష్మీశ సూచించారు. కలెక్టర్ను కలిసిన వారిలో డీఐపీఆర్ఓ వెంట డీపీఆర్ఓ ఎస్.వి.మోహన్ రావు, డివిజనల్ పీఆర్ఓ కె.రవి, ఏవీఎస్ వి.వి.ప్రసాద్ తదితరులు ఉన్నారు.సమస్యలు పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగుల వినతిచిలకలపూడి(మచిలీపట్నం): తమ సమస్యలను పరిష్కరించాలని, రేషన్లైజేషన్, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు జి.గోపీచంద్ కోరారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీకి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపీ చంద్ మాట్లాడుతూ.. వార్డు సచివాలయాలకు వార్డు టు వార్డు బదిలీలకు అవకాశం కల్పించాలన్నారు. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, సీనియార్టీ, మెరిట్ ప్రాతిపదికన బదిలీలు నిర్వహించాలని కోరారు. రేషనలైజేషన్ ప్రక్రియలో మిగులు ఉద్యోగులను ఏ డిపార్టుమెంట్లోకి తీసుకుంటారో ఇంత వరకు సమాచారం లేదని, జాబ్చార్ట్, డిపార్ట్మెంట్ పరిధి తెలియజేసి రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమ్యలన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి కృష్ణాజిల్లా అధ్యక్షుడు ఎం.వి.శ్యామ్నాథ్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.కోటిలింగాలను దర్శించుకున్న హంపీ పీఠాధిపతిముక్త్యాల(జగ్గయ్యపేట): గ్రామంలోని కోటిలింగ హరిహర మహా క్షేత్రంలోని అమృతలింగేశ్వర స్వామిని జగద్గురు ఆదిశంకరాచార్య హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ హరిదుర్గానాగేశ్వరరావు పూర్ణకుంభంతో స్వామీజీకి స్వాగతం పలికారు. అనంతరం అమృతలింగేశ్వర స్వామికి పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటిలింగాల సమీపంలోని హంపీ పీఠం మొదటి వార్షికోత్సవంలో భాగంగా వచ్చామన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో విశ్రాంత ఈఓ దూళిపాళ్ల సుబ్రహ్మణ్యం, అర్చ కులు తేజ, హర్ష, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతుల గోడు పట్టని కూటమి ప్రభుత్వం
పెనుగంచిప్రోలు: కూటమి ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. మునేరు వరదల సమయంలో తువ్వకాలువకు పడిన గండ్లను నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ముందుగా స్థానిక చెరువుకట్ట వద్ద నుంచి భారీ ర్యాలీగా కాలువ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. తువ్వకాలువకు పడిన గండ్లను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో మునేరుకు భారీగా వరదలు వచ్చి తువ్వకాలువకు 50 చోట్ల గండ్లు పడగా, వాటిని పూడ్చడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. గండ్లు పూడ్చటానికి అంచనాలు రూపొందించామని అధికారులు, నాయకులు చెబుతున్నా నేటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదన్నారు. వరదల కారణంగా ఖరీఫ్తోపాటు రబీ పంటలను కూడా రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తంచేశారు. గండ్లను పూడ్చకుంటే ప్రస్తుత ఖరీఫ్లో పంటల సాగు సాధ్యం కాదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వరదలకు తువ్వకాలువకు గండ్లు పడితే వెంటనే పూడ్చి రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు. రైతుల తరఫున వైఎస్సార్ సీపీ ఇప్పటికే పలుమార్లు ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదన్నారు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్(చిన్నా), బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, పార్టీనాయకులు కొత్తపల్లి పెంటయ్య, పొన్నం కోటేశ్వరరావు, బూడిద నరసింహారావు, నర్రమనేని వెంకటేష్, దేరంగుల శ్రీనివాసరావు, కీసర లోకేశ్వరరావు, మెండెం రామారావు, కనగాల రమేష్, నంబూరి రవి, కనకపూడి భాస్కరరావు, చేని రాంబాబు, సర్పంచ్ బి.జ్యోతిబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. తువ్వకాలువ గండ్లను వెంటనే పూడ్చాలి వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
భూ సేకరణ పడక..
గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణే అడ్డంకి గడ్డమణుగు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 173/3లో ఇద్దరు రైతుల నుంచి 48 సెంట్ల భూమిని హైవే కోసం తీసుకున్నారు. ఆ రైతులు అందుబాటులో లేరు. ఈ భూమిని నేను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. నష్ట పరిహారం కోసం అవసరమైన పత్రాలన్నీ నేనే అధికారులకు ఇచ్చాను. అయినప్పటికీ పరిహారం ఇవ్వకుండా నేను సాగు చేస్తున్న పత్తి, మునగ పైర్లును అన్యాయంగా దున్నేశారు. నాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. – అజ్మీరా హేమానాయక్, రైతు, గడ్డమణుగు, జి.కొండూరు మండలం సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ – ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే ప్యాకేజీ–3 పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణే ఈ పనులకు ప్రధాన అడ్డంకిగా మారింది. బాధిత రైతులకు పరిహారంగా ఇచ్చేందుకు నిధులు మంజూరైనా పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. భూ సేకరణ జాప్యం కావడంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించి పరుగులు పెట్టించారు. అప్పట్లో జాయింట్ కలెక్టర్ సంబంధిత గ్రామాల రైతులతో చర్చించి భూ సేకరణను తుది దశకు తెచ్చారు. కూటమి అధికారంలో వచ్చాక భూసేకరణ పనులు అటకెక్కాయి. దాదాపు ఏడాదిన్నరగా భూసేకరణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. దీంతో రహదారి పనులు ప్రారంభించ డంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పటికీ పలు చోట్ల భూసేకరణ పనులు పెండింగ్లోనే ఉన్నాయి. 14 గ్రామాల్లో 351 ఎకరాలు విజయవాడ – నాగపూర్ ఎకనామిక్ కారిడార్లో అంతర్భాగంగా విజయవాడ – ఖమ్మం మధ్య ప్యాకేజీ–3కి సంబంధించి 29.70 కిలో మీటర్ల మేర రహదారి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ రహదారి కోసం ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం, జి.కొండూరు, విజయవాడ రూరల్ మండలాల పరిధిలోని 14 గ్రామాల్లో 351 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 136 ఎకరాల భూమి సేకరించారు. ఇంకా 215 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రధానంగా రహదారి వెంబడి 22.5 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. 3డీ నోటిఫికేషన్ స్థాయిలో మరో 30 ఎకరాలు ఉంది. ఈ భూములకు సంబంధించిన సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. దీనికితోడు భూసేకరణలో భూమికి సంబంధించి మార్కెట్ విలువల్లో వ్యత్యాసాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఏడాదిన్నర క్రితమే రూ.220 కోట్ల మేర అవార్డులు పాసైనా ఇప్పటి వరకు కేవలం రూ.65 కోట్లు మాత్రమే భూములు కోల్పోతున్న రైతులకు పంపిణీ చేశారు. డాక్యుమెంట్లు సమర్పించలేదని, ఇతర చిన్న చిన్న కారణాలతో పరిహారం పంపిణీ నిలిచిపోయింది. క్షేత్ర స్థాయిలో కొంత మంది రెవెన్యూ అధికారులు డబ్బులకు ఆశపడి, భూములు కోల్పోతున్న రైతులను పరిహారం పంపిణీ విషయంలో ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద భూసేకరణకు నిధుల సమస్య లేకున్నా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే జాతీయ రహదారి పనుల ప్రారంభంలో జాప్యానికి కారణమని స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఈ భూసేకరణ పనులపైన దృష్టి సారించకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అన్యాయంగా పైరు దున్నేశారు ఎన్టీఆర్ జిల్లాలో ప్యాకేజీ–3 కింద 29.70 కి.మీ. మేర జాతీయ రహదారి ఏడాదిన్నర క్రితమే రూ.230 కోట్ల అవార్డు పాసైనా బాధిత రైతులకుపంపిణీ చేసింది రూ.65 కోట్లే నత్త నడకన సాగుతున్న భూ సేకరణ పనులు కొలిక్కి రాని అసైన్డ్ భూముల వ్యవహారం గ్రీన్ ఫీల్డ్ హైవే ఇలా.. పరిహారం ఇవ్వకుండానే రహదారి పనులు మా అత్తగారు చొక్కం వెంకట్రావమ్మ పేరుతో సర్వే నంబరు 12–3లో గల 1.90 ఎకరాల్లో 60 సెంట్లు భూమిని గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తీసుకున్నారు. అయితే ఈ భూమి రికార్డుల్లో చాకలి ఇనామ్గా నమోదైందని పరిహారం ఇవ్వడం లేదు. 40 సంవత్సరాలుగా ఈ భూమిని మేము సాగు చేసుకుంటున్నాం. ఈ భూమికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాసుపుస్తకాలు కూడా ఉన్నాయి. అధికారులు వెంటనే స్పందించి పరిహారం అందించాలి. – కొండపల్లి సత్యనారాయణ, చెర్వుమాధవరం, జి.కొండూరు మండలం విజయవాడ – నాగపూర్ ఎకనామిక్ కారిడార్ (జాతీయ రహదారి) పనులను పనులను గత నెల ఏడో తేదీన ప్రారభించారు. 80 శాతం భూమి అప్పగిస్తేగానీ పనులు ప్రారంభం కావు. భూసేకరణలో జరుగుతున్న జాప్యంతో 60 శాతం భూమిని మాత్రమే అధికారులు అప్పగించారు. దీంతో జి.కొండూరు మండలంలో కాంట్రాక్టు సంస్థ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం కంపచెట్లు తొలగింపు, భూమి చదును చేయడం వంటి పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.745.83 కోట్లు. మెగా కాంట్రాక్టు సంస్థ ఈ పనులకు మే 23, 2023లో అగ్రిమెంట్ చేసుకొంది. ఈ పనులను ప్రారంభించిన రెండేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంది. 29.707 కిలోమీటర్ల రహదారిలో 1.345 కిలోమీటర్ల స్లిప్ రహదారి ఉంది. మేజర్ బ్రిడ్జి ఒకటి, మైనర్ బ్రిడ్జిలు 19, వీయూపీఎస్లు ఆరు, ఎల్వీయూపీఎస్లు ఐదు నిర్మించాల్సి ఉంది. -
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025 పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం కొనసాగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 155 మంది, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 142మంది, ఆంధ్రా లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 196 మంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 493 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. నేటి షెడ్యూల్ ఇలా.. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో బుధవారం నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నామని విజయసారథి చెప్పారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి పాలిసెట్–2025 పరీక్షలో 1 నుంచి 40 వేల లోపు ర్యాంకు పొందిన ఎన్సీసీ అభ్యర్థులు, 1 నుంచి చివరి ర్యాంకు పొందిన విభిన్న ప్రతిభావంతుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామన్నారు. ● మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 68,001 నుంచి 77 వేల ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 77,001 నుంచి 86 వేల లోపు ర్యాంకు పొందిన జనరల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట
ఏపీఎస్ఈబీ ఇంజినీర్స్ అసోసియేషన్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీసీపీడీసీఎల్, ఏపీ ట్రాన్స్కో ఇంజినీర్లు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఏపీఎస్ఈబీ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ రామారావు, ప్రధాన కార్యదర్శి నాగప్రసాద్ పేర్కొన్నారు. యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చామని గుర్తుచేశారు. విజయవాడలో ఏపీఎస్ఈబీ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశం మంగళవారం జరిగింది. సమ్మె నోటీసు, 1999 నుంచి 2004 మధ్య నియమితులైన వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి జీపీఎఫ్ ఇవ్వాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఏఈఈల నియామకం తక్షణం చేపట్టాలని, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఎర్న్డ్ లీవ్ ఎన్క్యాష్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశంలో అసోసియేషన్ అసోసి యట్ ప్రెసిడెంట్ రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేయడం లేదని ఇంజినీర్లపై అధిక పనిభారం మోపుతోందని పేర్కొన్నారు. ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని, ట్రైపార్టీ అగ్రిమెంట్ను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఇంజినీర్లకు పీఆర్సీ 2022లో తీరని అన్యాయం జరిగిందని గుర్తుచేశారు. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె బాట పట్టడం తప్ప మరో మార్గంలేదని తేల్చిచెప్పారు. అనంతరం అసోసియేషన్కు విశిష్ట సేవలందించి ఇటీవల పదవీ విరమణ చేసిన బి.వి.నాగేశ్వర రావును సత్కరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు వంశీ, ఇర్ఫాన్, కృష్ణప్రసాద్, కంపెనీ నాయకులు రాజేష్ ఖన్నా, నాగేశ్వరరావు, జిల్లా నాయకులు ఎం.వి.వి.రామకృష్ణ, బి.రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
రోగం తిరగబెట్టింది!
విజయవాడ జీజీహెచ్లో స్ట్రెచర్లు, వీల్ చైర్లూ లేక రోగుల అవస్థలుపేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది విజయవాడ జీజీహెచ్ పరిస్థితి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సకల సౌకర్యాలు కల్పించడంతో అత్యుత్తమ సేవలు అందించింది. రాష్ట్రానికే పెద్దన్న పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వాస్పత్రికి రోగం తిరగబెట్టింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో సమస్యల జబ్బు తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా రోగంతో వచ్చే ప్రజలకు కనీస వసతులు ఆస్పత్రిలో కరువైపోయాయి. స్ట్రెచర్లు ఉండవు.. కనీసం వీల్ చైర్లు కనపడవు.. దీంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, వివిధ రకాల ఆపరేషన్లు అయి నడవలేని పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చే వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది.మరోవైపు ఆస్పత్రిలో మందుల కొరత సరేసరి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెద్దాస్పత్రిలో కనీస వసతులు కల్పించి పుణ్యం కట్టుకోవాలని పలువురు రోగులు విన్నవిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ స్క్రాప్గా మారిన స్ట్రెచర్లు, వీల్ చైర్లు -
షరా‘మామూలే’!
పెనమలూరు: యనమలకుదురు ఇసుక క్వారీలో మామూళ్ల వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. టీడీపీ నేతలు హుకుంతో రెవెన్యూ అధికారులు క్వారీ గేటుకు తాళం వేశారు. వివరాల్లోకి వెళితే.. యనమలకుదురు ఇసుక క్వారీని 15ఏళ్ల క్రితం రివర్ కన్జర్వేటర్ ఆదేశాలతో నదిలో ఇసుక తవ్వకాలు నిషేధించారు. అప్పటి నుంచి ఇసుక క్వారీలో తవ్వకాలు జరగటం లేదు. మధ్యలో కొందరు ఇసుక మాఫియా తవ్వకాలు చేయటంతో గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాపై పోలీసులు సస్పెక్ట్ షీట్లు తెరిచింది. కూటమి పాలనలో మళ్లీ మొదలు.. కాగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నిషేధ ఇసుక క్వారీలో అక్రమం తవ్వకాలు మొదలుపెట్టారు. చట్టాన్ని, నిబంధనలు గాలికి వదిలేశారు. అధికారులు ఇదంతా చూస్తూనే ఉన్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. నిషేధ ఇసుక క్వారీ పరిస్థితి ప్రమాదంగా మారింది. తవ్వకాలతో నదిలో భారీ గుంతలు ఏర్పడి నదీ పరీవాహక ప్రాంతం ప్రమాదకరంగా మారింది. గొడవేంటంటే.. ఇసుక ట్రాక్టర్కు రూ. 500 మామూలు ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేయటంతో సోమవారం రాత్రి క్వారీ వద్ద గొడవ తలెత్తింది. దీనికి ట్రాక్టర్లలో ఇసుక తరలించేవారు అభ్యంతరం తెలిపారు. దీంతో ఉద్రిక్త పరిస్థితుల ఏర్పడ్డాయి. పోలీసులు, సొసైటీ, రెవెన్యూ సిబ్బందికి ఇప్పటికే మామూళ్లు ఇస్తున్నామని, ఇప్పుడు టీడీపీ నేతలకు కూడా మామూళ్లు ఇస్తే తమకు ఏమి మిగులుతుందని ట్రాక్టర్ యజమానులు అడ్డం తిరిగారు. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి ఇసుక క్వారీ గేటుకు పోలీసుల అండదండలతో రెవెన్యూ అధికారుల చేత మంగళవారం తాళం వేయించారు. అధికారులు కళ్ల ఎదుటే నిషేధ ఇసుక క్వారీలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా.. మామూళ్ల విషయంలో గొడవ జరుగుతున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా.. కేవలం టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు క్వారీకి తాళాలు వేయడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అంతేకాక ఈ మామూళ్ల వ్యవహారం తెరపైకి రావటంతో ఈ దందాలో ఎవరెవరి పాత్ర ఉందనేది స్పష్టమయింది. చట్టం తనపని తాను చేసుకు పోతుందని కూటమి నేతలు తరచూ ఊకదంపుడు ప్రకటనలు చేస్తుంటే మరి యనమలకుదురులో చట్టం ఏమయిందో ఆ నేతలే చెప్పాల్సి ఉంది. వాటా ఇవ్వడం లేదన్న నెపంతో టీడీపీ నేతల రాద్ధాంతం యనమలకుదురు క్వారీ గేటుకు తాళం -
‘పట్టా’భిషేకానికి వేళాయె
ఏర్పాట్ల పరిశీలన.. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న గవర్నర్ పర్యటన ఏర్పాట్లను ఎస్పీ ఆర్. గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, వర్సిటీ వీసీ రాంజీలతో కలిసి కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. వంటశాల ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి వర్షం పడే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లను చేయాలన్నారు. విశ్వవిద్యాలయంలోని వంటశాలను ప్రారంభించిన అనంతరం బ్యాటరీ కారులో వైఎస్సార్ పరిపాలనా భవనానికి చేరుకుని అక్కడ పోలీస్ గౌరవవందనం స్వీకరించాక వైఎస్ చాన్స్లర్ చాంబర్లో కార్యనిర్వాహక మండలి సభ్యులతో సమావేశమవుతారన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు ఆడిటోరియానికి చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, ఏఎస్పీలు, ఆర్డీఓ పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం 6, 7, 8 స్నాతకోత్సవాలు బుధవారం నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్చాన్స్లర్ కూన రాంజీ తెలిపారు. విశ్వవిద్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని మధ్యాహ్నం 3 గంటలకు విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో సమావేశం జరుగుతుందన్నారు. ముందుగా నూతనంగా నిర్మించిన వంటశాలను ప్రారంభిస్తారని తెలిపారు. గవర్నర్ నజీర్తో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర హాజరవుతారన్నారు. 6వ స్నాతకోత్సవానికి సంబంధించి ఎన్ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ మండవ ప్రభాకరరావు, 7వ స్నాతకోత్సవానికి సంబంధించి అమెరికాలోని అలభామ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంఎన్వీ రవికుమార్, 8వ స్నాతకోత్సవానికి సంబంధించి గ్రీన్ కో గ్రూపు సీఈవో చలమలశెట్టి అనిల్కుమార్కు గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నట్లు రాంజీ తెలిపారు. పలువురికి గోల్డ్మెడల్స్, పట్టాలు.. ఈ స్నాతకోత్సవాలలో 17 మంది విద్యార్థులకు 21 గోల్డ్మెడల్స్, 63మందికి పీహెచ్డీ పట్టాలతో పాటు ఇరువురు ఎంఫిల్ పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేస్తామని వీసీ తెలిపారు. వీరితో పాటు పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తి చేసిన 300 మంది విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఉష, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బ్రహ్మచారి పాల్గొన్నారు. నేడు కృష్ణా యూనివర్సిటీ 6, 7, 8 స్నాతకోత్సవాలు పాల్గొననున్న చాన్స్లర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరాలు వెల్లడించిన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రాంజీ -
తక్షణమే స్పందిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించగలం
