‘మీకు అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టమనా..?’ | Botsa Satyanarayana Slams Government Over Misuse Of Power And Attacks On Ambati Rambabu, Check More Details Inside | Sakshi
Sakshi News home page

‘మీకు అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టమనా..?’

Feb 13 2026 2:08 PM | Updated on Feb 13 2026 3:42 PM

Botsa Satyanarayana Asks Attacks In AP govt Ruling

విజయవాడ: కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టడానికా? అని ప్రశ్నించారు శాసన మండలివ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 13వ తేదీ) శాసనమండలిలో అధికార పక్షంపై ప్రశ్నల వర్షం కురిపించారు బొత్స. 

‘ అంబటి రాంబాబు పై దాడి చేస్తే...ఆయన కొన్ని మాటలు అన్నారు. ఆ తరువాత అంబటి రాంబాబు తన వ్యాఖ్యల పై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు విజ్ఞత కలిగిన వ్యక్తి...అందుకే ఆయన క్షమాపణ చెప్పారు. అంబటిని వేధించినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు. ప్రజా స్వామ్యంలో దాడులు చేయడం తప్పు కాదా..??, మరోమాజీ మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారు. 

రాజకీయాల్లో మహిళలను తీసుకు వచ్చి మైలేజ్ కోసం చూస్తున్నారు. అంబటి రాంబాబు తల్లి తల్లి కాదా...??, అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి... మీ తల్లిని అంటే ఒకటా...?, తల్లి ఎవరికైనా తల్లే. మీకు అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టమనా..?, మహిళ విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే. అంబటి రాంబాబు తాను చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పారు. అంబటి రాంబాబు తల్లిని దూషించిన వీడియోలు ఉన్నాయి’ అని స్పష్టం చేశారు బొత్స.

Botsa: అంబటి తల్లి కూడా తల్లే మీ తల్లిని తిడితే ఊరుకుంటారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement