NTR district Latest News
-
దుర్గగుడి భూముల పరిరక్షణకు చర్యలు
ఆలయ ఈవోతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ లక్ష్మీశ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవదాయ శాఖ, దుర్గగుడి దేవస్థాన భూములు అన్యాక్రాంతం అంశంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం దుర్గగుడి ఈవో శీనానాయక్తో సమావేశం నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబ ర్లో సమావేశం జరిగింది. ఇటీవల కాలంలో దేవ దాయ శాఖ, దుర్గగుడికి చెందిన భూములు, పొలాలు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం కావడంపై దాతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక నిర్ణయాలు.. ఈ నేపథ్యంలో దేవాలయ భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్, ఈవోలు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఆలయ భూములు ఉన్న మండల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారితో మాట్లాడారు. దేవదాయ శాఖ, దుర్గగుడి అధికారుల వద్ద ఉన్న రికార్డుల మేరకు వెంటనే ఆలయ భూములను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. వివాదాలలో ఉన్న ఆలయ భూములు, పొలాల వివరాలను దుర్గగుడి లీజెస్ విభాగం అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో సబ్ కలెక్టర్ చైతన్య, దేవదాయ శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలపై ‘తమ్ముళ్ల’ దాడి
● తాము చెప్పిన చోటే పని చెయ్యాలంటూ దౌర్జన్యం ● ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని పోలీసులు మైలవరం: తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం రోజు రోజుకూ శ్రుతి మించుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్న తరుణంలో తెలుగు తమ్ముళ్లు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు అధికారమే అండగా దాడులకు తెగబడుతున్నారు. ఉపాధి కూలీలను కులం పేరుతో దూషిస్తూ మహిళలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన పొందుగలలో జరిగింది. మైలవరం మండలం పొందుగల గ్రామం దళితవాడకు చెందిన ఉపాధి హామీ కూలీలు స్థానికంగా ఉన్న చెక్ డ్యామ్ వద్ద ఉపాధి పనులు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నాయకుడి అనుచరులు ఆరేపల్లి సత్యనారాయణ, నాగరాజు, గోపాలరావు వచ్చి ‘ఇక్కడ పనిచేయవద్దు మేము చెప్పిన చోట పనులు చేయాలని’ వారిపై ఒత్తిడి చేశారు. ‘మేము చెప్పిన చోట పనులు చేయకపోతే కూలీ డబ్బులు కూడా ఇవ్వకుండా చేస్తా మంటూ’ బెదిరించారు. మేము ఫీల్డ్ అధికారి చెప్పిన చోట పనిచేస్తామని ఉపాధి కూలీలు తేల్చి చెప్పడంతో కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. ఈ వివాదాన్ని ఫోన్లో చిత్రీకరిస్తున్న మహిళ వద్ద ఫోన్ లాక్కుని మరీ దాడి చేశారు. దాడిలో ఉపాధి కూలీలు సుష్మ, కమలమ్మ అనే మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఘటనలో నిందితులపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టక పోవడంతో బాధిత ఉపాధి కూలీలు శుక్రవారం నిరసన తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. -
పురోగతి లేకుంటే ఉపేక్షించం
చిలకలపూడి(మచిలీపట్నం): గృహ నిర్మాణాల్లో పురోగతి లేకుంటే ఉపేక్షించేది లేదని, బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని మీకోసం సమావేశం మందిరంలో గృహ నిర్మాణ పురోగతిపై మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం చాలా వెనుకబడి ఉందన్నారు. ఈ నెల 13న సమీక్షించినప్పుడు 910 గృహాలను లక్ష్యంగా నిర్ణయించగా.. కేవలం 412 గృహాలు మాత్రమే పూర్తి చేశారన్నారు. మచిలీపట్నం నగరం, అవనిగడ్డ, కోడూరు, గన్నవరం, చల్లపల్లి, పెదపారుపూడి, కృత్తివెన్ను, మోపిదేవి, గుడివాడ నాగాయలంక మండలాలు పురోగతిలో చాలా వెనుకబడ్డాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో లెంటల్ స్థాయిలో 8,108, పైకప్పు స్థాయిలో 2,148, రూఫ్ కాస్టింగ్ స్థాయిలో 588 ఇళ్లు ఉన్నాయన్నారు. జూన్ నెల 13వ తేదీన నిర్వహించే సమావేశానికి పనితీరు మార్చుకోకపోతే కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు బాధ్యులైన వారిని అందర్నీ సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. గృహ నిర్మాణంపై మండల ప్రత్యేక అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లతో పాటు వెల్ఫేర్ సెక్రటరీ, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లతో తరచూ సమావేశాలు నిర్వహించి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. నేడు పింఛన్ల పంపిణీ.. జూన్ ఒకటో తేదీన సెలవు కావటంతో ఈనెల 31వ తేదీ శనివారం పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలని కలెక్టర్ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి వెంకట్రావు, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ చిన్నోడు, మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు మునిసిపల్ కమిషనర్లు బాపిరాజు, గోపాలరావు, వెంకటేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారులు జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద కుమార్, డీటీడబ్ల్యూవో ఫణిధూర్జటి, మత్స్యశాఖ జేడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్మాణాల్లో చాలా మండలాలు వెనుకబడి ఉన్నాయి అధికారులతో కృష్ణా కలెక్టర్ సమీక్ష -
జగన్ సంక్షేమ సంతకం.. అన్నదాతల్లో ఆనందం
కంకిపాడులో గత ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రిల్యాబ్ కాలువలకు మరమ్మతులు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే జూన్ మొదటి, రెండు వారాల్లో సాగునీటిని ప్రధాన కాలువలకు విడుదల చేశారు. కాలువలు, బోర్ల సదుపాయంతో భూములను దుక్కి, దమ్ములు చేయించి నారుమడులు, ఇతర ఖరీఫ్ సాగు పనులు రైతులు చేసుకున్నారు. రైతు భరోసా పథకం.. పెట్టుబడి సాయంగా ఖరీఫ్లోనే కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి రూ.13,500 విడతల వారీగా అందించి రైతులకు భరోసా ఇచ్చింది. 2019–24 వరకూ రూ.979.29 కోట్లు రైతు భరోసా కింద లబ్ధి చేకూరింది. మేమున్నామన్న ధైర్యం.. మిచాంగ్ తుపానుతో పంట నష్టం వాటిల్లితే నిబంధనలను పక్కన పెట్టి దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేసింది. 1,64,849 మంది రైతులకు ఇన్పుట్సబ్సిడీగా రూ. 126.03 కోట్లు అందించింది. అంతే కాకుండా వివిధ విపత్తులతో జరిగిన నష్టానికి ఐదేళ్ల కాలంలో రూ 47.77 కోట్లు రైతులకు అందించిన పరిస్థితి. రుణ సాయం.. సున్నావడ్డీ కింద రూ లక్ష లోపు రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులు కృష్ణాజిల్లాలో 1.66 లక్షల మందికి రూ 30.23 కోట్లు, ఎన్టీఆర్ జిల్లాలో 30,405 మందికి రూ 7.72 కోట్లు లబ్ధి చేకూర్చింది. చెంతకే సేవలు.. రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చి ప్రపంచం యావత్తూ రైతు సేవల గురించి చర్చించేలా, దేశంలోని వివిధ రాష్ట్రాల దృష్టిని ఆకర్షించేలా విధానాన్ని అమలు చేసింది. గ్రామ స్థాయిలో భరోసా కల్పించిందంటూ రైతులు గుర్తు చేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. జలకళ సాకారం.. వైఎస్సార్ జలకళతో అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకీ సబ్సిడీతో కూడిన బోరు సదుపాయం కల్పించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అనేక గ్రామాల్లో జలకళ కింద బోర్లు ఏర్పాటయ్యాయి. పక్కాగా పరీక్షలు.. నియోజకవర్గానికి ఒక అగ్రిల్యాబ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మట్టి నమూనాతో పాటుగా విత్తన నాణ్యత, ఎరువుల, పురుగు మందుల నాణ్యత, చేపల మేత నాణ్యత పరిశీలన వంటి అనేక పరీక్షలు అందించింది. ఒక్కో ల్యాబ్ ద్వారా నెల నెలా 100 పరీక్షలకు తగ్గకుండా జరిగాయంటే వాటిని ఎంత సమర్థంగా అందుబాటులోకి తెచ్చిందో, రైతుల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుందో అర్థమవుతుంది. -
యోగాను మరింత చేరువ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కళాకారులకు సమాజంలో మార్పు తెచ్చే శక్తి ఉందని యోగాను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంస్కృతిక వాస్తు శిల్పులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. ఆయుష్శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆర్టిస్ట్ థీమ్ యోగా నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని నాట్యాచార్యులు, కళాకారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సమాజంలోని ప్రతివర్గానికి యోగాను చేరువచేయాలనే ఉద్దేశంతో థీమ్ యోగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కళాకారులతో నిర్వహించిన యోగా అభ్యసన కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి సర్వ రోగ నివారిణి అయిన యోగాను రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మందికి జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి చేరువచేసేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డుకు యోగా స్ట్రీట్గా నామకరణం చేసి ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31న అన్నదాతలతో యోగాసనాల అభ్యసన కార్యక్రమం ఉంటుందన్నారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల ప్రిన్సిపల్ నరసమ్మ, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, ప్రముఖ నాట్యాచార్యులు కళారత్న భాగవతుల వెంకట రామశర్మ, కళాక్షేత్ర నృత్య అకాడమీ హవీష చౌదరి పాల్గొన్నారు. కలెక్టర్ జి.లక్ష్మీశ -
కేటుగాళ్లు రూటు మార్చారు
● ఎన్టీఆర్ జిల్లాలో బైక్లు చోరీ ● ఆ నగదుతో ఏవోబీలో గంజాయి కొనుగోలు ● పాత నేరస్తుల ఆధ్వర్యంలో దందా విజయవాడ స్పోర్ట్స్: గంజాయిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అక్రమ మార్గంలో అది విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు వచ్చి చేరుతూనే ఉంది. సరుకు, ప్రజా రవాణాపైనే నిఘా నేత్రం దృష్టి సారిస్తున్న ప్రస్తుత తరుణంలో గంజాయి అక్రమ రవాణాకు కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. ఈ ప్రాంతాలే టార్గెట్ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలు ముందుగా బైక్లను చోరీ చేస్తున్నారు. విజయవాడలోని రద్దీ ప్రాంతాలు, రాత్రి సమయంలో రోడ్లపైనే పార్కింగ్ చేసి ఉండే ప్రాంతాల్లో, ఆస్పత్రుల వద్ద బైక్లను చోరీ చేస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్స్టేషన్, రైల్వే స్టేషన్, కొత్త, పాత ప్రభుత్వాస్పత్రి, కొండ సమీపంలోని నివాసాల వద్ద ఈ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. కృష్ణలంక, భవానీపురం, కొత్తపేట, మాచవరం, సత్యనారాయణపురం, పోలీస్ స్టేషన్ల్లో ఈ దొంగతనాలు అధికంగా జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. గడచిన ఏడాదిలో 185 బైక్ చోరీ కేసులు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి. సిండికేట్గా మారి.. చోరీ ముఠా మొత్తం సిండికేట్గా మారి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధానంగా విజయవాడకు చెందిన కట్టా శ్రీను ఇక్కడ బైక్లను చోరీ చేసే ముఠాకు నాయకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. బైక్ చోరీ చేసిన వ్యకి..ఒడిశాకు చేరుకునే మార్గాన్ని ఇతనే దిశానిర్దేశం చేస్తాడు. ఒడిశాకు చేరుకున్న తర్వాత చోరీ చేసిన బైక్ను నరసింహులు అనే వ్యక్తి కొనుగోలు చేసి నగదు ముట్టజెబుతాడు. ఆ తర్వాత రమేశ్ అనే వ్యక్తి నేరగాళ్లకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతంలో రమేష్ గంజాయి విక్రయించడంతో పాటు విజయవాడలోనూ తన ముఠాతో యువతకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులపై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదు గంజాయి అక్రమ రవాణా చేసే వ్యక్తులు బైక్లను చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నాం. ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నాం. ఏడాదిలో 185 బైక్లు చోరీకి గురవ్వగా 130 బైక్లను స్వాధీనం చేసుకున్నాం. ప్రధాన నిందితులు కట్టా శ్రీను, నరసింహులు, రమేశ్తో పాటు మరికొందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిందితులపై పిట్ ఎన్డీపీఎస్(ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్స్) యాక్ట్ను ప్రయోగిస్తున్నాం. ఈ కేసులో అరెస్ట్ అయితే ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ బైక్కు జీపీఎస్ ట్రాకర్ను అమర్చుకోవాలి. దీంతో బైక్ చోరీకి గురైన వెంటనే ట్రాకర్ సాయంతో గుర్తించడానికి వీలుంటుంది. – రాజశేఖరబాబు పోలీస్ కమిషనర్, విజయవాడ విజయవాడతో పాటు నగర శివారు, గ్రామీణ ప్రాంతాల్లో చోరీ చేసిన బైక్లపై నేరగాళ్లు నేరుగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)కి చేరుకుంటున్నారు. విజయవాడలోనే సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఒడిశాలోకి ప్రవేశించి, అక్కడ వాహనాన్ని అమ్మేస్తున్నారు. వచ్చిన నగదులో కొంత జల్సాలు చేసి మిగిలిన నగదుతో అక్కడే గంజాయిని కొనుగోలు చేసి, పలు రవాణా మార్గాల్లో విజయవాడకు చేరుకుంటున్నారు. ఒక్కో నిందితుడు గరిష్టంగా 5 కేజీల గంజాయిని తీసుకొస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తీసుకువచ్చిన గంజాయిని ప్యాకెట్లుగా చేసి యువతకు విక్రయిస్తున్నారు. బైక్లతో పాటుగానే మొబైల్ ఫోన్లనూ ఈ ముఠా చోరీ చేసి ఒడిశాలో విక్రయించి, ఆ సొమ్ముతో గంజాయి కొని తీసుకొస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఒడిశాలో అమ్మేస్తున్నారు గంజాయి కొనుగోలు చేసేందుకు చోరీ చేసిన బైక్లను ఇటీవల స్వాధీనం చేసుకున్న సింగ్నగర్ పోలీసులు (ఫైల్) (ఇన్సెట్లో) గంజాయి -
బీడీసీ రిటైనింగ్ వాల్ పనులపై మంత్రి అసంతృప్తి – కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): గతేడాది బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతంలో రూ.23 కోట్లుతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ వద్ద జరుగుతున్న సిమెంట్ కాంక్రీట్ పనులను అధికారులతో కలసి శుక్రవారం మంత్రి పరిశీలించారు. పనులు నత్తనడకన జరగడంపై కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. మందకొడిగా పనులు సాగడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 10వ తేదీనాటికి ప్రధాన పనులు పూర్తి చేయాలని ఆదేశించినా కాంట్రాక్ట్ ఏజెన్సీ స్పందించక పోవడంపై మండిపడ్డారు. తక్షణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్మికులను సొంత జిల్లాలకు పంపండి చిలకలపూడి(మచిలీపట్నం): తెలంగాణ నుంచి వచ్చిన తొమ్మిది మంది ఏపీకి చెందిన వెట్టి చాకిరి కార్మికులను వారి సొంత జిల్లాలకు సురక్షితంగా పంపించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి పెంట్లవల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలోని ఫిషింగ్ యూనిట్లో తొమ్మిది మంది వెట్టిచాకిరి చేస్తున్న (బాండెడ్) కార్మికులను ఏపీకి చెందినవారుగా గుర్తించారు. వారిని శ్రీకాకుళం, కృష్ణ, విజయ నగరం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, కడప, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందినవారని తెలియజేస్తూ సర్టిఫికెట్లను జారీ చేస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకొనివచ్చి అప్పగించారు. వారు శుక్రవారం ఉదయం కలెక్టర్ డీకే బాలాజీని కలిశారు. కలెక్టర్ వారందరితో మాట్లాడి కార్మికులను సొంత జిల్లాలకు పంపారు. కల్తీ ఇంజిన్ ఆయిల్ వ్యాపారి అరెస్ట్ సూర్యాపేటటౌన్: కల్తీ ఇంజన్ ఆయిల్ తయారు చేసే వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. శుక్రవారం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద సీసీఎస్, కోదాడ రూరల్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా కల్తీ ఇంజన్ ఆయిల్ బాటిల్స్తో వ్యాపారి పట్టుబడ్డాడు. అతడిని విచారరణ చేయగా ఏపీలోని విజయవాడకు చెందిన కాకాని నాగ వెంకటేశ్వరరావుగా గుర్తించారు. అతడు విజయవాడలోని ఓ ఇంజిన్ ఆయిల్ కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేశాడు. ఇంజిన్ ఆయిల్ తయారీలో అనుభవం ఉన్న నాగ వెంకటేశ్వరరావు సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఈక్రమంలో కలకత్తా నుంచి ప్రముఖ కంపెనీలకు చెందిన ఆయిల్ డబ్బాల స్టిక్కర్లు, లేబుల్స్, ప్లాస్టిక్ టిన్స్ తెప్పించాడు. విజయవాడలో దొరికే మడ్డి ఆయిల్ ఫిల్టర్ చేసే వారి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి విజయవాడలో తన ఇంటి వద్దనే లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్లో నింపి స్టిక్కర్లు అతికించి లీటర్ రూ.200 చొప్పున బైక్ మెకానిక్లకు విక్రయించడం ప్రారంభించాడు. 2007లో విజయవాడలోని తన ఇంటిలో కల్తీ ఇంజిన్ ఆయిల్ను బాటిల్స్లో నింపుతుండగా విజయవాడ వన్ టౌన్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశాడు. రెండు రోజులు విజయవాడ జైల్లో ఉన్నాడు. తర్వాత వ్యాపారం బంద్ చేశారు. మళ్లీ కల్తీ ఇంజిన్ ఆయిల్ తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయిల్ బాటిల్స్ను కారులో వేసుకుని నేరేడుచర్ల, మిర్యాలగూడ బైక్ మెకానిక్లకు అమ్ముతున్నాడు. శుక్రవారం ఉదయం కారులో కల్తీ ఇంజిన్ ఆయిల్ బాటిల్స్తో రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు వస్తుండగా సూర్యాపేట సీసీఎస్ పోలీసులు, కోదాడ రూరల్ పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2లక్షల విలువైన ఆయిల్, కారును స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీసీఎస్ సీఐ శివ, సిబ్బంది, కోదాడ రూరల్ సీఐ రజితరెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు ఒంగోలులో హాల్టింగ్ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల అవసరాల దృష్ట్యా రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనంగా విజయవాడ డివిజన్లోని ఒంగోలు రైల్వే స్టేషన్లో రెండు నిమిషాలు హాల్టింగ్ ఇచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి ధనపూర్–బెంగళూరు ఎక్స్ప్రెస్ రైళ్లు (03251,03259) అర్ధరాత్రి 1.28 గంటలకు ఒంగోలు చేరుకుని, తిరిగి 1.30 గంటలకు బయలుదేరుతాయి. జూన్ 3 నుంచి బెంగళూరు–ధపపూర్ ఎక్స్ప్రెస్ రైళ్లు (03252,03260) రైళ్లు ఉదయం 11.58 గంటలకు ఒంగోలు చేరుకుని, తిరిగి 12 గంటలకు బయలుదేరుతాయి -
నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కలెక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 31వ తేదీ శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2,27,786 పెన్షన్లకు దాదాపు రూ. 98.11 కోట్లు పంపిణీ చేస్తారని చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషి చేయాలన్నారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్డీఏ పీడీ, ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పెన్షన్ల పంపిణీ జరిగేలా చూడాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, ఆర్డీఓలో కావూరి చైతన్య, కె.మాధురి, కె.బాలకృష్ణ, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. ఆలిండియా సహకార భారతి డెయిరీ సెల్ డైరెక్టర్గా చలసాని చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఆలిండియా సహకార భారతి డెయిరీ సెల్ డెరెక్టర్గా కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) చైర్మన్ చలసాని ఆంజనేయులను ఎన్నుకున్నట్టు ఏపీ సహకార భారతి చైర్మన్ అడ్డూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ బోర్డు మీటింగ్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో చలసాని ఆంజనేయులకు, అడ్డూరి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ 24వ తేదీ గుజరాత్లోని ఆనంద్లో ఆలిండియా సహకార భారతి సమావేశం జరిగిందన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ తరఫున చైర్మన్ చలసాని ఆంజనేయులు హాజరు కావడంతో పాటు సహకార రంగంలో విజయ డెయిరీ సాధిస్తున్న విజయాలను, రైతు సంక్షేమ కార్యక్రమాలను వివరించారన్నారు. సహకార రంగంలో పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సహకార భారతి డెయిరీ సెల్ను ఏర్పాటు చేశారన్నారు. దానిలో జాతీయ స్థాయిలో పది మంది డైరెక్టర్లలో చలసాని ఆంజనేయులను ఒకరిగా ఎంపిక చేశారని తెలిపారు. సహకార రంగంలో ఇబ్బందులకు గురయ్యే వారికి వెన్నుదన్నుగా ఉండాలనే లక్ష్యంతో 1979లో సహకార భారతి ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీనివాసరావును విజయ డెయిరీ బోర్డు చైర్మన్, డైరెక్టర్లు శాలువాతో సత్కరించారు. -
దుక్కుల్లో దుఃఖం
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2025ఏడాదిగా అతీగతీలేక అన్నదాత ఆక్రందన● సాగులో అడుగడుగునా గండాలు ● పండిన పంటకు గిట్టుబాటు దక్కక ఆవేదన ● ప్రకృతి విపత్తులతో నష్టపోతే ఆదుకోని సర్కారు ● వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కూటమి ఏడాది పాలనజిల్లాలో పరిస్థితి.. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 2,09936 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 1.21 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరితో పాటు 3.30 లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 785 గ్రామాల్లో 600 రైతు సేవా కేం ద్రాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. చైర్పర్సన్ ఎన్నికకు భారీ బందోబస్తు తిరువూరు: తిరువూరు నగరపంచాయతీ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గత రెండు విడతల్లో చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియకు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అడుగడుగునా అడ్డుతగిలి కౌన్సిలర్లను ఎన్నికల్లో ఓటు వేసేందుకు రానీయకుండా ఇబ్బందుల పాలు చేయడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొనడంతో చైర్పర్సన్ ఎన్నిక వాయిదా వేశారు. మళ్లీ జూన్ 2న చైర్పర్సన్ ఎన్నిక నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీవో కె. మాధురి కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. ఏసీపీ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బంగారు నగలు ఉన్న పర్సు అప్పగింత అవనిగడ్డ: ఆర్టీసీ బస్లో మర్చిపోయిన బంగారు నగలు ఉన్న పర్సుని తిరిగి ఆ ప్రయాణికురాలికి అప్పగించిన ఘటన శుక్రవారం జరిగింది. డిపో మేనేజర్ కె.హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డకు చెందిన ఉడతా వెంకట రమణమ్మ ఆర్టీసీ బస్సులో విజయవాడ నుంచి అవనిగడ్డకు వచ్చింది. ఇంటికి వెళ్లిన తరువాత తన వద్ద ఉండాల్సిన కవర్ కనిపించక పోవడంతో మనవడిని ఆర్టీసీ డిపోకి పంపించింది. అప్పటికే ఆ బస్ గ్యారేజీలోకి వెళ్లగా సిబ్బంది క్లీనింగ్ చేస్తున్నారు. బస్లో వెనుక సీటులో కవర్ కనబడింది. అందులో ఉన్న పర్స్ చూడగా రూ.1.50 లక్షల విలువగల బంగారు గొలుసు, రూ.890 నగదు ఉన్నాయి. అనంతరం వాటిని డిపో మేనేజర్ ద్వారా ప్రయాణికురాలికి అందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ శ్రీలక్ష్మి, ఆర్టీసీ సెక్యూరిటీ హెడ్ రాఘవయ్య, డీసీ బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్లాస్టిక్ జార్లలో విజయ నెయ్యి చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) ప్లాస్టిక్ జార్లలో ఆవు, గేదె నెయ్యిలను అందిస్తున్నామని చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. పాలప్రాజెక్టులోని పరిపాలనా భవనంలో శుక్రవారం చైర్మన్ చలసాని ఆంజనేయులు మీడి యా సమావేశం ఏర్పాటు చేసి, విజయ నూత న ఉత్పత్తులను వినియోగదారులకు పరిచ యం చేశారు. ఆవు, గేదె నెయ్యిలను కేజీ, అరకేజీ, 200 ఎంఎల్, 100 ఎంఎల్లలో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కేజీ రూ. 650, అర కేజీ రూ. 330, 200 ఎంఎల్ రూ.160, 100 ఎంఎల్ రూ. 90లకు అన్ని విజయ అవులెట్స్, మిల్క్ పాయింట్లలో విక్రయిస్తామన్నారు. తొలుత నిర్వహించిన పాలక వర్గ సమావేశంలో పాడి రైతుకు మరింత ఆర్థిక దన్ను ఇచ్చేలా చేపట్టాల్సిన కార్యచరణ గురించి చర్చించామని తెలిపారు. ఎండీ కొల్లి ఈశ్వరబాబు, సమితి డైరెక్టర్లు చలసాని చక్రపాటి, వేమూరి వెంకట సాయి, నెలకుదిటి నాగేశ్వరరావు, నెక్కలపు వాణిశ్రీ, చెరుకూరి లవయ్యలతో పాటు పలువురు ట్రస్ట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. 4న ‘వెన్ను పోటు దినం’ పామర్రు: కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టే విధంగా వైఎస్సార్ సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన నిర్వహించే ‘వెన్ను పోటు దినం’ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ అన్నారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమాలలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభు త్వ అసమర్థతపై ప్రజా వ్యతిరేకతను తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి.. గెలిచాక పథకాలు ఇవ్వకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వ దగాకోరుతనానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఆపద వేళ రిక్తహస్తం.. కూటమి ఏడాది పాలనా కాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఉమ్మడి జిల్లాలో పంటలకు అపార నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి పెట్టుబడులు కోల్పోయారు. మే మొదట్లో వచ్చిన అకాల వర్షాలకు సైతం అదే నష్టం. చేతికొచ్చిన ధాన్యం, మొక్కజొన్న, మిరప, పత్తి, మామిడి, కూరగాయ పంటలు తుడిచిపెట్టుకు పోయాయి. గతేడాది సెప్టెంబర్ వరదల సాయంలో సర్కారు భారీగా కోత విధించి మొక్కుబడిగా సాయం అందించటం తెలిసిందే. ఇక అకాల వర్షాల విషయంలో నష్టపరిహారం ఎంత? ఎప్పుడు ఇస్తారు? అన్నది కూడా స్పష్టత లేక, తమను ఆదుకునే నాఽథుడే కరువయ్యాడంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు సేవా కేంద్రాల(గతంలో ఆర్బీకేలు) నిర్వహణను గాలికొదిలేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ. 129 కోట్ల అంచనా వ్యయంతో 600 రైతు సేవా కేంద్రాలను చేపట్టింది. వీటిలో దాదాపుగా అన్ని కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే తుది దశ పనుల వద్ద నిలిచి పోయి, నిర్మాణ పనులు పూర్తయ్యి ప్రారంభానికి నోచుకోక రైతు సేవకు దూరంగా ఉంటున్నాయి.నమ్మించి మోసం.. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను ప్రజానీకం విశ్వసించారు. ముఖ్యంగా సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తామని, సాగునీరు సమృద్ధిగా అందేలా చూడటంతో పాటుగా పెట్టుబడి సాయం ఏకంగా రూ. 20 వేలు (కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి) ఇస్తామని ప్రచారం చేసింది. కానీ ఏడాది కూటమి పాలనలో ఒక్క పైసా అన్నదాత సుఖీభవ కింద రైతు ఖాతాలకు చేరింది లేదు. నమ్మించి నయవంచన చేస్తూ రెండో ఏడాది పాలనకు కూటమి శ్రీకారం చుట్టిందంటూ రైతులు పెదవి విరుస్తున్నారు. సాగుకు భరోసా లేకుండా పోతుందంటూ ఆవేదన చెందుతున్నారు. బందరు, రైవస్తో పాటు బ్యారేజీకి ఎగువున ఉన్న అనేక ప్రధాన కాలువలు, బుడమేరు సహా చానళ్లు తూడు, గుర్రపుడెక్కతో పూడుకుపోయాయి. వేసవిలోనే కాలువ కట్టల పటిష్టం, తూడు, పూడికతీత తొలగింపు పనులు పూర్తి చేయిస్తే ఖరీఫ్ నాటికి కాలువలు సిద్ధమయ్యేవి. కానీ హడావుడిగా మొక్కుబడిగా తూడు తొలగింపులకు నిధులు కేటాయింపులు చేయటం, పనులు చేపట్టడం వల్ల కాలువ చివరి భూములకు సాగునీరు ప్రశ్నార్థకమేనని, మొక్కుబడిగా పనులు సాగటం వల్ల ప్రయోజనం ఉండదని రైతులు వాపోతున్నారు. రైతులకు ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలను మే ఆఖరు వస్తున్నా పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేని దుస్థితి నెలకొంది. వేసవిలో భూ సారం పెంపొందించే పచ్చిరొట్ట విత్తనాలు సమృద్ధిగా రైతులకు చేరలేదు. కొన్ని ఆర్ఎస్కేల్లో పచ్చిరొట్ట విత్తనాలు మూలుగుతున్నాయంటే రైతుల పట్ల ఎంతటి నిర్లక్ష్యం కనబరుస్తున్నారో తేటతెల్లమవుతోంది. ఎరువులు, విత్తనాలు, రైతు సేవల బుకింగ్స్ ఆన్లైన్లో చేపట్టేందుకు అందుబాటులోకి తెచ్చిన కియోస్క్లు మరమ్మతులతో మూలన పడ్డాయి. కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చింది. రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పింది. కానీ నేటికీ అండగా నిలిచిందే లేదు. ప్రభుత్వం అందించే విత్తనాలు, బయటి మార్కెట్లో విత్తనాలు ధర ఒకే విధంగా ఉన్నాయి. ఇంకా సబ్సిడీ విత్తనాలు అంటూ ప్రచారం చేసుకోవటానికే తప్ప ప్రయోజనం లేదు. భరోసా దక్కక రైతులు సాగుకు వెనుకాడుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. – కొండవీటి వెంకట సుబ్బారావు, రైతు, మంతెన ప్రకృతి విరుచుకుపడింది. ప్రభుత్వం మొక్కుబడిగా కాకిలెక్కలు వేసి అరకొరగా సాయం విదిలించింది. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట దెబ్బతిని రైతులు గగ్గోలు పెట్టారు. పరిహారం ఇదిగో అన్నారే కానీ, నేటికీ అందలేదు. అదే జగన్ ప్రభుత్వంలో ఏడాదికి రైతు భరోసా రూ.13,500 వచ్చింది. ప్రకృతి విపత్తుతో నష్టపోతే అదే సీజన్లో పరిహారంతో పాటుగా పంట ఎలాంటి స్థితిలో ఉన్నా కొనుగోలు చేసి ధైర్యం చెప్పింది. నేడు ఆ పరిస్థితి లేదు. – బొమ్మారెడ్డి వాసు, రైతు, చలివేంద్రపాలెం కూటమి ఏడాది పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదు. దళారులు ఎక్కువైపోయారు. ఈ ఏడాది ధాన్యం పండించిన రైతులకు నష్టమే తప్ప లాభం లేదు. క్వింటాకు రూ. 300 నుంచి రూ. 400 వరకూ నష్టపోయాం. వేసవిలో భూమికి బలాన్ని ఇచ్చే పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేస్తాం. నేను 30 ఎకరాలకు పైగా సాగు చేస్తాను. నాకు కేవలం 50 కిలోలు విత్తనం ఇచ్చారు. రెండెకరాలకు కూడా సరిపోదు. – నెరుసు నాని, రైతు, ఉప్పలూరు కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు మొండి చేయి చూపుతోంది. నేటి వరకూ కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. రైతుల అంగీకారంతో సంబంధం లేకుండా వాస్తవంగా సాగు చేస్తేనే ఇవ్వమని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశా. కానీ కార్డులు ఇవ్వటం లేదు. మొన్న అకాల వర్షాలకు మొక్కజొన్న పూర్తిగా దెబ్బతింది. కానీ ఆదేశాలు లేవంటూ నష్టం నమోదు చేసేందుకు అధికారులు ముందుకు రాలేదు. – వి.మరియదాసు, కౌలురైతు, గొడవర్రు జ్ఞాన సముపార్జనలో గ్రంథాలయాల పాత్ర కీలకం విజయవాడ కల్చరల్: విజ్ఞాన సముపార్జనలో గ్రంథాలయాల పాత్ర కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. గ్రంథాలయ పునర్వికాస వేదిక, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో 10 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాయాలు అని అభివర్ణించారు. ముగింపు సందర్భంగా బాల బాలికలకు నిర్వహించిన పోటీలో గెలుపొందిన వారికి కలెక్టర్ జ్ఞాపికలను, ప్రశంస పత్రాలను అందజేశారు. గ్రంథాలయ పునర్వికాసవేదిక నిర్వాహకులు గోళ్ల నారాయణరావు, సవర్ణవెంకటనారాయణ, మనోహర నాయుడు, లక్ష్మయ్య, రహ్మనుద్దీన్, నిహారిక, హసీనా తదితరులు పాల్గొన్నారు. 9నాడున్యూస్రీల్నేడుఅరకొర సేవలు.. కౌలు రైతులకు మొండిచేయిరైతులకు భరోసా ఏదీ? నష్టపోయినా ఆదుకోలేదు..పచ్చిరొట్టకూ దిక్కులేదు.. ఫిషరీస్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు భావదేవరపల్లి(నాగాయలంక): ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం అందించే ఫిషరీస్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండలంలోని భావదేవర పల్లి ఎంవీకేరావు మత్స్య పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.చంద్రశేఖరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 22ఏళ్ల లోపు, పదో తరగతి దానికి తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులని వివరించారు. మే 30 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుందని జూన్ 20తో గడువు ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ పాలిటెక్నిక్ కాలేజీలో చేరేందుకు ప్రవేశ పరీక్షలు ఉండవని, అడ్మిషన్స్ సంబంధించి మరి ఏ ఇతర ప్రకటన వెలువడదని తెలిపారు. -
నాతో గడుపు.. సర్టిఫికెట్ ఇప్పిస్తా!
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: అధికార మదంతో ఊగిపోతున్న కూటమి నేతలు(Kutami Leaders).. ఇప్పుడు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. తన భర్త డెత్ సర్టిఫికెట్ కోసం అర్జి పెట్టుకున్న ఓ మహిళను బీజేపీ నేత ఒకరు లైంగికంగా వేధిస్తున్న ఉదంతం విసన్నపేటలో వెలుగు చూసింది. విసన్నపేట(Vissannapeta) పట్టణంలో టీ దుకాణంలో పని చేసే ఆదిలక్ష్మీ.. బీజేపీ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అబ్బినేని బాబుపై సంచలన ఆరోపణలకు దిగింది. ఆయన తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ వీడియో ద్వారా ఆమె వివరాలను వెల్లడించారు .బాధితురాలి భర్త కొద్ది రోజుల మరణించాడు. అయితే డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అబ్బినేని బాబు ఆమె వద్దకు వచ్చి ఆరా తీశాడు. తనతో కొంత టైం గడిపితే డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆమె గట్టిగా తిట్టి పంపించేసింది. ఆటైంలో అబ్బినేని బాబు తాను చెప్పినట్లు వినకపోతే డెత్ సర్టిఫికెట్ ఎలా వస్తుందో చూస్తానంటూ బెదిరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలిసి అబ్బినేని తప్పతాగి వచ్చి ఆమెపై బెదిరింపులకు దిగారు. ‘‘నేను ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అంతటోడిని అని, ఎవరికీ భయపడను’’ అని మళ్లీ బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె తనకు న్యాయం జరగాలంటూ వీడియో ద్వారా అభ్యర్థించారు.ఇదీ చదవండి; చంద్రబాబు కోవర్టు రాజకీయం -
రైతులను సాగుకు సమాయత్తం చేయాలి
అనాథ బాలలతో జగనన్న గరికపాడు(జగ్గయ్యపేట): ఖరీఫ్ సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు వ్యవసాయ శాఖాధికారులు, శాస్త్రవేత్తలు ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు సూచించారు. గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రీ ఖరీఫ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ఆయన గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ.. జూన్ 12వ తేదీ వరకు రైతులను ఖరీఫ్ సాగుకు సమాయత్తం చేసేలా వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఈ పర్యటనలో భూమి, భూసార పరీక్ష, నీరు–నీటి పరీక్షల ప్రాముఖ్యత, సాగు మెలకువలు, పంటల ఎంపిక, అధిక దిగుబడులు ఇచ్చే పంట రకాలు, యాంత్రీకరణ సౌలభ్యం, పంటల యాజమాన్యం, సస్యరక్షణ, పాడి పశువుల యాజమాన్యంతో పాటు కేంద్ర, రాష్ట్ర పథకాలపై గ్రామ స్థాయిలో రైతులకు వివరిస్తారని పేర్కొన్నారు. ఖరీఫ్ సాగులో రైతుల అవసరాలను గుర్తించాలని సూచించారు. వరి, మిర్చి, మొక్కజొన్న పంటలతో పాటు కూరగాయలు, ఆహార ధాన్యాల సాగులో సాంకేతిక పరిజ్ఞానంతో అత్యధిక దిగుబడులు వచ్చేలా రైతులకు శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో వివరించాలన్నారు. గ్రామాల్లో పశుపోషణకు రైతులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అనుమంచిపల్లి, తక్కెళ్లపాడుకు చెందిన రైతులు సతీష్, వెంకటేశ్వర్లు జింకు సకాలంలో పంపిణీ చేయటం లేదని, పంట నష్టపరిహారం సక్రమంగా అందించలేదని, వరిలో ఎలుకల నివార ణకు అధికారులు కనీస చర్యలు తీసుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ ఢిల్లీరావు రైతుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేవీకేలో వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి, డీఆర్ఎస్ మాధవిలత, కేవీకే కోఆర్డినేటర్ అచ్యుతరాజు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణంరాజు, జగ్గయ్యపేట, నందిగామ ఏడీఏలు భవానీ, శ్రీనివాసరావు, ప్రకృతి వ్యవసాయం వలంటీర్లు, ఏఓలు, వీఏఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు -
ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరేసుకుని మృతిచెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో స్టేషన్ ఎదురుగా ఉన్న మసీదులో బయట వైపు గల ఒక గదిలోని ఫ్యాన్కు ఓ వ్యక్తి ప్లాస్టిక్ తాడుతో ఉరేసుకుని వేలాడుతూ ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుని వద్ద ఊరు, పేరుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడు ఎరుపు రంగులో ఉండి, నలుపు, తెలుపు జుట్టు కలిగి, 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండవచ్చని తెలిపారు. తెల్లని చొక్కాపై నల్లని చుక్కల డిజైన్, బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడని చెప్పారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిళ్లా రవి ఇచ్చిన ఫిర్యాదుపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుని గురించి వివరాలు తెలిసిన వారు 9849808555 నంబర్లో గానీ, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గానీ సంప్రదించాలని కోరారు. చిన్నబోయిన అమ్మతనం నడిరోడ్డుపై నెలలు నిండని మృత శిశువు చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఓ అమ్మ తన కాఠిన్యాన్ని చూపింది.. కడుపుతీపిని చంపుకొని అమ్మతనం చిన్నబోయేలా చేసింది.. నడి రోడ్డుపై అర్ధరాత్రి నెలలు నిండని పసిగుడ్డును వదిలేసి కర్కశాన్ని ప్రదర్శించింది. ఈ ఘటన కొత్తపేట కింద ప్రాంతంలోని సింహాద్రి వీధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై నెలలు నిండని పసిగుడ్డును పడేశారంటూ స్థానిక వీఆర్వో పామర్తి శివనాగేంద్రస్వామికి సమాచారం అందింది. దీంతో కొత్తపేట పోలీసుల సహకారంతో ఘటనా స్థలానికి చేరుకునే సరికి ప్రాణాలను కోల్పోయిన నెలలు నిండని పసికందు గుర్తించారు. ఘటనపై వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత శిశువును ఖననం చేసేందుకు తరలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు దుర్మరణం నందివాడ: మండలంలోని టెలిఫోన్ నగర్ ఆర్టీవో ట్రాక్స్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధు డు అక్కడికక్కడే మృతి చెందాడు. నందివాడ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. గుడివాడ రూరల్ మండలం శేరిగోల్వేపల్లి గ్రామానికి చెందిన నెరుసు బసవేశ్వరరావు (90) తన ఇంటి నుంచి బంధువుల ఫంక్షన్కి వచ్చి.. తిరిగి గురువారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో సుమారు 3.30 గంటల ప్రాంతంలో రోడ్డు మార్జిన్లో రోడ్డు దాటుతుండగా టెలిఫోన్ నగర్ ఆర్టీవో ట్రాక్స్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయిన వృద్ధుడి పై నుంచి ఆ వాహనం వెళ్లడంతో తల నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే చనిపోయాడు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
ప్రపంచ పర్యావరణ సంస్థ ఏపీ చాప్టర్ అధ్యక్షుడిగా భార్గవ్ కుమార్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ పర్యావరణ సంస్థ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బి.ఎస్ భార్గవ్ కుమార్, ఆ సంస్థ గౌరవ చైర్ పర్సన్గా డాక్టర్ జి.అనిత నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ ఫౌండర్ సీహెచ్ భద్ర వివరాలు చెబుతూ.. అంకిత భావం గల సంస్థకి సరైన వ్యక్తులను నియమించాలనే ఉద్దేశంతో ఏపీ చాప్టర్కు బీఎస్ భార్గవ్ కుమార్ను నియమించినట్లు తెలిపారు. జర్నలిస్ట్గా కెరీర్ను ప్రారంభించి తదనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేశారని, ప్రస్తుతం ఏపీ హై కోర్ట్లో అడ్వకేట్గా పని చేస్తున్నారన్నారు. అలాగే ఎంతో మంది జర్నలిస్ట్లను సమాజానికి అందించిన ప్రొఫెసర్ జి. అనితను గౌరవ చైర్ పర్సన్గా ఎన్నుకున్నామని, భవిష్యత్లో ఆమె మార్గదర్శకత్వంలో అందరం కలిసి పని చేస్తామన్నారు. -
మహా మండపంలో షాపులకు బహిరంగ వేలం
11, 12 తేదీల్లో నిర్వహణకు దుర్గగుడి అధికారుల ఏర్పాట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మహా మండపం 5వ అంతస్తులో పూజా సామగ్రి, ప్లాస్టిక్ ఆట వస్తువులను విక్రయించే 19 షాపులకు బహిరంగ వేలం నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన పనులను దేవస్థాన లీజెస్ విభాగం అధికారులు సిద్ధం చేశారు. జూన్ 11, 12వ తేదీన మహా మండపం ఆరో అంతస్తులో వేలం నిర్వహించనున్నారు. 2022లో అప్పటి ఈవో భ్రమరాంబ మహామండపంలో పూజా సామగ్రిని విక్రయించేందుకు షాపులకు బహిరంగం వేలం నిర్వహించారు. అయితే భక్తులు కొండపైకి ఘాట్రోడ్డు, లిఫ్టు మార్గంతో పాటు మెట్ల మార్గం ద్వారా చేరుకుంటున్నారు. కేవలం మహా మండపం మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే 5వ అంతస్తులోకి మళ్లించడంతో వారికే పూజా సామగ్రి విక్రయించే అవకాశం ఉండేది. వేలాది రూపాయలు అద్దెలు చెల్లించినా వ్యాపారాలు అంతగా లేకపోవడంతో తమ దుకాణాలను కొండ దిగువకు మార్చాలని దుకాణదారులు ఈవోకు మొర పెట్టుకున్నారు. దీంతో కనకదుర్గనగర్లో దేవస్థానం షాపులను నిర్మించి అద్దె బకాయిలు చెల్లించిన వారికి కేటాయింపు చేస్తామని ప్రకటించింది. దీంతో పలువురు వ్యాపారులు బకాయిలు చెల్లించి కనకదుర్గనగర్లో షాపులను దక్కించుకున్నారు. గతేడాది గోశాల వద్దకు.. గత ఏడాది దసరా ఉత్సవాలకు ముందు కనకదుర్గనగర్లోని షాపులను తిరిగి తొలగించి గోశాల ఎదుట కేటాయింపు చేశారు. అయితే ఇటీవల దుర్గగుడి ఈవోగా బాధ్యతలు నిర్వహించిన దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ గోశాల వద్ద ఉన్న దుకాణాలను తొలగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న దుకాణాలతో పాటు మహా మండపం 5వ అంతస్తులో ఉన్న దుకాణాలకు టెండర్ నిబంధనల ప్రకారం మూడేళ్ల కాల పరిమితి పూర్తి కానుంది. దీంతో వ్యాపారులు తమ దుకాణాలను తిరిగి రెన్యూవల్ చేయించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోసారి ఐదో అంతస్తుకు.. మహా మండపం 5వ అంతస్తుకు తిరిగి దుకాణాలను తరలిస్తున్నట్లు లీజెస్ విభాగం అధికారులు వ్యాపారులకు సూచించడంతో వారు ఆందోళనకు గురయ్యారు. గతంలో వ్యాపారాలు సరిగా లేకనే కొండ కిందకు దిగామని, తిరిగి మహా మండపంలోకి పంపడం సరికాదని బహిరంగంగానే పేర్కొంటున్నారు. మరో వైపున గోశాల వద్ద షాపులను కేటాయింపులకు దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులతో పాటు కీలక అధికారులకు లక్షలాది రూపాయలు ముట్టజెప్పినట్లు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అయితే కొంత మంది కూటమి నేతలు తమ దుకాణాలను బహిరంగ వేలం నిర్వహించకుండా ఉండేందుకు ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. -
‘వేగ’కు ఎలాంటి సంబంధం లేదు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): స్థానిక అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ‘బంగారం స్కీమ్ పేరుతో జరిగిన మోసం’ కేసుకు, తమకు ఎటువంటి సంబంధం లేదని, తమ సంస్థలో ఎటువంటి చిట్టీలు కానీ, ఏజెంట్లు కానీ లేనే లేరని వేగ జ్యూవెలరీ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్కుమార్ వనమా పేర్కొన్నారు. గుణదల సమీపంలోని ఓ హోటల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తన సోదరుడు సుధాకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి.. నవీన్కుమార్ మాట్లాడుతూ బంగారం స్కీమ్, చిట్టీల పేరుతో మోసం చేసిన కేసులో నిందితుడైన ముచ్చర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తికి.. తమ సంస్థకు సంబంధం ఉన్నట్లుగా వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముచ్చర్ల శ్రీనివాసరావు తమ ఏజెంట్ అంటూ.. వేగ జ్యూవెలరీకి వారు మాకు హామీ ఇచ్చారంటూ కొంతమంది బాధితులు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని వెల్లడించారు. తమను ఏ బాధితుడు వచ్చి కలవలేదని, తాము ఎవరికీ ఎటువంటి హామీలు కానీ, వివరణలు కానీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. కావాలంటే విజయవాడలోని తమ బ్రాంచి సీసీ కెమెరాలన్నింటినీ చెక్ చేసుకోవచ్చని తెలిపారు. నిజాయితీతో నడుచుకుంటూ ప్రజల విశ్వాసంతో ముందుకు వెళ్తున్న తమ సంస్థ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయాలనే దురుద్దేశంతో ఎవరైనా నిరాధార ఆరోపణలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ సంస్థలో ఉన్న బంగారం స్కీములు కేవలం 11 నెలలు మాత్రమే ఉంటాయని, వాటికి కూడా తమ సంస్థ తరఫున అన్ని రశీదులు, ఆన్లైన్ లావాదేవీలు ఉంటాయని వివరించారు. తమకు ఎటువంటి ఏజెంట్లు కూడా లేరని ఈ విషయాన్ని గమనించి, ప్రజలు ఎవరి చేతిలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీసులు త్వరితగతిన ఈ కేసును ఛేదించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సంస్థకు ఎటువంటి ఏజెంట్లు లేరు నిరాధార ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం వేగ జ్యూవెలరీ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్కుమార్ వనమా -
ఆరోగ్య, ఆనంద స్వర్ణాంధ్రే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆరోగ్య, ఆనంద స్వర్ణాంధ్ర సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా మే 21న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమం ముందుకెళ్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. ఆయుష్శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పోలీస్ కమిషనరేట్, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో పోలీస్ థీమ్ యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ కె.విజయానంద్ పాల్గొని సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. విశేష స్పందన.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్రకు విశేష స్పందన లభిస్తోందన్నారు. భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జి.జయలక్ష్మి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి అందించిన విలువైన యోగా సంపదపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ యోగాసనాల కార్యక్రమాలు జరుగుతున్నాయని, బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లోనూ థీమ్ యోగాను నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రణాళిక ప్రకారం జిల్లాలో దాదాపు 15 లక్షల మందికి యోగాను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్నీ సొంతం చేసే యోగా ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కమిషనర్ జి.వీరపాండ్యన్, ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.రాజకుమారి, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఏపీఎస్పీ ఐజీ రత్నకుమారి, డీసీపీ కేజీవీ సరిత పాల్గొన్నారు.జూన్ 21 వరకూ కార్యక్రమాలు.. అనంతరం సీఎస్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అప్పటికీ కనీసం రెండుకోట్ల మందికి యోగాను నేర్పించేలా ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.25లక్షల మంది యోగా ట్రైనర్లు నమోదు చేసుకున్నారని, వీరి సహాయంతో ప్రజలకు యోగాపై అవగాహన కల్పించడంతో పాటు యోగాసనాలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. -
అమ్మ భూమి పరిరక్షణకు చర్యలు
వివాదాస్పద భూమిని పరిశీలించిన దేవదాయశాఖ ఏసీ కంకిపాడు: అమ్మ భూమి పరిరక్షణకు సమర్థ చర్యలు తీసుకుంటామని, అన్యాక్రాంతం కానివ్వబోమని దేవదా యశాఖ ఏసీ నూతక్కి వెంకట సాంబశివరావు అన్నారు. మండలంలోని నెప్పల్లిలో గల దేవదాయశాఖ భూమిని ఆ శాఖ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. వివాదాస్పదంగా మారి న భూమిలో రియల్ వెంచర్ నిర్వాహకులు చేపడుతున్న పనులను అడ్డుకున్నారు. స్థలాల మెరక, వ్యర్థనీటి తొలగింపు పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఏసీ నూతక్కి వెంకట సాంబశివరావు విలేకరులతో మాట్లాడారు. అగ్రిమెంట్లు తేవాలని ఆదేశం.. మండలంలోని నెప్పల్లి గ్రామంలోని ఆర్ఎస్ నంబరు 101లో 4.41 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడ దుర్గగుడి దేవస్థానానికి చెందిన భూమి ఉందని ఏసీ చెప్పారు. ఈ భూమిని దేవదాయశాఖకు సంబంధం లేకుండా కన్యకా పరమేశ్వరీ సత్రం నిర్వాహకులు అడంగల్లో పేరు నమోదు చేయించి, లీజుకు ఇచ్చారని చెబుతున్నారన్నారు. లీజుకు సంబంధించిన దస్తావేజులు అందించాలని ఆదేశించామన్నారు. దేవస్థానానికి చెందిన భూమి నుంచి రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులు అక్రమంగా రహదారిని నిర్మించారన్నారు. కన్యకా పరమేశ్వరీ సత్రం నుంచి తమకు లీజుకు ఇచ్చారని చెబుతున్నారన్నారు. అందుకు సంబంధించిన దస్తావేజులు, అగ్రిమెంట్లు తేవాలని ఆదేశించామన్నారు. దేవదాయ శాఖకు చెందిన భూమి నుంచి రోడ్డు నిర్మించటాన్ని సహించేది లేదన్నారు. తక్షణమే రోడ్డును మూసివేస్తున్నామన్నారు. దుర్గగుడి అధికారులతో భూమి వ్యవహారంపై సంప్రదింపులు జరిపామన్నారు. 43 ప్రాపర్టీ రిజిస్టర్లో భూమి వివరాలను పొందుపర్చటంతో పాటుగా, భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వివరించారు. పరిశీలనలో ఇన్స్పెక్టన్ సుజన్కుమార్, ఈఓ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. లంచం తీసుకున్న డెప్యూటీ సర్వేయర్కు జైలు పెనుగంచిప్రోలు: ఏసీబీ కేసులో మండల సర్వేయర్గా పనిచేసిన సబతి సత్యనారాయణకు ఏసీబీ ప్రత్యేక కోర్టు గురువారం ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ.6,000 జరిమానా విధించింది. పెనుగంచిప్రోలు మండలం, అనిగండ్లపాడు గ్రామానికి చెందిన గింజుపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి అతని తండ్రి వ్యవసాయ భూమికి చెందిన సర్వే రిపోర్టును తహసీల్దార్కు పంపటానికి రూ.2,500 లంచం డిమాండ్ చేయగా.. విజయవాడ అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు శ్రీనివాసరావు వద్ద నుంచి 2010, అక్టోబర్ 15న సర్వేయర్ లంచం డబ్బులు తీసుకొంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేసి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో అతనిపై చార్జ్షీట్ వేశారు. కోర్టు విచారణ అనంతరం గురువారం జరిమానాతో పాటు శిక్ష విధించారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు పొడిగింపు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మూడు నెలల పాటు పొడగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 31 వరకు కార్డులపై కాలపరిమితి పొడిగింపు స్టిక్కర్ను పొంది అనంతరం బస్సు పాస్లను తీసుకోవాల్సిందిగా డీఐపీఆర్వో ఓ ప్రకటన తెలిపారు. 30వ తేదీ శుక్రవారం నుంచి డీఐపీఆర్వో కార్యాలయ పనివేళల్లో స్టిక్కర్ పొందాలని కోరారు. -
బంగారం స్కీం పేరుతో ఘరానా మోసం
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): నెలనెలా వాయిదా పద్ధతిలో బంగారానికి డబ్బులు కడితే 25 నెలలు తరువాత కట్టిన దానికి అదనంగా బంగారం, డబ్బులు వేసి ఇస్తారంటూ ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి రూ.30 కోట్లకు టోకరా వేసిన ఘటన విజయవాడ అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్నగర్ ప్రాంతానికి చెందిన చలవాది లక్ష్మణుడు ఓ టీవీ చానెల్ చైర్మన్గా పనిచేస్తున్నాడు. అతనికి అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ మార్క్లో నివసిస్తున్న ముచ్చెర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి తాను వేగ జ్యూవెల్లరీలో ఏజెంట్గా పనిచేస్తానని పరిచయం చేసుకుని బంగారం స్కీమ్ గురించి చెప్పాడు. 25 నెలల పాటు నెలకు 30 గ్రాముల బంగారానికి డబ్బులు కడుతూ ఉంటే 26వ నెల మనం కట్టిన డబ్బులకు, ఆ బంగారానికి అదనంగా వేసి తిరిగి చెల్లిస్తారని చెప్పుకొచ్చాడు. తనపై నమ్మకం కలిగేలా ఓ 25 మంది టీములో ఉన్న వారిలో ఓ వ్యక్తికి మొదటినెల తాను చెప్పినట్లుగానే బంగారం ఇచ్చాడు. దీంతో అతని మాటలు నమ్మి, వేగ జ్యూవెల్లరీపై నమ్మకం కలగడంతో లక్ష్మణుడు నెల నెలా డబ్బులు కడుతున్నాడు. ఈ క్రమంలో 25 నెలలు ముగిసిన తరువాత 26వ నెల డబ్బులు, బంగారం కోసం లక్ష్మణుడు శ్రీనివాసరావుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతని ఫోన్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన లక్ష్మణుడు శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఆరా తీయగా మూడు రోజుల నుంచి శ్రీనివాసరావు ఆచూకీ దొరకడం లేదని వారు బదులు ఇచ్చారు. ఇంతలో మరికొంతమంది బాధితులు శ్రీనివాసరావు ఇంటి వద్దకు వచ్చి తాము కూడా బంగారం స్కీముకు, చిట్టీలకు డబ్బులు కట్టామని తమకు కూడా డబ్బులు రావాలని చెప్పారు. దీంతో వారంతా కలిసి బందరురోడ్డులోని వేగ జ్యూవెలరీకి వెళ్లి అక్కడి యాజమాన్యంతో కలిసి మాట్లాడగా వారు శ్రీనివాసరావు తమ ఏజెంట్ అన్న మాట వాస్తవమేనని, అయితే అతను ఎవరి వద్ద డబ్బులు కట్టించుకున్నాడో, ఎంత కట్టించుకున్నాడో తెలియాలంటే ఆయన రావాలని, శ్రీనివాసరావును తీసుకుని వచ్చి ఆధారాలు చూపిస్తే తాము వాటిని ఇస్తామని చెప్పారు. శ్రీనివాసరావు ఆచూకీ ఎక్కడా లభించకపోవడంతో లక్ష్మణుడు ఇతర బాధితులతో కలిసి సింగ్నగర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారం, చిట్టీలు, టూర్లు ముచ్చెర్ల శ్రీనివాసరావు బంగారం స్కీములతో పాటు చిట్టీలు వేయడం, జనాలను టూర్లకు తీసుకువెళ్లడం చేసేవాడని తెలిసింది. ఇలా చిట్టీలు, బంగారం స్కీ ములు, టూర్ల పేరుతో డబ్బులు ఇచ్చిన బాధితులు మొత్తం 65 మంది సింగ్నగర్ పోలీసులను ఆశ్రయించారు. సుమారు రూ.30 కోట్ల వరకూ బాధితులు మోసపోయినట్లుగా తెలుస్తోంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. లక్ష్మణుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి ఆచూకీ తెలుసుకుని అతన్ని విచారించిన తరువాత పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. రూ.30 కోట్లకు టోకరా టీడీపీ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న వేగ జ్యూవెల్లరీ ఏజెంట్పై కేసు నమోదు అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్కు క్యూకడుతున్న బాధితులు పరారీలో నిందితుడు ముచ్చెర్ల శ్రీనివాసరావు -
రూ.16.80 లక్షలతో అంచనాలు తయారు
పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకం మరమ్మతులకు రూ.16.80 లక్షలతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్లు ఏపీఎస్ఐడీసీ విజయవాడ డివిజన్ ఈఈ బి.రత్నరాజు తెలిపారు. ఈనెల 28న ‘సాక్షి’ దినపత్రికలో ‘‘ఎత్తిపోతలు..ఎదురు చూపులు’’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా ఈఈ రత్నరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెనుగంచిప్రోలు మునేరు పక్కన 2465.92 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు సుమారుగా 17.23 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించామని, 2018లో పథకానికి శంకుస్థాపన జరగగా 2021లో పూర్తి చేశామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటినుంచి సాగునీరు రైతులకు అందిస్తున్నామన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన భారీ వరదలకు ఎత్తిపోతల పథకంలోని పంపులు, మోటార్లు, పానెల్ బోర్డు, 2 ట్రాన్స్ఫార్మర్లు, వీసీబీ పానెల్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయని, విద్యుత్ స్తంభాలు పడిపోయాయన్నారు. వరద తగ్గిన తరువాత అధికారులు పథకాన్ని పరిశీలించి రూ.16.80 లక్షలతో వివరణాత్మక అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించామని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. -
అనిగండ్లపాడులో ఉద్రిక్తత
● ఉపాధి పనులపై విచారణ సమయంలో కూలీల ఆందోళన ● ఏపీడీ కారును అడ్డగించి నిరసన అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఉపాఽధిహామీ పనులపై నిర్వహించిన విచారణ ఉద్రిక్తతకు దారితీసింది. ఉపాధిహామీ పనులకు రాని వారికి వచ్చినట్లు హాజరు నమోదు చేశారని, గతంలో చేసిన విచారణ సరిగా లేదంటూ గ్రామానికే చెందిన గింజుపల్లి వేణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీడీ ఎన్. శ్రీనివాసరావు, ఏపీఓ ఎన్. జనార్దనరావు మరోసారి విచారణ నిర్వహించారు. దీనిలో భాగంగా పెద్ద సంఖ్యలో వచ్చిన కూలీలు తాము అందరూ పనిచేస్తేనే కూలీ డబ్బులు వచ్చాయన్నారు. ఎఫ్ఏగా రమణ పనిచేసిన సమయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, అతనినే తిరిగి ఎఫ్ఏగా నియమించాలన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇక్కడకు రావాలని కూలీలు పట్టుబట్టి పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించారు. అధికారులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మహిళా మేట్లకు వేణు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమయంలో చేసేది లేక విచారణాధికారి ఏపీడీ శ్రీనివాసరావు కారులో వెళ్లిపోతుండగా కూలీలు అడ్డుకున్నారు. దీంతో ఆయన మళ్లీ పోలీసుల మధ్య పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లారు. పోలీసులు సర్దిచెప్పడంతో.. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎంఎస్కే అర్జున్ సంఘటనా స్థలానికి వచ్చి కూలీలతో మాట్లాడారు. విచారణ నిర్వహించటానికే అధికారులు వచ్చారని, అధికారులు అందరి దగ్గర నుంచి లిఖిత పూర్వకంగా అర్జీలు తీసుకున్నారన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో ఆందోళన తగదన్నారు. మీకు సమస్య ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఉన్నతాధికారులకు నివేదిస్తాం.. దీనిపై ఏపీడీని వివరణ కోరగా వేణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేశామని, గ్రామంలో మొత్తం 40 గ్రూపులు ఉంటే 22 గ్రూపుల వారు తాము పనిచేస్తేనే డబ్బులు ఖాతాలో జమయ్యాయని లిఖిత పూర్వకంగా తెలియజేశారన్నారు. సామాజిక తనిఖీలో భాగంగా ఎఫ్ఏ నుంచి 2023–24కు సంబంధించి రూ.3లక్షల వరకు రికవరీ చేయాలని ప్రతిపాదించామన్నారు. ప్రస్తుతం అతన్ని సస్పెండ్ చేసి వేరొకరిని ఎఫ్ఏగా నియమించామన్నారు. విచారణ సమగ్రంగా నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి పి. సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు. -
రోడ్డెక్కినా.. సాయం కరువు
గత ఏడాది ఆగస్టులో బుడమేరుకు వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన బాధితులు తమకు పరిహారం అందలేదని రోడ్డెక్కారు. విజయవాడలో పలు ప్రాంతాలలో బాధితులు రోడ్లెక్కి నిరసన సైతం వ్యక్తం చేశారు. అదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే గ్రామ వలంటీర్లే నేరుగా ఇళ్లకు వచ్చి వివరాలు నమోదు చేసుకొని ప్రతి ఒక్కరికీ పరిహారం అందించేవారని అప్పట్లో బాధితులు బహిరంగంగానే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. గ్రామ వలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల వేలాది మంది బాధితులకు పరిహారం అందలేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వైఫల్యం స్పష్టమైంది. -
కరాటే పోటీల్లో విజయవాడ క్రీడాకారుల సత్తా
విజయవాడస్పోర్ట్స్: నేపాల్లో జరిగిన 11వ అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజయవాడ క్రీడాకారులు జె.శ్రీఆదిత్యరావ్, షేక్ అనీఫ్, ఐ.ఈశ్వర్సాయి, బి.ఈశ్వర్దుర్గ, ఎం.అనీష్కుమార్, పి.కుషాల్ సత్తా చాటారు. ఈ నెల 24, 25 తేదీల్లో జరిగిన ఈ పోటీలకు శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మలేషియా, నేపాల్, భారత దేశాల క్రీడాకారులు పోటీ పడ్డారు. ఈ పోటీల్లో ఆదిత్యరావ్ కుమితే విభాగంలో గోల్డ్, కటా విభాగంలో బ్రాంజ్, హనీష్ కటాలో గోల్డ్, కుమితేలో బ్రాంజ్, ఈశ్వర్సాయి కుమితేలో గోల్డ్, కటాలో బ్రాంజ్, ఈశ్వర్దుర్గ కుమితేలో సిల్వర్, కటాలో బ్రాంజ్, అనీష్కుమార్ కటాలో సిల్వర్, కుమితేలో బ్రాంజ్, కుషాల్లో కటాలో సిల్వర్ కుమితేలో బ్రాంజ్ మెడల్స్ సాధించారు. వీరంతా నగరంలోని వాడో–ర్యు కరాటే అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను అకాడమీ డైరక్టర్ జె.ఎం.దాస్, ఇన్స్ట్రక్టర్ ఆరీఫ్ పాషా అభినందించారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మానసిక ప్రశాంతత ద్వారానే ప్రమాద రహిత, సురక్షితమైన ప్రయాణం చేయగలుగుతామని, అందుకు యోగా మంచి సాధనమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. బుధవారం బీఆర్టీఎస్ రోడ్డులోని శారదా కళాశాల జంక్షన్ వద్ద యోగాంధ్ర–2025 మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన చోదకులకు ప్రత్యేక యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ వాహన చోదకులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వాహన చోదకులకు మానసిక ప్రశాంతత అవసరమని, ఏమాత్రం ఒత్తిడికి లోనైనా ప్రమాదాలు బారినపడే అవకాశాలు ఉంటాయన్నారు. డ్రైవర్లు ప్రతిరోజూ ఎంతో కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించాల్సిన అవసరముందన్నారు. డ్రైవర్లలో అవగాహన కల్పించేందుకు యోగాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో డ్రైవర్లకు యోగాసనాల శిక్షణ, అవగాహన కల్పిస్తున్నామని, తద్వారా ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, వీఎంసీ అడిషనల్ కమిషనర్ డి.చంద్రశేఖర్, ఆర్టీవోలు ఆర్.ప్రవీణ్, కె.వెంకటేశ్వరరావు, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు, రవాణాశాఖ కానిస్టేబుళ్ల సంఘం అధ్యక్షుడు కె.భద్రాచలం (రాజా) తదితరులు పాల్గొన్నారు. యోగాతో గర్భకోశ వ్యాధులు దూరం నున్న(విజయవాడరూరల్): మహిళలు యోగా అలవర్చుకుంటే గర్భకోశ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎం.సుహాసిని చెప్పారు. మంగళవారం ప్రపంచ మహిళ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నున్న గ్రామ సచివాలయం–2లో జరిగిన యోగసనాల శిక్షణ కార్యక్రమంలో డీఎంఅండ్హెచ్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ మహిళలు వేయాల్సిన యోగాసనాల గురించి వివరించారు. కిశోర బాలికలు కూడా ప్రతి రోజు యోగసనాలు వేయాలని సూచించారు. డెప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ జె.ఇందు మతి, విజయవాడ రూరల్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఎన్. విజయ, ఆశా కార్యకర్తలు, పీహెచ్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వరి విత్తనాలు పంపిణీ
కంకిపాడు: ఎట్టకేలకు రైతులకు వరి విత్తనాలు పంపిణీ అయ్యాయి. ‘విత్తనానికి వెతుకులాట’ శీర్షికన ఈనెల 25న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆగమేఘాలపై రైతులకు ఖరీఫ్ సాగుకు అనువైన వరి విత్తనాలను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు. చర్యల్లో భాగంగా ఉప్పలూరు పంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు వరి విత్తనాలను ఏఎంసీ చైర్మన్ అన్నే ధన రామకోటేశ్వరరావు పంపిణీ చేశారు. చైర్మన్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన వరి విత్తనాలు ఆయా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. సబ్సిడీపై అందించే విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి, సర్పంచ్ లాం సోనియా, మండల వ్యవసాయాధికారి పీఎం కిరణ్ పాల్గొన్నారు. 6న కూచిపూడిలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం మొవ్వ: కూచిపూడిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో జూన్ 6వ తేదీన కృష్ణాజిల్లా స్థాయి యోగాంధ్ర–2025కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మొవ్వ ఎంపీడీవో జె. విమాదేవి తెలిపారు. సుమారు 1000 మందికి పైగా పాల్గొనే ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. వీఐపీల భద్రతపై అవగాహన రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వీఐపీలు ప్రయాణించే సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, భద్రత విషయంలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వర్తించాలని రైల్వే ఆర్ఐ శీరిష సిబ్బందికి సూచించారు. రైల్వే ఎస్పీ కార్యాలయంలో రైల్వే రిజర్వ్డ్ పోలీసులకు, అధికారులకు వీఐపీ భద్రత విధులపై ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా వీఐపీలు ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన చర్యలు గురించి ఆర్ఐ శీరిష వివరించారు. ప్రధానంగా ఉన్నత స్థాయి వ్యక్తులను, వారి పరిసరాలను రక్షించడానికి ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముప్పు అంచనా, భద్రతా ప్రణాళిక, అత్యవసర ప్రతిస్పందన వంటి అనేక అంశాలను పర్యవేక్షించాలన్నారు. వత్సవాయిలో 46.2 మి.మీ. వర్షం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో 46.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల మధ్య జిల్లాలోని పలు మండలాల్లో 8.34 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గంపలగూడెంలో 23.0, నందిగామలో 18.6, వీరులపాడులో 18.2, చందర్లపాడులో 12.6, పెనుగంచిప్రోలులో 10.6, జి. కొండూరులో 7.0, కంచికచర్లలో 5.2, జగ్గయ్యపేటలో 4.8, ఇబ్రహీంపట్నంలో 4.2, ఏ కొండూరులో 3.6, రెడ్డిగూడెం మండలంలో 2.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 31న కలెక్టరేట్లో జాబ్ డ్రైవ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ వికాస ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ శనివారం విజయవాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ కె.లచ్చారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్ డ్రైవ్లో దాదాపు 10 ప్రముఖ కంపెనీలు 200 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయన్నారు. శాండ్స్పేస్ టెక్నాలజీస్, హెచ్1 హెచ్ఆర్, డేటా వ్యాలీ, ముత్తూట్ ఫైనాన్స్, వరుణ్మోటార్స్, అడ్మిషన్ యారో అండ్ అకడమిక్ ఓవరీస్, మణప్పురం ఫైనాన్స్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫాక్స్కాన్ వంటి కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. వీరికి ఉద్యోగాలను బట్టి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 40వేల వరకు జీతం, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్లో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 98494 65427లో సంప్రదించాలని పీడీ లచ్చారావు సూచించారు. -
కోటలు దాటిన కూటమి మాటలు.. చేతల్లో కోతలు
పథకాలన్నీ గడప వద్దకే.. ఈ ఫొటోలోని మహిళ పేరు చింతలచెరువు పద్మావతి. ఈమెది జి. కొండూరు మండలంలోని గంగినేని గ్రామం. భర్త అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందారు. ఈమెకు కుమారులు వెంకటేశ్వరరావు, వెంకటకృష్ణ. ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. పద్మావతి కుటుంబానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాల వల్ల రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరింది. 2019 నుంచి ఐదేళ్ల పాటు పింఛన్ రూపంలో రూ.1,21,500, వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ.72,951, సున్నా వడ్డీ పథకం కింద రూ.5,355, వైఎస్సార్ చేయూత పథకం కింద 56,250, రైతు భరోసా పథకం కింద రూ.21,000, జగనన్న తోడు పథకం కింద రూ.20,000, అమ్మ ఒడి పథకం కింద రూ.81,000, వాహనమిత్ర కింద రూ.20,000, ఇంటి స్థలం, పక్కాగృహం ఒక్కొక్కటి చొప్పున అందుకున్నారు. ఈ పథకాలన్నీ అర్హతే ప్రామాణికంగా ఆమెకు అందాయి. ఏ ప్రభుత్వ కార్యాలయం కానీ, అధికారుల చుట్టూ కానీ తిరగకుండా.. గ్రామ వలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి, వివరాలు నమోదు చేసుకొని పథకాలు అందించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ మినహా ఏ ఒక్క పథకం ఆమె కుటుంబానికి అందలేదు. ● వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం ● నిర్దాక్షిణ్యంగా గ్రామ/వార్డు వలంటీర్ల తొలగింపు ● ఇంటి వద్దకే రేషన్ పంపిణీని నిలిపివేస్తూ ఆదేశాలు ● రైతు భరోసా కేంద్రాలు అంతంతమాత్రమే ● కనిపించని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ● ప్రజలను కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్న వైనం ● గత ప్రభుత్వ హయాంలో ఇంటి గడప వద్దకే ప్రభుత్వ పాలన ఉమ్మడి కృష్ణాజిల్లా సమాచారం రేషన్ కార్డులు 11,12,832 రేషన్ పంపిణీ వాహనాలు 710 రేషన్ పంపిణీ సిబ్బంది 1420 గ్రామ సచివాలయాలు 670 రైతు భరోసా కేంద్రాలు 630 గ్రామ వలంటీర్లు 18,547 పెన్షన్ లబ్ధిదారులు 4,59,125 వెల్నెస్ సెంటర్లు 614 ఇంటికే సంక్షేమం.. ఇంటికే రేషన్.. ఇంటికే వైద్యం.. ఇంటికే పౌర సేవలు.. వెరసి ప్రజలను తమ గడప దాట నీయకుండా సాగింది గత ప్రభుత్వంలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంస్కరణల పాలన. గ్రామ సచివాలయ వ్యవస్థ.. దానికి అనుబంధంగా వలంటీర్లు.. వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు దానికనుబంధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం.. ఎండీయూ వాహనాలతో రేషన్ కూడా డోర్ డెలివరీ చేసి దేశంలోనే ది బెస్ట్ అనిపించుకునేలా సేవలందించారు. సీన్ కట్ చేస్తే.. కూటమి అధికారం చేపట్టిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రగతి ‘గడప’దాటడం లేదు.. వచ్చీరాగానే వలంటీర్లకు గుడ్ బై అన్నారు.. లేటెస్ట్గా ఎండీయూ వాహనాలకు టాటా చెప్పేశారు.. ఫ్యామిలీ డాక్టర్ను నెమ్మదిగా రిటైర్ చేసేస్తున్నారు. మొత్తంగా ఇంటికే ప్రభుత్వ సేవల కాన్సెప్ట్కే స్వస్తి పలికేసి.. ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేలా చేస్తున్నారు. అంతటా కూటమి నేతల స్వార్థపూరిత, కక్షపూరిత రాజకీయాలతో సంక్షేమం జాడైనా లేకుండా.. అభివృద్ధి ఏ కోశానా కనిపించకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. – జి.కొండూరు -
దుర్గమ్మ భక్తులకు ఇక్కట్లు తొలగేనా..!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సుదూర ప్రాంతాల నుంచి దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తులకు తిరుగు ప్రయాణంలో ఇక్కట్లు తప్పడం లేదు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం కొండ దిగువన ఉన్న స్నానఘాట్తో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్ల నుంచి దేవస్థానం బస్సులను నడుపుతోంది. దుర్గాఘాట్ నుంచి ఉచిత బస్సు సర్వీసుతో పాటు టికెటు సర్వీసును నడుపుతున్నారు. దేవస్థాన బస్సులు కొండపైకి చేరుకున్న తర్వాత ఓం టర్నింగ్ వద్ద బస్సు పాయింట్ నిలుపుతారు. అయితే భక్తులు బస్సు దిగే పాయింట్, బస్సు ఎక్కే పాయింట్ ఒకే చోట ఉండటంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. పాయింట్లో బస్సులు అంతకుముందే ఉంటే ఇతర ప్రాంతాల్లో బస్సులను నిలుపుతున్నారు. దీంతో భుజానికి ఉన్న లగేజీ, చేతిలో చంటి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బస్సు కోసం పరుగులు తీస్తూ ఆపసోపాలు పడవలసి వస్తోంది. ప్రతి శుక్ర, శని, ఆదివారాలతో పాటు పండుగ రోజుల్లో ఇక్కడ ఇటువంటి దృశ్యాలు చాలా కామన్. బస్సు కోసం వేచి ఉండే భక్తులు, యాత్రికులు తాము ముందే బస్సు ఎక్కి సీటు దక్కించుకునేందుకు చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. బస్సు ఎక్కే వారు.. బస్సు దిగే వారి మధ్య తోపులాటలు జరుగుతున్నాయి. భక్తులు బస్సు దిగే పాయింట్, బస్సు ఎక్కే పాయింట్ వేరు వేరుగా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. జేబుదొంగల చేతివాటం బస్సులోకి ఎక్కే భక్తులే టార్గెట్గా జేబుదొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలలో బస్సు పాయింట్ వద్ద జేబు దొంగతనాలు పరిపాటిగా మారింది. మహిళా భక్తుల చేతిసంచులు, బ్యాగ్లలో మనీ పర్సులు చోరీకి గురువుతున్న ఘటనలు ఓం టర్నింగ్ పాయింట్లో సర్వసాధారణమయ్యాయి. ప్రయివేటు వాహనదారుల దందా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కొండపైకి చేరేందుకు దేవస్థాన బస్సులు అందుబాటులో ఉన్నాయి. దుర్గాఘాట్ నుంచి దేవస్థానం ఉచిత బస్సులతో పాటు రూ.10 టికెటుపై బస్సులను నడుపుతోంది. అయితే కొంతమంది ప్రయివేటు కారు డ్రైవర్లు దుర్గాఘాట్ పాయింట్ను అడ్డాగా మార్చుకుని భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. దుర్గాఘాట్ నుంచి దేవస్థాన బస్సు టికెటు రూ.10 కాగా ప్రయివేటు వాహనదారులు రూ.50 వసూలు చేస్తున్నారు. అసలు దుర్గగుడి కొండపైకి భక్తుల వాహనాలతో పాటు దేవస్థాన బస్సులకు మాత్రమే అనుమతి ఉంది. అయితే పోలీసుల నుంచి గాని, దేవదాయ శాఖ నుంచి గాని ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 10 కార్లు కొండపైకి, కొండ దిగువకు సర్వీసులు నడుపుతున్నాయి. డ్రైవర్తో పాటు 9 మందికి మాత్రమే ప్రయివేటు వాహనాల్లో అనుమతించాల్సి ఉండగా, డబ్బుల కోసం 12 మందికి పైగానే కుక్కుతున్నారు. ఈ ప్రయివేటు వాహనాల దందాలో రాజకీయ పార్టీ నాయకుల అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శీనానాయక్ భక్తుల ప్రయాణ కష్టాలు తొలగేలా చర్యలు తీసుకుంటారని భక్తులు ఎదురు చూస్తున్నారు. ఓం టర్నింగ్లో బస్సు కోసం ఇబ్బందులు స్నానఘాట్, ఓం టర్నింగ్లలో ప్రయివేటు వాహనాల దందా రూ.10 టికెటుకు రూ.50 వసూలు -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
గన్నవరంరూరల్: పశువైద్య విద్యార్థులు క్రీడల్లో కూడా రాణిస్తేనే మంచి గుర్తింపు లభిస్తుందని కళాశాల అసోసియేట్ డీన్ పీవీఎస్ కిషోర్ అన్నారు. మండలంలోని కేసరపల్లి డాక్టర్ ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో బుధవారం 15వ వార్షిక క్రీడా దిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీన్ కిషోర్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలన్నారు. వృత్తి విద్యా కళాశాలల్లో నిత్యం చదువులతో గడిపే విద్యార్థులకు క్రీడలు సాంత్వన ఇస్తాయన్నారు. ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా 410 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని క్రీడా ప్రతిజ్ఞ చేశారు. తొలుత జాతీయ జెండాను అసోసియేట్ డీన్ కిషోర్ ఎగురవేసి క్రీడా జ్యోతిని వెలిగించారు. క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. హెచ్వోడీ డాక్టర్ సీహెచ్ వెంకట శేషయ్య, పీడీ డాక్టర్ బి.కృష్ణ దీపిక, అధ్యాపకులు పాల్గొన్నారు. -
చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం అదుపులోకి తీసుకుంది. నిందితుల నుంచి రూ.30 లక్షలు విలువ చేసే 476 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఎస్.వి.రాజశేఖరబాబు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. దొంగతనాలు, చైన్ స్నాచింగ్లను నివారించేందుకు నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం. ఇందులో భాగంగానే ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం బస్టాప్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సీసీఎస్ సీఐ రామ్కుమార్ అనుమానాస్పదంగా పారిపోతున్న ఆచ్చి గిరిబాబు(నెల్లూరు జిల్లా ఉప్పుటూరు), ఆచ్చి మహేశ్(నెల్లూరు జిల్లా ఉప్పుటూరు), గాలేటి వెంకట రమణ(ఎన్టీఆర్ జిల్లా దొనబండ), మొగిలి సంధ్య(ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి)లను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం వీరందరూ ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని కొండపల్లి, దొనబండ గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు ఆచ్చి గిరిబాబు తన స్వగ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకునేవాడు. జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. తన నివాస పరిసరాల్లో గతంలో 12 చైన్ స్నాచింగ్లకు పాల్పడి జైలు జీవితం అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తరువాత తన రెండో భార్య వెంకట రమణమ్మ ఉండే ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి మకాం మార్చాడు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తన బైక్పై అతని తమ్ముడు మహేష్తో కలిసి నాలుగు, అతని భార్య వెంకటరమణతో కలిసి మూడు, అతని మరదలు మొగిలి సంధ్యతో కలిసి మూడు, అతనొక్కడే 15 చైన్ స్నాచింగ్లు చేశాడు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో రెండు, జగ్గయ్యపేట సర్కిల్లో మూడు, మైలవరం సర్కిల్లో నాలుగు, తిరువూరు సర్కిల్లో మూడు, కృష్ణాజిల్లాలో నాలుగు, ఏలూరు జిల్లాలో రెండు, తెలంగాణ రాష్ట్రంలో ఏడు చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడ్డాడని సీపీ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్ఐలు బాలయ్య, స్వామి, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుళ్లు మిథున్, సురేష్, షబ్బీర్, రమణలను సీపీ ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు. సమావేశంలో క్రైం డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీ ఎం.రాజారావు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ రామ్కుమార్ పాల్గొన్నారు. నిందితుల నుంచి 476 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు -
అరుదైన లోపంతో పుట్టిన శిశువును కాపాడారు
పటమట(విజయవాడతూర్పు): కాన్జెనిటల్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా (ఇఈఏ) అనే ఒక అరుదైన ప్రాణాంతక స్థితితో 32 వారాలకే 1.6 కిలోల బరువుతో జన్మించిన ఒక శిశువును విజయవాడలోని అంకుర ఆస్పత్రి వైద్యులు కాపాడారు. చికిత్స చేసి ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశారు. బుధవారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో నియోటాలజీ నిపుణులు డాక్టర్ అశోక్, డాక్టర్ ఇందుశ్రీ, డాక్టర్ శ్రీముఖి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ వ్యాధి కలిగిన వారికి పేగులు, ఇతర పొట్ట అవయవాలు ఛాతీ భాగంలోకి ప్రవేశిస్తాయని, దీంతో ఛాతీ భాగంలో ఉండే ఊపిరితిత్తుల అభివృద్ధి తీవ్రంగా ప్రభావితమవుతుందన్నారు. ఈ వ్యాధి ముందస్తు జననం (ప్రీటర్మ్), తక్కువ బరువుతో పుట్టిన శిశువుల్లో మరణ ప్రమాదం కలిగించే అవకాశాలు ఎక్కువ చేస్తుందని వెల్లడించారు. అయినప్పటికీ తమ ఆస్పత్రి వైద్య నిపుణుల బృందం శిశువుకు సమర్థంగా చికిత్స నిర్వహించారన్నారు. నియోనటాలజీ నిపుణులైన తాము ము గ్గురం కలిసి శిశువును ప్రథమంగా మెడికల్గా స్థిరపరిచి, శస్త్రచికిత్సకు సిద్ధం చేశామని, తర్వాత పిల్లల శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ ఎం.వరుణ్ కుమార్ డయాఫ్రాగ్ లోపాన్ని సర్జరీ ద్వారా విజయవంతంగా సరిచేశారని తెలిపారు. ప్రసూతి విభాగానికి చెందిన డాక్టర్ సౌమ్య శిశువును సురక్షితంగా డెలివరీ చేశారన్నారు. అనస్తీషియా నిపుణుడు డాక్టర్ నాగరాజ్ శిశువు పరిస్థితిని బట్టి అనస్తీషియా నిర్వహణ ద్వారా శస్త్రచికిత్స సాఫీగా సాగేందుకు ముఖ్య పాత్ర వహించారని తెలిపారు. చికిత్స అనంతరం శిశువు నెమ్మదిగా కోలుకోగా డిశ్చార్జ్ చేశామన్నారు. -
గడువుకు ముందే పరిశ్రమలకు అనుమతులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం యాప్ ఆధారిత డిజిటల్ వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర) ద్వారా ప్రజలకు 500కు పైగా సేవలు అందిస్తోందని, ఇందులో పారిశ్రామిక సేవలపై పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలకు అవగాహన కల్పించి, సద్వినియోగం చేసుకొనేలా ప్రోత్సహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం వర్చువల్గా జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు తదితరాలపై చర్చించారు. 2025, ఏప్రిల్ 1 నుంచి మే 26 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులకు సంబంధించి 824 దరఖాస్తులు స్వీకరించారన్నారు. ఇప్పటికే 762 దరఖాస్తులు ఆమోదం పొందాయని పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు.. మిగిలిన దరఖాస్తులను కూడా నిర్దేశిత గడువుకు ముందే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ప్రోత్సాహకాలపై స్క్రూటినీ.. పారిశ్రామిక అభివృద్ధి విధానం (2015–20), పారిశ్రామిక అభివృద్ధి విధానం (2020–23), పారిశ్రామిక అభివృద్ధి విధానం (2023–27) కింద ఎంఎస్ఎంఈ రంగానికి అందించే ప్రోత్సాహకాలపై స్క్రూటినీ కమిటీ సమావేశాలు నిర్వహించిందని కలెక్టర్ చెప్పారు. 90 క్లెయిమ్లకు రూ. 4.13కోట్లు మేర ప్రతిపాదనలు పంపగా.. వీటిపై తాజాగా చర్చించి డీఐఈపీసీ ఆమోదం తెలిపిందన్నారు. సమావేశంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, ఇన్చార్జ్ జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
విజయకీలాద్రిపై సుదర్శన హోమం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం సుదర్శన హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి మంగళాశాసనాలతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి సర్వ రక్షాకర సుదర్శన హోమాన్ని నిర్వహించామని తెలిపారు. అమావాస్య రోజున హోమం, పారాయణం, శాంతులు, దానాలు చేయడం ఎంతో ఉన్నత ఫలితాలను ఇస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. -
ఖాళీల జాబితా విడుదల చేయాలని వినతి
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల బదిలీలలో ప్రిఫరెన్షియల్ కేటగిరీకి 50 శాతం కోరుకునే అవకాశమున్న ఉన్నత పాఠశాలల్లోని ఖాళీల జాబితా విడుదల చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు బదిలీలకు సంబంధించిన సమస్యలను జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావును వివరించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ బదిలీల జీఓ ప్రకారం 2021కి ముందు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ ఇవ్వవలసి ఉండగా ఎంఈఓలు నిరాకరించారన్నారు. దీంతో ఉపాధ్యాయులలో ఆందోళన నెలకొందన్నారు. ప్రస్తుతం జరగబోతున్న ఉద్యోగోన్నతులకు మాన్యూవల్ కౌన్సెలింగ్ జరపాలన్నారు. మ్యూజిక్ టీచర్స్ బదిలీ ఆన్లైన్ దరఖాస్తులకు మే 27వ తేదీ చివరి రోజు కాగా ఓపెన్ కాలేదని, అప్లికేషన్లు ఓపెన్ అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి. లంకేష్, రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు, జిల్లా కార్యదర్శి ఎన్. సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ట్రయల్ సీడ్ సాగును నిషేధించాలి
మైలవరం: రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ట్రయల్ సీడ్ సాగును ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, విత్తన రైతుల సంఘం కన్వీనర్ బి. రాము, సీపీఐ మైలవరం మండల కార్యదర్శి బుద్దవరపు వెంకట్రావు తదితరుల ప్రతినిధుల బృందం ఎన్టీఆర్ జిల్లా మైలవరం డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. శ్రీనివాసరావుకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, రైతులు, సీడ్ ఇచ్చే కంపెనీల ప్రతినిధులు మధ్య లిఖితపూర్వక ఒప్పందం చేసుకున్న తర్వాతే సీడ్ సాగును ప్రోత్సహించాలని, అలా ముందుకు రాని విత్తన కంపెనీలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేని విత్తనాలను సాగు చేస్తే పెట్టుబడితో పాటు ఒక సంవత్సరం పాటు ఆ రైతు కుటుంబం పోషణకు అవసరమైన ఆదా యం కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. బయట మార్కెట్లో సర్టిఫైడ్ సీడ్ మాత్రమే అమ్మేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నాణ్యత లేని విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అమ్ముతున్న వారిపై విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు సబ్సిడీతో అందజేయాలని కోరా రు. కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. -
తెనాలి ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించండి
మధురానగర్(విజయవాడసెంట్రల్): కూటమి పాలనలో దళిత, మైనార్టీలకు రక్షణ కరువైందని.. తెనాలి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రభ కాలనీ జనహిత సదనంలో మంగళవారం మైనారిటీ దళిత యువకులపై తెనాలిలో పోలీసులు చేసిన అమానుష దాడిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రం హక్కులను హరిస్తున్నారని... రాష్ట్రంలో టీడీపీ చట్టాలు నడుస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై దళిత, మైనార్టీ యువకులను పోలీసులు విచక్షణ రహితంగా కర్రలతో కొడుతూ బూటు కాళ్లతో తన్నడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలను వైఎస్సార్ సీపీ ఖండిస్తోందన్నారు. జూన్ 4న మాజీ సీఎం జగన్హన్రెడ్డి పిలుపు మేరకు టీడీపీ అరాచక పాలన ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి మస్తాన్ షేక్, పఠాన్ నజీర్ ఖాన్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పేరం త్రివేణి రెడ్డి, కార్యదర్శి ఝాన్సీ రాణి, వేముల బేబీ రాణి, ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ విభాగం అధ్యక్షుడు సుధాకర్, నాయకులు ఎర్రగోళ్ల శ్రీరాములు, అలంపూర్ విజయ్, ఈసరపు రాజా రమేష్, ఒగ్గు గవాస్కర్, కుందేరు శ్యామ్, మార్తి చంద్రమౌళి, తోపుల వరలక్ష్మి, మాతా మహేష్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి పాలనలో పెరిగిన దాడులు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -
నెల రోజుల్లో కొత్త అక్రిడిటేషన్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రస్తుతం ఉన్న అక్రిడిటేషన్ల గడువు నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో వాటిని తక్షణమే రెన్యువల్ చేయాలని, ఈనెల 31, జూన్ 1వ తేదీలు ఆర్టీసీ సెలవు దినాలు కావడంతో బస్పాస్లు రెన్యువల్కు చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఐఅండ్పీఆర్ డైరెక్టర్ హిమాన్ష్శుక్లాకు విన్నవించారు. ఈ మేరకు మంగళవారం ఐఅండ్పీఆర్ కార్యాలయంలో డైరెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి ఏపీయూడబ్ల్యూజే నేతలు వినతి పత్రం అందజేశారు. మరోసారి అక్రిడిటేషన్ పొడిగించకుండా రెగ్యులర్గా ఇచ్చే కొత్త అక్రిడిటేషన్ల ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని డైరెక్టర్ను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ .. వచ్చే నెల రోజుల్లోగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని, ప్రస్తుతం ఉన్న కార్డులు రెన్యువల్ చేస్తామని చెప్పారు. జర్నలిస్టులు ఇబ్బంది పడకుండా ఈనెల 30వ తేదీ లోపే బస్ పాస్లు రెన్యువల్ చేసేలా చర్యలు తీసుకుంటామని చె ప్పారు. రెండు లేక మూడు నెలల కాలానికి అక్రిడేషన్లను రెన్యువల్ చేస్తామని, ఈలోపే రెగ్యులర్ అక్రిడేషన్ల ప్రక్రియ కూడా నెల రోజుల్లోగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే అక్రిడిటేషన్ కమిటీ జీవో వెలువడుతుందని శుక్లా యూనియన్ నేతలకు తెలిపారు. డైరెక్టర్ ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ కమిటీ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కంచల జయరాజ్, కార్యదర్శి దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఏడాది కూటమి పాలనలో ఘొల్లుమంటున్న పల్లెలు
ఇదిగో నాటి వికాసంÆ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పాలన ఎంతో సమర్థంగా సాగిందంటూ ప్రజలు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. Æ ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో రూ. కోటి వరకూ విలువైన ప్రభుత్వ భవనాలను అందుబాటులోకి తెచ్చింది. కృష్ణాజిల్లాలో 497 పంచాయతీలకు 385 సచివాలయాలు, ఎన్టీఆర్ జిల్లాలో 288 పంచాయతీలకు 285 సచివాలయాలు ఏర్పాటు చేసింది. Æ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్ది విద్యాభివృద్ధికి బాటలు వేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని చేరువ చేసింది. కృష్ణాజిల్లాలో 1791 పాఠశాలలకు గానూ 488 పాఠశాలల్లో రూ.179 కోట్ల ను, ఎన్టీఆర్ జిల్లాలో 886 పాఠశాలలకు గానూ 341 పాఠశాలల్లో రూ.80 కోట్లతో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేశారు. దీంతో విద్యా ప్రగతికి బాటలు వేయటంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచిన ఘనత వైఎస్సార్ సీపీకే దక్కుతుంది. Æ రైతు భరోసా కేంద్రాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. కృష్ణాజిల్లాలో 363, ఎన్టీఆర్ జిల్లాలో 267 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతినిధులు, ఏకంగా ఐక్యరాజ్య సమితి బృందం వణుకూరు, గన్నవరం మొదలైన ప్రాంతాల్లో పర్యటించి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను తెలుసుకుని ప్రశంసించారంటే వాటి నిర్వహణ సామర్థ్యం ఏంటో అర్థమవుతుంది. Æ ప్రజారోగ్యాన్ని పెంపొందించేలా కృష్ణా జిల్లాలో 357, ఎన్టీఆర్ జిల్లాలో 257 వెల్నెస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చి గ్రామ స్థాయికి వైద్య సేవలను విస్తృతం చేసి, ప్రజారోగ్య పరిరక్షణకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాటుపడింది.కంకిపాడు: ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ హామీలను ఊదరగొట్టింది. పింఛన్లు, మహిళలకు నెలకు రూ. 1500, ఉచిత బస్సు, గ్యాస్ సిలెండర్లు, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అంటూ ప్రజలను మభ్యపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణాజిల్లా వ్యాప్తంగా 2,34,909 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 2,24,216 మందికి సామాజిక పింఛన్లను అందిస్తున్నారు. ఇందుకు గానూ రూ. 199 కోట్లు సొమ్ము అందజేస్తున్నారు. ఇటీవల గ్యాస్ సిలెండర్ల వర్తింపు మినహా(అదీ అరకొరే), ఇతర పథకాలు ఏవీ అమలుకు నోచుకోలేదు. ఏడాది పాలనలో ప్రధానంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు ఎదురుచూసిన ప్రజానీకం ప్రభుత్వ పనితీరుపై మండిపడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాఠశాలలు తెరిచే నాటికే అమ్మ ఒడి, సాగుకు పెట్టుబడి సాయం విడతల వారీగా అందిందని గుర్తు చేసుకుంటున్నారు. అంతా మా ఇష్టం.. మా వాళ్లకే.. కూటమి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ల అందజేత కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ప్రహసనంగా సాగుతోంది. ఆయా గ్రామ, వార్డుల్లో కూటమి నేతలే నేరుగా అధికారులతో కలిసి వెళ్లి పింఛను లబ్ధిదారులను కలిసి పింఛన్ పంపిణీని ప్రచార ఆర్భాటంగా సాగిస్తున్నారు. నేతలు ఫొటోలకు ఫోజులిస్తూ లబ్ధిదారులను తమ గుప్పిట పెట్టుకునేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. వివిధ కార్పొరేషన్ల కింద జారీ చేసే స్వయం ఉపాధి రుణాల ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగింది. లబ్ధిదారుల ఇంటర్వ్యూలు మండలాల్లో మొక్కుబడిగా సాగాయంటే అతిశయోక్తి కాదు. మొక్కుబడిగా యూనిట్ల కేటాయింపు, ఇంటర్వ్యూలు జరిగిపోయాయి. అన్నీ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వచ్చే సిఫారసు లేఖల ఆధారంగానే పూర్తి చేశారనే విమర్శ ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల కింద స్వయం ఉపాధికి యువత, మహిళలకు రుణా లు అందించి, తోడ్పాటు అందించింది. లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా అర్హతను బట్టి వలంటీర్ల చేసింది. అరకొర సేవలతో అవస్థలు పడుతున్న ప్రజలు నిర్వీర్యమవుతున్న సచివాలయ, ఆర్బీకే వ్యవస్థలు పాలనంతా కూటమి నేతల కనుసన్నల్లోనే.. ఆఖరికి స్వయం ఉపాధి రుణాల జారీలోనూ ఏకపక్ష నిర్ణయాలే లబోదిబోమంటున్న ప్రజలు గత వైఎస్సార్ సీపీ పాలనలో రాజకీయాలు, కులమతాలకు అతీతంగా సేవలు, పథకాలువ్యవస్థలను కూటమి సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే గ్రామ స్వరాజ్యం సాధన దిశగా ఏర్పాటుచేసిన సచివాలయాలు, వాటిలో పనిచేసే సిబ్బంది మదింపు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే జరిగితే గ్రామ సచివాలయ స్థాయిలో ఉద్యోగు లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీని వల్ల గ్రామ స్థాయిలోనే అందే అనేక రకమైన పౌర సేవలకు విఘాతం కలుగుతుంది. ఇప్ప టికే వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడింది. తాజాగా ఇంటికి రేషన్ పంపిణీ వాహనాలను తొలగించి, వాహనాలపై ఆధారపడి జీవించే అనేక మంది యువతను రోడ్డు పాలు చేసింది. మళ్లీ కిలో మీటర్ల దూరం వృద్ధులు సైతం నడుచుకుంటూ వెళ్లి రేషన్ డిపోల వద్ద సరుకులు తెచ్చుకోవాల్సిన దయనీయ పరిస్థితులు దాపురించబోతున్నాయి. పేరుకే సచివాలయాలు.. ఆర్బీకేలు.. ఇప్పటికే సచివాలయాల్లో సిబ్బంది సర్వేల పేరుతో ఇళ్ల వెంబడి తిరుగుతుంటే ప్రజలు సేవల కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రైతు సేవా కేంద్రాలు(నాటి ఆర్బీకేలు) నామ్కే వాస్తే అన్న చందంగా మారాయి. అందులో రైతులకు సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన కియోస్క్లు మరమ్మతులు లేక రైతు సేవలకు దూరంగా ఉంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చిన భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులు పూర్తిగా కోలుకోలేదు. రబీ ధాన్యం సేకరణ దళారులు, మిల్లర్లు పుణ్యమాని అస్తవ్యస్తంగా సాగటంతో రైతులు నష్టపోయారు. ఉన్నత లక్ష్యంతో రైతుకు భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆర్బీకేలు నేడు అలంకార ప్రాయంగా మారుతున్నాయంటే.. దానికి సర్కారు అనాలోచిత, నిర్లక్ష్య విధానాలే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. -
ఎత్తిపోతలు.. ఎదురుచూపులు
పెనుగంచిప్రోలు: స్థానిక శింగవరం రోడ్డులో మునేరుపై నిర్మించిన ఎత్తిపోతల పథకం మరమ్మతుల కోసం ఎదురుచూస్తోంది. 2022లో ఈ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ డీవీఆర్ బ్రాంచి కాలువ పరిధిలోని పెనుగంచిప్రోలు మేజర్ ఆయకట్టులోని చివరి గ్రామం పెనుగంచిప్రోలు. సాగర్ కాలువకు చివరగా ఉండటంతో ఆయకట్టు రైతులకు సాగు నీరు సక్రమంగా అందడం లేదు. చివరి భూముల సాగునీటి కోసం.. చివరి భూముల సాగునీటి కోసం స్థానిక మునేరులో ఐడీసీ ఆధ్వర్యాన రూ.17.23 కోట్ల వ్యయ అంచనాతో దీనిని నిర్మించారు. ఈ పథకం ద్వారా సుమారుగా 2465.02 ఎకరాలకు సాగు నీరు అందేది. పంపుహౌస్లో 200 హెచ్సీ సామర్థ్యమున్న నాలుగు మోటార్లు, నాలుగు పంపులు ఏర్పాటు చేశారు. నాలుగు పంపుల ద్వారా ఒక రోజులో ఎత్తిపోసే నీరు 30.88 క్యూసెక్కులుగా నిర్ణయించారు. నిలిచిపోయిన పథకం గత ఏడాది సెప్టెంబర్ నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా మునేరుకు వరదలు రావడంతో పక్కనే ఉన్న ఎత్తిపోతల పథకం మొత్తం నీట మునిగింది. లోపల ఉన్న నాలుగు పంపుల్లోకి నీరు చేరి ఒండ్రు పేరుకు పోయింది. ప్యానెల్ బోర్డులు మొత్తం తడిసిపోయాయి. స్కీమ్కు సంబంధించిన రెండు ట్రాన్స్ఫార్మర్లతో పాటు విద్యుత్ శాఖవారికి సంబంధించిన మరో ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా నీటి లో తడిసి పోయి మరమ్మతులకు గురయ్యాయి. 10 విద్యుత్ స్తంభాలు పడిపోగా స్తంభాలు మాత్రం కొత్తవి వేశారు. పూర్తిగా మరమ్మతులకు గురవ్వడంతో ఎత్తిపోతల పథకం పని చేయడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొంతమేర రైతులు మరమ్మతులు చేయించుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే ఆదుకోవాలి ఈ ఎత్తిపోతల పథకం పెనుగంచిప్రోలు, సుబ్బాయిగూడెం గ్రామ రైతులకు ఉపయోపగపడతాయి. పథకం ఐడీసీ ఆధ్వర్యంలో నిర్మించినా తర్వాత అంతా రైతుల ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. రైతులు ఎకరానికి కొంత వేసుకుని మరమ్మతులు, ఇతర నిర్వహణ ఖర్చులు చూసుకోవాల్సి ఉంది. అయితే వరదలకు చాలా నష్టపోయామని, ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఖరీప్ సీజన్ నాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖరీఫ్కై నా పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకం బాగుయ్యేనా వరదలకు దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు.. పంపులు నిలిచిపోయిన ‘పథకం’ ఆదుకోవాలంటున్న ఆయకట్టు రైతులు -
యోగాంధ్రకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): మంగినపూడిబీచ్లో ఈ నెల 31వ తేదీన జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి పక్కా ప్రణాళికతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో మంగళవారం మధ్యాహ్నం యోగాంధ్ర కార్యక్రమాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ ఉదయం 7 నుంచి 8గంటల వరకు మంగినపూడిబీచ్లో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించాలన్నారు. డీఆర్డీఏ, మెప్మా, ఉపాధిహామీ శ్రామికులు, అంగన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. జూన్ 2న 5వేల మందితో అధికారులు, ఉద్యోగులతో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు లక్ష్మీటాకీసు సెంటరు నుంచి సాయిబాబా గుడి వరకు ఒకవైపు రహదారిపై యోగా నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, యోగాంధ్ర సమన్వయ అధికారి పోతురాజు, డ్వామా, డీఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు శివప్రసాద్, హరిహరనాధ్, ఎంఎన్ రాణి, డీఎస్వో పార్వతి, డీపీవో అరుణ తదితరులు పాల్గొన్నారు.కృష్ణా కలెక్టర్ బాలాజీ -
జాతీయ స్థాయి కూచిపూడి నృత్యంలో జెడ్పీ విద్యార్థిని ప్రతిభ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని సంపసాల శ్రావ్య జాతీయ స్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శనలో తృతీయ స్థానంలో నిలిచింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కళా నిలయం సంస్థ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన 40వ జాతీయ నవరస శాసీ్త్రయ జానపద సంగీత నాట్య కళారూపాల ప్రదర్శనలో జూనియర్ విభాగంలో ఉత్తమ ప్రదర్శనతో శ్రావ్య ఈ ఘనత సాధించింది. సంస్థ నిర్వాహకులు మంగళవారం నిర్వహించిన ముగింపు సభలో మెమెంటో, ప్రశంసాపత్రాన్ని ఆమెకు అందజేశారు. గతంలో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిలో జరిగిన జాతీయ స్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శనలో తృతీయ స్థానం, దాక్షారామంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో నాట్య రవళి బిరుదు ఆమె అందుకుంది. ప్రముఖ దేవాలయాల్లో అనేక కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. పాఠశాల హెచ్ఎం పద్మలత, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. -
విదేశీ విహంగాల సందడి
వెంకటాపురం(పెనుగంచిప్రోలు): పెనుగంచిప్రోలు మండలంలోని వెంకటాపురంలో విదేశీ విహంగాలు సందడి చేస్తున్నాయి. వెంకటాపురం విదేశీ పక్షుల విడిదిగా మారింది. ఏటా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆస్ట్రేలియా నుంచి పెయింటెడ్ స్టాక్స్(ఎర్రకాళ్ల కొంగలు) డిసెంబర్లో గ్రామానికి వచ్చి విడిది చేస్తాయి. వందల సంఖ్యలో వచ్చిన పక్షులు సంతానోత్పత్తి తర్వాత జూన్లో వాటి స్వస్థలాలకు వెళ్తుంటాయి. గ్రామస్తులు కూడా వీటిని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. ప్రస్తుతం కొన్ని పక్షులు వాటి స్వస్థలాలకు వెళ్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. పక్షుల కోలాహలం గ్రామంలో ఎక్కడ చూసినా పక్షుల కోలాహలం కనిపిస్తోంది. వందల సంఖ్యలో వచ్చిన పక్షులు నేడు సంతానోత్పత్తి చేయడంతో వేల సంఖ్యకు చేరాయి. ఇవి చేసే అరుపులు, ధ్వనులతో కోలాహలం సృష్టిస్తున్నాయి. గ్రామస్తులు వాటిని కాపాడుకుంటున్నారు. పక్షుల పిల్లలు గ్రామస్తులతో పాటు కింద తిరుగుతూ వారితో కలిసి పోతున్నాయి. ఇళ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ సందడి చేస్తున్నాయి. నీటి కుంట అభివృద్ధి చేస్తే.. దశాబ్దాల నుంచి తమ గ్రామానికి బంధువుల మాదిరి ఏటా వస్తున్న పక్షులను తమ సొంత పిల్లల మాదిరి, పుట్టింటికి వచ్చిన బిడ్డల్లా చూసుకుంటున్నారు. వీటికి గ్రామంలోని నీటికుంట తాగునీటి అవసరాన్ని తీరుస్తోంది. ఎకరం 80 సెంట్లు ఉన్న ఈ కుంటను ఊర చెరువుగా అభి వృద్ధి చేస్తే పక్షులకు తాగునీటి ఇబ్బందులు తొలగడంతో పాటు గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. కుంటలో వర్షం నీరు లేకపోయినా మునేరు ఎత్తిపోతల పథకం నుంచి నీటిని నింపవచ్చు. గతంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కూడా నీటిని కుంటలోకి వదిలారు. ప్రస్తుతం నీటి కుంట మొత్తం కంపచెట్లతో నిండి పోయి ఉంది. దీంతో పక్షులు గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద నీటి కోసం వస్తున్నాయి. వెంకటాపురంలో కోలాహలం నీటికుంటను అభివృద్ధి చేయాలంటున్న గ్రామస్తులు రక్షణ చర్యలు చేపడతాం గ్రామంలో విదేశీ పక్షుల రక్షణకు చర్యలు చేపడతాం. గ్రామస్తులు వీటిని తమ సొంత బిడ్డల్లా చూసుకోవడం ముచ్చటేస్తోంది. ప్రస్తుతం గ్రామంలో వేల సంఖ్యలో పక్షులు సందడి చేస్తున్నాయి. వీటి తాగునీటికి అవసరమైన నీటికుంట అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. –మార్కపూడి గాంధీ, ఎంపీపీ -
క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. డీఆర్వో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత సమయంలో అర్జీలను పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పీజీఆర్ఎస్లో మొత్తం 167 అర్జీలు స్వీకరించినట్లు డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తెలిపారు. ఇందులో రెవెన్యూ 65, పోలీస్ 30, మున్సిపల్ 14, పంచాయతీరాజ్ 6, సర్వే 4, డీఆర్డీఏ 5, వైద్య ఆరోగ్యం 2, హౌసింగ్ 8, ఏపీసీపీడీసీఎల్ 2, డ్వామా 2 , జలవనరులు 2, బీసీ కార్పొరేషన్కు 7, ఎస్సీ కార్పొరేషన్ 1, వ్యవసాయం 2, గ్రామ, వార్డు సచివాలయాలు 3, ఉపాధి కల్పన 1, మార్కెటింగ్ 2, ఆర్డబ్ల్యూఎస్ 1, ఆర్ అండ్ బీ 3, నైపుణ్యాభివృద్ధి 1, సాంకేతిక విద్య 1, విభిన్న ప్రతిభావంతులు 1, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 3, బ్యాంకింగ్ ఒకటి చొప్పున అర్జీలు అందాయి. దివ్యాంగులకు ట్రైసైకిళ్ల అందజేత కలెక్టరేట్లో దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల సాయంతో ఇద్దరు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందించారు. ట్రైసైకిళ్లు అందుకున్న వారిలో 21వ డివిజన్కు చెందిన సింహాద్రి క్షీరవర్థి, గొల్లపూడికి చెందిన అన్నవరపు వరప్రసాద్ ఉన్నారు. ●గుణదల ఆర్వోబీ ఫ్లై ఓవర్ను పునరుద్ధరించాలని ఏఐవైఎఫ్ ప్రతినిధులు పీజీఆర్ఎస్లో డీఆర్వో లక్ష్మీనరసింహంకు అర్జీ అందజేశారు. డీఆర్వో లక్ష్మీనరసింహం పీజీఆర్ఎస్లో 167 అర్జీలు -
మహాత్ముని కీర్తి శిఖరం గాంధీ కొండ
కలెక్టర్ లక్ష్మీశవన్టౌన్(విజయవాడపశ్చిమ): మహాత్ముని ఆశయాల కీర్తి శిఖరం గాంధీ కొండ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. గాంధీ హిల్పై యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా సోమవారం గాంధీహిల్పై గాంధీ హిల్ ఫౌండేషన్, జిల్లా యంత్రాంగం, ఏపీ టూరిజం శాఖల సంయుక్త ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా ప్రజలకు యోగాతో కలిగే ప్రయోజనాలను వివ రించి జీవితాంతం ఆచరించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాకు వచ్చే పర్యాటకులకు కూడా యోగా ఔన్నత్యంపై అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా తొలుత గాంధీ హిల్పై నిర్వహించామన్నారు. భవానీ ద్వీపం,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం, కొండపల్లి ఖిల్లా తదితర ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. యోగాచరణను నిత్యజీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకోవాలన్నారు. ఆరోగ్య భారత్ సాకారానికి కృషి చేసి మహాత్మునికి నిజమైన నివాళులు అర్పిద్దామన్నారు. కార్యక్రమంలో భాగంగా గాంధీజీ తాత్వికత, యోగా, సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే ప్రత్యేక ప్లానిటోరియం షో ప్రదర్శించారు. కార్యక్రమంలో గాంధీ హిల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గాంధీ పీసీ కాజా, కార్యదర్శి వై. రామచంద్రరావు, సభ్యులు శివశంకర్ కస్తూరి, రావి శారద పాల్గొన్నారు. బిహార్ యోగా విశ్వవిద్యాలయం ప్రతినిధి స్వామి భక్తి చైతన్య, ఏపీ టూరిజం ప్రతినిధులు శిల్ప, ప్రసన్నలక్ష్మి, కృష్ణచైతన్య, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ భక్తులకు శీఘ్ర దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సాధారణ భక్తులకు శీఘ్రదర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అందులో భాగంగానే మహా నివేదన సమయంలో వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మహా మండపం ఆరో అంతస్తులో సోమవారం ఈవో శీనానాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించి 15 రోజులైందని, ఇప్పటికే ఆలయ వ్యవహారాలను క్షుణంగా పరిశీలించానని, ఇంకా అనేక విషయాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా సాధారణ భక్తులకు పెద్ద పీట వేస్తూ వారికి అమ్మవారి దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడటంతో పాటు శీఘ్రదర్శనం కల్పిస్తామన్నారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించే సమయంలో రద్దీ అధికమవుతోందని గుర్తించి, ఆ సమయంలో వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేశామన్నారు. ఇక ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దసరా నాటికి ఓ కొలిక్కి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. అన్నదాన భవనం, లడ్డూ పోటులను ఉత్సవాలకు సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే పూర్తయిన పూజామండపం, రాతి యాగశాలను శ్రావణ మాసం నుంచి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. కొండపైన, కొండ దిగువన పార్కింగ్ ప్రాంతం తక్కువగా ఉండటంతో రద్దీ సమయాల్లో భక్తులు తమ వాహనాలను వీఎంసీ కార్యాలయం వద్ద నాలుగు ఎకరాల హోల్డింగ్ ఏరియాతో పాటు రెండు ఎకరాల టీటీడీ స్థలం, పున్నమి ఘాట్ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల నుంచి దేవస్థానం బస్సులను నడుపుతుందన్నారు. 3 నుంచి నవగ్రహ విగ్రహ ప్రతిష్ట జూన్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించిందన్నారు. ఇప్పటికే విగ్రహ ప్రతిష్టకు సంబంధించి పూజా కార్యక్రమాలు, జపాలు జరుగుతున్నాయన్నారు. మీడియా సమావేశంలో ఆలయ ఈఈ కోటేశ్వరరావు, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు కోట ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు దసరా నాటికి లడ్డూ పోటు, అన్నదాన భవనాలు మీడియాతో దుర్గగుడి ఈవో శీనానాయక్ -
పట్టణ ప్రజలపై రూ.784 కోట్ల పన్నుల భారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పట్టణ ప్రజలపై ఇంటి పన్నుల రూపంలో రూ.784 కోట్ల భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, కార్యవర్గ సభ్యుడు డి.కాశీనాథ్ ధ్వజమెత్తారు. విజయవాడలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో బాబూరావు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు రాష్ట్రంలోని 123 పట్టణాలు, నగరాల్లోని 40.22 లక్షల గృహాలు, ఇతర కట్టడాల సర్వేను ప్రారంభించారన్నారు. 20 శాతం ఇంటి పన్ను పెంపు లక్ష్యంగా సర్వే సాగుతోందన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి 15 శాతం ఇంటి పన్నులు పెంచారన్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం 35 శాతానికి తగ్గకుండా పన్ను పెంచేందుకు ఆగమేఘాల మీద ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో పట్టణ ప్రజలపై రూ.784 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఈ పన్ను పెంపు రూ.1500 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదన్నారు. జూన్ 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని పట్టణాల్లో ప్రతి ఇంటినీ సర్వే చేసి, కొలతలు తీసుకుని పన్నుల భారం మోపాలని నిర్ణయించిందన్నారు. టీడీపీ కూటమి ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని సమీక్షిస్తామని, పన్నుల భారాలు వేయబోమని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల భారం మోపతూ ప్రభుత్వం మాట తప్పి ప్రజలకు నమ్మకద్రోహం చేసిందన్నారు. కనీసం ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ఏప్రిల్ నుంచి 15 శాతం ఇంటి పన్ను పెంచారన్నారు. అభ్యంతరాలు స్వీకరించకుండా వసూళ్లు కూడా ప్రారంభించారన్నారు. అంతటితో ఆగకుండా మరో 20 శాతంకు తగ్గకుండా పన్నులు పెంచడానికి ఆదేశాలివ్వడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క విజయవాడ నగరంలోనే ప్రజలపై రూ.40 కోట్ల మేర పన్నులు పెరిగాయన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివసించే పేదలపై అక్రమ నిర్మాణాల పేరుతో అదనపు భారం మోపుతారన్నారు. పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారాన్ని పూర్తిగా విస్మరించాయన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయని ప్రభుత్వం తొలి ఏడాది కానుకగా ఇంటి పన్నుల భారం మోపిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి ఇంటింటి సర్వే ఆపాలని డిమాండ్ చేశారు. దీనిపై అవసరమైతే ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ తొలి ఏడాది కానుక తక్షణమే ఇంటింటి సర్వే ఆపాలి ఇంటి పన్ను పెంపు నిలుపుదల చేయాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు -
పోలీస్ ప్రజావాణిలో 81 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 81 ఫిర్యాదులను స్వీకరించినట్లు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) కృష్ణమూర్తినాయుడు తెలిపారు. ఆస్తి వివాదాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 39, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి ఏడు, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి ఏడు, దొంగతనాలకు సంబంధించినవి నాలుగు, కొట్లాటకు సంబంధించినవి ఐదు, సైబర్ నేరాలకు సంబంధించి ఐదు, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 14 ఫిర్యాదులను స్వీకరించినట్లు చెప్పారు. బాధితులతో మాట్లాడటంతో పాటు, దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశించినట్లు చెప్పారు. -
పోలీసు బదిలీలకు పారదర్శకంగా కౌన్సెలింగ్
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు సాధారణ బదిలీలలో బాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కమిషనర్ కార్యాలయంలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేశారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారితో స్వయంగా మాట్లాడి వారి వారి అభ్యర్థనల మేరకు వివిధ పోలీసు స్టేషన్లకు బదిలీ చేశామన్నారు. 14 మంది ఏఎస్ఐలకు, 118 మంది హెడ్ కానిస్టేబుళ్లకు, 188 మంది కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించి వివిధ పోలీసుస్టేషన్లకు బదిలీ చేసినట్లు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా సిబ్బందితో స్వయంగా మాట్లాడి వారి అభ్యర్థనల మేరకు బదిలీ చేశామని చెప్పారు. అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, ఏడీసీపీ ఎం.రాజారావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు -
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో థీమ్ యోగా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యోగా ఔన్నత్యా న్ని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికీ చేరువ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం) ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. సోమవారం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఆయుష్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, వీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో థీమ్ యోగా కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో కృష్ణబాబుతో పాటు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ, ఎండీ గిరీష్ పీఎస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, పెద్దఎత్తున యోగా ఔత్సాహికులు, నగర ప్రజలు పాల్గొని డాక్టర్ రత్న ప్రియదర్శిని మార్గనిర్దేశనంతో యోగాసనాలు వేశారు. 26 జిల్లాల్లో 26 రోజులు...26 థీమ్లు ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ మే 21న ప్రారంభమైన యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 రోజులపాటు 26 ఇతివృత్తాలతో థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమైనట్లు వివరించారు. సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేసేందుకు థీమ్ యోగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా విశిష్టతను వివరించి, అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ప్రతి ఒక్క వర్గాన్ని భాగస్వాములను చేస్తున్నామన్నారు. కనీసం రెండుకోట్ల మందికి యోగాలో ప్రవేశం కల్పించాలనే యోగాంధ్రను నిర్వహిస్తున్నామని, గ్రామ/వార్డు, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో అమరావతి యోగా అసోసియేషన్, పతంజలి యోగా, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారిలు భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో విజయ వాడ ఆర్డీఓ కావూరి చైతన్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ వి.రాణి, జిల్లా ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ రామత్లేహి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం) ఎం.టి.కృష్ణబాబు -
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష
జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూవ్మెంట్ వ్యవస్థాపకుడు కరణం రాజేష్ కుమార్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దక్షిణ భారతదేశంపై కేంద్రం వివక్ష చూపుతోందని జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా ఉద్యమ వ్యవస్థాపకుడు డాక్టర్ కరణం రాజేష్ కుమార్ అన్నారు. సమస్యల పరిష్కారానికి యావత్ దక్షిణ భారతదేశం ఏకమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్క్లబ్లో జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూవ్మెంట్ ఆధ్వర్యాన ఆదివారం రాజకీయ పార్టీల సమావేశం జరి గింది. 25 రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణం రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా తగ్గిందన్నారు. మొత్తం జనాభాలో కేవలం 17 శాతం మాత్రమే ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. 1970లో డాక్టర్ కె.ఎల్.రావు ప్రతిపాదించిన నదులు అనుసంధాన ప్రాజెక్టులో ఇప్పటివరకు ఎలాంటి ప్రగతి లేదన్నారు. దేశానికి రెండో రాజధాని, సుప్రీంకోర్టు బెంచ్ దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ కమిటీ అధ్యక్షుడుగా జి.ఎస్.ఫణిరాజును నియమించారు. సమావేశంలో జైహింద్ పార్టీ దశరథరామిరెడ్డి, కనకం శ్రీనివాసులు, బాలకోటయ్య, డీఎస్ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్ పరిసరాల్లో ప్రత్యేక డ్రైవ్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): నిబంధనలకు విరుద్ధంగా రైల్వేస్టేషన్ ప్రాంగణంలో బయట నుంచి తోపుడు బండ్లపై వచ్చి ఆహార విక్రయాలు చేస్తున్న వారిపై రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. స్టేషన్ డైరెక్టర్, సిబ్బంది ఆదివారం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అనధికార విక్రేతలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్టేషన్ దక్షిణ ప్రవేశ ద్వారం వద్ద కొందరు బయట నుంచి తోపుడు బండ్లపై టిఫిన్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్టేషన్ పరిసరాల్లో ప్రహరీ పక్కన కొంత మంది బడ్డీకొట్లలో నాణ్యత, పరిశుభ్రత లేకుండా ప్యాకింగ్ డ్రింక్స్, వాటర్ ప్యాకెట్లు, గుట్కా, సిగరెట్ల విక్రయాలు సాగిస్తుండగా అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఏడుగురు అనధికార విక్రేతలను అదుపులోకి తీసుకుని ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ రైలు ప్రయాణికుల భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కొందరు విక్రేతలు మాత్రం పరిశుభ్రత, నాణ్యత లేకుండా రైలు ప్రయాణికులకు నాసిరకం ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అనధికార విక్రేతలపై చర్యలు -
ఉయ్యూరు డివిజన్ నూతన కమిటీ ఎన్నిక
ఉయ్యూరు రూరల్: ఉయ్యూరు డివిజన్ పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గ ఎన్నిక మండలంలోని కాటూరు గ్రామపంచాయతీలో ఆదివారం జరిగింది. ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంఘ జనరల్ సెక్రటరీ జీటీవీ రమణ, కృష్ణా జిల్లా పంచాయతీ కార్యదర్శుల కోశాధికారి ఏఎస్ఆర్ కోటేశ్వరరావులు ఎన్నికల అధికారులుగా వ్యవహరించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఉయ్యూరు డివిజన్ అధ్యక్షుడిగా ఓగిరాల తిరుమల వెంకటరత్నం, ఉపాధ్యక్షులుగా ఎం. పద్మశ్రీవేణి, కేబీవీఎన్ఎం స్వామి, ప్రధాన కార్యదర్శిగా డి,మునిరాజు, పి.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా పీవీ సుబ్బారావు, బి.వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు మచిలీపట్నం డివిజన్కు.. చల్లపల్లి: పంచాయతీ కార్యదర్శుల సంఘం మచిలీపట్నం డివిజన్ అధ్యక్షుడిగా చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న పేర్ని వెంకట మాధవేంద్రరావును ఎన్నుకున్నారు. మచిలీపట్నంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన డివిజనల్ పంచాయతీ కార్యదర్శిల సమావేశంలో నూతన డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. డివిజన్ జాయింట్ సెక్రటరీగా మోపిదేవి మండలం మెరకనపల్లి పంచాయతీ కార్యదర్శి కె.రామకోటేశ్వరరావును ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా డీఎల్పీఓ వి.సీతారామయ్య వ్యవహరించగా రాష్ట్ర పంచాయతీ కార్యదర్శిల సంఘం ప్రతినిధి జీటీవీ రమణ, జిల్లా ట్రెజరర్ ఎ.ఎస్.ఆర్.కోటేశ్వరరావు పర్యవేక్షించారు ఆంధ్ర కురియన్ జశ్వంతరావుకు భార్య వియోగం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయ డెయిరీ వ్యవస్థాపకుడు, ఆంధ్ర కురియన్ డాక్టర్ వి.జశ్వంతరావు సతీమణి స్వర్ణకుమారి (85) మృతి చెందారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ మౌలాలిలోని స్వగృహంలో ఆమె కన్నుమూశారు. ఆమె మృతికి సీనియర్ జర్నలిస్టు వీకేఎం తిలక్ సంతాపం తెలిపారు. -
నిధుల్లేక.. కొనలేక..!