తాడేపల్లి రూరల్: అనుకోని విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట్ దీపక్ అన్నారు. తాడేపల్లి పరిధిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి సంసిద్ధత’పై ఎయిమ్స్ వైద్యులు, ఆంధ్ర, తెలంగాణ, పుదుచ్చేరి, చత్తీస్గడ్కు చెందిన 30 మంది వైద్యులకు మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ దీపక్ మాట్లా డుతూ.. విపత్తుల ముందు, ఆ తరువాత అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు, డాక్టర్లు విపత్తుల ప్రమాద తగ్గింపునకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మంగళగిరి ఎయిమ్స్లోని నిర్మాణాత్మక పరికరాలు, అనుభవం కలిగిన డాక్టర్లు, మెడిసిన్, టెస్టింగ్ పరికరాలు, బ్లడ్బ్యాంక్ వంటి ఇతర వివరాలను అందజేయాలని సూచించారు. సమావే శంలో ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడీ డాక్టర్ రామమోహన్, డాక్టర్ రమ్యజ్యోతి, విపత్తుల సంస్థ అధికారులు ఆర్ఎస్ఐ మధుబాబు, జీఐఎస్ ఎక్స్పర్ట్ హరీష్, ప్రాజెక్ట్ మేనేజర్లు బస్వంత్, కిషోర్, సతీష్, పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్ పామ్ తోటల్లో ఎలుకల నివారణపై అవగాహన
ఘంటసాల: ఆయిల్ పామ్ పంటల్లో ఎలుకల ఉద్ధృతి తగ్గించుకోవడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెప్పే సూచనలు, సలహాలు రైతులు పాటించాలని కృష్ణాజిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి అన్నారు. జిల్లా ఉద్యాన శాఖ, ఉండవల్లి ఆగ్రోస్ ఎల్.ఎల్.పి. ఆధ్వర్యంలో ఘంటసాల కేవీకే సమన్వయంతో ఆయిల్ పామ్ తోటల్లో ఎలుకల నివారణపై రైతులకు అవగాహన సదస్సు ఘంటసాల సత్యసాయి మినీ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే సమన్వయకర్త డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ఆయిల్ పామ్తో పాటు అన్ని పంటల్లో ఎలుకల నివారణకు రైతులంతా సామూహికంగా చేపట్టాలన్నారు. ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి.మంజువాణి మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటల్లో పోషక, నీటి యాజాన్యం, మాగాణుల్లో వేసుకున్న పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా ఘంటసాల, చల్లపల్లి, మొవ్వ, పామర్రు, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఉండవల్లి ఆగ్రోస్ ఎల్.ఎల్.పి., ఎఫ్3 సంస్థలతో ఆయిల్ పామ్ పండించే రైతులకు నూరు శాతం రాయితీపై మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎకరానికి 57 మొక్కలు, హెక్టారుకు 143 మొక్కలు చొప్పున ఇస్తున్నామని, వాటిని నాటే సమయంలో మొక్కల మద్య 9 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉండవల్లి ఆగ్రోస్ డీజీఏం బి.హరికృష్ణ, 3ఎఫ్ ఆయిల్ పామ్ సీనియర్ మేనేజర్ యు.విక్రమ్రాజు, పామర్రు ఉద్యాన శాఖ అధికారి జె.కీర్తిదేవ్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రేవతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ
ప్రత్యేక సమావేశంలో ఎన్డీఎంఏ అధికారుల బృందం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ సాధ్యమని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సీనియర్ అధికారుల బృందం పేర్కొంది. ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ ఎన్.ప్రకాష్, అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్ అభినవ్ వాలియా సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక నవీకరణ, డిజాస్టర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కార్యకలాపాలు, విపత్తు ముప్పు తగ్గింపుతో పాటు భవిష్యత్తు విపత్తులను ఎదుర్కొనే వ్యవస్థ పటిష్టత తదితర అంశాలపై సమీక్షించి, సమన్వయ శాఖల అధికారులతో చర్చించారు. మాక్ డ్రిల్స్ నిర్వహణ, సామర్థ్య నిర్మాణంపై అధికారులకు శిక్షణ, సమన్వయం వంటి అంశాల్లో జిల్లాలో చర్యలు బాగున్నాయన్నారు. బుడమేరు వరదల సమయంలో బాధితులకు చేయూతనివ్వడం, పునర్మిర్మాణ చర్యల్లో అధికార యంత్రాంగం చూపిన చొరవను కూడా బృందం సభ్యులు ప్రశంసించారు. వరదల్లో వ్యవసాయ డ్రోన్లతో ఆహారం పంపిణీ.. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే సరైన సన్నద్ధత విషయంలో ప్రతి శాఖా తమదైన ప్రత్యేక విపత్తు నిర్వహణ ప్రణాళికలను రూపొందించడం కీలకమని చెప్పారు. చట్ట ప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై రియల్టైమ్ హెచ్చరికల వ్యవస్థలో సచేత్ కీలక మైలురాయి అని, ఈ యాప్పై అధికారులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను పొందుపరచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఆపద మిత్ర, ఇతర వలంటీర్ సేవలకు ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలని ఎన్డీఎంఏ అధికారుల బృంద సభ్యులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ బుడమేరు వరదల్లో వ్యవసాయ డ్రోన్లను ఆహారం పంపిణీకి ఉపయోగించామన్నారు. పారిశుద్ధ్య కార్యకలాపాల్లోనూ డ్రోన్లను వినియోగించినట్లు తెలిపారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, డీఎంహెచ్వో ఎం.సుహాసిని, డీపీవో పి.లావణ్య కుమారి, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీఏవో డీఎంఫ్ విజయకుమారి, పశు సంవర్థక అధికారి ఎం.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ ప్రజావాణిలో 66 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: నగరంలోని జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిస్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 66 ఫిర్యాదులను స్వీకరించినట్లు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఏబీటీఎస్ ఉదయరాణి తెలిపారు. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడటంతో పాటు వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి సమస్యను తెలుసుకుని ఫిర్యాదులను స్వీకరించామని తెలిపారు. ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 37, కుటుంబ కలహాలపై ఎనిమిది, కొట్లాటలపై ఎనిమిది, దొంగతనాలపై మూడు, మహిళా సంబంధిత నేరాలపై ఒకటి, ఇతర సంఘటనలకు సంబంధించి తొమ్మిది ఫిర్యాదులను స్వీకరించినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ ఫిర్యాదులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ అధికారులను ఆమె ఆదేశించారు. -
వైఎస్ జగన్పై కూటమి భారీ కుట్ర
వైఎస్సార్ సీపీ నేత పోతిన వెంకట మహేష్వన్టౌన్(విజయవాడపశ్చిమ): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ విమర్శించారు. జగన్ పల్నాడు పర్యటనపై తాను మాట్లాడిన వీడియోను మహేష్ సోమవారం విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు అర్బన్ ఎస్పీ సతీష్కుమార్ నేరుగా పత్రికా ప్రకటన విడుదల చేసి, మీడియాతో సమావేశమై కాన్వాయ్ ఉన్న ప్రైవేటు వెహికల్ ఢీ కొందని, ఆ ప్రైవేటు వాహనం నంబర్ ఇదీ అని ప్రకటించారని గుర్తుచేశారు. ఆ వాహనం ఓనర్ను పిలిపించి వాళ్లను జామీను తీసుకుని స్టేషన్ బెయిల్ మీద విడుదల చేయడం వాస్తవం కాదా, మీరు దీన్ని కాదనగలరా? అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిందని తెలియగానే.. జగన్ కాన్వాయ్ను అనుసరిస్తున్న నాయకులు లాన్ మీద ఉన్న సింగయ్యను చూసి ఆటోలోగానీ, సొంత కారులోగానీ ఆస్పత్రికి తీసుకెళ్తామని అక్కడున్న పోలీసులను అడిగితే వాళ్లు నిరాకరించారని, 108 వాహనం ద్వారా మాత్రమే పంపిస్తామని అక్కడున్న ఏఎస్ఐ రాజశేఖర్ చెప్పారని పేర్కొన్నారు. దీని వల్ల అమూల్యమైన 35 నిమిషాల సమయం వృథా అయ్యిందని, నాయకుల వాహనంలో తీసుకెళ్లేందుకు అనుమతించి ఉంటే ప్రాణాలు కాపాడే వారిమని మహేష్ స్పష్టంచేశారు. మాజీ సీఎంపై కేసు నమోదు.. పోలీసుల దుందుడు చర్య వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని పార్టీ నాయకులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ప్రత్తిపాడు పార్టీ ఇన్చార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబానికి చేతనైనంత మేర పార్టీగా తమ బాధ్యతను నిర్వర్తించామని మహేష్ పేర్కొన్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి టీడీపీ పాఠాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని పోతిన మహేష్ పేర్కొన్నారు. ఏదైనా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయినప్పుడు ఆ వీడియోను వాస్తవమో కాదో తెలుసుకున్న తర్వాతే ఎస్పీ స్థాయి అధికారి కానీ పోలీసు ఉన్నతాధికారులు గానీ బయటకు వస్తారని, అలాంటి నిర్ధారణలేవీ లేకుండానే ఒక మాజీ ముఖ్యమంత్రిపై కేసు పెట్టడం దుందుడుకు చర్య అని దుయ్యబట్టారు. -
ఆక్రమణకు గురైన అమ్మవారి భూములపై సమీక్ష
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ కేదారేశ్వరపేట పరిధిలోని లోటస్ ప్రాంతంలో ఆక్రమణకు గురైన శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి భూములకు సంబంధించి శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్ సమీక్ష జరిపారు. ఆక్రమణకు గురైన భూములలో వెలిసిన కట్టడాల క్రయ విక్రయాలను నిలుపుదల చేస్తూ 22ఏ 1సీ నిషేధిత జాబితాలో చేర్చడంపై రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, నగరపాలక సంస్థలతో సమన్వయం గురించి సోమవారం సాయంత్రం దేవాలయ లీజెస్, ల్యాండ్ విభాగం సిబ్బందితో సమీక్షించారు. సత్యనారాయణపురం పాత సర్వే నంబర్ 118, ఆర్ఎస్ నంబర్ 112లో సుమారు రూ.200 కోట్ల విలువైన ఈ భూమి సంరక్షణ నిమిత్తం దేవస్థానం నుంచి ఎటువంటి కాలయాపన లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓ తెలిపారు. అదే విధంగా మహామండపం దిగువ ప్రాంతంలో స్థలాభావ సమస్య పరిష్కారం కోసం ఆలయ ఇంజినీర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. నూతన అన్న ప్రసాదం భవన నిర్మాణం, లడ్డూ పోటు భవన నిర్మాణ ప్రాంతాల్లో ఇంకా స్థల సేకరణపై సాధ్యాసాధ్యాల గురించి చర్చించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కోటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. యోగా నిత్య జీవితంలో ఓ భాగం కావాలి మచిలీపట్నంటౌన్: యోగా ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో ఓ భాగం కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీ యోగసభ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్లోని ఉదయపు నడక మిత్రమండలి భవనంలో సోమవారం యోగా గురువు మద్దాల చింతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణ తరగతుల్లో కలెక్టర్ పాల్గొని సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, యోగాసనాలు వేశారు. యోగా కార్యక్రమం అధికారికంగా ముగిసినప్పటికీ యోగా సాధన మన నిత్యజీవితంలో ఓ భాగం చేసుకుని నిరంతరం కొనసాగించాలని సూచించారు. మచిలీపట్నం నగరంలో ఏపీ యోగాసభ ఆధ్వర్యంలో గాంధీనగర్, చింతగుంటపాలెం, కాస్మోపాలిటన్ క్లబ్, గొడుగుపేట, శంకరమఠంలో ఉచితంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. -
కర్కశపు తండ్రి కటకటాల పాలు
మైలవరం: మైలవరంలో ఇటీవల ఇద్దరు చిన్నారులను తండ్రే హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి కనబడకుండా పోయిన నిందితుడు రవిశంకర్ కటకటాల పాలయ్యాడు. మైలవరం పోలీస్ స్టేషన్లో సోమవారం సీఐ చంద్రశేఖర్ విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న మైలవరంలోని మారుతీనగర్లో ఓ రేకుల షెడ్డు నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు తమకు సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది ఆ ఇంటికి వెళ్లి తలుపులు తెరచి చూడగా ఇద్దరు చిన్నారులు వేములమడ హిరణ్య(12), వేములమడ సాయి(9) విగత జీవులుగా మంచంపై పడి ఉన్నారు. వారి తండ్రి వేములమడ రవిశంకర్ చిన్నారులను హత్య చేశాడు. భార్యపై అనుమానం, పిల్లలు తనకు పుట్టలేదన్న అపోహతో ఈ హత్యలకు పాల్పడ్డాడు. సాంకేతిక పరిజ్ఞానంతో అరెస్ట్.. రవిశంకర్, అతని భార్య చంద్రిక గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. చంద్రిక ఉపాధి కోసం విదేశాలకు వెళ్లింది. దంపతుల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. నిందితుడు రవిశంకర్కు భార్యపై అనుమానం ఉండటంతో ఆ పిల్లలు తనకు పుట్టారా అని పలుమార్లు భార్యను ప్రశ్నించడం, అనుమానంగా చేస్తుండేవాడని విచారణలో తేలింది. మైలవరంలోని అతని నివాసంలో ముందుగా చిన్నారి సాయిని ఓ చీరతో ఒక గదిలో ఉరివేసి చంపాడు, తరువాత హిరణ్యను మరో గదిలో దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఇద్దరినీ ఒకే మంచంపై పడుకోబెట్టాడు. కేసు తప్పుదారి పట్టించేందుకు ఇబ్రహీంపట్నం ఫెర్రీలో సిమ్ కార్డు వదిలి వైజాగ్ పారిపోయాడు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. కారు – ఆటో ఢీ : నలుగురికి గాయాలు మక్కపేట(వత్సవాయి): కారు ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలైన ఘటన సోమవారం గ్రామ శివారులో జరిగింది. జగ్గయ్యపేట వైపు నుంచి వస్తున్న కారు వత్సవాయి వైపు నుంచి వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు కాళ్లు, చేతులు, తలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆటోల్లో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మాదక ద్రవ్యాలతో జీవితాలు చిన్నాభిన్నం
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోపిమచిలీపట్నంటౌన్: గంజాయి, మత్తు పదార్థాల వినియోగంతో యువత జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటోందని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.గోపి చెప్పారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దిన వారోత్సవాల్లో భాగంగా సోమవారం కృష్ణాజిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవహారం చేపట్టారు. ర్యాలీలో కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ సమాజంలోని కొన్ని అసాంఘిక శక్తుల వల్ల యువత తప్పుదారి పట్టి మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంచి భవిష్యత్తును అందించడానికి కృషి చేయాలన్నారు. చిన్నారులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి గుర్తిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలి.. వ్యవస్థ పరంగా మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయని జస్టిస్ గోపి చెప్పారు. అదేవిధంగా వాటిని అరికట్టడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమన్నారు. ప్రతి నేరం ఘోరం వెనుక ఈ మాదకద్రవ్యాల వినియోగం ముఖ్య భూమిక పోషిస్తోందని, యుక్త వయసుకు వచ్చిన వారి పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వారిలో అనుమానాస్పద ప్రవర్తన గుర్తించినట్లయితే వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించి వివరాలు రాబట్టాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసైనట్లు గుర్తిస్తే వెంటనే వారికి అందుకు సంబంధించిన పునరావాస కేంద్రంలో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ముందుకు రావాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిల్వలు, వినియోగంపై ప్రజలకు ఎలాంటి సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య, మచిలీపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోతురాజు, న్యాయమూర్తులు, అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. -
ముగిసిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీలు
మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కౌన్సెలింగ్కు జిల్లా అధికారులు ఆదివారం సన్నద్ధమయ్యారు. అప్పటికే ఉమ్మడి కృష్ణాలో 115 మంది 2008, 150 మంది 1998 డీఎస్సీలకు చెందిన ఎంటీఎస్ టీచర్ల బదిలీల నిమిత్తం సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. కౌన్సెలింగ్ కోసం డీఈఓ కార్యాలయానికి చేరుకున్న ఉమ్మడి జిల్లా ఎంటీఎస్ టీచర్లు ఖాళీలను పూర్తి స్థాయిలో ప్రదర్శించా లంటూ ఆందోళనకు దిగిన విషయం పాఠకులకు విదితమే. అనంతరం ఉమ్మడి కృష్ణాలోని 264 మందికి మొత్తం 644 పోస్టులు ఖాళీలు ప్రదర్శించడంతో టీచర్లు శాంతించారు. బదిలీల వెబ్ లింక్ సాయంత్రం వరకు రాకపోవడంతో ఉపాధ్యాయులు అసహనానికి గురయ్యారు. పొద్దుపోయాక ప్రారంభమైన బదిలీల్లో తొలుత 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు ప్రాధాన్యమిచ్చారు. ఆదివారం అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ జరిగింది. నిబంధనల మేరకు ఈ నెల 20 నాటికి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా 22వ తేదీ నాటికి మొత్తం ఉమ్మడి కృష్ణాలోని 264 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీలు విద్యాశాఖ పూర్తి చేసింది. అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ టీచర్ల అసహనం -
కూటమి మోసాలపై యువత పోరు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యువతను, నిరుద్యోగులను నిండా ముంచింది.. 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి నెలకు రూ. 3వేలు ఇస్తామని నమ్మించి మోసం చేసింది.. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా యువతకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదంటూ కూటమి మోసాలపై యువత గళమెత్తింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో సోమవారం వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత, నిరుద్యోగుల పక్షాన యువత పోరు కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యువతీయువకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూ. 3వేల నిరుద్యోగ భృతి ఎక్కడ? 20లక్షల ఉద్యోగాలు ఏవి? ఉద్యోగాలు పీకుడేగాని, వేసుడు లేదు.. వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. వినతిపత్రం అందజేత నిరసన అనంతరం వైఎస్సార్ సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ప్రతినిధులు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఇలక్కియకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజ, బెల్లందుర్గ, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ బండి పుణ్యశీల, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, తోలేటి శ్రీకాంత్, దొడ్డా అంజిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంపత్ విజిత, త్రివేణిరెడ్డి, తోపుల వర్లలక్ష్మి, బూదాల శ్రీనివాసరావు, యువజన విభాగం నియోజకవర్గాల అధ్యక్షులు కేసరి రాజశేఖరరెడ్డి, దేవిశెట్టి శ్రీనివాసరెడ్డి, సీహెచ్ సీతారామిరెడ్డి, కార్పొరేటర్లు, పలు విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏడాది పాలనలో యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు 20 లక్షలు ఉద్యోగాలు ఎక్కడ? రూ.3 వేల నిరుద్యోగ భృతి ఏది? వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నాచౌక్లో యువత పోరుఅన్ని వర్గాలను మోసం చేస్తున్న చంద్రబాబు అండ్కోకూటమి అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాలను చంద్రబాబు అండ్కో మోసం చేసింది. హామీలు అమలు చేయాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందంటూ దాటవేత ధోరణి అవలంబిస్తోంది. తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టి రెండో ఏడాది రూ. 2వేలు కోత విధించి అరకొరగా వేసింది. 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తానని ఈ రోజుకు కూడా ఆ పథకం గురించి మాట్లాడటం లేదు. ఉచిత బస్సు, రైతులకు రూ.20 వేలు ఆర్థిక సాయం, ప్రధానంగా యువతకు నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఇవన్నీ చేస్తామని చెబితే నమ్మి ఓట్లేశారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు. మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేసిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్. కరోనా సమయంలో కూడా ప్రజలకు అండగా నిలిచారు. లక్షలాది ఉద్యోగాలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందించారు. కానీ కూటమి ఏడాది పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. –దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు -
ఈవీఎంల గోడౌన్ భద్రతపై ప్రత్యేక దృిష్టి పెట్టండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్ భద్రత, పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతర పర్యవేక్షణ జరగాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన గోడౌన్ల సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన సోమవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గల ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరిచే గోడౌన్ను అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, వివిధ పార్టీల నాయకులు యేదుపాటి రామయ్య, తరుణ్ కాకాని, కె.పరమేశ్వరరావు, ఎ.నాగేంద్రప్రసాద్, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ డెప్యూటీ తహసీల్దార్ గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ -
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
కలెక్టర్ జి.లక్ష్మీశగాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ జి.లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కార మార్గం లభిస్తుందని ఎంతో ఆశతో గ్రీవెన్స్ సెల్ను ఆశ్రయిస్తున్నారన్నారు. వారి నమ్మకానికి బలం చేకూర్చడానికి నాణ్యతతో అర్జీలు పరిష్కరించాలన్నారు. మానవతాదృక్పథంతో సానుకూలతతో సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలన్నారు. ఇకపై అర్జీల పరిష్కారంపై తాను ప్రతి రోజూ సమీక్ష నిర్వహిస్తానని, పరిష్కారంలో సరైన కారణం లేకుండా జాప్యం జరిగినా, నాణ్యత లేకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. 189 అర్జీల స్వీకరణ రెవెన్యూ శాఖకు సంబంధించి 93, పోలీస్ శాఖకు 22, విద్య 12, ఎంఏయూడీ 10, అటవీ 5, పంచాయతీరాజ్ 5, సర్వే 5, రిజిస్టేషన్ అండ్ స్టాంప్స్ 4, ఏపీఎస్డబ్ల్యూఆర్ఇఈఎస్ 3, హౌసింగ్ 3, గ్రామీణ నీటి సరఫరా 3, వ్యవసాయం 2, సహకార శాఖ 2, విభిన్న ప్రతిభావంతులు 2, డీఆర్డీఏ 2, ఉపాధి హామీ 2, హెల్త్ 2, విద్యుత్, పౌరసరఫరాలు, కళాశాల విద్య, డ్వామా, మత్య్స, జలవనరులు, కేడీసీసీ సీఈవో, కార్మిక శాఖ, బ్యాంకు, గనులు, ఆర్ అండ్ బీ, సాంకేతిక విద్యకు సంబంధించిన ఒక్కో అర్జీతో కలిపి మొత్తం 189 అర్జీలను స్వీకరించామని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ మహేశ్వరరావు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పాపారావు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం సాక్షిలో ‘దందాకు అండదండలు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా మళ్లీ మళ్లీ చేస్తున్న వ్యక్తులపై నిఘా పెట్టామన్నారు. ప్రివెంటివ్ ఆఫ్ బ్లాక్ మార్కెట్ యాక్టు ప్రకారం ఐదుగురిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్, పోలీసు కమిషనర్కు సూచించినట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్ మెంట్ను కట్టుదిట్టం చేశామని, బియ్యం సరిహద్దులు దాట కుండా పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నామని వివరించారు. ప్రభుత్వం రూపొందించిన యాప్లో అన్లైన్లో ఆర్ఐలు, డీటీలు, తహసీల్దార్లు, ఆర్డీఓలు తనిఖీలు చేసి వివరాలు నమోదు చేస్తున్నారన్నారు. బియ్యం పక్కదారి పట్టకుండా ప్రజలకు నిత్యావసర సరుకులను సక్రమంగా అందేలా చర్యలు తీసుకొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రివెంటివ్ ఆఫ్ బ్లాక్ మార్కెట్ యాక్టు ప్రకారం క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసిన ఐదుగురిలో రేషన్ బియ్యం మాఫియా డాన్ రామచంద్రరావు పేరు ఉన్నట్లు సమాచారం. ఇతనిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. క్షేత్ర స్థాయిలో తనిఖీలు ముమ్మరం డీఎస్ఓ పాపారావు -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3,70,41,400
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయ వాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం (దుర్గగుడి)కి హుండీ కానుకల ద్వారా రూ.3,70,41,400 ఆదాయం లభించింది. ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహామండపం ఆరో అంతస్తులో సోమవారం హుండీ కానుకల లెక్కింపు చేర్చారు. 18 రోజులకు రూ.3,70,41,400 నగదు, 501 గ్రాముల బంగారం, 6,948 గ్రాముల వెండి లభించాయి. కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనానాయక్ పర్యవేక్షించగా అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రంగారావు, దేవదాయ శాఖ సిబ్బంది, వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. చల్లపల్లి విద్యార్థికి జాతీయస్థాయి గుర్తింపు చల్లపల్లి: కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన విద్యార్థి వేముల హేమంత్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. చల్లపల్లికి చెందిన వ్యాపారి వేముల పాండురంగారావు, దీపిక దంపతుల కుమారుడు హేమంత్ విజయవాడలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) చదివి ప్రస్తుతం ఆర్టికల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2024 జూన్లో నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) పరీక్షల్లో కళాశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన హేమంత్ జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించాడు. న్యూఢిల్లీలో సోమవారం ఐసీఎంఏఐ ఆధ్వర్యంలో 12వ నేషనల్ స్టూడెంట్ కాన్వకేషన్–2025 జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఐసీఎంఏఐ అధ్యక్షుడు బిభూతి భూషణ్ నాయక్ చేతుల మీదుగా వేముల హేమంత్ ధ్రువపత్రాన్ని, పతకాన్ని అందుకున్నాడు. -
మద్యం మత్తులో దారుణ హత్య
జగ్గయ్యపేట అర్బన్: మద్యం మత్తులో జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఆదివారం జరిగింది. జగ్గయ్యపేట సీఐ కార్యాలయంలో సీఐ పి.వెంకటేశ్వర్లు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పట్టణంలోని క్రిస్టియన్పేటకు చెందిన అభిమళ్ల వెంకయ్య (32) పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అప్పుడప్పుడు ఇనుము సామగ్రి లోడింగ్కు కూడా వెళ్తుంటాడు. మద్యం అలవాటున్న వెంకయ్యకు విలియంపేటకు చెందిన అల్లూరి కృష్ణతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు స్నేహంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పట్టణంలోని ఓ వైన్షాపు వద్ద వారిద్దరూ మద్యం తాగారు. ఆ మత్తులో గొడవ పడ్డారు. వెంకయ్యను ఎలాగైనా చంపుతానని అల్లూరి కృష్ణ బెదిరించాడు. అక్కడ ఉన్నవారు ఇద్దరినీ విడదీసి పంపించేశారు. ఆ తరువాత ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో పట్టణంలోని రైతుబజారు ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వెనుక ఒంటరిగా ఉన్న వెంకయ్యపై కృష్ణ రాయితో దాడిచేసి పారిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో వెంక య్య మృతిచెందాడు. వెంకయ్య తల్లి మణి పట్టణ పోలీస్స్టేషన్కు వచ్చి అంబేడ్కర్ విగ్రహం వద్ద తన కుమారుడు చనిపోయి ఉన్నాడని ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వెంకయ్య మృతదేహం పక్కన అతనిపై దాడికి వాడిన రాయి కూడా ఉంది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టి అల్లూరి కృష్ణను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో పేట ఎస్ఐ జి.రాజు, చిల్లకల్లు ఎస్ఐ ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కెనరా బ్యాంక్లో అగ్నిప్రమాదం
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని కోదాడ రోడ్లో ఉన్న కెనరా బ్యాంకులో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ వారు గుర్తించారు. ఉదయం 5 గంట ల సమయంలో బ్యాంకు నుంచి పొగలు రావడంతో బ్యాంకు ఉన్న బిల్డింగ్పై అంతస్తులో ఉన్న వాగ్దేవి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బుస్సా సురేష్ అగ్నిమాపక శాఖ వారికి, బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. మంట లు బిల్డింగ్ మొత్తం వ్యాపించకుండా నివారించడంతో పెను ప్రమాదం తప్పింది. ముందు గా పై అంతస్తులో ఉన్న నర్సింగ్ కళాశాల హాస్టల్ విద్యార్థులను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో బ్యాంక్ క్యాష్ కౌంటర్లోని కంప్యూటర్, టేబుల్స్ తదితర ఫర్నీచర్, ఫ్యాన్లు కాలిపోయాయి. సుమారు రూ. లక్ష వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పిల్లలు సహా మహిళ ఆత్మహత్యా యత్నం కృష్ణలంక(విజయవాడతూర్పు): మనస్తాపం చెంది ఇద్దరు పిల్లలు సహా ఆత్మహత్యకు యత్నించిన మహిళను కృష్ణలంక పోలీసులు కాపాడిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భవానీ పురం, ఎరుకల వారి వీధికి చెందిన జడిపట్ల లావణ్య, జ్యోతికిరణ్ భార్యాభర్తలు. వీరికి ఏడేళ్లు, నాలుగేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కిరణ్ ఆటోడ్రైవర్గా పనిచేస్తుండగా, లావణ్య సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తోంది. కిరణ్ రోజూ మద్యం తాగి వస్తుండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన లావణ్య పిల్లలతో కలిసి కృష్ణనదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణలంక పద్మావతి ఘాట్ పరి సరాల్లో కృష్ణానదిలోకి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వారించి స్టేషన్కు తరలించారు. సీఐ నాగరాజు మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చి భవానీపురం పోలీసులకు అప్పగించారు. -
కౌంటర్లు, దుకాణాల్లో ఈవో తనిఖీలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవస్థాన కౌంటర్లతో పాటు దుకాణాల్లో ధరల బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఇంద్రకీలాద్రిపై రద్దీ నేపథ్యంలో ఈవో శీనానాయక్ పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. తొలుత ఓం టర్నింగ్ వద్ద ఉన్న పొంగలి షెడ్డును తనిఖీ చేసి, గతంలో గుర్తించిన లోపాలను సరి చేశారా లేదా అని పరిశీలించారు. అనంతరం దేవస్థానం కొబ్బరి కాయల కౌంటర్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. రోజు వారి అమ్మకాలు, భక్తుల అభిప్రాయ సేకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులతో మాట్లాడి.. లగేజీ, చెప్పుల స్టాండ్ వద్ద ఈవో భక్తులతో మాట్లాడారు. కౌంటర్లలో అధిక రుసుం వసూలు చేయరాదని, భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం టోల్గేట్ వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లో నీటి నాణ్యతను పరీక్షించారు. కనకదుర్గనగర్లో దుకాణాల వద్ద ధరల బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే బోర్డులు ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అమ్మవారి సన్నిధిలో నిద్ర చేసే భక్తులు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈవో వెంట అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఈఈ కోటేశ్వరరావు, ఇతర ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు యువత పోరు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/లబ్బీపేట(విజయవాడతూర్పు): యువత జీవితాలతో కూటమి చెలగాటమాడుతోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 23న నిర్వహించనున్న ‘యువత పోరు’ పోస్టర్ను ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్యతో కలిసి అవినాష్ ఆవిష్కరించారు. సోమవారం ఉదయం 10 నుంచి విజయవాడ అలంకార్సెంటర్లోని ధర్నా చౌక్లో యువత పోరు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు సర్కార్పై నిరసన గళంనిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కార్పై నిరసన గళం వినిపించేందుకు యువత పోరు ఏర్పాటు చేశారన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు, అనుబంధ విభాగాల వారు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకూ నిరసనలు తెలియజేద్దామని పిలుపునిచ్చారు. యువత పోరు కార్యక్రమం అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా యువతకు రూ.3వేలు నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ. 3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిందన్నారు. కానీ ఏడాది పాలనలో నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోయిందన్నారు. వలంటీర్లు, ఎండీయూ వాహనాల నిర్వాహకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులు , పార్టీ ఇన్చార్జిలతో కలిసి యువత పోరుకు సమాయత్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. మచిలీపట్నంలో.. చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యాన జిల్లా కేంద్రమైన మచిలీ పట్నంలో యువత పోరు కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మేరుగుమాల శ్రీకాళేశ్వరరావు ఆదివారం తెలిపారు. నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నామన్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపి తర్వాత కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ ధర్నాచౌక్లో నిరసన కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేత -
జగన్మాతకు జేజేలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భక్తజనం జగన్మాతకు జేజేలు పలికారు. నగరంలోని దుర్గ గుడిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభమైన భక్తుల సందడి సాయంత్రం వరకు కొనసాగింది. సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం కావడంతో అమ్మవారి ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. లోక కల్యాణార్థం ఆదివారం ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 11 గంటలకు అన్ని క్యూలైన్లు కిటకిటలాడటంతో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. రూ. 300 టికెట్పై బంగారు వాకిలి దర్శనం కల్పించగా, రూ. 100 టికెట్పై రెండు క్యూలైన్లు నడిచాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం పల్లకీ సేవ జరిగింది. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఆర్జిత సేవల్లో ఉభయదాతలు -
కీళ్లు కిర్రు కిర్రు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కీళ్ల సమస్యలు అధికమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వాస్పత్రిలో, ప్రైవేటు ఆస్పత్రిల్లో ఆర్ధోపెడిక్ వైద్యుల వద్దకు కీళ్ల సమస్యలతో ఎక్కువ మంది వస్తున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరికి కీళ్ల అరుగుదల సమస్య ఎదురవుతోంది. ఇలాంటి వారిలో 35 ఏళ్లు వయస్సు వారు కూడా ఉండటం గమనార్హం. 40 ఏళ్లకే కీళ్ల మార్చిడి చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఒకప్పుడు ఒబెసిటీ ఉన్న వారిలో, వృద్ధాప్యంలో కీళ్లు అరిగిన వారు ఉండేవారు. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే ఆర్థరైటిస్ కారణంగా కీళ్లు అరిగిపోతున్నాయి. కీళ్లు పూర్తిగా అరిగి నడవలేని స్థితికి చేరుకున్న వారికి కీళ్ల మార్పిడే మార్గంగా ఉంటోంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది ఎందుకు సోకుతుందో కచ్చితంగా నిర్ధారించలేదు. ప్రస్తుతం ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సోకిన వారిలో కీళ్ల వాపులు, తీవ్రమైన కీళ్ల నొప్పులు ఉంటాయి. సకాలంలో చికిత్స చేయించుకోకుండా అశ్రద్ధ చేస్తే కీళ్లు అరుగుదలతో పాటు చర్మం, కళ్లు, ఊపిరితిత్తులు, గుండె, నరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె, ఊపిరితిత్తుల చుట్టూ వాపు ఏర్పడవచ్చు. ప్రస్తుతం రుమటాయిడ్ ఆర్థరైటిస్కు మంచి వైద్యం అందుబాటులోఉంది. క్రమం తప్పకుండా మందులు వాడి అదుపులో ఉంచుకోవచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ దీన్ని గుల్ల ఎముక (ఆస్టియో ఆర్థరైటిస్) వ్యాధి అని కూడా అంటారు. ఇది సోకిన వారిలో ఎముకలు గుల్లబారుతుంటాయి. ఆ ప్రభావంతో చిన్న దెబ్బకే విరుగుతుంటాయి. మోకీళ్లు, తుంటెకీళ్లు అరుగుదల ఏర్పడుతుంది. అలాంటి వారికి కీళ్లమార్పిడి చేయాల్సి వస్తుంది. వెన్నుముక వంకర ఏర్పడటంతో నిటారుగా నడవలేని పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మధ్య వయస్సు వారు కూడా ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే ఆర్థరైటిస్ అరుగుతున్న కీళ్లు వ్యాయామంతో అదుపులో.. జిల్లాలో 50 వేల వరకూ ఆర్థరైటిస్ రోగులుఇలాంటి వారికి రావచ్చు థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఆర్థరైటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 16 నుంచి 45 ఏళ్ల మహిళలకు రావచ్చు. ఈ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడటం, వ్యాయామం, ఆహార నియమాలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే అందుపులో ఉంచవచ్చు. ముఖ్యంగా ఏ రకమైనది సోకిందో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. -
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ రెండో రోజైన ఆదివారం కొనసాగింది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో 145, మాచ వరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్రంలో 119 మంది, ఆంధ్ర లయోలా డిగ్రీ కళాశాల ఆవరణలో 91 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైంది. 355 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను ఆదివారం పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశామని పాలిసెట్ ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. నేటి షెడ్యూల్ ఇదీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 32001 నుంచి 38 వేల ర్యాంకు వరకు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 38001 నుంచి 44 వేల ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 44001 నుంచి 50 వేల ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శుల సంఘం ఎన్నిక కంచికచర్ల: ఎన్టీఆర్ జిల్లా గ్రామ పంచాయతీ కార్యదర్శులు సంఘ ఎన్నికలు గొల్లపూడి దత్త కల్యాణ మండపంలో ఆదివారం జరిగాయని ఎన్నికల అధికారి (డెప్యూటీ ఎంపీడీఓ) ఎంవీ ప్రసాద్ తెలిపారు. జిల్లా కార్యదర్శుల సంఘ అధ్యక్షుడిగా ఇందుపల్లి నానిబాబు(కంచికచర్ల మండలం చెవిటికల్లు), ఉపాధ్యక్షుడు టి.సాంబశివరావు(వీరులపాడు మండలం కొనతాలపల్లి), ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరెడ్డి(జగ్గయ్యపేట మండలం ముక్తేశ్వరపురం), జాయింట్ సెక్రటరీ పి.గోపీకృష్ణ(వత్సవాయి మండలం మక్కపేట), కోశాధికారి ఏ నరేష్(పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం), కార్యవర్గ సభ్యులను ఎన్నుకొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ రమణ తదితరులు పాల్గొన్నారు. నేడు దుర్గగుడి మాస్టర్ప్లాన్పై సమీక్ష ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి మాస్టర్ప్లాన్పై సోమవారం సమీక్ష సమావేశం జరగనుంది. మహామండపంలోని ఏడో అంతస్తులో సమీక్ష నిర్వహిస్తారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యే అవకాశాలున్నాయి. దేవస్థానంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, మాస్టర్ప్లాన్ అమలుపై దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దసరా నాటికి మహామండపం ఎదుట అన్నదాన భవనం, ప్రసాదాల పోటులను సిద్ధం చేయడానికి ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంజినీరింగ్ పనులు, ఇతర అభివృద్ధి పనులకు ఆలయ ఈవో శీనానాయక్ ఇప్పటికే పలుసార్లు సమీక్షించారు. కనకదుర్గనగర్, గోశాల ఎదుట ఉన్న దుకాణాలను మహా మండపం 5వ అంతస్తులోకి తరలించే అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ దుకాణాలను తరలిస్తేనే అభివృద్ధి పనులకు అటంకం లేకుండా సకాలంలో పూర్తి చేసే వీలుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. పేకాట కేసులో టీడీపీ 30వ డివిజన్ ఇన్చార్జి! మధురానగర్(విజయవాడసెంట్రల్): పేకాట కేసులో 30వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి కరణం వెంకటరమణను ఆదివారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినాయకనగర్లో ఆదివారం పేకాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందులో 30వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి కరణం వెంకటరమణ కూడా ఉన్నారని తెలిసింది. దీంతో టీడీపీ నాయకులు ఈ కేసు నుంచి వెంకటరమణను బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇదే డివిజన్కు చెందిన ఎమ్మెల్యే పీఏ.. కేసును నీరు కార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
దందాకు అండదండలు..
రెచ్చిపోతున్న రేషన్ మాఫియా సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధికారులు, కూటమి నేతల అండదండలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఇందులో కీలక పాత్ర టీడీపీకి చెందిన నియోజక వర్గ స్థాయి నేతలు పోషిస్తున్నారు. పోలీసులు, పౌరసరఫరా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్నారు. వీరి కనుసన్నల్లోనే కాకినాడ పోర్టుకు భారీగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని తెలుస్తోంది. రేషన్ షాపులు తెరిచిన వారం రోజుల్లోనే.. రేషన్ దుకాణాలను తెరిచిన వారం రోజుల్లోపే రేషన్ బియ్యం అక్రమ నిల్వలతో పట్టుబడి పలు షాపులను సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పలుచోట్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం మాటలు బూటకమని తేలిపోయింది. నేరుగా రేషన్ డీలర్లే రేషన్ బియ్యం అక్రమ రవాణాలో పాత్ర వహించడం విస్మయానికి గురి చేస్తోంది. జిల్లాలో ‘రేషన్’ గ్యాంగ్ తిరువూరు, మైలవరం, నూజివీడుల్లో అక్కడి నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో రామచంద్రరావు అనే వ్యక్తి రేషన్ మాఫియాని నడిపిస్తున్నారు. వీరికి తోడుగా జి.కొండూరులో నిఖిల్, గొల్లపూడిలో సురేష్ పాతపాడులో రంగా, తిరువూరులో చారి తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. రేషన్ మాఫియా డాన్కు కొందరు సీఐలు సహకరిస్తున్నారు. కేతన కొండలోని ఓ రైస్ మిల్లులో రీ సైక్లింగ్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చేరడం.. చర్యలకు ఉపక్రమించడంతో, పార్లమెంటు ప్రజా ప్రతినిధి కార్యాలయంలో ఉండే అక్రమాల ‘కిశోరం’ అడ్డుపడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ పోర్టుకు.. జగ్గయ్యపేట నియోజకవర్గంలో నాగరాజు, వత్సవాయి మండల పరిధి లింగాల గ్రామానికి చెందిన నరసింహారావు రేషన్ మాఫియాను నడిపిస్తున్నారు. ‘నందిగామ’లో వీరులపాడు మండలానికి చెందిన హరికృష్ణ, సత్యం, చందర్లపాడులో ఇద్దరు నరసింహారావులు, మాఫియాని నడిపించడంలో కీలకంగా ఉన్నారు. నియోజక వర్గంలో కీలక బాధ్యతలు చూస్తున్న వ్యక్తి వీరికి అండగా ఉంటున్నారు. విజయవాడ అజిత్సింగ్నగర్లో కోటేశ్వరావుతోపాటు, రూరల్, జక్కంపూడికాలనీలో టీడీపీ నేతలు దందాలో పాల్గొంటున్నారు. బియ్యం విస్సన్నపేట మీదుగా కాకినాడ పోర్టుకు వెళ్తున్నాయి. ఈ నెలలో పట్టుబడిన ఘటనలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రేషన్ షాపు నంబరు 6లో రేషన్ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్లు ఈ నెల 4వ తేదీన రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. వారు తనిఖీలు చేయగా 18బస్తాల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించి షాపును సీజ్ చేశారు. ● ఎ.కొండూరు మండల పరిధి కొత్తరేపూడి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 34 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు ఈ నెల 8వ తేదీన స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం కనిపించకుండా మొక్కజొన్న విత్తనాలతో కలిపి ప్యాక్ చేసిన మిల్లు నిర్వాహకులు అధికారుల కన్నుగప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ● ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల పరిధి నాగులూరులో రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్న నందిపాము వరప్రసాద్ అనే డీలరుపై తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి ఈ నెల 4వ తేదీన 6ఏ కేసు నమోదు చేశారు. స్టాకు రిజిస్టరు కంటే అదనంగా 162 కిలోల బియ్యం, 72 కిలోల పంచదార డీలరు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ ఈస్ట్లో ఒకరు, సెంట్రల్ ఒకరు రేషన్ మాఫియాలో ఒకరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులది హైటెక్ జీవనశైలి రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వారి వద్ద ఖరీదైన ఐ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, కార్లు ఉండటం పోలీసులనే విస్తుగొలుపుతోంది. ఈ వ్యాపారం చేస్తున్న వారు నెలకు రూ.10 నుంచి 20 లక్షల వరకూ సంపాదిస్తున్నట్టు తెలిసింది. కీలక భాగస్వాములు.. పచ్చనేతలు, పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులే! బియ్యం వాహనాలతో అక్రమాలు అంటూ కూటమి విష ప్రచారం ఈ నెలలో పలుచోట్ల రేషన్ బియ్యం పట్టివేత మిల్లులకు తరలించి అక్కడ నుంచి పాలిష్ పట్టి బియ్యం అమ్మకాలు మరికొన్ని కాకినాడ పోర్టుకు తరలించి ఇతర దేశాలకు రవాణా ఎక్కడికి తరలిస్తున్నారు కృష్ణా జిల్లాలో..ప్రభుత్వం బూటకపు మాటలు గత ప్రభుత్వం మొబైల్ వాహనాలతో ఇంటింటికీ రేషన్ ఇచ్చారు. వీటితో అక్రమాలు పెరిగిపోతున్నాయంటూ కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేసింది. ఈ వాహనాలను తొలగించి పాత పద్ధతిలోనే డీలర్లకు బాధ్యతలు అప్పగించారు . రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకే ఎండీయూ వాహనాలను రద్దు చేసినట్లు ప్రభుత్వం బూటకపు మాటలు చెప్పింది. చిన్నపాటి కేసులతో సరి అక్రమ రవాణా ఘటనల్లో పట్టుబడిన వారు గతంలో పలుసార్లు రేషన్ బియ్యాన్ని అక్రమ సరఫరా చేసినవారే. పట్టుకున్నప్పుడలా చిన్న చిన్న కేసులు కట్టి వదిలేయడం మళ్లీ వారు అక్రమ వ్యాపారం చేయడం పరిపాటైంది. వీరిపై బలమైన కేసులు పెడితే ఇలాంటి పనులు చేయడానికి మిగిలిన వారు భయపడతారని కొంతమంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా అర్ధరాత్రి, తెల్లవారు జామున రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుంటారు. ఆ సమయంలో ముందుగానే రెక్కీ నిర్వహించి తమకు అనుకూలంగా ఉన్న పోలీసులు ఉంటే వాహనాలను ముందుకు వెళ్లనిస్తారు. లేదంటే తర్వాత పంపిస్తారు. బియ్యం అక్రమ రవాణాలో పోలీసులకు ముడుపులు ముడుతున్నట్టు విమర్శలున్నాయి. ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులకు పెద్ద మొత్తంలో మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లోని మిల్లులకు తరలించి వీటిని పాలిష్పెట్టి కిలో రూ.35 నుంచి రూ.40కి బయట వ్యాపారులకు అమ్ముకుంటున్నట్టు తెలిసింది. కార్డు దారుల నుంచి కిలో బియ్యం రూ.10 కొనుగోలు చేసి, అక్కడ నుంచి మిల్లులకు కిలో రూ.18 కి అక్రమార్కులు విక్రయిస్తున్నారు.ఈ నెల 3వ తేదీ అవనిగడ్డలో 4.50 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మోపిదేవి మండలం పెదకళ్లేపల్లికి చెందిన కూతాడి వెంకన్న, అవనిగడ్డకు చెందిన కోసూరు రామారావుని అరెస్ట్ చేసి వారి వాహనాల నుంచి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని రేషన్ షాపులకు పంపిన బియ్యం సీలు కూడా తీయకుండా అలాగే అక్రమ రవాణా చేయడం కొసమెరుపు. గుడివాడ బైపాస్ రోడ్డులో ఈనెల 16న అక్రమంగా తరలిస్తున్న 17క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని అక్రమ వ్యాపారం చేస్తున్న కొత్తపేటకు చెందిన పెద్ది రామచంద్రరావు, వ్యాన్ డ్రైవర్ యండమూరి సీతారాముడుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
ఏ రకమో గుర్తించడం ముఖ్యం
ఆర్థరైటిస్ 12 రకాలు ఉన్నాయి. వాటిలో రోగికి ఏ రకమైన ఆర్థరైటిస్ సోకిందో తెలుసుకుని మందులు వాడాల్సి ఉంటుంది. కొందరికి ఆరునెలలు, ఏడాది పాటు మందులు వాడితే తగ్గిపోతుంది. మరికొందరు దీర్ఘకాలికంగా మందులు వాడాల్సి ఉంటుంది. లక్షణాలను తొలిదశలో గుర్తించి మందులు వాడితే దుష్పలితాలు లేకుండా చూడవచ్చు. కీళ్లనొప్పులు, వాపులు ఉండటం, ఉదయాన్నే వేళ్లు కీళ్లు పట్టేసినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించాలి. –డాక్టర్ ఎన్.కావ్యాదేవి, రుమటాలజిస్ట్, విజయవాడ● -
మా కష్టాన్ని గుర్తించి న్యాయం చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): ‘మా కష్టాన్ని గుర్తించి న్యాయం చేయాలని’ ఎంటీఎస్ టీచర్లు కోరారు. మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయం వద్ద ఆదివారం జరగాల్సిన ఎంటీఎస్ టీచర్ల కౌన్సెలింగ్ను బాయ్కాట్ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము 1998, 2008 డీఎస్సీలో అర్హత పొంది టీచర్లుగా పని చేస్తున్నామన్నారు. తక్కువ జీతంతో చేస్తున్న తాము ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ గోడు విని మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) రూ.32,470 వేతనంగా ప్రకటించి ఉమ్మడి జిల్లాలోని 265 మంది ఉపాధ్యాయులకు న్యాయం చేశారని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు తమను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయాలన్న ఉద్దేశంతో దూర ప్రాంతాల్లోని ఖాళీలను మాత్రమే చూపి కౌన్సెలింగ్ నిర్వహించాలని చూస్తున్నారన్నారు. నిబంధనను తుంగలో తొక్కుతున్నారుగతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్లకు తక్కువ వేతనం కాబట్టి దగ్గర ప్రాంతాల్లోనే బదిలీ చేయాలని నిబంధనగా చేసిందని దాన్ని తుంగలో తొక్కే ప్రయ్నతం చేయాలని ఇప్పటి ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. ఇతర ఉపాధ్యాయుల మాదిరిగా హెచ్ఆర్ఏ, డీఏలు లేవని ఓన్లీ టైమ్ స్కేల్లో పని చేస్తున్న తమకు నియర్ బై రెసిడెన్స్ ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంటీఎస్ టీచర్లకు మ్యూచువల్ బదిలీలకు కూడా అవకాశం కల్పించాలన్నారు. తమలో దివ్యాంగులు కూడా ఉద్యోగులుగా చేస్తున్న వారు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని యథావిధిగా పని చేస్తున్న స్థానంలోనే కొనసాగించాలని కోరారు. ఎంటీఎస్ టీచర్లు కౌన్సెలింగ్ బాయ్కాట్ కృష్ణా డీఈఓ కార్యాలయం వద్ద నినాదాలతో నిరసన -
ఆర్థరైటిస్లో కీళ్ల అరుగుదల
రుమటాయిడ్, సోరియాసిస్ ఆర్థరైటిస్ లాంటి ఇన్ప్లమేటరీ డిసీజ్ కారణంగా తుంటి, మోకీళ్ల అరుగుదల ఎక్కువగా ఉంటుంది. మధ్య వయసులోనే కీళ్లు అరిగి వస్తున్నారు. అలాంటి వారికి కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నాం. మోకీలు మార్పిడికి రోబోటిక్ సర్జరీలు చేస్తున్నాం. టోటల్ హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీలు ఎక్కువగా చేస్తున్నాం. వందశాతం సక్సెస్రేటుతో కీళ్ల మార్పిడి చేస్తున్నాం. 20 నుంచి 80 ఏళ్ల వయస్సు వాళ్ల వరకు వస్తున్నారు. –డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ -
పీఆర్సీ కమిషన్ను నియమించండి
ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని పెండింగ్ డీఏలు, పాత బకాయిలను చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. చిరంజీవి కోరారు. నగరంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. చిరంజీవి మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమైన వెంటనే ట్రైనింగ్స్ పెట్టి ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయటం సరికాదన్నారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి. సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షితులయ్యేలా విద్యావిధానాలను రూపొందించాలన్నారు. ఆన్లైన్ పనులతో పాటు బోధనా సమయాన్ని హరించకుండా చూడాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ. దస్తగిరి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్ల బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. లంకేష్, గౌరవాధ్యక్షుడు ఎం. రామబ్రహ్మం, సంఘ నాయకులు పాల్గొన్నారు. -
క్రియా యోగాతో ఆనందకరమైన జీవితం
విజయవాడ కల్చరల్: క్రియా యోగాతో ఆనందకరమైన జీవితం పొందవచ్చని స్వామి స్మరణానందగిరి స్వామి పేర్కొన్నారు. యోగదా సత్సంగ ధ్యానకేంద్రం విజయవాడ శాఖ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని రామకోటిలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా ఆదివారం ఆయన భారతీయ యోగా అంశంగా ప్రసంగించారు. భారతీయ రుషులు మనకు అందించిన అద్భుతమైన ప్రక్రియ యోగా అన్నారు. భారతీయ యోగా పట్ల ప్రపంచం ఆసక్తి చూపుతోందన్నారు. దీని వల్ల శరీరంలో వస్తున్న హానికరమైన మార్పుల నుంచి విముక్తి కలుగుతోందన్నారు. జీర్ణప్రక్రియలో మార్పులు కలిగి స్వస్థత కలుగుతుందన్నారు. ధ్యాన పద్ధతులను వివరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నట్లు తెలిపారు. న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. స్మరణానంద స్వామిని కలెక్టర్ లక్ష్మీశ, హజరత్తయ్య గుప్తా సత్కరించారు. -
ఘనంగా మెడికల్ కళాశాల వార్షికోత్సవం
గన్నవరం రూరల్: నైతిక విలువలు, ధర్మం పునాధులుగా విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ భారతీయం సత్యవాణి ఆకాంక్షించారు. ఆదివారం రాత్రి చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల 19వ వార్షికోత్సవాన్ని విద్యార్థుల కోలాహలం మద్య ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్ డాక్టర్, మేజర్ ఎంవీ భీమేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యవాణి మాట్లాడుతూ పవిత్రమైన వైద్య వృత్తిలో స్థిరపడే విద్యార్థులు భారతదేశ ఔన్యత్యాన్ని, వారసత్వాన్ని, చరిత్రను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు వైద్య రంగంలో విశేషంగా రాణిస్తున్నారని అభినందించారు. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైద్య విద్యార్థులు క్రమశిక్షణతో ప్రగతి సాధించాలన్నారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు ఎం.రాజయ్య, ట్రెజరర్ సూర్రెడ్డి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ డాక్టర్ సీవీ రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
చెరువుల్లో పూడికతీత చేపట్టాలి
ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య విజయవాడరూరల్: చెరువుల్లో పూడిక తీత పనులు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులు వ్యవసాయ పనులు ముమ్మరంగా చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ పొలాలు మెరక చేసుకునేందుకు చెరువుల ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులకు మాత్రమే మట్టిని తీసుకొనే అవకాశం కల్పించాలన్నారు. చెరువుల్లో మట్టి అక్రమ విక్రయాలకు గురికాకుండా ఉండాలన్నారు. ఎత్తిపోతల పథకాలపై దృష్టి పెట్టండి.. అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో 39 ఎత్తిపోతల పథకాలున్నాయని వాటిల్లో ప్రధానమైన వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.15 కోట్లను మంజూరు చేశారని, అయితే ఇంత వరకు మరమ్మతుల పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. ఆ ఎత్తిపోతల పథకం పరిధిలో 20వేల ఎకరాల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయని మరమ్మతుల పనులు యుద్ధప్రాతిపదికన చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. పోలంపల్లి ఆనకట్ట మరమ్మతుల పనులు, మునేరుపై ఎత్తిపోతల పథకం పనులు కూడా ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదని గుర్తు చేశారు. -
సీటు కోసం పాట్లు
జి.కొండూరు: నిలబడేందుకు నీడ లేక, కూర్చునేందుకు అవకాశం లేక గురుకులంలో ప్రవేశం కోసం కౌన్సెలింగ్కు వచ్చిన అభ్యర్థులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. గురుకుల బాలికల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ గురుకుల పాఠశాలల జిల్లా కో ఆర్డినేటర్ మురళీకృష్ణ పర్యవేక్షణలో జరిగింది. అయితే కౌన్సెలింగ్లో సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో అభ్య ర్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు నరక యాతన పడ్డారు. అందరూ ఐదో తరగతిలో ప్రవేశం కోసం వచ్చిన చిన్న వయస్సు బాలికలు కావడంతో వారికి ప్రత్యేక వసతులు లేక ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం తొమ్మిది గురుకుల బాలికల పాఠశాలలు ఉండగా అన్ని పాఠశాలల్లో మిగిలిన వంద సీట్ల భర్తీ కోసం ఈ కౌన్సెలింగ్ను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 970మంది అభ్యర్థులు, వారి వెంట తల్లిదండ్రులతో కలిపి 2వేల మందికిపైగా హాజరయ్యారు. వీరికి నిలబడేందుకు కనీసం టెంటు సౌకర్యం లేక, తినేందుకు తిండిలేక, మైకులు లేకపోవడంతో కౌన్సెలింగ్లో ఏ పేర్లు పిలుస్తున్నారో అర్థం కాక అభ్యర్థులు ఆందోళన చెందారు. తల్లిదండ్రుల ఆగ్రహం.. వంద సీట్ల కోసం అన్ని వందల మందిని కౌన్సెలింగ్కు ఎందుకు పిలిచారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా అత్యంత దారుణంగా కౌన్సెలింగ్ను నిర్వహించారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పాఠశాల హెచ్ఎం కె.బ్యూలాని వివరణ కోరగా అన్ని వసతులు కల్పించామన్నారు. తక్కువ సీట్ల కోసం ఎక్కువ మంది హాజరు కావడం వల్ల సీట్లు రాని వారు అసంతృప్తి వ్యక్తం చేశారని వివరణ ఇచ్చారు. కుంటముక్కల గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ కనీస మౌలిక వసతులు లేక అభ్యర్థుల నరకయాతన వంద సీట్ల కోసం 970మంది పోటీ -
ఉత్సాహంగా స్నాతకోత్సవం
గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరులో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ 24వ స్నాతకోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ డాక్టర్ నూతలపాటి వెంకటరమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమాన అవకాశాలు, సామాజిక చలనశీలతను నిర్ధారించడానికి నాణ్యమైన విద్య శాశ్వత సాధనాల్లో ఒకటి అని ఆయన పేర్కొన్నారు. అది అందించడంలో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ముందుందని కొనియాడారు. ఈ స్నాతకోత్సవంలో 1,165 మంది విద్యార్థులు హాజరై ప్రొవిజనల్ సర్టిఫికెట్లను ముఖ్య అతిథి ఎన్.వి.రమణ చేతుల మీదుగా ఆయా విభాగాల విభాగాధిపతులు, అధ్యాపకుల సమక్షంలో అందుకున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థినులు వరుసగా కొమ్ము సుప్రియ (9.65), గంజి స్నేహలత (9.52), ఈలపర్తి ప్రియాంక (9.51) అకడమిక్ టాపర్స్గా నిలవడం విశేషం. 33మంది విద్యార్థులు ఆనర్స్ డిగ్రీ పూర్తి చేయగా, 17మంది విద్యార్థులు మైనర్స్ డిగ్రీ పూర్తి చేసి అదనంగా 18క్రెడిట్స్ సాధించారు. అన్నింట్లో ముందంజ.. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్ మాట్లాడుతూ విద్యా సంబంధిత విషయాలలోనే కాకుండా క్రీడా విభాగంలో సహితం కళాశాల విద్యార్థులు ముందంజలో ఉన్నారన్నారు. 25మంది విద్యార్థులు యూనివర్సిటీ బ్లూస్గా జేఎన్టీయూకే కాకినాడకు ప్రాతినిధ్యం వహించి, అంతర్ విశ్వ విద్యాలయం, అంతర్ రాష్ట్ర టోర్నమెంట్లలో పాల్గొని అనేకానేక పతకాలు, ట్రోఫీలు గెలుచుకున్నారని చెప్పారు. అంతర్ కళాశాలల అథ్లెటిక్స్లలో 17బంగారు పతకాలు, 10వెండి పతకాలు, 4రజత పతకాలు సాధించారన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విద్యార్థిని కె.అనిత రికార్డు స్థాయిలో అత్యధికంగా 253 పాయింట్లు సాధించి బెస్ట్ ఔట్ గోయింగ్ స్టూడెంట్గా నిలవడం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. ముందుగా కళాశాల ఎన్ఎస్ఎస్ బ్యాండ్ బృందం, ఎన్సీసీ క్యాడెట్స్ నుంచి ఎన్.వి.రమణ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయనను కళాశాల చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ ముసునూరి శ్రీనివాసరావు, సెక్రటరీ– కరస్పాండెంట్ వల్లూరుపల్లి సత్యనారాయణ, కో సెక్రటరీ – కరస్పాండెంట్ వల్లూరుపల్లి రామకృష్ణ తదితరులు జ్ఞాపికను అందించి, దుశ్శాలువాతో సత్కరించి సన్మాన పత్రాన్ని సమర్పించారు. -
