రెవెన్యూ క్లినిక్‌ అర్జీలపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ క్లినిక్‌ అర్జీలపై ప్రత్యేక దృష్టి

Feb 3 2026 8:00 AM | Updated on Feb 3 2026 8:00 AM

రెవెన్యూ క్లినిక్‌ అర్జీలపై ప్రత్యేక దృష్టి

రెవెన్యూ క్లినిక్‌ అర్జీలపై ప్రత్యేక దృష్టి

● ఔటర్‌ రింగ్‌ రోడ్డు కింద భూములు కోల్పోయే రైతులకు బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారం నష్టం పరిహారం చెల్లించాలని కోరుతూ కంచికచర్ల, వీరులపాడు, కొండూరు మండలాల రైతులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. రిజిస్ట్రేషన్‌ విలువ తక్కువగా ఉందని, బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు ఎక్కువ ఉన్నాయని, దీనిని గుర్తించి అధిక పరిహారం ఇవ్వాలని విన్నవించారు. రోడ్డు వెడల్పును 250 మీటర్ల నుంచి 70 మీటర్లకు తగ్గించాలని కోరారు. ● తారకరామ ఎత్తిపోతల పథకాన్ని పునరుద్దరించాలని కోరుతూ కౌలు రైతు సంఘం ప్రతినిధులు జమలయ్య, బుడ్డి రమేష్‌, చెరుకూరి శ్రీనివాసరావు తదితరులు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. మరమ్మతులకు రూ.5కోట్లు కేటాయించాలని, వచ్చే ఖరీఫ్‌ నాటికి పంటపొలాలకు సాగునీటిని అందించాలని విన్నవించారు. అలాగే బుడమేరు ఎడమ కాలువకు మరమ్మతులు చేయాలని, కవులూరు వద్ద రిజర్వాయర్‌ నిర్మించాలని కోరారు.

జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లా స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ ద్వారా అందుతున్న అర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహంతో కలిసి రెవెన్యూ క్లినిక్‌, పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి సత్వర పరిష్కారానికి ఆదేశాలిచ్చారు.

మొత్తం 211 అర్జీలు..

పీజీఆర్‌ఎస్‌ నాన్‌ రెవెన్యూ కింద మొత్తం 136 అర్జీలు అందాయన్నారు. వీటితోపాటు రెవెన్యూ క్లినిక్‌ ద్వారా 75 అర్జీలు అందాయని కలెక్టర్‌ తెలిపారు. విజయవాడ ఆర్డీవోలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, తిరువూరు కె.మాధురి, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement