breaking news
NTR district Latest News
-
బాల్య వివాహాల నివారణపై అవగాహన
గూడూరు:బాల్య వివాహాల నివారణకు అందరూ కృషి చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ యు.ఉషశ్రీ అన్నారు. బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ముక్కొల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బాలబాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూ పెళ్లి ఈడు రాకుండా వివాహం చేసుకుంటే శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, సామాజికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పెళ్లి ఈడు వచ్చే వరకు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను రూపుమాపటానికి బాలబాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.శారద, జి.హేమలత, అరుణాదేవి, ఎంఎస్కే రీనా బేగం, ఏఎన్ఎం కాగిత కోమలి, భవాని, ఉదయలక్ష్మి, అర్చన, వరలక్ష్మి, పి.భాగ్య పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీకాంతంకు అవార్డు
పటమట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి. లక్ష్మీకాంతం నేపాల్లోని ఖాట్మాండులో వరల్డ్ కాన్ఫరెన్స్ కౌన్సిల్ నుంచి ఎస్డీఈ చాంపియన్ బహుమతిని అందుకున్నారు. ఈ నెల 28వ జరిగిన ఈ కార్యక్రమంలో నేపాల్ మాజీ ఎన్నికల కమిషనర్, మాజీ రాయబారి డాక్టర్ రాంభక్త ఠాకూర్, మాజీ పర్యాటక మంత్రి యాంకిల షెర్పా, మాజీ మహిళా, శిశు సంక్షేమ మంత్రి భగవతి చౌదరి, నేపాల్ మాజీ సంస్కృతి, పౌర విమానయాన మంత్రి ఆనంద ప్రసాద్ పోఖారెల్ సమక్షంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. గుడ్లవల్లేరు: లిపిడోమిక్స్ వినూత్న పరిశోధనలు అంశంపై వి.వి.ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ గుడ్లవల్లేరులోని ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా మిచిగన్ వేన్ స్టేట్ యూనివర్సిటీ రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ పి.గోవిందయ్య హాజరయ్యారు. సాంకేతికత ద్వారా ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైలింగ్లో జరుగుతున్న వినూత్న పరిశోధనలు అనే అంశంపై విలువైన ఉపన్యాసం అందించారు. లిపిడోమిక్స్ రంగంలో ఈ ఆధునిక విశ్లేషణ పద్ధతుల ప్రాముఖ్యతను, ఔషధ పరిశోధన, ఆరోగ్య శాస్త్రాల్లో వాటి వినియోగాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. డాక్టర్ గోవిందయ్యను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. -
ఈవీఎం గోడౌన్ పరిశీలన
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ త్రైమాసిక తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ను తెరిచి ఈవీఎంలను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఈవీఎం నోడల్ అధికారి ఎం నిత్యానందం, మచిలీపట్నం మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా, సీపీఎం నాయకులు కొడాలి శర్మ, బూర సుబ్రహ్మణ్యం, పంతం గజేంద్ర, వీరంకి గురుమూర్తి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎంవీ శ్యామ్నాధ్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ పీజీ గైనకాలజీలో యూనివర్సిటీ టాపర్ జాహ్నవి లబ్బీపేట(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం ఈ నెల 28వ తేదీ విడుదల చేసిన పీజీ ఫలితాల్లో గైనకాలజీ విభాగంలో డాక్టర్ ఓ శ్రీజాహ్నవి యూనివర్సిటీ టాపర్గా నిలిచారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డాక్టర్ జాహ్నవి అత్యుత్తమ మార్కులతో గైనకాలజీ విభాగంలో మొదటి స్థానం పొందారు. భవిష్యత్లో గ్రామీణ మహిళలకు వైద్య సేవలు అందించడానికి కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఆమె తండ్రి జయరాజు ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. జాహ్నవిని పలువురు అభినందించారు. బాడీబిల్డింగ్లో బందరు యువకుడికి స్వర్ణపతకం మచిలీపట్నంఅర్బన్: ఆంధ్ర బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ 2025 రాష్ట్రస్థాయి పోటీల్లో బందరుకు చెందిన యువకుడు స్వర్ణ పతకం సాధించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదివారం నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో స్థానిక మాచవరానికి చెందిన బీరం ప్రశాంత్ 65 కేజీల విభాగంలో మొదటి స్థానం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. న్యూ నవ్యాంధ్ర ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన పోటీల్లో ప్రశాంత్ ప్రతిభ కనబర్చాడు. విజేతలకు సంఘ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గోల్డ్ మెడల్తో పాటు సర్టిఫికెట్ను అందజేశారు. ఈ విజయంతో బందరు ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చినందుకు క్రీడాభిమానులు, స్థానికులు అభినందించారు. జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికలు భవానీపురం(విజయవాడపశ్చిమ): కరాటే ఇండియా ఆధ్వర్యాన జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహించనున్న మొదటి జాతీయ స్థాయి కరాటే చాంపియన్షిప్ పోటీలకు విజయవాడలోని క్రీడా కేంద్రంలో ఆదివారం ఎంపికలు జరిగాయి. దీనిపై ఏపీ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జె.హరనాఽథ్, ప్రధాన కార్యదర్శి జె.శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంపికల్లో భాగంగా అండర్ 21 కేటగిరిలో బాలబాలికల మధ్య సబ్ జూనియర్స్, క్యాడెట్–జూనియర్స్కు పోటీలు జరిగాయని తెలిపారు. ఇందులో కటా బాలికల జట్టులో అక్షిత, చార్వీ అగర్వాల్, ఆఫ్రిన్ షహనాజ్, తేజశ్రీ సాయి, కుసుమ శ్రీచరిత, షఫియ, హరిచందన బంగారు పతకాలను గెలుచుకుని జాతీయ టోర్న్మెంట్కు ఎంపికయ్యారని వివరించారు. కటా బాలుర జట్టుకు లీలా ఉదయ్ రెడ్డి, భువన్ సాయి, అబ్దుల్ రెహన్, అజయ్ శర్వణ్, వెంకట అవినాష్ గోల్డ్ మెడల్స్ సాధించారని పేర్కొన్నారు. కుమితే బాలికల జట్టుకు స్నిగ్ధ, వసుధ, లక్ష్మీదివ్య, బాలుర జట్టుకు గ్రిఫిన్ జోయల్, యశ్విన్, సాత్విక్, సుహాన్, కృష్ణ, మోనిష్, ప్రియతమ్, నితీష్ నాగసాయి, విఘ్నేష్ బంగారు పతకాలను సాధించారని తెలిపారు. ఎంపికలకు జక్కుల దినేష్, సీహెచ్ మహేష్, టి.మధు, బి.నరసింహ, టీవీ సాయికుమార్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలను ఏపీ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ అన్వర్ షేక్ అభినందించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 41.2400 టీఎంసీలు. ముక్కోటి ఏకాదశికి ముస్తాబు లబ్బీపేట: ముక్కోటి ఏకాదశి సందర్భంగా టీటీడీ ఆధ్వర్యాన పున్నమ్మతోటలో టీటీడీ కల్యాణ మండపం ఆవరణలోని వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. రీజనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల రీజనల్ స్పోర్ట్స్ మీట్ సోమవారం ప్రారంభమైంది. –8లో.. 7 -
బరి తెగింపు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పందెంరాయుళ్లు కాలు దువ్వుతున్నారు. సంక్రాంతికి ముందే కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో పలుచోట్ల మామిడితోటల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలు జరుగుతున్నాయి. నియోజకవర్గ, పార్లమెంటు ప్రజాప్రతినిధులు పచ్చ జెండా ఊపడంతో నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పోలీసులకు సైతం మామూళ్లు అందుతుండటంతో వారు వీటిపై కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది. సంప్రదాయం ముసుగులో.. సంక్రాంతి వేళ సంప్రదాయం ముసుగులో కోట్లు దండుకునేందుకు అధికార టీడీపీ రెడీ అయ్యింది. పండుగ వేళ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బరుల స్థాయిని బట్టి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు రేటు ఫిక్స్ చేశారు. వీటి నిర్వహణను పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు కొందరు ప్రజాప్రతినిధులు అప్పజెప్పారు. పండుగకు వారం ముందు నుంచే ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహిస్తూ సంప్రదాయం ముసుగు కప్పి బరులను సిద్ధం చేసేందుకు ప్రణాళిక రెడీ చేశారు. ‘క్యాసినో’ నిపుణులు రంగంలోకి.. ఈ ఏడాది ప్రత్యేకంగా ఇప్పటికే క్యాసినో నిపుణులను నిర్వాహకులు రంగంలోకి దించుతున్నారు. నార్త్, గోవా, నేపాల్ డీలర్లతో సంప్రదింపులు జరిపినట్లు జోరుగా చర్చ సాగుతోంది. రాత్రీపగలు క్యాసినోకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో.. -
నీటి సమస్య పరిష్కారానికే జలశక్తి హ్యాక్థాన్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ వైఆర్ఎస్ రావుపెనమలూరు: జల సమస్యల పరిష్కారాలను కనుగొని, నూతన సాంకేతికతతో నీటి నిర్వహణను మెరుగుపర్చడమే జలశక్తి హ్యాక్థాన్–2025 ముఖ్య ఉద్దేశమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ వైఆర్ఎస్ రావు తెలిపారు. కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సీటీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం జలశక్తి మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సస్, రివర్ డెవల్మెంట్ శాఖల సహకారంతో జలశక్తి హ్యాకథాన్–2025ను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఆర్ఎస్ రావు మాట్లాడుతూ నీటి సమస్యలు గుర్తిస్తే వెంటనే పది లైన్లతో జలశక్తి మంత్రిత్వ శాఖ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సాంకేతికతతో అధిగమించగలం.. ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్జైన్ మాట్లాడుతూ దేశంలో వనరులు తక్కువగా ఉన్నా సాంకేతికతతో సమస్యను అధిగమించగలుగుతామని అన్నారు. విద్యార్థులు పరిశోధనలు చేసి వాస్తవ సమస్యలకు గుర్తించి పరిష్కారం చేయాలని సూచించారు. సెంట్రల్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ ఎన్.జ్యోతికుమార్ మాట్లాడుతూ మన దేశంలో ఆకలి నుంచి హరిత విప్లవం పైపునకు సివిల్ ఇంజినీర్లు తీసుకు వెళ్లారన్నారు. జాతీయ నీటి నిపుణుడు ఎ.వరప్రసాదరావు, శాస్త్రవేత్త డాక్టర్ ఎస్వీ విజయ్కుమార్, కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, వర్సిటీ సివిల్ హెడ్ డాక్టర్ వి.మల్లికార్జున, భూగర్భశాఖ నిపుణులు, సివిల్ ఇంజినీరింగ్ నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్కు ప్రజల నుంచి 60 ఫిర్యాదులు అందా యి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎం.రాజారావు, కై ం ఏడీసీపీ ఎస్వీడీ ప్రసాద్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా నడవలేని వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి సమస్యను తెలుసుకుని ఫిర్యాదులు అందకున్నారు. అనంతరం వాటిని సంబంధిత ఎస్హెచ్ఓలతో ఫోన్లో మాట్లాడి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. కాగా గ్రీవెన్స్లో భూ వివాదాలు, ఆస్తి తగాదాలకు సంబంధించి 27, కుటుంబ కలహాలపై 7, కొట్లాటకు సంబంధించి 3, వివిధ మోసాలపై 5, మహిళా సంబంధిత నేరాలపై 3, దొంగతాలకు సంబంధించి 5, వివిధ సమస్యలు, సంఘటనలకు సంబంధించి 10, మొత్తం 60 ఫిర్యాదులు అందాయి. మచిలీపట్నంఅర్బన్: ఏపీలో 104 సేవలను నిర్వహిస్తున్న భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య తీరును నిరసిస్తూ సాగుతున్న ఉద్యోగుల ఉద్యమానికి అన్ని కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వాలని 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.ఆర్. ఫణికుమార్ ఒక ప్రకటనలో కోరారు. భవ్య హెల్త్ సర్వీస్ యాజమాన్యం గత ఏడు నెలలుగా కార్మికులను పూర్తిగా దోపిడీ చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. గత యాజమాన్యం ఇచ్చిన చివరి నెల వేతనాన్ని కొనసాగించాల్సిన బాధ్యతను విస్మరించి, ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
దుర్గమ్మ భక్తుల తలనీలాలకు రికార్డు ధర
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సమర్పించిన తలనీలాలకు రికార్డు ధర పలికాయి. ఏడాదికి రూ. 10.10 కోట్లకు తణుకుకు చెందిన ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ టెండర్ను దక్కించుకుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో సోమవారం టెండర్ ప్రక్రియను నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పాటు ఏపీకి చెందిన మొత్తం 19 మంది కాంట్రాక్టర్లు ఒక్కొక్కరూ రూ.50 లక్షల ప్రథమ దరావత్తుగా చెల్లించి వేలంలో పాల్గొన్నారు. రెండేళ్ల కాల పరిమితికి దేవస్థానం టెండర్లు ఆహ్వానించగా, కాంట్రాక్టర్ మొదటి ఏడాది మొత్తంపై 10 శాతం పెంపుతో రెండో ఏడాది టెండర్ కొనసాగింపు జరుగుతుందని టెండర్ నిబంధనల్లో పొందుపరిచారు. గతంలో రూ. 8 కోట్ల పైబడి పలికిన టెండర్ రెండేళ్ల హెయిర్కు డిమాండ్ లేకపోవడంతో కేవలం రూ. 6.30 కోట్లకు కాంట్రాక్టర్కు దేవస్థానం అప్పగించింది. ఈ ఏడాది మళ్లీ హెయిర్కు డిమాండ్ రావడంతో అధిక ధర పలకడం గమనార్హం. మూడు విధానాల్లో.. బహిరంగ వేలం, సీల్డ్ టెండర్, ఈ టెండర్ వంటి మూడు విధానాల ద్వారా దేవస్థానం టెండర్లు ఆహ్వానించారు. మూడు రాష్ట్రాలకు చెందిన మొత్తం 19 మంది టెండర్లు దాఖలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 6.30 కోట్లు పలికిన టెండర్కు 2026 జనవరితో కాంట్రాక్ట్ ముగుస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి తలనీలాలు పొగు చేసుకునేలా నిర్ణయించిన ఆలయ అధికారులు పాటను రూ. 7 కోట్లుగా నిర్ణయించి బహిరంగ వేలం ప్రారంభించారు. మదర్ హ్యూమన్ హెయిర్ ఇండస్ట్రీస్, ఇండియన్ హెయిర్ ఇండ్రస్టీస్ టెండర్ను దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. చివరకు ఇండియన్ హెయిర్ ఇండ్రస్టీస్ రూ. 10.10 కోట్లకు బహిరంగ వేలం ద్వారా టెండర్ను దక్కించుకుంది. సీల్డ్ టెండర్లో నలుగురు కాంట్రాక్టర్లుసీల్డ్ టెండర్లో నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా, అందులో అత్యధికంగా రూ. 9.57 కోట్లకు కోట్ చేశారు. ఆన్లైన్లో ఈ టెండర్ ద్వారా రూ. 9.09 కోట్లకు టెండర్ దాఖలు చేయడంతో బహిరంగ వేలం ద్వారా అత్యధిక ధర పలకడంతో ఆ టెండర్ను ఆమోదిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియను ఈవో శీనానాయక్, ఎసీ రంగారావు, ఏఈవోలు చంద్రశేఖర్, ఎన్.రమేష్బాబు, సూపరింటెం డెంట్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. కమిషనర్ అనుమతి అనంతరం టెండరు ఖరారు చేస్తారని అధికారులు పేర్కొన్నారు. -
ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అందుతున్న ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రతి అర్జీని లోతుగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించి, తీసుకున్న చర్యల వివరాలను అర్జీదారులకు సరైనవిధంగా తెలియజేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో నిలిపేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలు, తాగునీరు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రెవెన్యూ సేవలతో పాటు ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరు, ఉపాధి, పెన్షన్ మంజూరు తదితరాలకు సంబంధించి మొత్తం 202 అర్జీలు స్వీకరించామన్నారు. వీటిలో రెవెన్యూకు సంబంధించి 49, పురపాలక పట్టణాభివృద్ధికి 40, వైద్య,ఆరోగ్యానికి 23, డీఆర్డీఏకు సంబంధించి 15, పోలీసు శాఖకు12, విద్యుత్ శాఖకు 9 అర్జీలు, మిగిలినవి వివిధ శాఖలకు సంబంధించి అర్జీలు అందాయన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నాంచారరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో యూరియా అక్రమ రవాణా, నిల్వలు, పక్కదారి మళ్లింపులను అరికట్టేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నామని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందని కలెక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. జిల్లాలో యూరియా పంపిణీ ప్రణాళిక, పక్కదారి పట్టకుండా తీసుకుంటున్న చర్యలు, రైతులకు నాణ్యమైన సేవలు అందించడంపై కలెక్టర్ సోమవారం ఆర్డీవోలు, వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లైసెన్స్ రద్దు.. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో అక్టోబర్ నుంచి మొత్తం 17,707 టన్నుల యూరియా విక్రయాలు జరిగాయన్నారు. వచ్చే మూడు రోజులకు 339 టన్నుల యూరియా అవసరం కాగా.. ప్రస్తుతం 5,236 టన్నుల యూరియా కోఆపరేటివ్ సొసైటీల్లో, మార్క్ఫెడ్ గోదాముల్లో, రిటైల్/హోల్సేల్ తదితరాల చోట్ల అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, రైతులు ఎరువులను కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా డీలరు నుంచి రసీదు పొందాలని సూచించారు. డీలర్లు నిబంధనలు ఉల్లంఘించినా, కృత్రిమ కొరత సృష్టించినా, పక్కదారి పట్టించినా, ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయించినా వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ ఎన్జీఓ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నూతన సంవత్సరంలో స్వర్ణాంధ్ర సాధన దిశగా పనిచేద్దామని తనను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు అన్నారని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. సోమవారం ఏపీ ఎన్జీఓ, ఏపీ జేఏసీ నేతలు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్జీఓ సంఘ క్యాలెండర్ను, డైరీ 2026ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. సీఎంను కలిసిన వారిలో ఏపీ ఎన్జీఓ సంఘం జనరల్ సెక్రటరీ డీవీ రమణ, ఏపీ యూటీఎఫ్ ప్రెసిడెంట్ నక్కా వెంకటేశ్వర్లు, ఏపీ ఎస్టీయూ ప్రెసిడెంట్ ఎం.రఘునాథరెడ్డి, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (257) ప్రెసిడెంట్ జి.హృదయరాజు, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (1938) ప్రెసిడెంట్ మంజుల, ఏపీపీటీడీ (ఎన్ఎంయూ అసోసియేషన్) ప్రెసిడెంట్ వై.శ్రీనివాస్, ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి.వెంకటేశ్వర్లు, ఏపీ సీపీఎస్ ప్రెసిడెంట్ సతీష్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం ప్రెసిడెంట్ జానీ పాషా తదితరులు ఉన్నారు. -
నవలంకలో సందడి
నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ ఎదుట నది మధ్యలో తారసపడే చిరుదీవి ‘నవలంక’. ఇక్కడ ఇసుక తెన్నెలపై తరచూ సందర్శకులు సందడి చేస్తున్నారు. నది మధ్య ప్రకృతి పరచిన సహజ సైకత పరదాల అందాలు ఆకట్టుకోవడంతో చల్లపల్లికి చెందిన వాకర్స్ ఆదివారం రాత్రి ఆటపాటలు, క్యాంప్ ఫైర్ నృత్యాలతో ఎంజాయ్ చేశారు. చల్లపల్లి వాకర్స్ ఇసుకలో తొలుత ఇక్కడి నుంచి సూర్యాస్తమయ దృశ్యాలను ఆస్వాదిస్తూ తర్వాత బీచ్ బాల్, టగ్ ఆఫ్ వార్, ట్రాక్ సాంగ్స్ అంత్యాక్షరి లాంటి క్రీడలు నిర్వహించారు. వయసు, హోదా పక్కనపెట్టి డాక్టర్లు, టీచర్లు, వ్యాపారులు, ఉద్యోగులతో కూడిన వాకర్స్ బృందం సభ్యులు క్యాంప్ఫైర్ చుట్టూ ఆట పాటలతో చేసిన నృత్యాలు అలరించాయి. దివిసీమ ప్రాంత వాసులకు నవలంక సేద తీర్చే విడిదిగా మారడంతో సాయంత్రానికి శ్రీరామపాదక్షేత్రం ఘాట్, నవలంక సందర్శనకు ఉత్సాహంగా వస్తున్నారు. సంక్రాంతి సెలవులకు సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో నావల ప్రయాణంలో రక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. –నాగాయలంక -
రాష్ట్ర క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సాహకాలను అందిస్తున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చెప్పారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల రీజనల్ స్పోర్ట్స్ మీట్ సోమవారం ప్రారంభమైంది. వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, త్రిపుల్ జంప్, షార్ట్పుట్, డిస్కస్త్రో, జావెలెన్త్రో అంశాల్లో పోటీలు జరిగాయి. పోటీల ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అతిథులుగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి, బెలూన్లు, పావురాలను ఎగుర వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ నగరంలో జరిగిన 87వ నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో నగరానికి చెందిన టి.సూర్య చరిష్మ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి నగరానికి పేరు తేవడమే కాకుండా ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జీవీ రామచంద్రరావు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారథి తదితరులు పాల్గొన్నారు. విజేతల వివరాలు.. -
ఈ–ఆటోలతో చెత్త సేకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామాల్లో చెత్త సేకరణకు వివిధ రంగుల చెత్త బుట్టలతో ఈ–ఆటోలు, తోపుడు బండ్లను ఏర్పాటు చేశామని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం జిల్లా పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యాన చెత్తసేకరణ కోసం ఈ–ఆటోలు, తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయన ఈ–ఆటోలను నడిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ఇందుకోసం జిల్లాలో ఎనిమిది ఈ–ఆటోలు, 171 తోపుడు బండ్లను గ్రామాలకు అందజేశామన్నారు. ఆటోలు, తోపుడుబండ్లలో వేర్వేరు రంగులతో చెత్తబుట్టలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో జె.అరుణ, డీఎల్పీవో రహ్మతుల్లా, ఏవో సీతారామయ్య, పలువురు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గ్రీన్ క్లైమెట్ ఫండ్ వినియోగించుకుని మత్స్యసంపదను పెంపొందించే దిశగా ప్రత్యేక దృష్టిసారించి మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో గ్రీన్ క్లైమెట్ ఫండ్ వినియోగంపై సంబంధిత అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నిధులతో పీతలు, సముద్రనాచు, అలంకార చేపల పెంపకం యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉందని, అధిక ఆదాయం పొందే విధంగా మత్స్యకారులకు అవగాహన కల్పించాలన్నారు. పీతల పెంపకంపై దృష్టి.. జిల్లాలో 27 పీతల పెంపకం యూనిట్లు ప్రారంభించాల్సి ఉంది. ఒక్కొక్క యూనిట్కు రూ. 19,400 అవుతుందని, 64 మంది లబ్ధిదారులను గుర్తించామని కలెక్టర్ చెప్పారు. పీతల పిల్లల కోసం ఆర్జీసీఐకు ఇండెంట్ పెట్టాలన్నారు. రానున్న ఫిబ్రవరి రెండో వారంలో యూనిట్లు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కేటాయించిన రూ. 9 లక్షలకు సంబంధించి వినియోగ ధ్రువీకరణ పత్రం సిద్ధం చేసి పంపాలన్నారు. జిల్లాలో 25 సముద్రనాచు పెంపకం యూనిట్ల కోసం 80మంది సిద్ధంగా ఉన్నారని ఒక్కొక్క యూనిట్ విలువ రూ. 11,660 అని వీటికి జనవరి మొదటి వారంలో చెల్లింపులు చేయాలన్నారు. అలంకార చేపల యూనిట్ విలువ రూ. 45,948 కాగా 10 మంది కృత్తివెన్ను మండలంలో లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు. జనవరి మొదటి వారంలో యూనిట్లు మొదలయ్యేలా చొరవ చూపాలన్నారు. వచ్చే సంవత్సరం మరో 500 పీతల పిల్లల పెంపకం యూనిట్లు నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 4వ తేదీన మత్స్యకారులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, మత్స్యశాఖ జేడీ ఎ. నాగరాజు, డీఎఫ్వో సునీత, గ్రీన్ క్లైమెట్ ఫండ్ ప్రాజెక్టు మేనేజర్ ఉష, ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ముగిసిన బాలోత్సవ్ సంబరాలు
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని విజయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మహిళా కళాశాలలో గత రెండు రోజుల నుంచి విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బాలోత్సవ్ సంబరాలు ఆదివారం ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిశాయి. కార్యక్రమంలో ఉభయ జిల్లాలలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమలోని ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. కల్చరల్, అకడమిక్ విభాగాల్లో విద్యార్థులను కేటగిరీలుగా విభజించి పోటీలు నిర్వహించారు. కల్చరల్లో క్లాసికల్, ఫోక్ డ్యాన్స్, కోలాటం, ఏకపాత్రాభినయం ప్రదర్శనలతో అదరగొట్టారు. అకడమిక్ ఈవెంట్లో చదువుకు దోహదపడే పలు ఆటలతో పాటు బంక మట్టితో బొమ్మల తయారీ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవుడి బొమ్మలు, జంతువులు, ప్రకృతి ప్రాధాన్యతను వివరిస్తూ మట్టితో మలిచిన కళాకృతులు విశేషంగా ఆకట్టుకున్నాయి. సృజనాత్మకతకు పదును పెట్టాలి విద్యార్థులు తమలో దాగిఉన్న సృజనాత్మకతకు పదును పెట్టినప్పుడే తమలో ప్రతిభ గురించి నలుగురికి తెలుస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు విద్యతో పాటు తమలో దాగి ఉన్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. అనంతరం పలు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వీసీఎస్టీఏ అధ్యక్షుడు ముదిగొండ శ్రీహరిరావు, కార్యదర్శి భీమిశెట్టి గణేష్ బాబు, కోశాధికారి పుప్పాల శ్రీనివాసరావు, కో చైర్మన్ అనుమాటి చెన్నయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
యనమలకుదురు వృషభాలకు మొదటి బహుమతి
పెనమలూరు: యనమలకుదురు గ్రామానికి చెందిన శ్రీఅనంతనేని కావ్య, శ్రీమధులకు చెందిన వృషభాలు బండలాగుడు పోటీలో ప్రథమ బహుమతి గెలిచాయి. నరసరావుపేటలో శనివారం జరిగిన జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి వృషభ రాజముల బండలాగుడు పోటీలో యనమలకుదురుకు చెందిన వృషభాలు ఆరు పళ్ల విభాగంలో 3765 అడుగులు బండలాగి ప్రథమస్థానం పొందాయి. మరో జత 3059 అడుగులు బండ లాగి నాల్గవ స్థానం వచ్చాయి. ఈ పోటీలో 12 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ మేరకు బహుమతి యజమాని అనంతనేని అజాద్ తీసుకున్నారు. నేడు షాబుఖారి దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభం కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 429వ ఉరుసు మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు దర్గా ప్రాంగణం శుద్ధి చేశారు. దర్గాతో పాటు బీ కాలనీ సెంటర్ నుంచి దర్గా వరకు విద్యుద్దీపాలంకరణ చేశారు. సోమవారం రాత్రి గుసుల్ ఉత్సవం, మంగళవారం గంధం మహోత్సవం, బుధవారం దీపారాధన వైభవంగా జరుపుతారు. గంధం ఊరేగింపు ఉత్సవాలకు హైలెట్గా నిలవనుంది. ఈ సందర్భంగా ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ రజా మాట్లాడుతూ ఉరుసు ఉత్సవాల్లో మూడు రోజుల పాటు కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొని బాబా వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఉత్సవాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కృష్ణానదిలో పడి వృద్ధుడు దుర్మరణం కంచికచర్ల: కూలి పని కోసం వెళ్లిన ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన మాలాజీ నందియ్య(70) పొలం పని కోసం ఇంటి నుంచి వెళ్లగా ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని కృష్ణానదిలో పడిపోయాడని తెలిపారు. గమనించిన స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడని చెప్పారు. మృతునికి ముగ్గురు సంతానం ఉన్నారు. నందియ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు సురేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. టిప్పర్ లారీ ఢీకొని వృద్ధురాలు దుర్మరణం కొండపల్లి(ఇబ్రహీంపట్నం): టిప్పర్ లారీ ఢీకొని వృద్ధురాలు దుర్మరణం చెందిన ఘటన కొండపల్లి ఖిల్లా రోడ్డులో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొండపల్లి ఖిల్లా రోడ్డుకు చెందిన కంపా సలోమి (66)వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. కొండపల్లికి చెందిన ఓ స్టోన్ క్రషర్ లారీ గ్రావెల్తో వెళుతూ నడుచుకుంటూ వెళ్తున్న సలోమిని ఢీకొట్టింది. ఆమె కిందపడిపోగా లారీ డ్రైవర్ గమనించకుండా వృద్ధురాలి మీదుగా లారీని పోనిచ్చి ఆగకుండా వెళ్లిపోయాడు. సమీపంలో వాహనదారులు వెంబడించి లారీ డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సలోమికి గతంలోనే భర్త మృతి చెందగా, కుమారుడి వద్ద ఉంటోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్, లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యభిచారం కేసులో మహిళ అరెస్ట్ గుణదల(విజయవాడ తూర్పు): పలువురు యువతుల సహకారంతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను మాచవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాచవరం శాంతినగర్కు చెందిన వేముల రమణమ్మ తాను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. నివాసాల మధ్య అసభ్యకరంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా ఏర్పాటు చేసిన మాచవరం పోలీసులు దాడులు నిర్వహించగా ముగ్గురు యువతులతో పాటు బి.రాజు అనే విటుడు ఉన్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు రమణమ్మను అరెస్ట్ చేశారు. -
త్రిముఖ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
పటమట(విజయవాడతూర్పు): త్రిముఖ ట్రైలర్కు పాన్ ఇండియా వ్యాప్తంగా విశేష ఆదరణ వచ్చిందని మూవీ యూనిట్ పేర్కొంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆదివారం చిత్ర యూనిట్ విజయవాడ విచ్చేసింది. ఈ సందర్భంగా విజయవాడ బందర్ రోడ్డులోని ఓ హోటల్లో మూవీ యూనిట్ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. త్రిముఖ మూవీ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా అందరినీ ఆకట్టుకుంటుందని ప్రొడ్యూసర్ మద్దాలి సత్య శ్రీదేవి అన్నారు. ఈ సినిమాలో ఏసీపీ శ్రీవాణి పాత్రలో సన్నీలియోన్ నటన విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. చిత్ర దర్శకుడు రాజేశ్వర్ మాట్లాడుతూ తన తొలి చిత్రం కావడంతో అందరూ నచ్చే కథాంశంతో తీశానని, చిత్రంలో అందరూ కొత్త వారు అయినప్పటికీ నటనలో విశేష ప్రతిభ కనబరిచారని చెప్పారు. హీరో యోగేష్ మాట్లాడుతూ త్రిముఖ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు. జెమినీ సురేష్ మాట్లాడుతూ సినిమాని అందరూ ఆదరించాలని కోరారు. అకిరా డ్రిమ్ క్రియేషన్స్లో యోగేష్ హీరోగా, ఆకృతి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం జనవరి 2న విడుదల అవుతోందని తెలిపారు. పిచ్చికుక్క స్వైరవిహారం తొమ్మిది మందికి గాయాలు చల్లపల్లి: పిచ్చికుక్క స్వైరవిహారం చేయటంతో పలువురు గాయాలపాలైన ఘటన మండల పరిధిలోని లక్ష్మీపురం, చింతలమడ గ్రామాల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఒక పిచ్చికుక్క శనివారం నుంచి లక్ష్మీపురం, చింతలమడ గ్రామాల్లో సంచరిస్తూ కనిపించినవారినల్లా కరిచి గాయపరిచింది. శనివారం ఐదుగురిని కరవగా ఆదివారం మరో నలుగురిని కరిచింది. దీంతో మొత్తం పిచ్చికుక్క కాట్లకు గురైన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. విజయవాడకు చెందిన అంకినీడు ప్రసాద్ చుట్టపుచూపుగా లక్ష్మీపురం రాగా ఆదివారం అతనిని, లక్ష్మీపురం గ్రామానికి చెందిన జయంపాటి శ్రీదేవిని, చింతలమడకు చెందిన సుదాని విష్ణుమూర్తితో పాటు మరొకరిని కరిచింది. వీరమాచినేని అంకినీడు ప్రసాద్ కాలుకు తీవ్రగాయం కాగా తొలుత చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆదివారం అక్కడ సివిల్ సర్జన్ లేకపోవటంతో విజయవాడ వెళ్లిపోయాడు. జయంపాటి శ్రీదేవి, సుదాని విష్ణుమూర్తి ప్రస్తుతం చల్లపల్లి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కేబీఎన్ సేవలు అపూర్వం వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యాభివృద్ధికి కేబీఎన్ కళాశాల గడిచిన 60 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలు అపూర్వమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కేబీఎన్ కళాశాల పూర్వవిద్యార్థుల సమ్మేళనం (కోసా) ఆదివారం ఆ కళాశాల ప్రాంగణంలో అత్యంత వేడుకగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శివనాథ్ మాట్లాడుతూ చంద్రయాన్ ప్రయోగంలో కీలకమైన విడిభాగాలు తయారుచేసిన బీఎన్రెడ్డి వంటి ప్రముఖుల ద్వారా కాలేజీ కీర్తి ఖండాంతరాలు దాటి వ్యాపించిందన్నారు. మరో మూడు నెలల్లో కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోతిన మహేష్ మాట్లాడుతూ కేబీఎన్ కళాశాలలో తాను ఎనిమిదేళ్లు అధ్యాపకునిగా పని చేశానన్నారు. టాలీవుడ్ నటుడు, కాలేజీ పూర్వవిద్యార్థి సుహాస్ మాట్లాడుతూ కేబీఎన్ కాలేజీ నేర్పించిన క్రమశిక్షణ, చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే సినీ రంగంలో తాను నిలదొక్కుకోవటం సాధ్యమైందన్నారు. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జేఎసీఎస్రావు, మాజీ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి, హిందూ హైస్కూల్స్ కమిటీ జనరల్ సెక్రటరీ గోపిశెట్టి మల్లయ్య తదితరులు మాట్లాడారు. కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు ఉసిరిక ఉమామహేశ్వరరావు, తూనికుంట్ల శ్రీనివాసు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి ఏవో డాక్టర్ వి.నారాయణరావు ఉపాధ్యక్షుడు చిట్టూరి నాగేంద్ర, పూర్వ విద్యార్థి ప్రముఖులు రమేష్ బాబు (సీఈఓ, సి ఛానెల్), డాక్టర్ ఆర్కే అయోధ్య (ప్రముఖ సైకాలజిస్ట్), నందిపాటి శ్రీనివాసరావు (ప్రముఖ న్యాయవాది) తదితరులు పాల్గొన్నారు. -
ఊబకాయం
ఆయుష్షును హరించే ఇతర వ్యాధులివే... ● ఒబెసిటీ ఉన్న వారిలో రక్తపోటు, మధుమేహం వలన వచ్చే దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ● ఒబెసిటీ ఉన్న వారిలో పది శాతం మందిలో గాల్బ్లాడర్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ● ఫ్యాటీ లివర్ ఏర్పడి, దీర్ఘకాలంలో తీవ్రమైన లివర్ సమస్యలు తలెత్తుతున్నాయి. ● మోకీళ్లపై ప్రభావం చూపి, నాలుగు పదుల వయస్సులోనే మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తుంది. లబ్బీపేట(విజయవాడతూర్పు): ● పటమటకు చెందిన వెంకట్ వయస్సు 35 సంవత్సరాలు. ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం లేకపోవడంతో బరువు 97 కేజీలకు చేరాడు. ఇటీవల నీరసంగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకుంటే మధుమేహం ఉన్నట్లు తేలింది. ఒబెసిటీ కారణంగానే మధుమేహం సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ● వన్టౌన్కు చెందిన శ్రావణి వయస్సు 27 సంవత్సరాలు. ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. వివాహమై మూడేళ్లు అవుతున్నా పిల్లలు లేక పోవడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. ఒబెసిటీ కారణంగా ఓవరీస్లో బుడగలు వచ్చినట్లు చెప్పారు. అంతేకాకుండా హైపోథైరాయిడ్కు గురైంది. ఇలా అనేక మంది ఒబెసిటీ కారణంగా మధుమేహం, రక్తపోటులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు గుండె జబ్బులు, థైరాయిడ్ , కిడ్నీ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. అందుకు కదలిక లేని జీవన విధానం. ఆహారపు అలవాట్లలో మార్పులతో నేడు చిన్నారుల నుంచి పెద్దవారి వరకూ ఊబకాయులుగా మారుతున్నారు. ఇలాంటి వారిలో కొన్నాళ్ల తర్వాత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. గుండె జబ్బులతో పాటు, కిడ్నీ సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్, కీళ్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల అనేక దుష్ఫలితాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. జాతీయ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న నాన్ కమ్యూనికల్ డిసీజెస్(ఎన్సీడీ) సర్వేలో సైతం ఒబెసిటీ కారణంగా రక్తపోటు, మధుమేహం వంటివి సోకుతున్నాయంటున్నారు. ఉమ్మడి కృష్ణాలో దాదాపు 10 లక్షల మంది అధిక బరువుతో ఉన్నట్లు అంచనాకు వచ్చారు. పెరుగుతున్న గుండె జబ్బులు గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో ఊబకాయులు ఎక్కువగా ఉంటున్నారు. గుండె జబ్బులతో ఆస్పత్రులకు వచ్చే వారిలో వారిలో 20 శాతం మందికి ఒబెసిటీ కారణంగా ఉంటుంది. అలాంటి వారిలో గుండె రక్తనాళాలు సన్నబడి బ్లాక్స్ ఏర్పడటం, గుండైపె ఎఫెక్ట్తో దెబ్బతినడం, పల్మనరీ ఎంబోలిజమ్, పల్మనరీ హైపర్ టెన్షన్ వంటి సమస్యలను వైద్యులు గుర్తిస్తున్నారు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్న వారికి యాంజియోప్లాస్టీ నిర్వహించి బ్లాక్స్ను తొలగించి స్టెంట్లు వేస్తున్నారు. గుండె నరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. కిడ్నీ సమస్యలు ఒబెసిటీ కారణంగా కిడ్నీలపై వత్తిడి పడుతుంది. ఆ కారణంగా ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. దీంతో యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవుతాయని వైద్యులు చెపుతున్నారు. కాళ్ల వాపులు రావడం, కిడ్నీలు పూర్తిగా పాడైన వారిని కూడా చూస్తున్నారు. ఊబకాయుల్లో వచ్చే మధుమేహం, రక్తపోటు కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న వారు ప్రభుత్వాస్పత్రికి డయాలసిస్ కోసం వస్తున్నారు. నిత్యం 50 నుంచి 60 మంది డయాలసిస్ చేయించుకుంటుండగా, వారిలో సగం మంది ఒబెసిటీ కారణంగా తలెత్తిన దుష్ఫలితాల ప్రభావంగా కిడ్నీలు పాడైన వారు ఉంటున్నారు. నియంత్రణ ఇలా... మనదేశంలో బాడీ మాస్ ఇండెక్స్ 23.5 దాటిన వారందరినీ ఒబెసిటీగా భావిస్తారు. ఇలాంటి వారు బరువు తగ్గేందుకు శ్రమగల జీవన విధానం, సమతుల్య ఆహారం తీసుకుంటే సత్ఫలితాలు రాబట్టవచ్చు. బరువు తగ్గేందుకు లాంగ్టర్మ్, షార్ట్ టర్మ్ రెండు విధానాలు ఉన్నాయి. లాంగ్టర్మ్లో వారానికి మూడు, నాలుగు గంటలు వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. షార్ట్ టర్మ్లో రోజుకు వెయ్యి క్యాలరీల కంటే తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. బీఎంఐ 27 శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి మందులు అందుబాటులోకి వచ్చాయి. అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు శరీర బరువు అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యదాయకం మధుమేహం, రక్తపోటుకు ప్రధాన కారణం గుండెపోటుకు దారి తీస్తున్న వైనం వత్తిడికి లోనై దెబ్బతింటున్న కిడ్నీ ఫిల్టర్లు వ్యాయామం, ఆహార నియమాలు తప్పనిసరి అంటున్న వైద్యులు జాతీయ ఎన్సీడీ–సీడీ సర్వేలో ఒబెసిటీతో వ్యాధులకు గురవుతున్నట్లు గుర్తిస్తున్న వైనం రెగ్యులర్ చెకప్ అవసరం ఒబెసిటీ ఉన్న వారు రెగ్యులర్గా బీపీ, షుగర్, కొలస్ట్రాల్ పరీక్షలతో పాటు, థైరాయిడ్ పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఒబెసిటీని అధిగమించేందుకు ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయాలి. ఊబకాయులకు గుండెపోటు, బ్రెయిన్స్ట్రోక్లతో పాటు, మెటబాలిజం దెబ్బతింటుంది. అదుపులో లేని మధుమేహం, రక్తపోటు సమస్యలకు దారితీస్తుంది. జంక్ఫుడ్కు దూరంగా ఉండాలి. పిజ్జాలు, బర్గర్లు, ఐస్క్రీమ్లు తినకుండా ఉండటం ఉత్తమం. – డాక్టర్ టీవీ మురళీకృష్ణ, జనరల్ మెడిసిన్ నిపుణుడు(ఫిజీషియన్), విజయవాడ -
న్యూ ఇయర్ వేడుకలు ఆహ్లాదంగా జరుపుకోండి
● ఆరోగ్యంగా, హాని రహితంగా చేసుకోవాలి ● ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర్ బాబు లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31వ తేదీ రాత్రి నిర్వహించుకునే వేడుకలకు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంక్షలు విధించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సహకరిస్తూ, వేడుకలను ఆహ్లాదంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పలు సూచనలు అర్ధరాత్రి రోడ్డు మీద వేడుకలకు అనుమతులు లేవని, అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడపవద్దని సీపీ హెచ్చరించారు. ట్రిపుల్ రైడింగ్పై్ కఠిన చర్యలు ఉంటాయని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లు (కొత్త, పాత) , కనక దుర్గా ఫ్లైఓవర్ లపై ట్రాఫిక్ను నిలిపివేస్తామన్నారు. గుంపులు గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రివేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరగవద్దని, హద్దు మీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీపీ హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసివేసి అధిక శబ్దాలతో హోరెత్తించడం, అతి వేగంతో రోడ్లపై తిరగటం, వాహనాలు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించడం, బాణసంచా పేల్చడం వంటి వాటివలన ప్రశాంతతకు భంగం కలిగి వృద్ధులకు, చిన్న పిల్లలకు, రోగులకు ఇబ్బంది కలుగుతుందని, అలాంటి వాటికి పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాలకు లోనుకాకుండా, ఇతరులను గురిచేయకుండా సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. -
మాజీ ఎంపీ కంభంపాటిని పరామర్శించిన సీఎం
గన్నవరం: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లిలో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్రావు నివాసానికి ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విచ్చేశారు. ఇటీవల మాతృమూర్తి వెంకట నరసమ్మను కోల్పోయిన కంభంపాటిని, ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించి, సానుభూతి తెలిపారు. తొలుత వెంకట నరసమ్మ చిత్రపటానికి చంద్రబాబునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్కుమార్, అదనపు ఎస్పీ సత్యనారాయణ, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రమణ్యం, ప్రత్యేక భద్రతాధికారి శాంతకుమారు తదితరులు పాల్గొన్నారు. -
గన్నవరం వెటర్నరీ కాలేజీలో ర్యాగింగ్!