పేద, మధ్యతరగతికి కార్పొరేట్ వైద్యమే లక్ష్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం కార్పొరేట్ వైద్యం అందించాలనే ఆశయంలో తన తండ్రి డాక్టర్ ఎన్. సుబ్బారావు పేరుతో ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ అన్నారు. ఈ ఆస్పత్రిలో తన పిల్లలు వరుణ్, పవన్, మనోజ్ వర్షిణీ సేవలు అందించనున్నట్లు తెలిపారు. సూర్యారావు పేట ప్రకాశం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్. సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్, ఆంధ్రా యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ను ఆదివారం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, కామినేని శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమరాజు, యురాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మనోజ్ తుమ్మల తదితరులు పాల్గొన్నారు. రేపు వినియోగదారుల కమిషన్ భవనం ప్రారంభం చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో వినియోగదారుల కమిషన్ కార్యాలయ మొదటి అంతస్తు భవనాన్ని ఈ నెల 24వ తేదీ మంగళవారం ప్రారంభించనున్నట్లు వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు నందిపాటి పద్మారెడ్డి ఆదివారం తెలిపారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, ఎంయూడీఏ చైర్మన్ మట్టా ప్రసాద్తో పాటు సివిల్ సప్లయీస్ కమిషనర్ సౌరభ్ గౌర్తో పాటు ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు దొమ్మేటి శ్రీనివాస్ పాల్గొంటారని ఆయన తెలిపారు. పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలకు గవర్నర్పేటలోని సర్వోదయ ట్రస్ట్, స్వాతంత్య్ర సమరయోధుల సంఘ భవనంలో బహుమతులు అందజేశారు. ఈ నెల 19వ తేదీన స్వాతంత్య్ర సమర యోధుల సంఘ భవనం వద్ద జరిగిన యోగా పోటీల్లో 150 మంది, చిత్రలేఖన పోటీల్లో 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలకు కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ఆదివారం బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సర్వో దయ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ జి.వి.మోహన్ప్రసాద్, కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, డ్రీమ్ యోగా అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు పి.రమేష్, కృష్ణాజిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎల్.మురళీకృష్ణ పాల్గొన్నారు. -
మండుటెండలో కటిక నేలపై విద్యార్థుల యోగాసనాలు
ఇబ్రహీంపట్నం: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిన్సిస్ రికార్డు సృష్టి స్తామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నారు. గ్రామ స్థాయిలో యోగా కార్యక్రమాల నిర్వహణకు ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు. ఇబ్రహీంపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో విద్యార్థులు కటిక నేలపై కూర్చుని యోగాసనాలు వేయాల్సి వచ్చింది. ఉదయం పది గంటల సమయంలో ఎర్రటి ఎండలో ఆసనాలు వేయలేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం టార్పాలిన్ పట్టాలు కూడా వేయకుండా కంకరుతో కూడిన కటిక నేలపై విద్యార్థినులతో ఆసనాలు వేయించడం గమనార్హం. వర్గీకరణ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ నిబంధనలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిందన్నారు. ఇప్పటికే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంలో నూతన నిబంధనలు అమలు చేయాలన్నారు. నూతన నిబంధనలను అమలు చేయకుండా వర్గీకరణ చేశామని ప్రభుత్వం చెప్పుకున్నా మాదిగలకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. ఇకపై జరిగే నియామకాల్లో వర్గీకరణ నిబంధనలు అమలు చేసి మాదిగలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎ.వి.కృష్ణ, మందా నాగమల్లేశ్వరరావు, చెట్టే సుజన రావు, వనం నాగేశ్వరరావు, విజయ్, అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు. కోడూరు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ చిలకలపూడి(మచిలీపట్నం): అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు పంచాయతీ ఇంచార్జి కార్యదర్శి బి. శేషగిరిరావును సస్పెండ్ చేస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శేషగిరిరావు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని, పీజీఆర్ఎస్లో గ్రామానికి చెందిన రాజనాల భాస్కరరావు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ విచారణ జరపాలని డీపీఓను ఆదేశించారు. దీంతో కోడూరు మండలం ఈఓపీఆర్డీ రేవతి విచారణ జరిపారు. ఈ విచారణలో రూ.34.62 లక్షల నిధులు దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారించారు. ఆమె ఇచ్చిన నివేదిక మేరకు కలెక్టర్ బాలాజీ కార్యదర్శి శేషగిరిరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. -
4న విద్యుత్ చార్జీలపై పోరుబాట
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో జూలై నాలుగో తేదీన పోరుబాట నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. పోరుబాటలో భాగంగా ఏపీసీపీడీసీఎల్ కార్యాలయం వద్ద ఆ రోజు నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీభవన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పోరుబాట వాల్ పోస్టర్ను కాశీనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సర్దుబాటు చార్జీలు, సర్చార్జీలు, వడ్డీలు ఇలా వివిధ రూపాల్లో ప్రజలపై కూటమి ప్రభుత్వం భారాలు మోపిందన్నారు. పోరుబాటలో భాగంగా సోమవారం ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి, సంకాల సేకరణ చేపడతామన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని పగులగొట్టాలని ఎన్నికల ముందు చంద్రబాబు, నారా లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆ పిలుపు మేరకే తాము పోరుబాట చేపట్టామన్నారు. ఈ సమావేశంలో విజయవాడ పశ్చిమ, తూర్పు సిటీ కమిటీల పార్టీ కార్యదర్శులు బోయి సత్యబాబు, పి.కృష్ణ పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం కావాలి
పటమట(విజయవాడతూర్పు): భవిష్యత్ తరాలకు డ్రగ్స్ రహిత సమాజాన్ని అందించాలని ఎన్టీఆర్ జిల్లా ఈగల్ టీం సీఐ టి.ధనుంజయ్ పేర్కొన్నారు. నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించు కుని శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐ ధనుంజయ్ మాట్లాడుతూ.. యువత, విద్యా ర్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ విక్రయాల గురంచి తెలిసిన వారు వెంటనే పోలీసులకు లేదా 1972 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. నవజీవన్ బాల భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ తంబీ జోసెఫ్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలతో బతుకు దుర్భరం చేసుకోవద్దని సూచించారు. ర్యాలీలో పట మట త్రివేణి కళాశాల నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మానవహారాన్ని నిర్వహించి డగ్స్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతనం డ్రగ్సకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నవజీవన్ బాల భవన్ ప్రోగ్రాం మేనేజర్ గోళ్లమూడి శేఖర్బాబు, త్రివేణి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పుష్పలత, ఈగల్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.వీరాంజనేయులు, నవజీవన్ బాల భవన్ జోనల్ కోఆర్డినేటర్లు జ్యోతి చంద్రిక, నజ్మా, కె.ప్రియాంక, జాకబ్ రాజు, బి.రమేష్, దేవమణి, డి.వెంకటేశ్వరావు, లీలావతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రారంభం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ నిర్వహించిన పాలిసెట్–2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం మొదలైంది. ర్యాంకులు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలన చేసేందుకు నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆంధ్ర లయోల డిగ్రీ కళాశాల, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవరణలో ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశామని పాలిసెట్ ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 63 మంది, లయోల కళాశాలలో 85 మంది, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలలో 58 మంది చొప్పున మొత్తం 206 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను శనివారం పూర్తి చేశామన్నారు. పాలిసెట్లో 380వ ర్యాంకు పొందిన ఎం.సహస్ర చౌదరి సర్టిఫికెట్లను పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని ఆమెను ఎం. విజయసారథికి అందజేశారు. నేటి షెడ్యూల్ ఇదీ.. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 15,001 నుంచి 21 వేల ర్యాంకు వరకు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో 21001 నుంచి 26500వ ర్యాంకు వరకు, లయోల కళాశాల ఆవరణలోని కేంద్రంలో 26501 నంచి 32 వేల ర్యాంకు పొందిన అభ్యర్థుల సర్టిపికెట్లను పరిశీలిస్తామని కన్వీనర్ విజయసారథి తెలిపారు. గన్నవరంలో.. గన్నవరం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం నుంచి పాలిసెట్ అభ్యర్థులకు కౌన్సె లింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పాలిసెట్ కౌన్సెలింగ్ను కోఆర్డినేటర్ వి.వి.కృష్ణమోహన్ ప్రారంభించారు. అనంతరం తొలిరోజు జరిగిన కౌన్సెలింగ్లో 40 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, 37 మంది అభ్యర్థులు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్నారని కోఆర్డినేటర్ తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు వరకు జరిగే కౌన్సెలింగ్ను పాలిసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
ఉయ్యూరు: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్నజీర్ పర్యటనకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. ఈ నెల 25న జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనపై ఉయ్యూరులోని శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ప్రాంగణంలో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరవుతారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. విజయవాడ నుంచి యూనివర్సిటీ వరకూ గవర్నర్ నజీర్ పర్యటనకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విశ్వవిద్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, రహదారులపై గుంతలు పూడ్చి సరిచేయాలని, వసతులు, సౌకర్యాలు, భద్రతా చర్యలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఎస్పీ గంగాధర్రావు మాట్లాడుతూ.. ప్రముఖులు పర్యటించే రహదారుల వెంబడి గ్రీన్ చానల్ ఏర్పాటుచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ గీతాంజలి శర్మ, కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రాంజీ, డీఆర్వో చంద్రశేఖర్రావు, యూనివర్సిటీ రిజిస్ట్రారు ఉష, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, ఎస్సీ సంక్షేమ సాధికారిత అధికారి షాహిద్ బాబు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, డీపీఓ అరుణ, డీఈఓ పి.వి.జె.రామారావు, ఆర్డీఓలు స్వాతి, హెలా షారోన్ పాల్గొన్నారు. -
విలీనం కాదు... వినాశకరం
శాతవాహన వివాదంపై నిజనిర్ధారణ కమిటీ వేయాలి విజయవాడలీగల్: సుదీర్ఘ కాలంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యనందించి, ఉన్నత స్థానాల్లో నిలిపిన శాతవాహన కళాశాల ప్రాంగణం కొంతకాలంగా వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది. దీనిపై పూర్వవిద్యార్థులు, న్యాయవాదులతో ఒక నిజనిర్ధారణ కమిటీ వేయాలని అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. బెజవాడ బార్ అసోసియేషన్ హాలులో బీబీఏ అధ్యక్షుడు ఎ.కె.బాషా ఆధ్వర్యంలో శనివారం శాతవాహన కళాశాల పరిరక్షణ కోరుతూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కళాశాలను అర్ధరాత్రి జేసీబీలతో కూల్చివేశారని, కూల్చివేతపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విద్యార్థుల సర్టిఫికెట్లు, ఇతర విలువైన పత్రాలు కూడా ధ్వంసం చేశారని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల కమిటీలో అంతర్గత విభేదాల కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నడూ లేనిది విజయవాడ నగరంలో కూడా బుల్డోజర్ సంస్కృతి వచ్చిందని, అర్ధరాత్రి సమయాల్లో సినిమా థియేటర్లు, కాలేజీలు కూల్చివేయడం బాధాకరమన్నారు. పేద వర్గాలకు విద్యను అందించే లక్ష్యంతో 1970లలో నగరంలో ఏర్పడిన శాతవాహన కళాశాలను రక్షించేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు కదలాలని అన్నారు. దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ లో ఉన్న అవకతవకలు బహిర్గతం చేయాలని కోరారు. ఈ సమస్యపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ జోక్యం చేసుకుని కళాశాలను పునఃప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కార్యదర్శి డి.విష్ణువర్ధన్, కార్యదర్శి మోతుకూరి అరుణ కుమార్, వల్లూరు నాగబాబు తదితరులు పాల్గొన్నారు -
ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలి
కృష్ణా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని కలెక్టరేట్ పెట్రోల్ బంక్ వద్ద శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణంలో సమతుల్యత జరగాలంటే పచ్చదనం పెంపుదల చేయాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ వారి ఇంటి ఆవరణలో కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవో కె.స్వాతి, కలెక్టరేట్ ఏవో సీహెచ్ వీరాంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ డీఎస్సీగా షణ్ముగ వడివేల్ బాధ్యతల స్వీకారం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీఎస్సీ (డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్)గా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) 2014 బ్యాచ్కు చెందిన షణ్ముగ వడివేల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడుకు చెందిన ఆయన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. అనంతరం 2014లో సివిల్ సర్వీస్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఆఫీసర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తొమ్మిది సంవత్సరాల తన కెరీర్లో భారతీయ రైల్వేలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈశాన్య సరిహద్దు రైల్వేలోని టిన్సుకియా డివిజన్లో డీఎస్సీగా, ఉత్తర రైల్వేలోని మొరాదాబాద్ డివిజన్లో సీనియర్ డీఎస్సీగా, దక్షిణ రైల్వేలోని చైన్నె డివిజన్లో సెక్యూరిటీ కమిషనర్గా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయవాడ డివిజన్ సీనియర్ డీఎస్సీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఆర్పీఎఫ్ అధికారులు, పలు బ్రాంచ్ల అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. వీఎంసీ సబార్టినేటర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక పటమట(విజయవాడతూర్పు):విజయవాడ నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఆఫీస్ సబార్డినేటర్స్ కార్యవర్గ ఎన్నిక శనివారం జరిగింది. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాలు వద్ద జరిగిన ఈ ఎన్నికల్లో శీలం కరుణ అధ్యక్షులుగా ఎన్నికర్యారు. ఉపాధ్యక్షులుగా పీవీ లోకేశ్వరరావు, కార్యదర్శిగా పీవీ ఆనంద్ హనుమాన్, సహాయ కార్యదర్శిగా డి. దుర్గమ్మ, కోశాధికారిగా కె. ఫణి భరత్ ఎన్నికయ్యారు. -
మహా యోగం
ఆరోగ్యానికి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాసనాలు వేస్తున్న నగర ప్రజలు, విద్యార్థులు విజయవాడస్పోర్ట్స్/గాంధీనగర్: నిత్య యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హితవు పలికారు. భారత దేశ వారసత్వ సంపద అయిన యోగా భవిష్యత్తులో గేమ్ చేంజర్ అవుతుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా అధికార యంత్రాంగం శనివారం విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల రోజుల పాటు నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, యోగా ఆసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్, మాజీ సైనికులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో యోగాసనాల సాధన చేశామన్నారు. జిల్లాలోని 605 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 5,454 ప్రాంతాలలో 8.50 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, మానసిక ప్రశాంతత కలిగి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటూ స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుని ఆర్థిక పురోగతికి దోహదపడాలని పిలపునిచ్చారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత మన భారతీయులదే కావడం గర్వకారణమన్నారు. ప్రతి ఉద్యోగి రోజులో కొంత సమయాన్ని యోగాకు కేటాయించడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరిగి రక్త ప్రసరణ మెరుగవుతుందన్నారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు మాట్లాడుతూ కృష్ణానదిలో వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డు నమోదు కావడం మన జిల్లాకు గర్వకారణమన్నారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్టేడియం వద్ద మొక్కలు నాటారు. యోగా విశిష్టతను తెలిపేలా ప్లకార్డులతో ర్యాలీ చేశారు. ఫ్లోటింగ్ యోగాలో ముఖ్య భూమిక నిర్వహించిన యోగా అసోసియేషన్ సభ్యులకు, నెల రోజుల పాటు యోగా మాసోత్సవాలలో పాల్గొన్న జిల్లా అధికారులు, సిబ్బందికి కలెక్టర్ లక్ష్మీశ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, మాజీ మంత్రి పీతల సుజాత పాల్గొని యోగాసనాల సాధన చేయించారు. యోగాంధ్రతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఉయ్యూరు: రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే యోగాంధ్ర లక్ష్యమని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. ఉయ్యూరు శ్రీ విశ్వశాంతి పాఠశాల ఆవరణలో శనివారం యోగాంధ్ర కృష్ణా జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని సామూహిక యోగాసనాలు వేశారు. యోగా శిక్షకులు పోతన శాస్త్రి నమస్కార ముద్రా ప్రార్థనాగీతంతో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాసనాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడటం ద్వారా రాష్ట్ర జీడీపీ పెరుగుతుందన్నారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి , ఎమ్మెల్యే బోడె ప్రసాద్ , జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్రావు, జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా యూనివర్సిటీ వీసీ కె.రాంజీ, ముడా చైర్మన్ మట్టా ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
