NTR district News
-
బాలకార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
భవానీపురం(విజయవాడపశ్చిమ): బాల కార్మిక వ్యవస్థ కారణంగా పుస్తకాలు పట్టాల్సిన చేతులతో పనిముట్లను పట్టుకుని పనిచేయడం ద్వారా వారి భవిష్యత్ చిన్నాభిన్నమవుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం భవానీపురంలోని హరిత బెరంపార్క్లోని పున్నమీఘాట్లో ఏర్పాటు చేసిన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అవగాహన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ జి. ధనలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కో ఆర్డినేటర్ అరవ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కుటుంబ సమేతంగా, సీపీ రాజశేఖరబాబు దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. కలెక్టర్ లక్ష్మీశకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన దర్బారు సేవ, పల్లకీ సేవలో చైర్మన్ రాధాకృష్ణతో కలిసి పాల్గొన్నారు. అలాగే సీపీ రాజశేఖరబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. సీపీకి ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): మనసుకు ప్రశాంతత, జీవితానికి సమతుల్యత యోగాతోనే సాధ్యమవుతుందని, అది కేవలం వ్యాయమం కాదని, సంపూర్ణ జీవన విధానానికి మార్గమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భవానీపురంలోని బెరంపార్క్లో నిర్వహించిన యోగ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ శ్వాసను నియంత్రించే యోగా మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా జీవితాన్ని క్రమశిక్షణతో నడిపించే శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా ఎంతో అవసరమని చెప్పారు. యోగ సాధనతో ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాకు సమయాన్ని కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయుష్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియదర్శిని, నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ షమ్మి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శ్రీనివాసరావు, సెయింట్ ఆన్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
దద్దరిల్లె ఊరు
వెన్నుపోటుపై పోరు..గన్నవరం.. జనహారం.. గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక బుద్దవరం రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై గాంధీబొమ్మ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయ సెంటర్కు చేరుకుంది. అక్కడ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకుడు షేక్ సలార్దాదా, ఎంపీపీ అనగాని రవి, జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజిబెత్రాణి, పార్టీ నాయకులు కాకర్లమూడి సువర్ణరాజు, కొమరవల్లి గంగాభవాని, మేచినేని సత్యనారాయణ, వై నగేష్ తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి కార్యకర్తలు, నాయకులతో కలిసి వీరమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఉయ్యూరు సెంటరులో సభ నిర్వహించి, ప్రభుత్వ రెండేళ్ల వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఉయ్యూరు తహసీల్దార్ సురేష్కు వినతిపత్రం అందజేశారు. తొలుత వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) కార్యక్రమం వద్దకు చేరుకుని కార్యకర్తలతో కొద్దిసేపు మాటమంతి నిర్వహించారు. మోసపూరిత వాగ్ధానాలతో కూటమి ప్రభుత్వం మహిళలను దగా చేస్తోంది. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలందరికీ నెలకు రూ. 1,500 ఇస్తామనే ఎన్నికల హామీ ఇంతవరకు అమలు చేయలేదు. రెండేళ్లకుగాను ఒక్కొక్క మహిళకు ప్రభుత్వం రూ. 36వేలు బకాయి పడింది. సీ్త్రశక్తి పథకం, ఉచిత గ్యాస్, తల్లికి వందనం పథకాలు అమలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. – కూనపురెడ్డి రజని, గన్నవరం -
పాతబడి న అడుగులు
చిరిగిన బ్యాగ్లు, తెగిన చెప్పులు, రంగు వెలిసిపోయిన యూనిఫామ్తో విద్యార్థులు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో వేసవి సెలవుల తరువాత బడి గంటలు శుక్రవారం మోగాయి. పాఠశాలలకు చిరిగిన బ్యాగులు తగిలించుకుని, షూస్ లేకుండానే చిన్నారులు చిటిపొట్టి అడుగులతో వడివడిగా బడిబాట పట్టారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ తరగతులు పునఃప్రారంభమయ్యాయి. కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే విద్యార్థులకు అందించారు. తొలి రోజు సంప్రదాయానికి స్వస్తి.. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్, షూస్, సాక్స్, డిక్షనరీ, వర్క్బుక్ ఇలా అన్ని వస్తువులతో కూడిన కిట్ను తొలిరోజే అందించేవారు. ఈ సంప్రదాయాన్ని తొలిసారిగా జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంప్రదాయానికి స్వస్తి పలికిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గత ఏడాది తొలి రోజు అరకొరగానే పుస్తకాలు అందిస్తే ఈ ఏడాది కేవలం పాఠ్యపుస్తకాలతోనే తొలిరోజు పంపిణీని మమ అనిపించారని ఉపాధ్యాయులు వ్మాఖ్యానిస్తున్నారు. అది సైతం కేవలం కొన్ని పాఠశాలల్లోనే జరిగింది. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పాఠశాలకు చేరుకున్న పుస్తకాలను మాత్రమే విద్యార్థులకు అందించామని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. చిరిగిన బ్యాగ్లతో అవస్థలు చిన్నారులు తొలి రోజు చిరిగిన బ్యాగ్లతోనే పాఠశాలలకు హాజరయ్యారు. గత ఏడాది నాణ్యత లేని బ్యాగ్లు సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఆ బ్యాగ్లు అప్పుడే చిరిగిపోవటంతో వాటిని కుట్టుకొని వినియోగించారు. తొలి రోజు పాఠశాలలో బ్యాగ్ అందిస్తారని ఆశగా వచ్చిన చిన్నారులకు వాటిని సరఫరా చేయకపోవటంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దానికి తోడు పేదలైన చిన్నారులు చాలా మంది తెగిన చెప్పులతో వచ్చారు. కొన్ని పాఠశాలలు పాఠ్యపుస్తకాలు అందించటంతో వాటిని తీసుకెళ్లటానికి విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారు. సెలవుల అనంతరం పాఠశాలలకు చేరుకున్న విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. చాలా పాఠశాలల్లో తరగతుల కొరత వెంటాడుతోంది. గదులు సరిపోక రెండు తరగతులు ఒకే గదిలో నడిపే పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. అంతేకాకుండా సరిపడ మరుగుదొడ్లు, మంచినీరు, బెంచ్లు ఇలా సగానికి పైగా సర్కార్ పాఠశాలల్లో సమస్యలు ఉన్నట్లు అధికారుల పర్యవేక్షణలోనే తేలింది. -
దుర్గమ్మ నిత్యాన్నదాన పథకానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మామిడిపాలెం రోడ్డుకు చెందిన బబ్బూరి సుబ్బారావు కుటుంబం శుక్రవారం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి రూ. 9లక్షల విరాళాన్ని అందజేసింది. అలాగే విజయవాడ బందరురోడ్డుకు చెందిన సాదు వెంకట సుబ్బారావు గుప్తా దంపతులు రూ. 1,11,111, పాయకాపురానికి చెందిన ఎం. శ్రీనివాసరావు రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశవన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యాన కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఎక్స్పోను కలెక్టర్ ప్రారంభించారు. 20 మండలాల్లోని విద్యాసంస్థలు సాధించిన విజయాలను వివరిస్తూ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి మంచి ఫలితాలను సాధించడానికి కృషి చేశారన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలు, సౌకర్యాలు, విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే విధంగా విద్యా ఎక్స్పోను నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి 31 మంది విద్యార్థులు 580 పైగా మార్కులు సాధించారన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్.రమేష్ బాబు, డెప్యూటీ డీఈవోలు డి.సాంబశివరావు, జి.గుర్నాథం, ఎ.శ్యాంసుందర్, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, జిల్లాకు చెందిన మండల విద్యా శాఖ అధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు సెగ తగిలేలా నేడు ర్యాలీలు
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): రెండేళ్ల కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు వెన్నుపోటు పేరుతో ఈ నెల 4 నుంచి 12 వరకూ వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చంద్రబాబుకు సెగ తగిలేలా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో చేపట్టే నిరసన ర్యాలీల్లో వేలాదిగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు అసమర్థ పాలన, అక్రమాలు, ఎన్నికల హామీలు విస్మరించడం వంటి అంశాలను ప్రశ్నించడానికి ర్యాలీలను విజయవంతం చేద్దామని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నంఅర్బన్: బందరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్)లో ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గురువారం కీలక నియామకాలు చేపట్టినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.లీలాప్రసాద్ తెలిపారు. నూతన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంఓ)గా కంటి వైద్య నిపుణులు జి. భానుమూర్తి, అసిస్టెంట్ ఆర్ఎంఓలుగా ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజన్, డాక్టర్ నాగలక్ష్మిని నియమించామన్నారు. -