పెడన: కూటమి పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. నాడు టీడీపీ సర్కారులో తీవ్ర నిర్లక్ష్యానికి గురై గ్రామాలకు దూరంగా చెత్త సంపద కేంద్రాలను నిర్మించి వదిలేస్తే.. వీటి ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూర్చేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మళ్లీ టీడీపీ వివిధ పార్టీలతో పొత్తుపెట్టుకుని అధికారం చేపట్టి చెత్త సంపద కేంద్రాలను నిర్వీర్యం చేయాలని చూస్తోంది. అందులో భాగంగా ప్రతి 250 ఇళ్లకు ఒక క్లాప్ మిత్రను, ఒక రిక్షాను పంచాయతీలే కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలని, అవసరమైన రిక్షాలు కొనుగోలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. పంచాయతీ నిధులు అంతంత మాత్రంగా ఉన్న వాటితో ఎలా వీటిని కొనుగోలు చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు భారం పెడన నియోజకవర్గం పరిధిలో అధిక శాతం పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. పంచాయతీలన్నింటికి ఆర్థిక సంఘం నిధులే ఆధారం. ప్రతి 250 కుటుంబాలకు ఒక రిక్షా, క్లాస్ మిత్ర ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలా చేయాలంటే జనాభా ప్రాతిపదిక కనీసం ఒక్కో పంచాయతీకి మూడు నుంచి పది రిక్షాలు వరకు కొనుగోలు చేయాలి. ఒక రిక్షా ఖరీదు రూ.25 వేల నుంచి రూ.30 వేలకు వరకు ఉందని, వాటిని ఎలా కొనుగోలు చేయాలంటూ పంచాయతీ సిబ్బంది వాపోతున్నారు. గతంలో కొనుగోలు చేసిన వాటికి మరమతులు చేయించాలంటేనే రూ.10వేలు వరకు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం లేని పంచాయతీలే అధికం నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని చాలా పంచాయతీలకు ఆదాయం రావడం లేదు. ఆస్తి పన్నులు, నీటి కుళాయిల ద్వారా వచ్చే పన్నులు అంతంత మాత్రమే. వీటితో నెలవారి ఖర్చులకు కూడా సరిపోని దుస్థితి. పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను ఇలా నాలుగు మండలాల్లో కూడా చాలా పంచాయతీల్లో రూ.2లక్షలు కూడా ఆదాయం రానివి ఉన్నాయి. ఆదాయం లేని పంచాయతీలను గుర్తించి ప్రభుత్వమే రిక్షాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు, కార్యదర్శులు కోరుతున్నారు. కొందరు క్లాప్మిత్రలు పనిచేస్తూ మానేస్తున్నారు. పంచాయతీల పరిధి ఎక్కువగా ఉండటంతో పాటు తిరగలేక, జీతాలు సరిగ్గా సరిపోక ఇబ్బందులు పడుతూ మానేస్తున్నారు. కొత్త వారిని తీసుకుందామంటే ముందుకు రాని దుస్థితి. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై నీలినీడలు రిక్షాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆదేశం ప్రతి 250 ఇళ్లకు ఒక క్లాప్మిత్ర..ఒక రిక్షా అంతంత మాత్రం పంచాయతీల ఆదాయం పెడన నియోజకవర్గంలో పంచాయతీలు...సంపద కేంద్రాలు మండలం పంచాయతీలు సంపద కేంద్రాలు పెడన 24 24 గూడూరు 27 26 బంటుమిల్లి 21 21 కృత్తివెన్ను 16 16 -
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
వించిపేట(విజయవాడపశ్చిమ): విద్యుత్ షాక్తో బాలుడు మృతి చెందిన ఘటన పశ్చిమ నియోజవర్గం 50వ డివిజన్లోని గొల్లపాలెంగట్టు కొండ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం తమ్మా లలిత కూలి పనులు చేసుకుంటూ జెండా చెట్టు సెంటర్లోని కొండప్రాంతంలో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె చిన్న కుమారుడు తమ్మా మానస్(8) ఆదివారం మధ్యాహం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న క్రమంలో అక్కడ ఉన్న ఒక బడ్డీ కొట్టును పట్టుకొన్నాడు. దీంతో అతనికి విద్యుత్ షాక్ తగిలింది. కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఆటోలో నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. బడ్డీ కొట్టు నిర్వాహకులు సమీపంలోని తమ ఇంటి నుంచి.. ఇనుప రేకులతో ఏర్పాటు చేసిన కొట్టుకు విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సరఫరా రేకులకు తాకడంతో బాలుడు ఆడుకుంటూ దాన్ని పట్టుకోవడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన విషయం తెలియడంతో స్థానిక కార్పొరేటర్ బోయి సత్యబాబు, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు బంకా చాముండేశ్వరి బాలుడి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆడుకుంటూ బడ్డీకొట్టును తాకడంతో కరెంట్ షాక్ -
ప్రభుత్వమే ఆదుకోవాలి
పంచాయతీల ఆదాయం అంతంత మాత్రమే. ఖర్చులు బాగా పెరిగాయి. ఇటీవల రిక్షాలు కొనుగోలు చేయాలని, క్లాప్మిత్రలను పెట్టుకోవాలని అధికారులు చెప్పడంతో పాలుపోని దుస్థితి. ప్రభుత్వమే పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను చేపట్టాలి. రిక్షాలు కొనుగోలు చేసి పంచాయతీలకు ఇవ్వాలి. ఈ రిక్షాలు కూడా మోటర్సైకిల్గా ఉండాలి. పంచాయతీల పరిధి ఎక్కువగా ఉంటుంది. తొక్కుకుంటూ వెళ్లా లంటే క్లాప్మిత్రలకు ఇబ్బందికర పరిస్థితి. క్లాప్మిత్రల జీతభత్యాలను కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగవుతుంది. –గరికపాటి వెంకట రామానాయుడు, సర్పంచు, పెనుమల్లి, పెడన -
మిద్దె తోటల కూరగాయలతో ఆరోగ్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువుతో మిద్దె తోటల్లో కూరగాయలు, ఆకుకూరలను పండిస్తే పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని పలువురు వక్తలు పేర్కొన్నారు. వన్ ఎర్త్ – వన్ లైఫ్ (టెర్రస్ గార్డెన్ గ్రూప్) ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కళాక్షేత్రం ప్రాంగణంలో రైతులు ప్రదర్శించిన దేశవాళీ విత్తనాలు, ప్రకృతి వ్యవసాయం, ఔషధ మొక్కల స్టాల్స్ను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తిలకించారు. మిద్దె తోటల అభివృద్ధికి సహకారం అందిస్తానని తెలిపారు. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సతీష్ మాట్లాడుతూ నగరాల్లో మిద్దె తోటల పెంపకం ప్రాధాన్యం పెరిగిందని, దీంతో జీవ వైవిధ్యం మెరుగుపడుతుందన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ టెర్రస్ గార్డెన్లో పెరిగిన కూరగాయలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొత్తగా మిద్దె తోటలను ప్రారంభించానుకునేవారికి చీడపీడల నివారణ పద్ధతులతో పాటు ఇతర మెలకువలను తెలియజేస్తామని చెప్పారు. పర్యావరణవేత్త కొమెర అంకారావు (జాజి) మాట్లాడుతూ సేంద్రియ ఎరువుతో పండించే ఆకుకూరల్లో ఉండే ఔషధ గుణాలను వివరించారు. వన్ ఎర్త్ – వన్ లైఫ్ (మిద్దె తోట వాట్సప్ గ్రూప్) వ్యవస్థాపకురాలు ఏలూరి లీలా కుమారి మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన పురుగుల మందులతో పండించినవి ఏవైనా ఆరోగ్యానికి హానికరమని, ఈ సమస్యకు సమర్థమైన ప్రత్యామ్నాయం మిద్దె తోటల పెంపకమేనన్నారు. తొలుత విద్యార్థులకు పర్యావరణం, వన్ ఎర్త్–వన్ లైఫ్ అంశాలపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. -
అమ్మసన్నిధి.. భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, వివాహాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో క్యూలు కిటకిటలాడుతూ కనిపించాయి. మహా మండపం రెండో అంతస్తులో దేవస్థానం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి భక్తుల రద్దీ మరింత పెరగడంతో ఘాట్రోడ్డు పైకి కార్లను అనుమతించలేదు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం 11.40 నుంచి 12.15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. 2 గంటల పాటు వీఐపీ దర్శనాలు నిలిపివేత భక్తుల రద్దీ ఉండే సమయాల్లో వీఐపీ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యలో ఆదివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలివేశారు. ప్రముఖులు, అధికారుల పేరిట వచ్చిన వారికి ఈవో ఆదేశాలను వివరించారు. మధ్యాహ్నం 1.30 గంట తర్వాత వీఐపీ దర్శనాలకు అనుమతించారు. టికెట్ ఉంటేనే అంతరాలయ దర్శనం రూ. 500 టికెట్ ఉన్న వారికి మాత్రమే అంతరాలయంలోకి అనుమతించారు. ఆదివారం ఉదయం ఈవో శీనానాయక్ పలుమార్లు టికెట్ల స్కానింగ్, చెకింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. ప్రముఖుల సిఫార్సులతో దర్శనానికి విచ్చేసిన వారిని ప్రొటోకాల్ కార్యాలయానికి వెళ్లి టికెట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రద్దీ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక సమయం కేటాయింపు దిశగా ఈవో చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనం పూర్తయిన భక్తులు నటరాజ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వద్ద సేద తీరగా ఈవో శీనానాయక్ వారిని కలిసి మాట్లాడారు. తిరుపతమ్మ ఆలయంలో.. పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ క్యూలు, పరిసరాలు కిక్కిరిశాయి. తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు వాహనాల రద్దీ కొనసాగింది. కొందరు భక్తులు మునేరు అవతల మామిడి తోటల్లో సందడి చేస్తూ వంటలు వండి భోజనాలు తిన్నారు. -
ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ
కొడవలూరు: కొడవలూరు మండలం గండవరం సబ్స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా విజయవాడకు చెందిన వారే. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విజయవాడ నుంచి నాగూర్ నాగపట్నం వెళ్లేందుకు 40 మంది ప్రయాణికులు ట్రావెల్స్ బస్సులో శనివారం రాత్రి బయలుదేరారు. కొడవలూరు మండలం గండవరం సబ్స్టేషన్ వద్దకు ఆదివారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో చేరుకొన్నారు. ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉండటంతో ప్రయాణికులు కాలకృత్యాలు తీర్చుకొనేందుకు బస్సును రోడ్డుకు పక్కగా నిలిపారు. ప్రయాణికుల్లో కొందరు ఖాళీ ప్రదేశాల్లో ఉండగా, విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన సిరింగి బాబురావు(50) బస్సు వెనుక నిల్చున్నారు. ఇంతలో చీమకుర్తి నుంచి చైన్నె పోర్టుకు వెళుతున్న కంటైనర్ లారీ ఆగి ఉన్న ట్రావెల్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సు వెనుక నిల్చొని ఉన్న బాబురావు రెండు వాహనాల మధ్య నలిగి అక్కడికక్కడే మరణించగా, బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని 108లో చికిత్స నిమిత్తం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిలో మృతుని కుమారుడైన కిరణ్కుమార్ పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై కోటిరెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన కొద్ది పేపటికే రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కొడవలూరు సీఐ సురేంద్రబాబులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు సహాయ చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ● యాత్రకు చేరుకోక ముందే బాబురావు మృతి చెందడం, కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుని భార్య మున్నీ కన్నీటి పర్యంతమయ్యారు. మున్నీ రోదన బస్సులోని తోటి ప్రయాణికులను కలచి వేసింది. క్షతగాత్రునికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి పరామర్శ నెల్లూరు(స్టోన్హౌస్పేట): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తీవ్ర గాయాలతో మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్కుమార్ను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్రెడ్డి ఎమ్మెల్సీ వెంట ఉన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పెడన: పట్టణంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పెడన పీఎస్లో ఆదివారం కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ కరోజ్ జిల్లా బైగాం గ్రామానికి చెందిన రామ్తీథ్(35) రెండేళ్ల క్రితం పెడనకు వచ్చి పానీ పూరి బండి నడుపుతున్నారు. 21వ వార్డులోని అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అతనికి మూడు నెలల క్రితం కామెర్లు వచ్చాయి. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. మద్యం అలవాటున్న రామ్తీథ్ శనివారం ఇంట్లో పడిపోయాడు. ఆదివారం అతని బంధువులు నిడుమోలులో ఉంటూ పెడనకు వచ్చి రామ్తీథ్ను చూసి పెడన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని బావమరిది ఉమేష్చంద్ర ఫిర్యాదు మేరకు ఎస్ఐ సత్యనారాయణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహన చోరీ నిందితుల అరెస్టు సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఎస్ఎన్పురం పీఎస్ పరిధిలో ఇటీవల జరుగుతున్న వరుస ద్విచక్ర వాహన చోరీలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. నార్త్జోన్ ఏసీపీ స్రవంతిరాయ్ ఆదేశాల మేరకు ఎస్ఎన్పురం సీఐ ఎస్వీవీ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు షబ్బీర్, ఎ. సౌజన్య ప్రత్యేక దర్యాప్తు చేశారు. సీసీ కెమేరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చోరీలు చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీలు చేసింది నగరంలోని పెజ్జోనిపేట, అల్లావుద్దీన్ వీధికి చెందిన సయ్యద్ సాజీజ్, స్థానికుడు ఖాన్ చాంద్ఖాన్లు స్నేహితులు. వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గుంతలో పడి గాయపడిన నేవీ ఉద్యోగి మృతి పెనమలూరు: కానూరులో బైక్పై వెళ్తూ రోడ్డుపై ఉన్న గుంతలో పడి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేవీ ఉద్యోగి మృతి చెందాడె, దీనిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం తాతినేని సీతారామయ్య కుటుంబ సభ్యులతో గన్నవరం మండలం కేసరపల్లి ముస్తాబాద రోడ్డులోని జ్యుల్కౌంట్ అపార్టుమెంట్లో ఉంటున్నారు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తాతినేని కాత్యారావు(33) మర్చంట్ నేవీలో పని చేస్తాడు. ప్రసుత్తం సెలవుల్లో ఉండటంతో తండ్రి వద్దకు వచ్చాడు. ఈ నెల 20వ తేదీ కాత్యారావు బైక్పై విజయవాడకు వెళ్లి 21వ తేదీ ఉదయం 4.50 గంటలకు బైక్పై అత్తగారు ఉంటున్న ఎనికేపాడుకు బయలుదేరాడు. అతను బైక్పై కామయ్యతోపులో నుంచి కానూరు ప్రధాన రహదారిలోకి వచ్చాడు. ఆర్సీఎం చర్చి వద్ద ప్రధాన రహదారిపై పెద్ద గుంత ఉండటంతో కాత్యారావు పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న అతను శనివారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆంధ్రనాట్యం అద్భుతః
నటరాజుకు నాట్యాభిషేకం..విజయవాడ కల్చరల్: దృశ్యవేదిక నెలవారీ కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథా లయంలో ఆదివారం నాట్యాచార్యుడు పిళ్లా ఉమామహేశ్వర పాత్రుడు బృందం ప్రదర్శించిన ఆంధ్రనాట్యం అంశాలు ఆకట్టుకున్నాయి. ఆంధ్రనాట్య సంప్రదాయ నృత్యం కుంభహారతి, త్రిపుర సంహార శబ్దం, తరంగం, వారాహిస్తుతి, ఉమామహేశ్వర పాత్రుడు రచించిన సంక్షిప్త రామాయణం, దశావతారం అంశాలను ఎస్. మహేష్, పి. మానసతేజ, టి. జ్యేష్ట, కె. సాహితి, ఎం. హర్షిణి, జి. భార్గవి, టి. చిన్మ యి, ఎస్కే షర్మిల, పి. జోషిత సాయిలు అభినయించారు. నాట్యాచార్యుడు ఉమామహేశ్వరపాత్రులు మాట్లాడుతూ నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యానికి అంతర్జాతీయ కీర్తిని తీసుకువచ్చారన్నారు. సుసుమ నాగభూషణం రచించి, ఈఎస్ పవన్కుమార్ దర్శకత్వం వహించిన కాలజ్ఞానం సాంఘిక నాటికను ప్రదర్శించారు. కళాపరిషత్ నిర్వాహకులు పోపూరి నాగేశ్వరరావు, దృశ్యవేదిక వ్యవస్థాపకుడు హెచ్వీఆర్ఎస్ ప్రసాద్, బుర్రా నరేన్, నాట్యా చారిణి పద్మశ్రీ హేమంత్, రాయన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో ఒత్తిడి నియంత్రణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజలకు సేవలు అందించడంలో నిత్యం బిజీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు యోగసాధన చేయడం ద్వారా ఒత్తిడిని జయించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా ఆయుష్ శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల జంక్షన్ వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ ఎన్జీవో, జేఏసీ నేతలు, ఉద్యోగులతో కలిసి పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడిని జయించి, మంచి ఫలితాలు సాధించేందుకు యోగా ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజూ కొంత సమయాన్ని యోగాచరణకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు. యోగా జీవితంలో భాగం కావాలి.. ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ యోగా, ధ్యానం భారతీయ వారసత్వ సంపద అని పేర్కొన్నారు. ఉద్యోగులంతా యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. యోగాతో అద్భుత ఫలితాలు సాధించొచ్చన్నారు. పేద విద్యార్థులకు ఆర్టిస్టిక్ యోగాలో శిక్షణ ఇస్తూ, యోగాకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్న ట్రైనర్ బి.శిరీష ఇకపై కూడా కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా రూ. 10 వేలు తక్షణ సహాయం ప్రకటించారు. ఏపీ ఎన్జీవో జిల్లా కార్యవర్గ అధ్యక్షుడు డి.సత్య నారాయణ, సహాధ్యక్షుడు వీవీ ప్రసాద్, కార్యదర్శి పి.రమేష్, నగర శాఖ అధ్యక్షుడు సీవీఆర్ ప్రసాద్, కార్యదర్శి షేక్ నజీరుద్దీన్, యోగాంధ్ర నోడల్ అధికారి, డీఎంహెచ్వో ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
పంట మిగల్లేదు.. పరిహారం అందలేదు!
కంటితుడుపు ప్రకటనతో సర్కారు సరికంకిపాడు: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందలేదు. పరిహారం కోసం కొద్ది రోజులుగా రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇంకా పంట నష్టం నమోదు దశలోనే అధికార యంత్రాంగం ఉంది. పంట నష్టం నమోదు సక్రమంగా జరగటం లేదన్న వ్యాఖ్యలు అన్నదాతల నుంచి వినిపిస్తున్నాయి. పంట నష్ట పరిహారంపై కూటమి ప్రభుత్వం కంటితుడుపు ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తోందంటూ రైతులు పెదవి విరుస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఉద్యాన రైతుకు కష్టం.. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్ట పోయారు. చేతికొచ్చిన పంట తడిసిపోయి, నాణ్యత దెబ్బతిని అవస్థలు పడ్డారు. పంట సంరక్షణకు నానా పాట్లు పడ్డారు. దీనికి తోడు విడువకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటుగా మేజర్గా పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో సాగులో ఉన్న మొక్కజొన్న పంట ఎండబెట్టి మార్కెట్కు తరలించే దశలోనూ, పంట చేను మీద దెబ్బతింది. జిల్లాలో 4,750 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తే ఇంకా 40 శాతం పంట రైతుల వద్ద ఉన్నట్లు సమాచారం. మొక్కజొన్న గింజలు మొలకెత్తి పెట్టుబడులు మొత్తం కోల్పోయే పరిస్థితి నెలకొంది. తూతూమంత్రంగా.. ఎంత మేరకు పంట నష్టం వాటిల్లిందీ వ్యవసాయశాఖ అంచనాలను నమోదు చేయలేదు. ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలకే మొక్కజొన్న దెబ్బతిన్నా, వరి చేలు కోత దశలో నేలవాలినా కనీసం ఎలాంటి నష్టం వాటిల్లలేదంటూ ప్రాథమిక నివేదికలో పేర్కొనటం విడ్డూరం. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలనలు చేయకుండా తూతూమంత్రంగా నివేదికలను సమర్పించి చేతులు దులుపేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పంట దెబ్బతిందని రైతులు ఆర్ఎస్కేల్లో చెబితే పంట తీసుకొచ్చి చూపండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన సిబ్బంది ఉన్నారంటే రైతులు పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కోతలు విధిస్తూ.. అయితే ఉద్యానశాఖ మాత్రం జిల్లా స్థాయిలో ప్రాథమికంగా రూపొందించిన పంట నష్టం అంచనాల్లో 127 మంది రైతులకు చెందిన 92.40 హెక్టార్లలో బొప్పాయి, మునగ, కూరగాయలు, తమలపాకు, అరటి పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదించింది. అయితే పంట నష్టం సర్వే అనంతరం 64.337 హెక్టార్లలో అరటి, తమలపాకు, బొప్పాయి, కూరగాయలు పంటలు దెబ్బతిన్నట్లు నివేదించారు. 143 మంది రైతులు నష్టపోయారని, రూ. 19.90 లక్షలు పరిహారం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, పామర్రు, బాపులపాడు, ఉంగుటూరు, ఉయ్యూరులో పంట నష్టం జరిగినట్లు నివేదించారు. నష్టం భారీగా ఉంటే కోతలు విధించటం సమంజసమేనా అన్న వాదన రైతులు వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురుచూపులు పంట నష్టం నమోదుపై అభ్యంతరాలు ప్రభుత్వం కాలయాపన చేస్తోందంటూ విమర్శలు ఆదుకోవడంలో విఫలం.. అకాల వర్షాల అనంతరమే కూటమి ప్రభుత్వం ‘మంగళవారం’ నాటికే పరిహారం రైతుల ఖాతాకు చేరాలని ప్రకటించింది. ఇప్పటికి ఎన్నో మంగళవారాలు గడిచాయి. కానీ రైతులకు మాత్రం పరిహారం అందలేదు. కేవలం కంటి తుడుపు ప్రకటనలకు సర్కారు పరిమితం అయ్యిందని అన్నదాతలు విమర్శిస్తున్నారు. పంట వారీగా సమర్థంగా పంట నష్టం నమోదు చేసి బాధిత రైతులకు పరిహారం అందేలా చేయటంలో అటు సర్కారు, ఇటు అధికారులు కూడా విఫలమయ్యారంటూ ఆరోపిస్తున్నారు. -
కృష్ణా తీరాన రామలింగేశ్వరునికి విశేష అభిషేకాలు
నాగాయలంక: మాస శివరాత్రిని పురస్కరించుకుని స్థానిక శ్రీరామ పాదక్షేత్రం వద్ద కృష్ణానదిలోని శ్రీగంగ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి మండపంలో శివలింగానికి ఆదివారం విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. క్షేత్రం చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు పర్యవేక్షణలో మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన సామాన్య భక్తులతో కలసి వేకువ జామున విభూధి, నారికేళ, గోక్షీరం, తేనె, పంచదార, పసుపు, కుంకుమ తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అభిషేకాల తదుపరి స్వామివారిని పూలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. మాస శివరాత్రి పర్వతిథిని పురస్కరించుకుని నాగాయలంకలోని పురాతనమైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం ఆలయ అర్చకుడు సాయి కిరణ్ శర్మ బ్రహ్మత్వంలో విశేష పూజ నిర్వహించారు. స్వామికి జరిపిన ప్రత్యేక అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 8వ తేదీన బాడీ బిల్డింగ్ జట్టు ఎంపిక పెనమలూరు: వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లాల క్రీడాకారుల ఎంపిక చేస్తామని బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్, తాళ్లూరి అశోక్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం కానూరులో వివరాలు తెలుపుతూ జూన్ 22వ తేదీన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పాల్గొనే క్రీడాకారులకు జూన్ 8వ తేదీ ఆదివారం జట్టు ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సింగ్నగర్ మనోహర్ జిమ్లో క్రీడాకారుల ఎంపిక ఉదయం 9 గంటలకు జరుగుతుందని, ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఎంపికలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు 86867 71358, 85550 47808లలో సంప్రదించాలన్నారు. కవులు ఉమ్మడిగా గళం విప్పాలి విజయవాడ కల్చరల్: రాజ్యాంగ నైతికతను కవులు భుజానికి ఎత్తుకోవాలని ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న అన్నారు. మల్లెతీగ సాహిత్యసేవా సంస్థ ఆధ్వర్యంలో బందరురోడ్డులోని బాలోత్సవ్ భవన్లో ఆదివారం బంగార్రాజు కంఠ రచించిన ‘దుఃఖం పండుతున్న నేల’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకన్న మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఒక లైక్ కోసం యువత విలువైన జీవితాన్ని కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కవులు ఉమ్మడిగా గళం విప్పాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన బిక్కీ కృష్ణ మాట్లాడుతూ దేశంలో క్రమశిక్షణ లోపించందన్నారు. గజల్ రచయిత రసరాజు స్ఫూర్తివంతమైన ప్రసంగం చేస్తూ కవికి సొంత డిక్షన్ కావాలన్నారు. రచయిత్రి ఘంటసాల నిర్మల, మల్లెతీగ సాహిత్యవేదిక వ్యవస్థాపకుడు కలిమిశ్రీ, కవి విల్సన్రావు, పోలీస్ అధికారి లోసారి సుధాకర్, పుస్తక రచయిత బంగార్రాజు, శిఖా ఆకాష్ కవిత్వంలో వస్తున్న మార్పులు అంశంగా మాట్లాడారు. ఏకగ్రీవంగా నూతన కమిటీ చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) కృష్ణా జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మచిలీపట్నం జి–కన్వెన్షన్ హాల్ వేదికగా జరిగిన జిల్లా కమిటీ ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా సంఘ రాష్ట్ర నాయకులు గుళ్లిపల్లి నాగసాయి, కిషోర్ వ్యవహరించారు. జిల్లాకు నూతనంగా ఎన్నికై న కార్యవర్గం సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.. అధ్యక్షుడిగా పి. రాము, సహాధ్యక్షుడిగా జి. శ్రీనివాస్ రావు, కార్యదర్శిగా తోట వరప్రసాద్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎస్. రాంబాబు, వైస్ ప్రెసిడెంట్స్గా కేవీ లోకేశ్వరరావు, ఎస్వీవీ రామారావు, కె. కోటేశ్వరరావు, సీహెచ్వీ సత్యనారాయణరావు, వి. సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా జి. రామకష్ణ, సీహెచ్ఎస్ఆర్ పవన్కుమార్, సీహెచ్ బ్రహ్మానందబాబు, ఎం. బాలాజీ, పి. ప్రవీణ్ కుమార్, హుస్సేన్, ఎండీ సలీం, ట్రెజరర్గా బి. సురేష్నాయక్బాబులను ఎన్నుకున్నారు. -
ఆదిదంపతుల ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో ఆదివారం నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో కీలకమైన రూ.25 వేల వస్త్రాలంకరణ సేవలో ఆదివారం ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి తొలి దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంంటలకు ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చనలో 18 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష అభిషేకాల్లోనూ ఉభయదాతలను అనుమతించారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఛండీహోమం నిర్వహించగా 51మంది ఉభయదాతలు తమ నామగోత్రాలతో హోమం జరిపించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మూర్తి వద్ద లక్ష కుంకుమార్చన నిర్వహించారు. లక్ష కుంకుమార్చన, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, శ్రీచక్రనవార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. ఇక ప్రతి ఆదివారం నిర్వహించే సూర్యోపాసన సేవలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆయా సేవల్లో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 25కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 10,381 మంది అభ్యర్థులకు గాను ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకూ నిర్వహించిన పేపర్–1కు 5,716 (55.1 శాతం) మంది, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ జరిగిన పేపర్–2కు 5,665 (54.6 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సక్రమంగా ప్రశాంతంగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో జరిగిన పరీక్షను కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. అలాగే పరీక్ష జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. హాజరైన 55 శాతం అభ్యర్థులు 25 కేంద్రాల్లో కొనసాగిన పరీక్ష పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ -
బీచ్ కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టుకు బ్రాంజ్
విజయవాడస్పోర్ట్స్: ఖేలో ఇండియా మొదటి జాతీయ బీచ్ కబడ్డీ చాంపియన్షిప్లో ఆంధ్ర ప్రదేశ్ పురుషుల జట్టు సత్తా చాటింది. ఈ నెల 19వ తేదీ నుంచి డామన్డయ్యులో ప్రారంభమైన ఈ పోటీల్లో రాష్ట్ర జట్టు అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి బ్రాంజ్ మెడల్ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పోటీలను నిర్వహించింది. తొలుత లీగ్ పోటీల్లో హిమాచల్ప్రదేశ్ను 41–38, ఉత్తర్ప్రదేశ్ను 42–37, హరియాణాను 42–39 తేడాతో ఓడించి సెమీ ఫైనల్కు చేరింది. సెమీస్లో రాజస్థాన్పై 40–43 తేడాతో ఓడి మూడో స్థానంలో నిలిచి పతకాన్ని అందుకుంది. జట్టులో నవీన్ (నెల్లూరు), లక్ష్మారెడ్డి(ప్రకాశం) రాణించి జట్టు విజయాలకు తోడ్పాటు అందించినట్లు కోచ్లు సాతేంద్రసింగ్, పి.చైతన్య తెలిపారు. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో పతకాన్ని సాధించిన జట్టును ఆంధ్రప్రదేశ్ బీచ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె.వి.ప్రభావతి, కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా అర్జునరావు అభినందించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2025u10లో దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. లక్ష కుంకుమార్చనలో ఆలయ ఈఓ శీనా నాయక్ దంపతులు పాల్గొన్నారు. తీరానికి తాళం ముందస్తు ప్రకటన లేకుండా అధికారులు హంసలదీవి తీరం గేట్లను మూసివేశారు. దీంతో పర్యాటకులు గంటల తరబడి నిరీక్షించి, నిరాశతో వెనుదిరిగారు బెజవాడ నగరంలో డ్రెయినేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వర్షానికే నగరంలో డ్రెయిన్లు పొంగి రహదారులను ముంచెత్తు తున్నాయి. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిందంటే కొన్ని రహదారుల్లో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. కొన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాకాలానికి ముందే డ్రెయిన్లు, కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాల్సిన కార్పొరేషన్ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: నగరంలో ఈ ఏడాది మేజర్ కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత పనుల కోసం మూడు సర్కిల్ల పరిధిలో రూ.17కోట్లతో పనులను చేపట్టారు. ఈ పనులు తూతూ మంత్రంగా చేస్తూ చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం అవుతుండటంతో ఈ సీజన్లో సైతం నగర వాసులకు కష్టాలు తప్పేలాలేవు. వర్షాలు కురిసినప్పుడు నగరంలో కొన్ని ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగి మురుగునీరు రోడ్లపైకి రావడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం మురుగు నీరు కాలువల్లో సక్రమంగా ప్రవహించేలా, డ్రెయిన్లలో పూడికతీత తొలగించకపోవటమే. ఇప్పటికే నగర కమిషనర్ పలు ప్రాంతాల్లో పర్యటించి నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగకుండా క్షేత్ర స్థాయిలో ఆయా శాఖాధిపతులు పర్యటించి డ్రెయిన్లలో నీరు నిలువకుండా ఉండే విధంగా ఉన్న అడ్డంకులను తొలగించాలని ఆదేశించారు. కాని ఆచరణలో మాత్రం అమలు కావటం లేదు. జాతీయ రహదారి పైనుంచి వచ్చే వర్షపునీరు సర్వీసు రోడ్డుపై నిలిచిఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. అవుట్ ఫాల్ డ్రైన్లను పరిశీలించి వర్షపు, మురుగునీరు ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయడంలో సిబ్బంది విఫలం అవుతున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం నగరంలో డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతోనే, గత ఏడాది సెప్టెంబరులో కురిసిన వర్షాలకు బుడమేరు పొంగింది. దీంతో నరగంలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. వారం రోజులకు పైగా నీరు కాలనీల నుంచి వెళ్లక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా నగరంలో ప్రధాన డ్రైన్లు గుంటతిప్ప, పుల్లేరు, బుడమేరులో నామమాత్రంగా పూడిక తీశారు. దీంతో ప్రధానంగా డ్రైన్లు ప్రవహించే లబ్బీపేట, పిన్నమనేని పాలిక్లినిక్, గాయత్రినగర్, ఎల్ఐసీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, గుణదల, భారతినగర్, గురునానక్ కాలనీ, మారుతి కో–ఆపరేటివ్కాలనీ, భారతినగర్, ఆటోనగర్, అజిత్సింగ్ నగర్, మధురానగర్ ,పాయకాపురం, బెంజి సర్కిల్, పంటకాలువ రోడ్డు, తోట వారి వీధి, ఊర్మిళా నగర్, నిర్మల కాన్వెంట్ రోడ్డు, కృష్ణవేణి రోడ్డు, రమేష్ ఆస్పత్రి ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై మురుగు, వర్షపునీరు పొంగి ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ డ్రెయిన్ ఉందో తెలియక పాద చారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిధులు ఖర్చు చేసినా... ఈ ఏడాది వేసవిలో డ్రైన్లలో పేరుకుపోయిన చెత్త, చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్న మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ల నుంచి సైడు డ్రైన్ల వరకు సిల్టు తీయటానికి వీఎంసీ రూ.17 కోట్లు వీఎంసీ సాధారణ నిధుల నుంచి కేటాయింపులు జరిపారు. సిల్టు తొలగింపునకు కార్మికులు లేకపోవటం, ఉన్న కార్మికులు సుదీర్ఘ సెలవులపై ఉండటంతో గ్యాంగ్వర్క్ పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ సరైన ప్రణాళిక, డ్రైన్ల రూట్మ్యాప్, డ్రైన్లపై ఏర్పాటు చేసిన గేజ్ల నిర్వహణ లేకపోవటం, డ్రైన్లపై అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టటంతో సిల్టు తొలగింపు ప్రహసనంగా మారింది. నగరవ్యాప్తంగా ప్రతి రోజు వచ్చే 250 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ అధికంగా డ్రెయిన్లు, కాల్వల్లోనే సేకరించటానికి ప్రధాన కారణం వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతా ల్లో డ్రెయిన్లపై ఇనుప గేజ్లు ఏర్పాటు వలనే జరుగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విజయవాడ మిల్క్ప్రాజెక్ట్ సమీపంలో పేరుకుపోయిన చెత్తచెదారం 9న్యూస్రీల్అంతంత మాత్రంగానే డీసిల్టింగ్ పనులు చెత్త, వ్యర్థాలతో నిండిపోతున్న డ్రెయిన్లు కొద్దిపాటి వర్షానికే పొంగి పొర్లుతున్న వైనం రోడ్లపైనే భారీగా నిలుస్తున్న వర్షపు నీరు నగరవాసులకు తప్పని తిప్పలు విజయవాడ నగరంలో మురుగునీరు పారుదలకు, వర్షంనీటి పారుదలకు నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 142 కిలోమీటర్ల మేర మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లు, 302 కిలోమీటర్ల మైనర్ డ్రైన్లు నిర్మాణమయ్యాయి. నగరంలోని సర్కిల్–1 పరిధిలో వించిపేటలో, సర్కిల్–2 పరిధిలోని అజిత్సింగ్నగర్లో, సర్కిల్–2 పరిధిలోని గుణదలలోని పుల్లేటి కాల్వ నుంచి నగరంలోని మురుగునీరు, వర్షంనీరు బందరు, ఏలూరు, రైవస్, బుడమేరుల్లో కలుస్తున్నాయి. డ్రెయిన్లలో వచ్చే ఇతర వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా కాల్వల్లో మురుగునీరు ముందుకు పారటంలేదు. దీనికితోడు ప్రతి ఏడాది వేసవిలో చేపట్టాల్సిన డీసిల్టింగ్ పనులు కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. మూడు సర్కిళ్ల పరిధిలోని ప్రధాన అవుట్ఫాల్ డ్రెయిన్లలో ఎప్పటికప్పుడు సిల్టు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలో నరగపాలక సంస్థ అధికారులు విఫలం అవుతున్నారు. వరద నీరు డ్రెయిన్లలో సరిగా ప్రవహించకపోవడంతో నీరు వెనక్కి తన్ని కాలనీలు, రోడ్లు జలమయం అవుతున్నాయి. -
యోగాంధ్ర నిర్వహణకు బృందాల ఏర్పాటు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాలో యోగాంధ్ర–2025 కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ బృందాలను ఏర్పాటు చేస్తూ ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే భూమి – ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే అంశంతో రాష్ట్ర ప్రభుత్వం మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి యోగా శిక్షకులు మండలాల వారీ గా మాస్టర్ ట్రైనీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని స్థాయిల్లో యోగా సాధన శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్ చైర్మన్గా, ఎస్పీ వైస్చైర్మన్గా, జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా, డీఎంఅండ్హెచ్వో కన్వీనర్గా మొత్తం 24 మంది సభ్యులు ఉంటారని పేర్కొన్నారు. మండల, పట్టణ స్థాయి కమిటీలో మునిసిపల్ కమిషనర్ లేదా ఎంపీడీవో చైర్మన్గా, ఎంఈవో కన్వీనర్గా, ఇతర అధికారులు కో–కన్వీనర్, సభ్యులుగా మొత్తం తొమ్మిది మంది ఉంటారు. గ్రామస్థాయి కమిటీలో పంచాయతీ కార్యదర్శి లేదా వార్డులో అడ్మిన్ సెక్రటరీ చైర్మన్గా, వీఆర్వో, ప్రధానోపాధ్యాయులు, పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు సభ్యులుగా ఉంటారన్నారు. షెడ్యూలు ప్రకారం ట్రైనర్స్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయిలో 56 మంది వ్యాయామ ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్లుగా నియమించామన్నారు. ఉత్తర్వులు జారీ చేసిన కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ -
ప్రాణాంతకంగా బూడిద రవాణా
జి.కొండూరు: బూడిద రవాణా చేసే అక్రమార్కుల, లారీ యజమానుల అత్యాశ వాహన చోదకులకు ప్రాణాంతకంగా మారింది. బూడిదపై పట్టాలు కప్పకుండా లారీలలో పరిమితికి మించి ట్రక్కు పైన రెండు నుంచి మూడు అడుగుల మేర అదనపు లోడింగ్ చేసి రవాణా చేయడంతో దారి పొడవునా గాలికి లేచిన బూడిద వెనక వెళ్తున్న వాహన చోదకుల కళ్లల్లో పడుతోంది. తత్ఫలితంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాల పాలవుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ, ఆర్టీఓ కానీ, పోలీసు అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో బూడిద రవాణా ఇష్టారాజ్యంగా మారిపోయింది. రహదారులపై కుప్పలు తెప్పలుగా... ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలైన బూడిదను నీటితో కలిపి బూడిద చెరువులోకి తరలిస్తారు. అయితే బూడిదకి డిమాండ్ పెరగడంతో నీటితో ఉన్న బూడిదనే లారీలకు లోడింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో లారీ ప్రయాణించినంత దూరం లారీలో ఉన్న డస్టు నీటితో కలిసి రహదారి పొడవునా ట్రక్కుకు ఉన్న రంధ్రాల నుంచి కిందకు పడుతోంది. ఈ డస్టు ఎండకి ఎండిన తర్వాత రహదారిపై వచ్చే వాహనాల వేగానికి వచ్చే గాలితో కలిసి రహదారి పక్కన ఉన్న దుకాణాలు, ఇళ్లలోకి చేరుతుంది. దీనితో స్థానికులు నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీం పట్నం, జి.కొండూరు మండలాల్లో జాతీయ రహదారులపై ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. లారీలను అడ్డుకున్న గ్రామస్తులు బూడిద లారీలను రహదారిపై నిలపడం వలన కుప్పులు కుప్పలుగా బూడిద రహదారిపై పడి నరకయాతన పడుతున్నామని ఏప్రిల్ 24వ తేదీన పశ్చిమ ఇబ్రహీంపట్నంలో స్థానికులు విజయ వాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బూడిద లారీలను అడ్డుకోవడంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పడంతో స్థానికులు తమ నిరసనను విరమించారు. ప్రతి రోజూ 500కు పైగా లారీలు వీటీపీఎస్ బూడిదను భవన నిర్మాణాలు, రహదారులు, ఇటుక బట్టీలకు రవాణా చేసేందుకు ప్రతి రోజూ ఐదు వందలకు పైగా లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటితో పాటు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల పరిధిలో ఉన్న క్వారీలు, క్రషర్లలో వచ్చే డస్టును తరలించేందుకు కొన్ని లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ లారీలలో రోజుకి 18వేల టన్నులకు పైగా బూడిద రవాణా అవుతుంటుంది. ఇంత పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా లారీలలో డస్టును తరలిస్తుంటే అధికారులు మాత్రం కన్నెత్తి చూడడంలేదు. హెల్మెట్ లేదనో, లైసెన్సు లేదనో సామాన్యుల నుంచి ఫైన్ కట్టించే పోలీసులు, ఆర్టీఓ అధికారులు ఈ విషయం ఎందుకు పట్టించుకోరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పైన పట్టాలు కప్పకుండా యథేచ్ఛగా తరలింపు గాలికి లేచి వాహన చోదకుల కళ్లల్లో పడుతున్న వైనం ఈ కారణంగా ఎదురొచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల్లో ప్రధానంగా సమస్య పట్టించుకోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు -
యోగాతో ఆరోగ్య మహాభాగ్యం
కలెక్టర్ లక్ష్మీశ, ప్రభుత్వ విప్ బొండా ఉమా గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, అందుకే ప్రతి ఒక్కరూ యోగాసనాలను అభ్యసిస్తూ ఆరోగ్య మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం విజయవాడ బీఆర్ టీఎస్ రోడ్డు శారదా కళాశాల జంక్షన్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే ఉమా తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు యోగా విశిష్టతపై అవగాహన కల్పిస్తున్నామని, ఆరోగ్యంపై శ్రద్ధ, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని యోగాను తమ జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కుటుంబాలు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఉంటుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కావూరి చైతన్య, అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఎన్ ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తలనీలాలను సమర్పించి, ఘాట్రోడ్డు, మహా మండపం మీదుగా ఆలయానికి చేరుకున్నారు. సర్వదర్శనానికి గంటన్నర సమయం పట్టింది. మరో వైపున రూ. 100, రూ.300, రూ.500 టికెట్ క్యూలైన్లో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రద్దీ కనిపించింది. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు గాను మధ్యాహ్నం 12 గంటలకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. ఆర్జిత సేవలకు డిమాండ్.. శుక్రవారం, ఏకాదశిని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున ఖడ్గమాలార్చనకు 23 మంది ఉభయదాతలు హాజరు కాగా, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీ హోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చనకు ఈవో శీనానాయక్ దంపతులు హాజరయ్యారు. -
యోగాంధ్రలో జిల్లాను నంబర్ వన్గా నిలుపుదాం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్దీ, హెల్దీ, హ్యాపీ స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలా యోగాంధ్ర మాసోత్సవాలను ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని.. మీడియాతో పాటు ప్రతి వర్గం సమష్టి భాగస్వామ్యంతో ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్రలో నంబర్ వన్గా నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి థీమ్ ఆధారిత యోగాంధ్ర మాసోత్సవాలపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మే 21 నుంచి జూన్ 21వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జిల్లాలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇందుకోసం దాదా పు 2,500 మంది యోగా ట్రైనర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఏడుగురు ట్రైనర్లు అందుబాటులో ఉంటారని.. ఒక్కో ట్రైనర్ ఒక సెషన్కు 50 మందితో యోగాభ్యాసం చేయించనున్నట్లు తెలిపారు. థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు.. మన భారతీయ వారసత్వ, సాంస్కృతిక సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేలా ప్రోత్సహించేందుకు జిల్లాలోనూ నెల రోజుల పాటు థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మే 24న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో కార్యక్రమం ప్రారంభమై జూన్ 20న సెలబ్రిటీలతో థీమ్ ఆధారిత 45 నిమిషాల కామన్ యోగా ప్రొటోకాల్తో యోగాభ్యసన కార్యక్రమాలు పూర్తవుతాయన్నారు. ప్రత్యేక పోటీల నిర్వహణ.. యోగాంధ్ర మాసోత్సవాలను పురస్కరించుకొని గ్రామ/వార్డు స్థాయిలో యోగా ఫర్ ఆల్, మండల స్థాయిలో యూనిటీతో యోగా, జిల్లాస్థాయిలో యోగా అండ్ యూత్ ఇతివృత్తాలతో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని, విజేతలకు అవార్డుల బహూకరణ ఉంటుందన్నారు. పోటీల నిర్వహణకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారులు డాక్టర్ ఎం. సుహాసిని, డాక్టర్ జె.సుమన్, ట్రైనర్లు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ -
జోయాలుక్కాస్ షోరూమ్ పునఃప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బందరురోడ్డులోని జోయాలుక్కాస్ షోరూమ్ను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో వరల్డ్ ఫేవరేట్ జోయాలుక్కాస్ షోరూమ్ను ఆధునికీకరించి మూడు అంతస్తుల్లో పునఃప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. షోరూమ్ ప్రతినిధులు మాట్లాడుతూ షోరూమ్ పునఃప్రారంభం సందర్భంగా లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన డైమండ్ జ్యూవెలరీ కొనుగోలు చేసిన ప్రతి ఒక్క వినియోగదారుడికి గ్రాము గోల్డ్ కాయిన్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ది బ్రిలియన్స్ డైమండ్ జ్యూవెలరీ షో జూన్ 8వ తేదీ వరకు తమ షోరూమ్ లో జరుగుతుందని చెప్పా రు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, సీపీ రాజశేఖరబాబు పాల్గొన్నారు. షోరూమ్ ప్రారంభం సందర్భంగా మోడల్స్ బంగారు ఆభరణాలు ధరించి ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. ‘గోల్డ్’ శివ.. జోయాలుక్కాస్ షోరూమ్ పునఃప్రారంభం సందర్భంగా పెనమలూరుకు చెందిన కుంచం శివ శంకర సాయి కుమార్ (శివ) అనే వ్యాపారవేత్త సుమారు కోటిన్నర రూపాయలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. శివ పెనమలూరు సమీపంలోని మురళీనగర్ నివాసి. బంగారం ధరించి బయటకు వచ్చేటప్పుడు ఇంటిలోని కుటుంబసభ్యులు చాలా జాగ్రత్తలు చెప్పి పంపుతారని ‘సాక్షి’తో ఆయన చెప్పారు. -
లబ్ధిదారులతో మర్యాదగా వ్యవహరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, పనితీరు మెరుగుపరుచుకుని వారితో మర్యాదగా వ్యవహరించాలని కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ హెచ్చరించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో పింఛన్ పంపిణీ అధికారులతో కౌన్సెలింగ్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతి నెలా అధికారులు ఐవీఆర్ఎస్, 1100 కాల్ సెంటర్ల ద్వారా ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో కనీసం ఐదుగురు లబ్ధిదారుల స్పందనను తెలుసుకుంటున్నారన్నారు. జిల్లాలో గత మూడు నెలలుగా పింఛన్ పంపిణీ కార్యక్రమంపై ప్రతికూల స్పందన వస్తోందన్నారు. దీనిలో కారణాలను పరిశీలిస్తే పింఛన్ ఇస్తున్నామా, లేదా, నగదు మొత్తం కచ్చితంగా ఇస్తున్నామా, లేదా, సమాయానికి ఇవ్వలేకపోతే వారికి నచ్చజెప్పి మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నామా, లేదా అనే విషయాలను ప్రతి ఒక్కరూ విశ్లేషించుకోవాలన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారని, లబ్ధిదారుల నుంచి ప్రతికూల ప్రభావం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ పాల్గొన్నారు.కృష్ణా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ -
‘ప్లాస్టిక్ వినియోగాన్ని అంతం చేయాలి’
డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పిలుపు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని ‘ప్లాస్టిక్ వినియోగాన్ని అంతం చేయాలి’ అనే నినాదంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో రెండు వారాల పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే డివిజనల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పాల్గొని ప్లాస్టిక్ వాడకం కలిగే ముప్పును వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ వాడకం వలన జరిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు డివిజన్ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు. అందులో భాగంగా పర్యావరణ అనుకూల పద్ధతులు, డ్రెయిన్ల పరిశుభ్రత, మొక్కల పెంపకం, పర్యావరణ పద్ధతులను పాటించడం వలన కలిగే ప్రయోజనాలపై నాటక ప్రదర్శనల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజు వారీ విధుల్లో పర్యావరణ అనుకూల పద్ధతులను పాటించాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించారు. పర్యావరణ పద్ధతులను పాటించేలా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు పీఈ ఎడ్వీన్, కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీఈహెచ్ఎం ఎం.కిశోర్, పలు బ్రాంచ్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రేషనలైజేషన్తో వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు తీవ్ర అన్యాయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషనలైజేషన్లో వీఆర్వో, సర్వేయర్లకు తీవ్ర అన్యాయం జరగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. డిపార్ట్మెంట్ హెడ్లతో ప్రమేయం లేకుండా జీఎస్డబ్ల్యూఎస్ జీవో 4ను జారీ చేయడం దారుణమన్నారు. విజయవాడ ప్రెస్క్లబ్ నందు గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్వో, వీఎస్లను క్లస్టర్ విధానంలో రేషనలైజేషన్ పేరుతో జీఎస్డబ్ల్యూఎస్ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. జనాభా ప్రాతిపదికన రెండు, మూడు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి సచివాలయానికో వీఆర్వో, వీఎస్ను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఈ విధానంలో 7,500 మంది వీఆర్వోలు, 4,722 మంది వీఎస్లను తగ్గించి చూపారన్నారు. దీని వలన ఉద్యోగోన్నతులకు అర్హులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. క్లస్టర్ విధానంలో జరుగుతున్న లోపాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. రెవెన్యూలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐలుగా ఉద్యోగోన్నతులు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం ఉండదన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న గ్రేడ్ –2 వీఆర్వోలను గ్రేడ్–1, వీఆర్వోలుగా వన్ టైమ్ సెటిల్మెంట్గా ప్రమోషన్లు కల్పించాలన్నారు. ప్రతి రెవెన్యూ విలేజ్కు ఒక వీఆర్వోను కొనసాగించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు, రాష్ట్ర కోశాధికారి మౌళి బాషా, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యకులు లక్ష్మీనారాయణ, ప్రసన్న కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు. -
మారని అధికారులు..