మైలవరం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైలవరంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి సమీపంలో గురువారం రాత్రి జరిగింది. మైలవరం మండలం మొర్సుమల్లి గ్రామానికి చెందిన గురజాల సాయి(27) జేసీబీ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. మైలవరంలో పని ముగించుకుని తన ద్విచక్రవాహనంపై రాత్రి ఇంటికి వెళుతున్నాడు. మైలవరం జాతీయ రహదారిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి సమీపంలో ఎదురుగా వస్తున్న మినీ ట్రక్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వాహనంలో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతునికి ఆరేళ్ల క్రితం వర్షిణితో వివాహమైంది. మృతుని తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కారు దగ్ధం
పటమట(విజయవాడతూర్పు): ఓ ఆకతాయి చేసిన పనికి లక్షలు విలువ చేసే కారు దగ్ధమయింది. వివరాల ప్రకారం పటమట పోలీస్స్టేషన్ పరిధిలోని కరెన్సీనగర్లో ఉన్న ఆయుష్ ఆస్పత్రికి శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లికి చెందిన పి.ప్రవీణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి చికిత్స నిమిత్తం కారులో వచ్చి కుటుంబ సభ్యులను ఆస్పత్రి ముందు దింపి పక్కనే ఉన్న ఖాళీస్థలంలో పార్కింగ్ చేశారు. అదే సమయంలో అక్కడ గుర్తుతెలియని ఓ ఆకతాయి సిగరెట్టును తాగి ఆర్పకుండా అక్కడ ఉన్న చెత్తలో వేయటంతో మంటలు చెలరేగి కారుకు అంటుకున్నాయి. స్థానికులు చూసి పెద్దగా కేకలు వేయటంతో కారు యజమాని వచ్చి కారు తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే కారంతా దట్టమైన మంటలు వ్యాపించాయి. స్థానికులు ఆటోనగర్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు కాలి బూడిదయింది. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల మేరకు ఆస్తినష్టం జరిగిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. పటమట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆకతాయి కాల్చిపడేసిన సిగరెట్ కారణం? -
రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వానికి వెన్నెముక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పరిపాలనలో ప్రాచీన కాలం నుంచి ప్రజలకు సేవలందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వానికి వెన్నెముక లాంటిదని సీసీఎల్ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి అన్నారు. రెవెన్యూ శాఖలో పని చేసే ప్రతి ఉద్యోగి ప్రజలకు పారదర్శకమైన సేవలందించి ప్రభుత్వ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేయాలన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం రెవెన్యూ దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న జయలక్ష్మి రెవెన్యూ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ బ్రిటిష్ వారి హయాంలోనే 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటైందని దీనిని పురస్కరించుకుని ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవం జరుపుతోందన్నారు. ప్రభుత్వ శాఖలన్నింటికి రెవెన్యూ శాఖ తల్లిలాంటిదని, రెవెన్యూ సిబ్బంది పారదర్శకమైన సేవలు అందించినప్పుడే ప్రజలు ప్రభుత్వ విధానాలపై సంతృప్తి చెందగలుగుతారన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేయడం ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన విషయమన్నారు. ఈ శాఖలో వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుని ఆధునిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు సమర్థమైన సేవలను ప్రజలు అందజేసినపుడే మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి కీలక సమయాలలో రెవెన్యూ శాఖ ముఖ్య భూమికను పోషిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను 99 శాతం పైగా పరిష్కరిస్తున్నామని, నూరు శాతం పరిష్కరించి శాఖకు గుర్తింపు తీసుకురావాలన్నారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా రెవెన్యూ రికార్డులు, సర్వే పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. రెవెన్యూ శాఖలో ఉత్తమ సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన పలువురు ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, ఆర్డీఓలు కె.చైతన్య, కె.మాధవి, కె.బాలకృష్ణ, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామిశెట్టి వెంకట రాజేష్, కోశాధికారి సీహెచ్ నరసింహ, సంఘ ప్రతినిధులు రెవెన్యూ అధికారులు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సీసీఎల్ఏ స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి -
బై..పాస్ అయ్యేదెన్నడో!
విజయవాడ వెస్ట్ బైపాస్ విజయవాడ వెస్ట్ బైపాస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పనులు దాదాపు పూర్తయినా ప్రారంభం మరింత ఆలస్యమవుతోంది. హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమస్య కారణంగా పలుచోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కూడా దీనిపై నిర్లక్ష్యం చూపడంతో ఏడాదిగా పనులు అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం అలసత్వం వదిలి వెస్ట్ బైపాస్ ప్రారంభానికి చొరవ చూపాల్సి ఉంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: వెస్ట్ బైపాస్ రహ దారిని అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్నా పనులు సాగడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు, విజయవాడ ఎన్హెచ్ఏ ఆర్వో కార్యాలయ అధికారి అలసత్వం తోడైందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మరింత ఆలస్యం గత ప్రభుత్వ హయంలో.. రైతుల ముసుగులో టీడీపీ నాయకులు చేసిన కుట్రే నేడు శాపమైంది. ఆ చిక్కుముడే ఇప్పుడు ప్రతిబంధకంగా మారింది. విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తయితే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ఆశించిన ప్రజల కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. మరింత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం, ఎన్హెచ్ఏ ఆర్వో కార్యాలయ అధికారులు చిత్త శుద్ధితో పనులను పూర్తి చేసేందుకు కృషి చేయక పోవడంతో జాప్యం జరుగుతోంది. టవర్ల మార్పిడి వెనక అక్రమాలు! అయితే వీటి మార్పిడికి విజయవాడ ఆర్వో కార్యాలయం అధికారులు రూ.32.58 కోట్లు అంచనాలు వేశారు. మూతబడిన సంస్థకు సూపర్వైజేషన్కు చార్జీల కింద రూ.50 లక్షల పైగా చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో మూత పడిన ల్యాంకో పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ల్యాంకో ట్రాన్స్మిషన్ టవర్ల మార్పిడి వెనుక భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. రైతులను ఇబ్బంది పెడుతున్న వ్యవహారంలో ఎన్హెచ్ఏ, రాధా టీఎంటీ, పాత ల్యాంకో యాజమాన్యాల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. ఎన్హెచ్ఏ ఆర్వో కార్యాలయ అధికారి చొరవ చూపటం లేదు. ఆ ప్రాంతంలో టవర్లు మార్చితే, తమ పొలాలు పోతాయనే ఉద్దేశంతో రైతులు అడ్డుకుని టవర్ల ఎత్తు పెంచితే సరిపోతుందనే వాదనకు వారు తెర లేపారు. ప్రభుత్వం తలొగ్గి టవర్ల ఎత్తు పెంపునకు నిర్ణయం తీసుకున్నా.. కోర్టులో ఉన్న కేసు ఇప్పుడు ప్రతిబంధకంగా మారింది. దీనికి పరిష్కారం చూపడంలో ప్రభుత్వంతోపాటు, ఎన్హెచ్ఏ ఆర్వో కార్యాలయ అధికారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పూర్తయితే ట్రాఫిక్ కష్టాలకు చెక్ ఈ బైపాస్ పనులు పూర్తి అయితే , విజయవాడ నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బైపాస్ అందుబాటులోకి వస్తే విజయవాడ–విశాఖపట్నం, విశాఖపట్నం–విజయవాడ, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఉదాహరణకు చినఅవుటుపల్లినుంచి వారధి వరకు ప్రయాణం చేయాలంటే గంటనుంచి గంటన్నర సమయం పడుతోంది. ఇదే వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వస్తే కేవలం 15 నిముషాలలోపే చేరుకొనే అవకాశం ఉంది. దీనికితోడు విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు గత ప్రభుత్వ హయంలో డీపీఆర్ సిద్ధం చేసిన తూర్పు బైపాస్ రోడ్డు పనులకు కూటమి ప్రభుత్వం మోకాలు అడ్డుపెట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు సాకుగా చూపి దీనికి మంగళం పాడింది. గత ప్రభుత్వ హయాంలో.. గత ప్రభుత్వ హయంలోనే 98 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు శరవేగంగా ముందుకు సాగాయి . కేవలం ప్యాకేజి –3 కింద చిన అవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30కిలోమీటర్ల బైపాస్ నిర్మాణానికి సంబంధించి కేవలం 300 మీటర్ల మేర మాత్రమే మిగిలింది. 2024 జనవరిలో ప్రజలకు బైపాస్ను అందుబాటులోకి తెచ్చే యత్నం చేసింది. టవర్ల షిఫ్టింగ్ , సాంకేతిక సమస్యలను సాకుగా చూపి, టీటీపీ నేతలే రైతుల ముసుగులో పనులను అడ్డుకున్నారు. రూ.1,148కోట్లతో , పనులను మెగా సంస్థ ఫిబ్రవరి 2021లో చేపట్టింది. ఈ రహదారి కోసం 14 గ్రామాల్లో భూసేకరణ చేశారు. కృష్ణా జిల్లాలో వెదురుపావులూరు, రామచంద్రాపురం, కొండపావులూరు, బీబీ గూడెం, గన్నవరం, చిన్న అవుటుపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో గొల్లపల్లి, జక్కంపూడి, అంబాపురం, పి.నైనవరం, పాతపాడు, కెవీ కండ్రిక, నున్న గ్రామాల పరిధిలో మొత్తం 188.92 హెక్టార్ల భూమిని సేకరించారు. దీనికోసం రూ.416.60 కోట్లు ఖర్చు చేశారు. వెస్ట్ బైపాస్ ప్రారంభమెప్పుడో! చినఅవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మేర బైపాస్ 98 శాతానికి పైగా పనులు పూర్తి గత ప్రభుత్వంలో రోడ్డు పనులుప్రారంభం కాకుండా కుట్ర కొలిక్కి రాని ల్యాంకో టవర్ల సమస్య పట్టించుకోని ప్రభుత్వం ల్యాంకో ట్రాన్స్మిషన్ల టవర్ల ప్రధానంగా బైపాస్ రోడ్డుకు మధ్యలో హై ఓల్టేజీ విద్యుత్తు లైన్లు వెళుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఒకచోట, ఎన్టీఆర్ జిల్లాలో 12 చోట్ల ఏపీ ట్రాన్స్కో, ల్యాంకో, పవర్గ్రిడ్కు సంబంధించిన విద్యుత్ లైన్లను మార్చాలింది. ఇందులో గత ప్రభుత్వం చొరవ చూపటంతో కోర్టు కేసులను అధిగమించి రూ.15 కోటత్లో ఏపీ ట్రాన్స్కో, పవర్ గ్రిడ్ విద్యుత్ లైన్లను మార్చారు. అయితే ప్రస్తుతం 300 మీటర్లు జక్కంపూడి, గొల్లపూడి మధ్య ల్యాంకో ట్రాన్స్మిషన్ టవర్ల మార్పిడి సమస్య జటిలంగా మారింది. ల్యాంకో చెందిన ట్రాన్స్ మిషన్కు సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ కమిటీ నుంచి లైసెన్సు లేదు. ఈ లైసెన్సు లేని సంస్థకు చెందిన టవర్లను మార్చే అధికారం ఎన్హెచ్ఏకు లేదు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
చల్లపల్లి: ఊక లోడు తో వస్తున్న లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రెండు స్కూటీలు, ఒక బైకు, ఒక మినీ లారీ దెబ్బతిన్నాయి. చివరకు లారీ రెండు ఇళ్ల మధ్య ఉన్న సందు లోకి దూసుకుపోయి ఆగింది. అదృష్ట వశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అవనిగడ్డకు చెందిన ఈ లారీ రేపల్లె మండలం పేటేరులోని ఒక రైసు మిల్లులో ఊక నింపుకొని పులిగడ్డ, చల్లపల్లి, పామర్రు మీదుగా గుడివాడకు వెళ్లేందుకు బయలుదేరింది. చల్లపల్లిలోని పాగోలు రోడ్డువద్ద గల బ్రహంగారి గుడి వద్దకు రాగానే ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పాములా దూసుకురావడం ప్రారంభించింది. తొలుత ఒక మినీట్రాన్స్పోర్టు వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టగా, ఆ వ్యాను ఛాసిస్ ముందుకు జరిగి ఇంజన్ను నొక్కటంతో అది నడిరోడ్డు మీదే ఆగిపోయింది. తర్వాత ఊకలారీ పాత ఇనుపసామాను కొట్టు వద్ద పనిచేస్తున్న వ్యక్తిపైకి దూసుకురాగా, అతను గమనించి పక్కకు తప్పుకోగా లారీ అక్కడ ఉన్న ఒక స్కూటీని ఢీకొట్టి రెండు ఇళ్ల మధ్య ఉన్న సందులోకి దూసుకుపోయి ఆగింది. అక్కడ ఉన్న ఒక స్కూటీ, బైక్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. పక్కన ఉన్న షెడ్డు పాక్షికంగా దెబ్బతింది. కరెంటు స్తంభానికి ఉన్న సర్వీసు వైర్లు తెగిపడ్డాయి. ఇంత బీభత్సం సృష్టించినా ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఊక లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మోసాలు, అబద్ధాల ఏడాది కూటమి పాలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిందని, మోసాలు, అబద్ధాలతో గత ఏడాదిగా కూటమి పాలన సాగిందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తల నరకాలన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుణదలలోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కూటమి నాయకుల మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు చెబుతున్నట్లు ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో వేలాది మంది వస్తే కనీస పోలీస్ భద్రత ఇవ్వలేదని, ఒక పార్టీకి అధినేత, మాజీ ముఖ్య మంత్రికి మూడు కార్లు, వంద మందికి మాత్రమే పర్మిషన్ ఉందని అనడాన్ని వారి విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని అవినాష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏడాదిగా కేవలం వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీపై కక్షపూరితంగా కేసులు పెట్టడం తప్ప, రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం కానీ, అభివృద్ధిగానీ చేసింది శూన్యం అన్నారు. పల్నాడులో వైఎస్ జగన్ పర్యటన కర్ఫ్యూ లాంటి వాతావరణం మధ్య జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సూపర్సిక్స్ హామీలపై వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు వెన్నుపోటు పొడ వడం, రెడ్బుక్ పాలన తప్ప రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన లా అండ్ ఆర్డర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అరెస్ట్ చేయాలి ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
ఆర్టీసీ ప్రయాణికుల అగచాట్లు
ఆటోనగర్(విజయవాడతూర్పు): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సులను విశాఖపట్నానికి మళ్లించడంతో ప్రయాణికులు నానా అగచాట్లు పడుతున్నారు. రెండు రోజులుగా సిటీ, లైన్ సర్వీసులు సరిపడా రాకపోవడంతో ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. నిత్యం మచిలీపట్నం,పామర్రు, ఉయ్యూరు, కంకిపాడుతోపాటు పలు గ్రామాల నుంచి పనులకు వస్తుంటారు. కేవలం నాన్స్టాప్ బస్సులను మాత్రమే ఆర్టీసీ అధికారులు నడపడంతో మిగతా గ్రామాల నుంచి విజయవాడకు ప్రయాణికులు రావడానికి నానా ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు ఆటోనగర్ బస్టెర్మినల్ వద్ద వివిధ గ్రామాలకు వెళ్లడానికి ప్రయాణికులు నిలువ కాళ్లపై ఎదురు చూడాల్సి వచ్చింది. గంటకు ఒక బస్సో... గంటన్నరకు మరొక సిటీ బస్సు రావడంపై ఇంటికి ఎలా వెళ్లాలో అర్థంకాక తలపట్టుకున్నారు. మచిలీపట్నం. గుడివాడ, కై కలూరు, భీమవరానికి మాత్రమే నాన్స్టాప్ బస్సులను అరకొరగానే నడిపారు.రెండో రోజూ అరకొర బస్సులతో సరి -
యోగా.. వారసత్వ సంపదలో కలికితురాయి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారతీయ వారసత్వ సంపదలో యోగా కలికితురాయి అని వరల్డ్ రికార్డు యూనియన్ ప్రతినిధి ఎలీసా రేనాల్డ్స్ అన్నారు. కృష్ణా నదిలో ‘యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగా’ ఈవెంట్ను నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించడం అభినందనీయమన్నారు. ఇటీవల కృష్ణా నదిలో నిర్వహించిన ‘యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగా’ ఈవెంట్లో పడవలపై వేలాదిమంది యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సాధించిన నేపథ్యంలో శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో వరల్డ్ రికార్డు యూనియన్ ప్రతినిధి ఫ్రాన్స్కు చెందిన ఎలీసా రేనాల్డ్స్.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు వరల్డ్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రేనాల్డ్స్ మాట్లాడుతూ భారతదేశం యోగాసనాలతో ప్రపంచానికి అమూల్యమైన బహుమతి ఇచ్చిందన్నారు. యోగా వంటి ఆరోగ్య విధానం బృహత్తర రికార్డులకే పరిమితం కాకూడదని, అందరూ తప్పక ఆచరించాలని ఎలీసా రేనాల్డ్స్ సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ టీమ్ ఎన్టీఆర్ కృషి.. ప్రజలు స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు అందరి సహకారంతోనే వరల్డ్ రికార్డు సాధించగలిగామన్నారు. కార్యక్రమంలో లంకా దినకరన్, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, సబ్కలెక్టర్ కె.చైతన్య, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో తరుణ్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. వరల్డ్ రికార్డు యూనియన్ ప్రతినిధి (ఫ్రాన్స్)ఎలీసా రేనాల్డ్స్ -
వైద్య రంగం నిర్వీర్యం..