జీతం రాక.. జీవితం సాగక
ప్రాణాలు కాపాడుతున్న చేతులకు జీతాల కష్టాలు లబ్బీపేట(విజయవాడతూర్పు): కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు అందడం లేదు. ప్రభుత్వ మొండి వైఖరితో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు చెల్లించకపోవడంపై అధికారులను అడుగుతుంటే వారు ఏవేవో కారణాలు చెబుతున్నా రని, గట్టిగా అడిగితే తమ చేతుల్లో ఏమీ లేదంటున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకనెలలో నాలుగు రోజులు జీతం ఆలస్యమేతేనే ఇబ్బందని, అలాంటిది మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జీతాలు రావడం లేదని మేమేం అవస్థలు పడుతున్నామో అధికారులకు ఏం తెలుసని పలువురు వాపోతున్నారు. 400మంది కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్), ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల (ఎస్ఎంసీ) పరిధిలో సుమారు 400 మంది కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 250 మంది వరకూ స్టాఫ్ నర్సులు ఉండగా, మిగిలిన వారు ఆఫీసు సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పారా మెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, అడ్మినిస్ట్రేటర్లు ఇలా అనేక విభాగాల్లో పని చేస్తున్నారు. వీరిలో కొందరు పదేళ్లకు పైగా పనిచేస్తుండగా, మరికొందరు ఐదేళ్లుగా పని చేస్తున్నారు. అప్పులు చేయాల్సిన పరిస్థితి మూడు నెలలుగా జీతాలు రాక పోవడంతో అప్పులు చేసి, కుటుంబాలను నెట్టుకు రావాల్సి వస్తోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రతినెలా మొదటి వారంలో జీతాలు వస్తుండేవని, దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం, వస్తువులు కొనుగోలు చేయడం చేశామంటున్నారు. ఇప్పుడు వాటి ఈఎంఐలు చెల్లించేందుకు బంగారు వస్తువులు తాకట్టు పెట్టాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాటవేత ధోరణి కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల జీతాల విషయమై ప్రభుత్వాస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జయలక్ష్మిని వివరణ కోరగా, ఉద్యోగుల జీతాలు వంటి విషయాలు అన్నీ వైద్య కళాశాల ఏడీ చూస్తున్నట్లు తెలిపారు. వైద్య కళాశాల ఏడీని సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఒక సీనియర్ అసిస్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేసి తాము కొత్తగా వచ్చామని, అవి తమకు తెలియదని చెప్పడం గమనార్హం ఇప్పటి వరకూ ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్ నుంచి ప్రభుత్వం జీతాలు చెల్లించేది. ప్రస్తుతం నిధి పోర్టల్ను ఏర్పాటు చేశారు. దీనిలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం ఎప్పుడు జరిగింది.. వారి వివరాలు అన్నీ ఎంటర్ చేయాలి. తక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్న చోట ఒకటీ, రెండు నెలల్లో చేసేశారు. ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న వైద్యశాఖలో నిధి పోర్టల్లో డేటా ఎంటర్ చేయడం జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది. -
17న దుర్గమ్మ సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 17వ తేదీ సామూహిక అక్షరాభ్యాసాలు జరగనున్నాయి. దీనిపై ఆలయ వైదిక కమిటీ సామూహిక అక్షరాభ్యాసాల నిర్వహణకు నిర్ణయించింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఆరో అంతస్తులో బుధవారం ఉదయం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సుమారు 250 మందితో అక్షరాభ్యాసం చేయించనున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు దేవస్థానం తరఫున ఉచితంగా పలక, బలపం, అమ్మవారి కంకణం, లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందితో పాటు ఆలయ సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలు చేశారు. పెనమలూరు: జాతీయ స్థాయిలో జరగనున్న ఫెడరేషన్ కప్ బాడీ బిల్డింగ్ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులను ఎంపిక చేశామని ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. ఆయన గురువారం కానూరులో వివరాలు తెలుపుతూ సయ్యద్ జావీద్(57కేజీలు), దుంప వంశీ(75కేజీలు) విభాగంలో ఏపీ జట్టు నుంచి జాతీయ పోటీల్లో పాల్గొంటారని టీఏబీబీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బెజవాడ రవికుమార్, ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు ప్రకటించారన్నారు. ఈ నెల 12,13,14 తేదీల్లో పంజాబ్ రాష్ట్రం లూథియానాలో 15వ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాడీబిల్డింగ్ పోటీలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను సంఘ ప్రతినిధులు బి.మనోహర్, సీహెచ్.రాజు, సభ్యులు అభినందించారు. 21 కేజీల గంజాయి స్వాధీనం అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): నగరంలో అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గద్దె వారి పొలాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సింగ్నగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. దావు బుచ్చయ్య కాలనీ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సింగ్నగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ దాడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది నిఘా పెట్టి దాడులు చేయగా ముగ్గురు రౌడీషీటర్లు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా 21 కేజీల గంజాయి లభ్యమైంది. నిందితులైన ముగ్గురు రౌడీషీటర్లు అద్దంకి సతీష్, కందుల విఘ్నేష్, వల్లభనేని సాయి శ్రీరామ్ అలియాస్ వైఫైలను అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. -
సమస్యల తిష్ఠ
సర్కారీ స్కూళ్లలో వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ ఆసక్తి చూపడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ కృషి ఫలితంగా సాధించిన విజయాలను తమవిగా పాలకుల గొప్పులు చెప్పుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రూ.10.50 కోట్లు లేక రెండేళ్లుగా నిలిచిన 364 తరగతి గదులు ఎన్టీఆర్ జిల్లాలో నాడు–నేడు పనుల్లో భాగంగా పది శాతం పనులు పూర్తి చేస్తే సుమారు 364 తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి. అయితే కూటమి ప్రభుత్వం నాడు–నేడు పేరును ‘మనబడి – మన భవిష్యత్’ అంటూ మార్చేసింది. కానీ ఒక్క రూపాయి సైతం విడుదల చేయలేదు. జిల్లాలో ఈ రెండో విడత పనులకు సుమారుగా రూ.10.50 కోట్లు అవసరం కానున్నాయి. వీటి కోసం జిల్లాలో విద్యాసంస్థలు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాయి. అయినా పాలకుల్లో స్పందన లేదు. రూ.189 కోట్లతో మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎయిడెడ్ మినహాయిస్తే సుమారుగా 863 పాఠశాలలు పని చేస్తున్నాయి. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విద్యాసంస్థలతో పాటుగా ఇతర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. వాటిల్లో రెండేళ్లగా ఎటువంటి పనులు చేపట్టకపోవటంతో వేలాది సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి సుమారుగా రూ.189 కోట్లు నిధులు అవసరమవుతాయని జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష విభాగాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది. ఎదురు చూపులు రాష్ట్ర ప్రభుత్వం వసతుల ఏర్పాటుకు దాతలను చూడాలంటూ అధికారులకు సూచిస్తున్నట్లు సమాచారం. విద్యాంజలి యాప్ ద్వారా దాతలను గుర్తించి ప్రోత్సహించాలంటూ సర్వశిక్ష అధికారులకు ఆదేశాలిచ్చినట్లు కొంతమంది ఉపాధ్యాయులు చెబుతున్నారు. నాడు– నేడు పనుల్లో భాగంగా విజయవాడ కుమ్మరిపాలెంలోని దళవాయి సుబ్బరామయ్య హైస్కూల్ పురాతనం కావటంతో పడగొట్టి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పునాదులు పడే సమయంలో ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా స్థానిక నేతల ఆందోళనలతో.. దానికి దాతలను చూసే పనిలో కూటమి ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వసతుల ఏర్పాటుకు నిధులు లేవువిద్యార్థుల భవిష్యత్తు అంధకారంపూర్తికాని అదనపు గదులుజిల్లాలో వివిధ విద్యాసంస్థల్లో అనేక సమస్యలు తిష్ట వేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష విభాగాలు ఆయా పాఠశాల్లో ఉన్న సమస్యలపై ప్రధానోపాధ్యాయులను ఇటీవల సమాచారాన్ని కోరాయి. అందులో చాలా పాఠశాల్లో విద్యార్థులు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వివరించారు. ఉన్నవి చాలడం లేదని, సరిపడా మంచినీటి వసతులు లేవని, అలాగే ఇతర మౌలిక సదుపాయలపై పలు వినతులను వివరించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. ఎగువ నుంచి 1250 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. 7ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ నిత్యాన్నదానానికి విజయవాడ గాంధీనగర్ కు చెందిన గుండా కృష్ణకార్తీక్ కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది.చల్లపల్లి: స్థానిక లక్ష్మీపురం రైతు సేవా కేంద్రాన్ని మంగళవారం కృష్ణా జిల్లా జేసీ ఎం. నవీన్ సందర్శించి, ఎరువుల పంపిణీపై అధికారులకు పలు సూచనలిచ్చారు. -