నమో వాయుపుత్ర శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. భజేహం పవిత్రం.. అంటూ భక్తులు హనుమంతుడిని భక్తితో కొలిచారు. జై హనుమాన్.. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. హనుమత్ జయంతి సందర్భంగా గురువారం వాడవాడలా అభయాంజనేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వహిందూ పరిషత్ మహానగర్ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శైవపీఠాధిపతి శివస్వామి ర్యాలీని ప్రారంభించారు. భారీ సంఖ్యలో హాజరైన హనుమాన్ భక్తులు జెండాలు చేత పట్టుకొని ఉత్సాహంగా ముందుకుసాగారు. మహిళలు కూడా బైక్లపైకి ఎక్కి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ అభయాంజనేయుడికి భక్తజన నీరాజనం హనుమాన్జంక్షన్ రూరల్: హనుమాన్జంక్షన్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. జై హనుమాన్ నామస్మరణలతో మార్మోగింది. అంజనీపుత్రుడిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో తెల్లవారుజాము మూడు గంట ల నుంచే బారులు తీరారు. స్వామివారిని నూతన వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం 4 గంటలకు ప్రభాతసేవ, అర్చన, వేదపారాయణం నిర్వహించారు. హనుమాన్జంక్షన్ లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 25 వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. ర్యాలీ ప్రారంభం.. జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న శైవపీఠాధిపతి శివస్వామి తదితరులుఅధికారులకు ఆదేశాలిచ్చాం: కలెక్టర్లు సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్నామని, ఇకపై ఎటువంటి కార్యక్రమాలు జరిగినా సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం అందించేలా అధికారులకు ఆదేశాలిచ్చామని కృష్ణా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సభలో ప్రకటించారు. అలాగే జిల్లా పరిషత్ ద్వారా ఆయా మండలాలకు మంజూరైన నిధులు త్వరితగతిన నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజలకు సేవ చేసేందుకు ప్రజల ద్వారా ఎన్నికై న తాము ప్రజలకు చేయాల్సిన పనులు చేయలేకపోతున్నామని.. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వటం లేదని.. కనీసం ప్రొటోకాల్ పాటించటం లేదని జెడ్పీటీసీ, ఎంపీపీలు వాపోయారు. గురువారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు, మంత్రులు హాజరు కాకపోవడంపై స్థానిక సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రారు.. మంత్రులు కనిపించరు.. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ విషయంలో ప్రతి సర్వసభ్య సమావేశంలో అధికారులకు చెబుతున్నా పట్టించుకోవటం లేదని, ఈ రోజు మాత్రం తమకు కచ్చితమైన హామీ ఇవ్వాలని వారు భీష్మించుకొని కూర్చున్నారు. గౌరవం ఇవ్వరా.. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులుగా ఉన్న తమకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎటువంటి గౌరవం దక్కటం లేదని జెడ్పీటీసీ, ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక దాదాపుగా 18 నెలలుగా తమకు గౌరవవేతనం చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని, సమావేశానికి రావాలంటే తమకు రూ.5వేలు ఖర్చవుతోందని అయినప్పటికీ ప్రజాసేవ కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమావేశంలో తెలియపరిచేందుకు తామిక్కడికి వస్తే సంబంధిత అధికారులు ఉండరూ, మంత్రులు హాజరుకారు.. ఇలా అయితే గ్రామాల్లో తమకు ప్రాధాన్యం ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు తమ గోడును వెళ్లబుచ్చుకున్నా అధికారులు కూటమి నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోతున్నారన్నారు. పేరుకు శిలాఫలకాలపై పేర్లు ఉన్నప్పటికీ ఆ కార్యక్రమం గురించి తమకు సమాచారం ఇవ్వటం లేదని ఆరోపించారు. గౌరవవేతనం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జీతాలు నిలుపుదల చేస్తే తమ బాధ అర్థమవుతుందన్నారు. నిరసనగా బాయ్కాట్.. సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం రాకపోవటంతో కొద్దిసేపు పోడియం వద్ద నిరసన తెలిపారు. అనంతరం అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవటంతో సమావేశం నుంచి బాయ్కాట్ చేసి సమావేశ మందిరం బయట నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రొటోకాల్ పాటించాలి, గౌరవవేతనం వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. అలాగే తమ మండలాల్లో కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రశ్నించాలని వస్తే సంబంధిత అధికారులు, శాసనసభ్యులు ఎవరూ ఉండరని, సమాధానం ఎలా వస్తుందని వాపోయారు. చర్చలు జరిపినా ససేమిరా.. సమావేశం నుంచి బాయ్కాట్ చేసిన అనంతరం జెడ్పీటీసీ, ఎంపీపీలతో ఇన్చార్జ్ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్ చర్చలు జరిపారు. ఈ విషయాలపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, గౌరవవేతనం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తామని చెప్పినప్పటికీ స్పష్టమైన హామీ కావాలంటూ వారు ఒప్పుకోలేదు. ఇకపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇరువురు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులందరూ ఉంటేనే సమావేశం నిర్వహించాలని.. అలా అయితేనే తమను ఆహ్వానించాలని ఘంటాపదంగా చెప్పారు. పోడియం వద్ద నిరసన తెలుపుతున్న జెడ్పీటీసీ, ఎంపీపీలు స్థానిక సంస్థలను చిన్నచూపు చూస్తున్నారంటూ ఆవేదన ప్రొటోకాల్ అమలు కావడం లేదని నిరసన 18 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వకపోవడంపై ఆందోళన ఎమ్మెల్యేల జీతాలు కూడా ఆపేయండంటూ నిలదీత చర్చలు జరిపినా ససేమిరా అన్న ప్రజాప్రతినిధులు సమావేశాన్ని వాయిదా వేసిన చైర్పర్సన్ ఉప్పాల హారిక స్థానిక సంస్థలు ఉండాలా.. వద్దా?: చైర్ పర్సన్ హారిక స్థానిక సంస్థలను ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజల నుంచి ఎన్నికై న తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎక్కడా ప్రోటోకాల్ అమలు జరగటం లేదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఏ పనులు జరిగినా సంబంధితశాఖల అధికారులు సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వటం లేదన్నారు. గౌరవవేతనం గురించి తాము ప్రభుత్వానికి రెండు సార్లు లేఖ రాసినా దానిని తిరిగి పంపించి వేశారన్నారు. ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్న దృష్ట్యా జెడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశంలో స్పష్టమైన హామీ వస్తుందని ఆశపడి భంగ పడటంతో బాయ్కాట్ చేసి వెళ్లిపోయారన్నారు. తక్షణమే దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తొలుత జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పెహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన 26 మంది ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో నూజివీడు సబ్కలెక్టర్ స్మరణ్రాజ్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
కృష్ణలంక హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక జాతీయ రహదారిపై సత్యంగారి హోటల్ జంక్షన్ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు, ఒక వ్యాన్ ఒక దానికొకటి ఢీకొనడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సేకరించిన వివరాల మేరకు గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో బస్టాండ్ వైపు నుంచి వేగంగా వస్తున్న ఆల్టో కారు సత్యంగారి హోటల్ జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో ముందు వెళ్తున్న వ్యాన్ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. వ్యాన్ డివైడర్ను ఢీకొట్టింది. ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు.. అదే సమయంలో వారధి వైపు నుంచి బస్టాండ్ వైపు వేగంగా ఎర్టిగా, ఐ10 కార్లు వస్తున్నాయి. అప్పటికే పల్టీలు కొట్టి రోడ్డు మీద పడి ఉన్న ఆల్టో కారును ఐ10 కారు ఢీ కొనగా వెనుక వస్తున్న ఎర్టిగా కారు ఐ10 కారును ఢీకొట్టింది. దీంతో మూడు కార్లు, వ్యాన్ దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం చూసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై కారులో ఉన్న వారిని కాపాడేందుకు పరుగులు తీశారు. ఆల్టో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలవ్వగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కార్లలోని బెలూన్లు సైతం ఓపెన్ అయ్యాయంటే ప్రమాద తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో కార్లను పక్కకు తీసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదానికి కారణమైన జంక్షన్ను వెంటనే పోలీసులు బారీకేడ్లతో మూసివేశారు. ప్రమాదాలు నిత్యకృత్యమైన ఈ కూడలిని శాశ్వతంగా మూసేస్తామని పోలీసులు తెలిపారు. కూడలిని మూసివేయడంతో కృష్ణలంక అండర్పాస్ వద్ద నిలిచిపోయిన ట్రాఫిక్ను ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించారు. ప్రమాదంపై వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక దానికొకటి ఢీ కొన్న నాలుగు వాహనాలు ముగ్గురికి స్వల్ప గాయాలు -
ప్రైవేటుకే పటుత్వం!
గన్నవరం: ప్రభుత్వంలో కీలకమైన రవాణా శాఖ ఒక్కొక్క బాధ్యతల నుంచి తప్పుకుంటోంది. ఇప్పటికే రవాణా శాఖకు చెందిన అనేక సేవలను ఆన్లైన్ చేసింది. పలు సేవలను ప్రైవేట్ పరం చేసింది. కొత్తగా వాహన పటుత్వ (ఫిట్నెస్) పరీక్ష నిర్వహణ బాధ్యతలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించనుంది. ఇప్పటి వరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)పర్యవేక్షణలో నిర్వహించిన వెహికల్ ఫిట్నెస్ టెస్ట్లు ఇకపై పూర్తిగా ఆటోమెటిక్ విధానంలో జరగనున్నాయి. ఇప్పటికే కర్నూలు, నంద్యాల, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రిలో ఫిట్నెస్ టెస్ట్లను ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. కొత్తగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ఇప్పటికే విజయవాడ రూరల్ మండలం నున్న పరిధిలో టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నిత్యం రద్దీగా గన్నవరం కేంద్రం.. ట్రాన్స్పోర్ట్ హబ్గా గుర్తింపు పొందిన విజయవాడలోని రవాణా శాఖ కార్యాలయానికి అనుసంధానంగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా వాహన పటుత్వ, వాహన చోదక యోగ్యత పరీక్ష నిర్వహణ కేంద్రం నడుస్తోంది. వెహికల్ ఫిట్నెస్ పరీక్షల నిమిత్తం విజయవాడ రవాణా శాఖ పరిధిలోని వేలాది ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఇక్కడికి వస్తుంటాయి. ఈ వాహనాలకు ఎంవీఐ దగ్గర ఉండి బ్రేక్లు, ఛాసిస్, ఇంజిన్ నంబర్లు, సిగ్నల్ లైట్లు, ఇంజిన్ పనితీరు, గేర్ బాక్స్, ఎయిర్ ప్రెజర్ను వంటి విభాగాలను పరీక్షించి ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు చేస్తుంటారు. సదరు వాహనం ప్రమాదానికి గురైనప్పుడు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించిన ఎంవీఐ వెళ్లి వాహనం పరిస్థితిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ టెస్ట్లకు వచ్చే వాహనదారులు, సంబంధిత వ్యక్తులతో గన్నవరం కేంద్రం నిత్యం రద్దీగా దర్శనమిచ్చేది. ఇప్పుడు వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంతో రానున్న రోజుల్లో ఈ కేంద్రం నిరుపయోగంగా మారనుంది. బీవీఎస్ఆర్ సంస్థకు కాంట్రాక్టు.. వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ కాంట్రాక్ట్ను బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ వాహన పటుత్వ పరీక్షల నిర్వహణ నిమిత్తం నున్న సమీపంలోని వికాస్ కళాశాలకు వెళ్లే రోడ్డులో సెంటర్ను సిద్ధం చేసింది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తిచేసింది. ఎంవీఐలతో సంబంధం లేకుండా పూర్తిగా కంప్యూటరైజ్డ్ విధానంలో యంత్రాల సహాయంతో వెహికల్ ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించనుంది. సదరు టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీచేయనున్నారు. అయితే ప్రైవేట్ సంస్థల పర్యవేక్షణలో జరిగే వాహన పటుత్వ పరీక్షలకు ఎంత వరకు కచ్చితత్వం ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ సంస్థ చేతికి వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ బాధ్యతలు ఎంవీఐ పర్యవేక్షణలో మాన్యువల్ పరీక్షలకు స్వస్తి ఆటోమేటిక్ విధానంలో నిర్వహణకు ఏర్పాట్లు విజయవాడ రూరల్ పరిధిలోని నున్న వద్ద కేంద్రం ఏర్పాటు -
యోగాంధ్ర స్ట్రీట్గా బీఆర్టీఎస్ రోడ్డు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రెండుకోట్ల మందికి యోగాలో ప్రవేశం లక్ష్యంతో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 21 విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో రోజూ ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంట ల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డులోని శారదా కళాశాల జంక్షన్ వద్ద ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమం జరిగింది. ఇందులో కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు పాల్గొని యోగాసనాలను సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మనిషి జీవన నాణ్యతను పెంచేందుకు, శ్రేయస్సుకు యోగా గొప్ప మార్గమని వివరించారు. ఇతివృత్తం ఆధారిత యోగా సెషన్లతో పాటు వివిధ పర్యాటక ప్రాంతాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ట్రైనర్లు, పౌరుల రిజిస్ట్రేషన్కు ఏర్పాటు చేస్తున్నామని.. ఈ నెల రోజుల పాటు యోగాసనాల అభ్యసనతో పాటు ఆసనాల ప్రదర్శన, సూర్య నమస్కార్, ప్రాణాయామ ప్రదర్శన, గ్రూప్ యోగా, ఆర్టిస్టిక్ యోగా.. ఇలా వివిధ విభాగాల్లో పోటీలు కూడా నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ మరో ముగ్గురిని యోగాచరణ దిశగా ప్రోత్సహించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. మన చారిత్రక సంపదను సద్వినియోగం చేసుకోవాలి.. యోగా అనేది భారతీయ వారసత్వ, చారిత్రక సంపద అని.. ఈ సంపదను సద్వినియోగం చేసుకొని.. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు కావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర అన్నారు. యోగా అభ్యసనను ఏ ఒక్క రోజుకో పరిమితం చేయకుండా జీవితాంతం ప్రతిరోజూ యోగాను ఆచరించడం వల్ల కొత్త ఉత్తేజంతో మంచి ఫలితాలు సాధించొచ్చని పేర్కొన్నారు. విజయవాడ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీనాథ్ రెడ్డి, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 21 వరకు రోజూ ఉదయం ప్రత్యేక యోగా కార్యక్రమాలు వివరాలు వెల్లడించిన కలెక్టర్ జి.లక్ష్మీశ -
కాసుల వేటలో నేతలు
బదిలీలు షురూ.. ● ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం చర్యలు ● అనువైన స్థానాల్లో చోటు కోసం ఉద్యోగుల పాట్లు ● నేతల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు ● సిఫార్సు లేఖల కోసం పడిగాపులు ● అందిన కాడికి దండుకునే పనిలో నేతలు కంకిపాడు: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బదిలీలకు వచ్చే నెల 2వ తేదీ వరకూ అవకాశం ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఉద్యోగులు తమకు అనువైన ప్రాంతాల్లో పోస్టు దక్కించుకోవటం కోసం నానా పాట్లు పడుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, కూటమి నేతల మెప్పుతో పోస్టింగులను పదిలం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సందట్లో సడేమియాగా ముఖ్య ప్రజాప్రతినిధులు తమ చేతికి మట్టి అంటకుండా ‘షాడో’లతో సిఫార్సులు అందిస్తున్నారు. ముఖ్యనేతలతో పాటు షాడోలు చక్రం తిప్పుతూ అందిన కాడికి కొమ్ము కాస్తూ పరిస్థితులను చక్కబెట్టుకుంటున్నారు. పెద్ద ఎత్తున పైరవీలు జిల్లా వ్యాప్తంగా 4115 మంది ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. రెండేళ్లు నిండిన వారు బదిలీలకు అర్హత కాగా, ఐదేళ్లు నిండిన వారు తప్పనిసరిగా బదిలీ కావాలని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు జిల్లాలో సగానికి పైగా ఉద్యోగులకు స్థానచలనం కలుగుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న సెమీ అర్బన్ ప్రాంతాల్లో పోస్టుల కోసం ఉద్యోగులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం వారి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పెద్ద ఎత్తున పైరవీలు చేసుకుంటున్నారు. చేతికి మట్టి అంటకుండా.. గత అనుభవాలతో కూటమి నేతలు జాగ్రత్త పడుతున్నారు. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధులు తమ చేతికి మట్టి అంటకుండా ‘షాడో’లను రంగంలోకి దించారు. ఎక్కడికక్కడ మండల స్థాయిలో క్యాంపులు తెరిచారు. సచివాలయ ఉద్యోగుల నుంచి వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల వరకూ ఆ క్యాంపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. బదిలీలకు సమయం మించి పోతుందనే కారణంతో సిఫార్సు లేఖల కోసం తిరుగుతున్నారు. తమకు అనుకూలమైన అధికారులను, సిబ్బంది తమ తమ నియోజకవర్గాల్లో కొలువుదీరేలా నేతలు సైతం కుస్తీ పడుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి వరకూ అందరికీ గులాం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చోటా మోటా నేతలు కూడా సిఫార్సు లేఖలు ఇప్పిస్తామంటూ ఉద్యోగులను ఆకట్టుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కార్యదర్శి సీటు కోసం గ్రామ స్థాయి నేతలకు లకారం వరకూ ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. మండల స్థాయి పోస్టులకు ఎంత మేరకు బేరం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఏరియాలకూ డిమాండ్ అధికంగా ఉంటోంది. ఆ మేరకే ‘షాడో’ నేతలు తమకు అనుకూలం అని చెప్పుకుంటూనే లెక్కలు సరిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేతల కులపోకడ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో భాగంగా ఇచ్చే సిఫార్సుల విషయంలో నేతలు కులపోకడ వదలటం లేదు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ ప్రాభల్యం ఉన్న ప్రాంతాల్లో తమ వారు అయితేనే లేఖలు అంటూ బాహాటంగా చెబుతుండటం ఉద్యోగ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. అర్హతలతో పాటుగా పని విధానం, సిన్సియార్టీ చూడకుండా కేవలం కులాన్ని చూడటం ఏంటంటూ పెదవి విరుస్తున్నారంటే నేతల వ్యవహారశైలి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు బదిలీల్లో గత ప్రభుత్వంలో తమకు తీరని అన్యాయం జరిగిందనే వాదనను నిస్సిగ్గుగా లేవనెత్తుతున్న పరిస్థితి. బలవంతంగా తమను ఇక్కడి నుంచి బదిలీ చేశారంటూ కొందరు కూటమి నేతలను ప్రసన్నం చేసుకుని పోస్టులను పదిలం చేసుకుంటున్నారు. కొందరు అధికారుల వల్ల తమ పనులు ఏవీ నెరవేరలేదంటూ సాగనంపే పనిలోనూ నేతలు ఉన్నారు. తమకు అన్యాయం జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. -
ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ ఈఏపీసెట్ పరీక్షల్లో భాగంగా ఇంజినీరింగ్ స్ట్రీమింగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నిర్వహించారు. బుధవారం నుంచి ఇంజినీరింగ్ విభాగం ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. జిల్లాలో 12 కేంద్రాల్లో 7,816 మంది విద్యార్థు లకు 7,328 మంది పరీక్షలు రాశారు. కృష్ణాజిల్లాకు మూడు కేంద్రాల్లో 1,009 మంది విద్యార్థులకు 973 మంది హాజరయ్యారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కోనేరుసెంటర్(మచిలీపట్నం): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో బుధవారం యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అధ్యాపకులు, విద్యార్థులతో యోగా గురువులు ఆసనాలు వేయించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వీసీ రాంజీ మాట్లాడుతూ.. యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి ఆరోగ్యవంతు లుగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్.ఉష, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ రెజ్లింగ్ పోటీలకు నిహారిక, కుమార్ విజయవాడస్పోర్ట్స్: అండర్ –17 జాతీయ రెజ్లింగ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఆంధ్ర ప్రదేశ్ జట్టులో విజయవాడ క్రీడాకారులు బి. నిహారిక, బి.కుమార్ చోటు దక్కించుకున్నారని ఎన్టీఆర్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఇన్చార్జి కార్యదర్శి డి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఇటీవల చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు హరియాణా రాష్ట్రంలోని పల్వాల్లో జరిగే జాతీయ పోటీల్లో నిహారిక 36–40 కిలోల విభాగం, కుమార్ 41–45 కిలోల విభాగంలో ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ‘ఉపాధి’లో ఉచితంగా పండ్ల తోటల పెంపకం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులు ఉచితంగా పండ్ల తోటల సాగు చేపట్టొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించి, సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశిం చారు. కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటలు, పశుగ్రాసం పెంపకా నికి సంబంధించిన సమాచారంతో కూడిన కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందన్నారు. ఉపాధి పథకం ద్వారా ఉచితంగా ఉద్యాన పంటల సాగు చేపట్టొచ్చని పేర్కొన్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి, ఆయిల్పామ్, ఆపిల్ బేర్, మునగ, మల్లి, గులాబీ వంటి తోటల పెంపకానికి ఐదెకరాల లోపు పొలం ఉన్న చిన్న, సన్నకారు రైతులు అర్హులని తెలిపారు. సొంత భూమి ఉండి పశుపోషణ చేస్తున్న రైతులు పశుగ్రాసం పెంపకం చేపట్టవచ్చన్నారు. ఆసక్తిగల రైతులు ఎంపీడీఓ లేదా ఉపాధి హామీ ఏపీఓ లేదా గ్రామ సచివా లయ ఉద్యాన అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.రాము, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఏడీఏ అనిత, డ్వామా జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ కె.ఉష తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు అకాల కష్టం
● పసుపు, మొక్కజొన్న రైతులకు కోలుకోలేని దెబ్బ ● ధర లేక ఇప్పటికీ కల్లాల్లోనే ఉన్న పంట దిగుబడులు ● ఆపై వెంటాడుతున్న అకాల వర్షాలు కంకిపాడు: అకాల వర్షం కృష్ణా జిల్లా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చిన పంటను కాపాడుకోవటానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. పండిన పంట వర్షానికి దెబ్బతినకుండా సంరక్షించుకోవడానికి రైతులు నానా పాట్లు పడు తున్నారు. ధర లేక కల్లాలు, ఖాళీ స్థలాల్లోనే పంట ఉత్పత్తులు రాశులుగా పోసి ఉండటంతో రైతుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. వర్షాల వల్ల మార్కెట్ ధరపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు, మొక్కజొన్నకు తప్పని నష్టం ఈ సీజన్లో మొక్కజొన్న, పసుపు రైతులకు అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలతో పాటుగా లంక ప్రాంతాల్లో సాగు చేసిన మొక్క జొన్న పంట ఇంకా కల్లాల్లో రాశులు, పంట చేను మీద ఉంది. గాలులు, భారీ వర్షానికి చాలా చోట్ల పంట నేలవాలిపోయింది. మొక్కజొన్న కండెలు వర్షానికి తడిచిపోవ టంతో నాణ్యత దెబ్బతింది. రాశులు మీద ఉన్న గింజలు వర్షానికి నాను తున్నాయి. జిల్లాలో 5,031 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. రైతులు కొమ్ములను ఉడకబెట్టి ఎండబెట్టారు. పూర్తి స్థాయిలో ఎండబెట్టి మార్కెట్కు తరలించే క్రమంలో విడవకుండా పడుతున్న వర్షాలకు పంట నాణ్యత దెబ్బతింటోంది. కొమ్ములు కటిక (నలుపు) వస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా అటు మొక్కజొన్న, ఇటు పసుపు కొమ్ములను సంరక్షించుకోవడానికి రైతులు నిత్యం కల్లాలు, ఖాళీ వెంచర్లలో పంట మధ్యే గడుపుతున్న దుస్థితి. చినుకు పడితే పరదాలు కప్పటం, తెరపివ్వగానే ఎండ పొడకు పంటను ఎండబెట్టే పనుల్లో నిమగ్నం కావాల్సిన పరిస్థితి. ధరపై దిగులు ఈ విపత్కర పరిస్థితుల్లో మార్కెట్ ధరపై రైతులు దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం క్వింటా మొక్కజొన్న రూ.2 వేల నుంచి రూ.2100 వరకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. వదలకుండా పడుతున్న వానలకు గింజ నాణ్యత దెబ్బతింటే ధర మార్కెట్లో పతనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. మరో వైపు ఎకరాకు 25 క్వింటాళ్లు వరకూ ఎండు పసుపు కొమ్ముల దిగుబడి వస్తున్న విషయం తెలిసిందే. క్వింటా ధర రూ.11,500 వరకూ పలుకుతోంది. వానల వల్ల కొమ్ములు నలుపు వచ్చినా, నాణ్యత దెబ్బతిన్నా ధర తగ్గుతుందనే ఆందోళన రైతులను కలవరపెడుతోంది. అకాల వర్షాలకు తీవ్ర నష్టం 1.5 ఎకరాల్లో మొక్కజొన్న, 70 సెంట్లలో పసుపు సాగు చేశాను. మొక్కజొన్న పూర్తిగా పడిపోయింది. చేలోనే పంట ఉండిపోయింది. ఎంత వస్తుందో దిగుబడి, ఎంత ధర వస్తుందో కూడా తెలియదు. పసుపు పంట ఎండబెట్టి మార్కెట్కు పంపుదామని చూస్తూంటే రోజూ వర్షమే. తడవటం, ఆరబెట్టడం ఇదే పనిగా మారింది. ఈ ఖర్చులే ఇప్పటి వరకూ రూ.10 వేలు అయ్యాయి. ఈ సీజన్లో వానల వల్ల పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు. – చెన్ను బాబూజీ, కౌలురైతు, గొడవర్రు అధికారులకు పట్టడంలేదు ఎకరంన్నరలో మొక్కజొన్న, ఎకరంన్నరలో పసుపు సాగు చేశాను. మొక్కజొన్న చేను పడిపోయి నష్టం జరిగిందని అధికారుల వద్దకు వెళ్లాను. పంట తీసుకొచ్చి చూపండని చెప్పారే కానీ వారు వచ్చి చేను చూడటం, నమోదు చేయటం జరగలేదు. ఇంకా మా బాధలు ఏం చెప్పాలి? తరచూ కురుస్తున్న వానలకు పసుపు పంట తడుస్తోంది. కటిక వచ్చి నాణ్యత దెబ్బతింటే మార్కెట్లో ధర పడిపోయే ప్రమాదం ఉందని భయంగా ఉంది. – నూతక్కి ధనకోటేశ్వరరావు, కౌలురైతు, గొడవర్రు కన్నెత్తి చూడని అధికారులు అటు వ్యవసాయశాఖ, ఇటు ఉద్యాన శాఖ అధికారులు తమ గోడు పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న పొలంలోనే నేలవాలిన, పంటకు నష్టం జరిగినా కనీసం తమ పొలాలకు వచ్చి చూసి పంట నష్టం నమోదు చేసిన అధికారులు లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఆదేశాలతో పంట నష్టం నమోదు ప్రాథమిక అంచనాల్లో సైతం ఒక ఎకరం విస్తీర్ణంలోనూ పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ చూపకపోవటం విడ్డూరం. పసుపు పంట చేతికొచ్చాక వర్షాలకు తడిచి దెబ్బతిందని, ఈ దశలోనూ నష్టం నమోదు చేస్తే తమకు ఊరటగా ఉంటుందని రైతులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను అకాల వర్షాలు విడవటం లేదు. రబీ సీజన్లో వరి, పసుపు, మొక్కజొన్న, మినుము ఇతర పంటలు చేతికొచ్చింది మొదలు అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఆ శాఖ అంచనా మేరకు కృష్ణా జిల్లాలో 54 హెక్టార్లలో పంట దెబ్బతింది. వీటిలో ప్రధానంగా అరటి, తమలపాకు, బొప్పాయి, కూరగాయల పంటలు ఉన్నాయి. తాజాగా ద్రోణి ప్రభావంతో వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అతి కష్టం మీద ధాన్యాన్ని ఆర్ఎస్కేలు, బయటి వ్యాపారుల ద్వారా మిల్లులకు తరలించి రైతులు సొమ్ము చేసుకోగలిగారు. -
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును రక్షించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్రంపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో విశాఖ ఉక్కు రక్షణకు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సంఘీభావంగా వామపక్ష పార్టీలు బుధవారం ధర్నా చేశాయి. బీజేపీ డౌన్ డౌన్.. విశాఖ ఉక్కును కాపాడుకుందాం అంటూ ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ధర్నాలో సీపీఎం రాష్ట్ర దర్శివర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు, కార్యవర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ప్రసంగించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రయత్నాలను కొనసాగిస్తోందన్నారు. ఇందులో భాగంగానే దఫదఫాలుగా వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించిందన్నారు. పర్మనెంటు కార్మికులు 1400 మందిని తగ్గిస్తోందన్నారు. ఎనిమిది నెలల నుంచి కార్మికులకు సగం జీతాలే చెల్లిస్తోందని వివరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకుండా కేంద్రం మోసం చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లే ప్రకటించి బ్యాంకుల బకాయిల రూపంలో తిరిగి జమ చేసుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు కార్మికులు, ప్రజలు పోరాడుతుంటే వారిని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అణిచివేస్తోందన్నారు. కార్మి కుల తొలగింపు చర్యలు మానుకోవాలన్నారు. సీఐటీయూ నాయకులు ఎ.వి.నాగేశ్వరరావు, కె.దుర్గారావు, ఎన్.సీహెచ్.శ్రీనివాసరావు, మూలి సాంబశివ రావు, డి.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
● బీడీసీ గండ్ల వద్ద కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు వర్షాలతో ఆటంకం ● పనుల కోసం జరిగిన తవ్వకాలతో ప్రమాదకరంగా బీడీసీ ఎడమ కట్ట ● కొద్దిపాటి వర్షం పడినా వరదంతా విజయవాడ వైపు తరలే ప్రమాదం జి.కొండూరు: ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. గతేడాది ఎన్టీఆర్ జిల్లాలో జల ప్రళయానికి కారణమైన బుడమేరు డైవర్షన్ కెనాల్ గండ్ల వద్ద కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల్లో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. వేసవి చివరిలో గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అడుగడుగునా బ్రేక్లు పడి పనులు ముందుకు సాగడంలేదు. ఈ పనుల కోసం జరిగిన తవ్వకాలతో డైవర్షన్ కెనాల్ కట్ట ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. భారీ వర్షం పడితే మైలవరం నియోజకవర్గంలో కురిసిన ప్రతి వర్షపు బొట్టు విజయవాడ వైపు తరలిపోయి మరో జల ప్రళయం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. వరద నివారణ చర్యల్లో ప్రభుత్వ పని తీరును చూసి ఇదేనా విజన్ బాబూ అంటూ స్థానికులు విస్తుపోతున్నారు. ఎనిమిది నెలలుగా కాలయాపన గతేడాది ఆగస్టు 30వ తేదీ రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వరద పోటెత్తి జల ప్రళయాన్ని సృష్టించిన సంగతి విదితమే. ఈ ప్రళయానికి కారణం కూడా ప్రభుత్వ నిరక్ష్యమే కారణమని అప్పట్లో విమర్శలు తలెత్తాయి. ఈ వరదలకు ప్రధాన కారణమైన బుడమేరు డైవర్షన్ కెనాల్ గండ్లను అప్పట్లో మిలటరీ సాయంతో ప్రభుత్వం తాత్కాలికంగా పూడ్చింది. అయితే ఈ గండ్ల వద్ద కాంక్రీటు వాల్ నిర్మించకపోతే మరో సారి గండ్లు పడే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ నిపుణులు తేల్చారు. అయినప్పటికీ కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల కోసం నిధులను కేటాయించ డంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. గండ్లు పడిన ఆరు నెలల తర్వాత మార్చి 21న హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులకు రూ.1.80 కోట్లు, డైవర్షన్ కెనాల్కు గండ్లు పడిన ప్రదేశంలో ఎడమ వైపు 500 మీటర్లు, కుడి వైపు 50 మీటర్ల కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల కోసం రూ.37.97 కోట్ల కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ నిధుల్లో రూ.28 కోట్లతో గోడ నిర్మాణ పనుల కోసం 54 రోజుల తర్వాత మే 15వ తేదీన శంకుస్థాపన చేశారు. ఈ పనులు నిరంతరాయంగా కొనసాగితే మూడు నెలల్లో కాంక్రీట్ గోడ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే వర్షాలు పడుతున్న నేపథ్యంలో వచ్చేది కూడా వర్షా కాలం కావడంతో పనులు ముందుకు సాగే అవకాశం కనిపించడంలేదు. వర్షంతో పనులకు బ్రేక్ బుడమేరు డైవర్షన్ కెనాల్కు జి.కొండూరు మండల పరిధి కవులూరు, కొండపల్లి శాంతినగర్కు సమీపంలో కట్టకు ఎడమ వైపు మూడు గండ్లు పడిన ప్రదేశంలో కాంక్రీట్ గోడ నిర్మాణం కోసం కట్టను తవ్వి పనులు ప్రారంభించారు. ఎగువ నుంచి నీరు దిగు వకు రాకుండా ఈ ప్రదేశంలో కెనాల్కు అడ్డంగా ఆనకట్ట కట్టారు. అయితే రెండు రోజులుగా భారీగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఈ కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు ప్రారంభంలోనే బ్రేక్ పడింది. కాలువ కట్ట బురదమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి పనులు ముందుకు సాగడంలేదు. కెనాల్ ఎగువున నిల్వ ఉన్న నీటి నుంచి ఊట వస్తుండటంతో ట్రాక్టరు ఇంజిన్లతో నీటిని తోడే ప్రక్రియను ప్రారంభించారు. మరో వైపు నైరుతి రుతుపవనాలు కూడా మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉండడంతో ఇప్పటికే కృష్ణాజిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టడం లేదా కట్టను తవ్విన ప్రదేశంలో గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం గండ్లు పడిన తర్వాత ఎనిమిది నెలలుగా కాలయాపన చేసిన ప్రభుత్వం, వర్షాకాలం ఆరంభానికి ముందు పనులను ప్రారంభించింది. ప్రస్తుత అకాల వర్షాలతో పనులకు బ్రేక్ పడుతోంది. కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల కోసం బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపు మూడు గండ్లు పడిన ప్రదేశంలో కట్టను తవ్వడంతో పాటు ఇక్కడ ఉన్న సైపన్ ఎత్తు పెంచేందుకు కట్టను కింద వరకు తవ్వారు. దీంతో ఈ ప్రాంతం ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఎగువ బుడమేరుకు పడిన గండ్లు, మైలవరం నియోజకవర్గంలో చెరువులకు పడిన గండ్లను కూడా ఇప్పటి వరకు పూడ్చకపోవడంతో ఒక వేళ రాత్రి సమయంలో భారీ వర్షం కురిస్తే వరదంతా నేరుగా విజయవాడ వైపు తరలిపోయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే ప్రమాదం ఉంది. వర్షంతో పనులకు ఆటంకం బుడమేరు డైవర్షన్ కెనాల్కు గండ్లు పడిన ప్రదేశంలో కాంక్రీట్ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ పనులకు వర్షం అడ్డంకిగా మారింది. రోజూ వర్షం పడడం వల్ల పనులు ముందుకు సాగడంలేదు. ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటే పనులను ప్రారంభించి చకచకా చేయిస్తున్నాం. పనులు జరుగుతున్న ప్రాంతంలో కట్ట బలంగానే ఉంది. వరద ప్రవాహం వల్ల గండ్లు పడే అవకాశం ఉండదు. – పి.కౌశిక్, పోలవరం కాలువ ఏఈఈ, వెలగలేరు -
వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పటమట(విజయవాడతూర్పు): అనారోగ్యానికి గురై చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో నిరుపేదలు వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులకు వస్తారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం దైవ సేవతో సమానమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించడంలో ప్రభుత్వాస్పత్రిని అగ్రస్థానంలో నిలపాలని, టీమ్ జీజీహెచ్ స్ఫూర్తితో పనిచేయా లని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్డీఎస్) సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వాస్పత్రిలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించి, పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయా లన్నారు. ఇటీవల ప్రభుత్వాస్పత్రుల పనితీరుపై ప్రభుత్వం సేకరించిన ప్రజాభిప్రాయ నివేదిక ప్రకారం విజయవాడ సర్వజనాస్పత్రికి ఇచ్చిన నివేదికలో వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యం, అవినీతి రహిత సేవలు ఆశించిన స్థాయిలో లేకపోవడం బాధాకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఆదర్శవంతమైన ఆస్పత్రిగా జీజీహెచ్ను తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషిచేయా లని సూచించారు. ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ డీఎంఈ డాక్టర్ వెంకటేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్కుమార్, ఆర్ఎంఓలు డాక్టర్ పద్మావతి, డాక్టర్ మంగాదేవి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నాగార్జున, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఆమోదం పొందిన అంశాలు ఇవీ.. పల్మనరీ మెడిసిన్ డిపార్టుమెంటుకు రూ.5.17 లక్షలు, గైనకాలజీ డిపార్టుమెంటుకు రూ.4.50 లక్షలు, మైక్రోబయాలజీ డిపార్టుమెంటుకు రూ.10.90 లక్షలు, ఈఎన్టీ డిపార్టుమెంటుకు రూ.3 లక్షలు, డీవీఎల్ డిపార్టుమెంటుకు రూ.2.82 లక్షలు, ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్టుమెంటుకు రూ.3.74 లక్షలతో వివిధ సౌకర్యాలు కల్పించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. పాత, కొత్త జీజీహెచ్లతో పాటు పీఎంఎస్ఎస్వై బ్లాక్లో రూ.4.50 లక్షలతో పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ఏర్పాటుకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. ఓపీ కౌంటర్ల క్యూబికల్స్ కోసం రూ.లక్షతో పనులు చేపట్టేందుకు, ఆర్థోపెడిక్ డిపార్టుమెంట్లో దాదాపు రూ.3 లక్షలతో అవసరమైన సౌకర్యాల కల్పనకు కూడా ఆమోదం తెలిపారు. -
యోగాంధ్ర మాసోత్సవాలు ప్రారంభం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో యోగాను ఒక భాగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సూచించారు. భారతీయ వారసత్వ, ప్రాచీన సంపదను అందరికీ అందించాలన్నదే యోగాంధ్ర ఉద్దేశమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యాన బుధవారం విజయవాడ భవానీపురంలోని పున్నమిఘాట్లో యోగాంధ్ర మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమం జరిగింది. యోగా ట్రైనర్ రామాంజనేయులు యోగా ప్రయోజనాలతోపాటు పతంజలి యోగా సూత్రాలను వివరిస్తూ ఆసనాలు చేయించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ యోగా నిపుణులు రూపొందించిన 45 నిమిషాల కామన్ యోగా ప్రొటోకాల్ ఆధారంగా ఔత్సాహికులకు శిక్షణ ఇస్తా మని తెలిపారు. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లా డుతూ.. నెల రోజుల యోగాంధ్రలో భాగంగా గ్రామ/వార్డ్ సచివాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బాపూ మ్యూజియం, కొండపల్లి ఖిల్లా, గాంధీ హిల్ వంటి చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. యోగా విశిష్టతపై రాష్ట్రం నలుమూలల యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, మునిసిపల్ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ రామత్లేహి తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 512.60 అడుగుల వద్ద ఉంది. ఇది 136.1274 టీఎంసీలకు సమానం. మున్సిపల్ కార్మికుల ఆందోళనవిజయవాడ ధర్నా చౌక్లో మున్సిపల్ కార్మి కులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని కార్మికులు తేల్చిచెప్పారు. నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్కు చెందిన ఎం.పద్మారావు కుటుంబం బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించింది. – 8లో7 -
మసుల ఫెస్ట్ వేడుకలను విజయవంతం చేస్తాం
● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు ● అధికారులతో కలిసి మసుల ఫెస్ట్ ఏర్పాట్ల పరిశీలన ● ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు, సలహాలు జారీకోనేరుసెంటర్: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో వచ్చే నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న మసుల ఫెస్ట్ను విజయ వంతం చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు అన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించనున్న జల క్రీడలు, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలను అందరి సమన్వయంతో సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. బుధవారం ఆయన మంగినపూడి బీచ్ను సందర్శించి అక్కడి ఏర్పాట్లకు సంబం ధించి అధికారులతో చర్చించారు. అనంతరం జల క్రీడలు నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. క్రీడలను వేల సంఖ్యలో ప్రజలు వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలు, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టం, ప్రమాదాలు జరగకుండా రక్షణ వలయాలు పకడ్బందీగా చేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కెనోయింగ్, కయా కింగ్ వంటి జల క్రీడలు, బీచ్ కబడ్డీ, వాలీబాల్ వంటి పోటీలు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ ఉత్సవాలకు మసుల ఫెస్ట్–25గా నామకరణం చేశామని, త్వరలో డాల్ఫిన్ లోగోను ఆవిష్కరిస్తామన్నారు. మత్స్యకారులకు గుర్తుగా ఈ చిహ్నాన్ని మలిచారన్నారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సాంస్కృతిక, పర్యాటక రంగాలలో ఉన్న ప్రముఖులను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ సాయిబాబు, డీఎస్డీఓ ఝాన్సీలక్ష్మి, విజయవాడ క్రీడల అధికారి కోటేశ్వరరావు, తహసీల్దార్ హరినాథ్, జల క్రీడల జిల్లా అధ్యక్షుడు దావులూరి సురేంద్రబాబు, ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. -
కాలుష్యం కోరల్లో కృష్ణమ్మ
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంకృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రకృతి ప్రసాదించిన జీవనది కృష్ణమ్మకు కష్టాలు వచ్చి పడ్డాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఓ వైపు మురుగునీరు, పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నదీ జలాలు కలుషితమవుతుంటే మరోవైపు భవన శిథిలాలు, మట్టితో కృష్ణానది పరివాహక ప్రాంతం పూడ్చివేతకు గురవుతోంది. రాణిగారితోట, 18వ డివిజన్లో వారధి వెంబడి ఉన్న ర్యాంప్ ద్వారా కొందరు ఇష్టారాజ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను ట్రాక్టర్లు, ఆటోల, ఇతర వాహనాల ద్వారా నదీగర్భంలోకి తరలించి డంప్ చేస్తుండగా సాక్షాత్తు ప్రభుత్వ అభివృద్ధి పనులు చేసే ఓ కాంట్రాక్టర్ కూడా టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా మట్టిని నదిలోకి తొలి పూడ్చివేతకు పాల్పడుతున్నారు. కృష్ణానదిలో ఇసుక తిన్నెలతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఎటువంటి ఆక్రమణ లు గానీ, వ్యర్థాలు గానీ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ సంబంఽధిత అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తుండడంపై పలు విమర్శలొస్తున్నాయి. కాలువలు, చెరువుల్లో పూడిక తీయాలని ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తుంటే ఇక్కడ అధికారులు మాత్రం కృష్ణానదిని వ్యర్థాలతో నింపి పూడ్చే దిశగా ప్రయత్నం చేస్తుండడం శోచనీయం. కృష్ణానదిపై పర్యవేక్షణ లోపించటం వలనే పూడ్చివేతకు గురవుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో, నదీగర్భంలో ఎలాంటి చెత్తాచెదారం, భవన శిథిలాలను వేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు వాటిని అతిక్రమించి రేయింబగళ్లూ తేడా లేకుండా ట్రాక్టర్లు, ఆటోల ద్వారా నదిలో డంప్ చేస్తూ కృష్ణానదిని డంపింగ్ యార్డుగా మార్చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల రాణిగారితోట, 18వ డివిజన్, సిమెంట్ గోడౌన్స్లో ఓ కాంట్రాక్టర్ నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. తానేం తక్కువ కాదన్నట్లు నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వగా వచ్చిన మట్టిని టిప్పర్ల ద్వారా నదీగర్భంలోకి తరలించి వారధి పక్కన, రిటైనింగ్ వాల్ వెంబడి డంప్ చేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దాదాపు 50 టిప్పర్ల వరకు మట్టిని నదిలోకి తరలించారని, అందుకు అధికారుల సహకారం ఉన్నట్లు సమాచారం. కృష్ణానది పూడ్చి వేతకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వలన నదిలో వ్యర్థాలు పేరుకుపోయి రాబోయే రోజుల్లో నదీజలాలు అడుగంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికై నా అధికారులు స్పందించి నదీ గర్భ పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి నదీగర్భంలో వ్యర్థాలు వేయరాదని నిబంధనలు ఉన్నా కాంట్రాక్టర్ ఎవరి అండ చూసుకుని టన్నుల కొద్దీ మట్టిని నదిలోకి తరలించాడో చెప్పాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్తోనే నదిలో నుంచి మట్టిని తొలగించేందుకు చర్యలు చేపట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలని, నదులను సంరక్షించే బాధ్యతను అధికారులు సక్రమంగా నిర్వర్తించాలని కోరుతున్నారు. రక్షణగా గేటు ఏర్పాటు చేస్తాం డంపింగ్ యార్డులా తయారైన కృష్ణానది వ్యర్థాలు, మట్టికుప్పలతో నింపేస్తున్న వైనం కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యం చోద్యం చూస్తున్న వీఎంసీ అధికారులు కృష్ణానదిలో వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకుంటాం. వాటర్ ట్యాంక్ నిర్మాణంలో భాగంగా వచ్చిన మట్టిని కాంట్రాక్టర్ కృష్ణానదిలో వేసినట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని పరిశీలించి నోటీసులిస్తాం. అక్కడ నుంచి మట్టి కుప్పలను కాంట్రాక్టర్ తోనే తొలగింపచేసేందుకు చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా నదిలోకి ఎవరూ వెళ్లకుండా పటిష్ట చర్యలు చేపడతాం. రెండు మూడు నెలల్లో రక్షణగా గేటును ఏర్పాటు చేస్తాం. –సామ్రాజ్యం, వీఎంసీ ఈఈ (సర్కిల్–3) -
దుర్గమ్మ సేవలో మంత్రి అచ్చెన్నాయుడు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయ వాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. పెనమలూరు సర్పంచి 3 నెలలు సస్పెన్షన్ పెనమలూరు: పెనమలూరు సర్పంచి లింగాల భాస్కరరావును మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. పెనమలూరు గ్రామం పల్లిపేటలో నిబంధనలకు విరుద్ధంగా 15వ ఆర్థిక సంఘ నిధులు, రూ.55,25,112, గ్రామ పంచాయతీ సాధారణ నిధులతో పల్లిపేటలో సీసీ రోడ్డు వేశారని డీఎల్పీవో విచారణలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ నిధులు రూ.63,42,912 సర్పంచి భాస్కరరావు, పూర్వ పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు అభ్యంతరకరంగా ఖర్చు చేశారని డీపీఓ నివేదిక ఇచ్చారు. దీంతో ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచి భాస్కరరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉపసర్పంచి శీలం సుమతికి సర్పంచి బాధ్యతలు అప్పగించారు. చెక్ పవర్ ఉప సర్పంచితో పాటు డెప్యూటీ మండల పరిషత్ అధికారికి కౌంటర్ సంతకం చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
సంక్షేమం గాలికి.. కక్ష సాధింపే లక్ష్యంగా...
కూటమి పాలనపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపాటు అవనిగడ్డ: సంక్షేమ పఽథకాలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా పాలన సాగిస్తోందని విజయవాడ సెంట్రల్ మాజీ శాసన సభ్యుడు మల్లాది విష్ణు విమర్శించారు. అవనిగడ్డ మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్బాబు స్వగృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కరెంట్ని రూ.2.40కి కొనుగోలు చేస్తూ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడున్న కూటమి పార్టీలు నానా యాగీ చేశాయన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే కరెంట్ని రూ.4.60కు ఎలా కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కృష్ణాజిల్లాలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేవారు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో చాలా చోట్ల రైతులు కల్తీ విత్తనాలతో నష్టపోయినా, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మల్లాది విమర్శించారు. ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన టీడీపీ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని, అందుకు తిరువూరు ఘటనే నిదర్శన మన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించినా బుద్ధి తెచ్చుకోవడం లేదన్నారు. అన్ని పన్నులు పెంచేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు, నిత్యావరసర వస్తువులు, నీటి పన్నులు, ఇలా అన్నీ పెంచేశారని, ఇప్పుడు తాజాగా ఆస్తి పన్ను పెంచేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. ప్రజాసమస్యలపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు రాజనాల మాణిక్యాలరావు, గరికపాటి కృష్ణారావు పాల్గొన్నారు. -
కృష్ణా నదిని డంపింగ్ యార్డులా చేస్తున్నారు
కొందరు వ్యక్తులు బిల్డింగ్ మెటీరియల్, ఇతర వ్యర్థాలను వాహనాల్లో తరలించి నదిలో కలుపుతున్నారు. వారధి వద్ద, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల్లో విపరీతంగా వ్యర్థాలను నదిలో వదులుతున్నారు. కృష్ణానదిని డంపింగ్ యార్డుగా తయారుచేస్తున్నారు. పలుమార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు నదిలోకి వెళ్లకుండా అబ్జర్వర్ను గానీ, గేటు గానీ ఏర్పాటు చేయాలి. నదులను కలుషితం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. –పుప్పాల కృష్ణ, సీపీఎం తూర్పు నగర కార్యదర్శి -
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● 10,381 మంది అభ్యర్థులు, 25 పరీక్ష కేంద్రాలు ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈనెల 25న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ లక్ష్మీశ యూపీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 25 కేంద్రాల్లో 10,381 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 25న ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష జరగనుందన్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి లోకల్ ఇన్స్పెక్టింగ్ కమ్ లైజన్ ఆఫీసర్, రూట్ అధికారులు, సూపర్ వైజర్లు, స్ట్రాంగ్ రూమ్ భద్రతా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, విద్యుత్, ఏపీఎస్ఆర్టీసీ, సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఆర్డీవోలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ సలీమ్, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, లైజనింగ్ అధికారులు, సహాయ లైజనింగ్ అధికారులు, వెన్యూ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
ఎస్ఆర్ఆర్ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): నగరం నడిబొడ్డున గులాబీతోట బీఆర్టీఎస్రోడ్డు సమీపంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన రూ.300 కోట్లకు పైగా విలువచేసే 6.67 ఎకరాల స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగి, ఎంతోమంది మేధావులను దేశానికి అందించిన ఈ కళాశాల స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కాసుల కోసం కక్కుర్తి పడి అధికారులు, అధికార పార్టీ నేతలు కళాశాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ స్థలాన్ని అధికార పార్టీ నేతల అండదండలతో కాజేసేందుకు యత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే కళాశాల పూర్వ విద్యార్థులు జిల్లా కలెక్టర్, మంత్రి నారా లోకేష్ను కలిసి కళాశాల స్థలాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన నారా లోకేష్ కళాశాల స్థలాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ కళాశాల స్థలాన్ని నిషేధిత జాబితాలో పెడతామంటూ హామీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇంత వరకు ఈ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చలేదని కళాశాల విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులు నోరు మెదపకపోవటం అనుమానాలకు తావిస్తుండగా మరోపక్క ఇటీవల ఇక్కడ స్థలాన్ని కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులు భవన నిర్మాణాల ప్లాన్ల కోసం అడ్డదారులలో ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.300 కోట్ల విలువైన స్థలంపై పెద్దల కన్ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు అధికార పార్టీ నేతల యత్నం నిషేధిత జాబితాలో చేర్చాలని కోరుతున్న పూర్వ విద్యార్థులు 22(1)ఏ నిషేధిత జాబితాలో చేర్చాలి ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని ఎటువంటి లావాదేవీలు జరగకుండా 22(1)ఏ నిషేధిత జాబితాలో చేర్చాలని నగరవాసులు, కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. కళాశాల స్థలాన్ని ఎట్టి పరిస్ధితులలోను అన్యాక్రాంతం కాకుండా చూస్తామని, ఇందుకు అవసరమైతే ఎంత దూరం వెళ్లటానికై నా తాము సిద్ధంగా ఉన్నామని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు లంకా జానయ్య, కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెలగా జోషి అంటున్నారు. అసలు కోర్టులో ఉన్న కళాశాల స్థలాన్ని ఏ విధంగా క్రయ విక్రయాలు జరుపుతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కళాశాల స్థలాన్ని 22(1)ఏ నిషేధిత జాబితాలో చేర్చటంతో పాటు ఇప్పటికే ఆక్రమించిన ఆక్రమణలను కూడా తొలగించి కళాశాల అభ్యున్నతికి సహకరించాలని కోరుతున్నారు. -
కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
గుణదల(విజయవాడ తూర్పు): రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి రాజ్యాధికారమే ధ్యేయంగా ఏకపక్ష ధోరణితో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. గుణదలలోని తన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాసంక్షేమాన్ని కనుమరుగు చేసి ప్రజా స్వామ్యాన్ని హరించే దిశగా కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు తెగబడిందన్నారు. జిల్లాలోని తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం తప్పుదారి పట్టింస్తోందన్నారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ కౌన్సిలర్లకు మద్దతు ప్రకటించేందుకు వైఎస్సార్ సీపీ నాయకులం వెళ్తుండగా వంద లాది మంది టీడీపీ గూండాలు అడ్డగించారని పేర్కొన్నారు. నడిరోడ్డుపై తమ వాహనాలను నిలిపి, తమను చుట్టుముట్టి బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి రక్షణ కల్పిస్తుందని సూటిగా ప్రశ్నించారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను, ఉద్రిక్త పరిస్థితులను వేదికగా మార్చారని దుయ్యబట్టారు. ఎన్నికల అధికారులను మరోమారు కలసి తమ సమస్యను చెప్పు కొంటామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని దుర్మార్గం సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందామంటున్న కూటమి నేతలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగజారుడుతనంతో వ్యవహరించారని, ఇది దేశంలో ఎక్కడా లేని దుర్మార్గ మని ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ విమర్శించారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం నడిరోడ్డుపై దాదాగిరీ ప్రదర్శించిన కూటమి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ అభ్యర్థులకు మద్దతు ప్రకటించేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులే టీడీపీ గూండాలకు మద్దతుగా నిలవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, న్యాయం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. తిరువూరు చైర్పర్సన్ ఎన్నికపై నీచరాజకీయాలు దౌర్జన్యాలు, దాడులకుతెగబడిన టీడీపీ గూండాలు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఆస్తి పన్ను మదింపు
పెడన: పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను అసెస్ మెంట్లు పెరుగుతున్నా ఆదాయం పెరగకపోవడంపై పురపాలక శాఖ పరిపాలన విభాగం(డీఎంఏ) సీరి యస్ అయ్యింది. ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సుల్లో ఇదే విషయాన్ని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని అధికారులకు స్పష్టం చేసింది. పన్నులు వసూళ్లు చేయడంలోనే కాకుండా ఇంకా పాత రేట్లను కొనసాగిస్తున్నారంటూ మండిపడింది. ఆయా కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో అసెస్మెంట్లు పెరుగుతున్న స్థాయిలో ఆస్తి పన్నులు కూడా పెరగాల్సి ఉండగా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉందని.. తక్షణం వార్డు సచివాలయాల్లో ని అడ్మిన్లు, ఇంజినీరింగ్, ప్లానింగ్ కార్యదర్శులతో పునఃపరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సస్పెండ్ అవుతారు జాగ్రత్త.. ఆస్తి పన్నుల రూపంలో ఆదాయం వచ్చే విషయంలో మీనమేషాలు లెక్కిస్తే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డీఎంఏ స్పష్టం చేసింది. డీఎంఏ కార్యాలయం నుంచి ప్రత్యేక బృందాలు ఆస్తి పన్నులపై క్రాస్ చెక్ చేస్తాయని, ఆ సమయంలో ఏమైనా పన్నులు సక్రమంగా వేయలేదని గుర్తిస్తే మాత్రం సస్పెన్షన్కు గురికావాల్సి ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వార్డు సచివాలయాలకు చెందిన అడ్మిన్లు ఆస్తిపన్నులపై దృష్టి సారించారు. చాలా చోట్ల సిఫార్సులతోను, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కొన్ని ఇళ్లకు సక్రమంగా పన్నులు విధించడం లేదని విషయాలపై కూడా ఫిర్యాదులు డీఎంఏ కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. ఆదేశాలు నిజమే.. అసెస్మెంట్లు పెరుగుతున్నా.. ఆదాయం పెరగడం లేదని, ఆస్తి పన్నులు పునఃపరిశీలన చేయాలని డీఎంఏ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన వీసీల్లోను, టీసీల్లో ఇదే విషయమై చర్చ కూడా జరిగింది. అడ్మిన్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఆస్తిపన్నులు పెంపుదలలో బాగా వెనుకబడ్డారని తెలిపింది. గతంలో బిల్ కలెక్టర్లు ఉన్న సమయంలో పనులు సక్రమంగా జరిగేవని, ఇప్పుడు ఎందుకు ఆస్తి పన్నులు పెంచలేదని ఉన్నతాధికారులు అడిగారు. అనుమానం ఉన్న ఇంటిని కాదు, ప్రతి ఇంటినీ క్రాస్ చెక్ చేయాలని ఆదేశించారు. ఆ దిశగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. – పి.వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్,పురపాలక సంఘం, పెడన అధునాతన భవనాలు కట్టినా పాత ఇంటి బిల్లులు ఇంకా జనరేట్ అవుతున్నట్లు డీఏంఏ కార్యాలయానికి ఫిర్యాదులు చేరినట్లుగా తెలిసింది. కొత్తగా భవనాలు నిర్మించినా, మొదటి అంతస్తు వరకు పన్ను వేసి రెండు, మూడు అంతస్తులకు పన్నులు వేయకపోవడం, కాలనీలకు పన్నులు వేయకపోవడం, డాక్యూమెంట్లు సరిగ్గా లేవని పన్నులు వేయకుండా ఉండటం వంటి విషయంలో డీఎంఏ కార్యాలయం చాలా సీరియస్గా స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. తక్షణం ఇటువంటి వాటిని గుర్తించి 20 శాతం పన్ను వేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు వివరిస్తున్నారు. కొలతలు ప్రకారం పన్ను ఉందా లేక తగ్గిందా చూడాలని, ఏమాత్రం తగ్గినట్లు అనుమానం ఉన్నా తక్షణం వాటికి పన్నులు వేయాలని పేర్కొందని చెబుతున్నారు. డీఎంఏ కార్యాలయం నుంచి వెళ్లిన బృందాలకు పలు మునిసిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఈ దుస్థితి ఎదురైందని, పలువురు అడ్మిన్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంటూ హెచ్చరికలు జారీ చేసిందని వివరిస్తున్నారు. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పునఃపరిశీలన చేయాలని ఆదేశాలు అసెస్మెంట్లు పెరుగుతున్నా ఆస్తి పన్ను పెరగకపోవడంపై డీఎంఏ సీరియస్ వార్డు సచివాలయాల అడ్మిన్లు పట్టించుకోలేదని ఆగ్రహం ప్రత్యేక బృందాలు గుర్తిస్తే సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరిక పరుగులు పెడుతున్న సచివాలయ ఉద్యోగులు భవనాలు కట్టినా.. -
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కార్మికులకు శాపంగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిరసన, ధర్నా జరిగింది. కార్మికులకు శాపంగా మారిన నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని, ఎనిమిది పని గంటలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దోపిడీనే లక్ష్యంగా.. ధర్నాలో పాల్గొన్న ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఈ నాలుగు లేబర్ కోడ్లకు రూపకల్పన చేసి ప్రవేశపెట్టిందని విమర్శించారు. కార్పొరేట్లు యథేచ్ఛగా దోపీడీ కొనసాగించడమే కాకుండా కార్మికుల శ్రమను దోచుకునేందుకు కోడ్లు తెచ్చిందని మండిపడ్డారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు, చట్టాలు కనుమరుగవుతున్నాయన్నారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతోందన్నారు. కార్మికుల జీతభత్యాలు సక్రమంగా అందవని, ఉద్యోగాలు తొలగింపు తీవ్రతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించినా, సమ్మె చేసినా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, తిరిగి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సంక్షోభంలో వ్యవసాయం.. నూతన మార్కెట్ విధానం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుంటుందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ధర్నాలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె. దుర్గారావు, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలీ సాంబశివరావు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు వీఎల్ నరసింహులు, ఏ వెంకటేశ్వరరావు, ఏ కమల, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వెంకటసుబ్బయ్య, కేఆర్ ఆంజనేయులు, ఏఐయూటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుధీర్, ఏఐసీసీటీయూ రాష్ట్ర నాయకులు ఉదయ్ కుమార్, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ, శంకర్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్ -
అమ్మ భూమిపై విచారణలో జాప్యం
కంకిపాడు: అమ్మవారి భూమి అన్యాక్రాంతం వ్యవహారం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. భూ ఆక్రమణ వ్యవహారం వెలుగులోకి వచ్చి రోజులు గడిచిపోతున్నా విచారణ పేరుతో కాలయాపన జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవదాయశాఖ అధికారులు ఇంకా విచారణ సాగిస్తున్నారు. రెవెన్యూ రికార్డులతో పాటుగా కన్యకా పరమేశ్వరి సత్రానికి చెందిన దస్తావేజులు, రికార్డులను సైతం పరిశీలన చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని పరిరక్షించటంలో తాత్సారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామ పరిధిలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సుమారు 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వెంచరు వేస్తోంది. దీనికి సరైన రహదారి సదుపాయం లేకపోవటంతో సమీపంలోని మరో వెంచరు నిర్వాహకులతో మాట్లా డుకుని అందులో నుంచి తమ వెంచరులోకి దారి ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 20 సెంట్లకు పైగా భూమిలో రోడ్డు నిర్మించారు. ఈ దారి నిర్మాణమే వివాదాస్పదమైంది. దారి నిర్మించిన భూమి దేవదాయశాఖ పరిధిలోనిదని కొందరు, కన్యకాపరమేశ్వరి సత్రానికి చెందిన భూమని మరి కొందరు చెబుతున్నారు. ఫిర్యాదులతో వెలుగులోకి.. నెప్పల్లి గ్రామానికి చెందిన కొందరు ఈ భూమి అన్యాక్రాంతం అవుతోందంటూ కృష్ణా జిల్లా కలెక్టరు సహా దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో భూమి అన్యాక్రాంతం వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై ఈనెల 7న ‘అమ్మవారి భూమి అన్యాక్రాంతం’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో దేవదాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గ్రామంలోని సర్వే నంబరు 101లో ఉన్న 4.41 ఎకరాల భూమి ఉందని తేలింది. ఈ భూమి ఆర్ఎస్ఆర్లో విజయవాడ కనకదుర్గ దేవస్థానానికి చెందినదిగా ఉంది. అడంగల్లో మాత్రం కన్యకాపరమేశ్వరి సత్రం భూమిగా నమోదైంది. రెండు రికార్డుల్లో రెండు విధాలుగా ఎందుకు నమోదై ఉంద న్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. భూ వివాదం వెలుగులోకి వచ్చాక, ఎకరాకు రూ.200 చొప్పున సత్రం కన్యకాపరమేశ్వరి సత్రం నిర్వాహకులు తహసీలు చెల్లించారు. వివాదం తేలే వరకూ ఉండకుండా సత్రం నిర్వాహకులు నుంచి రెవెన్యూ అధికారులు తహసీలు వసూలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెప్పల్లి భూ వివాదానికి తెరపడేదెప్పుడో? నేటికీ కొనసాగుతున్న వెంచరు పనులు రికార్డుల పరిశీలనలో దేవదాయ శాఖ ఉత్సవాల నిర్వహణకు భూమి అప్పగించారంటున్న సత్రం నిర్వాహకులు భూమిని పరిరక్షిస్తాం వివాదాస్పద భూమిని కచ్చితంగా పరిరక్షిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన చర్యలను అడ్డుకుంటాం. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నాం. సమస్య జిల్లా కలెక్టరు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంది. సత్రం నిర్వాహకులు కూడా కొన్ని వివరాలను అధికారులకు అందించారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. భూమిని అన్యాక్రాంతం కానివ్వబోం. – నూతక్కి వెంకట సాంబశివరావు, ఏసీ, దేవదాయశాఖ, కృష్ణాజిల్లా రూ.కోట్ల విలువైన భూమికి రక్షణ లభించేనా? కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమికి రక్షణ లభించేనా అన్న అనుమానాలు నెప్పల్లి గ్రామస్తులు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం నెప్పల్లి పరిసరాల్లో ఎకరం భూమి విలువ రూ.5 కోట్ల వరకూ పలుకుతోంది. ఈ లెక్కన 4.41 ఎకరాల విలువ రూ.20 కోట్లు పైగా పలుకుతుంది. కోటి రూపాయల విలువైన దేవదాయ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా వెంచరు నిర్వాహకులు రోడ్డు నిర్మించి యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గం గుండానే వెంచ రులోకి అవసరమైన నిర్మాణ సామాగ్రిని తర లిస్తూ దర్పం ప్రదర్శిస్తున్నారు. భూమి వ్యవహారం తేలే వరకూ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులను కట్టడి చేయటం, భూమిని స్వా ధీనం చేసుకునే ప్రక్రియలో అధికారులు మెతకవైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూమి లీజు కేటాయింపులు అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి ఎలా దక్కాయన్నది కూడా ప్రశ్నగానే మిగిలింది. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన దేవదాయ శాఖ అధికారులు మాత్రం రోడ్డు నిర్మాణం అక్రమమేనని, పరిరక్షిస్తామని చెబుతున్నారు. సత్రం నిర్వాహకులు మాత్రం తమకు ఈ భూమిని ఉత్సవాల నిర్వహణకు ఏళ్లనాడు అప్పగించారంటూ కలెక్టరుకు సమర్పించిన నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. -
కృష్ణా జిల్లాలో 44.3 మి.మీ. సగటు వర్షపాతం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో 44.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం మంగళవారం నమోదైంది. అత్యధికంగా పమిడి ముక్కల మండలంలో 87.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా గన్నవరం మండలంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని మిగిలిన మండలాల్లోని నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చల్లపల్లి మండలంలో 71.8 మిల్లీమీటర్లు, మోపిదేవి 70.2, ఘంటసాల 69.2, పామర్రు 60.6, అవనిగడ్డ 57.4, మచిలీపట్నం 54.2, గుడ్లవల్లేరు 52.6, మొవ్వ, నాగాయలంక 50.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గుడివాడ మండలంలో 49.4 మిల్లీమీటర్లు, ఉయ్యూరు 48.2, బంటుమిల్లి 46.2, కంకిపాడు 44.2, పెదపారుపూడి 43.2, గూడూరు 36.0, నందివాడ 32.4, కోడూరు 31.2, పెనమలూరు 29.4, పెడన 28.8, తోట్లవల్లూరు 26.6, ఉంగుటూరు 21.4, కృత్తివెన్ను 18.2, బాపులపాడు మండలంలో 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్భారీ వర్షాలతో ఎలాంటి ఇబ్బంది కలిగినా సమాచారం ఇవ్వండి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, మునిసిపల్, వ్యవసాయ తదితర శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా 9154 970 454 నంబర్తో కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఈ నంబర్లో సంప్రదించి, సమాచారమివ్వాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా, సరఫరాలో ఆటంకం లేకుండా పంచాయతీరాజ్, మునిసిపల్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, నిరంతరం పరిస్థితిని సమీక్షించాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా.. రోడ్లపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపేందుకు అవసరమైన సిబ్బంది, ఇంజిన్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా చెట్లు కూలితే వెంటనే తొలగించేలా ఆదేశాలిచ్చామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల కింద నిలబడవద్దని, వాహనాలను భద్రమైన ప్రదేశాల్లో పార్క్ చేసుకోవాలని సూచించారు. టంగుటూరి జీవితం స్ఫూర్తిదాయకం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నేటి తరం యువత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద లోబ్రిడ్జి సమీపంలోని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద ఆయన 60వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆంధ్రకేసరి టంగుటూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత విశేషాలను వివరించారు. కార్పొరేటర్ శర్వాణి మూర్తి, చల్ల సుధాకర్, తోపుల వర లక్ష్మి, మాత మహేష్,మురళి కృష్ణంరాజు, గజ్జల కొండ వాసు పాల్గొన్నారు. ‘పది’ పరీక్షలు రెండో రోజూ ప్రశాంతం వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండో రోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. మంగళవారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష 30 కేంద్రాల్లో నిర్వహించారు. 495 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 260 మంది పరీక్ష రాశారు. 52.53 శాతం మాత్రమే హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. 235 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి మరో 29 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జిల్లా విద్యాశాఖ నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్లు 28 పరీక్ష కేంద్రాలను పరిశీలించాయి. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు పాత బస్తీలోని సుందరమ్మ వీఎంసీ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ ఆంథోని హైస్కూల్తో పాటుగా పలు కేంద్రాలను పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
పెనమలూరు: మండలంలోని కానూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ కథనం మేరకు.. కానూరు కామయ్యతోపు ప్రాంతా నికి చెందిన చిలికోటి సరోజిని(65) మంగళవారం రాయల్ ఫర్నిచర్ షాపు వద్ద బందరు రోడ్డు దాటుతుండగా వేంగా వచ్చిన బైక్ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సరోజిని అపస్మారకస్థితికి చేరుకుంది ఆమెను హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. -
యోగాపై అవగాహన పెంచాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నెల రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే యోగాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా సంబంధిత కార్యక్రమాలను నిర్వహించా లని, ఉద్యోగులు, సిబ్బంది యోగా సాధన చేయాలని, పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు. బాపూ మ్యూజియం, కొండపల్లి ఖిల్లా, గాంధీ హిల్ వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. టెలికాన్ఫరెన్స్లో విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఆర్డీఓలు కె.చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్పొరేట్లకు సాగిల పడుతున్న పాలకులు కంకిపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు సాగిల పడుతూ ఊడిగం చేస్తున్నా యని కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు విమర్శించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కంకిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్మిక, కర్షక వర్గాలు ఐక్యమై హక్కులు, చట్టాలను సాధించుకునేందుకు ఉద్యమిస్తున్నాయన్నారు. విద్యారంగంలో సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఆందో ళనబాట పట్టాయని స్పష్టంచేశారు. కనీస వేతనం అమలుచేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. నిరసన అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ అధికారులకు అప్పగించారు. వివిధ ప్రజా సంఘాల మండల బాధ్యులు తాడంకి నరేష్, జి.కుమారి, వి.శివశంకర్, వి.జాన్మోజేస్, వి.మరియదాసు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఐసెట్లో జిల్లా విద్యార్థికి మూడో ర్యాంక్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఐసెట్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించాడు. ఐసెట్ ఫలితాలను విశాఖపట్నంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది ఐసెట్ను ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన సకల కృష్ణ సాయి మూడో ర్యాంక్ సాధించాడు. ఎన్టీఆర్ జిల్లా నుంచి 2,528 మంది విద్యార్థులు ఐసెట్కు దరఖాస్తు చేసుకున్నారు. 2,271 మంది పరీక్షకు హాజర య్యారు. వారిలో 1,012 మంది బాలురు, 1,259 మంది బాలికలు ఉన్నారు. వారిలో 2,191 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. కృష్ణాజిల్లా నుంచి 713 మంది విద్యార్థులు ఐసెట్కు దరఖాస్తు చేసుకోగా 668 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 311 మంది బాలురు, 357 మంది బాలికలు ఉన్నారు. 638 మంది విద్యార్థులు అర్హత సాధించి ర్యాంకులు పొందారు. వారిలో 299 మంది బాలురు, 339 మంది బాలికలు ఉన్నారు. -
గ్రంథాలయాలు మనో వికాస కేంద్రాలు
విజయవాడకల్చరల్: గ్రంథాలయాలు మనోవికాస కేంద్రాలని ఏపీ గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర సంచాలకుడు కృష్ణమోహన్ అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, గ్రంథాలయ పునర్వికాస వేదిక, స్వేచ్ఛ ఆంధ్ర ఆధ్వర్యంలో 15 రోజులపాటు నిర్వహించే గ్రంథాలయ వర్క్షాప్ను గవర్నర్పేటలోని బుక్ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో ఆయన మంగ ళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ.. బాలబాలికలకు నిత్య పఠనాన్ని అలవాటు చేయాలని సూచించారు. వేసవి సెలవుల్లో గ్రంథాలయాలను విద్యార్థులు సందర్శించాలన్నారు. గ్రంథాలయాల కోసం కొత్త వెబ్సైట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయ ఉద్యమనేత గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రంథాలయ పునర్వికాసానికి గ్రంథా లయ పునర్వికాస వేదిక ద్వారా కృషి చేస్తున్నామని, ప్రజలు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు సహకరించాలని కోరారు. గ్రంథాలయ పునర్వికాస వేదిక రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాల పూర్వవైభవం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. పిల్లల ఠాగూర్ గ్రంథాన్ని కృష్ణమోన్ ఆవిష్కరించారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యవర్గసభ్యులు మనోహర్ నాయుడు, లక్ష్మయ్య, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ఎమెస్కో లక్ష్మీ, పల్లవి వెంకటనారాయణ, అరణ్కుమార్, జేసీ ప్రసాద్, నవరత్న రవి, సుబ్బరామయ్య, శైలజామూర్తి, నాగిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచాలి
కృష్ణా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచేలా ప్రభుత్వ శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకోవాలని కృష్ణా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ గవర్నెన్స్ అధికారి మంగళవారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ, పలువురు అధికారులు వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి పాల్గొన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ అనంతరం గీతాంజలిశర్మ అధికారులతో మాట్లాడుతూ.. అర్జీదారులతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా కాల్సెంటర్ 1100 నంబరు నుంచి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారని, దాని విశ్లేషణ ఆధారంగా ప్రభుత్వశాఖల అధికారులకు ర్యాంకింగ్ ఇస్తున్నా రని పేర్కొన్నారు. ఇకపై ప్రజాసమస్యలపై వెంటనే స్పందించి వారితో సానుకూలంగా మాట్లాడి అర్జీల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాల నలో ప్రజల సంతృప్తి స్థాయి చాలా కీలకమన్నారు. మండలాల్లో పరిపాలనా విధానం బాగాలేదని ప్రజలు చెబుతున్నట్లు నివేదికలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జూన్ 12వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఏ మేరకు సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, డీఎస్ఓ వి.పార్వతి, ఇన్చార్జ్ సీఈఓ ఆర్.సి.ఆనంద్కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
స్కానింగ్ సెంటర్లకు కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరిక గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ–పీఎన్డీటీ) చట్టాన్ని ఉల్లంఘిస్తే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. సమన్వయ శాఖల అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, ఏఆర్టీ–సరోగసీ చట్టాల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎ.సత్యానంద్ హాజరయ్యారు. ప్రజల్లో అవగాహన కల్పించాలి.. సమావేశంలో కమిటీ చైర్మన్, కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫిర్యాదులు వస్తే వాటిని త్వరితగతిన విచారించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చట్టంలోని నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే ఉన్న స్కానింగ్ కేంద్రాలకు అదనంగా కొత్త రిజిస్ట్రేషన్లకు సంబంధించిన తొమ్మిది దరఖాస్తులను, మూడు రెన్యువల్ దరఖాస్తులను, నాలుగు క్యాన్సిలేషన్ దరఖాస్తులను కమిటీ పరిశీలించి, చర్చించి, ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఏఆర్టీ లెవెల్–1 కేటగిరీకి సంబంధించిన రెండు దరఖా స్తులు, ఏఆర్టీ లెవెల్–2 కేటగిరీకి సంబంధించిన రెండు దరఖాస్తులతో పాటు సరోగసీ క్లినిక్కు సంబంధించి ఒక దరఖాస్తుకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, వాసవ్య స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జి.రేష్మీ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ, ఎన్హెచ్ఎం డీపీఎంవో డాక్టర్ నవీన్ పాల్గొన్నారు. -
మనీ.. మోర్ మనీ!