సాక్షిప్రతినిధి, విజయవాడ: గన్నవరం వెటర్నరీ కళాశాలలో ర్యాగింగ్ శ్రుతిమించింది. కొత్త బ్యాచ్ (బీవీఎస్సీ) విద్యార్థులు నిద్ర లేని రాత్రుళ్లు గడపాల్సి వస్తోంది. పరిచయం పేరుతో సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడుతుండటంతో జూనియర్లు హడలిపోతున్నారు. తల్లిదండ్రులకు చాటుగా ఫోన్ చేసి కష్టం చెప్పుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిర్యాదు చేస్తే ఎక్కువ వేధింపులు తప్పవని సీనియర్లు హెచ్చ రిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఉన్నత విద్యలో ర్యాగింగ్ను నివారించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఆచరణలో ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు, వార్డెన్లు దృష్టి పెట్టకపోవడంతో కొత్త విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ధైర్యం చేసి ఎవరైనా ఫిర్యాదు చేసినా, వార ఎవరో సీనియర్లకు తెలిసిపోతోందని బాధితులు వాపోతున్నారు. కొంత మంది ప్రొఫెసర్లు, సిబ్బందికి తెలిసినా ఇదంతా మామూలేనని, పట్టించుకోవద్దంటూ జూనియర్లకు సూచిస్తూ సీనియర్లకే వత్తాసు పలుకుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రుళ్లు సీనియర్లు హాస్టల్ గదుల్లోకి వచ్చి, చిత్ర విచిత్ర పనులు చేయమంటున్నారని, ఒప్పుకోకపోతే బూతులు తిడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. అమ్మాయిలు సైతం ర్యాగింగ్ దెబ్బకు కన్నీటి పర్యంతమవుతున్నారు. బాగా చదువుకుందామని వస్తే ఇదేం అన్యాయం అని వాపోతున్నారు. ఇక్కడ జరిగేది ఎవరికై నా చెబితే.. ఈ కాలేజీలో ఎలా చదువుతారో చూస్తామని సీనియర్లు హెచ్చరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో ర్యాగింగ్ నివారణ చర్యలు అనేవి కేవలం కాగితాలకే పరిమితం అయిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసినా సీనియర్లను కనీసం పిలిచి హెచ్చరించలేదని ఓ విద్యార్థి తండ్రి వాపోయాడు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. -
ఉత్కంఠగా సాగిన సెమీ ఫైనల్ పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని చెన్నుపాటి రామకోటయ్య మునిసిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన తమిరి సూర్య చరిష్మ 21–18, 18–21, 21–9 స్కోర్తో తెలంగాణకు చెందిన రక్షితశ్రీపై విజయం సాధించింది. ఉమెన్స్ సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో సెమీ ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఆదివారం ఫైనల్స్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయి. అనంతరం జరిగే ముగింపు సభలో విజేతలకు బహుమతులను అందజేస్తారు. సెమీ ఫైనల్స్ పోటీలను సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సంజయ్ మిశ్రా తిలకించారు. -
వనజా చంద్రశేఖర్కు నృత్య తపస్వి పురస్కారం
గన్నవరంరూరల్: విజయలలిత కూచిపూడి నృత్య అకాడమీ(గన్నవరం) నాట్య గురువు వనజా చంద్రశేఖర్ ప్రతిష్టాత్మక నృత్య తపస్వి పురస్కారం అందుకున్నారు. శుక్రవారం రాత్రి ఏలూరు అభినయ నృత్య భారతి 30వ వార్షికోత్సవంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రఖ్యాత నాట్యాచారుడు కోరాడ నరసింహారావు స్మారక–2025 అవార్డు నృత్య తపస్విని ఆమెకు అందించారు. కానాల గురుమూర్తి కళావేదికపై ముఖ్య అతిథులు ఆలపాటి నాగేశ్వరరావు, బి.వి.రమణమూర్తి, డాక్టర్ ఎం.ఎస్.చౌదరి, కమ్ములు ఆదినారాయణ, పిలగల కొండలరావు, చిర్లపల్లి రామ్మోహనరావు, డాక్టర్ కె.కృష్ణ చైతన్య స్వామి, కె.వి.సత్యనారాయణ పాల్గొని వనజా చంద్రశేఖర్ సేవలను ప్రశంసించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గన్నవరానికి చెందిన భక్తులు రూ.1.23 లక్షల విరాళం సమర్పించారు. చిట్టి శ్రీరామమూర్తి శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి ఉమామహేశ్వరి పేరిట రూ.1,23,456 విరాళం అందజేశారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. కంకిపాడు: విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఉయ్యూరు డీవైఈఓ పద్మారాణి స్పష్టంచేశారు. ఈడుపుగల్లు నారాయణ విద్యాసంస్థల పాఠశాలలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘటనపై శనివారం శాఖాపరమైన విచారణ సాగించారు. విద్యార్థులపై పాఠశాల హాస్టల్ వార్డెన్ లైంగిక వేధింపులకు పాల్పడటం, అనుచితంగా వ్యవహరించటంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తల్లిదండ్రులు వార్డెన్, ఏఓలకు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై డీవైఈఓ పద్మారాణి విచారణ సాగించారు. ప్రిన్సిపాల్ తిరుమలరావు, విద్యార్థులతో వేర్వేరుగా మాట్లా డారు. వార్డెన్తోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఓలను విధుల నుంచి తొలగించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విచారణలో ఎంఈఓ –1 వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కానూరు సిద్ధార్థ డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ ఆవరణలోని వైవీ రావు సిద్ధార్థ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో శుక్రవారం ప్రారంభమైన జేఎన్టీయూ అంతర్ కళాశాలల సెంట్రల్ జోన్ షటిల్ బ్యాడ్మింటన్ (పురుషులు, మహిళలు) టోర్నీ శనివారం ముగిసింది. జేఎన్టీయూ పరిధిలోని అనుబంధ కళాశాల నుంచి 22 పురుషుల, 11 మహిళల జట్లు ఈ పోటీల్లో తలపడ్డాయి. పురుషుల విభాగంలో అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గుడ్లవల్లేరులోని ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ, కానూరు సిద్ధార్థ కాలేజ్లీ, మహిళల విభాగంలో భీమవరంలోని ఎస్ఆర్కే ఇంజినీరింగ్ కాలేజీ, నరసరావుపేటలోని నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ, నర్సాపూర్లోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ జట్లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సిద్ధార్థ వర్సిటీ వైస్ చాన్స్లర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎ.వి.రత్నప్రసాద్, రిజిస్ట్రార్ ఎం.రవిచంద్, జేఎన్టీయూ కాకినాడ స్పోర్ట్స్ సెక్రటరీ ప్రొఫెసర్ జి.శ్యామ్కుమార్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. -
యువత సేవా భావం అలవరచుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువత సేవాభావం, కలిసి పనిచేసే తత్వాన్ని అలవరచుకోవాలని సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సూచించారు. సిద్ధార్థ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న కళాశాల పూర్వ విద్యార్థుల్లో ఎంపికచేసిన 36 మందిని శనివారం సిద్ధార్థ ఆడిటోరియంలో సత్కరించారు. ముఖ్యఅతిథి జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జీవితంలో విజయం సాధించడం అంటే నగదు ఆర్జించడం ఒక్కటే కాదని, నైతికత కూడా ముఖ్యమని అన్నారు. జీవితంలో డబ్బు అవసరమే కానీ సర్వస్వం కాదనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలన్నారు. ఐదు పదుల ప్రస్థానం ఏ విద్యాసంస్థకై నా మైలురాయేనని, అందుకు పాలకవర్గం అంకితభావం, ఐక్యత ప్రశంశనీయమని సిద్ధార్థ అకాడమీ సభ్యులను అభినందించారు. సిద్ధార్థ పూర్వ విద్యార్థులు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందరావు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ కనకమేడల రవీంద్రకుమార్, సినీ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య, సైంటిస్ట్ డాక్టర్ వి.డి.వి.పద్మజ, చెరుకూరి విజయేశ్వరిదేవి, శామ్సంగ్ (ఆర్అండ్డీ) మేనేజింగ్ డైరెక్టర్ గోలి మోహనరావు, విజయ బ్యాంక్ పూర్వ జీఎం వై.నాగేశ్వరరావు, గీతమ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కొల్లూరు శ్రీకృష్ణ, ఐఐటీ (ముంబాయి) ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులను సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగుల లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలితప్రసాద్ సత్కరించారు. సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.వెంకటేశ్వర్లు, సిద్ధార్థ అకాడమీ సభ్యులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
కిడ్నీ బాధితులకు తప్పని కష్టాలు
నీటి కాలుష్యం, ఇతర కారణాలతో ఎ.కొండూరు మండ లంతో అత్యధికంగా తండాల ప్రజలు కిడ్నీ వ్యాధులు బారిన పడుతున్నారు. వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వం ఎ.కొండూరులోనే డయా లసిస్ కేంద్రం ఏర్పాటు చేసింది. అంతే కాదు వైద్యులు ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంది. ఏడాది కాలంలో అంతంత మాత్రంగా అందుతున్న వైద్య సేవలతో ఆరుగురు కిడ్నీ రోగులు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి సేవలు అందించే ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం నిలిచిపోవడంతో ఆ ప్రభావం ఎక్కువగా కనిపించింది. -
ఉపాధి చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రామాల్లో కూలీల వలసలు నివారించి ఉపాధి కల్పించే లక్ష్యంతో 2005లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాల్సిందేనని వ్యవసాయ కార్మిక, రైతు, కౌలు రైతు సంఘాలు, కార్మిక, పౌర సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీరామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని, పాత చట్టాన్ని యథతథంగా కొన సాగించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు, కౌలు రైతు సంఘాలు, కార్మిక, పౌర సంఘాలు శనివారం చలో లోక్ భవన్ కార్యక్రమం చేపట్టాయి. లెనిన్ సెంటర్ నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లాలని ఆయా సంఘాలు, ఉపాధి కూలీలు సన్నద్ధమవగా, వారు లోక్ భవన్కు వెళ్ల కుండా పోలీసులు భారీగా మోహరించారు. అలంకార్ సెంటర్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తొలుత రైతు సంఘాల నాయకులు, ఉపాధి కూలీలు ధర్నా చౌక్లో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వి. వెంకటేశ్వర్లు, ఆవుల శేఖర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మార్చి 20 కోట్ల మంది గ్రామీణ పేదలకు తీరని ద్రోహం చేస్తోందన్నారు. చట్టాన్ని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే మార్పులు చేసిందని మండిపడ్డారు. కొత్త చట్టం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమన్నారు. ఈ చట్టం వల్ల రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాల వాటా పెంచడ మంటే కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకోవడమేనన్నారు. వీబీ జీరామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం లోక్ భవన్కు బయలుదేరిన రైతు సంఘాలు, ఉపాధి కూలీలను ధర్నా చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా లోక్ భవన్కు వెళ్లడానికి వీల్లేదని, రైతు సంఘాల ప్రతినిధులను పంపు తామని పోలీసులు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం 15 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని లోక్ భవన్కు అనుమతించారు. ప్రతినిధి బృందం లోక్ భవన్లో గవర్నర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్రం దిగివచ్చి కొత్తగా తెచ్చిన చట్టాన్ని రద్దు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జనవరి మొదటి వారంలో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్య దర్శులు కె.ప్రభాకర్రెడ్డి, కె.వి.వి.ప్రసాద్, కోటేశ్వరరావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, సీనియర్ రైతు సంఘం నాయకులు వై. కేశవరావు, మర్రాపు సూర్యనారాయణ, డి.హరినాథ్, వి.శివనాగరాణి, కోట కల్యాణ్, అప్పారావు, పిల్లి రామకృష్ణ, వి.అన్వేష్, పవన్, జమలయ్య తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ను కలిసి వినతి పత్రం అందజేసిన రైతు సంఘాల ప్రతినిధులు -
తిరోగమనం
ప్రభుత్వ వైద్యం.. స్క్రబ్ టైఫస్తో ఆందోళన సుత్సుగమూషి అనే కీటకం కుట్టడం వల్ల సోకే అరుదైన జ్వరం స్క్రబ్ టైఫస్. ఈ జ్వరం పదేళ్లుగా సోకుతున్నప్పటికీ ఈ ఏడాది ప్రజలను భయాందోళనకు గురిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు కావడం, పలువురు మృతి చెందడంతో కొత్తరకం జ్వరంగా ప్రచారం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 20 మంది వరకూ స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారు. ఉయ్యూరు మండలం ముదునూరుకు చెందిన ఒకరు మృతి చెందారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ వ్యాధి ప్రజలను ఆందోళన చెందేలా చేసింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వైరస్ జ్వరాలు విజృంభించాయి. పనిచేయక ప్రభుత్వాస్పత్రిలో పక్కన పడేసిన వెంటిలేటర్లు (ఫైల్)లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైద్య సేవలు 2025వ సంవత్సరంలో తిరోగమనంలో పయనించాయి. ఆరోగ్య కార్యక్రమాలు నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరికరాలు లేక, మందులు అందక అవస్తలు పడ్డారు. మరోవైపు సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులు సైతం విజృంభించాయి. విజయవాడలో నగర పాలక సంస్థ సరఫరా చేసే కలుషిత నీరు తాగి ఈ ఏడాది సెప్టెంబర్లో దాదాపు 300 మందికిపైగా అతిసార బారిన పడటం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో అరుదైన స్క్రబ్ టైఫస్ జ్వరాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. మరోవైపు ఎ.కొండూరు మండలంలోని తండాల్లో కిడ్నీ బాధితుల మరణాలు ఈ ఏడాది కూడా ఆగలేదు. ఇలా 2025వ సంవత్సరం ప్రభుత్వ వైద్యంలో అనేక లోపాలను ఎత్తిచూపింది. బెజవాడను వణికించిన అతిసార ఈ ఏడాది సెప్టెంబర్ పదో తేదీన విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో ప్రజలు అతిసార ప్రబలింది. తొలిరోజు దాదాపు వంద మంది వరకూ అతిసార బారిన పడటంతో అధికారులు ఉలికిపాటుకు గురయ్యారు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్థ సిబ్బంది కాలనీలోకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తొలుత వినాయకచవితి నిమజ్జనంలో కలుషిత ఆహారం తినడంతో అతిసార సోకిందని అధికారులు కొట్టిపారేశారు. అయితే అతిసార కేసులు రోజు రోజుకు పెరిగి పదిరోజులు కొనసాగాయి. దీంతో నగరపాలక సంస్థ కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటిని పరీక్ష చేయించగా ఆ నీటితో పాటు, భూ గర్భ జలాలు సైతం కలుషితమైనట్లు తేలింది. దాదాపు 300 మంది వరకూ అతిసార బారిన పడగా, వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దిగజారిన ప్రభుత్వ సేవలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాల కల్పన తిరోగమనంలో పయనిస్తోంది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం ఉన్న వెంటిలేటర్లు పనిచేయక పోవడంతో వాటిని పక్కడ పడేశారు. కోవిడ్ సమయంలో 200 వరకూ వెంటిలేటర్లను గత ప్రభుత్వం అందించింది. వాటితోనే ఇప్పటి వరకూ నెట్టుకొచ్చారు. అవి పనిచేయక పోవడంతో మూడు నెలల కిందట వాటన్నింటినీ పక్కన పెట్టారు. కొత్త వెంటిలేటర్ల కొనుగోలు చేయాలని నిర్ణయించినా అది కార్యరూపం దాల్చక పోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో సైతం సిబ్బంది, వైద్యుల కొరత, సౌకర్యాల లేమి వంటివి సేవలను దిగ జారేలా చేశాయి. అంతేకాదు ఒక్కొసమయంలో బీపీ మందులు, గ్యాస్ట్రబుల్కు వాడే పాంటాప్ మాత్రలు కూడా ఉండని పరిస్థితి నెలకొంటుంది. మరోవైపు ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు నిలిచిపోవడంతో గ్రామీణ ప్రజలు వైద్య సేవలు మరింత దూరం అయ్యాయి. వివాదాస్పదంగా పీపీపీ అంశంరాష్ట్రంలోని నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడం ఈ ఏడాది వివాదాస్పదంగా మారింది. వైద్య కళాశాలలు ప్రైవేటుకు అప్పగిస్తే పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం, వైద్య విద్య దూరం అవుతుందని పలువురు మేధావులు, సంఘాలు సైతం ఆందోళన వ్యక్తంచేశాయి. వైఎస్సార్ సీపీ ఒక అడుగు ముందకేసి అన్ని వర్గాల ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టింది. ఇలా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో దాదాపు తొమ్మిది లక్షల మంది నుంచి సంతకాలు సేకరించారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన నూతన వైద్య కళాశాలలో చదువుతున్న పిల్లలు, అక్కడ అభివృద్ధి చెందిన ఆస్పత్రినే నిదర్శనంగా చూపుతున్నారు. ఈ ఏడాది గంపలగూడెం మండలం అనుమోలు లంకలో బర్డ్ ఫ్లూ సోకి వేలాది కోళ్లు మరణించాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే మనుషులకు ఎవరికీ ఈ వ్యాధి సోకలేదు. -
జాబ్ క్యాలెండర్ ఎక్కడ బాబూ?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం విజయవాడ లెనిన్ సెంటర్లో యువతీ యువకులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు, లోకేశ్ ఎన్నికలకు ముందు ఏటా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీల నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్న చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే జనవరి 30వ తేదీన చలో సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం’ అని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.యుగంధర్, ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, నాయకులు లంకా గోవిందరాజులు, సాయికుమార్, మాధవి, యువతీ యువకులు పాల్గొన్నారు. -
హరిత గోపాలం.. పాడి రైతులకు వరం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మేత సాగు, మేత నర్సరీల ఏర్పాటుకు హరిత గోపాలం పథకం పాడి రైతుల పాలిట వరమని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) పరిపాలనా భవనంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత చైర్మన్ చలసాని అధ్యక్షతన బోర్డు డైరెక్టర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో చైర్మన్తో పాటు ఎండీ కొల్లి ఈశ్వరబాబు, బోర్డు డైరెక్టర్లు దాసరి బాలవర్ధనరావు, వేమూరి సాయిలతో పాటు ట్రస్ట్ సభ్యులు హాజరయ్యారు. మేత కొరతను పరిష్కరించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద పశుగ్రాసం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చైర్మన్ పేర్కొన్నారు. పథకానికి అవసరమైన పూర్తి విధి విధానాలను రూపొందించిన ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.కృష్ణతేజకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ పథకం వినియోగించుకోవడం ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడంతో పాటు మామిడి, పామ్ ఆయిల్ తోటల్లో అంతర పంటగా సాగు చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలు, కమ్యూనిటీ స్థలాలు, దేవదాయ భూములలో గడ్డి పెంచుకునే వెసులబాటు ఉందని చెప్పారు. -
ఉసురు తీసిన దోమల చక్రం
కృష్ణలంక(విజయవాడతూర్పు): దోమల చక్రం బాలుడి ఉసురు తీసిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాణిగారితోట, తారకరామనగర్కు చెందిన చిప్పల అనిల్కుమార్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతడికి భార్య అరుణకుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఓ కుమారుడు సమర్పణపాల్(9) ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. గత ఆదివారం అనిల్కుమార్, తన కుమారుడు సమర్పణపాల్తో కలిసి ఇంట్లోని ఓ గదిలో నిద్రపోయారు. దోమలు అధికంగా ఉండడంతో తెల్లవారుజామున దోమల చక్రం వెలిగించి మంచం కింద పెట్టుకున్నారు. ప్రమాదవశాత్తు అది దుప్పటికి అంటుకుని మంటల వ్యాపించాయి. ఆ మంటలు దుప్పటి కప్పుకుని నిద్రపోయిన పాల్కు కూడా అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. ఆ పక్కన ఉన్న తండ్రి స్వల్పంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శనివారం సాయంత్రం మృతిచెందాడు. బాలుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
గ్రేటర్ విలీనంతో భవిష్యత్తు ప్రశ్నార్థకం
పెనమలూరు: గ్రేటర్ విలీనంతో తాడిగడప మున్సిపాలిటీతో పాటు పెనమలూరు, కంకిపాడు మండలాల్లో గ్రామ పంచాయతీల భవిష్యత్తు ప్రశ్నార్థకం మారింది. తాడిగడప మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగక పోగా తాజాగా విలీనం చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. పలు గ్రామ పంచాయతీల్లో శనివారం అత్యవసర సమావేశాలు నిర్వహించి, గ్రేటర్ వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. గ్రేటర్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం శనివారం తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ భవిష్యత్తులో కొనసాగించే అవకాశం ఉండటంతో ఆందోళన నెలకొంది. మున్సిపాలిటీ ఉంటుందా.. లేదా..? 2020లో యనమలకుదురు, కానూరు, తాడిగడప, పోరంకిలోని గ్రామాలతో తాడిగడప మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ జనాభా 2.30 లక్షల మంది ఉండగా డివిజన్లు 38 ఉన్నాయి. పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకు వ్యవహారం బాగానే ఉన్నా తాడిగడప మున్సిపాలిటీని గ్రేటర్లో కలపాలా వద్దా అనే విషయం అనేక విమర్శలకు తావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోకి పెనమలూరు ప్రాంతాన్ని విలీనం చేయటంపై స్థానికులు ఆహ్వానిస్తున్నారు. అయితే తాడిగడప మున్సిపాలిటీతో పాటు పెనమలూరు మండలంలోని ఆరు గ్రామాలు గ్రేటర్ విజయవాడలో విలీనం చేయవద్దని గ్రామ పంచాయతీలు తీర్మానం చేయగా స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. బతుకు భారమే.. గతంలో గ్రామ పంచాయతీలు తాడిగడప మున్సిపాలిటీలో విలీనం తరువాత ఇంటి పన్నులు 150 శాతం పెరిగాయి. అలాగే ఆస్తి బదలాయింపు(మ్యుటేషన్) బాదుడు కూడా అధికమైంది. ట్రేడ్ లైసెన్స్, ఖాళీస్థలాల పన్నులు, ఇంటిప్లాన్ల ఫీజులు ఇలా అనేక రకాలుగా పన్నులు ప్రజలపై ఆర్థిక భారం పడింది. ఇప్పుడు గ్రేటర్లోకి విలీనం చేస్తే ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమిటనే ప్రశ్నతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్రేటర్లో కలపటం వలన తమకు వచ్చే ప్రయోజనం శూన్యమనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. పొలాలను ఏమి చేస్తారు..? పెనమలూరు నియోజకవర్గంలో గ్రామాలు పాడి పంటలతో గ్రామీణ వాతావరణం ఉంటుంది. నియోజకవర్గంలో దాదాపు 40 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని అర్బన్ చేయటం వలన పంట పొలాల భవిష్యత్తు మసకబారనుంది. ఆహార ధాన్యాలు, కూరగాయలు ప్రియమవుతాయి. వ్యవసాయం పైనే ఆధారపడిన రైతులు, రైతు కూలీలు కుటుంబాలు, పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో ఉన్న రాజధాని అమరావతి అభివృద్ధి పరిస్థితి అంతుపట్టకుండా ఉంది. ఈ పరిస్థితిలో గ్రేటర్ ప్రతిపాదనలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారుతుందన్న ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ అయితే గోడు వినేది ఎవరు ? పెనమలూరును గ్రేటర్లో విలీనం చేస్తే ప్రజల గోడు వినేది ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలు ఉంటే అధికారులను నేరుగా కలవటానికి అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు. గ్రేటర్ పరిధి ఎక్కవగా ఉంటే అనేక సమస్యలు ఉంటాయని, నిధులు తమ ప్రాంతాలకే వినియోగిస్తారనేది గ్యారెంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లాభం కంటే నష్టమే ఎక్కువని ప్రజలు తెలుపుతున్నారు. గ్రేటర్ ప్రతిపాదన వాయిదా గ్రేటర్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. మంత్రి నారాయణ శనివారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లతో సమావేశం జరిపారు. అయితే జనగణన ముందు గ్రేటర్లోకి విలీనానికి సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని సీఎం చెప్పారని, గ్రేటర్ ప్రతిపాదనను వాయిదా వేశామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం గ్రేటర్ ప్రతిపాదనలు హడావుడిగా తెరపైకి తీసుకువచ్చి రాత్రికి రాత్రే గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేయాలని ఆదేశించడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. -
180 కేజీల గంజాయి పట్టివేత
ఆత్కూరు(గన్నవరం): వ్యాన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని రూ.90 లక్షల విలువైన 180 కేజీల గంజాయిని ఆత్కూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు గన్నవరం డీఎస్పీ సీహెచ్. శ్రీనివాసరావు తెలిపారు. ఆత్కూరు పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 26న పెద్దఆవుటపల్లిలోని ఈశాన్య గార్డెన్స్ ఖాళీ ప్లాట్లలో ఓ వ్యాన్తో పాటు కారు ఆగి ఉండి ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంపై ఈగల్ టీమ్ ద్వారా ఆత్కూరు పోలీసులకు సమాచారం అందించింది. ఎస్ఐ ఎన్ఎల్ఎన్. మూర్తి నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకోవడం గమనించి సదరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించగా ఒడిశాలోని జనతాపై గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి బెంగళూరు తరలిస్తున్నట్లుగా సదరు వ్యక్తులు అంగీకరించారు. పైలెట్ వాహనంగా కారు.. థర్మకోల్ బాక్స్ల్లో ప్యాక్ చేసిన ఒక్కొక్కటి రెండు కేజీలు ఉన్న మొత్తం 90 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసులకు కంట పడకుండా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యాన్కు ముందు పైలెట్ వాహనంగా కారుతో బెంగళూరు తరలిస్తున్నారన్నారు. పట్టుబడిన వారిలో కర్ణాటకలోని చామరాజనగర్కు చెందిన సన్నప్ప మారెప్ప ఈజీగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అక్రమ రవాణాను ఎంచుకున్నట్లు తెలిపారు. అతనితో పాటు విశాఖపట్నానికి చెందిన బంటు తాతారావు, బొమ్మినాయిని మోహన్రావు, గుండేపల్లి అభిరామ్సంపత్, పాయకరావుపేటకు చెందిన గరికన రాజేష్పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. గంజాయిను పట్టుకున్న అధికారులను, సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్నాయుడు అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో హనుమాన్జంక్షన్ సీఐ ఎల్.రమేష్, ఎస్ఐ మూర్తి, ఈగల్ టీమ్ సీఐ ఎం.రవీంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూచిపూడి నృత్యంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న మద్దిరాల కేతనరెడ్డికి ‘నవ తెలుగు తేజం – శ్రీ లలిత శ్రావంతి అవార్డు దక్కింది. ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యాన విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మద్దిరాల కేతనరెడ్డి కూచిపూడి ప్రదర్శనలో అబ్బురపరుస్తోంది. కేతన ఇప్పటికే భారతీయ శాసీ్త్రయ నృత్య ప్రపంచంలో సత్తా చాటింది. తన ప్రదర్శన సమయంలో తన చేతుల్లో దీపాలను పట్టుకుని, హులా హూప్ చేస్తూ, తన తలపై కుండను నైపుణ్యంగా బ్యాలెన్స్ చేసింది. ఐదు నిమిషాల పాటూ ఆమె అద్భుతం చేసి చూపించింది. కేతన మూడేళ్ల వయస్సులో కూచిపూడి నేర్చుకోవడం ప్రారంభించి ఎన్నో మెడల్స్ అవార్డులు సాధించింది. గతంలో ఆమెను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరును లిఖించుకోవడం లక్ష్యమని కేతనరెడ్డి తెలిపింది. -
ఉత్సాహంగా బాలోత్సవ్
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని విజయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కళాశాల ప్రాంగణంలో బాలోత్సవ్ సంబరాలు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ చిల్ట్రన్స్ స్కూల్స్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. వీసీఎస్టీఏ అధ్యక్షుడు ముదిగొండ శ్రీహరిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు స్పోర్ట్స్, కల్చరల్, అకడమిక్ కేటగిరీల్లో గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలి ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని అప్పుడే చదువు, క్రీడల్లో ఉన్నతంగా రాణించగలరని బాలోత్సవాల సమన్వయకర్త పిన్నమనేని మురళీకృష్ణ అన్నారు. వీసీఎస్టీఎ బాలోత్సవం చైర్మన్ వెనిగళ్ల మురళీమోహన్ మాట్లాడుతూ.. 2011లో మొదలైన బాలోత్సవ్ సంబరాలు 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెట్టాయన్నారు. వీసీఎస్టీఏ కార్యదర్శి భీమిశెట్టి గణేష్ బాబు, కోశాధికారి పుప్పాల శ్రీనివాసరావు, కో చైర్మన్ అనుమాటి చెన్నయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు, విజయ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, లిటిల్ బ్రెయిన్స్ హైస్కూల్ డైరెక్టర్ ఫణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ విజయవాడ వైపు అడుగులు
గ్రేటర్ విజయవాడ వైపు అడుగులు పడుతున్నాయి. ఆ దిశగా కసరత్తు ప్రారంభమైంది. గతంలో ఈ ప్రతిపాదన వచ్చినా విలీన గ్రామాల పంచాయతీల నుంచి వ్యతిరేకత రావడంతో బ్రేక్ పడింది. తాజాగా పంచాయతీల గడువు ముగుస్తున్న తరుణంలో మళ్లీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపైన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్, కార్పొరేషన్ అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే దాదాపు 25 లక్షల జనాభాతో గ్రేటర్ విజయవాడ రూపుదాల్చనుంది.సాక్షి ప్రతినిధి, విజయవాడ: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో 53 గ్రామాలను విజయవాడ కార్పొరేషన్లో విలీనం చేసి, 15 లక్షల జనాభా, 469.59 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలని కార్పొరేషన్లో తీర్మానం చేశారు. అప్పట్లో పంచాయతీల నుంచి వ్యతిరేకత రావడంతో కార్యం రూపం దాల్చలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పుడు ప్రతిపాదించిన 53 గ్రామాలతో పాటు మరో 21 గ్రామాలు అంటే మొత్తం 75 గ్రామాలను విలీనం చేసి, గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేసే విధంగా అధికారులు అక్టోబరు నెలలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచా యతీ పాలకవర్గాలు ఉండటంతో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వస్తుందనే భావనతో ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చి, పంచాయతీల నుంచి తీర్మానాలు తెప్పించుకునే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 41 గ్రామాలకు సంబంధించి పంచాయతీలకు చెందిన పాలక వర్గాల తీర్మానాలు తీసుకున్నారు. మిగిలిన 34 పంచాయతీల నుంచి వీలైనంత త్వరగా తీర్మానాలను తీసుకుని, పంచాయతీ ఎన్నికలకు ముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనకు కౌన్సిల్లో కూడా తీర్మానం చేసే దిశగా పావులు కదుపుతున్నారు.విజయవాడ నగర విస్తీర్ణం ప్రస్తుతం 61.88 చదరపు కిలోమీటర్లుగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 10,34,350. ప్రస్తుతం మూడు నియోజక వర్గాలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనతో 8 మండలాల్లోని 75 గ్రామాలను విజయవాడ కార్పొరేషన్లో విలీనం చేస్తే గ్రేటర్ విజయవాడ విస్తీర్ణం 661.79 చదరపు కిలో మీటర్లు అంటే..దాదాపు 10 రెట్లు నగర విస్తీర్ణం పెరగ నుంది. ఈ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 20 లక్షలకు పైగా జనాభా ఉండగా, ప్రస్తుత జనాభా తీసుకుంటే 25 లక్షలకు పైగానే ఉంటుంది. గన్నవరం నియోజక వర్గంలో 31 గ్రామాలు, మైలవరం నియోజకవర్గంలో 23 గ్రామాలు, పెనమలూరు నియోజకవర్గంలో 19 గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించారు. గన్నవరం నియోజక వర్గంలో ఆత్కూరు, సూరంపల్లి, మైలవరం నియోజకవర్గంలో కొండపల్లి, పెనమలూరు నియోజక వర్గంలో ప్రొద్దుటూరు వరకు ఉన్న గ్రామాలు గ్రేటర్లో కలువనున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,42,916 కుటుంబాలు విలీనం కానున్నాయి. ప్రస్తుతం విజయవాడలో 2,79, 556 కుటుంబాలు ఉన్నాయి. కొండపల్లి. తాడిగడప మున్సిపాలిటీలు రద్దయ్యే అవకాశం ఉంది.మైలవరం నియోజక వర్గంలో 23 గ్రామాలుజి.కొండూరు మండలంలో రెండు గ్రామాలు కడింపోతవరం, కవులూరు, ఇబ్రహీంపట్నం మండలంలో 13 గ్రామాలు ఈలప్రోలు, గూడూరుపాడు, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, జూపూడి, కేతనకొండ, కొండపల్లి, మల్కాపురం, మూలపాడు, నవిపోతవరం, తుమ్మలపాలెం, త్రిలోచనాపురం, జమీ మాచవరం, విజయవాడ రూరల్ మండలంలో 8 గ్రామాలు గొల్లపూడి, జక్కంపూడి, కొత్తూరు, పైడూరుపాడు, రాయనపాడు, షాబాద, తాడేపల్లి, వేమవరం.పెనమలూరు నియోజక వర్గంలో 19 గ్రామాలుకంకిపాడు మండలంలో 11 గ్రామాలు దావులూరు, ఈడుపుగల్లు, గొడవర్రు, గోసాల, కంకిపాడు, కోలవెన్ను, కొణతనపాడు, ప్రొద్దుటూరు, పునాదిపాడు, ఉప్పులూరు, వేల్పూరు, పెనమలూరు మండలంలో యనమలకుదురు, గంగూరు, కానూరు, పెదపులిపాక, పెనమలూరు, పోరంకి, తాడిగడప, వణుకూరు.గన్నవరం నియోజకవర్గంలో 31 గ్రామాలుగన్నవరం మండలంలో 19 గ్రామాలు అజంపూడి, అల్లాపురం, బీబీ గూడెం, బుద్దవరం, బూతుమిల్లిపాడు, చినఅవుటపల్లి, గన్నవరం, జక్కులనెక్కలం, కేసరపల్లి, కొండపావులూరు, పురుషోత్తపట్నం, రామచంద్రాపురం, సవరగూడెం, సూరంపల్లి, తెంపల్లి, వెదురుపావులూరు, వీరపనేనిగూడెం, వెంకట నరసింహాపురం(కేసరపల్లి శివారు), వెంకటనరసింహాపురం(పురుషోత్తపట్నం శివారు), ఉంగుటూరు మండలంలో రెండు గ్రామాలు ఆత్కూరు, పెదఅవుటపల్లి విజయవాడ రూరల్ మండలంలో 10 గ్రామాలు అంబాపురం, దోనే ఆత్కూరు, ఎనికేపాడు, గూడవల్లి, నిడమానూరు, నున్న, (కొంత భాగం) పాతపాడు, ఫిర్యాదినైనవరం, ప్రసాదంపాడు, రామవరప్పాడు. -
టీడీపీ కార్యకర్తల్లా ఖాకీలు!