విద్యార్థుల జీవితాలతో సీబీఎస్ఈ ఆటలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సీబీఎస్ఈ తన అసమర్ధతతో దేశంలోని లక్షలాది యువత జీవితాలతో చెలగాటమాడుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ అన్నారు. సీబీఎస్ఈ పరీక్ష పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో అవకతవకల తీరును ఖండిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో విజయవాడ సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి.. ఈ సందర్భంగా బందెల నాసర్జీ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ జరిగి నెలరోజులు కాకుండానే సీబీఎస్ఈ పరీక్ష పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో అవకతవకలు జరగటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. పరీక్ష ఫలితాల అనంతరం అనేక వేలమంది విద్యార్థులకు వారి మార్కులు చూసి సందేహం కలిగి రీవ్యాల్యుయేషన్ దరఖాస్తు చేసుకున్నారన్నారు. అందులో భాగంగా వేదాంత్ అనే విద్యార్థి తాను రాసిన జవాబు పత్రం కావాలని స్కాన్ కాపీ కోరాడన్నారు. వచ్చిన పేపర్ తాను రాసిన జవాబు పత్రమే కాదని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారని చెప్పారు. సంజన, మోక్ష, హర్షిత విద్యార్థుల పేపర్లు అసలు రీవ్యాల్యుయేషన్ చేయలేదని వాపోయారు. ఈ వరుస తప్పిదాలకు నైతిక బాధ్యతగా తీసుకొని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ ఇటీవల ప్రారంభించిన కొత్త విధానంలో అనేక సాంకేతిక సమస్యలు బయటకు వచ్చాయన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి, శివా, రాష్ట్ర సమితి సభ్యులు అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లికి వందనానికి నిబంధనలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం కొత్త నిబంధనలతో తల్లికి వందనం పథకానికి ఎసరు పెట్టేందుకు కసరత్తు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకూ లేని కొత్త నిబంధనలను తీసుకొచ్చిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాలలు కార్మికులుగా మారకూడదనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకాన్ని తీసుకొచ్చింది. తమ పిల్లలను బడికి పంపించే తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జమచేసి. బాలలు అందరినీ బడిబాట పట్టిం చింది. ఆ పథకానికి జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలుచేస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం పథకం పేరును తల్లికి వంద నంగా మార్చి అర్హుల సంఖ్యను భారీగా తగ్గిం చింది. తాజాగా ఎస్సీ విద్యార్థులకు కొత్త నిబంధనలను తీసుకొచ్చి తల్లికి వందనం పథకాన్ని వారికి దూరం చేస్తోందని పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కొత్త ఖాతా తెరవాల్సిందే.. పదో తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియెట్లో చేరిన ఎస్సీ విద్యార్థులు అందరనూ కొత్తగా బ్యాంక్ ఖాతా తెరవాలని సాంఘీక సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాతా తెరిచిన వారికి మాత్రమే తల్లికి వందనం పథకం వర్తిస్తుందనే స్పష్టంచేశారు. విద్యార్థి కేవలం ఆధార్కార్డు, దానికి లింకై న ఫోన్ నంబర్తో బ్యాంక్ ఖాతాను తెరవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీ లోపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ శాఖల్లో మాత్రమే ఖాతా తెరిచి ఆ సమాచారాన్ని అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. పాన్కార్డు కావాల్సిందే.. కొత్తగా ఖాతాను తెరిచేందుకు వెళ్తున్న విద్యార్థులను బ్యాంకర్లు పాన్ కార్డ్ కావాలని అడుగుతున్నారు. పాన్ కార్డు లేకుండా కొత్తగా ఖాతాను తెరవటానికి అవకాశం లేదని కొన్ని బ్యాంకు శాఖల్లో అధికారులు చెబుతున్నారు. ఎంపిక చేసిన కొన్ని జాతీయ బ్యాంకుల్లో మాత్రమే ఖాతా తెరవాలని సూచించటం, అందులోనూ మూడు నాలుగు రోజుల్లోనే ఈ తంతు పూర్తి చేసి ఆప్డేట్ చేయాలని ప్రకటించటంపై తల్లిదండ్రులు, విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. చాలా మందికి ఈ సమాచారం తెలియలేదని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ఆధార్ లింకే సమస్య ఆధార్కార్డుకు ఫోన్ నంబర్ లింక్ కాకపోవటంతో బ్యాంకులు ఖాతా తెరిచేందుకు అభ్యంతరం చెబుతున్నాయి. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తల్లిదండ్రులు సెల్ఫోన్లు కొనిచ్చే పరిస్థితి లేదు. కొత్త నిబంధనల నేపథ్యంలో ఫోన్ కొని సిమ్ కార్డు తీసుకుని, దానిని విద్యార్థి ఆధార్ కార్డుకు లింక్ చేయటం ఇప్పటికిప్పుడు పూర్తయ్యే పరిస్థితి లేదు. కొత్తగా ఫోన్ నంబర్ లింక్ చేయాలంటే ఇబ్బందులు తప్పవని, అక్షరాస్యత లేని కుటుంబాలకు ఇంకా కష్టమని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అమ్మ ఒడి పేరుతో గత ప్రభుత్వం సమర్థంగా అమలు చేసిన ఈ పథకాన్ని తల్లికి వందనం పేరు మార్చి నీరుగార్చారని విమర్శిస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అని చెప్పిన కూటమి ప్రభుత్వం సుమారు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 50 వేల మంది పిల్లలకు ఈ పథకం ఇవ్వలేదంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు ఖాతా తెరవాలనే పేరుతో పథకంలో కోత పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇంటర్లో చేరిన ఎస్సీ విద్యార్థులు బ్యాంక్ ఖాతా తెరవాలని ఆదేశం పాన్కార్డు లేకుండా ఖాతాను తెరవబోమంటున్న బ్యాంక్ సిబ్బంది ఆధార్కు ఫోన్ నంబర్ లింక్ కాకపోవటంతో బ్యాంకర్ల అభ్యంతరం పథకం ఎగవేతకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటున్న విద్యార్థి సంఘాలు తల్లికి వందనం పథకాన్ని నీరుగార్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. అటువంటిది ఇప్పుడు ఎస్సీ విద్యార్థులు కొత్తగా ఖాతాలు తెరవాలని చెప్పటం ఏమిటి? అందులోనూ వారికి పాన్కార్డులు ఉండవు. ఆధార్కార్డుకు ఫోన్ లింక్ అయ్యే అవకాశాలు తక్కువ. అసలు వారికి ఫోనే ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పథకాన్ని పూర్తిగా కోతలు పెట్టేందుకు చంద్రబాబు సర్కార్ ఆడుతున్న నాటకంగా కనిపిస్తోంది. ఎటువంటి ఆంక్షలు, కొత్త నిబంధనలు లేకుండా పథకాన్ని అమలు చేయాలి. – ఎ.రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం -
కిల్కారి సేవలు సద్వినియోగం చేసుకోవాలి
పెనమలూరు: తల్లులు కిల్కారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని కిల్కారి స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. పోరంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రధాన మంత్రి సురక్షిత్ అభియాన్(పీఎంఎస్ఎంఏ) కార్యక్రమంలో భాగంగా మాతృత్వ కిల్కారి సేవలపై తల్లులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ ప్రతి గర్భిణి నాలుగో నెల నుంచి బిడ్డ పుట్టిన సంవత్సరం వరకు కిల్కారి కాల్స్ ప్రతి నెలకు ఒకసారి వస్తాయన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. డాక్టర్ సుష్మిత మాట్లాడుతూ ప్రతి గర్భిణి ప్రతీ నెల 9వ తేదీన ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోవాలన్నారు. కిల్కారి పీవో రాజు, సీహెచ్వో కుమార్, హెచ్వీ పుష్పావతి, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. జి.