క్రషర్లను మూసి వేయాలి ‘యోగాంధ్ర’కు పటిష్ట బందోబస్తు కంచికచర్ల: రాతి క్వారీలు, క్రషర్లు వెదజల్లే దుమ్ము ధూళి వల్ల రెండు పంటలు పండే పొలాలన్నీ బీడు భూములుగా మారుతున్నాయి. పంటలు సాగుచేసే సమయంలో సాగర్ కాలువను పూడ్చటంతో సాగునీరు సరఫరా కాక పంటలన్నీ ఎండిపోతున్నాయి. పొలాలను అమ్ముకుని ఇతర ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేద్దామనుకుంటే క్రషర్ యజమానులు భూములను అమ్ముకోవద్దని తమను బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ సమీపంలో 801 సర్వే నంబర్లలో 74 రాతి క్వారీలు, 25 వరకు క్రషర్లు ఉన్నాయి. క్వారీలు, క్రషర్ల సమీపంలో 450 ఎకరాల పంట భూములున్నాయి. ఆ భూముల్లో రైతులు పంటలు సాగు చేద్దామన్నా కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. నిత్యం వందల సంఖ్యలో లారీలకు భారీగా లోడింగ్ చేసి కంకర, మట్టి తరలిస్తున్నారు. దీంతో కాలుష్యం నిరంతరం వెదజల్లుతోంది. సాగర్ జలాలు రాకుండా కాల్వ పూడ్చివేత.. పంట పొలాలకు నాగార్జున సాగర్ జలాలు వచ్చేవి. ఆ నీటితో మూడు దశాబ్దాల క్రితం వరకు ఆ భూముల్లో రైతులు రెండు పంటలు పండించేవారు. కానీ క్వారీ గుత్తేదారులు, క్రషర్ల యజమానులు వారి వ్యాపారం కోసం సాగర్ కాలువలను సైతం పూడ్చివేసి రోడ్లు వేసుకున్నారు. దీంతో పంటలు సాగుచేసేందుకు సాగునీరు రాకపోవటంతో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. క్రషర్ల యజమానుల బెదిరింపులు.. పంట పొలాలను తక్కువ ధరకు ఇవ్వాలని లేకపోతే ఇతరులకు ఎవరికి విక్రయించినా ఊరుకునేది లేదని క్వారీ గుత్తేదారులు బెదిరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. రాజధానికి అతి సమీపంలో ఉన్న తమ పొలాలు బయట మార్కెట్లో ఎకరం భూమి రూ. కోటి 20 లక్షలు వరకు కొనుగోలు జరుగుతున్నాయని క్వారీ నిర్వాహకులు మాత్రం తమ భూములను కేవలం రూ.40 లక్షలకే ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు పచ్చని పొలాలకు కాల్వను పూడ్చివేశారు.. సాగర్ జలాలు మూలపాడు మేజర్ కెనాల్ ద్వారా వచ్చేవి. ఆ సాగు నీటితో రెండు పంటలు పండించే వాళ్లం. క్వారీ నిర్వాహకులు సాగర్ కాల్వలను పూడ్చివేసి ఆ మట్టిని కూడా క్వారీ యజమానులు విక్రయించారు. తమ భూములను ప్రభుత్వమే కాపాడాలి. – పురమా వెంకట శివప్రసాద్, రైతు, పరిటాల బ్లాస్టింగ్తో బండరాళ్లు వచ్చి పడుతున్నాయి.. రాతి క్వారీలో నాణ్యతలేని నాసిరకం పేలుళ్ల పదార్థాలను బ్లాస్టింగ్ సమయంలో ఉపయోగించటం ద్వారా అవి పెద్ద పెద్ద శబ్దంతో పేలుళ్లు వస్తున్నాయి. అనుభవం లేని కార్మికులచే నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ బండరాళ్లన్నీ పొలాల్లోకి వచ్చి పడుతున్నాయి. అదే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు తీవ్రగాయాలైన సంఘటనలు ఉన్నాయి. నాణ్యత, మన్నిక లేని నాసిరకం పేలుళ్ల పదార్థాలు గాతాల్లో పెట్టి రాళ్లను పేల్చుతున్నారు. ఆ పేలుళ్లకు ఇంటి గోడలు పెచ్చులూడి పడుతున్నాయి. పేలుళ్ల సమయంలో రాళ్లు లేచి జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు సైతం తీవ్రగాయాలైన సంఘటనలు సాధారణమైంది. దుమ్ము ధూళితో బీడు భూములుగా మారుతున్న వైనం సాగర్ కాల్వను పూడ్చటంతో సరఫరా కాని సాగు జలాలు భూములను అమ్ముకుందామన్నా బెదిరిస్తున్న క్రషర్ల యజమానులు ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. కానీ ఆ పొలం సాగు చేద్దామంటే క్రషర్ల నుంచి దుమ్ము, ధూళి వెదజల్లుతోంది. దీంతో సాగుచేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి, క్రషర్లను మూసివేసి పంటలు సాగయ్యేలా చూడాలి. – బండ్ల నాగేశ్వరరావు, రైతు, పరిటాల -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025u8లో రైల్వేస్టేషన్లో పోలీసుల తనిఖీలు వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో జీఆర్పీ పోలీసులు మంగళవారం జాగిలాల సాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. టీడీపీ దౌర్జన్యం తిరువూరు మునిసిపల్ చైర్మన్ ఎన్నికను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులను దారి కాచి అడ్డగించారు. భారీ వర్షం అవనిగడ్డ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. 7 -
అన్నమయ్య పదశోభకు పట్టంకట్టిన సంకీర్తనలు
విజయవాడకల్చరల్: శ్రీ వెంకటేశ్వర సంకీర్తనా అకాడమీ(శ్వాస), కంచికామకోటిపీఠస్థ శారదా చంద్రమౌళీశ్వర, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య జయంతి సందర్భంగా లబ్బీపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న పదయజ్ఞం కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు కార్యక్రమంలో ముడుంబై లక్ష్మి, రుగ్వేదం సోదరీమణులు, వడ్డాది కామేశ్వరి, వీరుభొట్ల సీతారమణి, తిరుపతికి చెందిన చిన్నమదేవి, ఎన్సీ శ్రీదేవిలు సంగీత యజ్ఞంలో పాల్గొన్నారు. అన్నమయ్య సంకీర్తనలకు విశేష ప్రాధాన్యం కలిగించిన గరిమెళ్ల బాల కృష్ణప్రసాద్ స్మృత్యర్ధం ఆయన ఆలపించిన కీర్తనల వీడియోలను, అందుకున్న పురస్కారాలను ప్రదర్శించారు. అలరించిన సప్తగిరుల సంకీర్తనం.. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామివారిని చేరుకోవాలంటే ఏడుకొండలను దాటి రావాలి ఒక్కో పర్వతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వాటిని ప్రాధాన్యతను వివరిస్తూ అన్నమయ్య రచించిన కీర్తనలకు సప్తగిరులని పేరు అవి భావములోన, బ్రహ్మకడిగిన పాదము, యెంతమాత్రమున, పొడగంటిమయ్యా, కొండలలోనెలకొన్న, నారాయణతే నమోనమో, ముద్గుగారే యశోద కీర్తనలను నగరానికి చెందిన పలువురు విద్వాంసులు మధురంగా ఆలపించారు. నిర్వాహకులు స్వామి వారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. లబ్బీపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మాగంటి వేణుగోపాల్, కార్యనిర్వాహకుడు డాక్టర్ సి.రామ్మోహనరావు, మేనేజర్ శర్మ పాల్గొన్నారు. దుర్గమ్మ సేవలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సినీనటుడు బెల్లంకొండ శ్రీనివాస్ సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన శ్రీనివాస్ను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. కారు ఢీకొని ఆటోడ్రైవర్ మృతి కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కారు ఆటోను ఢీ కొట్టిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. కొండపల్లి శాంతినగర్ సమీపంలో 30వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొండపల్లి గ్రామానికి చెందిన కంపా సాంబయ్య(59) ఆటోడ్రైవర్గా పని చేస్తాడు. ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో కంపా సాంబయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహన సిబ్బంది చేరుకుని వైద్యపరీక్షలు జరిపి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉండగా, ఇద్దరికి వివాహాలయ్యాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంఈఎఫ్ కృష్ణా జిల్లా కమిటీ ఏర్పాటు మచిలీపట్నంటౌన్: ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాలతో మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కృష్ణాజిల్లా నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్నికల్లో ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బిక్షాలు మాదిగ తెలిపారు. ఎంఈఎఫ్ కృష్ణా జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా దేవరపల్లి విక్టర్ బాబు, ఉపాధ్యక్షుడిగా జే అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శిగా బీడెల్లి మరియ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శిగా బొకినాల కృష్ణ, కోశాధికారిగా రాచపూడి బాలస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉడుముల దుర్గారావు, గౌరవ అధ్యక్షుడిగా మేదర రమేష్, గౌరవ ముఖ్య సలహాదారుగా రావెల వరుణ్ కుమార్, లీగల్ అడ్వైజర్గా అద్దేపల్లి నిరంజన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
తెలంగాణ మద్యం స్వాధీనం
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో సోమవారం ఎకై ్సజ్ అధికారులు తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. గంపలగూడెం మండలం ఊటుకూరు నుంచి 78 మద్యం సీసాలతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుండ్ల శేషగిరిరావు, ఎల్లమ్మలను అదుపులోకి తీసుకున్నట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నిందితులను తిరువూరు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్కు ఆదేశించారని తెలిపారు.బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని యువకుడి మృతిచిట్టినగర్(విజయవాడపశ్చిమ): పాముల కాల్వ సమీపంలోని బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని యువకుడు మృతదేహా న్ని సోమవారం గుర్తించారు. సుమారు 35 సంవత్సరాల కలిగిన వ్యక్తి రోడ్డు పక్కగా పడి ఉండటాన్ని గమనించిన వాహన చోదకులు కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు. జక్కంపూడి వైఎస్సార్ కాలనీ వీఆర్వో మర్రెపూడి శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అభయాంజనేయునికి విశేష పూజలు
హనుమాన్జంక్షన్రూరల్: హనుమాన్జంక్షన్లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు మూడో రోజైన సోమవారం ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానాన్ని, స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకులు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, శృంగారం వెంకట శేషారామాచార్యులు అంజనీపుత్రునికి ప్రభాత సేవ, 1,008 చామంతి పూలతో ప్రత్యేక పూజలు చేశారు. అధ్యాత్మిక వేదికపై కోదండ రామాంజనేయ భజన మండలి (బిళ్లనపల్లి) భక్త బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. సాయంత్రం హనుమంతునికి బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయం ఎదుట సాయికృష్ణ భజన మండలి మహిళలు నిర్వహించిన కోలాటం ఆద్యంతం ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్ అనిల్కుమార్ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన ‘డ్యాన్స్ బేబి డ్యాన్స్’ నృత్య ప్రదర్శన, నవీన ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ మ్యూజికల్ నైట్ అలరించింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి పితాని తారకేశ్వరరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాలి
విజయవాడస్పోర్ట్స్: జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని, క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు క్రీడాకారులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కలిదిండిలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సిలంబం(కర్రసాము) పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు విజయవాడలోని శాప్ కార్యాలయంలో చైర్మన్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ.. ఎస్వీఆర్కే ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 73 గోల్డ్ మెడల్స్, 16 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రపంచ క్రీడా వేదికపై అత్యధిక పతకాలు సాధించి రాష్ట్ర, దేశ గౌరవాన్ని పెంచాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో సిలంబం కోచ్లు శ్రీకాంత్, వర్మ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత కావాలి
కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ కృష్ణలంక(విజయవాడతూర్పు): భారత రాజ్యాంగ పరిరక్షణ వర్తమానంలో అందరి బాధ్యత కావాలని సీనియర్ పాత్రికేయుడు, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. పాలనకు పక్షవాతం సోకిందని, ఫెడరలిజానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా భారతదేశ ఫెడరల్ వ్యవస్థ–ఎదురవుతున్న సవాళ్లు అనే అంశంపై ఎం.బి.విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ పి.మధు అధ్యక్షతన సోమవారం స్మారకోపన్యాసం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీధర్ సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఫోర్త్ ఎస్టేట్లో ప్రశ్నించే ధోరణి లేదు.. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించినా వాటికి భంగం కలిగించే ప్రయత్నాలు ముమ్మరం కావడం ప్రమాదకరమన్నారు. ఎంతో ముందు చూపుతో అత్యున్నత రాజ్యాంగం అందుబాటులోకి తెచ్చుకున్నామని చెప్పారు. ఆర్టికల్ 200, 201 ప్రకారం బిల్లుల ఆమోదానికి పరిధి ఉన్నప్పటికీ రాష్ట్రపతి ప్రశ్నలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఫైనాన్స్ ఫెడరలిజం అనేది ప్రశ్నార్ధకం అయ్యిందన్నారు. ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వాల్సి ఉండగా డేటా చట్టం పేరుతో సమాచారం లేకుండా చేస్తున్నారని, ఫోర్త్ ఎస్టేట్లో ప్రశ్నించే ధోరణి మాయమవుతుందని చెప్పారు. రాజ్యాంగం విలువలకు తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వ బిల్లులను గవర్నర్ అడ్డుకుంటే ఇక ఫెడరలిజం ఎక్కడుందని ప్రశ్నించారు. విచక్షణ లేని వారంతా గవర్నర్ స్థానంలో ఉండడం వలన పాలన కూడా పక్షవాతం బారిన పడుతోందన్నారు. రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న దేశంలో ఇలాంటివి శ్రేయస్కరం కాదని, ప్రజలే భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, పి.రామరాజు, టి.క్రాంతి, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ ప్రజావాణిలో 89 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 89 మంది ఫిర్యాదులు అందజేశారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీలు ఏ.బి.టి.ఎస్.ఉదయరాణి, కృష్ణమూర్తినాయుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదులను స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 42, కుటుంబ కలహాలపై తొమ్మిది, కొట్లాటకు సంబంధించి ఏడు, మహిళా సంబంధిత నేరాలపై ఏడు, సైబర్ నేరాలపై మూడు, దొంగతనాలపై రెండు, ఇతర చిన్న చిన్న వివాదాలు, సంఘటనలపై 19 మంది ఫిర్యాదులు అందజేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు డీసీపీలు ఆదేశాలిచ్చారు. 925 వెండి నాగపడగలు సమర్పించిన అజ్ఞాత భక్తులు ఘంటసాల: స్థానిక నాగేంద్ర స్వామి పుట్ట వద్ద అజ్ఞాత భక్తులు వెండి నాగ పడగలు వేసి వెళ్లినట్లు శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు గొర్రెపాటి వెంకట రామకృష్ణ(ట్రస్టీ), గొర్రెపాటి జగన్మోహనరావు, గొర్రెపాటి సురేంద్ర సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల గ్రామంలో ప్రసిద్ధి గాంచిన సంతాన సాఫల్య స్వామిగా పేరుగాంచిన శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ(షష్టి గుడి) ప్రాంగణంలోని నాగేంద్ర స్వామి పుట్ట వద్ద మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని అజ్ఞాత భక్తులు వెండితో చేసిన నాగ పడగలు పుట్టపై వేసి వెళ్లిపోయారన్నారు. వీటిని ఆలయ సిబ్బంది గుర్తించి తమకు అందజేశారని చెప్పారు. వాటిని లెక్కించగా 925 నాగ వెండి పడగలు ఉన్నాయన్నారు. భక్తులు తమ కోర్కెలు తీరినందు వల్లే ఇలా మొక్కబడి తీర్చుకుని ఉంటారని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా పుట్టపై భక్తులు వెండి నాగ పడగలు వేశారని, ఆ భక్తులకు స్వామి వార్ల ఆశీస్సులు అందించాలని కోరారు. వీటి విలువ రూ.లక్ష వరకు ఉంటుందని ఆలయ ధర్మకర్తలు అంచనా వేశారు. -
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూత
విజయవాడస్పోర్ట్స్: జిల్లా పోలీస్ కమిషనరేట్ హోంగార్డ్స్ యూనిట్లో హోంగార్డ్గా విధులు నిర్వర్తిస్తూ బ్రెయిన్ స్ట్రోక్తో మృతిచెందిన పి.శ్రీమన్నారాయణ కుటుంబానికి జిల్లాలోని హోంగార్డులు ఆర్థిక చేయూతనందించారు. శ్రీమన్నారాయణ కుటుంబ సభ్యులకు ఆర్థిక ఆసరా కల్పించేందుకు జిల్లాలో పని చేస్తున్న హోంగార్డులందరూ వారి ఒక్క రోజు వేతనాన్ని సమకూర్చారు. రూ.5 లక్షల నగదు చెక్కును పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు చేతుల మీదుగా శ్రీమన్నారాయణ భార్య పి.నరసమ్మకు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత, హోంగార్డ్స్ ఆర్ఐ కె.సుధాకరరెడ్డి పాల్గొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా గట్టుభీమవరం(వత్సవాయి): హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడిన సంఘటన జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో బస్సు జాతీయ రహదారిపై కొంగరమల్లయ్య గట్టు దాటాక సాయిబాబా గుడి సమీపంలో లారీని తప్పించబోయి అదుపు తప్పి పక్కకు ఒరిగింది. దీంతో బస్సులోని ప్రయాణికులు వెంటనే దిగిపోయారు. తరువాత చిన్నగా బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు తెలిపారు. -
బరితెగింపు
బలం లేకపోయినా సాక్షి ప్రతినిధి, విజయవాడ/తిరువూరు: తిరువూరు మునిసిపల్ చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ దుశ్శాసన, దుర్వినీత పర్వానికి తెరతీసింది. సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, తన అనుచరులతో కలిసి మునిసిపల్ కార్యాలయం వద్ద వీధి రౌడీలా వ్యవహరించారు. తాయిలాలు ఎరవేసి వైఎస్సార్ సీపీ సభ్యులను తన వైపు తిప్పుకునేందుకు యత్నించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను మునిసిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. రెండు గంటలపాటు భీతావహ వాతావరణం సృష్టించారు. ఈ దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అడుగడుగునా అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యకుడు దేవినేని అవినాష్, నియోజకవర్గపార్టీ ఇన్చార్జి స్వామిదాసు ఆధ్వర్యంలో పార్టీ నాయకులే కవచంలా ఏర్పడి రక్షించుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మునిసిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, పార్టీ జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావుతో పాటు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. భర్తతో ఒత్తిడి చేయించి.. ఒకటో వార్డు కౌన్సిలర్ కొలికపోగు నిర్మల భర్తను టీడీపీలో చేర్చుకున్న కూటమి నేతలు అతని చేత ఆమైపె ఒత్తిడి చేయించారు. అయినా ఆమె వైఎస్సార్ సీపీకే ఓటు వేస్తానంటూ తేల్చి చెప్పారు. పార్టీ కౌన్సిలర్లతోపాటు చైర్మన్ ఎన్నిక కోసం సోమవారం మునిసిపల్ కార్యాలయానికి వచ్చారు. అయితే నిర్మలను కిడ్నాప్ చేశారంటూ ఆమె భర్తతో పోలీసు కేసు పెట్టించిన ఎమ్మెల్యే కొలికపూడి మునిసిపల్ కార్యాలయం వద్ద గొడవకు దిగారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, నేతలను అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లు, రాళ్లతో చెలరేగిపోయారు. అయినా వైఎస్సార్ సీపీ నాయకులు సంయమనం పాటించారు. అండగా అవినాష్.. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పోలీసుల నిర్బంధాలను దాటుకుని మునిసిపల్ కార్యాలయానికి వచ్చి తమ కౌన్సిలర్లకు రక్షణగా నిలిచారు. ఈ దశలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అవినాష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయినా వెనక్కి తగ్గని అవినాష్తోపాటు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామి దాస్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుధారాణి, ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్, షేక్ ఆసిఫ్ కౌన్సిలర్లకు అండగా నిలిచారు. చివరకు పోలీసులే నిర్మలను బలవంతంగా తీసుకెళ్లి ఆమె భర్తకు అప్పగించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కమిషనర్కు ఫిర్యాదు.. టీడీపీ నాయకుల తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్, పీఏసీ సభ్యుడు షేక్ ఆసిఫ్ వైఎస్సార్ సీపీ వార్డు సభ్యులతో కలిసి సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తిరువూరులో టీడీపీ అరాచక పర్వం గెలవలేమని తెలిసీ..ప్రజాస్వామ్యం ఖూనీ.. మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరువూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. టీడీపీ బరిలో నిలిపిన చైర్మన్ అభ్యర్థి కూడా టీడీపీలో గెలిచిన వ్యక్తి కాదని, పోలీసులు ఖాకీ యూనిఫామ్ బదులు, పచ్చ దుస్తులు వేసుకున్నారన్నారు. తమ కౌన్సిలర్ను లాక్కెళ్లి ఆమె మెడలోని వైఎస్సార్ సీపీ కండువాను తీసి చెట్లలో పడేశారని, ఎన్టీఆర్ జిల్లాలో అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని పోలీస్ కమిషనర్ను ప్రశ్నించారు. కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారన్నారు. ఎన్నిక జరగకుండా ఉండేందుకు చెప్పులు.. వాటర్ బాటిల్స్ విసిరి రాద్ధాంతం చేశారన్నారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించలేని అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి.. నేటి ఎన్నికను ప్రశాంతంగా జరిపించాలని కోరుతున్నామన్నారు. తీవ్ర అభ్యంతరకరం.. ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్ మాట్లాడుతూ తిరువూరులో టీడీపీ నేతలు, పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. తమకు ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్కు వచ్చి ప్రజాప్రతినిధులు ఏనాడైనా కోరుకున్న సందర్భాలున్నాయా అని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితులను ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. తిరువూరులో పోలీసులు పసుపు చొక్కాలేసుకుని డ్యూటీలు చేశారని విమర్శించారు.. తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఇరవై వార్డులకు 17 వైఎస్సార్ సీపీ గెలుపొందింది. టీడీపీ మూడు వార్డులనే గెలుచుకోగలిగింది. అప్పట్లో చైర్మన్గా ఎన్నికై న గత్తం కస్తూరిబాయి ముందస్తు ఒప్పందంలో భాగంగా ఇటీవల రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ సోమవారం ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనిని అదునుగా భావించిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు కాకర్లమూడి సుందర్కుమార్, పసుపులేటి శేఖర్బాబు, దారా పద్మజను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేర్చుకున్నారు. మరో ఇద్దరిని బలవంతంగా తమ వైపు తిప్పుకున్నారు. అయినా బలం చాలకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించేందుకు దౌర్జన్యాలకు తెగబడ్డారు. -
కార్తికేయుని సేవలో ప్రముఖులు
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ బోర్డు డైరెక్టర్, తమిళనాడు రాష్ట్రం ఎయిర్ పోర్ట్ల అడ్వైజరీ కమిటీ సభ్యుడు గూడూరు రాధాకృష్ణ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. అలాగే విశ్రాంత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. సత్యదేవుని ఆలయానికి రూ. లక్ష విరాళం గుడ్లవల్లేరు: స్థానిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి దేవాలయ గోపుర అభివృద్ధి పనులకు రూ.1,08,000ను సోమవారం దాతలు అందించారు. అట్లూరి సత్యనారాయణ, భాస్కరరావు, వీరమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు అట్లూరి వీరప్రభు చలపతి, రామకృష్ణ దుర్గా వరప్రసాద్, కుమార్తెలు కొండపల్లి వీర కుమారి, చాపరాల కస్తూరి చేతుల మీదుగా ఈ విరాళాన్ని గుడ్లవల్లేరు ఎస్ఈఆర్ఎం విద్యా సంస్థల చైర్మన్ వల్లభనేని వెంకట్రావుకు అందించారు. క్రికెట్ అండర్–15 జిల్లా బాలికల జట్టు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా అండర్–15 బాలికల క్రికెట్ జట్టును కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి సోమవారం ప్రకటించారు. టి.సౌమ్య (కెప్టెన్), డి.షాలినీచౌదరి, పి.లక్ష్మీలోహిత, టి.కావ్య, కె.మేఘనసాయి, ఆర్.తేజశ్వని, పి.ఆనందదీప్తి, బి.కార్తీక, కె.రుత్వేకఆరాధ్య, కె.జస్వితసాయిరెడ్డి, బి.తమిళిక, కె.మేఘన, ఆర్.లక్ష్మీప్రసన్న, జి.హరణి, కె.అక్షయ, కె.స్పూర్తి, పి.హనీషా, కె.కుశిక జట్టులో చోటు దక్కించుకున్నారని పేర్కొన్నారు. 2025–26 సీజన్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ జట్టు ఉమ్మడి కృష్ణాజిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుందని వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ఆటోనగర్(విజయవాడతూర్పు): ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా తొలి రోజు 23మంది సభ్యులు నామినేషన్ దాఖలు చేసినట్టు ఎన్నికల అధికారులు పంచకర్ల వెంకటరమణారావు, తాడేపల్లి శ్రీనివాస దివాకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి నామినేషన్ల పర్వం ముగుస్తుందని చెప్పారు. మొత్తం 21 వార్డు మెంబర్లకుగానూ తొలి రోజే 23 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గతంలో ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంధం వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు. ఈసారి అదనంగా ఇద్దరు వార్డు సభ్యు లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ సారి అధ్యక్షుడికి మంచి పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తమ నాటికగా ‘చీకటి పువ్వు’ చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేటలో కళాకారుల ప్రతిభా వేదికగా నిలిచిన తొమ్మిదో ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. చిలకలూరిపేట కళా పరిషత్, సీఆర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఈ మూడు రోజుల కళా ఉత్సవం 9 నాటికల ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించింది. బహుమతులు అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. చైతన్య కళాభారతి(కరీంనగర్) వారి ‘చీకటి పువ్వు’నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై బహుమతిని సొంతం చేసుకుంది. అమృత లహరి థియేటర్ ఆర్ట్స్(గుంటూరు) వారి ‘నాన్న నేను వచ్చేస్తా’ నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలవగా, అమరావతి ఆర్ట్స్’ (గుంటూరు) వారి ‘చిగురు మేఘం’ నాటిక తృతీయ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. -
ఇద్దరు రైల్వే ఉద్యోగులకు సేఫ్టీ అవార్డులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్కు చెందిన ఇద్దరు ఉద్యోగులకు ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డు’ లభించింది. సోమ వారం జోనల్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్తో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందే డ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్ పద్ధతిలో భద్రతపై జీఎం అరుణ్కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రమం తప్పకుండా అన్ని సెక్షన్లలో సేఫ్టీ డ్రైవ్లు నిర్వహిచాలని ఆదేశించారు. అనంతరం విజయవాడ డివిజన్లో విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన కాకినాడలోని మెకానికల్ విభాగానికి చెందిన టెక్నీషియన్ దార్ల బంగారి, గన్నవరంలోని ఆపరేటింగ్ విభాగానికి చెందిన స్టేషన్ మేనేజర్ జె.దుర్గాప్రసాద్లకు జీఎం అరుణ్కుమార్ జైన్ అవార్డులను అందజేశారు. అవార్డులు సాధించిన డివిజన్ సిబ్బందిని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
తొలి రోజు పరీక్ష ప్రశాంతం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల సందర్భంగా ఆయా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పాఠశాల విద్య, అధికారులతో పాటుగా రెవెన్యూ, పోలీసు, మెడికల్ తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. 61.04 శాతం హాజరు.. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 61.04 శాతం విద్యార్థులు హాజరయ్యారు. తొలి రోజు 1,014 మంది విద్యార్థులకు 30 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అందులో 614 మంది హాజరుకాగా 395 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు కేటాయించిన మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు 27 కేంద్రాలను పరిశీలించారు. విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు జోన్–2 (కాకినాడ) జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కొండపల్లి)లోని పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే ఎస్పీఎన్ఆర్సీ ఉన్నత పాఠశాల (గొల్లపూడి) కేంద్రాన్ని పరిశీలించారు. డీఈవో యూవీ సుబ్బారావు విజయవాడలోని ఏపీఎస్ఆర్ మునిసిపల్ ఉన్నత పాఠశాల కృష్ణలంక వీఎంసీ ఉన్నత పాఠశాల, పటమట జీడీఈటీ ఉన్నత పాఠశాల, సీవీఆర్ ఎంసీ ఉన్నత పాఠశాల తదితర పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం -
పని చేయకపోతే సస్పెండ్ చేస్తా
జగ్గయ్యపేట: ‘ప్రజలు సమస్యలతో వచ్చినప్పుడు ఓపికగా వినాలి.. మీరేమైనా బ్రిటీష్ రాజ్యంలో ఉన్నారా? సమస్యలపై స్పందన లేకుంటే ఎలా?’ అని కలెక్టర్ జి.లక్ష్మీశ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని కోదాడ రోడ్డులో గల బీ– కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్లో అన్ని శాఖల నుంచి అత్యధికంగా ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తున్నారన్నారు. రెవెన్యూ, మునిసిపల్, మహిళ శిశు సంక్షేమశాఖల నుంచే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పద్దతి మార్చుకోకుంటే.. నందిగామ డివిజన్ పరిధిలోని సర్వేయర్లు, తహసీల్దార్ల పనితీరు సక్రమంగా లేదని పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు. గత వారం తిరువూరులో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కూడా అధికారులను మందలించినా మార్పు రాలేదన్నారు. ప్రతి అర్జీదారుడు ఇచ్చే అర్జీని మండలంలోని అన్ని శాఖల ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలే తప్ప సమస్యపై నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. పీ4 సర్వే తీరుపై మండిపాటు.. జిల్లాలో అన్ని గ్రామాల్లో జరుగుతున్న పీ4 సర్వే కొన్ని గ్రామాల్లో సక్రమంగా జరగడంలేదని కలెక్టర్ అన్నారు. కొందరు ఎంపీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అటువంటి వారిని ఉపేక్షించేదిలేదన్నారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు కూడా మీ పరిధిలో ఉన్న ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలను కూడా గుర్తించి పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, డీఆర్డీఏ పీడీ ఎన్.వి.నాంచరరావు, డీపీవో లావణ్య కుమారి, ఏసీపీలు తిలక్, వెంకటేశ్వరరావు, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీనివాసరావు, అని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 461 అర్జీలు స్వీకరణ.... జగ్గయ్యపేటలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై 461 అర్జీలు వచ్చాయి. వీటిలో జగ్గయ్యపేట మండలం నుంచి 222, పెనుగంచిప్రోలు 56, వత్సవాయి 44, నందిగామ మండలం నుంచి 38, చందర్లపాడు 8, వీరులపాడు 4, కంచికచర్ల 8 చొప్పున అర్జీలు వచ్చాయి. అర్జీల పరిష్కారంపైప్రత్యేక దృష్టి పెట్టండి డీఆర్వో లక్ష్మీ నరసింహం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్జీదారుడు సంతృప్తి చెందేలా స్పష్టమైన సమాచారంతో అర్జీలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా సమస్యలను పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలన్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 63 అర్జీలు అందాయి. ● పెనుగంచిప్రోలులోని పాత సినిమాహల్ సెంటర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం (బురుజు సెంటర్) వరకు ఆర్అండ్బీ రోడ్డు విస్తరణకు సర్వే చేస్తున్నారని స్థానికులు వివరించారు. అయితే అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని.. రోడ్డు విస్తరణ చేస్తే తమ గృహాలు నేలమట్టం అవుతాయని న్యాయం చేయాలంటూ మహిళలు కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. ● పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఇటీవల కల్లు గీత కార్మికుని కోటాలో మద్యం దుకాణం మంజూరైందని, అయితే దుకాణాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు నడుపుతున్నారని ఆ ప్రాంతానికి చెందిన దినేష్, దొండ రాంబాబు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కాగా దుకాణం చుట్టూ గృహాలు ఉన్నాయని, అనధికారికంగా సిట్టింగ్ కూడా ఏర్పాటు చేయడంతో మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు. ● షేర్మహ్మద్పేట అడ్డరోడ్డు సమీపంలోని ఆటోనగర్ వద్ద గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రూ.కోటి వ్యయంతో హైవే బస్స్టాండ్ నిర్మాణం జరిగిందని, అయితే 11 నెలలుగా బస్స్టాండ్ నిరుపయోగంగా ఉందని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని 5వ వార్డు కౌన్సిలర్ వట్టెం మనోహర్ అర్జీ అందించారు. నందిగామ రెవెన్యూ అధికారులపై కలెక్టర్ లక్ష్మీశ ఆగ్రహం పీజీఆర్ఎస్లో 461 అర్జీలు స్వీకరణవచ్చిన అర్జీల్లో కొన్ని.. -
ఏపీ ఈఏపీ సెట్ ప్రారంభం
తొలి రోజు ఎన్టీఆర్ జిల్లాలో 91.21, కృష్ణాలో 95.71 శాతం హాజరు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీ ఈఏపీ సెట్)– 2025 సోమవారం ప్రారంభమైంది. తొలి దశలో రెండు రోజుల పాటు అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యార్థులకు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం 15 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, అలాగే మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్షలు కొనసాగాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఉదయం సెషన్కు 1,700 మందికి 1,555 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం సెషన్కు 1,700 మందికిగానూ 1,546 మంది పరీక్ష రాశారు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో ఉదయం సెషన్కు 291 మందికి 282మంది, మధ్యాహ్నం సెషన్కు 292 మందికి 276 మంది హాజరయ్యారు. కృష్ణాలో 95.71, ఎన్టీఆర్లో 91.21శాతం హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 3,983 మందికి 3,659 మంది పరీక్ష రాశారు. -
రైల్వే హాస్పిటల్లో నేరస్తుల సామాజిక సేవ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో చిన్న, చిన్న నేరాలకు పాల్పడిన నేరస్తులకు రైల్వే కోర్టు న్యాయమూర్తి ఆర్.వి శర్మ భారత న్యాయ సురక్షా సంహిత్ను అనుసరించి 133 మంది నేరస్తులకు జరిమానాతో పాటు సమాజ సేవా చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు పర్యవేక్షణలో 133 మంది నేరస్తులు విజయవాడ రైల్వే హాస్పటల్ ప్రాంగణంలో రోగులకు మజ్జిగ సరఫరా చేశారు. అనంతరం హాస్పటల్ పరిసరాలను శుభ్రపరిచారు. ఇటువంటి శిక్షలు విధించడంతో వారిలో పరివర్తన, సామాజిక బాధ్యత తెలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 22న జెడ్పీ సర్వసభ్య సమావేశం చిలకలపూడి(మచిలీపట్నం):ఈ నెల 22వ తేదీన జిల్లా పరిషత్ స్థాయీ సంఘాలు, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్ శనివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం 11 గంటలకు జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో సర్వసభ్య సమావేశం నిర్వహణ ఉంటుందని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్రతో పాటు శాసనసభ్యులు, ఇతర ప్రత్యేక ఆహ్వానితులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు హాజరవుతారని తెలిపారు. -
హోరాహోరీగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. సీనియర్స్ విభాగం పోటీలను శనివారం రాత్రి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ప్రారంభించారు. సీనియర్స్ విభాగంలో ఆరు జతలు పోటీలో పాల్గొన్నాయని పశు ప్రదర్శన కమిటీ సభ్యులు తెలిపారు. 25 నిమిషాల వ్యవధిలో 1.900 టన్నుల బరువును లాగినట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు దుస్తులు, జ్ఞాపికలు అందజేశారు. నగదు బహుమతుల అందజేత శుక్రవారం రాత్రి జరిగిన జూనియర్ కేటగిరీ పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం అతోటి శిరీష చౌదరి ఎడ్ల జత 20 నిమిషాల వ్యవధిలో 3,504.09 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు చెందిన రోహన్బాబు ఎడ్ల జత 3,451 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా పర్చూరు మండలం చిన్న నందిపాడు గ్రామానికి చెందిన ఆలా మోహన్రావు, పల్నాడు జిల్లా అమరావతి మండలం జీడుగు గ్రామానికి చెందిన ఎడ్ల జత 2,770.10 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నాందేడ్లవారిపాలెం గ్రామానికి చెందిన కాకర్ల సురేష్బాబు ఎడ్ల జత 2,760.04 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెద్దపులిపాక గ్రామానికి చెందిన గరికపాటి శ్రీధర్ ఎడ్ల జత 2,250 అడుగుల దూరం లాగి ఐదో స్థానం, గుంటూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి ఆంజనేయులు ఎడ్ల జత 2,000 అడుగుల దూరం లాగి ఆరో స్థానంలో నిలిచాయని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు వరుసగా రూ.70 వేలు, రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.25 వేల చొప్పున నగదు బహుమతులు అందించినట్లు కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ – పరీక్ష (ఏపీఈఏపీసెట్)– 2025 సోమవారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. సంబంధిత పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (ఆన్లైన్) విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యార్థులకు ఈ నెల 19, 20 తేదీలలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుండగా ఇంజినీరింగ్ స్టీమ్ (ఎంపీసీ) విద్యార్థులకు 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో ఇంజినీరింగ్కు 37,666 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 6671 మంది, రెండు పరీక్షలకు హాజరువుతున్న వారు 86 మంది ఉండగా మొత్తం జిల్లాలో పరీక్షకు హజరయ్యేవారు 44,468 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా 38,269 మంది విద్యార్థులు ఒక్క విజయవాడలోనే పరీక్షలకు హాజరవ్వనున్నారు. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి 5,050 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 1141, ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్షలకు హాజరవుతున్నవారు 18 మంది జిల్లా వ్యాప్తంగా హాజరయ్యే వారు 6209 మంది విద్యార్థులున్నారు. ఇందులో ఉదయం సెషన్ తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం సెషన్కు 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షను నిర్వహించనున్నారు. జిల్లాలో పరీక్ష కేంద్ర వివరాలు ఇలా... ఈఏపీసెట్ పరీక్ష కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను సిద్ధం చెశారు. ఎన్టీఆర్ జిల్లాలో పన్నెండు, కృష్ణా జిల్లాలో మూడు కేంద్రాలు ఉన్నాయి. అవి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ధనేకుల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఐకాన్ డిజిటల్ జోన్ కానూరు, ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజీస్, పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రసాద్ వీ పొట్లూరి సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్కే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సాయిలక్ష్మీ కంప్యూటర్స్, గొల్లపూడి, శ్రీ విజయదుర్గా ఐటీ ఇన్ఫో సొల్యూయేషన్స్, కానూరు (కానూరు ఎనికేపాడు డొంకరోడ్డు), ఎస్వీటీ ఇన్ఫోటెక్, గవర్నరుపేట విజయవాడ, వెలగపూడి రామకృష్ణ సిద్థార్థ ఇంజనీరింగ్ కళాశాలను ఎంపిక చేశారు. అదేవిధంగా తిరువూరులో శ్రీవాహిణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరువూరు, మైలవరంలో లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరం తదితర కేంద్రాలను కేటాయించారు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గుడ్లవల్లేరు, దైతా మధుసూధన్ శాస్త్రి శ్రీ వెంకటేశ్వర హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మచిలీపట్నం, శ్రీ వాసవీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నందమూరు మచిలీపట్నం కేంద్రాలు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలు రెండు జిల్లాల్లో పరీక్షకు హాజరుకానున్న 50,677 మంది విద్యార్థులు రాష్ట్రంలో అత్యధికంగా విజయవాడలోనే పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులు 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు 21 నుంచి 27 వరకూ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు -
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
కృష్ణా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ చిలకలపూడి(మచిలీపట్నం): స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని దీన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ హెచ్చరించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం మధ్యాహ్నం ఆరవ అదనపు జిల్లా జడ్జి పి.పాండురంగారెడ్డితో కలిసి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉన్న జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో పక్కా నిఘా ఉంచి తనిఖీలు చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై మాత్రమే కాకుండా అడిగిన వారు, ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవా లని అధికారులకు సూచించారు. న్యాయమూర్తి పాండురంగారెడ్డి మాట్లాడుతూ జిల్లా జనాభాలో సీ్త్ర, పురుష లింగ నిష్పత్తుల గణాంకాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నిష్పత్తుల్లో వ్యత్యాసం లేకుండా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా స్కానింగ్ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ కోసం ఐదు దరఖాస్తులు, రెన్యువల్ కోసం మూడు, క్యాన్సిలేషన్కు ఒక దరఖాస్తు వచ్చినట్లు డీఎంఅండ్హెచ్వో ఎస్ శర్మిష్ట వివరించారు. సమావేశంలో కమిటీ సభ్యులు ధర్మతేజ, పి. వెంకటేశ్వరరావు, విద్య మాస్ మీడియా అధికారి సీహెచ్ వాణిశ్రీ పాల్గొన్నారు. -
టెన్త్ సప్లిమెంటరీకి సన్నద్ధం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఫలితాల వెల్లడి రోజునే షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో పదో తరగతి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షను రాసినట్లయితే వారికి ఆ సర్టిఫికెట్పై సప్లిమెంటరీగా నమోదైది. కానీ గతంలో మాదిరిగా కాకుండా సప్లిమెంటరీ విద్యార్థులను కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 59 పరీక్షా కేంద్రాలను అధికారులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక తరగతులు.... గతేడాది మాదిరిగానే పదో తరగతి పరీక్షలు తప్పిన విద్యార్థులకు ఆయా పాఠశాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు ఉత్తీర్ణులయ్యే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు దాదాపుగా అన్ని పాఠశాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని ఆయా సబ్జెక్ట్లకు చెందిన ఉపాధ్యాయులు ప్రతి రోజూ ప్రత్యేక తరగతులను తీసుకొని తప్పిన విద్యార్థులను పరీక్షలకు సమాయత్తపరుస్తున్నారు. కొన్ని మెలకువలను నేర్పించి తీర్చిదిద్దుతున్నారు. హాల్ టికెట్లను పరీక్షల విభాగం ఆయా పాఠశాలలకు పంపించగా, ప్రధానోపాధ్యాయులు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించే పనిలో ఉన్నారు. 24 వరకూ ఓపెన్ స్కూల్ పరీక్షలు... ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ విద్యార్ధులకు సైతం ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకూ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు పదో తరగతితో పాటుగా ఇంటర్మీడియట్ విద్యార్థులు హాజరవుతారు. వీరికి సంబంధించి 1677 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలకు పదో తరగతికి 17, ఇంటర్మీడియెట్కు 12 చొప్పున పరీక్షా కేంద్రాలను అధికారులు కేటాయించారు. అధికారుల నియామకం జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 30 కేంద్రాలకు 30 మంది చీఫ్ సూపరింటెండెంట్లను జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు నియమించారు. వారితో పాటుగా మరో 30 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లును నియమించారు. ప్రశాపత్నాలు భద్రపరిచేందుకు, వాటిని పంపిణీ చేసేందుకు వివిధ పోలీసుస్టేషన్లను ఎంపిక చేశారు. అదేవిధంగా ఓపెన్ స్కూల్కు సంబంధించి సైతం మరో 29 మంది అధికారులను కేటాయించారు. వాటితో పాటుగా పరీక్షల నిర్వహణకు సుమారుగా 300 మంది ఇన్విజిలేటర్లను సైతం అధికారులు సిద్ధం చేశారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏడు బృందాలు పరీక్షలను పరిశీలించనున్నాయి. ప్రశ్నాపత్రాల పంపిణీని ఈ నెల 16వ తేదీన ప్రారంభించారు. 19 నుంచి 28వ తేదీ వరకూ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలు పరీక్ష రాయనున్న 1677 మందిఓపెన్ స్కూల్ విద్యార్థులు ఓపెన్ స్కూల్ పరీక్షలకు మరో 29 కేంద్రాలు పరీక్షకు హాజరు కానున్న 6149 మంది విద్యార్థులు పరీక్షలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎస్ఎస్సీ పరీక్షలకు 30 కేంద్రాలను, ఓపెన్ స్కూల్ పరీక్షలకు 29 కేంద్రాలను ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఆయా పాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సైతం దృష్టా సారించి వాటిని సిద్ధం చేస్తున్నాం. ఇతర విభాగాల సహకారంతో అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేస్తాం. – యువీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్ మార్చి 19వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలను నిర్వహించింది. అందులో ఎన్టీఆర్ జిల్లా నుంచి 27,467 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. వారిలో 23,534 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే వారిలో 3933 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్ట్ల్లో తప్పటంతో పదో తరగతి పరీక్షలు ఉత్తీర్ణులు కానట్లుగా ఫలితాలను ప్రకటించారు. వారితో పాటుగా గతంలో ఫెయిలైన విద్యార్థులతో కలిపి మొత్తం 6149 మంది విద్యార్థులు పరీక్షలకు హజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పరీక్షకు హజరయ్యే విద్యార్థులు ఉండటంతో దాదాపుగా అన్ని మండలాల్లో పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. -
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడ అలంకార్ సెంటర్లో శనివారం మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ నగరంలో వీధి దీపాలు సక్రమంగా వెలుగుతున్నాయని, నీటి సరఫరా జరుగుతుందంటే కారణం మున్సిపల్ కార్మికులేనన్నారు. అటువంటి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేయకపోవడం అన్యాయమన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల వేతనాలు పెంచారని చెప్పారు. ఆప్కాస్ ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు అందించిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాల పై బడిన కార్మికులను క్రమబద్దీకరించాలన్నారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఆదుకోవాలని విన్నవించారు. ఇతర న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు భవిష్యత్లో చేపట్టే ఆందోళనకు తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందన్నారు. ధర్నాలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహేష్, పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించండి జికొండూరు: సేంద్రీయ ఎరువుల తయారీ గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సేంద్రీయ ఎరువుల గుంతలతో పారిశుద్ధ్యం సమస్యకు చెక్ పెట్టడంతో పాటు బహుళ ప్రయోజనాలు కలిగిన సేంద్రీయ ఎరువులు తయారు చేసుకోవచ్చని సూచించారు. జికొండూరులో సేంద్రీయ ఎరువుల (కంపోస్ట్ ఫిట్) తయారీ గుంతల తవ్వకం పనులను శనివారం ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కంపోస్ట్ ఫిట్లకు ఎటువంటి ఖర్చులు లేకుండా ఉపాధిహామీ పథకంలో చేపట్టవచ్చన్నారు. ఈ ఏడాది జిల్లాలో 17వేల గుంతలు తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. పారిశుద్ధ్యం, పశు వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ రాము, డీఆర్డీఏ పీడీ నాంచారరావు, డీపీవో లావణ్యకుమారి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
రేషన్ కోసం తప్పదు కుస్తీ!