మైలవరం(జి.కొండూరు): టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. చంద్రబాబు పాలనలో ఖాకీలు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలు పూర్తిగా గాలికొదిలేసి పోలీసులు వ్యవహరిస్తున్న విభిన్న శైలి ప్రజలను, రాజకీయ నేతలను విస్మయానికి గురి చేస్తోంది. అధికార టీడీపీ నాయకులు ఎన్ని అకృత్యాలకు పాల్పడినా కేసులు నమోదు చేయడానికి మనసొప్పని పోలీసులు.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాకీలు తీరు ఇలా ఉండగా, ఎన్టీఆర్ జిల్లా మైలవరం పోలీసులు అందుకు రెండింతలుగా ఉండటం గమనార్హం. టీడీపీ నేతలపై కేసులు పెట్టరు.. గత నెల 4న మైలవరానికి చెందిన యువ టీడీపీ నాయకుడు లంకా లితీష్ పుట్టినరోజు సందర్భంగా ఆ రాత్రి మైలవరం గ్రామ పంచాయతీ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. నాలుగు గంటలపాటు గ్రామంలో డీజేలతో, బైకులతో విన్యాసాలు చేస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేశారు. ట్రాఫిక్లో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులపైకి ఎక్కి డ్యాన్సులు వేశారు. వాహనదారులు నరకయాతన పడినప్పటికీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. వైఎస్సార్సీపీ నేతలపై వరుస కేసులు.. ప్రశ్నిస్తే కేసులే.. కూటమి ప్రభుత్వ తీరు, మైలవరం నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి, యథేచ్ఛగా జరుగుతున్న మట్టి మాఫియా వ్యవహారాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇబ్రహీంపట్నంకు చెందిన సీనియర్ జర్నలిస్టు వెలమా రామారావుని మైలవరం పోలీసులు జూలై 8న అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం జి.కొండూరు స్టేషన్లో కేసు నమోదు చేయించారు. -
ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి వరకు పొడిగింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి వరకు పొడిగించినట్లు విజయవాడ డివిజన్ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–తిరుపతి (08583) జనవరి 1 నుంచి ఫిబ్రవరి 23 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–విశాఖపట్నం (08534) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 24 వరకు ప్రతి మంగళవారం, విశాఖపట్నం–తిరుపతి (08547) జనవరి 7 నుంచి ఫిబ్రవరి 25 వరకు ప్రతి బుధవారం, తిరుపతి–విశాఖపట్నం (08548) జనవరి 8 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతి గురువారం, విశాఖపట్నం–చర్లపల్లి (08579) జనవరి 2 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రతి శుక్రవారం, చర్లపల్లి–విశాఖపట్నం (08580) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి శనివారం నడపనున్నారు. రద్దీ దృష్ట్యా.. విజయవాడ మీదుగా నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. భువనేశ్వర్– యశ్వంత్పూర్ (0811) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 21 వరకు ప్రతి శనివారం, యశ్వంత్పూర్– భువనేశ్వర్ (02812) జనవరి 5 నుంచి ఫిబ్రవరి 23 వరకు ప్రతి సోమవారం, విశాఖపట్నం–ఎస్ఎంవీటీ బెంగళూరు (08581) జనవరి 4 నుంచి 25 వరకు ప్రతి ఆదివారం, ఎస్ఎంవీటీ బెంగళూరు –విశాఖపట్నం (08582) జనవరి 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, సంబల్పూర్– ఈరోడ్ (08311) జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి బుధవారం, ఈరోడ్ – సంబల్పూర్ (08312) జనవరి 9 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, సంత్రగచ్చి– యలహంక (02863) జనవరి 1 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతి గురువారం, యలహంక– సంత్రగచ్చి (02864) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి శనివారం, షాలీమార్– చైన్నె సెంట్రల్ (02841) జనవరి 5 నుంచి 26 వరకు, చైన్నె సెంట్రల్– షాలీమార్ (02842) జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి బుధవారం నడపనున్నారు. లక్ష్మీపురం(గుంటూరు): రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తరఫున ఏజెంట్లు అని చెప్పి వైన్ షాప్, లిక్కర్ మార్ట్ మంజూరు చేయిస్తామని రూ.1.15 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఘటనపై గుంటూరు అరండల్పేట పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి చెందిన నల్లూరి వెంకటేశ్వర్లుకు అన్నపూర్ణ నగర్ చెందిన వంకాయలపాటి రాంబాబు అనే వ్యక్తి సుమారు 12 సంవత్సరాలుగా పరిచయం ఉంది. రాంబాబు, శ్రీకంద సాయి కిరణ్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. ఇద్దరు కలిసి రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తరఫున ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు నమ్మించారు. బాధితుడు వెంకటేశ్వర్లుకు వైన్ షాపు, లిక్కర్ మార్ట్ మంజూరు చేయిస్తామని మాయ మాటలతో నమ్మబలికారు. ఈ రెండింటికి రూ.3 కోట్లు వరకు ఖర్చు అవుతుందని చెప్పకొచ్చారు.. ఇరువురి మాటలను నమ్మిన వెంకటేశ్వర్లు రెండు దఫాలుగా రూ.70 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా ఆన్లైన్ చేసి మళ్లీ రూ.45 లక్షలు నగదు ఇచ్చాడు. నగదు తీసుకుని రోజులు గడుస్తున్న ఎటువంటి షాపులు మంజూరు కాక పోవడంతో అనుమానం కలిగి బాధితుడు వెంకటేశ్వర్లు స్వయంగా రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి జరిగిన విషయాన్ని తెలియజేయగా ఇరువురు వ్యక్తులు మంత్రి కొల్లు రవీంద్రకు తెలియదని చెప్పారు. దీంతో నమ్మకంగా మోసం చేశారని బాధితుడు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంపాలెం(గుంటూరు): పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సుమారు రూ.53 లక్షల విలువైన 265 మొబైల్ ఫోన్లను పొగొట్టుకున్న వారికి శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.7.53 కోట్ల విలువైన 3,679 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. బాధితుల ఫిర్యాదుల ఆధారం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనానికి గురైన వెంటనే పోలీస్ హెల్ప్లైన్ నంబర్ 8688831574 లేదా సీఇఐఆర్ వెబ్సైట్ లేదా జిల్లా సైబర్ సెల్ లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదులు చేయాలని ఆయన సూచించారు. ఐటీ కోర్ సీఐ నిషార్ భాషా, కానిస్టేబుళ్లు శ్రీధర్, మానస, ఇమామ్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను జిల్లా ఎస్పీ అభినందించారు. -
కార్మికులను సంఘటిత పోరాటాలకు సిద్ధం చేయాలి
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ సహజ సంపదను, వనరులను అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా కట్టబెట్టి దేశ ప్రజలను నిర్వాసితులను చేస్తున్న అభినవ దానకర్ణులు మోదీ, అమిత్ షా, చంద్రబాబు కూటమి ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా రైతులను, కార్మికులను కూడగట్టి సంఘటిత పోరాటాలకు సిద్ధం చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వెలువరించిన ‘శ్రామిక నేస్తం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వ్యయసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణకు పాల్పడుతున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాలు రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులు హరించి వేస్తున్నారని ఆగ్రహం వ్యకం చేశారు. అనంతరం ‘నూతన కార్మికచట్టాలు– భారత కార్మిక వర్గంపై వాటి దుష్ప్రబావం అనే అంశంపై ఏపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ హక్కులు కోల్పోతున్న అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేయాలన్నారు. కార్మిక, కర్షకుల సమస్యలు వాటి పరిష్కార మార్గాల కోసం శ్రామిక నేస్తం పత్రిక కృషి చేస్తుందన్నారు. శ్రామిక నేస్తం పత్రిక ఎడిటర్ అన్నపూర్ణ అధ్యక్షత వహించిన సభలో ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులు బిర్రా రవి, మస్తాన్, కొండారెడ్డి పాల్గొన్నారు. -
దుర్గగుడికి కొనసాగుతున్న రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు శుక్రవారం ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టగా, రూ. 100, రూ. 300 టికెట్ క్యూలైన్లో గంట సమయం, రూ. 500 వీఐపీ టికెట్ క్యూలైన్లో రెండు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఘాట్రోడ్డులో ఓంటర్నింగ్ వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. శుక్రవారం రికార్డు స్థాయిలో 60 వేల పైబడి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. టికెట్ల విక్రయాలపై గందరగోళం రద్దీ సమయాల్లో టికెట్ల విక్రయాలపై గందరగోళం నెలకుంటుంది. శుక్రవారం ఉదయం నుంచి రద్దీ ప్రారంభం కావడంతో టికెట్ల విక్రయాలను ఉదయం 11 గంటల కల్లా నిలిపివేయాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారం కౌంటర్లలోని సిబ్బందికి తెలియకపోవడంతో వారు యథావిధిగా టికెట్లను విక్రయించారు. మధ్యాహ్నం మహా నివేదన తర్వాత అంతరాలయ దర్శనం నిలిపివేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. అప్పటికే రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అంతరాలయ దర్శనం కొనసాగించారు. మొరాయించిన సర్వర్.. దేవస్థానంలో అన్ని సేవలు ఆన్లైన్ ద్వారానే అందిస్తుండగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు సర్వస్ మోరాయించింది. మహా మండపం దిగువన రూ.100, రూ.300 టికెట్ల కౌంటర్లతో పాటు రూ. 500 టికెట్ కౌంటర్లో టికెట్ల విక్రయాలు నిలిచిపోయాయి. ఆయా కౌంటర్లలో సిబ్బంది టికెట్లను స్కానింగ్ పాయింట్లో కొనుగోలు చేయాలని చెబుతుండటంతో భక్తులందరూ గాలిగోపురం దిగువన ఉన్న స్కానింగ్ పాయింట్కు చేరుకున్నారు. అక్కడ కూడా కంప్యూటర్ పని చేయకపోవడంతో గందరగోళ పరిస్ధితులు నెలకున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు లడ్డూలు ఇవ్వడం లేదని, వాటిని ప్రసాదాల విక్రయ కౌంటర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని కొద్ది రోజులుగా దేవస్థానంలో ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఇదే అంశంపై పలువురు భక్తుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. -
మామ చేతిలో అల్లుడు హతం
తోట్లవల్లూరు: మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోట్లవల్లూరుకు చెందిన చీకుర్తి శ్రీనివాసరావు కుమార్తె ఝాన్సీరాణికి ప్రకాశం జిల్లా గజ్జలకొండకు చెందిన ఆదిమూలపు సురే్ష్ (31) తో 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సురేష్ లారీ డ్రైవర్గా పనిచేస్తూ విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడులో ఉంటున్నాడు. ముగ్గురు పిల్లలు అత్త, మామల వద్ద ఉండి చదువుకుంటున్నారు. రెండు నెలల క్రితం మూడేళ్ల వయసున్న సురేష్ కుమార్తె అత్త, మామల ఇంటి వద్ద అనారోగ్యంతో మృతి చెందింది. ఈ నెల 24న సురేష్ భార్య ఝాన్సీరాణితో కలిసి రెండో కొడుకు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ తీసుకుని పెనమకూరు వచ్చాడు. క్రిస్మస్ రోజు సురేష్ మద్యం తాగి తన కుమార్తెను సరిగా చూడకపోవటం వలనే మృతి చెందిందంటూ మామ శ్రీనివాసరావుతో గొడవకు దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసరావు అల్లుడు సురేష్ను కర్రతో బలంగా కొట్డాడు. తలకు బలమైన గాయం కావటంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. సీఐ చిట్టిబాబు హత్య కేసు నమోదు చేశారు. -
రంగా హత్య కేసులో టీడీపీనే తొలి ముద్దాయి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్రంగాది ముమ్మాటికీ సర్కారీ హత్యేనని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. రంగా హత్య కేసులో ఆనాటి టీడీపీ ప్రభుత్వం, ప్రభుత్వంలోని పోలీసులు, నాయకులు అందరూ కలిసి ఆయన్ను హత్య చేశారన్నారు. అప్పటికీ, ఇప్పటీకీ రంగా హత్య కేసులో తొలి ముద్దాయి టీడీపీయేనన్నారు. శుక్రవారం దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా 37వ వర్థంతి కార్యక్రమం విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీసెంట్ రోడ్డులో, సీతన్నపేట గేటు వద్ద రంగా విగ్రహాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ అనాటి టీడీపీ అప్రజ్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలు, దాష్టీకాలను రంగా ధైర్యంగా ఎదుర్కొని పోరాడారన్నారు. సమస్యలపై ప్రజా పోరాటాలు చేశారన్నారు. శిరోముండనం కేసులో అరెస్ట్లు చేసే వరకు, క్రీస్తు రాజుపురంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని రోడ్డుపై నిరాహార దీక్షలో కూర్చున్నారని గుర్తు చేశారు. ఆ దీక్షలోనే ఆయన్ను దారుణంగా హత్య చేయించారన్నారు. ఆయన హత్యకు ఏపార్టీ కారణమో అదే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగా విగ్రహాలకు డండలు వేస్తుంటే ఆశ్చర్యంగాను, వింతగాను ఉందన్నారు. ఇలా చేస్తే రంగా ఆత్మ క్షోభించకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. వంగవీటి మోహన్రంగా మరణించే వరకు టీడీపీకీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేశారన్నారు. టీడీపీ రాష్ట్రంలో క్షుద్ర రాజకీయాలు చేస్తోందన్నారు. దివంగత నేత వైఎస్సార్ అనుక్షణం రంగాను కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు. రంగా ఆశయాలు, సిద్దాంతాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయన్నారు. వంగవీటి రంగానే తమకు ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలే పుల్లారావు, ఒగ్గు విక్కీ, సుధాకర్, శ్రీరాములు, ఇసరపు రాజా, ఉద్దంటి సురేష్, మాంతి రమణరావు తాడి శివ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -
సమీక్ష శూన్యం.. తూతూ మంత్రం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ప్రధాన సమస్యలపై చర్చే లేకుండా.. జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి అర్ధమే మార్చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ ధ్వజమెత్తారు. సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రతి ఒక్కరూ తప్పుడు లెక్కలు, తప్పుడు సమాచారంతో డీఆర్సీ సమావేశానికి అర్ధం లేకుండా చేశారన్నారు. రైతులు పడుతున్న బాధలు, వారి దుస్థితి గురించి అసలు చర్చించలేదని, కేవలం అంకెల గారడీ చేశారని దుయ్యబట్టారు. ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ సాధారణంగానే అన్నీ గారడీ చేస్తుంటారని, అందులో భాగంగానే ఆదోని మెడికల్ కాలేజీలో కిమ్స్ వచ్చిందని చెప్పారని, ఈ రోజు ఆ విషయం అడిగితే కిమ్స్ కాదు వేరే వచ్చిందని మాట మార్చారన్నారు. ఎన్టీఆర్ జిల్లా డీఆర్సీ సమావేశం ముగిసిన అనంతరం మొండితోక అరుణ్కుమార్, ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రతి సమస్యపై వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్కు జిల్లాపై అవగాహన లేదన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నా వాటి గురించి డీఆర్సీలో చర్చించకుండా తూతూ మంత్రంగా ముగించారని మండిపడ్డారు. వారి మాటల్లో... ● ఎన్టీఆర్ జిల్లాలో ప్రధాన సమస్యలు, రైతులు పడుతున్న బాధలను చర్చించకుండానే సమావేశం ముగించేశారు. రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. పత్తి, మిరప, మొక్కజొన్న ధరలకు సంబంధించి ఒక్కొక్కటి మేం అడుగుతుంటే అధికారులు ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటే వారి ప్రస్తావన లేకుండా డీఆర్సీ ముగిసింది. ● రాష్ట్రంలో, జిల్లాలో ఎన్నడూ లేని విధంగా డయేరియా బాధితులు ఎక్కువగా ఉంటే వారి గురించి చర్చ లేకుండా పోయింది. ఎ.కొండూరులో అనేక మంది కిడ్నీ బాధితులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విజయవాడ ఆర్ఆర్ పేటలో డయేరియా బారిన పడడానికి అధికారులు చెప్పే కారణాలు వాస్తవ దూరంగా ఉన్నాయి. ● ఇసుక హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాలకు అక్రమ రవాణా గురించిన చర్చ లేదు. అధికారులు, నాయకులు కుమ్మకై ్క ఎన్టీఆర్ జిల్లాను దోచుకుంటున్నారు. ● ఎంఎస్ఎంఈ కింద కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో కేటాయించిన భూమి, కల్పించిన ఉద్యోగాలు, వచ్చిన ఇండస్ట్రియల్ పార్క్లు, భూమి ఎవరెవరికి కేటాయించారన్న సమాచారం అడిగితే కలెక్టర్ పొంతన లేని సమాధానం ఇచ్చారు. ● ఎన్నెస్పీ కాలువలకు మరమ్మతులు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు, వ్యవసాయం, పండించిన పంటలు. పరిశ్రమలు, ఆరోగ్యం దేని గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతుల ఆత్మహత్యల ప్రస్తావనే లేదు డీఆర్సీ మీటింగ్ అర్ధం మార్చేశారు తప్పుడు సమాచారం, అంకెల గారడీతో గంటలోనే ముగించారు విజయవాడ డ్రగ్స్ హబ్గా మారింది అధికారులు, నాయకులు కుమ్మకై ్క దోచుకుంటున్నారు డీఆర్సీ సమావేశం జరిగిన తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీలు అరుణ్కుమార్, రుహుల్లా లా అండ్ ఆర్డర్ విషయంలో జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిందని డీఆర్సీలో గొప్పలు చెప్పారు. కానీ వాస్తవానికి ఈ ప్రభుత్వంలో విజయవాడ డ్రగ్స్ హబ్ గా మారింది. గంజాయికి విజయవాడ ప్రధాన కార్యాలయంగా మార్చేశారు. యువత గంజాయి మత్తులో తూగుతుంటే అధికారులు మాత్రం గంజాయి లేకుండా చేశామని చెప్పడం విడ్డూరంగా ఉంది. గంజాయి, మత్తుపదార్ధాలు, నార్కొటిక్స్, ఎండీఎం విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అధికార పార్టీ అనుకూల పత్రికలే రాస్తున్నాయి. -
ప్రగతి సూచికల్లో ఎన్టీఆర్ ప్రథమం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి 315 కీలక ప్రగతి సూచిక (కేపీఐ)ల్లో 83 స్కోరుతో జిల్లా రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలిచిందని జిల్లా ఇంచార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఫ్రంట్ రన్నర్గా ఉన్న జిల్లా ఏ ప్లస్ అచీవర్ స్థాయికి చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పాలనలోనూ, సేవల పంపిణీలోనూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ స్ఫూర్తితో పని చేయాలన్నారు. శుక్రవారం మంత్రి సత్యకుమార్ అధ్యక్షతన నగరంలోని ఇరిగేషన్ కాంపౌండ్ రైతు శిక్షణ కేంద్రంలో 4వ జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు హాజరయ్యారు. గత డీఆర్సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన వివిధ అంశాలపై తీసుకున్న చర్యలపై అధికారులను వివరణ కోరారు. పరిశ్రమలు, వైద్య ఆరోగ్యం, రహదారులు, శాంతి భద్రతలు, పోలీస్ కమిషనరేట్ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు, పీఎం సూర్యఘర్ తదితరాలపై సమావేశంలో చర్చించారు. విజయవాడ రూరల్ పరిధిలో సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధుల కట్టడి, ఎ.కొండూరు కిడ్నీ వ్యాధిగ్రస్థులకు అందిస్తున్న సేవలు తదితరాలకు సంబంధించి అధికారులు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ రెవెన్యూ సేవల దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. జీడీడీపీలో జిల్లాను ముందు వరుసలో నిలపాలి.. సమావేశం అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..గత సమావేశంలోని 61 అంశాలకు సంబంధించి 11 అంశాల పరిష్కారం పూర్తయిందన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ)లో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఉపాధి కల్పనకు, ఆర్థిక వృద్దికి ఊతమిచ్చే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ప్రతి మండలంలోనూ చిన్న పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చొరవ చూపుతున్నట్లు తెలిపారు. కృష్ణా జలాల పంపిణీపై ట్రయల్ రన్.. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎ.కొండూరులో ప్రతివారం నెఫ్రాలజిస్టు వైద్య సేవలను అందిస్తున్నామని, ఇందుకు సంబంధించి గిరిజన తండాల్లో టాంటాం కూడా వేయిస్తున్నామని తెలిపారు. కృష్ణా జలాల పంపిణీపై ట్రయల్ రన్ జరుగుతోందని.. త్వరలోనే పూర్తిస్థాయిలో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదనపు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురాం, డీసీపీ కేజీవీ సరిత, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సీపీవో వై.శ్రీలత, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, ఆర్డీవోలు కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి ఖో–ఖో పోటీలు
గుడివాడటౌన్: కృష్ణాజిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు, సీ్త్రల విభాగం ఖో–ఖో పోటీలు శుక్రవారం ముగిశాయి. మొత్తం 13 జిల్లాల నుంచి ఏపీ పోలీస్ టీమ్తో సహా 27 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. రసవత్తరంగా సాగిన ఈ పోటీల్లో ప్రకాశం జట్టు విజేతలుగా నిలిచాయి. పురుషుల విభాగంలో ప్రకాశం జట్టు ప్రథమ, విజయనగరం ద్వితీయ, విశాఖపట్నం తృతీయ, శ్రీకాకుళం నాల్గవస్థానం దక్కించుకోగా మహిళల విభాగంలో ప్రకాశం జట్టు ప్రథమ, కృష్ణా జట్టు ద్వితీయ, చిత్తూరు జట్టు తృతీయ, తూర్పు గోదావరి జట్టు నాల్గవ స్థానం దిక్కించుకున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, స్టేడియం కమిటీ జాయింట్ సెక్రటరి కె. రంగప్రసాదు, ఖో–ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరి సీతారామిరెడ్డి, ఏపీ ఖో–ఖో అసోసియేషన్ అధ్యక్షుడు మడకా ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా జాతీయ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్స్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): 87వ యునెక్స్ సన్రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2025లో భాగంగా శుక్రవారం క్వార్టర్ ఫైనల్స్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. నగరంలోని పటమటలో ఉన్న చెన్నుపాటిరామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో, గురునానక్ కాలనీలోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆవరణలో ఉమెన్స్ సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. ఉమెన్స్ డబుల్స్లో తెలంగాణకు చెందిన వినీల, రష్మిక–21–16, 21–13తో విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో భార్గవ్ రామ్, విశ్వ తేజ–21–7, 21–13 స్కోర్తో చత్తీస్ఘడ్కు చెందిన అభిషేక్, సుజైన్పై గెలుపొందారు. ఉమెన్స్ సింగిల్స్లో ఏపీకి చెందిన సూర్య చరిష్మ 21–12, 21–15తో హర్యానాకు చెందిన ఉన్నతి హుడాపై గెలుపొందింది. తెలంగాణకు చెందిన రక్షితశ్రీ 16–21, 21–14, 21–18 స్కోర్తో పంజాబ్కు చెందిన తవ్వి శర్మపై విజయం సాధించింది. మెన్స్ సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారుడు ఎం.తరుణ్ 21–13, 22–20 స్కోర్తో హర్యానాకు చెందిన మన్రాజ్ సింగ్పై విజయం సాధించాడు. జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్లో పీఎస్బీ క్రీడాకారుడు తరుణ్ విన్యాసం జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ విజేత రైల్వే క్రీడాకారుల ఆటలో ఒక కీలక ఘట్టం -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
తిరువూరు/బంటుమిల్లి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వీరిలో ఒకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వారు మరొకరిది కృష్ణాజిల్లా. కాగా చనిపోయిన ఇద్దరు యువకుల పేర్లు కార్తీక్ కావడం గమనార్హం. విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన జల్ది కార్తీక్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పశువుల సంత సమీపంలో వేగంగా వెళుతున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది. కార్తీక్ బైక్పై ఉన్న మరో యువకుడు దేవరపల్లి సాయికిరణ్ తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. అవివాహితుడైన కార్తీక్ తిరువూరులోని సెల్ పాయింట్లో పని చేస్తున్నాడు. అతడి మృతికి సంతాప సూచకంగా శుక్రవారం సెల్ ఫోన్ దుకాణాలు మూసి వేశారు. వాహనం అదుపు తప్పి మరో యువకుడు.. బంటుమిల్లి మండల పరిధిలోని ఆముదాల పల్లి పంచాయతీ శివారు జయపురం గ్రామం వద్ద బంటుమిల్లి గుడివాడ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మరో యువకుడు మృతి చెందాడు. మల్లేశ్వరం గ్రామానికి చెందిన వీరమల్లు రజినికుమార్ పెద్ద కుమారుడు వీరమల్లు కార్తీక్ (22) ఈ నెల 25వ తేదీన బంటుమిల్లి వైపు వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన కార్తీక్ను బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. నలుగురు అరెస్టు, 10 బైక్లు స్వాధీనం పామర్రు: మండల పరిధిలోని పెరిశేపల్లి శివారు కాలువ గట్లపై పేకాట ఆడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తమకు అందిన విశ్వసనీయంగా సమాచారం మేరకు సీఐ వి.సుభాకర్, ట్రైనీ మహిళా ఎస్ఐ సత్యకళ సిబ్బందితో కలిసి సాయంత్రం 5 గంటల సమయంలో పరిశేపల్లి శివారు కాలువ గట్టు వద్ద పేకాట ఆడుతున్న వారిని గుర్తించామన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.9,600 నగదు, 10 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. -
జాతీయ స్థాయి టెన్నిస్బాల్ క్రికెట్కు ఎంపికై న సోదరులు
గన్నవరం: చనుపల్లివారి గూడెంకు చెందిన ఇద్దరు సోదరులు జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు ఎంపికై నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్డీ ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వేల్పుల దిలీప్, సందీప్లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. నాగపూర్లో జనవరి 19 నుంచి 22 వరకు జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వీరిద్దరూ రాష్ట్ర జట్టుకు ప్రాతి నిధ్యం వహించనున్నారు. దిలీప్, సందీప్లను నియోజకవర్గ క్రీడా సమన్వయకర్త డి. నాగరాజు, పలు సంఘాల ప్రతినిధులు అభినందించారు. దిలీప్ సందీప్ -
రంగుల మహోత్సవం
పెనుగంచిప్రోలులో ప్రతి రెండేళ్లకు జరిగే పండుగ ● తిరుపతమ్మ వారి సన్నిధిలో 26 రోజుల పాటు సందడి ● పేటలో నకాసి వంశీయుల చేతిలో రంగులద్దుకునే విగ్రహాలు ● జనవరి 5 నుంచి 30 వరకు కొనసాగనున్న ఉత్సవం పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారి రంగుల మహోత్సవం వచ్చిందంటే పెనుగంచిప్రోలు, మక్కపేట, చిల్లకల్లు, జగ్గయ్యపేట, భీమవరం, లింగగూడెం గ్రామ ప్రజలకు, వారి బంధువులకు ఇంతకన్నా పెద్ద పండుగ ఉండదు. పురాతన కాలంలో చెక్కతో చేసిన విగ్రహాలు కావటంతో విగ్రహాలకు చిన్నచిన్న మరమ్మతులు అవసరమవుతాయి. దీంతో ప్రతి రెండేళ్లకు 11 విగ్రహాలకు జగ్గయ్య పేటలో రంగులు వేసే పనులు పూర్వ కాలం నుంచి నిర్వహిస్తున్న నకాసి వంశీయులు చేస్తున్నారు. జనవరి 5న రంగులకు బయలుదేరే విగ్రహాలు జనవరి 6 మధ్యాహ్నానికి జగ్గయ్యపేట రంగుల మండపానికి చేరుతాయి. రంగుల అనంతరం విగ్రహాలు జనవరి 28వ తేదీ తెల్లవారు జామున జగ్గయ్యపేటలో బయలు దేరతాయి. జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు, రాత్రికి వత్సవాయి మండలం భీమవరానికి విగ్రహాలు చేరుతాయి. అనంతరం జనవరి 29న భీమవరం నుంచి పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామానికి మధ్యాహ్నానికి చేరుకుంటాయి. రాత్రి గం.9.30 గంటలకు పెనుగంచిప్రోలు రంగుల మండపానికి చేరుకుంటాయి. రాత్రి 11 గంటల నుంచి గ్రామంలో అందంగా అలంకరించిన రథంపై విగ్రహాలను ఉంచి ఊరేగిస్తారు. జనవరి 30 తెల్లవారు జాముకు విగ్రహాలు ఆలయానికి చేరుకుని గద్దె నెక్కుతాయి. ఉత్సవాల విశేషాలు ఇలా ఉంటాయి. తిరుగు ప్రయాణంలో... శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారుతో పాటు సహదేవతల విగ్రహాలను తిరుగు ప్రయాణంలో రజకులు జగ్గయ్యపేట నుంచి పల్లకీల్లో చిల్లకల్లు, భీమవరం, లింగగూడెం మీదుగా పెనుగంచిప్రోలుకు చేరుస్తారు. పల్లకీలు పెనుగంచిప్రోలు–5, అనిగండ్లపాడు, సుబ్బాయిగూడెం, ముండ్లపాడు గ్రామాలకు చెందిన ఒక్కో పల్లకీ ఉంటుంది. గ్రామాల్లో పల్లకీలకు భక్తులు ఎదురేగి స్వాగతం పలుకుతారు. మొక్కులు తీర్చుకొని కుటుంబసభ్యులు, బంధుగణంతో సరదాగా గడుపుతారు. ఆలయం నుంచి విగ్రహాలను బయటకు తీసిన తరువాత రజకులు వాటిని నెత్తిన పెట్టుకొని మోసుకుంటూ పెనుగంచిప్రోలు గ్రామం చివరన ఉన్న రంగుల మండపం వరకు చేరుస్తారు. అక్కడ నుంచి విగ్రహాలను గ్రామానికి చెందిన రైతులు అందంగా అలంకరించిన ఎడ్లబండ్లపై ఒక్కొక్క బండిలో ఒక్కో విగ్రహాన్ని ఉంచి 11 విగ్రహాలను 11 ఎడ్లబండ్లపై ఉంచి జగ్గయ్యపేటలో రంగులు వేసే మండపం వద్దకు మక్కపేట, చిల్లకల్లు మీదుగా భక్తజన సందోహం మధ్య తీసుకెళ్తారు. -
మ్యాజిక్ డ్రెయిన్ల పరిశీలన
నందిగామ రూరల్: మండలంలోని సోమవరం గ్రామంలో మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణ పనులను కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ గురు వారం పరిశీలించారు. తొలుత గ్రామంలో ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించి వివరాలు అడిగి తెలు సుకున్నారు. సిమెంట్ డ్రెయిన్ల కన్నా తక్కువ ఖర్చుతో మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం జరుగుతోందని, దోమల వ్యాప్తి నివారణ, మురుగు నీరు నిల్వ లేకుండా భూమిలోకి ఇంకిపోవటం ప్రయోజనాలను తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీఓ ప్రసాదరావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 500 మీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం జరిగిందని మరో 400 మీటర్ల పనులు చేపట్టాల్సి ఉందని తెలిపారు. అనంతరం రాజేష్కుమార్సింగ్ను ఎంపీడీఓ, సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఏపీడీ నాగలక్ష్మీ, ఏపీఓ శరత్, డ్యూటీ ఇంజినీర్ సతీష్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఒడిశా లోని భువనేశ్వర్లో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జరిగే 19వ జాతీయస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ చాంపియన్షిప్నకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిద్యం వహించే బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశామని ఏపీ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.దిలీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలి పారు. ఎంపికై న క్రీడాకారులు గురువారం విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లారని పేర్కొ న్నారు. బాలుర జట్టుకు పి.వి.చిన్హాస్, ఎన్.క్రిష్ ధరణ్రెడ్డి, వి.జయరాం సంజయ్ (ఎన్టీఆర్ జిల్లా), ఎస్.ఈశ్వరహితేష్, ఎన్.అర్జున్ సాయి, ఎస్.కె.తంజీల్ (కృష్ణాజిల్లా), ఎం.హేమరామ్ శంకర్ (పల్నాడు జిల్లా), ఎన్.అవినాష్ (గుంటూరు), బాలికల జట్టుకు ఎ.శ్రీవైశాలి, జి. నిత్య, పి.జాహ్నవి, ఎస్.ఈశ్వరి (ఎన్టీఆర్ జిల్లా), బి.తేజశ్రీ (కాకినాడ), టి.కృష్ణ సత్యశ్రీ(గుంటూరు), డి.అలియా, కె.కావ్య (అనంతపురం) ఎంపికయ్యారని వివరించారు. ఈ జట్లకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.శ్రీనుబాబు, కోశాధికారి బి.నీరజ అభినందనలు తెలిపారు. -
పర్యాటకుల కోసం ఆంధ్రా ట్యాక్సీ యాప్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో పర్యాటకుల సౌకర్యార్థం ఆంధ్రా ట్యాక్సీ పేరిట ప్రత్యేక యాప్ రూపొందించినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. పర్యాటకులకు అందుబాటు ధరల్లో సురక్షిత, సంతోషకర విహారయాత్ర సేవలను ఈ ప్రత్యేక యాప్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో రూపొందించిన ఆంధ్రా ట్యాక్సీ యాప్ను కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ట్యాక్సీ, ఆటో యూనియన్ల ప్రతినిధులు, డ్రైవర్లు, పర్యాటక, రవాణా శాఖ అధికారులు తదితరులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సౌకర్యవంతమైన ప్రయాణానికి సరైన ఎంపిక ఆంధ్రా ట్యాక్సీ అని పేర్కొన్నారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లా టూరిజం వివరాలు, వ్యవసాయ డ్రోన్ సేవలు, రవాణా సేవలు, సమీప పోలీస్ స్టేషన్కు అనుసంధానమైన ఎస్ఓఎస్ సేవలు తదితరాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. మొబైల్ యాప్తో పాటు క్యూఆర్ కోడ్, వాట్సాప్, వెబ్సైట్ ద్వారా కూడా ఆటో, ట్యాక్సీ తదితర సేవలను బుకింగ్ చేసుకునే వీలుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. అందుబాటులో టూరిజం ప్యాకేజీలు జిల్లాకు సంబంధించి ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజుల పర్యాటక ప్యాకేజీలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఒకరోజు ప్యాకేజీలో దుర్గగుడి, బెరం పార్కు, కొండపల్లి కోట, పవిత్రసంగమం (ఫెర్రీ ఘాట్), భవానీ ఐలాండ్, బాపూ మ్యూజియం, గాంధీ హిల్ ఉంటాయన్నారు. మిగిలిన ప్యాకేజీల పూర్తి వివ రాలు యాప్లో అందుబాటులో ఉన్నాయన్నారు. పర్యాటకులకు సేవలు అందించేందుకు ఇప్పటికే ఔత్సాహిక యువకులకు గైడ్లుగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లే పర్యాటక రాయబా రులేనన్నారు. ఉత్తమ సేవలు అందించిన వారిని సముచిత రీతిలో సత్కరిస్తామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. అనంతరం యాప్లో రైడ్బుక్ చేసుకుని కలెక్టర్ లక్ష్మీశ ఆటోలో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఇన్చార్జ్ ఆర్టీఓ కె.వెంకటేశ్వరరావు, విజయవాడ ట్యాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.సాయిప్రసాద్, కోర్ కమిటీ సభ్యుడు వి.బాబూరావు, రాష్ట్ర ఆటో ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.ఆదిబాబు, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. -
శరణు.. శరణు.. దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చనలో రికార్డు స్థాయిలో 33 టికెట్లను విక్రయించారు. ఉదయం ఆరు గంటల తర్వాతే అంతరాలయ దర్శనం కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే ఆల యానికి చేరుకున్న భక్తులు అంతరాలయ దర్శనం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, చండీహోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. రద్దీ నేపథ్యంలో కొండపైకి కేవలం ద్విచక్ర వాహనాలు, దేవస్థానం బస్సులను మాత్రమే అనుమతించారు. తెలంగాణ వైపు నుంచి వచ్చిన భక్తుల వాహనాలతో హెడ్ వాటర్ వర్క్సు, కుమ్మరి పాలెం, పున్నమి ఘాట్లు నిండిపోయాయి. మధ్యాహ్నానికి ఘాట్ రోడ్డులోని ఓం టర్నింగ్, మహా మండపంలోని ఐదో అంతస్తు వరకు క్యూ చేరింది. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు రద్దీ కొనసాగగా, సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తుల తాకిడి కనిపించింది. విధుల్లో కనిపించని ఆలయ సిబ్బంది రద్దీ సమయాల్లో దేవస్థానానికి చెందిన అన్ని విభాగాల సిబ్బందికి ఈఓ ప్రత్యేక విధులు కేటాయిస్తూ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. గురువారం స్కానింగ్ పాయింట్ వద్ద రద్దీని నియంత్రించేందుకు ఇద్దరు ఏఈఓలు, సూపరింటెండెంట్ విధులు నిర్వహిస్తుండగా, ప్రత్యేక విధులు కేటాయించిన సిబ్బంది మచ్చుకై నా కనిపించలేదు. దీంతో స్కానింగ్ పాయింట్లో టికెట్ల కౌంటర్తో పాటు స్కానింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపు టికెట్లను సకాలంలో ఇవ్వలేదు. అమలు కాని వీఐపీ ప్రొటోకాల్ సమయం పండుగలు, పర్వదినాలు, విశేషమైన రోజుల్లో వీఐపీలకు దేవస్థానం ప్రత్యేక సమయాలను కేటాయించినా అవి అమలుకావడం లేదు. రద్దీ వేళల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. దసరా ఉత్సవాల ముందు వరకు ఈ నిబంధనను దేవస్థానం అమలు చేసింది. ఆ సమ యంలో ఒక వేళ వీఐపీలు విచ్చేసినా డోనర్ సెల్లో వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం రద్దీ అధికంగా ఉన్న సమయంలో వీఐపీల పేరిట పలువురు దర్శనానికి విచ్చేశారు. దీనికి తోడు దేవస్థానం చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యుల బంధువులు, స్నేహితుల పేరిట మరో వైపు దర్శనాలు కొనసాగాయి. దీంతో రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అసలు ట్రస్ట్ బోర్డు వైపు నుంచి ఎంత మంది దర్శనాలకు విచ్చేస్తున్నారనే దానిపై చైర్మన్, సభ్యుల కార్యాలయాల్లో కచ్చితమైన సమాచారం లేకపోవడం గమనార్హం. -
మాజీ మంత్రి కాకాని కృషి చిరస్మరణీయం
హనుమాన్జంక్షన్రూరల్: సహకార రంగంలో పాడి పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో క్షీర విప్లవానికి నాంది పలికిన కాకాని వెంకటరత్నం సేవలు చిరస్మరణీయమని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. మాజీ మంత్రి, జైఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమాలు హనుమాన్జంక్షన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక విజయవాడరోడ్డులోని పాలశీతల కేంద్రం ప్రాంగణంలో కాకాని వెంకటరత్నం విగ్రహానికి చలసాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తరుణంలో కాకాని వెంకటరత్నం చొరవతోనే రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు గ్రామగ్రామాన ఏర్పడ్డాయని చలసాని వివరించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గానూ పాడి పరిశ్రమ అభివృద్ధికి, కృష్ణా మిల్క్ యూనియన్ బలోపేతానికి కాకాని విశేష కృషి చేశారని కొనియాడారు. పలువురు పాల సహకార సంఘాల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దడ పుట్టిస్తున్న ఇసుక లారీలు