కొండూరు: ఎరువుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీఏఐఎంఎస్ యాప్తో అర్హులైన రైతులకు రాయితీపై ఎరువులు సకాలంలో అందుతాయని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మండల పరిధిలోని వెలగలేరు గ్రామంలో శ్రీసాయి ఎంటర్ ప్రైజెస్ ఎరువుల దుకాణంలో యాప్ ద్వారా ఎరువుల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎరువులను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు ఎరువుల దుకాణాలతో పాటు సహకార సొసైటీలు సైతం ఈ యాప్ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి, తహసీల్దార్ రాణి, ఏఓ సూరిబాబు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఎస్సీ, ఓపెన్ స్కూల్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకన కార్యక్రమం రెండో రోజు సజావుగా కొనసాగిందని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపా రు. మంగళవారం ఆయన మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. మూల్యాంకనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యే లా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఓ చెప్పారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో వేద, స్మార్త విద్యలను అభ్యసించేందుకు ఆసక్తి కలిగిన బ్రాహ్మణ బాలుర నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. విధిగా ఉపనయనం జరిగి, సంధ్యావందనం చేస్తూ తెలుగు చదవగలిగిన బాలురు ప్రవేశానికి అర్హులని పేర్కొన్నారు. స్మార్త విద్యకు 10 నుంచి 13ఏళ్లు, వేద విద్యకు 10 నుంచి 12 ఏళ్లు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పాఠశాలలో రుగ్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం, అపస్తంబ పౌరోహిత్య స్మార్త విద్యను బోధిస్తారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, వస్త్రాలు, వైద్య సదుపాయాలతో పాటు కోర్సు పూర్తి చేసి తుది పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు యోగ్యతా పత్రాలతో పాటు రూ. 3లక్షలు స్టయిఫండ్ను అందిస్తారన్నారు. ఇతర వివరాలకు పోరంకిలోని దేవస్థాన వేద పాఠశాల ప్రిన్సిపాల్ను 9440136924లో సంప్రదించవచ్చన్నారు. -
క్రైస్తవ మైనారిటీలపై దాడులను అరికట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్రైస్తవులు ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.ఎ.మెల్కీ సెదేక్, మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మతమార్పిడి నిరోధక చట్టాలు, క్రైస్తవ ఇతర మైనార్టీలపై దాడులకు వ్యతిరేకంగా మంగళవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హర్షకుమార్. మెల్నీసెదేక్ మాట్లాడుతూ.. దేశంలో తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రిస్టియన్ బిల్లును ఆమోదించాలన్నారు. జస్టిస్ కె.బాలకృష్ణన్ కమిషన్పై తమకు ఏ మాత్రం నమ్మకం లేదని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవుల శేఖర్, ఐసీఎం చర్చ్ బిషప్ జాన్, ఎం.రాజేశ్వరరావు (ఏఐసీసీ), ప్రసాద్ రవికాంత్, మహమ్మద్ కరీముద్దీన్, శ్యామ్ సుందర్, శామ్యూల్ రాజు, రూత్ భారతి, ఆర్.ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్, మెల్కీ సెదేక్ -
దోష రహిత ఓటర్ల జాబితా కీలకం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు దోష రహిత ఓటర్ల జాబితా కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. దోష రహిత ఓటర్ల జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో సర్పై జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీశ పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్ ప్రక్రియలోని ఐదు దశలు, ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) అందజేత, స్వీకరణ, ఫారాల డిజిటైజేషన్, పూర్తి షెడ్యూల్ తదితర అంశాలను వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఈ నెల 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు జరుగుతాయని పేర్కొన్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుందని వివరించారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. క్లయిమ్లు పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని వివరించారు. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. అర్హులను ఓటరు జాబితాలో ఉండేలా చేయడంతోపాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా సర్ ప్రక్రియ చేపట్టారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ, స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయలని స్పష్టం చేశారు. శిక్షణ కార్యక్రమంలో డీఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను పాల్గొన్నారు. -
గేట్వే!
గంజాయ్కిజీవనశైలిలో యోగా భాగం కావాలి సాక్షి ప్రతినిధి,విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో చైన్నె, కోల్కతా హైవే గంజాయి కారిడార్గా మారింది. ఒడిశా, విశాఖ నుంచి నిత్యం గంజాయి తరలిస్తూనే ఉన్నారు. తరచూ పోలీసుల తనిఖీలో గంజాయి పట్టుబడుతూనే ఉంది. మంగళవారం తెల్లవారుజామున పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో పటమట పోలీసుస్టేషన్ పరిధిలోని నిడమానూరులో ఒక లారీని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి కలిగిన బ్యాగులను గుర్తించారు. ఇందులో రూ.70లక్షల విలువైన 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడోచోట పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతూనే ఉంది. మాదకద్రవ్యాలను (గంజాయి, డ్రగ్స్)సమూలంగా నిర్మూలిస్తాం, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం.. అంటూ రెండేళ్లుగా పాలకులు ఎక్కడ చూసినా మాటల తూటాలు పేలుస్తున్నారు. అవన్నీ ప్రచారం కోసం మాట్లాడే ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఎక్కడ చూసినా గంజాయి, ఇతర డ్రగ్స్ వంటివి విచ్చలవిడిగా లభిస్తుండటంతో యువత వాటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు విజయవాడ నగరానికే పరిమితమైన ఈ విష సంస్కృతి.. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ప్రభుత్వ వైఫల్యంతో గంజాయి కేజీలకు కేజీలు సరఫరా అవుతూనే ఉంది. అందుకు పోలీసులకు పట్టుబడిన ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గంజాయితో పాటు ఎండీఎంఏ డ్రగ్స్ సైతం విజయవాడలో పట్టుపడటం ప్రజలను నివ్వెర పడేలా చేస్తోంది. జాతీయ రహదారులు ఉండే పోలీసు స్టేషన్ల పరిధిలోనే ఎక్కువగా గంజాయి దొరకుతోంది. ఇందులో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. గత రెండేళ్లలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గంజాయి విక్రయాలు భారీగా పెరిగాయి. గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడుతున్న వారిలో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన యువత ఉంటున్నారు. అందుకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పదుల సంఖ్యలో యువతకు డ్రగ్స్ పాజిటివ్ రావడమే నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో 1200మందికి పైగా పాజిటివ్ రావటం గమనార్హం. దీనిని బట్టే గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పెరిగిందని స్పష్టంగా అర్థం అవుతోంది. పోలీసులు డ్రగ్స్పై దండయాత్ర పేరుతో కఠిన చర్యలు తీసుకొంటున్నామని పేర్కొంటున్నా.. క్షేత్ర స్థాయిలో మూలాలను కూకటి వేళ్లతో పెకిలించడంలో ఘోరంగా విఫలం అవుతున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్న స్మగ్లర్లు భారీగా పట్టుబడుతున్నా ఆగని రవాణా గ్రామాలకు విస్తరించిన గంజాయి గుప్పు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి మత్తులో చిత్తవుతున్న యువత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గంజాయి అమ్మకందారులు ప్రధానంగా విద్యాసంస్థలే లక్ష్యంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసుకొని గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. మత్తుకు బానిసలైన విద్యార్థులు విచక్షణ కోల్పోయి, ఘర్షణలకు దిగుతున్నారు. గంజాయికి అలవాటు పడిన వారు చివరకు చోరీలు, చైన్స్నాచింగ్లు వంటి నేరాలకు తెగబడుతున్నారు. పేకాట, కోడి పందేలు, క్రికెట్ బెట్టింగ్లకు బానిలసవుతున్నారు. ఇటీవల బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసిన నిందితుడిని పరీక్ష చేయగా, పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా గంజాయికి అలవాటు పడిన వారు నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళ్లలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైక్లు చోరీ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో కూడా డ్రగ్స్కు బానిసలైన వారు ఉంటున్నారు. -
పాఠశాలలో అభివృద్ధి పనుల పరిశీలన
గుడ్లవల్లేరు: మండలంలోని కౌతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం సందర్శించారు. ఆ పాఠశాల పనుల పురోగతిపై ఆయన ఆరా తీశారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా ఆయన పాఠశాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. దాతల సహకారంతో నిర్మిస్తున్న పలు భవనాల నిర్మాణ పురోగతి, ఒకేషనల్ భవన నిర్మాణం కోసం మెరక చేసిన స్థలాన్ని, కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించి అందుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, తహసీల్దార్ బి.లోకరాజు, ఎంపీడీఓ ఎండీ ఇమ్రాన్, సాగునీటి డీసీ చైర్మన్ మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, ఎంఈఓ జి.గోపాలరావు, పాఠశాల హెచ్ఎం రజిని కుమారి, ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు. -
అహంకారాన్ని చూపిస్తారా?