● ప్రసాదంపాడుకు చెందిన 55 ఏళ్ల శ్రీరామ్ గురువారం ఉదయం పొట్ట ఉబ్బరంగా ఉండటంతో రామవరప్పాడులోని వెల్నెస్ సెంటర్కు వెళ్లాడు. గ్యాస్కు ప్యాన్టాప్ ఉంటే ఇవ్వమని అక్కడ సిబ్బందిని అడగ్గా, గ్యాస్ బిళ్లలు లేవని చెప్పడంతో సమీపంలోని మందుల షాపునకు వెళ్లి రూ.100 పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది. ● ఎనికేపాడుకు చెందిన శ్రీనివాసరావు సమీపంలోని ఓ వెల్నెస్ కేంద్రానికి వెళ్లి జలుబుగా ఉందని సిట్రజన్ టాబ్లెట్స్ ఉంటే ఇవ్వమని అడిగాడు.. అవి మా వద్ద లేవని అక్కడి సిబ్బంది సమాధానం ఇచ్చారు. రక్తం పలుచపడే బిళ్లలు ఉంటే ఇవ్వమని అడగ్గా అవికూడా అయిపోయాయని చెప్పడంతో బయటకు వచ్చి ప్రైవేటు షాపులో కొనుక్కున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పేద రోగులకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన విలేజ్ హెల్త్ క్లినిక్లు.. ఇలా వారిని తిప్పి పంపి, ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. లబ్బీపేట(విజయవాడతూర్పు): గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యంతో పాటు, అత్యవసర సమయంలో తక్షణ వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన హెల్త్ వెల్ నెస్ సెంటర్(విలేజ్ హెల్త్ క్లినిక్)లు అలంకార ప్రాయంగా మారాయి. వాటిలో ఉండాల్సిన కనీస మందులు అందుబాటులో ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేయడంతో రోజు రోజుకు సేవలు దిగజారుతున్నాయి. ఆ సెంటర్ల ఏర్పాటులో ఉన్న ఉన్నత లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. దీంతో కృష్ణాజిల్లాలో 357, ఎన్టీఆర్ జిల్లాలోని 257 వెల్నెస్ సెంటర్లు నిరుపయోగంగా మారాయి. అంతేకాదు గత ప్రభుత్వం నిర్మించిన అత్యాధునిక భవనాలు సైతం నేడు రోగులు లేక వెలవెలబోతున్నాయి. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు.. గ్రామీణ ప్రజలకు తక్షణ వైద్యం అందించాలనే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఒక వెల్నెస్ కేంద్రం ఏర్పాటు చేశారు. వాటిలో బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్ఓ)లుగా నియమించారు. అక్కడే గర్భిణులు, చిన్నారులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేవారు. అంతేకాక దీర్ఘకాలిక రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు అక్కడ అందుబాటులో ఉండేవి. పాముకాటు, పాయిజన్ వంటి కేసులకు అందించాల్సిన సత్వర చికిత్సలపై సైతం సీహెచ్ఓలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్వహించిన ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం సైతం వెల్నెస్ సెంటర్ కేంద్రంగానే శిబిరాలు జరిగేవి. దీంతో ఆ సెంటర్లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. అంతేకాదు ఏదైనా ఆరోగ్య సమస్యతో వచ్చిన వారికి టెలీ మెడిసిన్ విధానంలో నిపుణులైన వైద్యులను స్పందించి మందులు ఇచ్చేవారు. నేడు ఆ పరిస్థితులు లేవు. అలంకార ప్రాయంగా.. నేడు వెల్నెస్ కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయి. గ్యాస్ ట్రబుల్కు వాడే ప్యాన్టాప్, ఎలర్జీలకు వాడే సిట్రజన్, దీర్ఘకాలిక రోగులు రక్తం పల్చబడేందుకు వాడే ఏస్పరిన్ వంటి మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు. వీటితో పాటు రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడేవారు మందులు లేకపోవడంతో దూర ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పెద్దాస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. గతంలో పదిహేను రోజులకు ఒకసారి నిర్వహించే ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో అన్ని రకాల మందులు ఇచ్చేవారంటూ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ శిబిరాలను సైతం ఎత్తేశారని వాపోతున్నారు. రాష్ట్రంలో వైద్య రంగం నిర్వీర్యమైంది. ప్రభుత్వాస్పత్రిలో కనీస మందు లు కూడా ఉండటం లేదు. గత ప్రభుత్వంలో వెల్నెస్ కేంద్రాల్లో అన్ని రకాల సేవలు అందించే వారు. మందులు కూడా ఉండేవి. కూటమి ప్రభుత్వం వాటిని అలంకార ప్రాయంగా మార్చింది. పేదలకు నాణ్యమైన సేవలు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం అలంకారప్రాయంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు కనీస మందులు కూడా లేవు దీర్ఘకాలిక రోగుల ఇక్కట్లు కూటమి ప్రభుత్వ వైఫల్యంతో దిగజారిన సేవలు -
జీవన విధానంలో యోగా ఒక భాగం
పాలిసెట్ హెల్ప్లైన్ సెంటర్గా గుడ్లవల్లేరు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడేళ్ల జైలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని వార్డు సచివాలయాల ప్లానింగ్ కార్యదర్శులు, యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుసంపన్న, ఆరోగ్య, ఆనంద ఆంధ్రాకు తొలి అడుగు యోగాంధ్ర అని చెప్పారు. 30 రోజులుగా జిల్లాలో గ్రామగ్రామాన, పట్టణాల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శరీరంలోని అన్ని వ్యవస్థలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చే శక్తి యోగాసనాలకు ఉందని పేర్కొన్నారు. ఒత్తిడిని మన జీవితంలోకి అడుగుపెట్టనివ్వకుండా యోగాసనాలు రక్షణ కవచాల్లాగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రతిరోజూ యోగాంధ్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, ఎన్సీసీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె.రమేష్, ఫిజికల్ డైరెక్టర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య మూలపాడు(ఇబ్రహీంపట్నం):వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మూలపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన మాకాని ఆదెయ్య (48) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో మూడురోజుల క్రితం అప్పులు ఇచ్చిన వారు ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆదెయ్య పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి జారిన అదెయ్యను విజయవాడ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య, వివాహమైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. గొంతు కోసుకొని.... గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో చోటుచేసుకుంది. బెల్లంకొండ నాగేశ్వరరావు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిని తిరుపతమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పది నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య తిరుపతమ్మ పిల్లలను భర్త వద్ద వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పిల్లల సంరక్షణ చూసుకుంటున్న నాగేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చాకుతో గొంతు కోసుకున్నాడు. పనులకు వెళ్లి వచ్చిన అతని తల్లి రక్తస్రావం కావడం గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తరలిస్తుండగా నాగేశ్వరరావు మృతి చెందాడు. మృతుడి తల్లి వెంకట్రావమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులు తాళలేక వివాహిత... గాంధీనగర్(విజయవాడసెంట్రల్):భర్త, ఆత్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఔట్ ఏజెన్సీకి చెందిన వినిత (27) ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. డిప్లొమా చదివే రోజుల్లో అదే ప్రాంతానికి చెందిన సుజిత్కుమార్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడి 2018లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం భర్త వేధించసాగాడు. వినిత కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా చక్కగా కాపురం చేస్తానని అంగీకరించాడు. అనంతరం వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత మరలా భర్త, అత్త వేధింపులు మొదలయ్యాయి. దీంతో గత ఆరు నెలలుగా భర్త నుంచి విడిగా ఉంటూ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వినిత అద్దెకు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. భర్త, అత్త వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్రాసి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న వినిత తల్లి విజయలక్ష్మి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వరి విత్తనాల సరఫరాలో ప్రభుత్వం విఫలం మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ తోట్లవల్లూరు: రైతులకు వరి విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ విమర్శించారు. మండలంలోని గరికపర్రులో గురువారం ఆయన పర్యటించారు. గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి విత్తనాలు దొరకడం లేదని, బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు రైతులు కై లే దృష్టికి తీసుకువచ్చారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో విత్తనాలు, ఎరువులు అందించడం జరిగిందని అనిల్కుమార్ గుర్తుచేశారు. రైతు భరోసా కేంద్రాల పేరు మార్చడమే కాకుండా వాటిని రైతులకు సేవలందించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. విత్తనాలు దొరకక రైతులు వ్యాపారులు, రైస్మిల్లర్లను ఆశ్రయించే పరిస్థితులు దాపురించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి రైతుల అవసరాలకు తగినట్లుగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని అనిల్కుమార్ డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు జొన్నల రామ్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ కళ్లం శివారెడ్డి, సర్పంచ్లు బొమ్మారెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడిశెట్టి ఉదయభాస్కర్, నాయకులు నడకుదురు రాజేంద్ర, చింతలపూడి గవాస్కర్రాజు, చింతలపూడి సుబ్బారావు, మైనేని వేమూరి కృష్ణబాబు, తారాచంద్, బోలెం చంటి పాల్గొన్నారు. మోపిదేవిలో కలెక్టర్ బాలాజీ పర్యటన మోపిదేవి: మండలంలో పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం తనిఖీలు నిర్వహించారు. మోపిదేవి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించారు. బాత్రూముల డోర్లు పర్మినెంట్గా ఉండేవి ఏర్పాటు చేయాలని, త్వరితగతిన భవన నిర్మాణం పూర్తిచేయాలని అదికారులకు సూచించారు. రావివారిపాలెంలో పీహెచ్సీని సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో మందుల విభాగాన్ని, ప్రయోగశాలను తనిఖీ చేశారు. గదులు చాలక రోగులు ఇబ్బంది పడుతున్నారని ఎంపీపీ దుర్గావాణి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పాముకాటుకు విరుగుడు మందు, రాబిస్ వ్యాధి మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంకటాపురంలో గ్రామ సచివాలయాన్ని సందర్శించి భూ రీ సర్వేపై గ్రామస్తులతో మాట్లాడారు. 11/1 కాలువ చివరలో పూర్తిగా పూడుకు పోయినందున కాలువ చివరి భూములకు నీరు అందడం లేదని పలువురు రైతులు కలెక్టర్కు తెలిపారు. స్థానిక జెడ్పీపాఠశాల, ఆంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. చిన్నారులకు మంచి పౌష్టికాహారం కలిగిన ఆహారం అందించాలని ఆదేశించారు. ఎంపీపీ రావి దుర్గావాణి, అదనపు డీఎంహెచ్వో వెంకటరావు, తహసీల్దార్ శ్రీవిద్య, ఎంపీడీవో స్వర్ణభారతి, సీహెచ్సీ డాక్టర్లు అనిల్కుమార్, లక్ష్మీనాఽథ్, వార్డెన్ నాగలక్ష్మీ, మాజీ సర్పంచ్ అబ్బూరి నాంచారయ్య, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. రాజధానిలో మొక్కలకు డ్రోన్లతో వర్మీవాష్ తాడికొండ: రాజధాని అమరావతిలో పచ్చదనం పెంపొందించేందుకు, మొక్కలకు పోషకాలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు తెలిపారు. ప్రధాన అనుసంధాన రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డుపై 10 కిలోమీటర్ల మేర పూల మొక్కలకు డ్రోన్ల ద్వారా వర్మీవాష్ చేసే ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ఆర్గానిక్ పోషకాలను మొక్కలకు అందించడానికి ఈ పద్ధతి తోడ్పడుతుందని చెప్పారు.గుడ్లవల్లేరు:ఏపీ పాలీసెట్ – 2025 ధ్రువ పత్రాల పరిశీలన హెల్ప్లైన్ సెంటర్గా ఎ.ఎ.ఎన్.ఎమ్ – వి.వి.ఆర్.ఎస్.ఆర్. పాలిటెక్నిక్ కాలేజీని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్ గురువారం విలేకర్లకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలీసెట్ – 2025 ఫలితాల ప్రకటన అనంతరం ఏటా మాదిరిగానే ఈసారి కూడా గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ను ఏపీ పాలీసెట్ – 2025 కౌన్సెలింగ్ హెల్ప్లైన్ సెంటర్గా ప్రకటించారన్నారు. ఈ అవకాశాన్ని గుడ్లవల్లేరు గ్రామా పరిసర ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. పాలీసెట్ – 2025 లో ర్యాంకును సాధించి ధ్రువ పత్రాల పరిశీలనకు హాజరయ్యే విద్యార్థులు ముందుగా ఈ నెల 20 నుంచి 27వ తేదీ లోపు ఓసీ/బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.250 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా కింద తెలిపిన తేదీల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్లో జరిగే ధ్రువ పత్రాల పరిశీలన ప్రక్రియలో తమ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. 25వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ ఎంట్రీ కూడా చేసుకోవచ్చన్నారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థులకు జూలై 3న అలాట్మెంట్స్ వస్తాయని పేర్కొన్నారు. విజయవాడలీగల్:బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్ట్ న్యాయాధికారి వి.భవాని తీర్పు చెప్పారు. మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే వ్యక్తి వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య టీచర్ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకునే సమయంలో భద్రాది కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ఏరియాకు చెందిన బొల్లవరపు ప్రసాద్ అనే వ్యక్తి పరిచయమై ఇంట్లో మనిషిగా ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఉపాధ్యాయురాలి కుమార్తె పదో తరగతి చదువుతున్నది. కొద్ది రోజులుగా బాలిక ఎవ్వరితో మాట్లాడకుండా ముభావంగా ఉండడంతో తల్లిదండ్రులు కారణం అడగ్గా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రసాద్ అంకుల్ ఎక్కడపడితే అక్కడ అసభ్యకరంగా తాకుతూ, ఎవరికై నా చెపితే మీ అమ్మ నాన్నలను చంపుతాను అని చెప్పి బెదిరించాడని చెప్పింది. దీంతో ఈ సంఘటనపై మాచవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 2019 మే 30వ తేదీన నిందితుడైన బొల్లవరపు ప్రసాద్ న్యాయస్థానం నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. అనంతరం పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేశారు. ప్రాసిక్యూషన్ తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.కృష్ణవేణి, సి.యం.ఎస్. ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు, అప్పటి మాచవరం ఎస్ఐ రమేష్, మహిళా ఎస్ఐ.అనూష, సిఎంయస్ సిబ్బంది పర్యవేక్షణలో 8 మంది సాక్షులను విచారించారు. బొల్లవరపు ప్రసాద్పై నేరం రుజువైనందున గురువారం పోక్సో కోర్టు న్యాయాధికారి వి.భవానీ నిందితుడికి మూడేళ్ల శిక్షతో పాటు జరిమానా విధించారు. జిల్లాలోని 4,470 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చిలకలపూడి(మచిలీపట్నం):అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 4,470 ప్రదేశాల్లో ఈ నెల 21వ తేదీన యోగా కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో గురువారం జూమ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సచివాలయ పరిధిలో యోగా కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. పేర్లు నమోదు చేసుకున్న పౌరులందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడిగడప, ఉయ్యూరు మునిసిపాల్టీల్లో, బంటుమిల్లి, మొవ్వ, నాగాయలంక మండలాల్లో శిక్షణా తరగతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఉయ్యూరులోని విశ్వశాంతి విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహిస్తామని అక్కడ అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని కోరారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కూడా అదే రోజు నిర్వహించాల్సి ఉన్నందున యోగా కార్యక్రమం పూర్తయిన తరువాత పరిసరాలను శుభ్రం చేయాలని చెప్పారు. మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేయించాలన్నారు. జేసీ గీతాంజలిశర్మ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛాంధ్ర పై యోగా, చిత్రలేఖనం పోటీలను నిర్వహించాలన్నారు. జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్, డీఈవో పీవీజె రామారావు, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా సమన్వయకర్త రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం నిమ్మకూరు(పామర్రు): యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సాధించవచ్చని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం. ఫణి ధూర్జటి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో గురువారం గురుకుల పాఠశాల, కళాశాల, జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు యోగ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో శారీరక రుగ్మతలు దూరం అవుతాయని చెప్పారు. ప్రతి రోజూ వ్యాయామం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. యోగ గురువు ముదిగొండ శాస్త్రి ఆధ్వర్యంలో స్వల్ప, సులభతర, వ్యాయామం, భ్రమర కపాలభాతి, భస్త్రికా ప్రాణాయామం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో నిర్వహించిన ఈ యోగ శిక్షణలో విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం ప్రముఖులను ఎస్వైఎల్ఎన్ ఆచార్యులు, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కన్వీనర్ తురగా ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ధర్మ ప్రచార పరిషత్ కన్వీనర్ తాండవ శిక్షణ, అన్నదాన కమిటీ సభ్యులు ఎ. నెలబాలుడులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.జ్యోతి, ఎంఈఓ – 2 గుమ్మడి పద్మవాణి, పాఠశాల హెచ్ఎం ఎం.లక్ష్మీలత, గ్రామసర్పంచ్ పి. దుర్గా శ్రీనివాసరావు, బీజేపీ మండల అధ్యక్షుడు ఎం.శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఫణి ధూర్జటి -
ఆక్రమణల తొలగింపునకు కార్యాచరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాలువలు, చెరువుల వెంబడి ఆక్రమణలను గుర్తించి, తొలగించేందుకు కార్యాచరణ రూపొందించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్, జిల్లా వాచ్డాగ్ కమిటీ కన్వీనర్ ఎస్.ఇలక్కియ కమిటీ సభ్యులతో గురువారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జీవో 386 ద్వారా నీటి వనరులు, చెరువుల బెడ్లను ఆక్రమణల నుంచి రక్షించేందుకు జిల్లా స్థాయి వాచ్డాగ్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ ప్రతి నీటి వనరు, చెరువు బెడ్ల పరిస్థితిని సమీక్షించి, ప్రభుత్వానికి త్రైమాసిక నివేదిక సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లాలోని కాలువలు, చెరువులు వెంబడి ఆక్రమణల ద్వారా ఏర్పాటుచేసుకున్న శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలను గుర్తించి జాబితా రూపొందించాలని ఆదేశించారు. ప్రతినెలా నిర్ణీత సమయంలో కమిటీ సమావేశమై ఆక్రమణలను గుర్తించడంతో పాటు తొలగించేందుకు కార్యాచరణ చేపట్టాల్సిందిగా తాజా సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వు ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపైనా కమిటీ చర్చించింది. ఈ సమావేశంలో విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు, ప్రజారోగ్య ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ -
పండుగలా యోగా డే
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈనెల 21వ తేదీ శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించే యోగాపై గురువారం నగరంలోని కలెక్టరేట్ నుంచి మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగాలో పాల్గొంటారన్నారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద ఐదు లక్షల మంది యోగా వేడుకలో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్ర బాబు నాయుడు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి.. జిల్లాలోని 605 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9 లక్షల మంది వీక్షిస్తూ యోగా చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన ప్రతి ఒక్కరూ యోగాలో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీపీఓ పి. లావణ్య కుమారి, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ● రేపు 9లక్షల మందితో యోగాసనాలు ● కలెక్టర్ లక్ష్మీశ -
ఆర్టీసీ చలో వైజాగ్..జనాలకు మొదలైన ప్రయాణ పాట్లు
ఆటోనగర్(విజయవాడతూర్పు): విశాఖలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా కార్యక్రమానికి విజయవాడ నుంచి అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులను కేటాయించారు. దీని ద్వారా జనాన్ని తరలించే దిశగా ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం నుంచి సిటీ బస్సుల సంఖ్యను తగ్గించారు. దీని వల్ల విజయవాడ చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. ఇక విద్యార్థులు వారి వారి గ్రామాలకు వెళ్లాలంటే సిటీ బస్సుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. గంటల తరబడి నగరంలోని వివిధ బస్ స్టాప్ల వద్ద కాలయాపన చేయాల్సి వచ్చింది.రోజుకు 200 సర్వీసులకు పైగానే..నిత్యం విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు సుమారు 200 సిటీ సర్వీస్లను సంబంధిత ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. గురువారం మాత్రం చాలా తక్కువగా సిటీ బస్లను నడిపారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్లను కొన్ని సుదూర ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేశారు. ముఖ్యంగా భీమవరం, మచిలీపట్నం. గుడివాడ, కై కలూరుతో పాటు కొన్ని కీలక ప్రాంతాలకు మాత్రమే ఎక్స్ప్రెస్లు ఒకటి, రెండు సర్వీస్ల చొప్పున మాత్రమే నడిపినట్టు ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు.బస్సుకు ఒక్కడే డ్రైవర్..సిటీ బస్సులను విశాఖపట్నంకు అధిక సంఖ్యలో పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బస్సుకు కేవలం ఒకే డ్రైవర్ను కేటాయించారు. రానూపోను ఆ డ్రైవర్ మాత్రమే బస్సును నడపాల్సి ఉందని సిబ్బంది చెబుతున్నారు. దీని వల్ల డ్రైవర్కు రెస్ట్ ఉండదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఆటోనగర్ సిటీ టెర్మినల్ బస్స్టేషన్ వద్ద సిటీ బస్లలో వివిధ గ్రామాలకు సిటీ బస్సులకు వెళ్లేందుకు అధిక సంఖ్యలో వేచి ఉన్నారు.మూడు రోజులు తప్పదు..విశాఖపట్నంలో శనివారం అంతర్జాతీయ యోగా కార్యక్రమం జరగనుంది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారిని విశాఖ తీసుకెళ్లేందుకు గాను ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన సిటీ బస్ సర్వీస్లను చాలా కుదించేశారు. దీంతో ప్రయాణికులు.. బస్పాస్ల ద్వారా వేరే గ్రామాల నుంచి వెళ్లాల్సిన విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. మూడు రోజుల పాటు విద్యార్థులకు.. ప్రయాణికులకు తిప్పలు తప్పవని ఆర్టీసీ సిబ్బంది బహిరంగంగానే చెబుతున్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025పడకేసిన ప్రాథమిక వైద్యం ఆర్టీసీ చలో వైజాగ్! సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం. తల్లిదండ్రుల ఆందోళన జగ్గయ్యపేట: చిల్లకల్లులోని ఎంఈవో కార్యాలయం వద్ద గురువారం ఎంపీ స్కూల్స్లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు తొలగించటంపై తల్లిదండ్రులు ఆందోళన చేశారు. దుర్గమ్మ సన్నిధిలో కలెక్టర్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. జి.కొండూరు: తాను ప్రభుత్వ అధికారినంటూ ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధిలో ఉండే కుప్పిరెడ్డి కృష్ణారెడ్డికి ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం సమయంలో సైబర్ నేరగాడి నుంచి ఫోన్ వచ్చింది. మీ గ్రామ వలంటీర్ కొప్పుల దివ్య ఎలా పని చేశారు? మీకు గతంలో అమ్మ ఒడి డబ్బులు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? అని కృష్ణారెడ్డిని అడిగారు. గతంలో ఏమీ పెండింగ్లో లేవని చెప్పడంతో ఇప్పుడు మీకు తల్లికి వందనం డబ్బులు పడతాయి, మీ ఫోన్పే ఓపెన్ చేసి నేను ఒక నంబరు చెప్తాను.. ఆ నంబరుకు రూ.20వేలు పంపించండి అని సదరు సైబర్ నేరగాడు చెప్పాడు. వెంటనే కృష్ణారెడ్డి తన ఫోన్పే నుంచి సదరు సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్ నంబరుకు రూ.5వేలు చొప్పున రెండు దఫాలుగా పదివేలు, మరొక ఫోన్ నుంచి రూ.10 వేలను రెండు దఫాలుగా పంపించారు. ఆ తర్వాత సదరు సైబర్ నేరగాడికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే అనుమానం వచ్చి ఫోన్పే ఓపెన్ చేయగా సైబర్ నేరగాడి అకౌంట్ వివరాలు కూడా కనిపించకపోవడంతో మోసపోయానని తెలుసుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన కొప్పుల వెంకట్రామిరెడ్డి నుంచి కూడా ఇదే రీతిలో రూ.9 వేలను సైబర్ నేరగాడు లాగేసుకున్నాడు. దీంతో చేసేది లేక ఇద్దరు బాధితులు జి.కొండూరు ఎస్ఐ సతీష్కుమార్ని సంప్రదించారు. బాధితులతో సైబర్ క్రైమ్ పోర్టల్తో పాటు ఫోన్పేకు ఎస్ఐ ఫిర్యాదు చేయించారు. వలంటీర్లను పావులుగా వాడుకుంటూ.. ప్రభుత్వం తల్లికి వందనం నగదు జమ చేసే 12వ తేదీని సైబర్ నేరగాళ్లు నేరం చేసేందుకు అనువుగా ఎంచుకున్నారు. అనుకున్న ప్రకారం ముందుగా జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన గ్రామ వలంటీర్లకు ఫోన్ చేసి మిమ్మల్ని గ్రామ వలంటీర్లుగా మళ్లీ తీసుకుంటున్నాం. ఎక్కువ జీతం కూడా వస్తుంది అని నమ్మబలికారు. మీ దగ్గర గతంలో అమ్మ ఒడి పొందిన లబ్ధిదారుల పేర్లు, ఫోన్ నంబర్లు ఇవ్వాలంటూ అడిగారు. దీంతో సదరు గ్రామ వలంటీర్లు వారి దగ్గర ఉన్న పేర్లు, ఫోన్ నంబర్లను ఇచ్చారు. ఇక అక్కడి నుంచి నేరగాళ్లు వ్యూహాత్మకంగా మోసానికి పాల్పడ్డారు. అయితే బాధితులు చెబుతున్న ప్రకారం సదరు సైబర్ నేరగాడు ఇచ్చిన అకౌంట్ నంబరు కోటక్ మహీంద్రా బ్యాంకుకు చెందినదిగా తెలుస్తోంది. అయితే చివరి నాలుగు నంబర్లు 9841 తప్ప మరేమీ కనిపించడంలేదని అంటున్నారు. Iన్యూస్రీల్సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలు రచిస్తూ అమాయక గ్రామీణులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా తల్లికి వందనం లబ్ధిదారులు టార్గెట్గా పన్నిన వ్యూహంలో గతంలో పనిచేసిన వలంటీర్లను కూడా పావులుగా వాడుకోవడం గమనార్హం. జి.కొండూరు మండలంలో ఈ విధంగా మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇంకా పరువు పోతుందని ఫిర్యాదు చేయకపోవడంతో వెలుగులోకి రానివి మరెన్నో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరగాళ్లతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ పథకాల పేరుతో లబ్ధిదారులకు ఫోన్ చేసి వివరాలు అడిగినా, డబ్బులు పంపమన్నా స్పందించవద్దు. ఎటువంటి అనుమానిత ఫోన్ కాల్స్ వచ్చినా 1930కి కానీ స్థానిక పోలీసుస్టేషన్కు కానీ ఫిర్యాదు చేయాలి. ఇప్పటికే వెంకటాపురంలో జరిగిన మోసంపై సైబర్ క్రైమ్ పోర్టల్, ఫోన్పే వారికి ఫిర్యాదు చేయించాం. ప్రజలందరినీ సోషల్ మీడియా ద్వారా అప్రమత్తం చేశాం. –సతీష్కుమార్, ఎస్ఐ, జి.కొండూరు తల్లికి వందనం పథకం డబ్బులు వస్తాయంటూ లబ్ధిదారులకు ఫోన్లు మాటలతో నమ్మించి ఫోన్పే నుంచి డబ్బులు లాగేసుకున్న సైబర్ నేరగాళ్లు వెంకటాపురంలో ముగ్గురు బాధితుల నుంచి రూ.44వేలు హాంఫట్ ఫోన్పే, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఇంటి నంబరు మార్పు సమస్య అని చెప్పి.. ఇదే గ్రామానికి చెందిన అయిలూరి వెంకట్రామిరెడ్డికి ఇంటి నంబరు మార్పు సమస్య ఉంది. అయితే వెంకట్రామిరెడ్డికి ఫోన్ చేసిన సైబర్ నేరగాడు ఇంటి నంబరు సమస్యను సైతం ప్రస్తావించాడు. తర్వాత మీ గ్రామ వలంటీరు పనితీరు ఎలా ఉంది అని అడిగి నమ్మబలికాడు. అనంతరం గ్రామ వలంటీరు గోపిరెడ్డిని ఫోన్ కాన్ఫరెన్స్ కలిపి తల్లికి వందనం డబ్బులు గురించి మాట్లాడుతారు అని వలంటీరుతో చెప్పించాడు. ఆ తర్వాత వలంటీరును హోల్డ్లో పెట్టిన సైబర్ నేరగాడు తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లోకి రావాలంటే మీరు కొంత డబ్బులు పంపాలని నంబరు చెప్పాడు. నిజమే అని నమ్మిన వెంకట్రామిరెడ్డి సైబర్ నేరగాడు చెప్పిన అకౌంట్ నంబరుకు రూ.5వేలు చొప్పున మూడు దఫాలుగా రూ.15వేలు పంపాడు. తర్వాత మోసపోయానని తెలుసుకుని పోలీసులకు సైతం ఫిర్యాదు చేయకుండా తన అకౌంట్ని క్లోజ్ చేయించాడు. వెంకటాపురం గ్రామానికి చెందిన ఈ ముగ్గురు బాధితులే కాకుండా తల్లికి వందనం లబ్ధిదారులు భారీగానే మోసపోయినట్లు తెలుస్తోంది. పరువు పోతుందనే భయంతోనే బాధితులు ఫిర్యాదు చేసేందుకు కూడా రావడం లేదని తెలుస్తోంది. -
జాతీయ రహదారిపై వాహనాల బీభత్సం
పెనమలూరు:విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి బందరు రోడ్డుపై గంగూరు సెంటర్లో గురువారం లారీ–కారు బీభత్సం సృష్టించాయి. దీంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు. గంగూరు సెంటర్లో ఉదయం క్వారీ డస్టు లోడ్తో విజయవాడ నుంచి కంకిపాడు వైపునకు వెళుతున్న లారీని గంగూరు సెంటర్ వద్ద వెనుక నుంచి వచ్చిన కారు ఓవర్ టేక్ చేసింది. ఈ లోగా కారుకు మరో వాహనం ఎదురుగా అడ్డు రావటంతో కారు ఒక్కసారిగి లారీ ముందుకు వచ్చి తగిలింది. దీంతో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటంతో లారీ అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డుపైనే పల్టీ కొట్టింది. లారీలో ఉన్న డస్టు రోడ్డు పై పడింది. కారు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. అయితే ప్రమాద స్థలంలో ఆ సమయంలో ఎవ్వరూ లేక పోవటంతో ప్రాణ నష్టం జరగలేదు. లారీ ఒక్కసారిగా రోడ్డు పై పల్టీ కొట్టడంతో గంగూరు సెంటర్లో ఉన్న జనాలు తీవ్ర ఆందోళన చెందారు. డివైడర్ మధ్యలో ఉన సిగ్నెల్ లైట్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలం వద్దకు పోలీసులు చేరుకోని క్రేన్తో రోడ్డు పై పడిన వాహనాలను తొలగించారు. -
అమ్మేద్దాం!