విజయవాడ – మచిలీపట్నం హైవేపై ఓవర్ లోడ్తో వెళ్తున్న ఇసుక లారీ పోరంకి–నిడమానూరు రోడ్డులో విద్యుత్ తీగలకు తగులుతున్న ఇసుక లారీ పెనమలూరు: సామాన్యలు హెల్మెట్ ధరించక పోతే కేసు.. ఆటో రోడ్డు మార్జిన్లో నిలిపితే ట్రాఫిక్ సమస్య కారణంగా కేసు.. మరి ఇసుక లారీలు ఓవర్ లోడ్తో నిత్యం రద్దీగా ఉండే బందరు రోడ్డుపై అత్యంత ప్రమాదకరంగా దడపుట్టిస్తూ నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్నా ఎటువంటి కేసులు ఉండవు.. టీడీపీ ప్రభుత్వ పాలనలో ఇది పోలీసులు, రవాణా శాఖ అధికారుల తీరు. అధికారుల వైఖరి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో ఇసుక లారీలు ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. చోడవరం, మద్దూరు ఇసుక క్వారీ నుంచి ఇసుక తరలించే లారీలు ఎటువంటి నిబంధనలు పాటించటం లేదు. లారీలో 40 నుంచి 60 టన్నులు ఇసుక లోడ్తో లారీలు జనావాసాల మీదగా ప్రయాణించటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద హైదరాబాద్–బీజాపూర్ రోడ్డుపై ఓవర్ లోడ్తో ఉన్న కంకర టిప్పర్ బస్సును ఢీ కొన్న ఘటనలో 19 మంది వరకు మృతి చెందిన ఘటనతో ఇక్కడి జనాలు టిప్పర్ లారీని చూస్తేనే ఆందోళన చెందుతున్నారు. ఓవర్ లోడ్తో ఉన్న లారీలకు అడ్డూ అదుపు లేకుండా ప్రయాణిస్తున్నాయని ప్రజలు ప్రాణభయంతో ఉన్నారు. గ్రామాల్లో ఆందోళన చెందుతున్న ప్రజలు ఓవర్ లోడ్ ఇసుకతో లారీలు చోడవరం ఇసుక క్వారీ నుంచి గ్రామాల మీదుగా జాతీయ విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి పైకి చేరుకుంటున్నాయి. టీడీపీ నాయకులు ఇసుక క్వారీ నిర్వహిస్తుండటంతో లారీలో భారీగా ఇసుక లోడ్ వేస్తున్నారు. ఒకేసారి 60 టన్నుల లోడ్ వేయటంతో లారీ భారీ చప్పుడు చేస్తూ కదలటంతో రోడ్డుపై ప్రయాణించే ప్రజలు కంగారు పడుతున్నారు. లారీ బాడీ కంటే పైకి ఇసుక వేయటంతో ఇసుక జారి రోడ్డుపై వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనదారులపై లారీలో ఇసుక కుప్పలు పడే ప్రమాదం పొంచి ఉంది. బందరు రోడ్డుపై ఇసుక లారీలు కారణంగా తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ వేళల్లో.. విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి బందరు రోడ్డుపై ఉదయం, సాయంత్రం బిజీ సమయాలలో ఇసుక లారీలు తిరుగుతుండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పోరంకి – నిడమానూరు రోడ్డులో విద్యుత్ వైర్లకు తగులుతూ ఓవర్ లోడ్ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. విద్యుత్ వైర్లు ఎక్కడ తెగిపడతాయోనని ప్రజలు భయపడుతున్నారు. ట్రాఫిక్ సమయాలలో ఇసుల లారీలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని, నిడమానూరు రోడ్డులో ఇసుక లారీల ప్రవేశం నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు. సురక్షిత ప్రయాణం ఎలా చేయాలి..? బందరు రోడ్డుపై ఓవర్ లోడ్తో ఇసుక లారీలు తిరుగుతుంటే సురక్షిత ప్రయాణం ఎలా చేయగలుగుతామని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. రోడ్డు భద్రతపై అధికారులు కార్యక్రమాలు నిర్వహించి చేతలు దులుపుకుంటే సరిపోదని ఆచరణలో అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చిన్నా, చితక వాహనదారులపై కేసులు రాసి పోలీసులు టార్గెట్లు పూర్తి చేయటం కాదని, ఓవర్లోడ్తో ఉన్న వాహనాల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నేటికి లారీలపై ఒక్క కేసైనా నమోదు చేశారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా రవాణా, పోలీసు అధికారులు స్పందించి ఓవర్లోడ్ లారీలపై కొరడా ఝలిపించాలని ప్రజలు కోరుతున్నారు. -
రసవత్తరంగా బ్యాడ్మింటన్ పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం, గురునానక్ కాలనీలోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆవరణలో జరుగుతున్న 87వ జాతీయ స్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ –2025 పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గురువారం ప్రీ క్వార్టర్ ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 28 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన క్రీడాకారులతో పాటుగా ఆర్బీఐ, కాగ్, ఎల్ఐసీ, రైల్వేస్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థల నుంచి కూడా క్రీడాకారులు తలపడుతున్నారు. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఏపీకి చెందిన సూర్య చరిష్మ జమ్ము అండ్ కశ్మీర్కు చెందిన కృష్ణ మహాజన్పై 21–8, 21–10 స్కోర్ తేడాతో విజయం సాధించింది. తెలంగాణకు చెందిన మేఘనారెడ్డి చండీగఢ్ చెందిన రాజిల్పై 21–16, 19–21, 21–9 స్కోర్తో గెలిచింది. తెలంగాణకు చెందిన రక్షితాశ్రీ కోల్కత్తాకు చెందిన రాజుల రాముపై 21–15, 21–16 స్కోర్తో గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వెంకటహర్షవర్థన్, కవి ప్రియ జంట ఒడిశాకు చెందిన ఆయుష్, ప్రభుప్రత్యూషపై 21–14, 21–10 స్కోరు తేడాతో విజయం సాధించింది. ఉమెన్స్ డబుల్స్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన దీపిక, స్రవంతి 21–12, 21–8 స్కోర్తో విజయం సాధించారు. -
వత్సవాయి పోలీస్స్టేషన్ తనిఖీ
వత్సవాయి: కేసుల దర్యాప్తు, పరిష్కారం విషయంలో పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాలని విజయవాడ డీసీపీ బి.లక్ష్మీనారాయణ సూచించారు. వత్సవాయి పోలీసుస్టేషన్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ కేసుల విషయంలో పారదర్శకత వహించి తగున్యాయం చేయాలన్నారు. శాంతిభద్రతలను విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలం రాష్ట్ర సరిహద్దులో ఉన్న నేపథ్యంలో సరిహద్దు వద్ద బందోబస్తు పటిష్టంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్, జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు, వత్సవాయి ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జనవరి 12న ఎన్జీవోస్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఎన్నికలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఎన్నికల అధికారి ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కె.జగదీశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ఈనెల 29న ఎన్జీవో హోమ్లో పబ్లిష్ చేస్తామన్నారు. జిల్లా శాఖకు ఒక అధ్యక్షుడు, ఒక సహాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, కార్యనిర్వాహక కార్యదర్శితోపాటు ఐదుగురు ఉపాధ్యక్షులు ఒక మహిళా ఉపాధ్యక్షురాలు – ఐదు సంయుక్త కార్యదర్శులు, ఒక మహిళ సంయుక్త కార్యదర్శి కలిపి మొత్తం 17 పోస్టులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జనవరి 3న నామినేషన్లు స్వీకరణ, అదేరోజు పరిశీలన, అర్హుల జాబితా ప్రచురణ, నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా ప్రచురణ నిర్వహిస్తామన్నారు. సహాయ ఎన్నికల అధికారిగా రాష్ట సంఘ ప్రచార కార్యదర్శి బి.జానకి, పర్యవేక్షకుడిగా రాష్ట్ర కార్యదర్శి వి.సుబ్బారెడ్డి వ్యవహరిస్తారని ఎన్నికల అధికారి జగదీశ్వరరావు తెలిపారు. పని దొరకడం లేదని.. నెల్లూరు(వీఆర్సీసెంటర్): పట్టపగలు ఓ వ్యక్తి కత్తితో తన మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన నెల్లూరులోని కనకమహాల్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామానికి చెందిన 41 సంవత్సరాల వయసున్న అమీర్వలీ బేల్దారి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో పనుల కోసం కొద్దిరోజుల క్రితం నెల్లూరుకు వచ్చాడు. ఇక్కడ పనులు దొరక్కపోవడంతో మానసికంగా ఆందోళనకు గురై గురువారం ఉదయం కనకమహాల్ సెంటర్ వద్ద మెయిన్ రోడ్డుపై చిన్న కత్తితో తన మెడ, పొట్ట భాగాల్లో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అమీర్వలీని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేశారు. వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రత్తిపాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన హైవేపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం పదహారవ నంబరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయస్సు సుమారు 30– 35 మధ్య ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు 86888 31386, 91548 76312 నంబర్లకు సమాచారం అందించాలని ప్రత్తిపాడు ఎస్ఐ కె.నరహరి తెలిపారు. -
మధుమేహం బారిన యువతరం
లబ్బీపేట(విజయవాడతూర్పు)ః కదలికలేని జీవన విధానం, వినూత్న ఆహారపు అలవాట్లు బాల్యాన్ని వ్యాధుల బారిన పడేస్తున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, ఒబెసిటీ వంటి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి. జీవనశైలి వ్యాధులను నిర్లక్ష్యం చేయడంతో మూడు పదుల వయసు నిండక మునుపే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్లకు గురవుతున్నారు. ఒకప్పుడు మధుమేహం సోకిన ఐదు నుంచి పదేళ్లలో స్ట్రోక్కు గురయ్యేవారు. ఇప్పుడు ప్రీ డయాబెటీస్లో కూడా స్ట్రోక్ వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. విజయవాడ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పక్షవాతం, గుండెపోటులకు గురైన వారు నిత్యం వంద మంది వరకూ వస్తుంటారు. వారిలో 20 నుంచి 40 ఏళ్ల వయస్సు వారు 15 నుంచి 20 శాతం ఉంటున్నారు. యువతలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్కు అదుపులో లేని మధుమేహమే కారణమనేది వైద్య నిపుణుల మాట. తీవ్రమైన వత్తిళ్లు, అదుపులోలేని మధుమేహం, ఆధునిక జీవనశైలి కూడా దీనికి దారి తీస్తున్నట్లు చెపుతున్నారు. ఇవే నిదర్శనం... విజయవాడ కృష్ణలంకకు చెందిన 22 ఏళ్ల రాజేష్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటారు. అతనికి రెండేళ్ల కిందట మధుమేహం ఉన్నట్లు గుర్తించాడు. తనకు ఎలాంటి దుష్పలితాలు లేవంటూ సక్రమంగా మందులు వాడలేదు. దీంతో ఇటీవల హఠాత్తుగా పక్షవాతానికి గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ● భవానీపురానికికు చెందిన 30 ఏళ్ల విక్రమ్ వ్యాపారంలో తీవ్రమైన వత్తిడిని ఎదుర్కొంటాడు. రెండున్నరేళ్ల కిందట డయాబెటిస్ సోకింది. సక్రమంగా మందులు వాడక పోవడంతో అదుపులో ఉండేది కాదు. ఇలీవల ఆయాసం రావడంతో పరీక్షలు చేయించుకోగా, గుండెపోటుకు గురైనట్లు తెలిపారు. ఇలా వీరిద్దరే కాదు అనేక మంది ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే పక్షవాతం, గుండెపోటుకు గురవుతున్నారు. ఇవే కారణం... ● మధుమేహుల్లో గుండె, మొదడు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గడ్డలు ఏర్పడతాయి. దీంతో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి స్ట్రోక్కు గురవుతుంటారు. ● మధుమేహం అదుపులో లేని వారిలో రక్తం గడ్డ కట్టే గుణం ఉంటుంది. అలాంటి గడ్డలు రక్త ప్రసరణకు అడ్డొచ్చి స్ట్రోక్కు గురవుతుంటారు. ● మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తనాళాలు సన్నపడటం, బిగుతుగా మారడం జరుగుతుంది. దీంతో రక్తప్రసరణ సరిగ్గా జరగక స్ట్రోక్కు గురయ్యే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు. ఇటీవల 30, 40 ఏళ్ల వయస్సులో బ్రెయిన్ స్ట్రోక్కు గురైన వారిని చూస్తున్నాం. వారిలో మధుమేహులు కూడా ఉంటున్నారు. అదుపులో లేని మధుమేహం బ్రెయిన్ స్ట్రోక్కు దారి తీస్తుంది. రక్త నాళాలు కుచించుకుపోవడం, కొలెస్ట్రాల్, రక్తం గడ్డలు మొదడు రక్త ప్రసరణపై ప్రభావం చూపుతాయి. ఆల్కహాల్, ధూమపానం చేసే వారిలో కూడా చిన్న వయస్సులో స్క్రోక్ వచ్చే అవకాశం ఉంది. రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. బ్రెయిన్ స్ట్రోక్కు గురైనప్పుడు గోల్డెన్ అవర్లో ఆస్పత్రికి చేరితే 80 శాతం మందిలో వైకల్యం లేకుండా చూడొచ్చు. డాక్టర్ చేకూరి మురళి, న్యూరాలజిస్ట్ -
ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రయివేటీకరణ కానివ్వం
●ప్రభుత్వ ఆస్తులను వైఎస్సార్ సీపీ కాపాడుతుంది ●ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి సాక్షి,అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రయివేటీకరణ ఒక పెద్ద కుట్ర అని, అన్ని కుంభకోణాల్లో కల్లా ఇది మాస్టర్ కుంభకోణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ప్రయివేట్ పరం కానివ్వబోమని, తమ పార్టీ న్యాయ పోరాటం చేసైనా అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణలో వెనక్కు తగ్గబోం అన్నట్లుగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ విషయంలో వచ్చే ప్రజావ్యతిరేకతను సీఎం చంద్రబాబు లెక్క చేయటం లేదని, ప్రజలతో తనకు సంబంధం లేదన్నట్లుగా ముందుకెళ్తున్నారని కారుమూరి విమర్శించారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్నీ ప్రయివేట్ వారికి అప్పగిస్తాం.. ఏమైనా చేయగలరా? అంటూ అహంకారం ప్రదర్శిస్తున్నారన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చుకోవాలంటే చాలా కష్టమనే విషయాన్ని చంద్రబాబు విస్మరించారన్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాలు సేకరించి గవర్నక్కి అందజేశారని, వాటిని కోటి సంతకాలుగా కాకుండా కోటి కుటుంబాల మద్దతుగా చూడాలని కోరారు. చంద్రబాబు మెండిగా వెళ్తే కచ్చితంగా తాము హైకోర్టుకు వెళ్లి, న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని ప్రభుత్వం తీసుకొంటుందని, విచారించి అందులో భాగస్వాములైన వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. ‘ప్రయివేట్ వారు మెడికల్ సీట్లు అమ్ముకొంటారు.. ప్రజల దగ్గర ఓపీ ఫీజు వసూలు చేస్తారు .. ప్రభుత్వం మాత్రం జీతాలు చెల్లిస్తుంది. ఇది చంద్రబాబు చేస్తున్న దుర్మార్గమైన కుట్ర. ఇందులో ప్రయివేట్ వారు భాగస్వాములు అయితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని’ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఒంటరిగా మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళ మెడలో చైన్ లాక్కుని వెళ్లిన స్నాచర్ను విజయవాడ భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యాధరపురానికి చెందిన పబ్బతి శ్రీదేవి రోజూ ఉదయం వాకింగ్కు వెళ్తుంది. బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఒంటరిగా వాకింగ్ చేస్తుండగా వెనుక నుంచి బైక్పై వచ్చి ఆమె మెడలోని 5 కాసుల చైన్ లాక్కెళ్లాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి స్నాచింగ్కు పాల్పడిన వ్యక్తి గుణాపు సాయి అలియాస్ రంగాసాయిగా గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి 5 కాసుల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెనాలి శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్లక్కి వర్థంతి సభ నిర్వహించారు. బోసురోడ్డులోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొని డాక్టర్ ఉళ్లక్కి సేవలను స్మరించుకున్నారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.శ్యామ్ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో విజయవాడకు చెందిన ప్రభ నర్సింగ్ హోం వైద్యురాలు కోడె ప్రభాదేవికి డాక్టర్ ఉళ్లక్కి స్మారక గోల్డ్ మెడల్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ‘ఎంపవరింగ్ హెల్త్ ఇన్ మిడ్ లైఫ్’ అనే అంశంపై డాక్టర్ ప్రభాదేవి ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ కోటేశ్వరప్రసాద్, డాక్టర్ జి.రవిశంకరరావు, డాక్టర్ టి.అఖిలేష్, డాక్టర్ కె.అనిల్ కుమార్, డాక్టర్ జి.నరసింహారావు, డాక్టర్ పి.ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025u8లో అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 41.6347 టీఎంసీలు.7పవిత్ర సగమం వద్ద కృష్ణానదిలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాయి. ప్రమాదాలకు గురైన వారిని రక్షించే చర్యలు ప్రదర్శించాయి. నాగాయలంక: మండలంలోని టి.కొత్తపాలెంలో ఔషధ మొక్కలతో మోడల్ ప్రాజెక్ట్గా చేపట్టిన గ్రామ ఆరోగ్య వనాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ప్రారంభించారు. -
సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య మునిసిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ – 2025 పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయవాడలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. శాప్ చైర్మన్ ఎ.రవి నాయుడు మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడా పాలసీని అమలు చేస్తోందన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. శాప్ ఎండీ ఎస్.భరణి, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసి డెంట్ ఎం.ద్వారకానాథ్, కార్యదర్శి అంకమ్మచౌదరి మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. శాప్ డైరెక్టర్ సంతోష్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఐ.రఘురాజ్, జాయింట్ సెక్రటరీ వంశీ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లాల క్రికెట్ చాంపియన్ గుంటూరు
విజయవాడ రూరల్: నున్నలోని గ్రీన్ హిల్స్ మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. స్కూల్ అండర్–17 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలవగా, చిత్తూరు జిల్లా ద్వితీయ, కర్నూలు జిల్లా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఫైనల్ మ్యాచ్లో గుంటూరు జట్టు నిర్ణీత ఒవర్లలో 78 పరుగులు చేయగా, చిత్తూరు జట్టు 62 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుంటూరు జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో కర్నూలు జట్టు కడప జట్టుపై విజయం సాధించింది. కర్నూలు జట్టు 101 పరుగులు చేయగా, కడప జట్టు 68 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. ముగింపు కార్యక్రమంలో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి ట్రోఫీ, పతకాలు అందజేశారు. ప్రిన్సిపాల్ నక్కనబోయిన గోపాలకృష్ణ, ఎస్జీఎఫ్ఏపీ అండర్–17 బాలికల అంతర్–జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ అబ్జర్వర్ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరాటే కుటుంబం
శుభకరం.. ప్రభు జననం ● దుర్గారావు కుటుంబంలో మూడు తరాలు కరాటేలోనే.. ● జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల సాధన విద్యుత్ దీపాల వెలుగుల్లో విజయవాడ వన్టౌన్లోని సెయింట్ పౌల్స్ సెంటినరీ చర్చిబాల ఏసు ప్రతిమ వద్ద ప్రార్థనలు చేస్తున్న బిషప్ తెలగతోటి రాజారావుఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో ప్రార్థనా మందిరాలు సరికొత్తగా కాంతులీనాయి. క్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపేలా ఏర్పాటు చేసిన పశువుల పాక సెట్లు ఆకట్టుకున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు విశ్వాసులు వేలాదిగా ప్రార్థనల్లో పాల్గొన్నారు.పెనమలూరు: పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన సుంకు దుర్గారావుది నిరుపేద కుటుంబం. ఆటో నగర్లో సీట్లు కుట్టడమే వృత్తి. అయితే కరాటేపై మక్కువ ఆయన జీవితాన్నే మార్చే సింది. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా తీర్చిదిద్దింది. ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి సత్తాచాటారు. తన భార్య, పిల్లలను సైతం కరాటేలో నిపుణులుగా తీర్చిదిద్దారు. దుర్గారావు మనవళ్లు, మనవరాళ్లు సైతం కరాటేలా పతకాల పంట పండిస్తున్నారు. దుర్గారావు ప్రస్తుత వయసు 64 ఏళ్లు. ఆయన విజయవాడ సింగ్నగర్లో జన్మించారు. తండ్రి సత్యం, తల్లి లక్ష్మి సింగ్నగర్లో హోటల్ నడిపేవారు. కుటుంబం గడవక పోవటంతో దుర్గారావు యనమలకుదురులో స్థిరపడి ఆటోనగర్లో సీట్లు కుట్టి కుటుంబాన్ని పోషించేవారు. దుర్గారావుకు భార్య నాగమణి, కుమారులు నరేంద్రబాబు, క్రాంతికుమార్, ప్రశాంత్కుమార్ ఉన్నారు. 1980లో బ్రూస్లీ ప్రభంజనం కాలంలో దుర్గారావుకు కరాటే, కుంగ్ఫూ నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. మాస్టర్ ఆర్.వి.టి.మణి వద్ద శిక్షణ పొంది 1986లో కరాటే మాస్టర్గా ఎదిగారు. 1994లో విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించి మలేషియన్ గ్రాండ్ మాస్టర్ చూచూ షూట్ నుంచి బ్లాక్బెల్ట్ పొందారు. దుర్గారావు ప్రేరణతో ఆయన భార్య, ముగ్గురు కుమారులు కూడా కరాటే నేర్చుకున్నారు. వారు సైతం జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. స్థానికంగా ఉంటున్న క్రీడాకారులు, చిన్నారులు, పెద్దలను ప్రోత్సహించి దుర్గారావు కరాటే శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. ఇలా నాలుగు దశాబ్దాలుగా ఎంతో మందికి కరాటేలో శిక్షణ ఇస్తున్నారు దుర్గారావు కుటుంబ సభ్యులు. కరాటే మాస్టర్ దుర్గారావు ఇంటి నిండా పతకాలే కనబడుతాయి. సీనియర్ సిటిజన్ విభాగంలో 14 బంగారు పతకాలు గెలిచారు. సీనియర్ సిటిజన్ విభాగంలో గ్రాండ్ చాంపియన్షిప్ను నాలుగు సార్లు కైవసం చేసుకున్నారు. అంతకు ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 18 పతకాలు సాధించారు. ఆయన సాధించిన మొత్తం పతకాల సంఖ్య 32. అతని కుటుంబంలో అందరు కలిపి ఇప్పటికి 175కు పైగా పతకాలు గెలిచారు. కరాటేలో దుర్గారావు, ఆయన భార్య, కుమారులే కాకుండా మనవళ్లు మనవరాళ్లు కూడా కరాటేలో ప్రావీణ్యం సంపాదించారు. తొమ్మిదేళ్ల సాత్విక్, ఏడేళ్ల రుత్విక్, అనన్య, అన్షిక్ కరాటే పోటీల్లో సత్తాచాటుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 27 పతకాలు గెలిచారు. తాను నేర్చుకున్న విద్య తనతో ఆగిపోకుండా ఉండటానికి కరాటేపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని దుర్గారావు చేపట్టారు. వాన్కాన్ కరాటే డు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ కోచ్గా తన వద్ద 30 మంది క్రీడాకారులకు కరాటే, కుంగ్ఫూలో కఠిన శిక్షణ ఇస్తున్నారు. విజయవాడ నగరంలో వివిధ పాఠశాలల్లో చదువుతున్ను వెయ్యి మందికిపై విద్యార్థులకు దుర్గారావు కరాటేలో రోజూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కరాటే నా ఊపిరి. నా కుటుంబంలో మూడు తరాల వారు కరాటే పోటీల్లో పాల్గొంటున్నారు. నేను 40 సంవ త్సరాలుగా కరాటే రంగంలో ఉన్నాను. అనేక మంది విద్యార్థులను కరాటేలో శిక్షణ ఇచ్చి మాస్టర్లుగా తీర్చిదిద్దాను. వ్యక్తిగత సంరక్షణకు కరాటే చాలా అవసరం. ప్రభుత్వం ముందుకొచ్చి సాయం అందిస్తే కరాటేను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తా. ఊపిరి ఉన్నంత వరకు కరాటే పోటీల్లో పాల్గొంటాను. – సుంకు దుర్గారావు, కరాటే మాస్టర్, యనమలకుదురు -
ఆతిథ్యానికి దాడుల సెగ
25 హోటళ్లపై 150 మంది జీఎస్టీ అధికారుల దాడులు హోటల్స్ ఆదాయాలను పరిశీలిస్తున్న వైనం సంపద సృష్టిలో భాగంగా హోటల్స్పై దాడులు? – షేక్ జహీర్, డెప్యూటీ కమిషనర్, విజయవాడ–2 డివిజన్ విజయవాడలో హోటళ్లపై జీఎస్టీ అధికారుల దాడులు 25 హోటళ్లపై దాడులు నిర్వహించిన 150 మంది అధికారులు సంపద సృష్టిలో భాగంగానే ఈ దాడులని విమర్శలు దాడులపై ముఖ్యమంత్రిని ఆశ్రయించిన హోటళ్ల సంఘ నేతలు -
హక్కులపై అవగాహన అవసరం
భవానీపురం(విజయవాడపశ్చిమ): వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కల్పించుకోవాలని, డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, ఎండీ ఎస్.ఢిల్లీరావు సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం’ అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరై ప్రసంగించారు. పౌరసరఫరాల సంస్థ సంచాలకుడు ఆర్.గోవిందరావు మాట్లాడుతూ.. పాఠశాలల్లో కన్జ్యూమర్ క్లబ్ల ద్వారా విద్యార్థులకు వినియోగదారుల హక్కు లపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ ప్రేమ్ సజాని పట్నాలా, లీగల్ మెట్రాలజీ శాఖ జాయింట్ కంట్రోలర్ కృష్ణచైతన్య, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, సివిల్ సప్లయీస్ అదనపు సంచాలకులు కె.రంగకుమారి, డీఈఓ చంద్రకళ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పాపారావు, ఏఎస్ఓ వేంపాటి శ్రీనివాసులు, విద్యార్థులు, ఎన్జీఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించే పోస్టర్ను ఆవిష్కరించారు. -
ఒడిశా గవర్నర్కు వినతి
జన్మభూమికి అనపర్తిలో స్టాపేజీ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విశాఖపట్నం– లింగంపల్లి – విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ ప్రెస్కు ప్రయోగాత్మకంగా అనపర్తి రైల్వేస్టేషన్లో స్టాపేజీ కల్పిస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం – లింగంపల్లి (12805) ఎక్స్ప్రెస్ జనవరి ఆరో తేదీ నుంచి ఉదయం 8.49 గంటలకు అనపర్తి చేరుకుని 8.50 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా లింగంపల్లి – విశాఖపట్నం (12806) సాయంత్రం 4.16 గంటలకు అనపర్తి చేరుకుని, 4.17 గంటలకు బయలుదేరుతుంది. షోలాపూర్–అనకాపల్లి రైలు పొడిగింపు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటి వరకు నడుస్తున్న షోలాపూర్–అనకాపల్లి ప్రత్యేక వారాంతపు రైలును ఫిబ్రవరి వరకు పొడిగించనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రు ప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. షోలాపూర్ – అనకాపల్లి (01477) ప్రత్యేక వారాంతపు రైలు జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు ప్రతి శుక్రవారం, అదే విధంగా అనకాపల్లి – షోలాపూర్ (01478) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి శనివారం నడపనున్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): హిందుస్థాన్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాల్లో కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరిగిన ఈ యువజనోత్సవాల్లో నృత్య పోటీల్లో కృష్ణా వర్సిటీ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించటమే కాకుండా, 13 అంశాల్లో పలు బహుమతులు సాధించారు. క్లాసికల్ ఓకల్ సోలోలో ద్వితీయ బహుమతి, క్లాసిక్ ఫర్క్యూషన్లో నాలుగో స్థానం, క్లాసిక్ నాన్ ఫర్క్యూషన్లో ద్వితీయ స్థానం ఇలా పలు అంశాల్లో విజేతలుగా నిలిచారు. దక్షిణ భారత స్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల్లో ప్రతిన కనమరిచి మూడో రన్నరప్గా నిలిచిన విశ్వవిద్యాలయ బృందాన్ని వైస్చాన్స్లర్ కె.రాంజీ, రెక్టార్ ఎం.వి.బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఎన్.ఉష అభినందించారు. -
28న గ్రీటింగ్ కార్డ్ డిజైన్ కాంటెస్ట్
వాల్పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈతరం చిన్నారులకు గ్రీటింగ్ కార్డులకు ఉన్న ప్రాముఖ్యతను తెలియపరచి వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే లక్ష్యంతో ఈనెల 28న గ్రీటింగ్ కార్డు డిజైన్ కాంటెస్ట్ నిర్వహించనున్నట్లు స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ప్రిన్సిపల్ స్ఫూర్తి శ్రీనివాస్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో గ్రీటింగ్ కార్డు కాంటెస్ట్ వాల్ పోస్టర్ను బుధవారం కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఆర్టిజో ఫైన్ ఆర్ట్స్ స్టూడియో, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రీటింగ్ కార్డ్ డిజైన్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ స్క్రీన్ టైంను తగ్గించేందుకు చిన్నారులకు ఇలాంటి కాంటెస్ట్లు అవసరమన్నారు. ఈతరం చిన్నారులకు ప్రేమ, ఆప్యాయతలతో ఇచ్చి పుచ్చుకునే గ్రీటింగ్ కార్డుల ప్రాముఖ్యత తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ పసుమర్తి అమర దీప్తి పాల్గొన్నారు. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని కాకానినగర్లో వరలక్ష్మి అనే యువతి బుధవారం ప్రియుడి ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా కై కలూరుకు చెందిన వరలక్ష్మి(29), జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్ అనే యువకుడు దాదాపు 13 ఏళ్లుగా కలిసి చదువుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ప్రేమగా మారడంతో గత ఆరేళ్లుగా ఇద్దరం ప్రేమించుకుంటున్నామని వరలక్ష్మి చెబుతోంది. ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నామని, సత్యదేవ్ తల్లిదండ్రులు కూడా మా కోడలు నీవే అని పలుమార్లు తనతో చెప్పినట్లు వరలక్ష్మి అంటోంది. అయితే కొంతకాలంగా బాలు సత్యదేవ్ ముఖం చాటేశాడని, అతని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మాటమార్చి తన ప్రియుడిని కనిపించకుండా చేసి, తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని యువతి కోరుతుంది. 27న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్మేళా గన్నవరం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ జాబ్మేళాలో జోయాలుక్కాస్ జ్యూవెలరీ, వరుణ్ మోటార్స్, ఇన్నోవోర్స్ సర్వీసెస్, అపోలో ఫార్మసీ, టెక్నోటాస్క్ బిజినెస్ సొల్యూషన్స్ కంపెనీలు పాల్గొంటాయని జిల్లా ఉపాధి అధికారి, డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి. విక్టర్బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్కుమార్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ.ఫార్మసీ పూర్తిచేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువత జాబ్మేళాకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా నైపుణ్యం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా, ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్, పాన్కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లతో జాబ్మేళాకు హాజరుకావాలని కోరారు. ఇతర సమాచారం కోసం 96767 08041, 94940 05725 సెల్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం
జగ్గయ్యపేట అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో బుధవారం పర్యటించిన మంత్రి రవీంద్ర పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం ఇప్పటికే రూ.50 వేల కోట్లతో సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోందని, అందులో భాగంగానే గూగుల్ ఏఐ సెంటర్ విశాఖకు రప్పించిందన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి సంవత్సర కాలం పట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కల్తీ మద్యం నుంచి విముక్తి లభించిందన్నారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం పోలంపల్లి మునేరు ఆనకట్టకు మరమ్మతులు చేయాలని, గ్రామీణ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. మార్కెట్ యార్డు చైర్పర్సన్ మల్లెల సీతమ్మ గ్రామీణ రోడ్లకు మార్కెటింగ్ శాఖ నిధులు వాడుకునేలా చూడాలని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని మంత్రికి విన్నవించారు. శాంతినగర్, విష్ణుప్రియనగర్ వాసులు కాలుష్య సమస్యపై మంత్రికి విన్నవించారు. ఈనాం భూముల సమస్య పరిష్కరించాలని బాధితులు మంత్రిని కోరారు. అనంతరం నూతనంగా ఏఎంసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మల్లెల సీతమ్మను మంత్రి సత్కరించారు. మంత్రి కొల్లు రవీంద్ర -
27న కేఎల్యూ స్నాతకోత్సవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం ఈనెల 27 వ తేదీన వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి.పార్థసారథివర్మ తెలిపారు. విజయవాడ గవర్నర్పేట మ్యూజియం రోడ్డులోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 184 మంది పీహెచ్డీ, 700 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, 4500 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరిలో 340 ఎంబీఏ, 105 ఎం.టెక్, 40 మంది లా కోర్సులు, 3200 మంది బీ.టెక్, 12 మంది ఆర్కిటెక్చర్, 48 మంది బీ.ఫార్మ్, 330 మంది బీసీఏ, 325 మంది బీబీఏ, 37 మంది బీకామ్, 18 మంది బీఎస్సీ (వీసీ), 25 మంది బీఏ, 180 మంది బీఎస్సీ అగ్రికల్చర్, 14 మంది ఎం.ఫార్మసీ, 32 మంది ఎం.ఎస్సీ (కెమిస్ట్రీ), 220 మంది ఎంసీఏ డిగ్రీ వారు ఉన్నారని వివరించారు. ఈ డిగ్రీలను విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరచిన 44 మంది విద్యార్థులకు బంగారు, 40 మందికి రజత పతకాలను, నగదు బహుమతులను అందించనున్నట్లు చెప్పారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ వినోద్ కె. సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారన్నారు. టాటా మెమోరియల్ సెంటర్, ముంబై ఎండీ, ఐఏపీ పీడియాట్రిక్ హీమాటో–ఆంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనవల్లి గౌరవ అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యక్రమ సంధాన కర్త వర్సిటీ రిజిస్ట్రార్ కె.సుబ్బారావు తెలిపారు. డిగ్రీలు తీసుకునే విద్యార్థులందరికీ ఇప్పటికే సమాచారం అందించామని, 27 వ తేదీ ఉదయం 9 గంటలకు యూనివర్సిటీ వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమానికి డాక్టర్ కె.సుబ్రమణ్యం, డాక్టర్ కె.రామకృష్ణ ప్రధాన కన్వీనర్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ కేఎస్ జగన్నాధరావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం.కిశోర్ బాబు పాల్గొన్నారు. -
పర్యాటక అభివృద్ధిలోనూ స్పీడ్ ఆఫ్ డూయింగ్
● క్యాలెండర్ ప్రకారం పర్యాటక కార్యక్రమాలు ● జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తికి అనుగుణంగా పర్యాటక రంగ అభివృద్ధికి కూడా సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందని, టూరిజంలో వినూత్న నమూనాలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో బుధవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పర్యాటక కౌన్సిల్ (డీటీసీ) సమావేశం జరిగింది. పర్యాటక శాఖ అధికారులతో పాటు ట్రావెల్స్, బోటింగ్ అసోసియేషన్ల ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్, హోమ్స్టేలు, పర్యాటక ఈవెంట్లు, ట్యాక్సీ యాప్ తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు తీసుకున్న నిర్ణయాల సత్వర అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడిదారులకు పూర్తిస్థాయి సహాయ, సహకారాలు అందజేస్తామన్నారు. పర్యాటక రంగ సుస్థిర అభివృద్ధికి, స్థానిక ప్రజలకు ప్రత్యక్షంగా ఆర్థిక ఫలాలు అందించడంలో హోమ్స్టేలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. వీటిపై ఔత్సాహికులకు అవగాహన కల్పించి, రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. పర్యాటక సేవలు, ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో ఉన్న ట్యాక్సీ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ప్రతి ఆటో, ట్యాక్సీలోనూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, ప్యాకేజీలకు సంబంధించిన బ్రోచర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్ కంటెంట్ ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని, హౌస్ బోట్, హెలీ టూరిజం తదితరాలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. డిమాండ్ దృష్ట్యా వీలైనన్ని ఎక్కువ హౌస్ బోట్లు ఏర్పాటుచేసేలా ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నారు. జనవరి 8 నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఆవకాయ్ సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవాన్ని విజయవంతం చేసేందుకు టూరిజం అధికారులు సమష్టిగా కృషిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. సమావేశంలో పర్యాటక శాఖ ఆర్డీ వైవీ ప్రసన్నలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఏపీటీడీసీ ఈఈ ఎం.శ్రీనివాసరావు, బీఐటీసీ ఈడీ జి.ఉమామహేశ్వరరావు, డాక్టర్ తరుణ్ కాకాని (అమరావతి బోటింగ్ క్లబ్), వాటర్ ఫ్లీట్ జీఎం నాంచారి, డీఆర్డీఏ, మెప్మా తదితర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్కు పటిష్ట భద్రత
జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల గోడౌన్కు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను చేశామని, అయినా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సమన్వయ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలతో పాటు మూడు నెలలకు ఒకసారి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి త్రైమాసిక తనిఖీలు నిర్వహించడంలో భాగంగా బుధవారం విజయవాడ రూరల్ గొల్లపూడిలోని ఏఎంసీ ఆవరణలో గల ఈవీఎం, వీవీప్యాట్ల గోడౌన్ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరుస్తున్న గోడౌన్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో త్రైమాసిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గోడౌన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, యరడ్ల ఆంజనేయరెడ్డి(వైఎస్సార్ సీపీ), యేదుపాటి రామయ్య(టీడీపీ), బొంతు కృష్ణారెడ్డి(బీజేపీ), బొర్రా కిరణ్(కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణానదిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాల మాక్ డ్రిల్
ఇబ్రహీంపట్నం: ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించే విధానాలపై స్థానిక పవ్రిత్ర సమగం వద్ద కృష్ణానదిలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాయి. నీటి ప్రమాదాలు, వరదల సమయంలో బాధితుల ప్రాణాలు రక్షించడం వంటి చర్యలను నదిలో ప్రదర్శించారు. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక వాహనంలో నది వద్దకు చేరుకుని ప్రత్యేక బోట్ల ద్వారా నదిలోకి చేరుకున్నారు. బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం, అక్కడ నుంచి అంబులెన్స్ ద్వారా వైద్యాధికారుల వద్దకు తీసుకువెళ్లి తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలు రక్షించడం వంటి సంఘటనలు కళ్లకు కట్టినట్లు మాక్ డ్రిల్ ప్రదర్శించారు. నదిలో చిక్కుకుని ఒడ్డుకు చేరుకోలేక మునిగిపోతున్న వారిని ఎయిర్ బెలూన్లు అందించి ఒడ్డుకు చేర్చిన విధానం ఆకట్టుకుంది. కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, మండల తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటరత్నం, సీఐ చంద్రశేఖర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
పెనమలూరు: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగే విధంగా శ్రమించాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్ఈఆర్డీ) డైరెక్టర్ మార్తల వెంకట కృష్ణారెడ్డి అన్నారు. పోరంకి మురళీ రిసార్ట్స్లో బుధవారం రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025–2026 ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు మంచి నైపుణ్యం ప్రదర్శించారన్నారు. విజేతలైన విద్యార్థులు త్వరలో హైదరాబాద్లో జరగనున్న సదరన్ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని సత్తా చాటి బహుమతులు గెలవాలని కోరారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థుల్లో కనీసం 10 మందైనా శాస్త్రవేత్తలుగా ఎదగాలని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ క్యూరేటర్ పురుషోత్తం, వైజ్ఞానిక ప్రదర్శన నోడల్ ఆఫీసర్ నాగమణి, అన్ని జిల్లాల డీఈవోలు, ఎంఈవోలు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలకు మైలవరం విద్యార్థినులు వన్టౌన్(విజయవాడపశ్చిమ): జాతీయ స్థాయి సైన్స్ఫెయిర్కు ఎన్టీఆర్ జిల్లా విద్యార్థుల నమూనాలు ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ తెలిపారు. బుధవారం జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ఫెయిర్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ఎస్ఈఆర్టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణకు మైలవరంలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇస్లావత్ రుక్మిణి, బత్తుల విజయదుర్గ ఎంపికై నట్టు చెప్పారు. వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా నుంచి ఇద్దరు ఎంపిక పెనమలూరు: పోరంకిలో జరిగిన రాష్ట్రస్థాయి విద్యా వెజ్ఞానిక ప్రదర్శనలో కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు దక్షిణ భారత స్థాయి పోటీకి ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. ఆయన బుధవారం పోరంకిలో వివరాలు తెలుపుతూ కృష్ణా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలో 11 మంది పాల్గొన్నారని, వారిలో ఇద్దరు ఎంపికయ్యారని చెప్పారు. గుడివాడ మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు చెందిన ఎస్.అశ్విన్కుమార్, ఉపాధ్యాయుల విభాగంలో మచిలీపట్నం మండలం గుండుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు బి.సోమేశ్వరరావు ఎంపికై నట్టు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న జిల్లా విద్యార్థులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. -
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఇండియన్ బ్యాంక్ మహిళల స్వయంసమృద్ధి, మహిళా సాధికారతకు కృషి చేస్తుందని బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని బ్యాంక్ జనరల్ మేనేజర్, ఆర్బీడీ వి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్లో బుధవారం ఇండియన్ బ్యాంక్ విజయవాడ జోన్ ఆధ్వర్యాన ఎస్హెచ్జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్ జరిగింది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్హెచ్జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రూ.1150 కోట్ల స్వయం సహాయక బృందాలకు రుణాలను మంజూరు చేశామన్నారు. ఎంతో మంది తమ చిన్న వ్యాపార అవసరాల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి తమ జీవితాలను కష్టతరం చేసుకుంటున్నారని అన్నారు. ఇండియన్ బ్యాంక్ ద్వారా స్వయం సహాయక బృందాల కోసం ఉత్పత్తులను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందవచ్చన్నారు మహిళలకు సాధికారత కల్పించి వారిని లక్షాధికారులగా మార్చటానికి ఉద్దేశించిన ‘సీడ్స్ టు సక్సెస్’ ప్రచారం, లక్షపతి దీదీ గురించి మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా మహిళలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. విజయవాడ జోనల్ మేనేజర్ ఎం.రాజేష్ మాట్లాడుతూ విజయవాడ జోన్లో స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేకత కలిగిన 4 మైక్రోశాట్ బ్రాంచిలు ఉన్నాయన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 5 వేల స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం అందిస్తోందని, 43 బ్రాంచిలు స్వయం సహాయక బృందాల ఆర్థిక అవసరాలను తీర్చటానికి నిరంతరం పనిచేస్తున్నాయని, బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేష్కుమార్, జోనల్ మేనేజర్ ఎన్.గౌరీశంకర్రావు, రాష్ట్ర అధికారులు ఏఎన్వీ నాంచారరావు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాద బాధితులకు ఊరట
లబ్బీపేట(విజయవాడతూర్పు): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హిట్ అండ్ రన్(గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన) 238 ఘటనల్లో 247 మంది బాధితులకు రూ.2 కోట్ల మేర పరిహారం అందించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. వారిలో 51 మంది మృతి చెందగా ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు, తీవ్ర గాయాలైన 196 మందికి ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున పరిహారం అందించినట్లు వివరించారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం అందేలా కృషి చేసిన పోలీసు అధికారులను బుధవారం సీపీ రాజశేఖరబాబు అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఫారూక్ తాడేపల్లిలో నూడిల్స్ బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తుండేవాడని, సరుకుల కోసం విజయవాడ భార్యతో కలిసి రాగా, గత ఏడాది జూన్ 9న జరిగిన ప్రమాదంలో భార్య మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం నెల్లూరు వెళ్లిపోయిన ఫారూక్ వివరాలు తెలుసుకుని, అతనికి రూ.2 లక్షల పరిహారం అందేలా రెవెన్యూ అధికారులతో కలిసి కృషి చేసినట్లు తెలిపారు. ఇలా 51 మందికి రూ.2 లక్షల చొప్పన అందించామన్నారు. ఇలాంటి హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారం అందేలా చేయడంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ప్రథమ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని గుర్తించలేని ఘటనల్లో సరైన పత్రాలు సేకరించి బాధితులకు పరిహారం అందేలా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం, ఏసీపీ పి.రామచంద్రరావు, హెడ్ కానిస్టేబుల్ ఎన్వీ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ వి.లీలా సాయికిరణ్లను ప్రశంసాపత్రాలతో సీపీ రాజశేఖరబాబు ప్రత్యేకంగా అభినందించారు. -
బస్సులు ఢీకొని పలువురికి గాయాలు
నందిగామ రూరల్:ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ పాఠశాల బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామానికి చెందిన సెయింట్ లూసి పాఠశాల బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వస్తుండగా కేతవీరునిపాడు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పాఠశాల బస్సు డ్రైవర్ ముప్పాళ్లకు చెందిన శ్రీనివాసరావు, ఆర్టీసీ బస్సు డ్రైవర్ హరికృష్ణలకు గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థులకు కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనలో పాఠశాల బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. దీనిపై పోలీస్ కేసు నమోదు కాలేదు. -
కారు ఢీకొని ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దుర్మరణం
చల్లపల్లి: కారు టైరు పగిలి బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని మాజేరు చెక్పోస్టు వద్ద 216 జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. మృతి చెందిన వారిలో ఒకరికి రెండు నెలల క్రితమే వివాహమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గుడివాడకు చెందిన దొడ్డ లోకేశ్వర్ తన భార్య రమాగీత, రెండేళ్ళ వయస్సుగల బాబు గీతాన్ష్తో కలిసి కారులో మోపిదేవి గుడికి వెళ్లారు. తిరిగి జాతీయ రహదారిపై మచిలీపట్నం మీదుగా గుడివాడ బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మాజేరు చెక్పోస్టు వద్దకు రాగానే కారు ముందుభాగంలోని డ్రైవర్ వైపు చక్రం పగిలిపోయింది. దీంతో అదుపుతప్పి రోడ్డుకు కుడివైపు కారు దూసుకుపోయింది. ఇంతలో ఎదురుగా మచిలీపట్నం నుంచి చల్లపల్లి వైపునకు వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న కోడూరు మండలం పిట్టలంక గ్రామానికి చెందిన సిరివెళ్ళ భాగ్యరాజు(24), పులిగడ్డకు చెందిన చెన్ను రాఘవ(25) మృతి చెందారు. భాగ్యరాజుకు బలమైన గాయాలు కావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. చెన్ను రాఘవకు కుడిచేయి చంక భాగంలో తెగిపోవటంతో తీవ్రరక్తస్రావం అయింది. వెంటనే 108లో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడు. భాగ్యరాజు, రాఘవ ఇద్దరూ పులిగడ్డ పంచాయతీ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ కింద కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఆఫీసు పనిమీద మచిలీపట్నం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. సిరివెళ్ళ భాగ్యరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వెంటనే కారులోని ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోవటంతో అందులో ఉన్న లోకేశ్వర్కు ఆయన భార్య రమాగీత, చిన్నారి గీతాన్ష్కు ఎటువంటి గాయాలుకాలేదు. లోకేశ్వర్ పస్తుతం పోలీసుల అదుపులో ఉండగా ఎస్ఐ కె.వై.దాస్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భాగ్యరాజుకు రెండు నెలల క్రితం అక్టోబర్ 7వ తేదీన వివాహం జరిగింది. కాళ్ళ పారాణి ఆరకముందే భాగ్యరాజు దుర్మరణం చెందాడు. పులిగడ్డకు చెందిన చెన్ను రాఘవకు తొమ్మిది నెలల క్రితం గాయత్రితో వివాహం అయ్యింది. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి. ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోవటంతో పాటు ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
సమాజసేవలో పోలీసుల భాగస్వామ్యం అభినందనీయం
జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడుకోనేరుసెంటర్: సమాజసేవలో పోలీసుల భాగస్వామ్యం నిజంగా అభినందనీయమని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు చెప్పారు. విధి నిర్వహణతో పాటు సమాజంలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న పలువురు పోలీసులను మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో సన్మానించి అభినందించారు. ఇటీవల రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వై.వెంకటరత్నం స్కూలు వదిలిన సమయంలో కొంత మంది పేద విద్యార్థులు మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా రోడ్డుపై వెళుతుండటాన్ని చూసి అందరికీ తన సొంత ఖర్చులతో పాదరక్షలు కొనిపెట్టి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఈ విషయంలో సోషల్మీడియా ద్వారా హల్చల్ అయింది. అలాగే ఆర్పేట పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ (డ్రోన్ ఆపరేటర్)గా విధులు నిర్వహిస్తున్న కె.కృష్ణమూర్తి (పిసి–1832) తన పుట్టినరోజును అందరి మద్య ఆడంబరంగా చేసుకోకుండా శీతాకాలంలో చలిపులికి గజగజలాడుతున్న యాచకులకు రగ్గులు, దుప్పట్లును అందజేసి తనలోని మానవత్వాన్ని చాటుకున్నాడు. అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్పీ విద్యాసాగర్నాయుడు వెంకటరత్నం, కృష్ణమూర్తిలను తన కార్యాలయానికి పిలిపించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల్లో సేవాభావం అనేది ఎప్పుడూ ఉంటుందన్నారు. అయితే పైకి గాంభీర్యం కనిపించే పోలీసులను మాత్రమే చూస్తారన్నారు. ప్రజాభద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కూడా ప్రజల కోసం పోలీసులు చేసే సేవా కార్యక్రమాలేనని చెప్పారు. మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు మరింత దగ్గరవుతుండటం సంతోషంగా ఉందన్నారు. వెంకటరత్నం, కృష్ణమూర్తి వంటి సిబ్బందిని పోలీసుశాఖలోని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అలాగే ఇదే స్ఫూర్తితో సిబ్బంది రాబోయే రోజుల్లో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా మన్ననలు అందుకోవాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి.వి నాయుడు, ఏఆర్ ఏఎస్పీ బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రసవత్తరంగా బ్యాడ్మింటన్ పోటీలు
ముగిసిన 78వ అంతర్ రాష్ట్ర టీం పోటీలు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని చెన్నుపాటి రామ కోటయ్య మునిసిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో సోమవారం మొదలైన 78వ అంతర్ రాష్ట్ర టీమ్ బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం ముగిశాయి. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. తమిళనాడు, హరియాణా జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోటీలో తమిళనాడు జట్టు విజయం సాధించింది. రన్నర్గా హరియాణా జట్టు నిలిచింది. మహిళల టీమ్ బ్యాడ్మింటన్ పోటిల్లో హరియాణా, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య జరిగిన పోటీలో హరియాణా టీమ్ విజయం సాధించింది. విజేతలకు కలెక్టర్ లక్ష్మీశతో పాటుగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ద్వారకనాథ్, టోర్నమెంట్ కన్వీనర్ ఉమర్ రషీద్, గుజరాత్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి మయూర్ పారిఖ్ బహుమతులను అందజేశారు. నేటి నుంచి నేషనల్ పోటీలు.. బుధవారం నుంచి 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఇండివిడ్యువల్ చాంపియన్ షిప్–2025 పోటీలు జరుగుతాయని బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలిపింది. పురుషుల సింగిల్స్లో తలపడుతున్న హరియాణా (డార్క్ బ్లూ టీషర్ట్), తమిళనాడు(స్కై బ్లూ టీషర్ట్) క్రీడాకారులు -
ఎస్ఎంసీలో బాలికల వసతి గృహం ప్రారంభం
కార్యక్రమంలో పాల్గొన్న వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్ఎంసీ)లో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 330మంది విద్యార్థినులు ఉండేలా 210 గదులతో భవనం నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా, అందుకోసం రూ.21.51కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన వసతి గృహంలో 105 గదులు ఉన్నాయని, వాటిలో 80 గదులు యూజీ(ఎంబీబీఎస్) బాలికలకు, మిగిలిన వాటిని సీనియర్ రెసిడెంట్లకు ఇవ్వనున్నట్లు తెలిపారు. మిగిలిన నిర్మాణాలను త్వరలో పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్య కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, పీపీపీ విధానంలోనే మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. నర్సింగ్ విద్యార్థుల వసతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దే రామ్మోహన్, కలెక్టర్ జి.లక్ష్మీశ, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డి.వెంకటేష్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
300 స్టాళ్లతో విజయవాడ పుస్తక మహోత్సవం
పోస్టర్ ఆవిష్కరించిన నిర్వాహకులువన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి రెండో తేదీ నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగే 36వ విజయవాడ పుస్తక మహోత్సవంలో తెలుగు సాహిత్యంలో వస్తున్న వివిధ మార్పులపై పలు సదస్సులను నిర్వహించనున్నట్లు సొసైటీ గౌరవ సలహాదారు ఎమెస్కో పబ్లిషర్స్ అధినేత డి.విజయకుమార్ చెప్పారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు టి.మనోహర్నాయుడు, కె.లక్ష్మయ్యతో కలిసి మాట్లాడారు. తొలుత బుక్ ఫెస్టివల్ కోసం ప్రత్యేకంగా సొసైటీ రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పలు అంశాలపై సదస్సులతో పాటు స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు, ప్రముఖ విద్యావేత్త ఆచార్య తూమాటి దొణప్ప, సుప్రసిద్ధ కథ రచయిత మునిపల్లె రాజు తదితర ప్రముఖుల శతజయంతి సభలు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది సుమారు 300 దుకాణాలతో పుస్తక మహోత్సవం ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్లను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యక్షులు జె. ప్రసాద్, సహాయ కార్యదర్శి ఏబీఎస్ సాయిరామ్, కోశాధికారి కె. రవి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతకు ప్రత్యేక కార్యక్రమాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళల సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు, పథకాలు అమలుచేస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకునేలా గ్రామస్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో మిషన్ శక్తి జిల్లాస్థాయి కమిటీ సమావేశంతో పాటు వరకట్న నిషేధ చట్టం – 1961 అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, పోలీస్, విద్య తదితర సమన్వయ శాఖల అధికారులు హాజరైన ఈ సమావేశంలో బేటీ బచావో బేటీ పఢావో, వన్ స్టాప్ సెంటర్, నారీ అదాలత్, ఉమెన్ హెల్ప్ లైన్ (181), ప్రధానమంత్రి మాతృ వందన యోజన, శక్తి సదన్, శక్తి నివాస్ తదితరాల అమలుపై సమీక్షించి.. మరింత సమర్థ అమలుకు సూచనలు చేశారు. ఆపన్న హస్తం అందించాలి.. భర్తను కోల్పోయిన, బంధువులతో నిరాదరణకు గురైన సీ్త్రలు, లైంగిక వేధింపులకు గురైన సీ్త్రల వంటివారికి ఆపన్న హస్తం అందించి, సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు చేయూతనిచ్చేందుకు ఉన్న కార్యక్రమాలను పటిష్టంగా అమలుచేయాలని కలెక్టర్ సూచించారు. శక్తి సదన్ల ద్వారా అందుతున్న ఉచిత వసతి, ఆహారం, వైద్య సదుపాయాలు, వృత్తి, నైపుణ్య శిక్షణ, న్యాయపరమైన సలహాలు, సామాజిక ఆర్థిక భద్రత, సోషల్ కౌన్సెలింగ్ తదితరాలపై అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు వాసవ్య మహిళా మండలి, గ్రామ వికాస్ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన శిబిరాలు నిర్వహించాలన్నారు. వరకట్న నిషేధ చట్టం–1961 అమలుకు సమన్వయ శాఖలు కృషి చేయాలన్నారు. ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, జి.రేష్మి (వాసవ్య మహిళా మండలి), వీడీ సత్యనారాయణరెడ్డి (గ్రామ వికాస్), డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటాలి
పెనమలూరు: పాఠశాల విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి అన్నారు. పోరంకి మురళీ రిసార్ట్స్లో మంగళవారం రెండు రోజుల రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025–26ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. పాఠశాల కర్రీక్యూలమ్ క్యాలెండర్ ప్రకారం స్టేట్ సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులు ప్రతిభ చాటాలని అన్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఏడు అంశాలలో 188 గ్రూపు ప్రాజెక్ట్లను విద్యార్థులు అంశాలవారీగా ప్రదర్శించారు. ఉపాధ్యాయుల కేటగిరీలో 52 ప్రాజెక్ట్లు, విద్యార్థుల వ్యక్తిగత ప్రాజెక్ట్లు 52 చొప్పున ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రొఫెసర్ టీపీ శర్మ, స్టేట్ ఎకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కే.నాగేశ్వరరావు, డీఈవోలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆశయం ఆవిరి
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే మహోన్న ఆశయంతో గత వైఎస్సార్ ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రులు, పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో అధునాతన మెషినరీ, ల్యాబ్లు ఏర్పాటుచేస్తే.. ప్రస్తుత చంద్రబాబు సర్కార్ ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. గతంలో ప్రజల ఇళ్ల ముంగిటకే వైఎస్సార్ సీపీ మెరుగైన వైద్యసేవలను అందజేసింది. అయితే నాణ్యమైన వైద్యసేవలు అందించాల్సిన పాలకులు ప్రస్తుతం ఆ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోని గర్భిణులకు స్కానింగ్ సౌకర్యం అందుబాటులో ఉంచడానికి గత ప్రభుత్వం పరికరాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత చంద్రబాబు సర్కార్ వాటిని ఇతర జిల్లాలకు తరలించేసింది. దీంతో గర్భిణులు స్కానింగ్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ఆరోగ్యకేంద్రాల్లోని లేబొరేటరీ పరికరాలను కూడా నిరుపయోగంగా మారుస్తున్నారు. ఇవి అక్కరకు రాకుండా పోతున్నాయి. ఇలా పట్టణ ఆరోగ్య సేవలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయినా పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు విని పిస్తున్నాయి. వైద్యులు లేరనే సాకుతో.. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో కాంట్రాక్ట్ బేసెస్లో పనిచేసే గైనకాలజిస్టులు ఉద్యోగం మానేశారు. అనంతరం కొత్త వారిని నియమించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయలేదు. దీంతో ఏడాది పాటు ఆరోగ్యం కేంద్రాల్లో స్కానింగ్ మెషిన్లను నిరుపయోగంగా ఉంచారు. ఇటీవల వైద్యులు లేక యూపీహెచ్సీల్లోని స్కానింగ్ పరికరాలు పాడవుతున్నాయనే సాకుతో వాటిని ఇతర జిల్లాల్లోని గైనకాలజీ వైద్యులు ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు తరలించేశారు. నగరంలో గతంలో 8 స్కానింగ్ మెషిన్లు ఏర్పాటు చేయగా, షేక్ రాజా ఆస్పత్రి మినహా, ఇతర ఏడు సెంటర్లలో స్కానింగ్ మెషిన్లను పశ్చిమగోదావరి తదితర జిల్లాలకు పంపేశారు. ల్యాబ్ పరికరాలూ అంతే.. గత ప్రభుత్వ హయాంలో నగరంలోని 42 యూపీహెచ్సీల్లో అత్యాధునిక పరికరాలు అందజేశారు. ఒక్కో యూపీహెచ్సీకి రూ.50 లక్షలు వెచ్చించి దాదాపు రూ.20 కోట్లతో పరికరాలు సమకూర్చారు. ఇవి ప్రజలకు బాగా ఉపయోగపడేవి. గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఉండటంతో 60 రకాల పరీక్షలను అక్కడే నిర్వహించేవారు. ఇప్పుడు కేవలం శాంపిల్ కలెక్షన్ పాయింట్స్గానే యూపీహెచ్సీలు మిగిలిపోయాయి. అక్కడ శాంపిల్ సేకరించి, సెంట్రల్ ల్యాబ్కు పంపిస్తుండటంతో, పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. యూపీహెచ్సీల్లోని అల్ట్రాసౌండ్ మిషన్లు వాడక పోవడంతో పాడైపోతున్నాయి. వాటిని ఉన్నతాధికారుల ఆదేశాలతో వేరే ప్రాంతాల్లో గైనకాలజిస్టులు ఉన్న సీహెచ్సీల్లో ఏర్పాటు చేశారు. చిట్టినగర్లోని షేక్రాజా ఆస్పత్రిలో మాత్రం పని చేస్తుంది. –మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ జిల్లా గత ప్రభుత్వ హయాంలో తమ నివాసాల సమీపంలో సేవలు పొందిన గర్భిణులు ఇప్పుడు పరీక్షల కోసం జీజీహెచ్కు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ రద్దీ ఉండటంతో గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అంతేకాదు స్కానింగ్ పరీక్ష రాస్తే, అక్కడ సీరియల్ ఎక్కువగా ఉండటంతో రెండు, మూడు రోజుల తర్వాత రావాలని డేట్ ఇస్తున్నారు. దీంతో మళ్లీ వెళ్లాల్సి వస్తోంది. ఇలా రవాణా ఖర్చులతో పాటు, దూర ప్రయాణం చేయడానికి నిండు గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే తమ సమీపంలోని యూపీహెచ్సీలో ఉంటే, ముందుగానే ఆశలు సమాచారం ఇచ్చి, గైనకాలజిస్టు వచ్చిన రోజు స్కానింగ్ చేయించే వాళ్లని చెబుతున్నారు. -
యూజీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) మూడు, ఐదు సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ సోమవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మూడో సెమిస్టర్కు సంబంధించి 51.85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఐదో సెమిస్టర్లో 66.31 శాతం సాధించారు. వీసీ మాట్లాడుతూ సెమిస్టర్ పరీక్షక్ష ఫలితాల్లో విద్యార్థులు మంచి ఫలితాలు కనపర్చడం అభినందనీయమన్నారు. ఫలితాలు వెబ్సైట్లో అధికారికంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పునఃమూల్యాంకనం కోరుకునే విద్యార్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు జనవరి 7 ఆఖరి తేదీగా తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎన్.ఉష, పరీక్షల నియంత్రణ అధికారి పి.వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా వర్సిటీలో మెగా జాబ్మేళా
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయంలో సోమవారం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించారు. ఎనిమిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు ప్రాంగణ ఎంపికల కార్యక్రమం చేపట్టారు. బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు, పీజీ విద్యార్థులు మూడు వందలమంది హాజరవ్వగా నూట నలభై మంది ఎంపికయ్యారు. మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సమన్వయంతో నిర్వహించిన మెగా జాబ్ డ్రైవ్లో ఎంపికై న వారికి ఉపకులపతి ఆచార్య కె. రాంజీ నియామక పత్రాలు అందజేశారు. ఎంపికై న విద్యార్థులను వీసీ అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, ట్రైనింగ్, ప్లేస్మెంట్ సెల్ సమన్వయకర్త ఆచార్య వైకే సుందరకృష్ణ, డైరెక్టర్లు కిషోర్, హనుమంతరావు, అలీ మీర్జా, కృష్ణ, విజయశేఖర్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఈసీగా కొత్తూరి తిరువూరు: ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తిరువూరు చాంబర్ ఆఫ్ కామర్స్ సొసైటీ అధ్యక్షుడు కొత్తూరి గంగాధర్ నియమితులయ్యారు. సోమవారం రాష్ట్ర చాంబర్ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు నియామకపత్రాన్ని గంగాధర్కు అందజేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి విడుదల నిలుపుదల చేశారు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులు తున్నారు. ఆత్మగౌరవ దీక్ష గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు (సీఆర్ఎంటీ) వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో సోమవారం ఆత్మగౌరవ దీక్ష చేశారు. దుర్గమ్మ పంచహారతుల సేవలో.. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు దంపతులు సోమవారం దుర్గమ్మ పంచహారతుల సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. 7 -
శాసీ్త్రయ ఆలోచనతో విద్యార్థుల సమగ్రాభివృద్ధి
కృష్ణా డీఈఓ సుబ్బారావు మచిలీపట్నంఅర్బన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచన.. తార్కిక శక్తిని, సమస్యలను విశ్లేషించి పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు అన్నారు. జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనతో పాటు జాతీయ గణిత దినోత్సవం సోమవారం స్థానిక లేడీ యాంప్తిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక విజ్ఞానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజన, ఆత్మవిశ్వాసం, పరిశోధనపై ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రపంచ స్థాయిలో మల్టీనేషనల్ సంస్థల్లో సీఈఓలుగా పనిచేస్తున్న భారతీయులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ ప్రదర్శనలో మొత్తం 196 వైజ్ఞానిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్, డీసీఈబీ సెక్రటరీ విజయ్, లేడీ యాంప్తిల్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.శ్రీరమ, జిల్లా స్థాయి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నూరు శాతం ఫలితాలు సాధించాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాల్లోని పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఫలితాలను సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ అన్నారు. జిల్లాలో పదో తరగతి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థంగా అమలు చేయాలని కోరుతూ జిల్లాలోని ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశాన్ని సోమవారం విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. చంద్రకళ మాట్లాడుతూ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సబ్జెక్ట్ టీచర్లు, క్లాస్ టీచర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి మౌలిక నైపుణ్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బలహీన విద్యార్థులకు తప్పనిసరిగా రీమీడియల్ బోధన నిర్వహించాలన్నారు. విద్యార్థుల పరీక్ష మార్కులు నిర్ణీత గడువులోపు అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో అందుబాటులో ఉండాలని, ఉపాధ్యాయుల హాజరు, బోధనా ప్రక్రియ, విద్యార్థుల హాజరును నిరంతరం పరిశీలించాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన అన్ని రికార్డులు, విద్యార్థుల ప్రగతి నివేదికలు, బోధనా నోట్స్ పాఠశాలల్లో సిద్ధంగా ఉంచాలన్నారు. విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను ఉత్తమ స్థానంలో నిలబెట్టేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలోని 187 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపవిద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ, జిల్లా పరీక్షల కమిషనర్, ఏఎస్ఓ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యం
ముస్తాబు కార్యక్రమ ప్రారంభంలో మంత్రి సవిత మోపిదేవి: విద్యార్థులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత సూచించారు. మండల కేంద్రం మోపిదేవి ఏపీఎంజేపీబీసీ గురుకుల బాలుర పాఠశాల, స్థానిక ఆశ్రమ పాఠశాలల్లో సోమవారం ముస్తాబు కార్యక్రమాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆశ్రమ పాఠశాలను గతంలో మంత్రి సందర్శించినప్పుడు పాఠశాలలో పల్లం ప్రాంతాన్ని మెరక చేయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని జనసేన నాయకుడు కోసూరు రామాంజనేయులు గత చిత్రపటాలను(ఫొటో) మంత్రికి చూపించి తక్షణం ఆ హామీని అమలు చేయాలని కోరారు. బాలురకు గురుకుల పాఠశాల ఉన్నట్లే దివిసీమకు మరో బాలికల గురుకుల పాఠశాల మంజూరు చేయాలని, స్కావెంజర్స్కు గౌరవ వేతనం పెంచాలంటూ కోలా బాలాజీ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. తొలుత ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అద్దము, దువ్వెన, వాష్ బేసిన్ మంత్రి పరిశీలించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కోరిన విధంగా అదనపు తరగతి గదులకు త్వరలో నిధులు విడుదలవుతాయని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి పి.మాధవీలత, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వరావు, ఎంపీపీ రావి దుర్గావాణి, మార్కెట్ యార్డు చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
వేంకటేశ్వరస్వామికి స్వర్ణకిరీటాలు
గుడివాడ టౌన్: గుడివాడ జగన్నాథపురం పాటిమీద వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారి ఉత్సవమూర్తులకు భక్తులు స్వర్ణకిరీటం సమర్పించినట్లు ఆలయ ఈఓ కె.వేణుగోపాలరావు తెలిపారు. సోమవారం ఉదయం ధనుర్మాస మహోత్సవ పూజా సమయంలో భక్తురాలు చలసాని అమృతవల్లి ఉత్సవమూర్తుల అలంకార నిమిత్తం 138 గ్రాముల మూడు స్వర్ణకిరీటాలు స్వామి వారికి సమర్పించారు. కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ ఎల్. శివరామ్ ప్రసాద్, అర్చకుడు వేదాంతం అప్పలాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. తిరుమలగిరి వెంకన్నకు రూ. 28.41 లక్షల ఆదాయం తిరుమలగిరి(జగ్గయ్యపేట): వాల్మీకోద్భవ వేంకటేశ్వరస్వామివారికి హుండీ కానుకలు, అన్నదానం, శివాలయం హుండీ ద్వారా రూ. 28.41 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. ఆలయ ఆవరణలో సోమవారం కానుకలు లెక్కించారు. ఆయన మాట్లాడుతూ మూడు నెలల 18 రోజులకు హుండీ కానుకల ద్వారా రూ. 26.93 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. కొండ కిందనున్న శివాలయం హుండీ కానుకల ద్వారా రూ. 29,843 రాగా అన్నదానం హుండీ ద్వారా రూ. 1.18 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు. కమిటీ చైర్మన్ భరద్వాజ్, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్బాల్ పురుషుల జట్టు ఎంపిక మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చైన్నెలోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవరణలో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్బాల్ పురుషుల టోర్నమెంట్లో తమ వర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించే బాస్కెట్బాల్ జట్టులోని క్రీడాకారులను సోమవారం ఎంపిక చేశామని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్స్ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.తిరుమల వీర రాఘవరావు(ఆంధ్ర మెడికల్ కళాశాల, విశాఖపట్నం), బి.హేమవిజయకృష్ణసాయిప్రదీప్(ఆంధ మెడికల్ కళాశాల, విశాఖపట్నం), ఎం.శ్రీకర్ ప్రసాద్ (జీఎస్ఎల్ మెడికల్ కళాశాల, రాజమండ్రి), మహ్మద్ హుస్సేన్(జీస్ఎల్ మెడికల్ కళాశాల రాజమండ్రి), డి.వెంకట సాయి కమల్నాథ్(కాటూరి మెడికల్ కళాశాల, చిన్నకొండూరుపాడు), ఆర్.జాకబ్ రాజు(కాటూరి మెడికల్ కళాశాల, చిన్నకొండూరుపాడు),బి.రంజిత్ కుమార్ (ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల,చినకాకాని), ఏ.వెంకట మణి జయంత్ (ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల, చినకాకాని), డి.క్రాంతి రుద్ర(శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కళాశాల), సూరజ్ యాదవ్(శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కళాశాల), జీపీ రతన్(విష్ణు డెంటల్ కళాశాల, భీమవరం)తో పాటు జట్టు మేనేజర్గా నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ జె.ఎస్.బాబు, జట్టు కోచ్గా చినకాకానిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ టి.గురునాథంను ఎంపిక చేశామని తెలియజేశారు. 27న వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ అందజేత లబ్బీపేట(విజయవాడతూర్పు): వివిధ రంగాల్లో రాణిస్తున్న ఆర్యవైశ్య మహిళలకు ఈ నెల 27న మణిపల్లి లైమ్లైట్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు ఇమ్మడి శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సోమవారం ఎంజీ రోడ్డులోని వారాహి సిల్క్స్ షోరూమ్లో ఆవిష్కరించారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ మహిళల నాయకత్వం, ప్రతిభ, సామాజిక సేవలను వేడుకగా జరుపుకోవాలనే తమ నిబద్ధతను ఈ కార్యక్రమం మరింత బలపరుస్తుందన్నారు. సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడిన ప్రేరణాత్మక మహిళా సాధికారులను గుర్తించి గౌరవించనున్నట్లు తెలిపారు. -
యోగాతో అద్భుత ప్రయోజనాలు
మచిలీపట్నంటౌన్: యోగ సాధనతో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని, నిత్య యోగ సాధనతో శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఒత్తిడి తగ్గుతుందని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఫైళ్ల పరిష్కారంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సీఎం చంద్రబాబునాయుడు నుంచి ప్రశంసలు పొందిన కలెక్టర్ డీకే బాలాజీని యోగా గురువులు, సభ్యులు ఘనంగా సోమవారం సన్మానించారు. గాంధీనగర్లోని వాకర్స్ అసోసియేషన్ హాల్లో యోగా తరగతులు నిర్వహించిన అనంతరం కలెక్టర్ను శాలువాలు, పూలదండలు, పుష్పగుచ్చాలు, మొక్కలతో ఘనంగా సన్మానించారు. బాలాజీని యోగా గురువులు గురునాథబాబు, మహాలక్ష్మి, చింతయ్య, వడ్డి శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ ట్రస్టీ యారా జగన్ మోహన్, మచిలీపట్నం జ్యూవెలరీ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు అంకెం జితేంద్ర, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సన్మానించారు. -
ప్రతి అర్జీని నిబద్ధతతో పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల సంతృప్త్త సేవలే నాణ్యతకు గీటురాయి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చిన ప్రతి అర్జీని సకాలంలో నిబద్ధతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్) జరిగింది. జేసీ ఎస్.ఇలక్కియ, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, ఉపాధి కల్పన, రెవెన్యూ సేవలు తదితర అంశాలపై మొత్తం 229 అర్జీలు అందాయన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కలెక్టర్ల సదస్సులో విలువైన సూచనలు ఇచ్చారని తెలిపారు కొత్త యూనిట్ల అభివృద్ధికి చర్యలు ఎంఎస్ఎంఈల ఉద్యమ్ రిజిస్ట్రేషన్పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ అన్నారు. కొత్త పారిశ్రామిక యూనిట్లతో పాటు ఉన్న యూనిట్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో ఒక చోట అనుమతి తీసుకొని మరో చోట తవ్వకాలు చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై రెండు సార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని సర్వే నంబర్ 46 ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలు చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు కూడా చూసీ చూడనట్లు ఉంటున్నారని’ గ్రామానికి చెందిన జమలయ్య పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. -
అన్ ఎయిడెడ్ పాఠశాలల హెచ్ఎంలతో సమావేశం