బాధితుల్ని ఓదార్చాల్సిందిపోయి.. చిలకలపూడి(మచిలీపట్నం): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను ఓదార్చాల్సింది పోయి.. రాష్ట్ర మంత్రులు అహంకారంతో వ్యవహరించడం, సంస్కారం లేని మాటలు మాట్లాడటం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల్సిన సమయంలో అహంకారాన్ని చూపిస్తారా? అని మండిపడ్డారు. మంగళవారం మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన సెక్షన్లలో 22 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా.. పది మందితో పని చేయించడం వల్ల ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఏడాదికి 3.2 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18 వేల మంది కార్మికులు పనిచేయగా.. నేడు 7.2 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యమున్నా కేవలం 8 వేల మంది కార్మికులు పనిచేయిస్తున్నారని వివరించారు. అనుభవం ఉన్న కార్మికులను గత రెండేళ్లలో వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపించేశారని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి భరోసా ఇవ్వాల్సిందిపోయి.. ‘మీ ఇంట్లో వాళ్లు చనిపోయారా?’ అంటూ మంత్రి నారా లోకేశ్ అహంకారంగా మాట్లాడటం ఏమిటని పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి పరిహారం ప్రకటించలేదని విమర్శించారు. 2011లో ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులకు ప్రకటించిన రూ.25 లక్షల పరిహారాన్నే.. ఇప్పుడు యాజమాన్యం ద్వారా ఇస్తామనడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ప్రమాదం జరిగిన గంట ల్లోనే కేంద్ర మంత్రి ఘటనా స్థలానికి రాగా.. ఒక రోజు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, అన్ని శాఖల మంత్రి నారా లోకేశ్ రావడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు నిదర్శనమన్నారు. ‘గతంలో కార్మిక సంఘాల సమావేశంలో తాను మాట్లాడినప్పుడు.. చెయ్యి ఎత్తకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్ ఇప్పించలేదు. జగన్మోహన్రెడ్డి ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేస్తే మేమే ఆపాం’ అని డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ మాట్లాడారంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడిన వీడియోను పేర్ని నాని ప్రదర్శించారు. ‘స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు పంపించింది. అందువల్లే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని 2025 జనవరిలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పిన వీడియోను చూపించి పవన్కల్యాణ్ను పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజైనా ప్లాంట్ను సందర్శించావా? అని పవన్ను నిలదీశారు. నాడైనా, నేడైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని.. ప్రతిపక్షంగా ఉన్న సమయంలో పోరాటం చేస్తామని.. అధికారంలో ఉంటే ప్రైవేటీకరణకు అడ్డం పడతామని పేర్ని నాని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎంవైఎస్ జగన్ ప్రకటించిన విధంగా.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబసభ్యులకు శాశ్వత ఉద్యోగం కల్పించా లని పేర్ని నాని డిమాండ్ చేశారు. మంత్రులు లోకేశ్, పవన్కల్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకమని పునరుద్ఘాటన -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మక్కపేట(వత్సవాయి): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన వత్సవాయి మండలంలోని మక్కపేట గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఖమ్మం జిల్లా, బోనకల్లు మండలం, పెద్దబీరవల్లి గ్రామానికి చెందిన గొర్రెముచ్చు ప్రమీళ (41) మక్కపేట సెంటర్లో ఆటో దిగింది. అనంతరం బైక్ ఎక్కి జగ్గయ్యపేట వైపు వెళ్తుండగా పంచాయతీ కార్యాలయం సమీపంలో అదుపుతప్పి రోడ్డు మీద పడిపోయింది. అదే సమయంలో పెనుగంచిప్రోలు వైపు నుంచి వస్తున్న టిప్పర్ టైరు ఆమె తలపై ఎక్కటంతో తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బైక్ నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారయిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పామర్రు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై బల్లిపర్రు అడ్డరోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పామర్రు మండలంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మచిటీ పట్నం మండలం బొర్రపోతుపాలెంనకు చెందిన కత్తిక శ్రీనివాసరావు(50) అదే గ్రామానికి చెందిన ముక్కు రామకృష్ణతో కలిసి బైక్పై విజయవాడకు ప్రయాణమయ్యారు. పామర్రు మండలం బల్లిపర్రు అడ్డరోడ్డు వద్ద వెనుక నుంచి టిప్పర్ అతి వేగంగా వచ్చి బైక్ను బలంగా ఢీకొట్టి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రామకృష్ణ కాలికు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతిని పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. పామర్రు సీఐ నాగప్రసాద్, ఎస్ఐ శ్రీనివాస్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. టిప్పర్ డ్రెయివర్ నిద్ర మత్తులో ఉండటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రెయివర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ కె.శ్రీనివాస్ తెలిపారు. నందివాడ: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని తమిరిశ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిరిశ గ్రామానికి చెందిన అలవాల నాగరాజు (36), వెంకటలక్ష్మి దంపతులు. నాగరాజు దినసరి కూలీగా జీవిస్తున్నాడు. మంగళవారం ఇంట్లో విద్యుత్ సరఫరా జరగడంలేదని తీగలను సరిచేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. స్పృహలేకుండా పడవున్న నాగరాజును అతని భార్య వెంకటలక్ష్మి గమనించి బంధువుల సాంయంతో 108 అంబులెన్స్లో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. -
గ్యాస్, పెట్రో ధరలను తక్షణమే రద్దు చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు, పన్నులు పెంచి ప్రజలను పీక్కుతింటున్నాయని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రేట్లు పెంపుదలకు నిరసనగా రాస్తారోకో జరిగింది. పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు హైవేపై బైఠాయించారు. ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, ధరల భారాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హైవేపై అరగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ధరలు పెంచడంలో రికార్డులు బ్రేక్.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, ఇతర వామపక్షాల నేతలు మాట్లాడుతూ.. 12 సంవత్సరాలు పాలించి మోదీ రికార్డు బ్రేక్ చేయడం కాదు, పన్నులు, ధరలు పెంచడంలో రికార్డులు బద్దలు కొట్టారని విమర్శించారు. పెట్రోలియం ఉత్పత్తులపై 12 ఏళ్లలో రూ.40 లక్షల కోట్లు పన్నులు వసూలు చేసిన పాపం కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపి చమురు రేట్లు పెంచడం దుర్మార్గమన్నారు. రష్యా, ఇరాన్ నుంచి చౌకగా చమురు లభిస్తున్నా అధిక రేట్లకు అమెరికా చెప్పిన విధంగా కొనుగోలు చేసి దేశ ప్రజలపై భారం మోపటం గర్హనీయమన్నారు. ఎన్నికలకు ముందు అదనపు పన్నులు తగ్గిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు కూటమి మోసం చేసిందని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువగా పెట్రోల్పై 35 శాతం, డీజిల్పై 27శాతం పన్నులు వసూలు చేయటం అమానుషమన్నారు. వామపక్ష పార్టీల నాయకులు హరినాథ్, వెంకటేశ్వర్లు, అమర్నాథ్, డి.కాశీనాథ్, జి.కోటేశ్వరరావు, ప్రసాద్ బాబు పాల్గొన్నారు. రాస్తారోకోలో వామపక్ష పార్టీల నాయకులు -
పవర్ లిఫ్టింగ్లో రాణిస్తున్న నితిన్ కుమార్