ఇంటి వద్దనే రేషన్ ఇవ్వాలి ఎండీయూ వాహనం ద్వారా ఇప్పటి వరకు ప్రతినెలా ఇంటి వద్దనే రేషన్ బియ్యం తీసుకుంటున్నా. ఇక నుంచి ఇంటి వద్దకు వాహనం రాదనే ప్రచారం జరుగుతోంది. ఎండీయూ వాహనాలను రద్దు చేస్తే రేషన్ షాపు వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి. ఇంటికి దూరంగా ఉన్న రేషన్ షాపునకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాలంటే ఇబ్బందులు తప్పవు. – సెశెట్టి ఈశ్వరి, కొండపల్లి, ఇబ్రహీంపట్నం మండలంసరుకుల కోసం పని మానుకోవాలి ఎండీయూ వాహనాలను తొలగించాలని ఆలోచన చేయడం బాధాకరం. ఇళ్లకు దూరంగా ఉన్న రేషన్ దుకాణాలకు దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు వెళ్లి రేషన్ తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడాల్సిందే. రేషన్ షాపుల వద్దకు వెళ్తే సరుకుల కోసం ఒక రోజు పని మానుకోవాల్సి వస్తుంది. ఇంటింటి రేషన్ పంపిణీపై ప్రభుత్వ పునరాలోచించాలి. – కంతేటి అగ్నేసమ్మ, కిలేశపురం, ఇబ్రహీంపట్నం మండలం ● ఎండీయూ వాహనాలకు ప్రభుత్వం మంగళం! ● డీలర్లతో రేషన్ సరుకుల పంపిణీకి కసరత్తు ● నిలిచిపోనున్న ఇంటింటికీ రేషన్ పంపిణీ ● ఆందోళనలో ఎండీయూ వాహనదారులు, కార్డుదారులు ఇబ్రహీంపట్నం: రేషన్ కార్డుదారుల ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులను చేరుస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాల సేవలకు ప్రభుత్వం త్వరలో మంగళం పాడనుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జరిగితే బియ్యం కార్డుల లబ్ధిదారులు పనులు మానుకుని, తమ ఇళ్లకు దూరంగా ఉన్న రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండీయూ వాహనదారులు, రేషన్ దుకాణదారులతో విజయవాడలో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించారు. రేషన్ పంపిణీలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని ప్రకటించారు. రేషన్ పంపిణీపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటా మన్నారు. ఈ పరిణామాలతో ఎండీయూ వాహనాలకు మంగళం పాడనున్నట్లు తేటతెల్లమవుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్కార్డుదారుల ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఐదేళ్ల పాటు ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ సక్రమంగా సాగింది. ఇప్పుడు ఈ వ్యవస్థను నిలిపి వేసేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. ఎండీయూ వాహనాలను నిలిపివేస్తే మైలవరం నియోజకవర్గంలో సుమారు 84,788 మంది రేషన్ కార్డుదారులు, 52 మంది ఎండీయూ వాహనదారులకు ఇబ్బందులు తప్పవు. 2027 జనవరి వరకు అగ్రిమెంట్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా లబ్ధిదారుల ఇంటి వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాహనం ఏ వీధికి వస్తుందో ముందుగానే తెలియజేయడంతో లబ్ధిదారులు ఇంటి వద్ద ఉండి రేషన్ సరుకులు తీసుకునేవారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ఈ విధానం సౌకర్యవంతంగా ఉండేది. గత ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ మేరకు 2027 జనవరి వరకు ఎండీయూ వాహన వ్యవస్థ కొనసాగాల్సి ఉంది. వాహనాలకు బీమా ప్రీమియం చెల్లిస్తామని, అప్పటి వరకు కొనసాగించాలని వాహనదారులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదని సమాచారం. ఎండీయూ వాహనాల తొలగింపునకు కసరత్తు! కూటమి ప్రభుత్వం తిరిగి రేషన్ డీలర్ల ద్వారా ప్రజలకు సరుకులు పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతోందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం త్వరలోనే నూతన విధానాన్ని అమలు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో వాహనదారులు, డీలర్లతో సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఎండీయూ వాహనాల రద్దు ప్రతిపాదన వస్తుందని తెలుస్తోంది. ఎండీయూ వాహనాల వ్యవస్థను రద్దు చేస్తే రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి కార్డులు లైన్లో పెట్టి పడిగాపులు కాయాల్సి వస్తుందని వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 512.70 అడుగుల వద్ద ఉంది. ఇది 136.3003 టీఎంసీలకు సమానం. ‘ప్లాస్టిక్’ నుంచి విముక్తి మోపిదేవి: ప్లాస్టిక్ ముప్పు నుంచి సమాజానికి విముక్తి కలిగిద్దామని శనివారం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ఈఓ వరప్రసాదరావు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలో పిలుపునిచ్చారు. రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో సోమవారం నుంచి ఏపీ ఈఏపీ సెట్ ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. –8లో7న్యూస్రీల్ -
హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం
హనుమాన్జంక్షన్ రూరల్: స్థానిక అభయాంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానాన్ని పూలతో విశేషంగా అలంకరించారు. స్వామివారి ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. ప్రధాన అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకులు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, శృంగారం వెంకట శేషారామాచార్యులు అంజనీపుత్రునికి ప్రభాత సేవ, 1008 గులాబీ పూలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక వేదికపై దాసాంజనేయ భజన సమాజం భక్త బృందం 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసింది. సాయంత్రం హనుమంతునికి బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రధాన కూడలిలోని రామాలయం వద్ద భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. ఉత్సవాలు జరిగే ఆరు రోజులు నిత్యం భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తామని ఆర్యవైశ్య సంఘం నాయకుడు పైడి సుధాకర్ తెలిపారు. -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత జి.కొండూరు: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించినప్పుడే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడంతో పాటు భవిష్యత్తు తరాలకు భరోసా ఇవ్వగలమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జి.కొండూరు మండలంలోని చెవుటూరు గ్రామంలో శని వారం నిర్వహించిన స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా మూడో శనివారం ఒక ప్రత్యేక థీమ్లో స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల బీట్ ది హీట్ను థీమ్గా కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఒక చెట్టును నరకడం తప్పనిసరైతే పది మొక్కలను నాటాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మొక్కలు పెంచడంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని సైతం వదిలేయాలని సూచించారు. చలివేంద్రాల ఏర్పాటు, అన్ని కార్యాలయాల్లో మంచి నీటి సౌకర్యం, ఇంకుడు గుంతలు, నీటి రీచార్జ్ నిర్మాణాలు వంటి అంశాలపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. వడదెబ్బ నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెవుటూరు సర్పంచ్ పిన్నిబోయిన శ్రీదేవి, వైస్ ఎంపీపీ పుప్పాల సుబ్బారావు, డీపీఓ పి.లావణ్యకుమారి, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, డ్వామా పీడీ ఎ.రాము, తహసీల్దార్ సీహెచ్. వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ బి.వి.రామకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్సీల్లో కాన్పులు పెరగాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలను పెంచాలని, రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులను మాత్రమే పెద్ద ఆస్పత్రులకు పంపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. జిల్లాలోని పీహెచ్సీ, యూపీహెచ్సీ వైద్యాధికారులతో ఆరోగ్య కార్యక్రమాల అమలుపై శనివారం విజయవా డలోని తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల నమోదు, ఎన్సీడీ– సీడీ సర్వే, గర్భిణుల నమోదు వంటి కార్యక్రమాల లక్ష్యసాధనలో వెనుకబడి ఉన్న గ్రామీణ ప్రాంత వైద్యాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ మాధవి, మాతృసంరక్షణ నోడల్ అధికారి డాక్టర్ పద్మావతి, డీపీహెచ్ఎన్ డీపీఎంఓ డాక్టర్ నవీన్, లిడియా ఇతర వైద్యాధికారులు, పలువురు పర్యవేక్షకులు పాల్గొన్నారు. కొండపల్లి బొమ్మల ఖ్యాతిని భావితరాలకు చాటాలి కొండపల్లి(ఇబ్రహీంపట్నం): దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించి పలు సూచనలు చేశారు. చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యమున్న జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. శతాబ్దాల నేపథ్యం కలిగిన కొండపల్లి బొమ్మ విశిష్టతను పర్యాటకులకు చాటిచెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ అభివృద్ధి చేస్తామన్నారు. అందమైన పెయింటింగ్స్తో ఈ సెంటర్ను అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. కొండపల్లి ఖిల్లా ట్రెక్కింగ్కు అనుకూలంగా మెట్లమార్గం అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెంటింగ్ ఆఫీసర్ ఎస్.పద్మారాణి, టూరిజం కన్సల్టెంట్ సాహితి, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, మునిసిపల్ కమిషనర్ రమ్యకీర్తన, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 21న జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి కూటమి విధానాలపై వైఎస్సార్ టీఎఫ్ తిరుగుబాటు మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ మే 21వ తేదీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తున్నట్లు ఆ సంఘ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధ్యక్షులు మల్లంపల్లి వెంకట మహంకాళిరావు, టి. జగదేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలపై కూటమి ప్రభుత్వం తీసు కుంటున్న అస్పష్టమైన, అస్తవ్యస్త విధానాలపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉపాధ్యాయ సంఘాలు ఇటీవల విజయవాడలో జరిగిన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సమావేశాన్ని బహిష్కరించాయని తెలిపారు. గుర్తింపు పొందిన తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలు సంయుక్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాయని వివరించారు. దీనిలో భాగంగా ఈ నెల 21న మచిలీపట్నంలోని ఉమ్మడి జిల్లాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి నిర్ణయించామని తెలిపారు. 23న విజయవాడలో డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేస్తామని పేర్కొన్నారు. -
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల వినూత్న నిరసన
చిలకలపూడి(మచిలీపట్నం): సమస్యల పరిష్కారం కోసం ఆయుష్మాన్ భారత్ ద్వారా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు శనివారం వినూత్న నిరసన తెలిపారు. ఉద్యమాన్ని ప్రారంభించి శనివారంతో 20 రోజులు పూర్తయిన నేపథ్యంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా హృదయాకృతిలో ఏర్పడి నిరసన తెలిపారు. సంఘ ప్రతినిధి వి.నాగబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ నిరసన ప్రదర్శనలకు స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రధానంగా ఆరు సంవత్సరాలు దాటిన వారిని క్రమబద్ధీకరించాలని కోరారు. రెగ్యులర్ ఇంక్రిమెంట్లతో పాటు పీఎఫ్ చెల్లింపులు చేపట్టాలన్నారు. ఇన్సెంటివ్లు చెల్లించాలని కోరారు. దీంతో పాటుగా తాము నిర్వహిస్తున్న కేంద్రాల కరెంటు బిల్లులు, అద్దె బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలు మూలల నుంచి వచ్చిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
దివ్యాంగులతో తొండాట
దివ్యాంగులతో కూటమి ప్రభుత్వం తొండాట ఆడుతోంది. పింఛన్ల సంఖ్యను కుదించేందుకు సదరం క్యాంపుల పేరిట వేధిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న పేద దివ్యాంగులను మళ్లీ సదరం క్యాంపులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సదరం క్యాంపుల వద్ద కనీసం వీల్చైర్లు కూడా ఏర్పాటు చేయకుండా ఇబ్బందుల పాలుచేస్తోంది. చేసేదేమీ లేక దివ్యాంగులను వారి బంధువులు భుజాలు, వీపులపై మోస్తూ సదరం క్యాంపులకు తీసుకొస్తున్నారు. విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటుచేసిన సదరం క్యాంపు వద్ద దివ్యాంగుల దుస్థితిని ఈ ఫొటోల్లో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
పెడన: మద్యానికి బానిసై రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెడన పట్టణంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. మచిలీపట్నం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... పట్టణంలోని రామలక్ష్మీ వీవర్స్ కాలనికి చెందిన సింహాద్రి రమేష్ (52) శనివారం వేకువ జామున గుడివాడ – మచిలీపట్నం ప్యాసింజరు రైలు కింద పెడన– వడ్లమన్నాడు రైలు మార్గంలోని పెడన శివారులో రైలుకు ఎదురువెళ్లాడు. రైలు ఢీ కొట్టడంతో పక్కకు పడి చనిపోయాడు. రైలు డ్రైవర్ ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు తెలియజేయడంతో వారు పెడన వచ్చి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతదేహం ఫొటోను వాట్సప్ గ్రూపుల్లో గుర్తించిన బంధువులు రైల్వే పోలీసులకు పూర్తి వివరాలను అందజేయడంతో వారు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీఈసెట్లో జిల్లా విద్యార్థులకు ర్యాంకులు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీఈసెట్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. రెండు వేరువేరు విభాగాలలో జిల్లాకు చెందిన విద్యార్థులు పది లోపు ర్యాంకులు సాధించారు. జిల్లాలోని కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన జ్యోతుల ప్రసన్నలీల బీఎస్సీ మ్యాథ్స్ స్ట్రిమ్కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో 88 మార్కులతో నాలుగో ర్యాంకును సాధించారు. విజయవాడ మల్లికార్జునపేటకు చెందిన గొడుగుల దినేష్కుమార్ సివిల్ విభాగంలో 119 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంకును సాధించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంచి విద్యాసంస్థల్లో చేరనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కొలువులు పొందటం లక్ష్యంగా వివరించారు. మద్యం వ్యసనంతో వ్యక్తి ఆత్మహత్య పెనమలూరు: మద్యం వ్యసనం కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తి గురువారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప కార్మికనగర్కు చెందిన బావిశెట్టి సురేష్ (39)కు 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. అతని చెడు అలవాట్ల కారణంగా భార్యతో విభేదాలతో కొద్ది సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. మద్యం విపరీతంగా తాగుతుండటంతో తండ్రి జయకృష్ణ, సోదరుడు నాగబాబు మందలించారు. దీంతో మద్యం తాగటం మానేస్తానని సురేష్ కొద్ది రోజుల క్రితం కొండాలమ్మ గుడి వద్దకు వెళ్లి కడియం వేసుకున్నాడు. అయితే కొద్ది రోజులకే కడియం తీసివేసి మరల మద్యం తాగటం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో గురువారం మద్యం తాగి సోదరుడు నాగబాబు ఉంటున్న లక్ష్మీపురం కాలనీ ఇంటికి వచ్చాడు. తండ్రి, సోదరుడు మందలించడంతో మనస్తాపానికి గురైన సురేష్ తాడిగడప కార్మికనగర్లో ఉన్న తన ఇంటికి వెళ్లి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలియటంతో వారు ఘటనా స్థలం వద్దకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు
జగ్గయ్యపేట: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ద్వారా పార్ బాయిల్డ్ బియ్యం కొనుగోళ్లు నిలిచిపోవటంతో మిల్లు యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. గత 45 రోజులుగా ఎఫ్సీఐ కొనుగోళ్లు ఆపివేయటంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. అయినా పౌర సరఫరాల శాఖాధికారులు పట్టించుకోవటం లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా మిల్లుల్లో 10 వేల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. జిల్లాలో నాలుగు మిల్లులు.. జిల్లాలో జగ్గయ్యపేటలో వెంకటేశ్వర పార్ బాయిల్డ్, అనుమంచిపల్లిలో శ్రీ పద్మావతి శ్రీనివాసా, విస్సన్నపేట మండలం పుట్రేలలోని వెంకటేశ్వర, ఎ.కొండూరులోని వెంకట శేషసాయి పార్ బాయిల్డ్ రైస్ మిల్లులున్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మిల్లుల వద్ద నుంచి పార్బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తుంది. 45 రోజులుగా కొనుగోళ్లు నిలిపివేయటంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. దీంతో మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రబీ సీజన్ ముగియటంతో ఆయా గ్రామాలలోని రైతు సేవా కేంద్రాల ద్వారా వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటికే మిల్లుల్లో ఽనిల్వ ఉన్న ధాన్యంతో రైతులు తీసుకువచ్చే ధాన్యానికి స్థలం లేక ధాన్యం తీసుకోమంటూ మిల్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇటీవల జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నందిగామ ప్రాంతాల్లోని రైతులకు, యజమానులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరొక పక్క యజమానులు మాత్రం ఎఫ్సీఐ అధికారులు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తే మిల్లుల్లో ధాన్యం ఖాళీ అవుతుందని, అప్పుడు రబీ సీజన్కు ధాన్యం తీసుకునేందుకు మిల్లుల్లో అనువుగా ఉంటుందని, రైతులకు గోనె సంచుల కొరత ఉండదని చెబుతున్నారు. రంగు మారే అవకాశం.. ఎఫ్సీఐ బియ్యం కొనుగోలు చేయకపోవటంతో మిల్లుల్లో ఆరుబయట ఉన్న ధాన్యం బాయిల్డ్ సమయంలో రంగు మారే అవకాశం ఉందని అంతేకాకుండా వర్షాలు పడుతుండటంతో తడిసే అవకాశం ఉందని మిల్లర్లు చెబుతున్నారు. బ్యాంకు గ్యారంటీ గడువు కూడా ముగుస్తుందని, ఎఫ్సీఐ అధికారులు కనీస నిబంధనలు కూడా చెప్పటం లేదని వాపోతున్నారు. 45 రోజులుగా నిలిచిన ఎఫ్సీఐ బియ్యం కొనుగోళ్లు పట్టించుకోని అధికారులు రబీ ధాన్యం తీసుకునేందుకు స్థలం లేక మిల్లర్ల ఇబ్బందులు జిల్లాలోని మిల్లుల్లో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు రెండు, మూడు రోజుల్లో కొనుగోళ్లకు అనుమతులు పార్ బాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి ఎఫ్సీఐ గోడౌన్లకు బియ్యం కొనుగోళ్లకు రెండు, మూడు రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని మిల్లర్లతో మాట్లాడుతున్నాం. అనుమతులు రాగానే కొనుగోలు చేస్తాం. – సతీష్, పౌరసరఫరాల శాఖ డీఎం -
హోరాహోరీగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉన్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోటీలలో భాగంగా న్యూ కేటగిరీ విభాగంలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను గురువారం రాత్రి పశుప్రదర్శన కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూ కేటగిరీ విభాగంలో ఎనిమిది జతలు పోటీలో పాల్గొన్నాయన్నారు. పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు. నగదు బహుమతుల అందజేత గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఆరుపళ్ల విభాగం పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన శ్రీకావ్య నంది బ్రీడింగ్ బుల్స్ నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత 15 నిమిషాల వ్యవధిలో 3911.08 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని కావ్యమధు ఎడ్ల జత 3583.2 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం పంగులూరు గ్రామానికి చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జత 3,500 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి గ్రామానికి చెందిన గాదే అశేర్ సుమన్వీరెడ్డి ఎడ్ల జత 3,481.8 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, పల్నాడు జిల్లా నకిరేకల్ మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన మేక అంజిరెడ్డి ఎడ్ల జత 3412.3 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 3,313.3 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో నిలిచాయని తెలిపారు. విజేతలకు వరుసగా రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేల చొప్పున నగదు బహుమతులు అందించినట్లు కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ పాల్గొన్నారు. -
దోమల నియంత్రణ ద్వారానే డెంగీ నివారణ సాధ్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దోమల నియంత్రణ ద్వారానే డెంగీ వ్యాధిని అరికట్టగలుగుతామని, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రాణాంతక డెంగీ వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఈనెల 16వ తేదీ జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా డెంగీ వ్యాధి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్థ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమల నియంత్రణ ద్వారానే డెంగీ వ్యాధిని అరికట్టగలుగుతామన్నారు. డెంగీ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సంబంధిత అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అధిక జ్వరం, తలనొప్పి, కంటి వెనుక భాగంలో నొప్పి, కండరాల నొప్పి, చర్మంపై గుండ్రటి మచ్చలు వంటి లక్షణాలు ఉన్న వారికి వెంటనే డెంగీ పరీక్షలు నిర్వహించాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ ప్రక్రియను ప్రతి సచివాయాలనికి అనుసంధానించాలని అన్నారు. దోమల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వి.మోతీబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాచర్ల సుహాసిని, వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పర్యాటకులకు మధురానుభూతిని కల్పించేలా కొండపల్లి ఖిల్లా, కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాలను అభివృద్ధి చేయడంతో పాటు ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కొండపల్లి బొమ్మల తయారీ కాలనీ వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు, కొండపల్లి ఖిల్లా అభివృద్ధి పై గురువారం కలెక్టర్ లక్ష్మీశ పర్యాటక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండపల్లిలో సుమారు 400 ఏళ్లకు పైగా రాజస్థాన్కు చెందిన హస్త కళాకారులు అత్యంత కళానైపుణ్యంతో తయారు చేసిన బొమ్మలకు జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. కొండపల్లి పరిసర ప్రాంతాలలో లభ్యమయ్యే తెల్ల పొణికి చెక్కతో రూపొందించే కొండపల్లి బొమ్మలకు మరింత ప్రాచుర్యం కల్పించి కళాకారులను ప్రోత్సహించడం ద్వారా జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా శతాబ్దాల చారిత్రక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా ఉన్న కొండపల్లి బొమ్మల విశిష్టతను పర్యాటకులకు చాటిచెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ను అభివృద్ధి చేస్తామన్నారు. భవనంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి, సుందరీకరణ పనులు చేపట్టి ఆకర్షణీయంగా తీర్చిదిదేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొండపల్లి బొమ్మల కాలనీ నుంచి ఖిల్లా వరకు ఉన్న మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దాలన్నారు. కొండపల్లి వద్ద పర్యాటకులు ట్రెక్కింగ్ నిర్వహించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఎస్.పద్మారాణి, టూరిజం కన్సల్టెంట్ సాహితి, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డీఈ శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ -
గురుకుల విద్యార్థుల ప్రతిభకు పట్టం
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో చదువుతూ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులను సత్కరించారు. వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఎంజేపీ గురుకులాలు, బీసీ గృహాల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి, అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా 31 గురుకుల పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలను తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రిన్సిపాళ్లను కూడా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 200 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, 22 మందికి రూ.20 వేలు, రూ.15, రూ.10 వేల చొప్పున నగదు పురస్కారాలను అందజేశామని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా గురుకుల పాఠశాలల బీసీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించటం అభినందనీయమన్నారు. జూన్ 15వ తేదీన తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అన్ని హాస్టళ్లల్లో సన్న బియ్యంతో భోజనం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సంచాలకుడు డాక్టర్ ఎ.మల్లికార్జున్, అడిషనల్ డైరెక్టర్ డి.చంద్రశేఖర్రాజు, మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల సొసైటీ కార్యదర్శి పి.మాధవీలత, ఎ.కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
చె
రువు మట్టి.. రబట్టి పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో జోరుగా మట్టి తవ్వకాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కూటమి నేతలు సహజ వనరులను కొల్లగొట్టేస్తున్నారు. వారి ధన దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. చెరువులను చెరబట్టి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మట్టిదందా సాగిస్తున్నారు. పామర్రు నియోజకవర్గంలో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే మట్టి దందా సాగుతోంది. ప్రైవేటు వెంచర్లకు మట్టిని విక్రయిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. మరో వైపు ఉచిత ఇసుకను కూడా బొక్కేస్తున్నారు. తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు గ్రామం మొదలుకొని పమిడిముక్కల మండలంలోని లంకపల్లి వరకు సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పేదల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడుస్తున్నారు. రోజుకు 400 లారీల ఇసుకను అక్రమంగా తరలించి జేబులు నింపుకొంటున్నారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో, లంకపల్లి చుట్టుపక్కల కార్మికులు తమ ఉపాధికి గండి కొడుతున్నారని రోడ్డెక్కిన ఘటనలు ఉన్నాయి. గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంతో పాటు, బుడమేరులో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. పామర్రు నియోజకవర్గంలో.. పొలాల్లో పూడికతీత, గ్రామాల్లో ఇళ్ల స్థలాల మెరకల పేరుతో కూటమి నాయకులు గ్రామాల్లో చెరువులను, కుంటలను చెరబట్టారు. చెరువులు, కుంటల్లో అక్రమంగా మట్టిని తవ్వి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలను ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు సైతం మామూళ్లు తీసుకుంటూ తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మట్టి తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ అక్రమ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా పామర్రు, ఉయ్యూరు ప్రాంతంలోని ప్రైవేటు వెంచర్లు, ఇళ్ల స్థలాల మెరకు మట్టి తరలిస్తున్నారు. కొన్ని చెరువుల్లో ఇప్పటికే మట్టి అక్రమ తవ్వకాల ద్వారా కోట్ల రూపాయల దోపిడీని పచ్చనేతలు చేశారు. ఒక్కో చెరువులో మట్టి తరలింపు ద్వారా కోటి రూపాయలకు పైగా దోచుకున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. గుడివాడ నియోజక వర్గంలో.. గుడివాడ నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజాప్రతినిఽధి కనుసన్నల్లో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తూ, కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. బుడమేరులో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడి నుంచి తవ్విన మట్టిని ఓ ఇంటర్నేషనల్ స్కూల్కు తరలిస్తున్నారు. నందివాడ మండలంలో వెన్ననపూడి, ఇలపర్రు గ్రామ చెరువుల్లోనూ మట్టి అక్రమ తవ్వకాలు జోరుగాసాగుతున్నాయి. గుడివాడ మండలంలో లింగవరం, నాగవరప్పాడు, బిళ్లపాడు, సిరిసింతల, కలువపూడి అగ్రహారం, మోటూరు గ్రామ చెరు వుల్లో మట్టి దోపిడీ చేస్తున్నారు. గుడ్లవల్లేరు మండలంలో విన్నకోట గ్రామ చెరువులో యథేచ్ఛగా మట్టి దందా సాగిస్తున్నారు. ఈ మట్టిని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అక్రమంగా చెరువుల్లో మట్టి తవ్విప్రైవేటు వెంచర్లకు తరలింపు పామర్రు నియోజకవర్గప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే తవ్వకాలు అధికారం అండతో రూ.కోట్లు దోచుకుంటున్న కూటమి నేతలు -
ఐటీఐ అర్హతతో అద్భుత ఉపాధి అవకాశాలు
ఐటీఐ అర్హతతో అద్భుత ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక విద్యపై ఆసక్తి కలిగి, వివిధ కారణాలతో ఉన్నత చదువులకు వీలుకాని వారికి ఐటీఐ విద్యాకోర్సులు చక్కని ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. ఐటీఐలో చేరదలిచే విద్యార్థులు ఈ నెల 24వ తేదీ వరకు ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు పూర్తి చేసిన తరువాత నైపుణ్యం కలిగిన విద్యార్థులకు జాబ్మేళాలు నిర్వహించి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తాం. – ఎం.కనకారావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, విజయవాడ ● -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పరిశ్రమలకు అవస రమైన కోర్సులను అందించే ఐటీఐ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పదో తరగతి అనంతరం ఐటీఐ కోర్సులు చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండటమే దీనికి కారణం. ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి అనంతరం చేరాల్సిన కోర్సులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దృష్టి సారిస్తున్నారు. కొంత మంది విద్యార్థులు పాలిసెట్, రెసిడెన్షియల్ కళాశాలల ప్రవేశ పరీక్షలు రాశారు. అధిక శాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ కోర్సుల్లో చేరనున్నారు. ఇంకా కొందరు విద్యార్థులు టెక్నికల్ కోర్సులు ఉన్న పాలిటెక్నిక్, ఐటీఐలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. పదో తరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐ కోర్సులు దోహదం చేస్తాయని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఐటీఐ కాలేజీలు ఇలా.. ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రభుత్వ, పది ప్రైవేటు ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్లలో 680 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సుమారుగా 944 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాల విజయవాడలో రమేష్బాబు హాస్పిటల్ రోడ్డులో ఉంది. ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఐటీఐ (గొల్లపూడి), సెయింట్ జోసఫ్ ఐటీఐ (గుణదల), జంపాల అన్నపూర్ణ ఐటీఐ (విజయవాడ), శ్రీ పద్మావతి ఐటీఐ (నందిగామ), వివేకానంద ఐటీఐ (విజయవాడ), సాయి కృష్ణ ఐటీఐ (తిరువూరు), శ్రీమతి ఈకే ఐటీఐ (జగ్గయ్యపేట), పీఎస్సీ బోస్ ఐటీఐ (నందిగామ), డోలూస్ ఐటీఐ (నందిగామ), నలంద ఐటీఐ (విజయవాడ) కళాశాలలు ఈ సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రభుత్వ, పది ప్రైవేట్ కాలేజీలు వివిధ ట్రేడుల్లో అందుబాటులో 1,624 సీట్లు అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లకు ఈ నెల 24 వరకు గడువు -
ప్రైవేటు టీచర్ల మెడపై అడ్మిషన్ల కత్తి
పెనుగంచిప్రోలు: విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే అడ్మిషన్ల పేరిట తమ వద్ద పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రైవేటు విద్యాసంస్థలు వేధిస్తున్నాయి. మండుటెండల్లో ఇంటింటి ప్రచారం చేసి విద్యార్థులను చేర్పించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. అడ్మిషన్లను తీసుకురాకుంటే జీతం ఇవ్వబోమని హెచ్చరిస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల తీరుతో ప్రైవేటు టీచర్లు, అధ్యాప కులు మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేక పీజీ, డిగ్రీ, బీఈడీలు చేసిన ఎంతోమంది జీవనం సాగించటానికి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి రెండు నెలల ముందే విద్యార్థుల ప్రవేశాలకు టార్గెట్ విధిస్తూ సిబ్బందిని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు వేధింపులకు గురిచేస్తున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచి ప్రోలు, వత్సవాయి, జగ్గయ్యపేట మండలాల్లో సుమారుగా 50 వరకు ప్రైవేటు పాఠశాలలు, పది కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా పెనుగంచిప్రోలులో రెండు, జగ్గయ్యపేటలో మరో రెండు కార్పొరేట్ పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. ఈ సంస్థల్లో వెయ్యి మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు గత నెల నుంచి ఆయా పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇంటింటికి పంపిస్తు న్నాయి. వారు ప్రతి ఇంటికీ వెళ్లి ‘మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా, ఉంటే ఏం చదువుతున్నారు’ అన్న సమాచారం సేకరిస్తున్నారు. వారిని తమ పాఠశాల, కళాశాలలో చేర్పించండని తల్లిదండ్రులను బతిమలాడుతున్నారు. టార్గెట్ పూర్తయితేనే.. ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్లు పూర్తి చేస్తేనే సెలవుల్లో జీతాలు ఇస్తామని కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు నిబంధనలు పెడుతున్నాయి. ఒకొక్కరు కనీసం పది నుంచి 15 మందిని చేర్పించాలన్నది లక్ష్యం. అలా చేర్పించిన తరువాత కూడా సెలవుల అనంతరం పాఠశాల తెరిచాక ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియదు. ఇచ్చే అరకొర జీతాలు నిలిపి వేస్తారనే భయంతో ఉపాధ్యాయులు, సిబ్బంది నానాతంటాలు పడుతుంటారు. భగభగ మండే ఎండల్లో ఇంటింటికీ తిరుగుతూ నానా కష్టాలుపడుతున్నారు. పిల్లలను చేర్పించటం ఒక పని అయితే స్థానికంగా పాఠశాలల నిర్వహణ చూసే బాస్లు సిబ్బందితో మాట్లాడే భాష, వారి ప్రవర్తన మరింత ఇబ్బంది పెట్టేలా ఉంటుందని పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులు వాపోతున్నారు. అడ్మిషన్ల కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడి మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సతమతమవుతున్న సిబ్బంది ఒకవైపు బోధన, మరోవైపు అడ్మిషన్ల టార్గెట్ను పూర్తిచేసే పనిలో ప్రైవేటు, కార్పొరేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు తీవ్ర వత్తిడికిలోనై మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని విద్యావేత్తలు చెబుతున్నారు. తమ వేదనను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలి పోతున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న సమయంలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోలేక, ఒత్తిడిని తట్టుకోలేక ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు యాజమాన్యాలు చాలీచాలని వేతనాలిస్తూ వారి జీవితాలతో చెలగాట మాడుతున్నాయి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు బోధించే టీచర్లకు నెలకు రూ.4,500 నుంచి రూ.5 వేల జీతం మాత్రమే ఇవ్వడం గమనార్హం. పిల్లలను స్కూళ్లలో చేర్పించాలంటూ టార్గెట్లు ఎండల్లో ఇంటింటి ప్రచారం చేయాలని ఆదేశం అడ్మిషన్లను తీసుకురాకుంటే జీతం అందనట్టే మనోవేదనకు గురవుతున్న ప్రైవేటు టీచర్లుభారీగా ఫీజులు విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఈ నిబంధన జిల్లాలోని ఏ ప్రైవేట్ పాఠశాలలో అమలు కావటం లేదు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు దండుకుంటున్నారు. టెక్నో, ఈ–టెక్నో, సీబీఎస్ఈ , ఐఐటీ కోచింగ్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లిష్, కరాటే, డ్రాయింగ్ తదితరాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారాన్ని మోపుతున్నారు. దీనికి అద నంగా యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బూట్లు, సాక్సులు, టై వంటివి ఆయా పాఠశాలల్లోనే అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. -
నిత్యాన్నదానానికి భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు అందచేశారు. హిందూ పూర్కు చెందిన బి.నవీన్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ ఈఓ శీనానాయక్ను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందచేశారు. విజయవాడ భవానీపురానికి చెందిన శీలం సాయి ఫణీంద్ర కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళం సమర్పించింది. దాతలకు ఈఓ శీనానాయక్, ఆలయ పర్యవేక్షకుడు నాథురామ్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. దుర్గమ్మకు వెండి పంచపాత్ర సమర్పణ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం దంపతులు గురువారం వెండి పంచపాత్రను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్ష్మీకాంతం దంపతులు ఆలయానికి విచ్చేయగా, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం రూ.2 లక్షలు ఖర్చుచేసి 2.028 కిలోల వెండితో తయారు చేయించిన పంచపాత్రను ఆలయ అధికారులకు అందజేశారు. లక్ష్మీకాంతం దంపతులకు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. తిరుమలగిరి హుండీ ఆదాయం రూ. 26.41 లక్షలు తిరుమలగిరి(జగ్గయ్యపేట): స్థానిక వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామికి హుండీ కానుకల ద్వారా రూ.26,41,390 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్ తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో కానుకల లెక్కింపు నిర్వహించారు. గత నెలలో నిర్వహించిన స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ పవన్కల్యాణ్, పరిటాల సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అడ్డుకున్న గ్రామస్తులు హుండీ కానుకల లెక్కింపు సమాచారాన్ని ఆలయ పాలకవర్గానికి ఇవ్వలేదని కొద్దిసేపు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల జరిగిన కల్యాణ మహోత్సవాల్లో ఆలయ ఈఓ ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేశారని, ఆ వివరాలు కూడా చెప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని గ్రామస్తులకు సర్దిచెప్పారు. ఆ సమయంలో ఆలయ ఈఓ కార్యాలయంలో లేరు. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులపై ఆలయ ఈఓ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొండపల్లి మునిసిపల్ చైర్మన్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇబ్రహీంపట్నం: మండలంలోని కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మునిసిపల్ కమిషనర్ రమ్యకీర్తనకు హైకోర్టు నుంచి సీల్డ్ కవర్ వచ్చింది. సీల్డ్ కవర్ను సబ్ ట్రెజరీలో భద్రపర్చాలని ఆదేశాలు ఉన్నాయి. దీంతో మైలవరం సబ్ ట్రెజరీ అధికారులకు దానిని గురువారం మునిసిపల్ కమిషనర్ అందజేశారు. విజయవాడ ఆర్డీఓ చైతన్య ఈ సీల్డ్ కవర్ను తెరిచి అందులో ఉన్న ఉత్తర్వుల మేరకు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. 2021 నవంబర్లో 29 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్ సీపీ నుంచి 14 మంది, టీడీపీ నుంచి 14 మంది కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఒకరు ఇండిపెండెంట్గా గెలుపొందారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ టీడీపీలో చేరడంతో వారి సంఖ్య 15కు చేరింది. అప్పటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓటుతో వైఎస్సార్ సీపీ సంఖ్య కూడా 15 అయింది. అప్పటి టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్అఫీ షియో ఓటు కోసం కోర్టును ఆశ్రయించడంతో ఎన్నిక నిర్వహించి సీల్డ్కవర్ ద్వారా కోర్టుకు సమర్పించారు. ఇటీవల కాలంలో కేశినేని నాని కేసు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులు సీల్డ్ కవర్లో వచ్చాయి. -
ప్రతిభకు కార్పొరేట్ వల
కంకిపాడు: ‘‘ఇంటర్లో స్టేట్ 1, 2, 3 ర్యాంకులు మావే... నీట్, ఎంసెట్లోనూ మేమే టాప్..’’ అంటూ కార్పొరేట్ విద్యాసంస్థలు తమ స్థాయిని పదిలం చేసుకోవాలంటే ప్రతిభావంతులైన విద్యార్థులు ఉంటేనే సాధ్యం. అందుకు ప్రతిభావంతులైన విద్యార్థులు పక్క విద్యాసంస్థల్లో చేరకుండా తమ సంస్థల్లోనే అడ్మిషన్లు పొందేలా చేసుకోవాలి. దీంతో పలు విద్యాసంస్థలు అడ్మిషన్లలో తీవ్ర పోటీ పడుతున్నాయి. ప్రతిభావంతులను చేర్చుకునే పనిలో పడ్డాయి. సమయం లేదుగా... ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్ తరగతులు జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమకు అనువైన, అందుబాటులో ఉన్న కళాశాలల్లో కోర్సులను ఎంపిక చేసుకుని అడ్మిషన్లను పొందుతున్నారు. ఈ కొద్ది రోజుల సమయాన్ని వినియోగించుకుని అడ్మిషన్లను భారీగా నమోదు చేసుకునే పనిలో పేరొందిన కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన విద్యాసంస్థలు నేడు గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్రాంచిలను అందుబాటులోకి తెచ్చి గ్రామీణ విద్యార్థులను చేర్పించుకుంటూ, అందుబాటులోనే తమ సంస్థ బ్రాంచిలు ఉన్నాయంటూ ప్రచారంలో ముందున్నాయి. ఆఫర్లే...ఆఫర్లు పది ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులపై టాప్–5లో ఉన్న కార్పొరేట్ సంస్థలు దృష్టి సారించాయి. వారు చదివిన పాఠశాలల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి వారిని నేరుగా కలుసుకుని అడ్మిషన్లను ఖాయం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభను చూసి ఆఫర్లు ఇస్తున్నారు. 550 మార్కులు దాటితే ఫీజులో 50 శాతం రాయితీ, 575 మార్కులు దాటితే 75 శాతం రాయితీ, 590 పైన మార్కులు వస్తే 80–90 శాతం వరకూ ఫీజుల్లో రాయితీ, అవసరమైతే అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తామంటూ ఆఫర్లు మీద ఆఫర్లు అందిస్తున్నారు. ఇదే క్రమంలో గత విద్యాసంవత్సరంలో తమ సంస్థకు వచ్చిన ర్యాంకులు, నీట్, ఎంసెట్ ఫలితాల్లో టాప్గా నిలిచామంటూ ప్రకటనలను చూపించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆకర్షణ మంత్రం వాడుతున్నారు. ఎంసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ అన్నింటికి కోచింగ్ ఇదే ఫీజులో అందిస్తామంటూ ఆశ చూపుతున్నారు. ఇంటర్లో అడ్మిషన్ల కోసం క్యూలు కడుతున్న వైనం విద్యార్థుల ఇళ్ల చుట్టూ అధ్యాపకుల ప్రదక్షిణలు రకరకాల ఆఫర్ల పేరుతో ఆకర్షించే యత్నం అడ్మిషన్లు మిస్సయితే జీతాలు కట్ కొంతమంది విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభను తమ ఖాతాలో వేసుకుని కోట్లు దండుకుంటున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు. టెన్త్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు వల వేసి, వారికి ఫీజుల్లో 50 నుంచి 90 శాతం వరకు కూడా రాయితీల ఆశ చూపించి తమ సంస్థల్లో చేర్చుకుంటాయి. ఇంటర్లో వారు సాధించిన ర్యాంకులను తమ గొప్పలుగా చెప్పుకొంటూ లక్షలాది అమాయక విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాయలు పోగేసుకుంటున్నాయి. మరో వైపు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మెడపై కార్పొరేట్ సంస్థలు కత్తి పెడుతున్నాయి. ఎంపిక చేసుకున్న విద్యార్థుల అడ్మిషన్ నూరు శాతం ఓకే అవ్వాలి. అడ్మిషన్ల సంఖ్య తగ్గినా, ముఖ్యమైన టార్గెట్ మిస్సయినా మే నెల జీతాలు ఉండబోవని ఆయా సంస్థలు తమ సిబ్బందికి టార్గెట్లు నిర్ణయిస్తున్నాయి. దీంతో సిబ్బంది చేసేది లేక విద్యార్థులు, వారి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎలాగోలా అడ్మిషన్ ఓకే అయ్యేలా చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు. -
ఖరీఫ్ సాగుపై నీలినీడలు
నిధులు మంజూరు చేయని ప్రభుత్వం గండ్లు పూడ్చకపోతే సాగు చేయలేం వెల్లటూరు పడమర చెరువు కింద నాకు 2 ఎకరాల పొలం ఉంది. పోయిన సంవత్సరం ఖరీఫ్లో వరి సాగు చేశాను. చెరువుకు ఐదు చోట్ల గండ్లు పడి పైరు పూర్తిగా కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయాను. ఇప్పటివరకు గండ్లు పూడ్చలేదు. గండ్లు పూడ్చకపోతే పంట సాగు చేయలేం. –మాదు నాగయ్య, రైతు, వెల్లటూరు పులివాగు గండ్లతో తీవ్రంగా నష్టపోయాం గత ఏడాది బుడమేరుకు వచ్చిన వరదలతో పులివాగు పొంగి గండ్లు పడ్డాయి. ఈ వరదల వలన నేను సాగు చేసిన నాలుగు ఎకరాల్లో వరిపైరు కుళ్లిపోయింది. తీవ్రంగా నష్టపోయాను. గండ్లు ఇప్పటివరకు పూడ్చలేదు. ఈ ఏడాది సాగు చేపట్టడం కూడా దండగ అనిపిస్తోంది. గండ్లు పూడ్చకపోతే సాగు చేపట్టలేం. –బెజవాడ వీరయ్య, రైతు, కవులూరు ఎనిమిది నెలలైనాగండ్లు పూడ్చలేదు గత ఏడాది వరదల వలన పులివాగుకు గండ్లు పడి నేను సాగు చేసిన పది ఎకరాల్లో వరిపైరు పాడైపోయింది. తీవ్రంగా నష్టపోయాను. గండ్లు పడి ఎనిమిది నెలలు దాటినా గండ్లు పూడ్చకపోవడం దారుణం. ప్రభుత్వం వెంటనే గండ్లను పూడ్చాలి. లేదంటే ఈ ఏడాది సాగు చేపట్టడం కష్టమే. –బొర్రా శ్రీనివాసరావు, రైతు, కవులూరు కూటమి ప్రభుత్వానికి అమరావతి జపం తప్ప రాష్ట్రంలో రైతులు ఏమై పోయినా పట్టదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా దళారీల దోపిడీకి దారులు తెరుస్తోంది. మిర్చికి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నా పట్టించుకోదు. బుడమేరు వరదలకు గండ్లు పడి ఎనిమిది నెలలైనా వాటిని పూడ్చాలనే ధ్యాసే ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది ఖరీఫ్లో 10 వేల హెక్టార్లలో సాగు ప్రశ్నార్థకం కానుంది. జి.కొండూరు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. గత ఏడాది జల ప్రళయాన్ని సృష్టించిన బుడమేరు ప్రక్షాళన సంగతి దేవుడెరుగు కనీసం చెరువులకు, వాగులకు పడిన గండ్లను పూడ్చడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగు చేపట్టాలో లేదో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువ బుడమేరు గండ్లతో పాటు పలు వాగులు, ఎన్ఎస్పీ కాల్వలకు పడిన గండ్లను అలానే వదిలేయడంతో మరో జల ప్రళయానికి ఆస్కారమిచ్చేలా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ... బుడమేరు డైవర్షన్ కెనాల్కు జి.కొండూరు మండల పరిధి కవులూరు శివారులో పడిన భారీ గండ్ల వద్ద జరుగుతున్న లైనింగ్ పనులను ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చెరువులు, వాగులు, ఎగువ బుడమేరు గండ్లు పూడ్చకపోతే తాము సాగు చేయలేమంటూ మొరపెట్టుకున్నారు. ఖరీఫ్ సాగు చేయమంటారా, వద్దంటారా అని మంత్రిని రైతులు పశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ దాటవేత ధోరణితో మాట్లాడారు. గండ్లు పూడ్చేందుకు ప్రతిపాదనలు ఆర్థికశాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయని, నిధులు విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. లైనింగ్ పనులకు విడుదలైన నిధులనే ఆర్థికశాఖ రిజెక్ట్ చేస్తే సమస్య తీవ్రతను వివరించి నిధులు తెచ్చామంటూ గొప్పలు చెప్పారు. మంత్రి మాటలను విని నవ్వాలో, ఏడవాలో తెలి యని పరిస్థితిలో రైతులు ఉన్నారు. గండ్లు పూడ్చకపోతే క్రాప్ హాలిడే ప్రకటించడమే మేలని భావిస్తున్నారు.ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే బుడమేరు వరద ముంపునకు గురైన పదివేల హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం కానుంది. వర్షాకాలం ముంచుకొస్తున్నా... గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షానికి బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో మైలవరం నియోజకవర్గంలో 34 చెరువులకు గండ్లు పడ్డాయి. వీటితో పాటు పులివాగు, కోతులవాగు, ఎన్ఎస్పీ కాల్వలకు సైతం గండ్లు పడి వేలాది ఎకరాల్లో ఖరీఫ్ పంటను రైతులు నష్టపోయారు. ఈ వరదల వలన చెరువులకు పడిన గండ్లను తాత్కాలికంగా కొన్ని చోట్ల పూడ్చినప్పటికీ కొన్ని చెరువులు, వాగులు, ఎగువ బుడమేరు గండ్లకు తట్ట మట్టి కూడా వేయలేదు. వేసవి కాలం పూర్తయి వర్షాకాలం వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా చోద్యం చూస్తుండడంతో ఖరీఫ్ సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బుడమేరు గండ్లు పూడ్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం వర్షాకాలం సమీపిస్తున్న వేళ రైతుల ఆందోళన గండ్లు పూడ్చకపోతే సాగు చేపట్టడం కూడా దండగేనంటున్న రైతులు గండ్లు పూడ్చాలంటూ ఇరిగేషన్ మంత్రికి మొరపెట్టుకున్న రైతులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిన మంత్రి 10వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకమే క్రాప్ హాలిడే తప్పదాబుడమేరు వరదల వలన వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువ బుడమేరు అంటే బుడమేరు ప్రారంభం వరకు వాగుకు ఇరువైపులా కట్టలకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు 65 పనులుగా నిర్థారించారు. ఈ పనులకు రూ.29 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపి నెలలు గడుస్తున్నా నిధులు విడుదల చేయలేదు. దీంతో పాటు చెరువులు, పులివాగు, కోతులవాగు, ఎన్ఎస్పీ కాల్వలకు పడిన గండ్లను శాశ్వతంగా పూడ్చేందుకు రూ.35 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు పంపినా నిధులను విడుదల చేయలేదు. కేవలం బుడమేరు డైవర్షన్ కెనాల్కు కవులూరు గ్రామశివారులో పడిన భారీ గండ్ల వద్ద లైనింగ్ పనులు, హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులకు మాత్రమే రూ.39.77 కోట్లు నిధుల విడుదల చేసి చేతులు దులుపుకొన్నారు. -
నిర్లక్ష్యాన్ని సహించను
ఉపాధి లక్ష్యాల సాధనలో గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా శ్రామికులకు 80 లక్షల పనిదినాలను కల్పించాలనే లక్ష్యాన్ని సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, లక్ష్య సాధనలో నిర్లక్ష్యాన్ని సహించనని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. పనుల నిర్వహణలో వెనుకబడితే చర్యలు తప్పవని, శ్రామికులకు రూ.307 కనీస వేతనం కల్పించి ఆర్థిక ఊతం ఇచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో చేపడుతున్న పనుల ప్రగతిపై బుధవారం నీటి యాజమాన్య సంస్థ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, మండలాభివృద్ధి అధికారులు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులతో కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా శ్రామికులకు పని కల్పించి వారికి ఆర్థిక ఊతం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదన్నారు. ఈ ఏడాది శ్రామికులకు 80 లక్షల పని దినాలను కల్పించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 13.40 లక్షల పని దినాలను మాత్రమే కల్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో పనులను మరింత వేగవంతం చేసి లక్ష్య సాధన వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. జగ్గయ్య పేట, నందిగామ, చందర్లపాడు, రెడ్డిగూడెం విస్సన్నపేట, ఎ.కొండూరు మండలాలలో ఆశించిన స్థాయిలో లేదని, ఆయా మండలాల అధికారులు మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉపాధి హామీ ద్వారా 3వేల పంట కుంటలను నిర్మించాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 572 కుంటలు మాత్రమే పూర్తి చేశారన్నారు. ఉపాధి హామీ పనులలో ఉద్యాన పంటల పనులకు ఆర్థిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉద్యాన పంటల సాగుకు ప్రతి గ్రామంలో కనీసం 20 ఎకరాలను గుర్తించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సరాసరి 294 రూపాయలు మాత్రమే శ్రామికులకు లభిస్తోందని చేపట్టనున్న పనుల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన రూ.307 దినసరి కనీస వేతనం తప్పనిసరిగా లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జాతీయ ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.రాము, ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు పి. బాలాజీ కుమార్, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రామికులకు కనీస వేతనం రూ.307 కల్పించాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
ఆకట్టుకున్న గోదా కల్యాణం నృత్య రూపకం
శ్రీకాకుళం(ఘంటసాల): శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషాభిమానాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన గోదా కల్యాణం కూచిపూడి నృత్య రూపకం ఆసాంతం ఆకట్టుకుంది. శ్రీకృష్ణదేవరాయల మహోత్సవం సందర్భంగా ఆముక్త మాల్యద కావ్యం నుంచి డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్, కేవీ సత్యనారాయణ రచించిన గోదా కల్యాణం కూచిపూడి నృత్య రూపకాన్ని బుధవారం రాత్రి ప్రదర్శించారు. శ్రీకృష్ణదేవరాయలుగా కేవీ సత్యనారాయణ అభినయించారు. తొలుత కేవీ సత్యనారాయణను జస్టిస్ యు.దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘనంగా సన్మానించారు. -
ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు
గూడూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టిగూడూరు సమీపంలో ఆటో బోల్తా కొట్టిన ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మచిలీపట్నంలో జరిగే ఓ శుభకార్యానికి వెళ్లడానికి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లికి చెందిన 15 మంది ఆటోలో బయలుదేరారు. ఆ ఆటో తరకటూరుపాలెం దాటిన తర్వాత అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆటో డ్రైవర్ తాడిశెట్టి శివరామప్రసాద్, పునుగుపాటి కోటేశ్వరమ్మ, పునుగుపాటి వెంకటేశ్వరమ్మ, మోచర్ల బ్లెస్సీ, కామరవపు శ్రీరష్మ, మోచర్ల సుజాత, రామకోటి ధనుష్, మోచర్ల జాయి, మోచర్ల వెంకటేశ్వరరావు తదితరులు గాయపడ్డారు. గూడూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్ని రకాల పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొమ్మిది రకాల పాఠశాలలను నెలకొల్పే ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఎద్దేవా చేసింది. ఇన్ని రకాల పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా అంటూ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో 117 జీఓకు పూర్వం ఉండే పాఠశాల వ్యవస్థ విధానాలు కావాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా జరిగింది. కూటమి ప్రభుత్వం విధానంతో ప్రభుత్వ పాఠశాలలు బలహీన పడతాయని ధ్వజమెత్తింది. ఈ ధర్నాను ప్రారంభించిన ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ.. విద్యారంగాన్ని గాడిలో పెడతామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ రంగాన్ని మరింత గందరగోళంలోకి నెడుతోందన్నారు. దీనిని ఏపీటీఎఫ్ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోందని స్పష్టంచేశారు. గత ప్రభుత్వం కేవలం 3, 4, 5, తరగతులను మాత్రమే ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తే... ఈ ప్రభుత్వం ఒకటి, రెండు తరగతులను కూడా విలీనం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. మోడల్ ప్రాథమిక పాఠశాలల పేరుతో, ఫౌండేషన్ పాఠశాలలను నెలకొల్పడం సరికాదన్నారు. మోడల్ ప్రాథమిక పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు టీచర్లను నియమించడం అశాసీ్త్రయమని విమర్శించారు. ఈ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ విద్యారంగ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. 12వ నేతన సవరణ కమిషన్ నియమించి 2023 జూలై నుంచి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయాలని, ప్రభుత్వం ఉద్యోగులకు బాకీపడిన 34 డీఏలను తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ప్రధాన సంపాదకుడు షేక్ జిలాని మాట్లాడుతూ.. విద్యారంగంలో విధ్వంస విధానాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొమ్మిది రకాల పాఠశాలలను నెలకొల్పడం, పాఠశాలకు పాఠశాలకు మధ్య అనేక అంతరాలను సృష్టించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు ఎ.శ్యాంసుందరరెడ్డి, కె.అశోక్ కుమార్, టి.త్రినాథ, మర్రివాడ అనిత, పువ్వాడ వెంకటేశ్వర్లు, కార్యదర్శులు డి.సరస్వతి, బి.ఎ.సాల్మన్రాజు, సయ్యద్ చాంద్బాషా, ఎన్.రవికుమార్, కె.శ్రీనివాసు, ఎం.శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి ఏపీటీఎఫ్ సూటి ప్రశ్న