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని అన్ఎయిడెడ్ పాఠశాలల హెడ్మాస్టర్లు, కరస్పాండెంట్లతో జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు శనివారం డీఈఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. పరీక్షపై చర్చా కార్యక్రమం ప్రాధాన్యతను వివరించి, విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరచేలా పాఠశాలల్లో అమలు చేయాలని తెలిపారు. రాబోయే ఎస్ఎస్సీ పరీక్షలు–2026కు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ విజయ్, అన్ఎయిడెడ్ పాఠశాలల హెడ్మాస్టర్లు, కరస్పాండెంట్లు పాల్గొన్నారు. పెనమలూరు: గోసాలకు చెందిన వ్యాపారి బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ దొంగలు సొమ్ము కాజేసిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు ఎస్ఐ ఫిరోజ్ కథనం మేరకు గోసాల గ్రామానికి చెందిన వ్యాపారి వి. రమేష్కి కొద్ది రోజుల క్రితం ఫోన్కు వచ్చిన మెసేజ్లో లింక్ ఓపెన్ చేశాడు. వెంటనే అతని బ్యాంక్ ఖాతా నుంచి రెండు దఫాలుగా రూ.2,99,999 సొమ్ము సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
సిద్ధార్థలో ఘనంగా వైట్ కోట్ వేడుకలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, సమాజంలో సేవలు అందించే అవకాశం వైద్యులకే ఉంటుందని మాజీ ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ యలమంచిలి రాజారావు అన్నారు. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో 2025–26 బ్యాచ్లో అడ్మిషన్ పొందిన వైద్య విద్యార్థులకు వైట్కోట్ అందించే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. డాక్టర్ రాజారావు మాట్లాడుతూ.. ఎంత కష్టపడి వైద్యవిద్యలో సీటు సాధించారో, అదే పట్టుదలతో కోర్సును పూర్తి చేయాలన్నారు. మరో అతిథి ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ.. మంచి వైద్యులుగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్, ఏడీఎంఈ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు వైట్ కోట్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విద్యార్థులకు వైట్కోట్లు, ఐడీ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 2024 బ్యాచ్ విద్యార్థులు, వైస్ ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాల నా పేరు గుణ్ణం సూర్యనారాయణరెడ్డి. నా వయసు 94 ఏళ్లు. నా ఊహ తెలిసినప్పటి నుంచి మా ఊరు కాండ్రపాడులో ఏ మార్పూ రాలేదు. ఎప్పుడో నిర్మించిన పంచాయతీ శిథిల భవనం తప్ప. కొత్తగా ఏవీ రాలేదు. ఏ పని కావాలన్నా 22 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రం చందర్లపాడు వెళ్లాలి. అక్కడికి వెళ్తే కావాల్సిన అధికారి ఉండేవారు కాదు. ఇక వైద్యం కోసం నందిగామ వెళ్లాల్సిందే. ఇదంతా గతం. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మా ఊరి స్వరూపమే మారిపోయింది. పాడుబడిన పంచాయతీ స్థానంలో కొత్త సచివాలయం వచ్చింది. 11 మంది ఉద్యోగులు గ్రామానికి వచ్చారు. వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుతో గ్రామంలోనే వైద్యం అందుతోంది. రైతు భరోసా కేంద్రంతోపాటు సకల వసతులతో పాఠశాల భవనం నిర్మించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత స్థాయిలో మార్పు ఎన్నడూ చూడలేదు. ఐదేళ్ల జగన్ పాలనలో మా గ్రామ స్వరూపం మారింది. మౌలిక సదుపాయాలు వచ్చాయి. అంతర్గత రోడ్లు, డొంక రోడ్లు బాగుపడ్డాయి. నీటి కనెక్షన్లు వచ్చాయి. గతంలో ఏ పని కావాలన్నా మండల కేంద్రానికి వెళ్లిన మేము ఆ ఐదేళ్లలో ఊరు దాటి బయటకు అడుగు పెట్టిందే లేదు. పాలనను మా వాకిళ్లలోకి తెచ్చిన జగన్ వెయ్యేళ్లు వర్ధిల్లాలి.. -
మార్చి 6 నుంచి దుర్గగుడిలో మహా కుంభాభిషేకం
మూడు రోజుల పాటు నిర్వహణ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై 2026 మార్చి 6వ తేదీ నుంచి మహా కుంభాభిషేకాన్ని నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ నిర్ణయించింది. దేవస్థాన స్థానాచార్యులు, దుర్గగుడి వైదిక కమిటీ, ప్రధాన అర్చకులు, వేద పండితులు మహా కుంభా భిషేక మహోత్సవ తేదీలను శనివారం ఖరారు చేశారు. దుర్గగుడి ఈవో శీనానాయక్తో వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు శనివారం సమావేశమయ్యారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా కుంభాభిషేకం గురించి సుదీర్ఘంగా చర్చించి తేదీలను ఖరారు చేశారు. ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి అధికారులు సమాలోచన చేశారు. మార్చి 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభి షేకాన్ని పురస్కరించుకుని చేపట్టే పూజలు, హోమాలు, ఇతర కార్యక్రమాల గురించి చర్చించారు. 8వ తేదీ ఉదయం పూర్ణాహుతితో మహా కుంభాభిషేక మహోత్సవాలు పరిసమాప్తమవుతాయి. మార్చి 3వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం, 4వ తేదీ తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, దర్శన ఏర్పాట్ల గురించి ఆలయ వైదిక కమిటీ సభ్యులు సమావేశంలో చర్చించారు. అనంతరం స్థానాచార్య శివప్రసాద్ శర్మ చైర్మన్, బోర్డు సభ్యులకు మహా కుంభాభిషేకం గురించి వివరించారు. మైలవరం: క్రమశిక్షణగా ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని బాలికాభివృద్ధి అధికారి(జీసీడీఓ) బి.విశ్వభారతి తెలిపారు. మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణంలో ఎన్టీఆర్ జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎం. రజనీకుమారి పర్యవేక్షణలో శనివారం జిల్లా స్థాయి కెరీర్ ఫెస్ట్ అండ్ ఎక్స్పో–2025 కార్యక్రమం జరిగింది. కెరీర్ ఫెస్ట్ ద్వారా విద్యార్థులకు విద్య ప్రాముఖ్యతను తెలియజేయడం, విద్యార్థుల అభిరుచులు, సామర్ాధ్యలకు అనుగుణంగా కెరీర్ ఎంపికలపై స్పష్టత కల్పిస్తారన్నారు. కెరీర్ ఫెస్ట్లో విజ్ఞాన సాంకేతిక, వాణిజ్య, వైద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం, వృత్తి విద్య, ఐటీ, పోలీస్, డిఫెన్స్ ప్రభుత్వ ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి కోర్సులు తదితర విభాగాలకు సంబంధించిన 25 స్టాళ్లను ప్రదర్శించారు. ఆయా రంగాల నిపుణులు విద్యార్థులకు కోర్సుల వివరాలు, విద్యార్హతలు, ప్రవేశ పరీక్షలు, భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లాలోని 20 మండలాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మండల స్థాయిలో ఎంపికైన ఉత్తమ ప్రాజెక్టులకు, జిల్లా స్థాయిలో నిర్వహించిన క్విజ్, కెరీర్ పోస్టర్స్ తయారీ, ఒకేషనల్ డ్రస్ తదితర పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థులు అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. యునిసెఫ్ కన్సల్టెంట్ సమగ్ర శిక్ష జి. ప్రియాంక, మైలవరం మండల ఎంఈఓలు ఎల్.బాలు, రాజు, ఎస్ఐ సుధాకర్, ఉపాధ్యాయులు, ఒకేషనల్ ట్రైనర్లు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ సంస్థకు రాష్ట్ర స్థాయి ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు వరించింది. విజయ వాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి విజయానంద్, ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ నాగలక్ష్మి, సీపీడీసీఎల్ చైర్మన్ పుల్లారెడ్డి చేతుల మీదుగా ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ పి.శివరామాంజనేయులు శనివారం అవార్డు అందుకున్నారు. థర్మల్ ప్లాంటులో శక్తి వినియోగాన్ని తగ్గిస్తూ వినూత్నమైన శక్తి పరిరక్షణ విధానాలు అమలు చేయడం ద్వారా రాష్ట్రస్థాయిలో శక్తి పరిరక్షణ విభాగంలో రెండో స్థానం దక్కించుకుని సిల్వర్ మెడల్ సొంతం చేసుకోవడం సంస్థకు గర్వకారణమని సీఈ శివరామాంజ నేయులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సీఈకి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈలు గోపాల్, వెంకటరావు, ఈఈలు సురేష్బాబు, శ్రీనివాస్రెడ్డి, డీఈఈ హరి పాల్గొన్నారు. -
విద్యార్థుల కెరీర్ దిశా నిర్దేశానికి కెరీర్ ఎక్స్పో
మచిలీపట్నంఅర్బన్: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు వారి కెరీర్పై అవగాహన కల్పించేందుకు కెరీర్ ఎక్స్పో వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్.కుముదిని సింగ్ తెలిపారు. ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్పో–ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కుముదిని సింగ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కుముదిని సింగ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కెరీర్కు సరైన దిశానిర్దేశం చేయాలనే లక్ష్యంతో ఈ ఎక్స్పో నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు 193 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన కెరీర్ ఎక్స్పో ల నుంచి మండల స్థాయిలో ఎంపి కై న 125 పాఠశాలల ఐదు ఉత్తమ కెరీర్ మోడల్స్ను జిల్లా స్థాయిలో ప్రదర్శించినట్లు చెప్పారు. విద్య, విజ్ఞానం, సాంకేతికత, వృత్తి అవకాశాలకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించి వివరణ ఇచ్చారన్నారు. విద్యార్థులు తమ ప్రదర్శనలతో వివిధ రంగాల్లో ఉన్న ప్రొఫెషనల్ అవకాశాలను స్పష్టంగా వివరించారని, ప్రాజెక్టులలో వారు చూపిన అవగాహన, ఆత్మవిశ్వాసం అభినందనీయమని ఆమె ప్రశంసించారు. ఎంపికై న మొదటి మూడు ఉత్తమ ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటాయన్నారు. ఉత్తమ ప్రాజెక్టులు ప్రదర్శించిన తొమ్మిది జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్బీఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జోనల్ మేనేజర్ ఆర్.వి. హనుమంతరావు, కొటక్ మహీంద్రా బీఎం సుధీర్ కుమార్, వైజాగ్ పాలిటెక్నిక్ కాలేజ్ మెకానికల్ ట్రేడ్ లెక్చరర్ డాక్టర్ టి.నాంచారయ్య, ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ ట్రేడ్ లెక్చరర్ డాక్టర్ సయ్యద్ సదాత్ అలీ, జీసీడీఓ సీతామహాలక్ష్మి, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్
●డీఎస్పీ ధీరజ్ వినీల్ ●ఐదు బైక్లు, రెండు బంగారు చెవిదిద్దులు స్వాధీనం గుడివాడరూరల్: బైక్లు, ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు గుడివాడ డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ తెలిపారు. గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం మల్లాయపాలెం టిడ్కో కాలనీ చివరి హెలిప్యాడ్ వద్ద నుంచి వచ్చిన రహస్య సమాచారం మేరకు ఎస్ఐ ఎన్.చంటిబాబు, తన సిబ్బందితో తనిఖీలు చేపట్టారని, ఈ క్రమంలో పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. వెంటనే ఎస్ఐ వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. టిడ్కో కాలనీలో ఉంటున్న పెమ్మిశెట్టి రామప్రకాష్(25), నైజాంపేటకు చెందిన అబుబకర్ బేగ్ అలియాస్ అబు(23)లను విచారించగా గుడివాడ లక్ష్మీనగర్ కాలనీ, టిడ్కో కాలనీ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో జరిగిన చోరీలను తామే చేసినట్లు విచారణలో అంగీకరించారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లు, రెండు బంగారు చెవిదిద్దులను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.4.50 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితులపై తెనాలి, చల్లపల్లి, గుడివాడ వన్టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జనవరి 2వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో తాలూకా సీఐ ఎస్ఎల్ఆర్ సోమేశ్వరరావు, ఎస్ఐ నంబూరి చంటిబాబు, ట్రైనీ ఎస్ఐ టి.లోకేశ్వరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అంకిత భావంతో విధులు నిర్వర్తించాలి
కోనేరుసెంటర్: పోలీసు శిక్షణకు వెళుతున్న అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం విధి నిర్వహణను అంకితభావంతో నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండా లని జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు తెలిపారు. జిల్లాలో ఇటీవల పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికై న అభ్యర్థులు విజయనగరం, శ్రీకాకుళం పోలీసుశిక్షణ కేంద్రాల్లో తొమ్మిది నెలల పాటు నిర్వహించనున్న శిక్షణకు శనివారం తరలివెళ్లారు. ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ నాయుడు అభ్యర్థులను అభినందించి శిక్షణకు పంపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా అభ్యర్థులు శిక్షణలో అన్ని మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. చట్టాలపై శిక్షణలో పూర్తిగా అవగాహన పెంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, బందరు డీఎస్పీ సీహెచ్ రాజా, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ, అన్నదానం, గోసంరక్షణకు భక్తులు విరివిగా విరాళాలు అందించారు. విజయవాడ మధురానగర్కు చెందిన డి.శ్రీనివాస ప్రసాద్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి ఉచిత ప్రసాద వితరణకు రూ.లక్ష విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయ్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అన్నదానానికి రూ.లక్ష విరాళం అమ్మవారి అన్నప్రసాద వితరణకు చైన్నెకు చెందిన ఎం.బాబ్జి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు. విజయవాడ ఇస్లాంపేటకు చెందిన కె.వి.మోహనరావు దంపతులు దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి రూ.1,00,005 విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించి, వేద ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. -
ప్రైవేటీకరణతో కృశించిపోతున్న ప్రభుత్వ రంగం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ, పీపీపీ విధానం మూలంగా ప్రభుత్వ రంగం క్రమేపీ కృశించిపోతోందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో కార్మికులు, పేదలు మరింత అభద్రతకు గురవుతున్నారని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. విద్యుత్, రవాణా, విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వం తన బాధ్యతలను వదిలించుకునేందుకు ఎంచుకున్న పీపీపీ విధానం మూలంగా అత్యవసర సేవల్లో నాణ్యత, జవాబుదారీతనం లోపించడంతో పాటు సామాన్య ప్రజానీకం మీద మరింత ఆర్థిక భారం మోపడానికి దారితీస్తుందన్నారు. విజయవాడ గవర్నర్ పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నాయకుడు మాకినేని బసవపున్నయ్య 111 వ జయంతి సందర్భంగా ఎం.బి.విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ పి.మధు అధ్యక్షతన శనివారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణ తీరుతెన్నులు–రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అనే అంశంపై స్మారకోపన్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు మార్క్సిజం లెనినిజాన్ని అన్వయించి భారత విప్లవోద్యమానికి సరైన పంథా రూపొందించిన అత్యుత్తమ నాయకుడు బసవ పున్నయ్య అని కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి ఒనగూడాల్సిన ప్రయోజనాలు రాజధాని నిర్మాణానికి కేంద్రం విడుదల చేయాల్సి నిధులపై కేంద్ర ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా రాజీ పడుతోందన్నారు. శ్రమ ప్రాధాన్యత పరిశ్రమలకు బదులు పెట్టుబడి ప్రాధాన్యత పరిశ్రమలకు పెద్దపీట వేయడంతో రాష్ట్రాలలోని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఎంవోయూలు, ఆర్భాటపు ప్రకటనలు కట్టిపెట్టి సరైన పారిశ్రామికాభివృద్ధికి నడుం కట్టాలన్నారు. సంస్థాగతంగా ఉన్న ఆటంకాలను అధిగమించేందుకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎం.బి. విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ, తులసీరావు, స్వరూపరాణి పాల్గొన్నారు. -
అక్రమ కేసులపై న్యాయపోరాటం చేయాలి
గుణదల(విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా చంద్రబాబు పని చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని తన కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికార మదంతో కూటమి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని, అదేమని అడిగిన తమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల విషయంలో లీగల్ సెల్ నాయకులు న్యాయ పోరాటం చేయాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగించిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అవస్థలకు గురవుతున్నారన్నారు. ప్రజల్లో ఇప్పటికే కూటమి పాలనపై వ్యతిరేకత మొదలైందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం లీగల్ సెల్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సాయిరామ్, ఉపాధ్యక్షుడు బసవారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
తిరువూరులో మెగా రక్తదాన శిబిరం
తిరువూరు: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం తిరువూరులో పార్టీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తిరువూరు ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలు కళాశాలల విద్యార్థులు, వైఎస్సార్ సీపీ కార్యక ర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు 200 మందికి పైగా రక్తదానం చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. కౌన్సిలర్ మోదుగు ప్రసాద్, పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి, కాలసాని గోపాల నాగేశ్వరరావు, వాళ్ల సురేష్ తదితరులు రక్తదాన మిచ్చారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ నల్లగట్ల సుధారాణి, మహిళా విభాగ అధ్యక్షురాలు పురిటిపాటి సుధారాణి, తిరువూరు, విస్సన్నపేట జెడ్పీటీసీ సభ్యులు యరమల రామచంద్రారెడ్డి, బీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, తిరువూరు, విస్సన్నపేట వైఎస్సార్ సీపీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్కుమార్, దుర్గారావు, కుటుంబరావు, పార్టీ నాయకులు కలకొండ రవికుమార్, గోగులమూడి చెన్నకేశవరెడ్డి, చావా వెంకటేశ్వరరావు, ఏరువ ప్రకాష్రెడ్డి, తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు, ఇనపనూరి రవి, పరసా నెహ్రూ, రాజ్మహ్మద్, ఆలపాటి ఉమామహేశ్వరరావు, చెరుకు నరసారెడ్డి, మామిడి కుటుంబరావు, బొర్రా మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గుణదల(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెరిగే దిశగా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహద పడతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గుణదలలోని సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఆవరణలో ఏర్పాటైన రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని తెలిపారు. సిద్ధాంత పరమైన సమస్యల పరిష్కారానికి ఆలోచనా సామర్థ్యం పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఉండే ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటిని ప్రోత్సహించేందుకు వీలవుతుందన్నారు. ఆధునిక ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అందరూ విజేతలే.. కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. ఈశ్వర్ మాట్లాడుతూ ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగస్వాములైన విద్యార్థులంతా విజేతలేనని తెలిపారు. ఈ ప్రదర్శనలో సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, హరిత ఇంధనం, గణిత వినోదం, జల వనరుల నిర్వహణ, వంటి అంశాలను ప్రదర్శించారన్నారు. డీఈఓ ఎల్. చంద్రకళ, పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ వరప్రసాద్, ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ రాంబాబు, పాఠశాల హెచ్ఎం సిస్టర్ షైనీ థామస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మస్తుతి.. పరనింద!
మొక్కుబడిగా డీఆర్సీ సమావేశం చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా సమీక్ష సమావేశం మొక్కుబడిగా సాగింది. గంటా నలభై నిమిషాలు ఆలస్యంగా వచ్చిన మంత్రులు.. ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల సహనానికి పరీక్ష పెట్టారు. సమావేశం ప్రారంభమైన తర్వాత కూడా జరగాల్సిన విధంగా జరగలేదు.. తూతూ మంత్రంగానే సాగింది. అంతా ఆత్మస్తుతి, పరనింద అన్న చందంగా సాగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాల కారణంగా తలెత్తుతున్న సమస్యలను సైతం గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ.. తాము చేసేదే గొప్ప అన్నట్లుగా సమావేశం నడిచిందని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా సమీక్ష సమావేశం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో శుక్రవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి 2 గంటలకు హాజరు కావాల్సిన మంత్రి వాసంశెట్టి, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి 3.40 గంటలకు వచ్చారు. దీనిపై అవనిగడ్డ ఎమ్మెల్యే(జనసేన) మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నిర్వహిస్తే పరిపూర్ణంగా నిర్వహించాలని.. లేకుంటే మరో రోజుకు వాయిదా వేయాలని, ఇలా చేస్తే ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ నుంచి విజయవాడ కరకట్ట రోడ్డు పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. మిల్లర్ల జోక్యాన్ని నివారించండి.. అనంతరం వ్యవసాయ అనుబంధ శాఖలపై చర్చ ప్రారంభంకావటంతో మంత్రి సుభాష్ మాట్లాడుతూ మోంథా తుపానును సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు. రాబోయే వేసవి కాలం నాటికి ఇసుకను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని దీని ద్వారా ఇళ్ల నిర్మాణం, భవన నిర్మాణ కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు రూ. 8కోట్ల నిధులు జిల్లా పరిషత్కు కేటాయించారని జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఆర్డర్లు తమకు వచ్చాయని కృష్ణాజిల్లాకు సంబంధించి ఆర్డర్లు రాలేదని వివరించారు. అయినప్పటికీ కృష్ణాజిల్లాకు సంబంధించిన నిధులను బట్టి కేటాయించిన పనులకు సంబంధించిన ఫైలు తాము తిరస్కరించామని పత్రికల్లో సీఈవో కన్నమనాయుడు తనపై వార్తలు రాయిస్తున్నారని మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా గత సర్వసభ్య సమావేశంలో జరిగిన సంఘటనను బట్టి కలెక్టర్ ఇచ్చిన హామీని కూడా లెక్క చేయకుండా మరలా 205 పనులు రద్దు చేస్తూ తనకు లేఖ రాశారని చెప్పారు. పనులు ప్రారంభమైనవి కూడా ప్రారంభం కాన్నట్లుగా చూపుతున్నారని.. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని ఆమె కోరారు. -
దళారులకే సం‘పత్తి’!
కంచికచర్ల: చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అధికారుల నిర్వాకంతో పత్తి రైతులు దళారీల చేతుల్లో నలిగిపోతున్నారు. సీసీఐ పంట కొనుగోలు చేస్తుందని ఊదరగొట్టినా.. చివరికి దళారీలదే పెత్తనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు సీసీఐ కూడా దళారీలకే మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్భాటంగా ప్రారంభం.. ఎన్టీఆర్ జిల్లాలో రైతులు 87,908 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. అయితే మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కొంత మేర పత్తి పంట దెబ్బతింది. గతంలో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే ఈ ఏడాది 5 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చిందని రైతులు అంటున్నారు. పత్తిని కొనుగోలు చేసేందుకు చంద్రబాబు సర్కారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను సంప్రదించింది. ఎన్టీఆర్ జిల్లాలో ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఆర్భాటంగా ప్రారంభించింది. అధికార పార్టీ నాయకులు కూడా దళారుల వద్ద అమ్ముకోవద్దని సీసీఐ ద్వారా పత్తిని విక్రయించాలని రైతులకు చెబుతూ వచ్చారు. కనీస మద్దతు ధరను క్వింటాకు నాణ్యతను బట్టి రూ. 7,710 నుంచి రూ.8,110గా ప్రకటించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ఒక్క దానిలో కూడా పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం లేదు. దళారుల సహకారంతో పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేయించి సీసీఐ అధికారులు లబ్ధి పొందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సీసీఐ, దళారుల మిలాకత్! కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయకపోవటంపై సీసీఐ అధికారులు హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్నారు. కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన పత్తిని గుంటూరులోని మిల్లుల వద్దకు రవాణా చేసేందుకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ టెండర్లు పిలిచామని, ఆ టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవటంతో పత్తిని కొనుగోలు చేయలేక పోతున్నామని కుంటి సాకులు చెబుతున్నారు. కాలయాపన చేస్తూ రైతులను అసహానికి గురిచేస్తూ దళారులను రైతులు ఆశ్రయించేలా చేస్తున్నారు. దళారుల నుంచి పత్తి కొనుగోలు చేయటం ద్వారా సీసీఐ అధికారులు మాత్రం ట్రాన్స్పోర్టు కిరాయిని దోచుకుంటున్నారు. ఇప్పటికే రైతుల వద్ద ఉన్న పత్తికి దళారులు క్వింటాకు రూ. 4వేల నుంచి రూ.4,500 లోపు కొంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిని కలిసినా.. తమ పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కంచికచర్లకు చెందిన ప్రజా ప్రతినిధులు, రైతులు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెం నాయుడిని ఇటీవల కలిశారు. కానీ నేటికీ రైతుల నుంచి ప్రభుత్వం కాని, సీసీఐ అధికారులు కాని కొనుగోలు చేయలేదని రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. -
నాడు పత్తిని రూ.7వేలకు కొన్నారు..
గ్రామంలో 20 ఎకరాలు పత్తి పంట సాగుచేశా. తుపాను దెబ్బకు ఎకరానికి నాలుగు క్వింటాళ్లు పత్తి మాత్రమే దిగుబడి వచ్చింది. జగన్ ప్రభుత్వంలో క్వింటా పత్తిని రూ.7.500కు కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తిని కిలో కూడా కొనలేదు. ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవటం లేదు. కనీసం పత్తి పంట దెబ్బతిన్నా ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎలా తీరుతాయో అర్థం కావటంలేదు. – షేక్ మొహిద్దీన్ పాషా, రైతు, మోగులూరు, కంచికచర్ల మండలం -
వీఆర్వోల సమస్యల పరిష్కారానికి డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్ర రాజు కోరారు. శుక్రవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న అర్హులైన గ్రేడ్–1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. వన్ టైం సెటిల్మెంట్ కింద రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అర్హులతో భర్తీ చేయాలన్నారు. అర్హులైన గ్రేడ్–2 వీఆర్వోలకు గ్రేడ్ –1, వీఆర్వోలుగా వెంటనే ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్వోలు అందరికీ కామన్ డీడీఓగా తహసీల్దార్లు ఉండేలాగా ఆదేశానివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకే డిపార్ట్మెంట్ కింద.. వీఆర్వోలు అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద జాబ్ చార్ట్ ప్రకారం పనిచేస్తారని, ఇతర శాఖల అధికారులు జారీ చేసిన ఆదేశాలు పాటించడం సాధ్యం కాదని రవీంద్రరాజు అన్నారు. బయోమెట్రిక్ విషయంలోనూ జీఎస్డబ్ల్యూ అధికారులు జారీ చేసిన ఆదేశాలు అమలు సాధ్యం కాదన్నారు. వీఆర్వోలు ఈ–ఆఫీసు ద్వారా ఫైల్స్ పంపేందుకు వీలుగా కంప్యూటర్ సౌకర్యం కల్పించాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో వీఆర్వోల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆర్టీజీఎస్ అధికారులు చేస్తున్న చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఏపీ గవర్నమెంట్ రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటు చేసి పనిచేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి మౌళి భాష, గ్రామ సహాయకుల రాష్ట్ర జేఏసీ చైర్మన్ పెద్దన్న, డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర నాయకులు, గ్రేటు–2 వీఆర్వో అసోసియేషన్ నాయకులు శ్యామ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో దేవదాయ శాఖ మంత్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు, చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రా లను బహూకరించారు. అనంతరం ఈవో చాంబర్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో చర్చించారు. భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లు, దేవస్థానంలో ఇటీవల చేపట్టిన మార్పులు, అదనపు కౌంటర్లు, ఆన్లైన్ సేవల గురించి అధికారులు వివరించారు. కార్యక్ర మంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దీక్ష విరమణల సమయంలో తయారు చేసిన లడ్డూలను శుక్రవారం కూడా దేవస్థానం ఉచితంగా పంపిణీ చేసింది. గురు, శుక్రవారాలలో మొత్తం 1.30 లక్షల లడ్డూలను ఉచితంగా పంపిణీ చేసినట్లు దేవస్థాన అధికారులు, చైర్మన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భవానీ దీక్ష విరమణల నిమిత్తం మొత్తం 28.08 లక్షల లడ్డూలను తయారు చేయగా, 24.49 లక్షల లడ్డూలను విక్రయించినట్లు అధికారులు పేర్కొన్నారు. దేవస్థానం వద్ద 4.61 లక్షల లడ్డూల స్టాక్ ఉండగా, వాటిలో 3.32లక్షల లడ్డూలను విక్రయం నిమిత్తం కౌంటర్లలో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మిగిలిన 1.30లక్షల లడ్డూలను ఉచిత ప్రసాద వితరణ బదులుగా గురు, శుక్రవారాల్లో ఆలయ ప్రాంగణంలోని వేరు వేరు ప్రదేశాల్లో భక్తులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిఽధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విశాఖపట్నం గాజువాకకు చెందిన పీతల సునీల్కుమార్ కుటుంబం రూ. లక్ష, ప్రకాశం జిల్లా పుల్లెల చెరువుకు చెందిన టి. బ్రహ్మానందరెడ్డి కుటుంబం టి. కోటిరెడ్డి పేరిట రూ. 1,01,116, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కొండిశెట్టి వెంకట విఠల్ భాస్కర్ తన కుటుంబ సభ్యులైన కె. సత్యనారాయణమ్మ, అంజయ్య ల పేరిట రూ. 1,00,116 విరాళాన్ని అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పక డ్బందీ ఏర్పాట్లతో విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 966 పోలియో బూత్ల పరిధిలో దాదాపు 2,48,900 మంది సున్నా నుంచి అయిదేళ్లలోపు పిల్లలు లక్ష్యంగా పల్స్ పోలియో నిర్వహిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, ప్రజా రవాణా, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులు కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. 611 గ్రామీణ బూత్లు, 355 అర్బన్ బూత్లు, 71 మొబైల్ బృందాలు, 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా బృందాలు సేవలందిస్తాయన్నారు. 22, 23వ తేదీల్లో ఇంటింటి సర్వే.. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి సర్వే ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని కలెక్టర్ చెప్పారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా అధికారులు చూడాలన్నారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, ఆర్డీవోలు పాల్గొన్నారు. -
డివైడర్ ఎక్కి బోల్తా కొట్టిన కారు
కృష్ణలంక(విజయవాడ తూర్పు): డివైడర్ ఎక్కి కారు బోల్తా కొట్టిన ఘటన కనకదుర్గ వారధి ఫ్లై ఓవర్ వద్ద జరిగింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు జి.కొండూరుకు చెందిన నాగభూషణం కారు డ్రైవర్. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అతను మైలవరంలో సమీప బంధువులైన ఇద్దరు మహిళలను కారులో ఎక్కించుకుని కంకిపాడులో శుభకార్యానికి వెళ్లారు. అతను అక్కడే మద్యం సేవించాడు. తిరిగి సాయంత్రం బంధువులను కారులో ఎక్కించుకుని బెంజిసర్కిల్ నుంచి కృష్ణలంక హైవే మీదుగా మైలవరం బయలుదేరాడు. సుమారు సాయంత్రం 6.30 గంటలకు రాణిగారితోటలోని కోదండ రామాలయం సమీపానికి చేరుకోగానే మద్యం మత్తులో ఉన్న అతను గుంటూరు వైపునకు వెళ్లే ప్లైఓవర్పైకి వెళ్లి డివైడర్ను ఎక్కించాడు. కారు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు సీట్బెల్టు ధరించడంతో చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును పక్కకు తీసి వివరాలు సేకరించారు. అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
విస్సన్నపేట: రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న గురుదేవ్ మహాపాత్రో(23)సంఘటన స్థలంలోనే మృతి చెందిన సంఘటన గురువారం విస్సన్నపేట– నూజివీడు రోడ్డులో జరిగింది. మృతుడు విస్సన్నపేటలో ఒక కార్ల షోరూమ్లో స్పేర్పార్ట్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులతో కలసి కొండపర్వలో నివాసం ఉంటున్న గురుదేవ్ మహాపాత్రో ఉదయం విధులకు హాజరయ్యేందుకు స్కూటర్పై ఇంటి నుంచి విస్సన్నపేట వస్తుండగా మలుపు వద్ద లారీ వెనుక భాగం తగిలి తలకు బలమైన గాయం అయి తీవ్ర రక్తస్రావం జరగటంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్కూటీ నడుపుతున్న మృతుడి హెల్మెట్ లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. వెనుకనే వస్తున్న డీసీఎం వ్యాను, దాని వెనుక వస్తున్న ఒక ప్రైవేటు స్కూల్ బస్సు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. స్కూల్ బస్లో ఉన్న విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు. న్యాయం చేయండి.. మృతుడు తల్లి మధుస్మిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. కాగా వీరి స్వగ్రామం ఒడిశా రాష్ట్రం పూరి జిల్లా మల్లూ గ్రామం, అయితే కొండపర్వ గ్రామం వద్ద ఉన్న ఫ్యానుల కంపెనీలో వైడింగ్ పని మేసీ్త్రగా తన భర్త సురేష్ మహాపాత్రో పనిచేస్తుండటంతో కుటుంబం కొండపర్వ గ్రామంలో నివాసం ఉంటున్నామని మృతుడి తల్లి మధుస్మిత పేర్కొన్నారు. డ్యూటీకి వస్తున్న క్రమంలో తన కుమారుడు ఈ విధంగా రోడ్డుప్రమాదంలో మృతి చెందాడని, మృతికి కారణమైనవారిని పట్టుకొని తమకు తగున్యాయం చేయాలన్నారు. చేతికంది వచ్చిన కుమారుడు ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో రక్తపు మడుగులో మృతి చెంది ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకొని విలపించారు. -
మహిళలకు ఇళ్లలోనూ రక్షణ కరువు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. కనీసం ఇళ్లల్లో కూడా మహిళలు స్వేచ్ఛగా ఉండలేని భయానక వాతావరణం నెలకొనడం సిగ్గుచేటని వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగ్నగర్లోని నార్త్జోన్ తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో బుధవారం గంజాయి బ్యాచ్ వీరంగంతో గాయపడిన గుమ్మళ్ల కుసుమ కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయన గురువారం పరామర్శించారు. గంజాయి బ్యాచ్ సభ్యులు చేసిన ఆగడాల గురించి బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీసిన వీడియోలను చూసి నివ్వెరపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని విమర్శించారు. టీడీపీ నాయకుల వత్తాసు సిగ్గుచేటు.. అమాయక ప్రజల ధన, మాన, ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడని గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు టీడీపీ నాయకులు వత్తాసు పలకడం సిగ్గుచేటని గౌతమ్రెడ్డి విమర్శించారు. ఇళ్లల్లో చొరబడి రాళ్లు, క్రికెట్ బ్యాట్లు, కారం ప్యాకెట్లతో అలజడి చేసి ఇళ్లను ధ్వంసం చేసి చిన్నపిల్లలను సైతం బూతుపురాణాలతో చంపేస్తామని బెదిరించిన మానవ మృగాలను కాపాడేందుకు టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిళ్లు తీసుకురావడం దారుణమన్నారు. ఇటువంటి విధానాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని.. కూటమి ప్రభుత్వ పాలకులు ఇటువంటి విధానాలను వీడకుండా నేరాలను, నేరస్తులను ప్రోత్సహిస్తే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తోందని హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల చేతుల్లో పావులుగా మారకుండా చట్టపరంగా.. న్యాయపరంగా నడుచుకోవాలని కోరారు. వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి సింగ్నగర్లో గంజాయి బ్యాచ్ చేతిలో గాయపడిన మహిళ కుటుంబానికి పరామర్శ -
భక్తులకు ఉచితంగా లడ్డూల పంపిణీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దీక్ష విరమణలలో తయారు చేసిన లడ్డూలను దేవస్థానం గురువారం ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేసింది. భవానీ దీక్ష విరమణలను పురస్కరించుకుని దేవస్థానం భారీగా లడ్డూలను తయారు చేసింది. అయితే చివరి రోజైన సోమవారం భక్తులు, భవానీల రద్దీ అంతంత మాత్రంగానే ఉండటంతో లడ్డూ విక్రయాలు తగ్గాయి. దీంతో దేవస్థానం వద్ద భారీగా లడ్డూ స్టాక్ ఉండటంతో గురువారం ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో భక్తులకు వాటిని ఉచితంగా పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే మార్గంలో రెండు ప్రదేశాల్లో, మహా మండపం లిప్టు ఎదుట, ఘాట్రోడ్డు మార్గంలో డోనర్ సెల్ వద్ద సేవా సిబ్బంది, ఆలయ అర్చకులకే లడ్డూలను పంపిణీ జరిగింది. మరో వైపున భక్తులు ఇదే అవకాశంగా ఒక్కోక్కరు ఒకటికి, రెండు సార్లు క్యూలైన్లో నిల్చోని లడ్డూలను పొందారు. దీంతో ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్, మహా మండపం దిగువన లడ్డూ కౌంటర్లు విక్ర యాలు లేక వెలవెలపోయాయి. దీక్ష విరమణలకు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన తిరుగు ప్రయాణమైన శానిటేషన్, సెక్యూరిటీ, దేవదాయ శాఖ, పోలీసు, ఇతర విభాగాలకు చెందిన వారికి సైతం దేవస్థానం లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేయడం విశేషం. అయితే ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి మాత్రం ఉచిత లడ్డూ ప్రసాదాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పొగముంచు.. గమనించు!
నాగాయలంక మండలంలో మంచు కమ్మేసింది. గురువారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచే దట్టంగా కమ్ముకున్న మంచుతో ఉదయాన్నే పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, ట్యూషన్లకు వెళ్లే విద్యార్థులు, స్వచ్ఛత పనులకు కదిలే పారిశుద్ధ్య కార్మికులు అవస్థలు పడ్డారు. ఉదయం 8గంటల దాటినా మంచు దుప్పటి వీడక పోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ఎవరికివారు జాగ్రత్తగా ముందుకు కదిలారు. – నాగాయలంక ఉదయం 8.30గంటల వేళ బయటకు వస్తున్న భానుడు ఉదయాన్నే మంచు, చలి నుంచి ఊరట పొందేందుకు టీ స్టాల్స్కు క్యూ కట్టిన శ్రామికులు వర్షంలా కురుస్తున్న మంచు మధ్యనే.. -
కేంద్రాలపై ప్రభుత్వం చిన్న చూపు
● పౌషకాహార లోపంతో చిన్నారులు ● అంగన్వాడీల్లో స్పెషల్ డైట్ ఊసే ఎత్తని సర్కారు ● దొడ్డుబియ్యం ఇస్తుండటంతో తినలేకపోతున్న చిన్నారులు ● గత వైభవం కోల్పోయిన అంగన్వాడీలు లబ్బీపేట(విజయవాడతూర్పు): చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. ఫలితంగా ఎదుగుదల లోపిస్తోంది. వయస్సుకు తగిన ఎత్తు, బరువు సక్రమంగా ఉండటం లేదు. ప్రభుత్వం సైతం అలాంటి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతా ల్లోని అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో 20 నుంచి 30 శాతం మంది ఇలాంటి పిల్లలు ఉన్నట్లు సమా చారం. అందుకు ఇటీవల జక్కంపూడి ప్రాంతంలోని ఒక అంగన్వాడీ సెంటర్ను ఓ జిల్లా అధికారి తనిఖీ చేయగా, అక్కడ ఉన్న 20 మందిలో 8 మంది పోషకాహార లోపంతో ఉన్నట్లు గుర్తించడమే నిదర్శనంగా కనిపిస్తోంది. వారికి ప్రత్యేక డైట్ ఏమైనా ఇస్తున్నారా అంటే అదేమీ లేదని తేలింది. అంతేకాదు పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ఇచ్చే ప్రత్యేక డైట్పై అంగన్వాడీలకు సైతం సరైన అవగాహన లేక పోవడం కొసమెరుపు. లావు బియ్యం, పుచ్చిన కందిపప్పు.. అంగన్వాడీల్లో చిన్నారులకు ప్రతిరోజూ మధ్యాహ్నం పప్పు, ఆకుకూరల భోజనంతో పాటు, ఉడికించిన గుడ్డు, వంద మిల్లీలీటర్ల పాలు ఇవ్వాలని మెనూలో ఉంది. కానీ అక్కడ పెట్టే భోజనం చిన్నారులు తినలేక పోతున్నట్లు చెబుతున్నారు. రేషన్ దుకాణాల్లో ఇచ్చే దొడ్డు(లావు) బియ్యమే అంగన్వాడీలకు ఇస్తుండటం, ఒక్కోసారి కందిపప్పు సైతం నాణ్యతాలోపం ఉండటంతో చిన్నారులు తినలేక పోతున్నట్లు చెబుతున్నారు. నూనె, ఇతర సరుకులు కూడా అంత నాణ్యత ఉండటం లేదు. దీంతో అంగన్వాడీల్లోని చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. మరోవైపు పోషకాహారలోపం ఉన్న వారికి అదనంగా డైట్ ఇవ్వాల్సి ఉన్నా, అది సరిగా అమలు కావడం లేదు. దీంతో పోషకాహార లోపం చిన్నారులకు శాపంలా మారుతుంది. గర్భిణులకూ నాసిరకమే.. ఏడాదిగా గర్భిణులకు సరఫరా చేసే రాగి పిండిలో ఇసుక తగులుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. నాసిరకం రాగి పిండి సరఫరా చేయడంతో ఇలా జరుగుతోందని వారు అంటున్నారు. అంతేకాకుండా చిక్కీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినది నాణ్యతగా ఉండేదని, కానీ ఇప్పుడు తినలేక పోతున్నామంటున్నారు. మరోవైపు పాలు లీటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారని, అవి ఫ్రిడ్జ్ లేని వాళ్లు ఎలా స్టోరేజ్ చేసుకుని తాగాలని ప్రశ్నిస్తున్నారు. అరలీటరు ప్యాకెట్స్ ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకూ వైఎస్సార్ సీపీ పాలనలో అంగన్వాడీలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే నిత్యావసరాలు నాణ్యతతో ఉండేలా చూశారు. ముఖ్యంగా సన్నబియ్యం సరఫరా చేయడంతో చిన్నారులు ఇష్టంగా తినేవారు. ఎవరైనా పోషకాహార లోపంలో చిన్నారులకు ఉంటే వారికి ప్రత్యేక డైట్ అందించేవాళ్లు. అలా మూడు నెలలు ఇచ్చినా బరువు పెరగకపోతే, వారికి న్యూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్(ఎన్ఆర్సీ)కు రిఫర్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్పెషల్డైట్ సక్రమంగా అందక పోగా, ఎన్ఆర్సీ సెంటర్కు కూడా రిఫర్ చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదు. దీంతో చిన్నారులకు బరువు తక్కువగా ఉంటూ, చలాకీగా ఉండలేక పోతున్నారు. అంగన్వాడీల్లో పిల్లలందరికీ రొటీన్ డైట్ ఇస్తాం. పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఉంటే, వారికి జీర్ణ లోపం ఉందేమో గుర్తించి, వారికి ఆహారం ఎలా పెట్టాలో తల్లికి కౌన్సెలింగ్ ఇస్తాం. స్పెషల్ డైట్ అంటూ ఏమీలేదు. – రుక్సానా, పీడీ, ఐసీడీఎస్, ఎన్టీఆర్ జిల్లా -
కన్నతల్లిని, జన్మభూమిని మరువకూడదు
గుడివాడ టౌన్: వునిషి ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా కన్న తల్లినీ, జన్మభూమినీ మరువ కూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నాట్స్ ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ హాలులో గురువారం నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేటి యువతరం ప్రకృతి సమతుల్యతను పాటించాలన్నారు. యువత ప్రకృతి సమతుల్యతను పాటించేందుకు ప్రయత్నించాలన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలన్నారు. నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ తన జన్మభూమిని గుర్తు ఉంచుకుని గుడివాడలో 30 విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, డాక్టర్ భవాని శంకర్, డాక్టర్ పాలడుగు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు -
విద్యాహక్కు చట్టంలో సవరణ తీసుకురావాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసు కురావాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరిచాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో గురువారం ఉపాధ్యాయులు ధర్నా చేశారు. కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం 2009 క్లాజ్ 23(2) సవరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తప్పని సరిగా టెట్ రాయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఇప్పటికీ నాలుగు నెలలైనా, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రివ్యూ పిటీషన్ వేయకపోవటాన్ని తప్పుపట్టారు. వెంటనే కోర్టులో రివ్యూ పిటీషన్ వేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి.మనోహర్ కుమార్, జిల్లా ప్రధాన కార్య దర్శి సుందరయ్య మాట్లాడుతూ.. ఆప్షన్ హాలిడే విని యోగించుకోవడంలో, రెండో శనివారం సెలవులు, ఏకోపాధ్యా యులు ఓహెచ్, ఇతర సెలవులు వినియోగించుకోవడంలో అధికారుల మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విజయవాడ కార్పొరేషన్ పరి ధిలో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం నాగాయలంక: మాస శివరాత్రి సందర్భంగా స్థానిక శ్రీరామ పాద క్షేత్రంలోని పుష్కర ఘాట్ వద్ద ఉన్న గంగ, పార్వతి సమేత రామలింగేశ్వరస్వామికి గురువారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 41.9308 టీఎంసీలు. గుడివాడటౌన్: ఏఎన్నార్ కాలేజీ వజ్రోత్సవాలు గురు వారం ఘనంగా ముగిశాయి. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్టౌన్(విజయవాడ పశ్చిమ):వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజయవాడలో గురువారం ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి మద్దతుగా తరలివచ్చిన ప్రజలు జననేతకు సంఘీభావం తెలిపారు. ప్రైవేటీకరణపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని కోటి సంతకాల రూపంలో గవర్నరకు తెలియజేయడానికి అభిమాన నేత నగరానికి చేరుకోవటంతో పార్టీ శ్రేణులతో పాటుగా భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పట్టి సంపూర్ణ మద్దతు తెలిపారు. నేతాజీ వంతెన నుంచి అంబేడ్కర్ స్మృతి వనం వరకు.. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నేతాజీ వంతెన వద్ద వేలాది మంది వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు నీరాజనాలు పలికారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేశారు. వందలాది కార్లు, వేలాది ద్విచక్ర వాహనాలతో భారీ సంఖ్యలో ప్రజలు వెంటరాగా పశువుల ఆస్పత్రి సెంటర్ వద్ద బందరు రోడ్డులోకి జననేత కాన్వాయ్ ప్రవేశించింది. అక్కడి నుంచి బందరు రోడ్డు మీదుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్మృతి వనం వద్దకు చేరుకుంది. రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్మృతి వనం వద్ద పార్టీ నాయకులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ పార్టీ శ్రేణులు నినదించాయి. అక్కడి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో చేపట్టిన ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందించేందుకు తరలివెళ్లారు. దారి పొడవునా జై జగన్.. జైజై జగన్ అన్న నినాదాలు మిన్నంటాయి. అడుగడుగనా ఆంక్షలు.. నగరంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సంద ర్భంగా అడుగడుగునా ఆంక్షలు విధించారు. బందరురోడ్డు పరిసరాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అంబేడ్కర్ స్మృతి వనం నుంచి గవర్నర్ బంగ్లాకు జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు, పోలీసులు బారికేడ్లు పెట్టి ఇబ్బందులు పెట్టారు. జననేత వెంట జనం ముందుకు సాగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, ఆంక్షలు విధిస్తూ ఎటూ వెళ్లడానికి లేకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ సుమారు మూడు గంటల పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వేలాది మంది ప్రజలు అనుసరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణకుమార్, రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, వెలంపల్లి, మల్లాది విష్ణు, పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ వివిధ విభాగాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. 7ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న చర్యలు దారుణం. పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు రానున్న రోజుల్లో వైద్య విద్య అందకుండాపోతుంది. ప్రభుత్వం తక్షణం ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలి. పేద, మధ్య తరగతి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలి. వారికి వైద్య విద్యను చేరువ చేయాలి. – కై లా భరత్ భూషణ్, బీఎస్సీ విద్యార్థి, యనమలకుదురు, పెనమలూరు మండలం -
ప్రైవేటీకరణను విరమించాలి
పేదలకు ఉచిత వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి ఐదింటిని ప్రారంభించారు. మిగిలినవి పూర్తయితే మాలాంటి పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందుతుంది. పది మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే వైద్య విద్యకు దూరం కావాల్సి వస్తుంది. వెంటనే ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించాలి – మహేష్ నాయక్, విద్యార్థి, విజయవాడ -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్షల విరమణ ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.4.49 కోట్ల ఆదాయం సమకూరింది. గురువారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.3,21,22,542 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మహా మండపం ఆరో అంతస్తులో కానుకలు లెక్కించారు. బుధవారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.1,27,90,645 కోట్ల ఆదాయం వచింది. రెండు రోజుల్లో రూ.4,49,13,187 నగదు, 218 గ్రాముల బంగారం, 17.324 కిలోల వెండి సమకూరింది. 190 యూఎస్ఏ డాలర్లు, 25 కెనడా డాలర్లు, 15 యూఏఈ దిర్హమ్స్, 23 మలేరియా రింగట్స్, 101 ఖత్తర్ రియాన్స్, 100.5 ఓమన్ బైంసాలు లభించాయి. కానుకల లెక్కింపును ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించగా, దేవస్థాన సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు. మచిలీపట్నం – ప్రయాగ్రాజ్ మధ్య ప్రత్యేక రైలు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు మచిలీపట్నం – ప్రయాగ్రాజ్ మధ్య ప్రత్యేక వన్ వే రైలు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రు ప్కర్ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. ఈ నెల 22న సాయంత్రం 4.20 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, 24న తెల్లవారుజాము 4.30 గంటలకు ప్రయాగ్రాజ్ చేరుతుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్లు, పెద్దపల్లి, మాచర్ల, సిర్పూర్ కాగజ్నగర్, బల్హార్షా, చంద్రాపూర్, నాగ్పూర్, బినా, వీరంగన లక్ష్మీభాయ్ జంక్షన్, ఒరై, గోవింద్పురి స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. విజయవాడ–కాచిగూడ ప్రత్యేక రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు నుస్రత్ మండ్రుప్కర్ తెలిపారు. ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్ మీదుగా కాచిగూడ చేరుకుంటుంది. పల్స్ పోలియోను విజయవంతం చేద్దాం లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈ నెల 21వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిద్దామని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. పల్స్ పోలియోపై యూపీ హెచ్సీ వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ ఎంలు, బూత్ వలంటీర్లకు తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గురువారం శిక్షణ ఇచ్చారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేయాలని స్పష్టంచేశారు. తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు మాత్రమే వైద్యుడి సంప్రదించా లని సూచించారు. జిల్లాలో 966 పోలియో బూత్లలో 2,48,900 మంది పిల్లలకు చుక్కల మందు వేయాలన్నది లక్ష్యమని వివరించారు. ఈ సమావేశంలో వీఎంసీ సీఎంఓహెచ్ డాక్టర్ అర్జునరావు, ఏఎంఓహెచ్ డాక్టర్ బాబుశ్రీనివాసరావు, డాక్టర్ గోపాలకృష్ణ, డీఐఓ డాక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. నేడు జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్ వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన నగరంలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల(గుణదల)లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్)ను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులలో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రొత్సహించే లక్ష్యంతో వివిధ స్థాయిల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా పాఠశాల, మండల స్థాయిలో నిర్వహించిన విజేతలతో జిల్లా స్థాయి ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన నమూనాలను రాష్ట్ర స్థాయిలో, అక్కడ విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయికి పంపిస్తామని వివరించారు. మండల స్థాయిలో గ్రూప్ ఎగ్జిబిట్స్ ఏడు చొప్పున, విద్యార్థుల వ్యక్తిగత ఎగ్జిబిట్స్ రెండు, ఉపాధ్యాయులు వ్యక్తిగత ఎగ్జిబిట్స్ రెండు చొప్పున ప్రదర్శనలో ఉంటా యని వివరించారు. -
సమస్యలపై చర్చ జరిగేనా?
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) తొమ్మిది నెలల తరువాత శుక్రవారం జరగనుంది. గత డీఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు సమాచారాన్ని సంబంధిత అధికారులు మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాల్సి ఉంది. తొమ్మిది నెలల తరువాత డీఆర్సీ సమావేశం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇది మూడో సమావేశం. గత డీఆర్సీ తూతూమంత్రంగా సాగింది. ఈ సమావేశంలో అయినా ప్రస్తుతం జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలపై చర్చ జరుగుతుందో లేదోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశం అజెండాలో వ్యవసాయ అనుబంధ శాఖలతో పాటు విద్య, వైద్యం, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, గృహనిర్మాణం, పరిశ్రమలు తదితర శాఖలకు సంబంధించి అంశాలను పొందుపరిచారు. రైతుల సమస్యలపై చర్చ సాగేనా..? జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు డీఆర్సీ జరగనుంది. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై చర్చ జరిగేనా అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. పంట కోతకొచ్చే సమయంలో మోంథా తుపాను ప్రభావం వల్ల జిల్లాలోని చాలా మండలాల్లో ఈదురుగాలులకు పైరు నేలవాలింది. ధాన్యం రాశులు వర్షానికి తడిచిపోయాయి. దీంతో ధాన్యంలో తేమ శాతం రైతులను వేధించింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని రైతులు పోరాటం చేసినప్పటికీ తేమశాతం తగ్గిస్తేనే కొనంటామని అధికారులు తెగేసి చెప్పారు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తూ మంత్రి కొలుసు పార్థసారథి ఇటీవల జిల్లాలో పర్యటించినప్పుడు ధాన్యం కొనుగోళ్లపై రైతులు నిలదీశారు. ఇప్పటికీ జిల్లాలో సగానికిపైగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ధాన్యం సేకరణ, రైతుల ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందో, లేదో వేచి చూడల్సి ఉంది. జిల్లాలోని ప్రతి మిల్లులో తేమశాతం తగ్గించేందుకు డ్రయ్యర్లు ఏర్పాటు చేయాలని గత సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. వలసలపై చర్యలేవి? కృష్ణాజిల్లా నుంచి పేదలు ఎక్కువగా వలస వెళ్తున్నారని, దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారిం చటం లేదని గత సమావేశం దృష్టికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీసుకువచ్చారు. జిల్లాలో అన్యాక్రాంతమైన భూములపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కలెక్టర్ వివరించాల్సిన అవసరం ఉందని యార్లగడ్డ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడలేని మనం ఇలా సమావేశాలు నిర్వహించటం వృథా అని ఆయన తేల్చి చెప్పారు. పశుసంవర్ధకశాఖపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాల్సిన అవసరం ఉంది. అన్నిశాఖల అధికారులందరూ జిల్లా కేంద్రమైన బందరులో కచ్చితంగా ఉండాల్సిందేనని మంత్రి కొల్లు రవీంద్ర గత సమావేశంలో స్పష్టంచేశారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అయినప్పటికీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోతో పాటు కొంతమంది అధికా రులు తప్ప ఎక్కువశాతం అధికారులు ఇప్పటికీ విజయవాడ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. మంత్రి సూచనలు, కలెక్టర్ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడంలేదు. అధికారులు జిల్లా కేంద్రంలో నివాసం ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే సమస్యల పరిష్కారంలో చొరవ చూపొచ్చని గత సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచించిన నేపథ్యంలో అటువంటివి ఏమీ ప్రస్తుతం జరగటం లేదు. ఈ సమావేశంలో ఈ విషయంపై ఎంత మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తారో చూడాల్సి ఉంది. -
తక్షణమే విరమించుకోవాలి..
చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కార్పొరేట్లకు కారు చౌకగా అప్పజెప్పే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా ఒక్క పాఠశాల కానీ, కళాశాల కానీ, విశ్వవిద్యాలయం కానీ నిర్మించడం చేతకాలేదు. కానీ గత ప్రభుత్వంలో నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాసులకు కక్కుర్తి పడి కార్పొరేట్లకు లీజుకు ఇవ్వడం సరైన పద్ధతి కాదు. – ఎం. సాయికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏఐఎస్ఎఫ్ -
ఎలా రద్దు చేస్తారు..
పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేసి పనులు కేటాయింపులు జరిపి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తరువాత ఎలా రద్దు చేస్తారు? నిధుల రాబడి అంచనాలు రూపొందించిన తరువాతే పనుల కేటాయింపు జరిగింది. గత సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ ఇచ్చిన హామీని సీఈవో లెక్క చేయటం లేదు. చైర్పర్సన్, పాలకవర్గ సభ్యులకు సమావేశం నిర్వహించి పనులపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఈవో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు. – వేముల సురేష్బాబు, గూడూరు జెడ్పీటీసీ -
మాకేం సంబంధం లేదు!
● బీఎస్సీ(ఎంఎల్టీ) విద్యార్థుల సమస్యలపై హెల్త్ వర్సిటీ వీసీ చంద్రశేఖర్ ● వర్సిటీ ఎదుట నిరసన తెలిపిన విద్యార్థులు వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని 2021– 22 సంవత్సర బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు కళాశాలల నుంచి వచ్చిన బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థులు డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ను బుధవారం కలిశారు. ప్రధానంగా 2021–22 సంవత్సర బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థులకు ఇంటర్న్షిప్ను ఆప్షనల్గా పెట్టాలని లేదా గరిష్టంగా ఆరు నెలలకు పరిమితం చేసి, ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థుల నుంచి ఇంటర్న్షిప్ పేరుతో ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదనీ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్న్షిప్ కారణంగా పొడిగించిన సంవత్సరానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్న్షిప్ సమయంలో కనీసం నెలకు రూ.6,000 స్టైఫండ్తో పాటు వారాంతాల్లో సెలవు ఇవ్వాలని కోరారు. మేం ఏం చేయలేం.. విద్యార్థుల డిమాండ్లపై వీసీ సానుకూలంగా స్పందించకపోవటంతో పాటు తాము ఏం చేయ లేమని స్పష్టం చేసినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజులు వసూలు చేయమని తాము చెప్పలేదని, కనుక తమకు సంబంధం లేదని, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కాబట్టి స్టైఫండ్ రిలీజ్ చేయడం కుదరదని పేర్కొన్నారని చెప్పారు. దాంతో విద్యార్థులు బయటకు వచ్చి యూనివర్సిటీ ఎదుట కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. -
పీపీపీపై జనకోటి కన్నెర్ర
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాu8లో గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సంతకాలతో నిరసనాగ్రహాన్ని వ్యక్తం చేసిన ప్రజలు● వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ● ఆ ప్రతులను నేడు గవర్నర్కు అందించనున్న వైఎస్ జగన్ ● ఉమ్మడి జిల్లా నుంచి 8.25 లక్షల సంతకాలు వన్టౌన్(విజయవాడపశ్చిమ): మెడికల్ విద్యను పేదలకు దూరం చేసే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న పీపీపీ విధానంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల ప్రజల నుంచి కోటి సంతకాలను సేకరించి ఆ ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కు నివేదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ క్రమంలో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన సంతకాల పత్రాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రాష్ట్ర గవర్నర్ను కలిసి అందించనున్నారు. జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ఉద్యమానికి కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాకుండా మిగిలిన రాజకీయపక్షాలు, విద్యార్థి సంఘాలు సైతం స్పందిస్తున్నాయి. దీంతో చంద్రబాబు సర్కార్ బెంబేలెత్తుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి 8.25 లక్షల సంతకాలు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి భారీ స్పందన లభించింది. రెండు జిల్లాల్లోని 14 నియోజకవర్గాల నుంచి ప్రజలు తమ సంతకాల ద్వారా చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ (పశ్చిమ), విజయవాడ (తూర్పు), విజయవాడ (సెంట్రల్), నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల నుంచి 4.25 లక్షల సంతకాలు రాగా, కృష్ణాజిల్లా నుంచి మచిలీపట్నం, గుడివాడ, పామర్రు, పెనమలూరు, పెడన, అవనిగడ్డ, గన్నవరం నియోజకవర్గాల నుంచి సుమారుగా నాలుగు లక్షల ప్రజల నుంచి సంతకాలను పార్టీ శ్రేణులు సేకరించాయి. ఆయా సంతకాల పత్రాలను 15వ తేదీన రెండు జిల్లాల నుంచి నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. ఉద్యమిస్తున్న రాజకీయ, విద్యార్థి సంఘాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలకు వైద్య విద్యను చేరువ చేసే లక్ష్యంతో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. వాటిల్లో కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే ఐదు మెడికల్ కళాశాలలను పూర్తి చేసి తరగతులను సైతం ప్రారంభించారు. మరో రెండు కళాశాలలు అందుబాటులో వచ్చే సమయానికి ఎన్నికలు రావటంతో చంద్రబాబు సర్కార్ గద్దనెక్కింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానం అంటూ తన అనుకూల వర్గీయులకు మెడికల్ కళాశాలలను కట్టబెట్టేందుకు కుట్రకు తెరలేపారు. దీనిపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రజా ఉద్యమం కొనసాగుతూ ఉండగా అదేబాటలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు రోడ్డుపైకి వస్తున్నాయి. 7గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టారు. అవి పూర్తయితే నాలాంటి పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యలో మంచి అవకాశాలు వచ్చేవి. కాని ప్రభుత్వం మారినంత మాత్రానా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గ చర్యగా భావిస్తున్నా. దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి ప్రైవేటీకరణను ఆపాలి. – కుక్కమళ్ల బ్యూలా, బీటెక్ విద్యార్థి, కంచికచర్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఫీజులు భారీగా పెరిగి వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుంది. వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు అధికంగా పాల్గొని ప్రభుత్వంపై వ్యతిరేకత చాటారు. గవర్నర్ సైతం ప్రైవేటీకరణపై తుదినిర్ణయం తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలని కోరుతున్నాం. – జి.హేమంత్, బీటెక్ విద్యార్థి, మైలవరంప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్య విద్యను దూరం చేసినట్లే. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకుంటే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. – వెనుగుర్తి హరి, జగ్గయ్యపేటప్రభుత్వ దంత వైద్య కళాశాల 2020 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు బుధవారం వెటర్నరీ కాలనీలోని ఓ ఫంక్షన్ హాలులో ఘనంగా జరిగాయి. గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.యుగంధర్ బుధవారం గుడ్లవల్లేరు పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేశారు. మందుల పంపిణీ, వార్డులను పరిశీలించారు. గుడివాడటౌన్: గుడివాడలో బుధవారం సినీ నటుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలకు కుటుంబసభ్యులతో హాజరయ్యారు. సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర అట్టడుగు వర్గాలకు వైద్య విద్యను దూరం చేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యంగా ఉంది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. – సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ ప్రభుత్వమే ప్రజల ప్రాథమిక హక్కులైన విద్యా, వైద్య రంగాలను కళ్ల ముందు కాజేస్తూ, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పీడీఎస్వో ఖండిస్తోంది. ప్రభుత్వ వైద్య కళాశాలల ిపీపీపీ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. యువగళం పాదయాత్రలో జీవో నంబర్ 107, 108ను రద్దు చేసి 100 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేస్తామన్న హామీని ఎందుకు నిలబెట్టుకోరని ప్రశ్నిస్తున్నాం. – ఏ సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్వో -
దుర్గగుడికి కంప్యూటర్ సామగ్రి వితరణ
మచిలీపట్నంఅర్బన్: విద్యా ప్రమాణాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడమే లక్ష్యమని, అందుకు ఉపాధ్యాయులు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. జిల్లాలో అమలవుతున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమ పరిశీలనలో భాగంగా తవిసిపూడి జెడ్పీ హైస్కూల్ను డీఈఓ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాక్షన్ ప్లాన్లో భాగంగా విద్యార్థుల అభ్యాస స్థాయిని పెంపొందించడం, ప్రాథమిక భావనలపై పట్టు పెర గడం, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా లక్ష్య నిర్ధారణతో బోధన జరగాలన్నారు. పాఠశాలల్లో క్రమశిక్షణ, హాజరు శాతం, బోధన నాణ్యత మెరుగుపడేలా 100 రోజుల యాక్షన్ ప్లాన్ను సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థుల అభ్యాస ఫలితాలను సమీక్షించారు. నోట్స్ సరిదిద్దు విధానం సహా ఇతర అకడమిక్ రికార్డులను పరిశీలించారు. గన్నవరం: సమాజానికి డ్రగ్స్ మహమ్మారి పెను సవాల్గా మారిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. యువత మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు, సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో బుధవారం వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులతో ముఖా ముఖీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని తెలిపారు. తన కుమారై దీపా వెంకట్ నేతృత్వంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారం లేకుండానే ఉపాధి, వైద్య సేవలందించడమే ట్రస్ట్ లక్ష్యమన్నారు. ట్రస్ట్ సీఈఓ శరత్బాబు, కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరదేశి పాల్గొన్నారు. సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి అత్యాధునిక పరికరాలు అవసరమని.. ఇందుకు సీఎస్ఆర్ ఫండ్స్ నుంచి రూ.2.80కోట్లు ఇవ్వాలంటూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కోరారు. కార్డియాలజీ, ఆప్తాల్మాలజీ, రేడియోలజీ వంటి విభాగాలకు వైద్య పరికరాలు అవసరమన్నారు. ఇందుకోసం రూ.2.80 కోట్లతో రూపొందించిన అంచనా వ్యయాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. -
ఏకపక్షంగా 205 పనులు రద్దు చేసిన సీఈఓ
● కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతర్ ● గత పాలకవర్గ సమావేశంలో నిలదీసినా వెనక్కి తగ్గని వైనం ● అధికారిని వెనకుండి నడిపిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ● సీఈఓ నిర్ణయంపై భగ్గుమంటున్న పాలక వర్గ సభ్యులు సాక్షి ప్రతినిధి, విజయవాడ/మచిలీపట్నం: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన పనులను రద్దు చేస్తూ సీఈవో కన్నమనాయుడు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆయన పాలక వర్గం నిర్ణయాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై పాలక వర్గ సభ్యులు భగ్గుమంటున్నారు. గత పాలక వర్గ సమావేశంలో పనుల రద్దు అంశంపైన సమావేశంలో గందరగోళం నెలకొంది. సీఈవో తీరును నిరసిస్తూ సభ్యులు నిరసన చేపట్టారు. కలెక్టర్ హామీతో సభ్యులు శాంతించారు. అయితే మరలా ఈ నెల 19వ తేదీన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ సీఈవో కె. కన్నమనాయుడు తన మొండి వైఖరి విడనాడకుండా, సమావేశంలో ఆమోదించిన పనులను రద్దు చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతి నిధులకు మంచి పేరు ఎక్కడ వస్తుందోనని ఆందోళన చెందుతున్న అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జిల్లా పరిషత్ సీఈఓను పావుగా వాడుకొంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లా పరిషత్ పాలకవర్గం ఆమోదించిన పనులకు నిధులు లేవంటూ సాకులు చూపుతూ రద్దు చేసి, ‘నేనింతే’ అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు సూచించిన పనులకు నిధులు వెచ్చిస్తున్నారు. పాలకవర్గంపై అక్కసుతోనే.. జిల్లా పరిషత్ పాలకవర్గం ఆయా సభ్యులకు కేటాయించిన రూ.12.74కోట్లకు సంబంధించి 205 పనులు నిలిపివేస్తూ జెడ్పీ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి చైర్పర్సన్కు లేఖ పంపినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులకు చెందిన పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ పాలకవర్గం వైఎస్సార్ సీపీది కావటంతో వారిపై అక్కసుతో కావాలనే ఈ రకంగా సీఈవో వ్యవహరిస్తున్నారని సభ్యులు వాపోతున్నారు. గత సర్వసభ్య సమావేశం ముందు రూ. 24.75 కోట్లకు చెందిన 424 పనులను రద్దు చేశారు. దీంతో సభ్యులు సమావేశంలో ఒక్కసారిగా సమావేశాన్ని స్తంభింపజేసి పనులను ఎందు కు నిలిపివేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. రద్దు చేసిన పనులు ఇవి.. నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి మండలాలకు ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేశారు. గుడ్లవల్లేరు, బంటుమిల్లి మండలాలకు శ్మశానవాటికలు లేవని, దహన సంస్కారాలకు చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆయా పంచాయతీలోని ప్రజలు విన్నవించగా 25 పంచాయతీలకు టెండర్ ద్వారా పనులను చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. ఇబ్రహీంపట్నంలోని రూ.90 లక్షల విలువగల పనులకు శంకుస్థాపన సైతం చేసినట్లు గత జెడ్పీ సర్వసభ్య సమావేశం దృష్టికి జెడ్పీ వైస్ చైర్సర్సన్ శ్రీదేవి తెచ్చారు. గత సర్వసభ్య సమావేశంలో పనుల రద్దు విషయంలో సభ్యులు చేసిన పోరాటానికి కలెక్టర్ డీకే బాలాజీ స్పందిస్తూ చైర్పర్సన్, సీఈవో, ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి పనులు ఎంత వరకు వచ్చాయి? ఏ పనులు పూర్తయ్యాయి? అనే విషయాలను చర్చిస్తామని.. అనంతరం నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీని సైతం తుంగలో తొక్కి ఏకపక్షంగా 205 పనులను సీఈఓ రద్దు చేయడంపై సభ్యులు మండిపడుతున్నారు. పనుల రద్దు సమయంలో కలెక్టర్ ఇచ్చిన హామీనీ ఓ అధికారి, సీఈఓ దృష్టికి తీసుకొని వస్తే, ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. చైర్మన్, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం పెట్టకుండానే నిర్ణయం తీసుకోవడం ఆయన మొండి వైఖరికి అద్దం పడుతుందనే భావన పలువురిలో వ్యక్తం అవుతోంది. -
దుర్గమ్మ హుండీ ఆదాయం లెక్కింపు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణలలో అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. తొలి విడత లెక్కింపులో రూ.1.27కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో జరిగిన కానుకల, ముడుపులు, మొక్కుబడుల లెక్కింపులో మొత్తం రూ. 1,27,90, 645 నగదు, 18 గ్రాముల బంగారం, 2.474 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. గురువారం కూడా కానుకల లెక్కింపు జరుగుతుందని అధికారులు ప్రకటించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఇతర అధికారులు పర్యవేక్షించారు. పైడమ్మతల్లి హుండీ ఆదాయం రూ.5.47లక్షలు పెడన: పట్టణ పరిధిలోని పైడమ్మ తల్లి ఉత్సవాలు ముగియడంతో బుధవారం అధికారుల పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించినట్లు ఈఓ గోవాడ వెంకటకృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవల ముగిసిన 70 రోజుల పైడమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి రూ. 5,47,633 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆయన చెప్పారు. అలాగే 700 మిల్లీగ్రాముల బంగారం, 128 గ్రాముల వెండి వస్తువులు వచ్చాయన్నారు. ఉత్సవాలు అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డి. వాయునందన్రావు పాల్గొన్నారు. పీవీన్వీ ప్రసాదరావు పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు. -
ఘనంగా దంత వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ డే
లబ్బీపేట(విజయవాడతూర్పు): దంత వైద్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు అందరూ సమాజంలో మంచి వైద్యులుగా గుర్తింపు తెచ్చుకోవాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు సూచించారు. ప్రభుత్వ దంత వైద్య కళాశాల 2020 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు బుధవారం వెటర్నీరీ కాలనీలో ఓ ఫంక్షన్ హాలులో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏడుకొండలరావు కోర్సు పూర్తి చేసిన 25 మంది దంత వైద్య విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా సిబార్ దంత వైద్య కళాశాల డీన్ డాక్టర్ ఎల్.కృష్ణప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశంలో సౌర విద్యుత్ వినియోగం యాభై శాతానికే పరిమితమైందని, ఇంకా పెరగాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కరరావు పేర్కొన్నారు. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సింటిలా–2025 పేరుతో సిద్ధార్థ ఆడిటోరియంలో భౌతిక శాస్త్రం చదువుతున్న విద్యార్థులకు పోటీలు బుధవారం జరిగాయి. విజయభాస్కరరావు అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. బొగ్గు ఆధా రిత విద్యుత్, జలవిద్యుత్లతో పోలిస్తే సోలార్ ఎనర్జీ పర్యావరణహితమని తెలిపారు. ఎయిర్ కండీషనర్లు, గ్రీజర్లు వంటి విద్యుత్ పరికరాలు, సెల్ ఫోన్ల వినియోగం తగ్గించుకోవాలని సూచించారు. ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ప్రాజెక్టు ఇంజినీర్ జి.సుమంత్, అసిస్టెంట్ ఇంజినీర్ చైతన్య మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయిలో ఎనర్జీ కన్జర్వే షన్ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. సభ అనంతరం విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మనోరంజని, ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ టి. శ్రీనివాసకృష్ణ, డెప్యూటీ హెడ్ తస్నీమ్, అధ్యాపకులు జె.పాండురంగారావు, ఎస్.విజయకృష్ణ, ఎన్.రాజశేఖర్, ముష్వరీన్, టి.పూజిత పాల్గొన్నారు. ప్రమాదవశాత్తూ తాపీ కార్మికుడి మృతి అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై నుంచి పడి తాపి కార్మికుడి మృతిచెందిన ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వాంబేకాలనీ ప్రాంతానికి చెందిన కొండపోగు ఉదయ్కుమార్(37) తాపీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. దేవినగర్లో చేపట్టిన భవన నిర్మాణ పనులకు వారం రోజుల నుంచి వెళ్తున్నాడు. మంగళవారం ఆ భవనం మూడో అంతస్తులో పనులు చేస్తూ ప్రమాదవు శాతు అక్కడి నుంచి కిందకు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఉదయ్కుమార్ను తోటి కార్మికులు హూటాహూటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరుగురు గంజాయి విక్రేతలు అరెస్టు
పెనమలూరు: మండలంలోని పెదపులిపాక గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిపై కేసు నమోదుచేసిన పెనమలూరు పోలీసులు వారిని అరెస్టు చేశారు. సీఐ జె.వెంకటరమణ కథనం మేరకు..పెదపులిపాక గణపతినగర్లోని ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఆరుగురు వ్యక్తులు గంజాయితో ఉన్నారన్న సమాచారం పోలీసులకు అందింది. స్పందించిన పోలీసులు ఆ ప్రాంతంపై దాడిచేసి గంజాయితో ఉన్న కానూరు మురళీనగర్కు చెందిన చెందిన జువ్వనపూడి శశికాంత్, ఉయ్యూరు వెంకటవంశీకృష్ణ, ప్రసాదంపాడుకు చెందిన వి.దుర్గారావు, ఆకుల వెంకటమాధవ్, పెదపులిపాక గణపతినగర్కు చెందిన ఆకులపల్లి మౌనిక, పెనమలూరు పల్లిపేటకు చెందిన గోగం ఫణికుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు భద్రాచలం నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న పొట్లాలుగా కట్టి విక్రయిస్తున్నారని విచారణలో తేలింది. నిందితుల వద్ద 2,250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గన్నవరంలో గంజాయి స్మగ్లర్ అరెస్టు కోనేరుసెంటర్(మచిలీపట్నం): గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని గన్నవరం పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పూణేకు చెందిన దీపక్ తుపే ఒడిశాలో రాజ్కుమార్, సురాన్కర్ణ వద్ద 112 కిలోల గంజాయి కొన్నాడు. పూణేలో వైష్ణవిలవన్కు అందిం చేందుకు కారులో ఒడిశా నుంచి బయలుదేరాడు. దీపక్ తుపే గన్నవరం సమీపంలోని బీబీగూడెం అండర్ పాస్ వద్ద చేరుకున్న సమయంలో పోలీ సులు వాహనాలను తనిఖీచేస్తుండటంతో కంగారుపడ్డాడు. అతడిని గమనించిన గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్ కారును తనిఖీ చేయగా రూ.5.60 లక్షల విలువైన 112 కిలోల గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు దీపక్ తుపేపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఒడి శాకు చెందిన రాజ్కుమార్, సురాన్కర్ణ, పూణేకు చెందిన వైష్ణవిలవన్ను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. స్మగ్లర్ను పట్టుకున్న గన్నవరం పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ బి.వి.శివప్రసాద్, ఈగల్ టీం సీఐ ఎం.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా చాప్టర్ ఏర్పాటు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన అధికారిక ఎంఎస్ఎంఈ వ్యవస్థ లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా చాప్టర్ ఏర్పాటైంది. మహాత్మాగాంధీ రోడ్డులోని అమరావతి హౌసింగ్స్లో ఏర్పాటు చేసిన ఈ శాఖను జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ మోహన్ సుందరం ఏపీ అధ్యక్షుడు తులసీ యోగీష్ చంద్రతో కలిసి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ సుందరం మాట్లాడుతూ.. లఘు ఉద్యోగ భారతి దేశం వ్యాప్తంగా 68 వేల ఎంఎస్ఎంఈ యూనిట్ల సభ్యత్వం కలిగి ఉందన్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద ఎంఎస్ఎంఈ సంస్థని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ కూడా పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా కార్యవర్గం ఇదే.. లఘు ఉద్యోగ భారతి ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడిగా వెలగపూడి సాంబశివరావు, కార్యదర్శిగా చెరుకూరి చాముండేశ్వరి, జాయింట్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ తరుణ్ కాకాని, ఉపాధ్యక్షులుగా టి.వెంకట నాగేశ్వరరావు, అన్నే శ్రీనివాసరావు, శ్రీరామ్, కార్యదర్శులుగా జె.అభినయ్కృష్ణ, యార్లగడ్డ హరీష్, కార్యనిర్వాహక సభ్యులుగా దొడ్డపనేని కల్యాణ్ కృష్ణ, ప్రణీత్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. -
స్వయం ఉపాధి కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జనశిక్షణ సంస్థాన్ ద్వారా అందిస్తున్న వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో నిరుద్యోగ యువతీ యువకులు శిక్షణ తీసుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఉపాధి పొందొచ్చని ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్థి అధికారి ఎస్.శ్రీనివాసరావు సూచించారు. మొగల్రాజపురంలోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయం ఆవరణలో కెపాసిటీ బిల్డిం పోగ్రామ్ బుధవారం జరిగింది. ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనశిక్షణ సంస్థాన్ నేటి అవసరాలకు తగినట్లుగా యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఇండస్ట్రీయల్ ప్రమోషనల్ ఆఫీసర్ (ఐపీఓ) కె.రవికుమార్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ తీసుకున్న యువకులు ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అవగాహన పెంచుకుని కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించి మరికొందరికి ఉపాధి చూపొప్చని పేర్కొన్నారు. జనశిక్షణ సంస్థాన్ చైర్పర్సన్ ఎన్.విదాకన్నా, డైరెక్టర్ ఎ.పూర్ణిమ పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్త ట్రాక్టర్ దగ్ధం
బూదవాడ(జగ్గయ్యపేట): గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త బాణావత్ నాగరాజుకు చెందిన ట్రాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. నాగరాజు ఎప్పటి మాదిరిగానే మంగళవారం ఇంటి బయట ట్రాక్టర్ను నిలిపి ఉంచాడు. బుధవారం తెల్లవారు జామున నిత్ర లేచి చూసే సరికి ట్రాక్టర్ పాక్షికంగా తగలబడి ఉండటాన్ని గమనించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గ్రామానికి చేరుకుని ట్రాక్టర్ను పరిశీలించి నాగరాజును పరామర్శించారు. కుటుంబానికి జీవనాధారమైన ట్రాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేయటం బాధాకరమన్నారు. నిందితులను పోలీసులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ మండల కన్వీనర్ బూడిద నరసింహారావు, నాయకులు పరిటాల పెద్ద సైదులు, భూక్యా గోపి, బాలకోటి, సతీష్ తన్నీరుతో పాటు బాధితుడిని పరామర్శించారు. రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు రింగ్ సెంటర్లో గుర్తుతెలియని యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. విజయవాడ పటమట పోలీసుల కథనం మేరకు.. రింగ్ సమీపంలోని ఏలూరు నాన్స్టాప్ బస్ స్టాండ్ సమీపంలో సుమారు 35 ఏళ్ల యువకుడు మృతి చెందాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ నెల 16వ తేదీన ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్న ఆ యువకుడిని గర్తించిన కండెక్టర్ రామవరప్పాడు రింగ్ వద్ద దింపివేశాడు. అప్పటి నుంచి బస్స్టాప్లోనే పడుకున్న యువకుడు బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించాడు. మృతుడి వంటిపై బ్లూకలర్ స్వెట్టర్ ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పటమట పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. పెనమలూరు: మండలంలోని గంగూరు గ్రామంలో ఓ వృద్ధుడు చెట్టుపై నుంచి కొందపడి మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన మద్దాల విల్సన్ (70) చెట్లు నరుకుతూ జీవనోపాధి సాగిస్తున్నాడు. అతను మంగళవారం గంగూరు అంబేడ్కర్నగర్లో ఆర్సీఎం చర్చి వద్ద వేప చెట్టు కొమ్మలు అడ్డుగా ఉన్నాయని నరకటా నికి వచ్చాడు. అతను చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విల్సన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం వేకువజామున మృతి చెందాడు. మృతుడి కుమారుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమాన్జంక్షన్ రూరల్: చెన్నయ్ – కోల్కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండ లంలో మంగళవారం అర్ధ రాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. హనుమాన్జంక్షన్ బైపాస్రోడ్డులో కె.సీతారామపురం వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న పేరం వెంకట రాజేష్ (21) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పేరం వెంకట రాజేష్ను ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిల్లబోయిన పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. విజయవాడలో డెలివరీ బోయ్గా పనిచేస్తున్నాడని, మరో వ్యక్తితో కలిసి బైక్పై ఏలూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మరో వ్యక్తి (40) ఆచూకీ తెలియాల్సి ఉంది. దీనిపై హను మాన్జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరవల్లి పోలీస్స్టేషన్ పరిధిలో షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు 45 సంవ త్సరాలు ఉంటుందని, మృతదేహం పూర్తిగా ఛిద్రమైందని, దీంతో అతను ఎవరో గుర్తించటం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. మృతుడు దుస్తులు ధరించకపోవటంతో యాచకుడు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రకృతి సాగు ఫలప్రదం
●వ్యవసాయ క్షేత్రమే పొలమే ప్రయోగశాల ●ప్రకృతి సాగుతో రసాయన ఎరువులకు స్వస్తి ●సొంతగా సేంద్రియ ఎరువుల తయారు పెనుగంచిప్రోలు: మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన రైతు ఊరుగుండ్ల గోవర్ధన ప్రకృతి వ్యసాయానికి శ్రీకారం చుట్టారు. విభిన్న పంటలు సాగుచేస్తూ, వ్యవసాయ ఉత్పత్తులను సొంతంగా విక్రయిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. రెండేళ్ల క్రితం కశ్మరీ యూపిల్ బేర్ సాగుచేసి మంచి లాభాలు ఆర్జించారు. గత ఏడాది రెడ్గోల్డ్, మిక్స్ ఇండియా, బాల సుందరి అనే మూడు రకాల యాపిల్బేర్ పండ్లు మొక్కలు కోల్కత్తా నుంచి తీసుకొచ్చి తనకు ఉన్న 40 సెంట్ల పొలంలో నాటాడు. మరో ఎకరం కౌలుకు తీసుకుని కాకర, పొట్ల కూరగాయలు పండిస్తున్నాడు. ఎకరానికి 600 మొక్కలు నాటేందుకు కావాల్సి ఉండగా అర ఎకరంలో 300 మొక్కలు నాటాడు. ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి అయింది. రోజుకు 80 నుంచి 100 కిలోలు దిగుబడి యాపిల్బేర్ తోటలో ఈ ఏడాది కాపు మొదలై దిగుబడి ప్రారంభమయింది. ఫిబ్రవరి వరకు దిగుబడి వస్తుందని రైతు గోవర్ధన తెలిపారు. రోజుకు 80 నుంచి 100 కిలోల దిగుబడి వస్తోంది. కాయలు నాణ్యంగా, తీపిగా ఉండటంతో వినియోగదారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. యాపిల్ బేర్ పండ్లను గోవర్ధన వ్యాపారులకు విక్రయించకుండా బైక్పై స్వయంగా గ్రామాల్లో తిరిగి విక్రయిస్తున్నారు. పెనుగంచిప్రోలుతో పాటు జగ్గయ్యపేట, నందిగామ, ఖమ్మం జిల్లాలోని మధిరకు వెళ్లి విక్రయస్తూ ఆదాయాన్ని అర్జిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై ఎక్కడ స్టాళ్లు ఏర్పాటు చేసినా తన పండ్లను తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. బైక్కు కూడా తాను చేసే ప్రకృతి వ్యవసాయం ఫ్లెక్సీ ఏర్పాటు చేసి విక్రయిస్తుండటంతో వినియోగదారులు కూడా ఆసక్తి కనపరచటంతో పాటు రసాయన ఎరువులు వాడకుండా పండించిన పండ్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. పొలంలోనే సేంద్రియ ఎరువుల తయారీ గోవర్ధన తన పొలంలో ఆవుపేడ, శనగపిండి, బెల్లం, పుట్టమన్ను, గోమూత్రాన్ని పులియబెట్టి జీవామృతం తయారు చేసి పొలంలో చల్లుతున్నారు. గోమూత్రం, శనగపిండి, బెల్లం ముద్దలు చేసి ఘన జీవామృతం బంతులుగా చేసి మొక్కల మొదట్లో వేస్తున్నారు. పండు ఈగ, ఇతర పురుగులు, రోగాలు రాకుండా నీమాస్త్రం పులియబెట్టిన మజ్జిగ, వెల్లుల్లితో పాటు పొగాకు, జిల్లేడు మొదలైన పది రకాల ఆకులతో తయారు చేసిన అగ్నాస్త్రం స్ప్రే చేస్తూ పూర్తిగా సేంద్రీయ పద్ధతులు అవలంబిస్తున్నారు. పందిరి విధానంలో కాకర, పొట్ల సాగు యాపిల్బేర్తో పాటు ప్రకృతి వ్యవసాయం ద్వారా పందిరి విధానంలో గోవర్ధన కాకర, పొట్ల సాగు చేస్తున్నానే. స్టార్ కాకర వారానికి క్వింటా చొప్పున దిగుబడి వస్తోందని, మార్కెట్లో బోర్డు రేటు కిలో రూ.48గా ఉందని తెలిపారు. పొట్ల కాపు దశలో ఉందన్నారు. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల కూరగాయలు చాలా నాణ్యంగా ఉంటాయన్నారు. స్థానికంగా ఉండే మార్కెట్లకు వెళ్లి విక్రయిస్తున్నానన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో వ్యవసాయ ఉత్పత్తులు కలుషితం అవుతున్న వేళ తాను పెద్దగా చదుకోక పోయినా సమాజానికి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించటానికి తనవంతు కృషి చేస్తున్నానని రైతు తెలిపారు. గతంలో బావుల్లో వరలు దింపే పనులు, ఇతర పనులకు వెళ్లేవాడిని. రెండేళ్ల నుంచి యాపిల్ బేర్ పండ్లు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది కొత్తరం యాపిల్ బేర్ పండ్లు దిగుబడి వస్తోంది. ఖర్చులు పోను ఆదాయం బాగానే ఉంది. వచ్చే ఏడాది మరో ఎకరం కౌలుకు తీసుకుని సాగు పెంచుతాను. నీళ్లు నిలబడకుండా ఉండే పొలం యాపిల్ బేర్ సాగుకు బాగుంటుంది. ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలకు మంచి డిమాండ్ ఉంది. కూరగాయల ధరలు కూడా ప్రస్తుతం బాగానే ఉన్నాయి. – ఊరుగుండ్ల గోవర్ధన, రైతు -
క్వార్టర్ ఫైనల్స్కు చేరిన క్రికెట్ పోటీలు
విజయవాడరూరల్: మండలంలోని నున్న గ్రీన్ హిల్స్ మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్ ఏపీ) అండర్–17 బాలుర అంతర జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ బుధవారం ప్రారంభమైంది. ఈ పోటీలను వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ, కరస్పాండెంట్ ఎన్.సత్యనారాయణరెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీని నున్నలో రెండు మైదానాలు, సూరంపల్లిలో ఒక మైదానంలో లీగ్–కమ్– నాకౌట్ పద్ధతి నిర్వహిస్తారు. కృష్ణా, కడప, గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. ప్రారంభ మ్యాచ్లో కడప జిల్లా గుంటూరుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తూర్పు గోదావరి జిల్లా ప్రకాశంపై 102 పరుగుల భారీ తేడాతో, కృష్ణా జిల్లాపై 35 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. విజయనగరంపై విశాఖపట్నం పది వికెట్ల తేడాతో, కర్నూ లుపై గుంటూరు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచాయి. కడప జిల్లా కర్నూలును 47 పరుగుల తేడాతో ఓడించింది. ఆతిథ్య కృష్ణా జిల్లా ప్రకాశంపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించింది. కృష్ణా బౌలర్ యశ్వంత్ అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం.అరుణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, టోర్నీ పరిశీలకుడు డి.భూపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ టి.విజయవర్మ పాల్గొన్నారు. -
మా కోసం పోరాడతానన్నారు
మా ఇళ్లు కూల్చివేత తరువాత న్యాయం చేయాలని కోరుతూ కలవని ప్రజాప్రతినిధి లేరు. కనీసం ఘటనా స్థలానికి వచ్చిన వారు లేరు. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు వెళ్లి కలిశాం. మా బాధలను ఆలకించిన ఆయన మా ప్లాట్ల వద్దకు వస్తానని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జగన్మోహన్రెడ్డి వచ్చారు. నలభై రెండు మందికి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. విశ్వసనీయతకు మారు పేరైన ఆయన మాలో నమ్మకం కల్పించారు. మా గుండెల్లో బాధను తగ్గించారు. – గోదావరి గంగ, బాధితురాలు -
సబ్జైలులో జిల్లా జడ్జి తనిఖీలు
అవనిగడ్డ: జిల్లా న్యాయమూర్తి జి.గోపీ మంగళవారం అవనిగడ్డ సబ్జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిమాండ్ ఖైదీలతో మాట్లాడారు. జైలులో అందుతున్న భోజన వసతి గురించి తెలుసుకున్నారు. స్టోర్ రూం, వంట గదిని న్యాయమూర్తి తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. జైలు ప్రాంగణం అంతా కలియ తిరిగి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి గోపీ మాట్లాడుతూ.. బెయిల్ కోసం న్యాయవాదులను పెట్టుకోలోని రిమాండ్ ఖైదీల కోసం న్యాయవాదులను ఏర్పాటు చేస్తామనానరు. ఖైదీల ప్రవర్తన గురించి జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, అవనిగడ్డ సీనియర్ సివిల్ జడ్జి కె.అరుణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వర్ణలత ఓల్గా, జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సనకా రఘురామప్రసాద్, న్యాయవాది దామెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి
పిల్లలు సున్నిత మనసుతో ఉంటారు. దేనికైనా వెంటనే ఆకర్షితులవుతారు. తిరునాళ్లు, జాతర్లు, సంక్రాంతి సంబరాల వద్ద నిర్వహించే బెట్టింగ్ గేమ్లను సరదాగా ఆడుతూ వాటికి ఆకర్షితులు అవుతారు. తల్లిదండ్రులు ఆ ఆటల వైపు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. బెట్టింగ్ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. నిరంతరం పిల్లలపై పర్య వేక్షణ లేకపోతే వారు బెట్టింగ్లకు బానిసయ్యే ప్రమాదం ఉంది. – డాక్టర్ జి.అజయ్కుమార్, పిల్లల వైద్య నిపుణుడు, మైలవరం -
మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ
మచిలీపట్నంటౌన్: స్థానిక బైపాస్రోడ్డు హౌసింగ్ బోర్డు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ మంగళవారం రాత్రి జరిగింది. మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్తో కలిసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ చేపట్టిన ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన యాత్ర’ బందరుకు చేరిన సందర్భంగా వాజ్పేయి విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహ ఏర్పాటును తొలుత టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పోటీగా ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు యత్నించడంతో ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో వాజ్పేయి, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని జనవరి 18న ఆవిష్కరిస్తారని సమాచారం. -
నీడ లేకుండా చేశారు
కుటుంబంతో ఒకటో నంబరు ప్లాట్లో నిర్మించిన ఇంటిలో నివసిస్తున్నా. ప్లాటుకొనుగోలు చేసే సమయంలో లీగల్ ఓపీనియన్ తీసుకున్నాం. ఎవ రికై నా అభ్యంతరాలు ఉంటే తెలపాలని పేపరు ప్రకటన కూడా ఇచ్చాం. ఎవరి నుంచీ అభ్యంతరాలు రాలేదు. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి రూ.70 లక్షలతో ప్లాటు కొనుగోలు చేశాం. అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే ఇంటి నిర్మాణం చేపట్టాను. ఇప్పుడు కొందరు గద్దల్లా వాలిపోయారు. 42 ప్లాట్లలో ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేసి, మాకు నిలువ నీడ లేకుండా చేశారు. – విద్యాసాగర్, బాధితుడు, జోజినగర్ -
కుంగ్ఫూలో తేజ్వీర్కు స్వర్ణపతకం
మచిలీపట్నంఅర్బన్: తండ్రి క్రీడా విజయాల బాటలో కుమారుడు కూడా అగ్ర స్థానానికి చేరుకున్నాడు. మచిలీపట్నానికి చెందిన అంతర్జా తీయ కిక్బాక్సింగ్ విజేత చలాది సతీష్ కుమారుడు చలాది తేజ్వీర్ (09) కుంగ్ఫూలో జాతీయ స్థాయిలో స్వర్ణపతకం సాధించాడు. ఈ నెల 14న చిలకలూరిపేటలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ నేషనల్ లెవల్ కుంగ్ఫూ, కరాటే చాంపియన్షిప్ 2025లో 25 కిలోల లోపు కాటా ఈవెంట్లో తేజ్వీర్ జాతీయ విజేతగా నిలిచి స్వర్ణపతకం కైవసం చేసుకున్నాడు. తేజ్వీర్ తండ్రి సతీష్ గత ఏడాది న్యూఢిల్లీలో వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్బాక్సింగ్ ఇండియా (వాకో) ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రెండు రజత పత కాలు సాధించారు. ఇప్పుడు అతని కుమారుడు జాతీయ స్థాయిలో విజయం సాధించడం విశేషం. -
జీవితాలతో బెట్టింగ్ ఆట
జి.కొండూరు: సంక్రాంతి సంబరాలు అంటూ నిర్వహిస్తున్న కోడిపందేల శిబిరాల వద్ద బెట్టింగ్ క్రీడలు జోరుగా సాగుతున్నాయి. శిబిరాల వద్దకు సరదాగా గడిపేందుకు వస్తున్న చిన్నారులు, యువకులను బెట్టింగ్ క్రీడలు ఆకర్షిస్తున్నాయి. పండుగ మూడు రోజుల సెలవుల్లో యువకులు, చిన్నారులు సరదాగా బెట్టింగ్ గేమ్లను ఆడడం పరిపాటిగా మారింది. ఈ సరదా వారిని బెట్టింగ్లకు బానిసగా మారుస్తోంది. చిన్న వయస్సులోనే ఆన్లైన్ గేమ్లు, బెట్టింగ్లకు అటవాటు పడిన యువకులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు, చోరీలకు తెగబడుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది జిల్లాలో 70కిపైగా శిబిరాలు ఎన్టీఆర్ జిల్లాలో గతేడాది సంక్రాంతి సంబరాల పేరుతో అనధికారికంగా 70కిపైగా కోడిపేందేల శిబిరాలు నడిచాయి. ఈ శిబిరాల ఏర్పాటుకు ముడుపులు, అద్దెల కోసం భారీగా ఖర్చు పెడుతున్న నిర్వాహకులు ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు పేకాటతో పాటు బెట్టింగ్ గేమ్లకు విచ్చలవిడిగా అనుమతినిచ్చారు. కోడిపందేలు నేరమని కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంప్రదాయం పేరుతో ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో పోలీసులు అటు వైపు వెళ్లే అవకాశం లేకుండా పో యింది. కోడిపందేల శిబిరాల నిర్వాహకులు ఆదాయం కోసం బెట్టింగ్ గేమ్లకు అనుమతి ఇవ్వడంతో మూడు రోజులు పాటు చిన్నారులు, యువకులు పేకాట, కోసు ఆట, లోన – బయట, రాజు – రాణి, నలుపు – తెలుపు, బొమ్మలాట, నంబర్లాట, చిన్న బజారు – పెద్ద బజారు, మూడు ముక్కలాట, బొమ్మాబొరుసు వంటి ఆటలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ సరదా సంక్రాంతి సంబరాలు ముగిశాక ఆన్లైన్ గేమ్లు, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడేలా చేస్తోంది. బెట్టింగ్లకు డబ్బుల కోసం లోన్ యాప్ల నుంచి అప్పులు చేయడం, డబ్బు దొరకనప్పుడు చోరీలు, ఇతర నేరాలకు పాల్పడటం వంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. వెలుగు చూసిన ఘటనల్లో కొన్ని.. -
చెట్టుకింద ఉంటున్నాం
జోజినగర్ 42 ప్లాట్లలో మాది 29వ ప్లాటు. 2001లో కొనుగోలు చేశాం. ఇంటి పన్నులు కూడా చెల్లించాం. మూడేళ్ల క్రితం రూ.30 లక్షల బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాం. స్టే ఉండగానే నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూల్చి నిలువ నీడ లేకుండా చేశారు. చెట్టుకింద ఉంటున్నాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. మా బాధ చెప్పుకొనేందుకు ఎయిర్ పోర్టు, ఇంటి వద్ద రెండు సార్లు జగనన్నను కలిశాం. పరామర్శకు వస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వచ్చారు. మా తరఫున ప్రభుత్వంపై పోరాడుతానన్నారు. మాకు ధైర్యం ఇచ్చారు. జగనన్నకు రుణపడి ఉంటాం. – యమున, బాధితురాలు -
బాధితులకు జననేత భరోసా
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ‘నేనున్నా.. మీకు తోడుగా ఉంటా’ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా బాధితుల్లో కొండంత ధైర్యం నింపింది. రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇళ్లను కోల్పోయి రోడ్డున పడి, ప్రభుత్వ ఆదరణకు నోచుకోని బాధితులు జననేత ఆత్మీయ పరామర్శతో సాంత్వన పొందారు. బెజవాడ జోజినగర్లో చంద్ర బాబు ప్రభుత్వం అండతో 42 ప్లాట్లలో ఇటీవల అక్రమంగా కూల్చివేతకు గురైన ఇళ్ల బాధిత కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం జోజినగర్ చేరుకున్న జననేతకు బాధితులు ఒక్కొక్కరుగా తమ ఆవేదన వినిపించారు. రెక్కల కష్టంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకుని పాతికేళ్లుగా నివ సిస్తున్నామని వివరించారు. ఇన్నేళ్ల తరువాత ఆ ప్లాట్లు తమవి కావంటూ తమ ఇళ్లను ఒక్కసారిగా బుల్డోజర్లతో కూల్చివేసి రోడ్డుపాలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. గంటకు పైగా బాధిత కుటుంబాలతో మాట్లాడిన జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన జగన్మోహన్రెడ్డి సుమారు గంటకు పైగా ఆయా కుటుంబాలను ఓదార్చారు. ప్రతి ఒక్కరినీ పరామర్శించి, వారి ఆవేదనను తెలుసుకున్నారు. స్థలాలను ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎంతకు కొన్నారు, ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ తీసుకున్న తీరును, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తదితర అంశాలపై బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జోజినగర్ 42 ప్లాట్ల ప్రాంతానికి చేరుకున్న జగన్మోహన్రెడ్డి ఆయా బాధిత కుటుంబాలు ఉన్న టెంట్లోకి వెళ్లి వారితో పాటు కూర్చుని వారి బాధలను ఓపికగా ఆలకించారు. ప్రభుత్వంపై బాధితుల ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి పోలీసు సిబ్బందితో తమను రోడ్డుపాలు చేసిందంటూ బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాము దశా బ్దాల క్రితం కష్టపడి కొనుగోలు చేసిన ఈ ప్లాట్లను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, అన్ని అనుమతులతో నిర్మించుకుని పాతికేళ్లుగా నివసిస్తున్న ఇళ్లను ప్రభుత్వం దగ్గరుండి కూల్చివేసి మోసగాళ్లకు కొమ్ముకాసిందని జగన్ వద్ద వాపోయాయి. తమ స్థలాలకు పన్నులు కట్టించుకుంటూ, ఇంటి నిర్మాణానికి ప్లాన్లతో ఆమోదం తెలిపి, విద్యుత్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ స్థలాలను ఎవరో వస్తే వారికి అండగా నిలిచి దోచి పెట్టిందని బాధితులు విలపించారు. జననేత కోసం తరలివచ్చిన జనసందోహం జోజినగర్కు వచ్చిన తమ అభిమాన నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడటానికి, కలిసి మాట్లాడటానికి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలతో జోజినగర్ పరిసరాలు మారుమోగాయి. భారీ జన సందోహం కారణంగా కారు దిగిన జగన్మోహన్రెడ్డి పక్కనే బాధిత కుటుంబాలు ఉన్న టెంట్ వద్దకు చేరుకోవడానికి 15 నిమిషాలకు పైగా సమయం పట్టింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, రుహుల్లా, మేయర్ రాయన భాగ్య లక్ష్మి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, రాష్ట్ర కార్యదర్శి గౌస్ మొహిద్దీన్, జోగి రాజీవ్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, వీఎంసీ ఫ్లోర్లీడర్ అరవ సత్యనారాయణ, కార్పొరేటర్లు ఆంజనేయరెడ్డి, చైతన్యరెడ్డి, ఇర్ఫాన్, కోటిరెడ్డి, షేక్ రెహమతున్నీసా, బండి నాగేంద్ర పుణ్యశీల, గోదావరి గంగ, శిరంశెట్టి పూర్ణ, సహాయ కార్యదర్శి షేక్ హాయత్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు సరగడ శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మ్యాజిక్ బస్తో కేయూ అవగాహనా ఒప్పందం
కోనేరుసెంటర్: కృష్ణా యూనివర్సిటీ పలు సంస్థలతో చేసుకుంటున్న అవగాహన ఒప్పందాల్లో భాగంగా మంగళవారం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఐబీఎం సంస్థతో సమన్వయంగా రానున్న 11 నెలల కాలంలో కృష్ణా యూనివర్సిటీలోని కళాశాలలు, దాని అనుబంధ కళాశాలలకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక టూల్స్తో లైఫ్ అండ్ ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ మీద విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించనుంది. అనంతరం ఆ సంస్థ ఆధ్వర్యంలోనే కొన్ని బహుళ జాతి సంస్థలలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అవగాహన ఒప్పందం చేసుకున్నారు. వర్సిటీ వీసీ ఆచార్య కె. రాంజీ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, వర్సిటీ శిక్షణ, ఉపాధి అవకాశాల డైరెక్టర్ ఆచార్య వైకే సుందరకృష్ణ, మ్యాజిక్ బస్ సంస్థ నుంచి డీజీఎం డి. శేఖర్బాబు, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సీహెచ్ మోహన్ సంస్థ ప్రతినిధులు శౌర్య, రత్న ప్రసాద్, పుష్పలత పాల్గొన్నారు. -
నిలిచిన సహకార సేవలు
పెనుగంచిప్రోలు: సహకార సంఘాల ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి, ఆ దిశగా ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదని ఆరోపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక(జేఏసీ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా ఈనెల 6న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కాగా, 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీబీ బ్రాంచ్ల ముందు సంఘాలకు తాళాలు వేసి ధర్నా నిర్వహించారు. మంగళవారం మరోసారి అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. అలాగే ఈనెల 22న రాష్ట్రంలోని అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల ముందు ధర్నా, వినతి పత్రం అందించటం, 29న రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా, ఉన్నతాధికారులకు వినతిపత్రం, జనవరి5, 2026నుంచి విజయవాడ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలను జేఏసీ ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో 2,000 మంది ఉద్యోగులు.. ఉమ్మడి జిల్లాలో 425 సహకార సంఘాల్లో రెగ్యులర్, రోజువారీ వేతనంతో పనిచేసే మొత్తం 2000 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ధర్నాలో పాల్గొనటంతో సంఘ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. దీంతో సహకార సంఘాలకు వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పలేదు. జిల్లాలో సహకార కేంద్రాల ద్వారా రోజు రూ.కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు, ధాన్యం అమ్మినవారు డబ్బులు చెల్లించేందుకు సహకార సంఘాలకు వస్తున్నారు. ఇప్పటికే ఈ నెలలో 8న, 12న రెండు రోజులు తాళాలు వేశారని రైతులు అంటున్నారు. మంగళవారం కూడా సంఘాల్లో ఉద్యోగులు లేక పోవటంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బంగారు రుణాల కోసం పదుల సంఖ్యలో రైతులు బ్యాంకు ల వద్దకు వెచ్చి వెనుదిరగడం కనిపించింది. సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు -
జియోడెటిక్ అసెట్ మ్యాప్ల ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కచ్చితమైన పటాల(మ్యాపుల) తయారీకి, సర్వేకు జియోడెటిక్ అసెట్ రిజిస్టర్ ఎంతగానో దోహదపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో జియోడెటిక్ అసెట్ రిజిస్టర్, రాష్ట్ర జియోడెటిక్ అసెట్ మ్యాప్లను సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడాతో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జియోడెటిక్ అసెట్ రిజిస్టర్లో గ్రేట్ ట్రిగ్నో మెట్రికల్ సర్వే స్టేషన్స్ (జీటీఎస్), గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ (జీసీపీ), స్టాండర్డ్ బెంచ్ మార్క్స్ (ఎస్బీఎం), గ్రావిటీ రిఫరెన్స్ స్టేషన్స్, మ్యాగ్నెటిక్ రిపీట్ స్టేషన్స్, టైడల్ అబ్జర్వేటరీస్ వంటి ఆరు అసెట్స్ ఉన్నాయని చెప్పారు. వీటి ద్వారా సర్వే, మ్యాపుల రూపకల్పన మెరుగ్గా చేయవచ్చని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడా మాట్లాడుతూ రాష్ట్రంలో స్వామిత్వ, నక్ష, అమృత్, ఏపీ రీ సర్వే వంటి కీలకమైన ప్రాజెక్టులలో సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా మొదటిసారిగా తెలుగులో రూపొందించిన రాష్ట్ర పటాన్ని (మ్యాప్ను) కలెక్టర్కు అందజేశారు. -
ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవాలు ప్రారంభం
గుడివాడ టౌన్: స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కళాశాల వజ్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పీవీ సత్యనారాయణ, డీన్ డాక్టర్ మణి, కళాశాల కరస్పాండెంట్ కేఎస్ అప్పారావు తదితరులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. 75ఏళ్ల క్రితం కళాశాల ఏర్పాటుకు సహకరించిన వారందరూ రైతులు కావడంతో రైతులను స్మరించుకుంటూ తొలి రోజు రైతు సదస్సు నిర్వహించారు. ఏరువాక సాగారో.. అనే చిన్నారుల నృత్యంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మనదేశంలో 15వేల మిలియన్ ఎకరాలలో పంటను పండిస్తే 145 కోట్ల మందికి భోజనం దొరుకుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల లోటు ఉన్న నేపథ్యంలో యాంత్రీకరణవైపు రైతు దృష్టిపెట్టాలన్నారు. ప్రిన్సిపాల్ పీజేఎస్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ బీఎస్ఎస్ పద్మజ, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
లంచం తీసుకుంటూ దొరికిన ఉద్యోగికి రిమాండ్
విజయవాడలీగల్: గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలవరం కుడి ప్రధాన కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ప్రింటింగ్ టెక్నీషియన్ నగేష్బాబుకు న్యాయమూర్తి ఈ నెల 30 వరకూ రిమాండ్ విధించారు. వివరాలివి.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు సంబంధించి విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జునకు ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు నగేష్బాబు రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో నాగార్జున అవినీతి నిరోధక శాఖ అధికారుల(ఏసీబీ)కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు వలపన్ని నగేష్బాబు తన కార్యాలయంలో లంచం మొత్తం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడిని మంగళవారం అవినీతి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి పి.భాస్కరరావు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఈనెల 30వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయ వాడ జిల్లా జైలుకు తరలించారు. కారుణ్య నియామకంలో ఆపరేటర్గా ఉద్యోగంలో చేరిన నగేష్బాబు 2022 నుంచి అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తిరువూరు: గంపలగూడెం మండలం వినగడప తండాలో మంగళవారం కిడ్నీ రోగి మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన భూక్యా సత్యం(47) పదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఏకొండూరు మండలం కుమ్మరికుంట్లకు చెందిన సత్యం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వివాహమైన తదుపరి వినగడప తండాలో నివసిస్తూ కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న నీటి కారణంగా కిడ్నీవ్యాధికి గురైన సత్యం నాలుగేళ్లుగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో, తదుపరి తిరువూరులో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. గత శనివారం తిరువూరు ప్రభుత్వాస్పత్రిలోని డయాలసిస్ యూనిట్లో డయాలసిస్ చేస్తున్న సమయంలో అతనికి రక్తపోటు విపరీతంగా పెరిగిపోవడంతో పరిస్థితి విషమించి అపస్మారక స్థితికి చేరాడు. హుటాహుటిన సత్యంను విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అసలే పేదరికం కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సత్యం కుటుంబం అతని చికిత్స నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వంశీని పలకరించారని టీడీపీ వారిపైనే దాడి
గన్నవరం: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ను పలకరించినందుకు టీడీపీ వారిపైనే దాడి చేశారు. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెం గ్రామంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని పరామర్శించేందుకు వల్లభనేని వంశీ ఆదివారం మర్లపాలెం వెళ్లారు. ఆయనను టీడీపీకి చెందిన కంభంపాటి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఇది జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు కంభంపాటి సాయి, శేషు, జాస్తి మురళి ఆదివారం రాత్రి గ్రామంలోని శివాలయం వద్ద ఉన్న శ్రీధర్పై అకారణంగా దాడి చేశారు. తనపై ఎందుకు దాడి చేశారని అడిగేందుకు బంధువైన కంభంపాటి రామ్మోహన్రావుతో కలిసి శ్రీధర్ గ్రామంలోని సాయి ఇంటికి వెళ్లగా... మరోసారి సాయి, శేషు, జాస్తి మురళీతో పాటు విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హాకీ స్టిక్స్, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. దీంతో శ్రీధర్ తలకు, రామ్మోహన్రావు చేతికి బలమైన గాయాలయ్యాయి. వారిని బంధువులు వెంటనే చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శ్రీధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, తాను 20 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నానని, గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు విజయం కోసం పని చేశానని శ్రీధర్ తెలిపారు. ఎన్నికల అనంతరం యార్లగడ్డ ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ తమను దూరం పెట్టారని చెప్పారు. తమ సమీప బంధువుల ఇంటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీని పలకరించాననే కక్షతో యార్లగడ్డ వర్గీయులు అమానుషంగా దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కంభంపాటి శ్రీధర్, రామ్మోహన్రావును సోమవారం వల్లభనేని వంశీ పరామర్శించారు. రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వర్గీయులు -
కరాటే పోటీల్లో తాత – మనవళ్ల్లకు పతకాలు
పెనమలూరు: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో యనమలకుదురుకు చెందిన తాత–మనవళ్లు ఉత్తమ ప్రతిభచాటి పతకాలు సాధించారు. హైదరాబాద్ జీడిమెట్లలో ఆదివారం ఐదో జాతీయ కుంగ్ఫూ, కరాటే, తైక్వాండో చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న యనమలకుదురుకు చెందిన ఎస్.దుర్గారావు(64) సీనియర్ సిటిజన్ కాటా విభాగంలో బంగారు పతకం, గ్రాండ్ చాంపియన్ షిప్ను గెలుచుకున్నాడు. అతని మనవళ్లు ఎస్.సాత్విక్ (9), ఎస్.రిత్విక్ (7) వెపన్ కాటా విభాగంలో బంగారు పతకాలు సాధించారు. అలాగే జి.నినా 7 సంవత్సరాల లోపు కాటా, వెపన్స్ కాటా విభాగాల్లో రెండు బంగారు పతకాలు గెలిచింది. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక మొగల్రాజపురం కొండపైన భాలభాస్కర నగర్కు చెందిన తుమ్మల కృష్ణ(50) అనే వ్యక్తి ఆదివారం రాత్రి బోయపాటి మాధవరావు రోడ్డులోని మురుగునీటి కాలువలో పడి మృతి చెందాడు. స్థానిక వైన్షాప్ సమీపంలో ఉన్న మురుగునీటి కాలువలో ఆదివారం అర్ధరాత్రి పడిపోయి మృతి చెందిన కృష్ణను సోమవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని తెలియజేశారు. కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని బాలభాస్కర నగర్లోని ఇంటికి తీసుకువెళ్లారు. మాచవరం పోలీసులు వచ్చి మృతుడి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. ఇబ్రహీంపట్నం: స్థానిక ఎన్టీటీపీఎస్లో జాతీయ ఇంధన వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారోత్సవాలను సంస్థ చీఫ్ ఇంజినీర్ శివరామాంజనేయులు సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది జరిగే ఇంధన వారోత్సవాల్లో ఇంధన పొదుపు, ఇంధన ప్రాధాన్యతపై ఉద్యోగులు, ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశమన్నారు. శక్తి వృథాను తగ్గించడం, వనరులు కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆర్థిక పునర్నిర్మాణ రంగం ఇంధన రంగంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. విద్యుత్ ఆదాతో పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. వారోత్సవాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడలీగల్: పోలవరం కుడి ప్రధాన కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ప్రింటింగ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న నగేష్బాబు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు సంబంధించి గుత్తేదారుకు ధ్రువీ కరణ పత్రం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జున నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్ చేయడంతో నాగార్జున ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నాగార్జున ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని నగేష్బాబు తన కార్యాలయంలో లంచం మొత్తం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నగేష్బాబు నివాసం, కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కారుణ్య నియామకంలో ఆపరేటర్గా ఉద్యోగంలో చేరిన నగేష్బాబు 2022 నుంచి అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. విశాఖ సిటీ: నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న మోసగాళ్లకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హెచ్బీ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా ‘ఆరాధ్య మిశ్రా’ అనే మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. తాను స్టాండర్డ్ చార్టర్డ్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పిన ఆ మహిళ.. 700 శాతం లాభాలు పొందవచ్చని ఆశ చూపింది. ఆమె పంపిన లింక్ ద్వారా ఫిర్యాదుదారుడు ‘ఎస్ఎల్ ఎలైట్’ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని, ఐపీవోలు, షేర్లు, ఇండెక్స్ ట్రేడింగ్లో మొత్తం రూ.32 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. అయితే తరువాత నగదు విత్డ్రా చేయాలనుకున్నప్పుడు, అదనపు సర్వీస్ ట్యాక్స్, ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాలని రావడంతో తాను మోసపోయినట్లు గ్రహించి, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా, మ్యూల్ బ్యాంకు అకౌంట్లను సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన విజయవాడకు చెందిన అడుసుమిల్లి శివరాంప్రసాద్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇతడి ద్వారా మరి కొంతమంది నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న వారికి బ్యాంకు అకౌంట్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు సమాచారం రాబట్టారు. ప్రస్తుతం వారిపై నిఘా పెట్టారు.