మచిలీపట్నంటౌన్: నగరానికి చెందిన కె. నితిన్ కుమార్ పవర్ లిఫ్టింగ్లో ప్రత్యేక ప్రతిభను కనబరుస్తున్నాడు. స్థానిక దేశాయిపేటకు చెందిన ఈ యువకుడు 17 ఏళ్ల వయసులోనే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పతకాలను సాధించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవల జరిగిన పలు పోటీల్లో పాల్గొని బంగారంతో పాటు పలు పతకా లను సాధించాడు. స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో నితిన్కుమార్ 12వ తరగతి చదువుతున్నాడు. గత ఏప్రిల్ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 93 కిలోల సబ్ జూనియర్ క్యాటగిరీ పోటీల్లో పాల్గొని టాప్ పోర్ విత్ 327.5 కిలోల బరువును ఎత్తాడు. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్నూల్లోని డీఎస్ఏ అవుట్ డోర్ స్టేడియంలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 295 కిలోల బరువు ఎత్తి వెండి, రజిత పతకాలను సాధించాడు. ఫిబ్రవరి 8వ తేదీన గుడివాడలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో జరిగిన సెకండ్ కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల జిల్లా స్థాయి పవర్ లిప్టింగ్ చాంపియన్ షిప్ 2025– 26 పోటీల్లో పాల్గొని సబ్ జూనియర్ 93 కిలోల విభాగంలో 250 కిలోల బరువును ఎత్తి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నాడు. అండర్ –20 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని 94 కిలోల భాగంలో బంగారు పతకాన్ని సాధించాడు. ఏ ప్రాంతంలో జరిగిన పోటీల్లోనైనా పాల్గొని పతకాలు సాధిస్తున్న యువ క్రీడాకారుడు నితిన్ కుమార్ను నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు అభినందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలను సాధించి మచిలీపట్నానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు 17 ఏళ్ల వయసులోనే క్రీడా నైపుణ్యం -
ఉపాధ్యాయులకు ముగిసిన శిక్షణ కార్యక్రమం
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉపాధ్యాయులకు నిర్వహించిన పునాది అభ్యాసన, సంఖ్యాత్మకత శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. జిల్లాలో ఒకటో తరగతి బోధించే 854 మంది ఉపాధ్యాయులకు ఏడు ప్రదేశాల్లో ఈ శిక్షణ శిబిరాన్ని వారం రోజులుగా నిర్వహించారు. విజయవాడలోని పడమట, గొల్లపూడి, మైలవరం, విస్సన్నపేట, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున 20 మండలాలకుగాను 60 మంది రిసోర్స్ పర్సన్స్ను ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. వారు వారివారి ప్రదేశాల్లో ఈ శిక్షణ నిర్వహిస్తారని వివరించారు. ప్రధానంగా విద్యార్థులకు బోధనలతో, నూతన పాఠ్యపుస్తకాలకు సంబంధించిన అంశాలను, సామర్థ్యాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు నేర్పి తద్వారా పాఠశాలలో అమలు చేస్తారన్నారు. జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్. రమేష్బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ, స్టేట్ అబ్జర్వర్ సీహెచ్ వెంకటరమణ, స్టేట్ ఎఫ్ఎల్ఎన్ కోఆర్డినేటర్లు ప్రతిష్ట కుసుమాలు పాల్గొన్నారు. -
28న స్విమ్మింగ్ జట్ల ఎంపికలు
వైఎస్సార్ సీపీ నేత పోతిన మహేష్ వన్టౌన్(విజయవాడపశ్చిమ): దేవదాయ శాఖ ఆస్తులను కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా బీజేపీ అధ్యక్షుడు మాధవ్లకు భగవంతుడు అంటే భయం లేకుండాపోయిందన్నారు. అందువలనే హిందూ దేవాలయాలకు చెందిన 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి, రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత భూముల జాబితా 22 (1) నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తుల పేర్లపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూములను అమ్మకం చేసి వేలకోట్ల రూపాయలు సంపాదించాలని దాని కోసమే దేవదాయ శాఖ ఆస్తుల జాబితా నుంచి తొలగించే బాధ్యతను ఆ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్కు అప్పగించారని ఆయన ఆరోపించారు. దేవాలయాల భూముల్ని కొట్టేయాలని చూస్తున్న వారు భగవంతుడి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఒక్క సంతకంతో దేవుడు ఆస్తుల జాబితా నుంచి భూములను తొలగించే నిర్ణయం సాధారణ నిర్ణయం కాదన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్గా అభివర్ణించారు. హిందూ ధర్మానికి హిందూ దేవాలయాల భూములకు శాశ్వత నష్టం కలిగించే ఈ మెమోని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మానికి, ఆలయాలకు ఇంత ప్రమాదం జరుగుతుంటే స్వామీజీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయవాడకు వెళ్తుండగా జాతీయ రహదారిపై గొల్లపూడి వద్ద డ్రైవర్ పక్కన ఉండే బానెట్లో నుంచి పొగలు వచ్చాయి. ఆ వెంటనే మంటలు వచ్చాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులున్నారు. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దింపేశారు. భయపడిపోయిన కొంత మంది యువకులు ఎమర్జెన్సీ ద్వారం, కిటికీల నుంచి బయటపడ్డారు. బానెట్ కింద ఉండే ఇంజిన్ వద్ద ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ అవడంతో పొగలు ఆ తరువాత మంటలు వచ్చి ఉంటాయని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఎండల తీవ్రత వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. -
పీహెచ్సీలో డీహెచ్ తనిఖీలు
పెనమలూరు: మండల కేంద్రమైన పెనమలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ (డీహెచ్) డాక్టర్ పద్మావతి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆన్లైన్ విధానం ద్వారా ఈహెచ్ఆర్, ఈ ఔషధి, ఫీల్డ్ సిబ్బంది సేవలను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అన్నిరకాల మందులు అందుబా టులో ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. ఆస్పత్రిలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఐఓ డాక్టర్ప్రేమ్చంద్, వైద్యాధికారి సాయిలలిత, డాక్టర్ బిజిలీ శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్తికేయుడి ఆలయానికి రూ.లక్ష విరాళం మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన సీహెచ్.వెంకటరామిరెడ్డి, వాసవి దంపతులు శనివారం రూ.1,05,116 విరాళంగా సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధు సూదనరావుకు విరాళాన్ని అందజేశారు. చిలక లూరిపేటకు చెందిన ఎం.సి.మనోజ్, ఉమా వైష్ణవి 970 గ్రాముల వెండి నాగపడగ సమర్పించారు. ఆలయ అధికారి కిషోర్ పాల్గొన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వర్షాకాలంలో అంతరాయాలు తలెత్తకుండా నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీ సీపీ డీసీ ఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో వర్చువల్ విధానంలో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వర్షాలు, ఈదురుగాలులు వంటి అత్య వసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో లైన్ లాసెస్ తగ్గింపు, రెవెన్యూ కలెక్షన్లు, నూతనంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ పనుల పురోగతి వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యా దులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, పలువురు సీజీఎంలు, ఎస్ఈలు, జీఎంలు, ఈఈలు పాల్గొన్నారు. యోగా నిర్వహణకు వెస్ట్ బైపాస్ పరిశీలన లబ్బీపేట(విజయవాడతూర్పు): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన సామూహికంగా యోగా నిర్వహించేందుకు వెస్ట్ బైపాస్ను వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గుంటూరు జిల్లా అధికారులతో కలిసి వెస్ట్బైపాస్ ప్రాంతాలను పరిశీలించారు. యోగా దినోత్సవానికి హాజరయ్యే ప్రజలు, యోగా సాధకులు, విద్యార్థులు , వివిధ శాఖల ప్రతినిధుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, తాగునీటి సదుపాయం, వైద్య సేవలు, అత్యవసర సహాయక ఏర్పాట్లు, వేదిక నిర్మాణం , ప్రజల రాకపోకలకు సంబంధించిన అంశాలపై అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరుజిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్, నగర డీసీపీ కృష్ణకాంత్ పటేల్, కేజీవి సరిత తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ సచివాలయ ఉద్యోగుల జేఏసీ కార్యవర్గం ఎన్నిక