తవ్వేద్దాం..ఎన్టీఆర్ జిల్లాలో యథేచ్ఛగా మట్టి దందా మైలవరం మండల పరిధి పొందుగల ఎర్ర చెరువులో గ్రావెల్ తవ్వకాలు జి.కొండూరు: అధికారమే అండగా టీడీపీ నాయకులు చెరువులపై ఎగబడుతున్నారు. పదుల సంఖ్యలో పొక్లెయిన్లు, వందల సంఖ్యలో ట్రాక్టర్లతో చెరువులను గుల్ల చేస్తున్నారు. రైతుల పేరుతో పొలాలకు మెరక కోసం అంటూ అనుమతులు పొందుతూ.. చెరువులలో మట్టి, గ్రావెల్ని ఇటుక బట్టీలు, వెంచర్లకు తరలించి రూ.కోట్లు బొక్కేస్తున్నారు. వారం రోజులుగా చెరువులు, రహదారులు దుమ్ము లేచిపోతున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే అక్రమ సొమ్ము ఒకరిద్దరే తింటే ఎలా? తమకూ వాటా కావాలంటూ కూటమిలోనే వేరే వర్గపు నేతలు గలాటా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చెరువుల వైపు కన్నెత్తి చూడడం లేదు. మారిపోతున్న భౌతిక స్వరూపం.. చెరువులలో మట్టి, గ్రావెల్ తవ్వకాల కోసం ఇష్టారాజ్యంగా చెరువుల వాలును బట్టి కాకుండా చెరువులో మట్టిని తవ్వేందుకు ఎక్కడ సులువుగా ఉంటే అక్కడ భారీ గొయ్యిలు పెట్టి తవ్వేస్తున్నారు. దీని వల్ల చెరువుల భౌతిక స్వరూపాలే మారిపోతున్నాయి. ఈ భారీ గొయ్యిల వల్ల చెరువులో ఉన్న నీరు తూములలోకి వచ్చే అవకాశం లేక రైతులు సాగునీటి ఎద్దడి వచ్చినప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీలకు ఆదాయం నిల్.. చెరువులలో మట్టిని, గ్రావెల్ని యథేచ్ఛగా తరలించి ఒకరిద్దరు అధికార పార్టీ నాయకులు బాగుపడడం తప్ప ఆయా గ్రామాలకు ఒరిగేదేమీ లేదు. అదే గ్రామ పంచాయతీలకు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టి మట్టి తరలింపునకు ప్రతి క్యూబిక్ మీటరుకు ఇంత అని లెక్క కట్టి గ్రామ పంచాయతీలకు చెల్లించేలా జీవో విడుదల చేస్తే నిధులు గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అయితే గ్రామ పంచాయతీల సర్పంచ్లు అధికంగా వైఎస్సార్ సీపీకి చెందిన వారే ఉండడంతో ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్ర చెరువులో ఎగబడ్డారు... మైలవరం మండల పరిధి పొందుగల ఎర్ర చెరువులో గ్రావెల్ లభ్యత ఎక్కువగా ఉండడంతో అక్కడి టీడీపీ నాయకులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. గత వారం రోజులుగా తవ్వకాలు జరుపుతూ పరిసర ప్రాంతాలలోని ఇళ్ల స్థలాలు, వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క ట్రాక్టరు ట్రక్కు గ్రావెల్ని రూ.1200కి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులకు సమాచారం అందించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో తవ్వకాలు ఇలా.. ● తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలం కొండపర్వ చెరువులో తవ్వకాలు జరిపారు. ● జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు మండలం కొణకంచి చెరువు నుంచి బండిపాలెం వెంచర్లకు గత మూడు రోజులుగా రాత్రి సమయాల్లో మట్టిని తరలిస్తున్నారు. ● నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం కంచికచర్ల, గొట్టిముక్కల, పేరకలపాడు, వీరులపాడు మండల పరిధిలోని జుజ్జూరు, పెద్దాపురం గ్రామాల్లోని చెరువులలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ● మైలవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండల పరిధిలో కొత్తూరు, మైలవరం మండలం పొందుగల, చంద్రాల, బొర్రగూడెం, రెడ్డిగూడెం మండలం నాగులూరు, జి. కొండూరు మండలం చిన్ననందిగామ, కుంటముక్కల, కోడూరు, వెల్లటూరు, ఆత్కూరు, చెవుటూరు, మునగపాడు, కవులూరు గ్రామాల్లోని చెరువుల్లో భారీగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేదు.. చెరువులను చెరబడుతున్న పచ్చ నేతలు పొలాలకు మెరక కోసం అంటూ రైతుల పేరుతో అనుమతులు వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం కోట్ల రూపాయల మట్టి తరలిపోతున్నా కన్నెత్తి చూడని అధికారులు గ్రామ పంచాయతీలకు దక్కని ఆదాయం అడ్డగోలుగా తవ్వితే అనర్థమే.. చెరువులలో నిబంధనల మేరక పూడికతీసి మట్టిని రైతుల అవసరాలకు మాత్రమే తరలించాలి. అలా కాకుండా ఇష్టా రాజ్యంగా పది అడుగుల లోతు వరకు తవ్వి మట్టిని అమ్ముకోవడం వల్ల ఒకరిద్దరే బాగుపడతారు. ఇలా తవ్వకాలు జరపడం వల్ల రైతులకు నష్టం జరుగుతుంది. చెరువులో నీరు ఉన్నప్పటికీ భారీ గోతుల వల్ల నీరు తూములలోకి రాకపోవడంతో సాగునీటి ఎద్దడి సమయంలో రైతులు నష్టపోతారు. అంతేకాక చెరువులో దిగినప్పుడు మనుషులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. – పీవీ ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో రేయింబగళ్లు చెరువులలో మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క చెరువు నుంచి రోజుకి 2 నుంచి 3వేల ట్రాక్టరు ట్రక్కులు అంటే రోజుకి 7వేల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తరలిపోతోంది. ఒక ట్రాక్టర్ మట్టికి రూ.1200 వరకు వసూలు చేస్తుండగా ట్రాక్టరు, పొక్లెయిన్ల కిరాయి పోను రోజుకి రూ.15లక్షల నుంచి రూ. 20లక్షల వరకు టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్తోంది. మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ల డ్రైవర్లు ఎక్కువ ట్రిప్పులు వేయాలనే పోటీతో వేగంగా నడుపుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. -
29న దుర్గమ్మకు తెలంగాణ బంగారుబోనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఈ నెల 29వ తేదీన తెలంగాణ బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ శ్రీభాగ్య నగర్ మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బుధవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. తొలుత ఆలయ దుర్గగుడి ఈవో శీనానాయక్ను కలిసి ఉత్సవం నిర్వహణ గురించి వివరించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి తెలంగాణ నుంచి బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఏడాది 29న సుమారు 500 మందితో అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్నట్లు కమిటీ అధ్యక్షుడు జి.రాఘవేందర్ తెలిపారు. 29వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్లోని ఉమ్మడి దేవాలయాల్లో కొలువై ఉన్న అమ్మవార్లకు దుర్గగుడి దేవస్థానం తరఫున జూలై 18న అమ్మవార్లకు సారె సమర్పించేందుకు విచ్చేయాలని కోరారు. జనగణనతో పాటే కులగణన హర్షణీయం లబ్బీపేట(విజయవాడతూర్పు): జనగణనతో పాటే కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న గజిట్ విడుదల చేయడం హర్షణీయమని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు. విజయవాడలోని తమ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో జనగణనతో పాటే కులగణన చేయాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక రూపాల్లో ఉద్యమాలు, నిరసనలు చేసినట్లు తెలిపారు. ఆ ఫలితంగా నేడు కులగణన చేసేందుకు కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓబీసీల జనాభా కచ్చితంగా తెలిసేలా వెనుకబడిన తరగతులకు చెందిన జాతీయ స్థాయిలోని 3,746 కులాలు, రాష్ట్రంలోని 139 కులాలకు చెందిన వారందరూ తమ జనాభా వివరాలతో పాటు కులాల వివరాలు కూడా తెలియజేయాలన్నారు. అప్పుడే బీసీ కులాల జనాభా ఎంత ఉందో తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ ఉద్యోగుల విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మేకా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చెప్పాడ చందు, పునుగుపాటి శ్రీనివాస్, నాయకులు వాకా వెంకటేశ్వరరావు, తెన్నేటి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులు మొగ్గుచూపాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకంచికచర్ల: జిల్లాలో 867మంది చిన్న, సన్నకారు రైతులకు రూ.1.67 కోట్ల వ్యవసాయ యాంత్రీ కరణ రాయితీ నిధులు జమ చేసిన చెక్ను అందించినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎప్పటి కప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సాగు ఖర్చులు తగ్గించుకుని వ్యవ సాయాన్ని లాభసాటిగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సి ఉందన్నారు. అధిక నీటి అవసరం ఉన్న వరి పంటనే కాకుండా, చిరుధాన్యాలు, కూరగాయలు పండ్ల తోటలు సాగుచేసుకుంటే నికర ఆదాయంతో పాటు తెగుళ్ల బెడద తొలగుతుందని, పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ త్వరలోనే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు తెలియ జేశారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ కె. బాలకృష్ణ, ఎంపీడీఓ బీఎం విజయలక్ష్మి, సర్పంచి వేల్పుల సునీత, ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ గరికపాడు సుధాకర్, డీఎం ఆగ్రోస్ మానస, ఏడీఏ శ్రీని వాసరావు, మండల ఏఓ కె.విజయకుమార్, ఇన్చార్జి తహసీల్దార్ వి.మానస పాల్గొన్నారు. -
మన దేశ సాంస్కృతిక వారసత్వ సంపద యోగ
భవానీపురం(విజయవాడపశ్చిమ): భారత దేశానికి మాత్రమే సొంతమైన సాంస్కృతిక వారసత్వ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం యోగాంధ్ర – 2025 మాసోత్సవాలను నిర్వహిస్తోందని మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి డాన్బోస్కో స్కూల్లో ఈ నెల 16,17,18 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో 15 కేటగిరీలలో 42 అంశాలపై 526 మంది పాల్గొనగా 193 మందిని విజేతలుగా ఎంపిక చేసి వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా 103 పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి ఆయా ప్రదేశాల ఔన్నత్యాన్ని చాటి చెప్పామన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నేతృత్వంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన థీమాటిక్ ఫ్లోటింగ్ యోగా ప్రపంచ రికార్డ్ సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సొంతం అవుతాయని అన్నారు. ఐరోపా దేశాల్లో సైతం భారతీయ యోగా, వెల్నెస్కు మంచి పేరుందని, ఆ విషయాన్ని ఇటీవల తన బెర్లిన్ పర్యటనలో గుర్తించినట్లు తెలిపారు. ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ పోటీల్లో విజేతలుగా నిలిచినవారు ఈ నెల 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీతో కలిసి యోగాసనాల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగాభ్యాసం ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. ఈవెంట్ కాదు..మూవ్మెంట్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ యోగాంధ్ర అనేది ఒక ఈవెంట్ కాదని, గొప్ప మూవ్మెంట్ అని అభివర్ణించారు. కళాత్మక యోగాతో యోగా గొప్పదనాన్ని చాటిచెప్పేందుకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలను ఏర్పాటు చేయడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, ఆయుష్ అధికారులు డాక్టర్ వి.రాణి, డాక్టర్ రామత్లేహి, డాక్టర్ రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంతో సాగిన కళారూపకం ఆహూతుల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ప్రజ్ఞ యోగ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రదర్శనతో పాటు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్ యోగా పోటీల్లో విజేతలకు బహుమతీ ప్రదానం -
రైతులకు నాణ్యమైన సేవలే లక్ష్యం
కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురామ్ చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణాజిల్లా సహకార సంఘాల్లో కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి చేశామని డిజిటల్ మాధ్యమాల ద్వారా రైతులకు పారదర్శకమైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించాలని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ అన్నారు. బ్యాంకు కార్యాలయంలో పీఏసీఎస్ సిబ్బందికి కంప్యూటరీకరణపై శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలు కంప్యూటరీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ సేవా కార్యక్రమాలు సహకార సంఘాలకు అనుసంధానించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో మీ–సేవా ద్వారా రైతులకు ఎన్నోరకాల సేవలను అందించేవారన్నారు. ప్రస్తుతం రైతులకు 1బీ, అడంగల్ వంటి భూ సంబంధిత పత్రాలను భవిష్యత్తులో సహకార సంఘాల ద్వారానే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కేడీసీసీబీ సీఈవో ఎ. శ్యామ్మనోహర్, జనరల్ మేనేజర్ బీఎల్ చంద్రశేఖర్, ఆప్కాబ్ ఏజీఎం అశోక్, డీపీడీఎంజీ పవన్కుమార్, పి. జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యోగాసనాల సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని.. ఆరోగ్యమే మహా భాగ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బంది, వాసవి ఇంటర్నేషనల్ క్లబ్స్ సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం బాగుంటే వైద్య ఖర్చుల రూపంలో చేసే వ్యయం తగ్గటం వల్ల వారిలో డబ్బులు పొదుపు చేసే సంస్కృతి పెరుగుతుందని.. అది వ్యక్తి శ్రేయస్సుకు, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇదే వేదికపై కొన్ని రోజుల కిందట వైద్యులు కూడా యోగా సాధన చేశారని.. వారి ప్రసంగాల్లో సైతం యోగాసనాలు ఆచరించడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం ప్రజలకు లభిస్తుందని తెలిపారన్నారు. యోగ సాధన విశిష్టతపై బ్యాంకర్లు తమ ఖాతాదారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ఆనందంగా ఉంది... యూబీఐ రీజనల్ హెడ్ ఎంవీ తిలక్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంటర్నేషనల్ వాసవీ క్లబ్ పూర్వపు అధ్యక్షుడు వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ భారతదేశ సాంస్కృతిక, వారసత్వ సంపద అయిన యోగా సాధనను ప్రపంచానికి చేరువచేయడంలో ప్రధాని విజయవంతమయ్యారన్నారు. ఎస్ఎల్బీసీ సీఎం గౌతమ్ లక్ష్మీనారాయణ, ఎల్డీఎం కె.ప్రియాంక, ఎస్బీఐ ఆర్ఎం శ్రీనివాస్, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ రాజేష్, ఏపీజీబీ ఆర్ఎం ప్రసాద్, కేడీసీసీ జీఎం రంగబాబు, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బీచ్లో గల్లంతై ఆటోడ్రైవర్ మృతి
కోనేరుసెంటర్: మంగినపూడిబీచ్లో గల్లంతై ఓ ఆటోడ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటనపై బందరు రూరల్ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుడ్లవల్లేరు మండలం పేజేండ్ర గ్రామానికి చెందిన షేక్ జిలాని (30) ఆటో నడుపుతుంటాడు. బుధవారం గుడ్లవల్లేరు నుంచి జిలానీ కుటుంబంతో పాటు ఇతర బంధువులు అంతా కలిసి విహారయాత్రకు మంగినపూడి బీచ్కు వెళ్లారు. అందరూ అలల మధ్య స్నానాలు చేస్తుండగా జిలాని ఒక్కసారిగా అలల మధ్య చిక్కుకుని కొట్టుకుపోయాడు. ప్రమాదాన్ని పసిగట్టిన కుటుంబ సభ్యులు, బంధువులు బిగ్గరగా కేకలు వేయడంతో బీచ్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అతని కోసం గాలించినా ప్రయోజనం లేకపోయింది. మరుకొద్ది సేపటికి జిలాని శవమై ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ నాగరాజు సంఘటనాస్థలానికి చేరుకుని బంధువుల నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
●నీవుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా..
ఓయ్.. నిన్నే.. ఉన్నావా? హమ్మయ్యా.. వచ్చేశావా.. దారి తప్పి.. ఎగిరిఎగిరి అలసిపోయిన ఓ చిలుక.. సాయం సంధ్యవేళ ఎట్టకేలకు తన ప్రియ సఖి వేచి ఉన్న చెట్టు గూడును కనిపెట్టి అక్కడకు చేరుకుంది. ప్రియా.. ప్రియా.. అని కూతపెట్టింది.. వేయి యుగాల నిరీక్షణతో లోపల వేచి ఉన్న ఆ సఖి ఆతృతగా బయటకొచ్చి.. ఇక నాతోనే ఉంటావా అని బెంగగా అడిగింది.. నీవుంటే నా జతగా నేనెక్కడికి వెళ్తాను.. నీతోనే ఉంటా.. నీ ఊపిరిగా అంటూ గాఢమైన ముద్దిచ్చి గూట్లోకి తీసుకుపోయినట్లుంది కదూ.. విజయవాడ భవానీపురం ప్రాంతంలో ఓ చెట్టు గూడులో చిలుకల ప్రేమ సరాగాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. – కిషోర్, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కప్తానుపాలెం(మోపిదేవి): మండల పరిధిలోని పెదప్రోలు శివారు కప్తానుపాలెం వద్ద 216 జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కిలపర్తి దినేష్(24) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు అవనిగడ్డ మండలం పులిగడ్డకు చెందిన కిలపర్తి కీర్తిరాజు కుమార్డు దినేష్ వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. మెటీరియల్ కోసం గుడివాడ వెళ్లి ఆ వస్తువులతో ద్విచక్రవానంపై పులిగడ్డ వస్తున్నాడు. మార్గమధ్యలో రేణిగుంట నుంచి మామిడి లోడుతో అన్నవరం వెళుతున్న లారీ కప్తానుపాలెం వద్ద ఎదురుగా వస్తున్న దినేష్ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొని సుమారు 20 మీటర్లకుపైగా రోడ్డుపై లాక్కుపోయింది. ఈ ప్రమాదంలో దినేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించి, వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. -
ఈడ్చి పడేశారు!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో సాగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) బుధవారం నిరసన వ్యక్తం చేసింది. ఎంజీ రోడ్డులో ఇందిరా టవర్స్ వద్ద ఉన్న శ్రీ చైతన్య కళాశాల వద్ద చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు, ప్రధాన కార్యదర్శి బందెల నాసర్లు మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, దుస్తులు వంటివి కూడా విక్రయం చేస్తున్నార న్నారు. నోట్ పుస్తకాలు సైతం విక్రయాలు జరపడమేంటని ప్రశ్నించారు. దీంతో మాచవరం పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి సంఘం నేతలపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు, వారిని ఈడ్చుకుంటూ వెళ్తి జీపు ఎక్కించి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వలరాజు మాట్లాడుతూ కార్పొరేట్ దోపిడీని అడ్డుకోవాల్సిన అధికారులు, పోలీసులు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తున్న తమపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. దోపిడీని అడ్డుకోవాల్సిన విద్యాశాఖ మంత్రి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు వీధి రౌడీల్లా విద్యార్థి సంఘ నాయకుల పట్ల వ్యవహరించారని మండిపడ్డారు. స్టేషన్లో ఉన్న విద్యార్థి సంఘ నాయకులను సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు పరామర్శించారు. సమాఖ్య ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ పాల్గొన్నారు. విద్యార్థి సంఘ నాయకులపై పోలీస్ జులుం కార్పొరేట్ కాలేజీల్లో ఫీజు దోపిడీపై ఆందోళన చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు అరెస్ట్ -
తొలిదశలో గుర్తిస్తే మందులతోనే నయం
శరీరంలో వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేసే ఇన్బిల్ట్ మిషన్లు కిడ్నీలు. వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అశ్రద్ధ వహిస్తే అసలుకే ఎసరు తెస్తుంది. నేటి సమాజంలో ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, రసాయనాలు వాడిన పండ్లు, ఇతర ఆహార పదార్ధాలు, అతిగా పెయిన్ కిల్లర్స్ వాడకం కిడ్నీలకు ప్రధాన శత్రువులు. వీటిని పరిహరిస్తే మన కిడ్నీలు సురక్షితంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉరుకులు పరుగుల జీవనం... ఆధునిక జీవనశైలి కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని ఎ.కొండూరు ప్రాంతంలోనే కాక ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధుల బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. శరీరంలో అత్యంత కీలకమైన సూపర్ ఆర్గాన్స్గా పిలిచే కిడ్నీల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది. అదుపులేని మధుమేహం, అధిక బరువు, ఆహారంలో పెస్టిసైడ్స్ అవశేషాలు వంటి వాటితో కిడ్నీలకు హాని కలుగుతుంది. కిడ్నీలు 2/3 వంతు డ్యామేజీ అయ్యేంత వరకూ గుర్తించలేక పోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు, వ్యాధులను ముందుగా గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు తరచూ చేయించుకోవాలని సూచిస్తున్నారు. జీవనశైలితో జిల్లాలో పెరిగిన కిడ్నీ వ్యాధులు ఆహారంలో పెస్టిసైడ్స్ అవశేషాలతో కిడ్నీలపై ప్రభావం తరచూ నొప్పి నివారణ మందులు వాడడం ఒక కారణమే ముందస్తు చర్యలతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు -
పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్గా శివరామప్రసాద్
చిలకలపూడి(మచిలీపట్నం): పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్గా టి.శివరామప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జిల్లా మేనేజర్గా పనిచేసిన శిరీష బదిలీ అయ్యారు. ఆ స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్గా పని చేస్తున్న శివరామప్రసాద్ను కృష్ణాజిల్లాకు నియమించారు. ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. దుర్గమ్మ సేవలో కేంద్ర సాధికార కమిటీ సభ్యులుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కేంద్ర సాధికార కమిటీ సభ్యులు, శాసనసభ ఉప సభాపతి బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్, జెఆర్.భట్, సునీల్ లిమాయేలను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. కేంద్ర సాధికార కమిటీతో పాటు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. కమిటీ సభ్యులతో పాటు అటవీ, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
‘తల్లికి వందనం’ పేరుతో మోసం
కంచికచర్ల: తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గోపీనాయక్ మండిపడ్డారు. కంచికచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా గోపీ నాయక్ మాట్లాడుతూ.. కుటుంబంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. పథకం అమలులో ఆంక్షల పేరిట తల్లులను మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ ఏడాది ప్రతి ఒక్క విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని గొప్పలు చెప్పి రూ.13 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వద్ద వసూలు చేసిన నగదును విద్యా సంస్థల అభివృద్ధికి ఉపయోగిస్తుందా అని ప్రశ్నించారు. అసంబద్ధ నిబంధనల పేరుతో విద్యార్థుల సంఖ్యను కుదింపు చేయడాన్ని ఖండిస్తున్నామని స్పష్టంచేశారు. జీఓ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు షేక్ ఖజు, తులసి, వరలక్ష్మి, దీపిక తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గోపీనాయక్ -
హెచ్ఐవీ బాధితులు మనోధైర్యంతో జీవించాలి
గాంధీనగర్/మధురానగర్(విజయవాడసెంట్రల్): హెచ్ఐవీ బాధితులు మనోధైర్యంతో జీవించాలని ఎన్టీఆర్ జిల్లా అదనపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జూపూడి ఉషారాణి సూచించారు. బావాజిపేట లోని నవజీవన్ బాల భవన్లో హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులకు మంగళవారం నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం తయారీపై అవగాహన కల్పించారు. ఉషారాణి మాట్లాడుతూ.. హెచ్ఐవీ బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. నవజీవన్ బాలభవన్ ప్రతి నెలా పౌష్టికాహారం అందజేయడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, విద్యార్థులను చదివించడం, సూక్ష్మ, మధ్యతరగతి వ్యాపారాలు ఏర్పాటుచేసుకోవడానికి సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. నవజీవన్ బాల భవన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫాదర్ అంతయ్య మాట్లా డుతూ.. హెచ్ఐవీ బాధిత కుటుంబాలకు ప్రతి నెలా పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, వారి కుటుంబాల్లోని బాల బాలికల చదువుకు సహాయం చేయడం ద్వారా వారికి తోడుగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ శాంసన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఏఆర్టీ మందులు క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవ జీవన్ బాల భవన్ అడ్మిస్ట్రేటర్ ఫాదర్ మర్రెడ్డి, ప్రోగ్రాం మేనేజర్ గోళ్లమూడి శేఖర్ బాబు, జోనల్ కోఆర్డినేటర్లు జాకబ్ రాజు, నజ్మా, ప్రియాంక, దేవ మణి, వెంకటేశ్వరావు, రమేష్, జ్యోతిచంద్రిక, వలంటీర్లు హైమావతి, దుర్గ, రాణి, హెచ్ఐవీ/ ఎయిడ్స్ బాధితులు పాల్గొన్నారు.ఏఎంహెచ్ఓ జూపూడి ఉషారాణి -
జీఎస్టీ కచ్చితంగా వసూలు చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కచ్చితంగా వసూలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో ఎస్పీ ఆర్.గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఐ.హేమతో కలిసి వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం సమన్వయ సమావేశాశం నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. వాణిజ్య శాఖ వసూలు చేసే రెవెన్యూ ద్వారానే ప్రజలకు అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుతో పాటు ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు వస్తున్నాయని పేర్కొన్నారు. పన్నులు సరిగా వసూలు చేయకపోతే ఆదాయం తగ్గిపోతుందని పేర్కొన్నారు. అధికారులు అందరూ సమన్వయంతో వస్తు సేవల పన్ను, వృత్తి పన్ను సక్రమంగా వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీ ఎగవేతదారుల జాబితాను వాణిజ్య పన్నులశాఖ అధికారులు అందిస్తారని, ఆ జాబితా మేరకు తహసీల్దార్లు తమ పరిధిలో వసూలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని బ్యాంకులకు ఈ జాబితాను అందజేస్తామని, వారు కూడా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి పన్ను బకాయిలు వసూలు చేసేందుకు సహకరించాలని కోరారు. జిల్లాలో 177 ప్రభుత్వ శాఖలు ఉండగా కేవలం 84 శాఖలు మాత్రమే జీఎస్టీ, టీఎస్ ఫైలింగ్ జరుగుతోందని, మిగిలిన శాఖల్లో కూడా ఫైలింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ప్రతి నెలా వృత్తి పన్ను వసూలు చేయాలన్నారు. మునిసిపాల్టీలు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా వృత్తి పన్ను చెల్లించాల్సి ఉంద న్నారు. వాణిజ్య పన్నులశాఖ అధికారులకు క్షేత్రస్థాయిలో అన్ని విధాల చేయూతను అందించి పన్నులు సక్రమంగా వసూలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గనులు, భూగర్భ వనరులుపై జీఎస్టీ వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గనులు, భూగర్భ వనరులు అక్రమంగా రవాణా కాకుండా నిరోధించాలని స్పష్టంచేశారు. ప్రతి పంచా యతీ కార్యదర్శి ఇకపై ప్రతి నెలా పదో తేదీలోగా జీఎస్టీ, టీడీఎస్ ఫైలింగ్ తప్పనిసరిగా చేయాలన్నారు. ఇందుకోసం వాణిజ్య పన్నులశాఖ అధికారులు పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, హౌసింగ్ పీడీ వెంకట్రావు, ఎల్డీఎం సి.రవీంద్రరెడ్డి, బందరు ఆర్డీఓ కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