మచిలీపట్నంటౌన్: ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ కృష్ణా జిల్లా కార్యవర్గం ఏకగ్రీ వంగా ఎన్నికై ంది. నోబుల్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్నికల కార్యక్రమంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ సంఘ జిల్లా చైర్మన్గా పువ్వుల కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా చాట్ల మేరీ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ హాజరైన ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్, అసోసియేట్ చైర్మన్ పిల్లి హరీశ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జేఏసీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఉద్యోగులకు ఇప్పటికే రావాల్సిన స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, అసంబద్ధమైన హేతుబద్ధీకరణ ప్రక్రియ, తాత్కాలిక డెప్యుటేషన్ల రద్దుతో పాటు ఇతర ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై రానున్న కాలంలో వివిధ శాఖల సంఘాల నాయకులతో చర్చించి త్వరలోనే ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర కమిటీ కో–చైర్మన్లు చేవూరి వెంకటేశ్వర్లు, బెక్కం రవితేజ, గంటా రామకృష్ణతో పాటు నూతనంగా ఎన్నికై న జిల్లా కార్యవర్గ సభ్యులు బి.సుకుమార్, కృష్ణ చైతన్య, రాజు, క్రాంతి, హనుమంతరావు, విశ్వ, రామకష్ణ, హేమలత, లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు కూల్చివెతలు
జేసీబీలతో రంగంలోకి దిగిన పోలీసు, రెవెన్యూ అధికారులు రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం నిడమానూరు సీడబ్ల్యూసీ గోదాము సమీపంలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా శతాబ్దానికి పైగా నివాసం ఉంటున్న నిరు పేదల ఇళ్లు తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భారీ జేసీబీలతో రంగంలోకి దిగి బలవంతంగా నివాసాలు తొలగించేందుకు యత్నించగా పేదలు అడ్డుకున్నారు. తహసీల్దార్ సుగుణ, ఏసీపీ దామోదర్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది హడావుడి చేస్తూ ఇళ్లు తొలగించ డానికి పూనుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధిత పేదలు, స్థానిక నాయకులు జేసీబీలను అడ్డుకోవడంతో అధికారులు చేసేదేమీ లేక ప్రస్తుతానికి వెను తిరిగారు. 100 ఏళ్లకు పైగానే స్థిర నివాసాలు గ్రామంలోని రైవస్ కాలువ, సీడబ్ల్యూసీ గోదాము సమీపంలో 100 సంవత్సరాలకు పైగానే నిరు పేదలు స్థిర నివాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 83 గృహల్లో పేదలు నివస్తుండగా, మరో 20 మంది చిన్నపాటి దుకాణాలు ఉన్నాయి. ఇటీవల రెవెన్యూ, రైల్వే అధికారులు ఓవర్ బ్రిడ్డి నిర్మాణమంటూ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ ప్రాంతంలో కొలతలు తీసుకున్నారు. రహదారికి రెండు వైపులా ఉన్న ఇళ్లను తొలగించాలని హుకుం జారీ చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సిర్థ నివాసాలు ఏర్పాటు చేసుకుని బతుకుతున్నామని, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, తమను సంప్రదించకుండా ఇళ్లు ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రెండు రోజులుగా ఫ్లై ఓవర్ బాధితుల పోరాట కమిటీగా ఏర్పడి ఇళ్ల తొలగింపుపై అభ్యంతరాలు తెలుపుతున్నారు. శనివారం ఇళ్లు కూల్చివేతకు అధికారులు రావడంతో బాధితులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి శీలం రంగారావు, మహిళా నాయకురాలు పరిమి సింధు, దండు సుబ్రహ్మణ్యరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి కృష్ణ, నాయకులు వెంకటేశ్వరరావు, ఆంజనేయులు తదితరులు మద్దతు తెలిపి బాధితుల నిరసనలో పాల్గొన్నారు. ఇళ్ల కూల్చివేతకు ముందుగానే బాధితులకు ప్రత్యామ్నాయం కల్పించాలని డిమాండ్ చేశారు. -
నేటి నుంచి యోగా పోటీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి ఒక్కరికీ యోగాపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర–2026లో భాగంగా ఆదివారం నుంచి యోగా పోటీలు నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఓ ప్రకట నలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు గ్రామ/వార్డు స్థాయిలో యోగా ఫర్ ఆల్ – గ్రాస్రూట్స్ వెల్నెస్ ఇతివృత్తంతో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఔత్సాహికులు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో విజేతలు మండల స్థాయికి, మండల స్థాయిలో విజేతలు జిల్లాస్థాయికి, అక్కడ విజేత లుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ నెల పది నుంచి 12వ తేదీ వరకు యూనిటీతో యోగా – బ్రిడ్జింగ్ కమ్యూనిటీస్ థీమ్తో మండలస్థాయిలో, ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు యోగా అండ్ యూత్ – బిల్డింగ్ ఏ హెల్దీ ఫ్యూచర్ థీమ్తో జిల్లాస్థాయిలో, ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు యోగాంధ్ర – ఆంధ్రాస్ గ్లోబల్ యోగా షోకేజ్ థీమ్తో రాష్ట్రస్థాయిలో పోటీలు ఉంటాయని తెలిపారు. వ్యక్తిగత కేటగిరీ, గ్రూపు కేటగిరీలో పోటీలు ఉంటాయని.. వ్యక్తిగత కేటగిరీలో ఆసనాల ప్రదర్శన, ప్రాణాయామం ప్రదర్శనలు, గ్రూపు కేటగిరీలో సింక్రనైజ్డ్ గ్రూపుయోగా ఉంటుందన్నారు. యోగా సాంగ్, యోగా క్విజ్, యోగా స్లోగన్, యోగా ఎస్సే పోటీలు కూడా ఉంటా యని వివరించారు. 10 నుంచి 18 ఏళ్ల వారికి జూనియర్, 19 నుంచి 35 ఏళ్ల వారికి యంగ్, 35 ఏళ్లు, ఆపైన వారికి సీనియర్ గ్రూప్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోటీల విజేతలను రాష్ట్రస్థాయి కార్యక్రమంలో సత్కరించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలకు 84980 12833, 83413 64185 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. -
ఉపాధి కూలీలపై ఎఫ్ఏ నిర్లక్ష్యం
క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లకుండా పని బాగోలేదన్న ఫీల్డ్ అసిస్టెంట్ పెడన: ఉపాధి కూలీలకు పనులు కల్పించి ఏ రోజు కూలి డబ్బులు ఆ రోజే ఇచ్చేస్తున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు పాలనలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మండలంలోని నందిగామలో జరుగుతున్న ఉపాధి పనులే ఇందుకు నిదర్శనం. వారం రోజులు పనులకు వెళ్లినా రూ.1000 కూడా కూలి రావడంలేదని కూలీలు వాపోతున్నారు. ఒక్కొక్క కూలీకి రోజుకు రూ.270 నుంచి రూ.320 నగదు వచ్చేలా పనులు కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా అడుగులు ముందుకు వేయడం లేదనే విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు పనులు చేసిన చోట హాజరు నమోదవక ఎక్కడో దూరంగా వెళ్లి ఆన్లైన్ చేస్తుండటాన్ని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు అవకా శంగా తీసుకుని కూలీలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పనిచేసిన రోజు హాజరు తీసుకోని ఎఫ్ఏ మండలవలోని నందిగామ దళితవాడకు చెందిన ఉపాధి కూలీలు 50 మందికిపైగా శుక్రవారం పనికి వెళ్లారు. వారికి మేట్లు సుధాకర్, ప్రకాష్ పని కల్పించారు. ఆ పనిని పూర్తి చేసిన శ్రామికుల హాజరు తీసుకోవాల్సి ఫీల్డ్ అసిస్టెంట్ పోలగాని అమలేశ్వరరావు పని ప్రదేశానికి రాలేదు. సిగ్నల్ అందే చోటకు రావాలని చెప్పడంతో అంత ఎండలో రాలేమని, పనిచేసే చోట సిగ్నల్ అందుతోందని మేట్లు కూడా చెబుతున్నారని కూలీలు చెప్పినా వినిపించుకోకుండా చేసిన పని బాగోలేదని పేర్కొంటూ కూలీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు శనివారం కూలీలకు పనులు కల్పించకుండా ఖాళీగా కూర్చో బెట్టారు. నందిగామ దళితవాడ వద్ద పనులు జరిగిన చోటుకు ఎఫ్ఏ వెళ్లకుండా పని బాగోలేదనే విషయంతో పాటు ఉపాధి కూలీల అటెండెన్సు చేసిన పని రోజున వేయకపోవడం, మరుసటి రోజున పనులు కల్పించకపోవడం వంటి విషయాలపై ఏపీఎంను పంపించి విచారణ చేయిస్తాం. గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఏం జరిగిందో తెలుసుకుంటా. ఉపాధి కూలీలకు న్యాయం చేస్తాం. – ఎ.అరుణకుమారి, ఎంపీడీఓ, పెడన హాజరు కోసం సిగ్నల్స్ అందడం లేదనే సాకుతో తమను ఫీల్డ్ అసిస్టెంట్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కూలీలు దుయ్యబడుతున్నారు. శుక్రవారం పని చేయగా హాజరు వేయకుండా పనిచేయని రోజు హాజరు తీసుకునేందుకు ఎఫ్ఏ ప్రయత్నించడంపై కూలీలు మండిపడ్డారు. ఏ రోజు పనులకు ఆ రోజు కూలి ఇవ్వకుండా, మరుసటి రోజు పని కల్పించకుండా ఖాళీగా కూర్చోబెట్టడం ఏమిటంటూ నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీఓ వజీర్ దృష్టికి తీసుకువెళ్లగా.. పని బాగోలేదని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పారని, తనకు రావడం కుదరదని, నందమూరులో ఉన్నానని బదులిచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డుకు వెళ్లకుండా పని బాగోలేదని ఫిర్యాదు చేస్తే ఏపీఎం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 20269అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ను ఆయన శనివారం ప్రారంభించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): సిటీ ఏఆర్ అదనపు ఎస్పీగా ఎన్.వి.రమణ శనివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం సీపీ రాజశేఖరబాబును మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. -
అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కంచికచర్ల: నిత్యావసర సరుకుల కోసం దుకాణానికి వెళ్లిన యువకుడు ట్రాక్టర్ ఢీకొని దుర్మరణం చెందాడు. ఇదే ప్రమాదంలో మరొకరు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన కంచికచర్లలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్ఐ పి.విశ్వనాధ్ శనివారం తెలిపిన కథనం మేరకు... మండలంలోని పరిటాల గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ రఫీ(28) ఓ ఐరన్ షీట్లు తయారు చేసే ప్యాబ్రిక్స్లో పని చేస్తుంటాడు. శుక్రవారం రాత్రి పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన అతడికి కుటుంబసభ్యులు నిత్యావసర సరుకులు తీసుకురావాలని చెప్పగా తన స్నేహితుడు షేక్ షరీప్బుడే కలసి స్కూటీపై దుకాణానికి కంచికచర్ల వెళ్లాడు. సరుకులు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా విజయవాడ వైపు నుంచి కంచికచర్ల వైపునకు కంకరలోడుతో వస్తున్న ట్రాక్టర్ వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహ్మద్రఫీ తలకు తీవ్ర గాయాలు కాగా షరీప్కు కూడా తీవ్ర గాయమయింది. రఫీని వైద్య చికిత్సకోసం ప్రవేటు వాహనం ద్వారా విజయవాడలోని గొల్లపూడి ప్రవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. షరీప్ బుడేను వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు సంతానం ఉన్నారు. రఫీ భార్య కౌసర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రకృతి పరిరక్షణ దిశగా అడుగులు వేయాలి
రైల్వే డివిజన్లో ముగిసిన పర్యావరణ దిన వేడుకలు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్లో పర్యావరణ దిన వేడుకలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఎన్విరాన్మెంట్ అండ్ హౌస్కీపింగ్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రైల్వే ఆడిటోరియంలో జరిగిన ముగింపు వేడుకల్లో డీఆర్ఎం మోహిత్ సోనాకియా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 15 నుంచి జూన్ 5 వరకు డివిజన్లో నిర్వహించిన వేడుకల్లో భాగంగా ఉద్యోగులు, విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ వలంటీర్లు, ప్రయాణికులతో అనేక పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా పర్యావరణ అనుకూల పద్ధతులు, వాతావరణంలో మార్పులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు రూపొందించిన కార్యాచరణలను ప్రస్తావించారు. డివిజన్ వ్యాప్తంగా 43 ప్రాంతాలలో పర్యావరణ ప్రతిజ్ఞలు, 1,060 మొక్కలు నాటడం, 158 అవగాహన ప్రదర్శనలు, 25 ఆరోగ్య అవగాహన, 27 సంతకాల సేకరణ కార్యక్రమాలను నిర్వహించినట్లు వివరించారు. అనంతరం పర్యావరణ అనుకూల పద్ధతులను పాటించడంలో కృషి చేసిన 15 మంది సిబ్బందికి డీఆర్ఎం చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు కొండా శ్రీనివాసరావు, పీఈ ఎడ్విన్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
పెడన: పాలనను ప్రజలకు చేరువ చేసి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా నియోజకవర్గ కేంద్రాలలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. శుక్రవారం కలెక్టర్ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో కలసి పెడన మునిసిపల్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శుక్రవారం ప్రత్యేక మీ కోసం కార్యక్రమాన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా పెడన నియోజకవర్గంలో మూడో శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించామని.. ప్రజల నుంచి మొత్తం 53 అర్జీలను స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులందరూ నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని, సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. మచిలీపట్నం ఆర్డీఓ సాంబశివరావు, డీఎస్పీ శ్రీనివాసరావు, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, ఎంపీడీవో నూతలపాటి శ్రీనివాసరావు, ఆర్టీసీ పర్యవేక్షకుడు గోపాల్, విద్యుత్ శాఖ ఈఈ గోవిందరావు, మునిసిపల్ కమిషనర్ కొండయ్య, పెడన తహసీల్దార్ వహీదా, ఎంపీడీవో అరుణ, గూడూరు తహసీల్దార్ రాజ్యలక్ష్మి, ఎంపీడీవో శైలజ, బంటుమిల్లి ఎంపీడీవో శివప్రసాద్ దేవదాయ శాఖ ఈవో అరుణ పాల్గొన్నారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● తమ గ్రామానికి ఆర్టీసీ బస్సులు తిరిగి నడపాలని కోరుతూ కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామస్తులు టి. ఆంజనేయులు, బి. సాయికుమార్, జి. రాము కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. గతంలో బందరు డిపో నుంచి గ్రామానికి ఆర్టీసీ బస్సు వస్తూ ఉండేదని, తర్వాత బస్సు నిలిపివేయడంతో మత్స్య ఉత్పత్తులను అమ్ముకునే వ్యాపారస్తులు, విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ● మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి ఆనుకుని ఒక కిలోమీటర్ దూరం లోపలికి తమ గ్రామానికి ఉన్న రహదారి గుంతల మయమై చాలా ఇబ్బందులు పడుతున్నామని రహదారి సమస్యను పరిష్కరించాలని గూడూరు మండలం తరకటూరు గ్రామపంచాయతీ పరిధిలోని తరకటూరుపాలెంకు చెందిన కేవీ రమణ, కె.కృష్ణ, పూర్ణ, నరేంద్ర అర్జీ సమర్పించారు. ● రీ సర్వే తర్వాత అందించిన పట్టాదారు పాస్ పుస్తకాలలో తమ భూమిని తక్కువగా చూపించారని, వాస్తవానికి ఉన్న భూమి ఎక్కువని దానిని సరిచేయాలని కోరుతూ పెడన మండలం జింజేరు గౌడ పాలెం గ్రామానికి చెందిన రాజులపాటి పూర్ణ, పెడన మండలం దేవరపల్లి గ్రామ వాసి జే. వరలక్ష్మి అర్జీ అందించారు. పెడన ప్రత్యేక ‘మీ కోసం’లో కలెక్టర్ డీకే బాలాజీ -
ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్కు స్వాగతం
గన్నవరం: కేంద్ర ఆహార ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్కు గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం ఘన స్వాగతం లభించింది. విజయవాడ పర్యటన నిమిత్తం ఆయన విశాఖపట్నం నుంచి ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో రాత్రి ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో చిరాగ్ పాశ్వాన్కు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, పలువురు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడ బయలుదేరి వెళ్లారు. -
స్మార్ట్ పోలీసింగ్లో ప్రతిభకు ప్రశంస
లబ్బీపేట(విజయవాడతూర్పు): శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు వేగంగా సేవలు అందిస్తూ.. స్మార్ట్ పోలీసింగ్లో ప్రతిభ చూపిన వారికి శుక్రవారం పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ప్రశంసాపత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతివారం ఇస్తున్న ర్యాంకింగ్లో 16 వారాలుగా స్మార్ట్ పోలీసింగ్లో జిల్లా ప్రథమస్థానంలో నిలుస్తుండటంతో అందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సైబర్ క్రైమ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ నేరాలు జరగకుండా చూడటం, ఒకవేళ జరిగినా సాంకేతికత, ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉపయోగించి నిందితులను వెంటనే పట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డీసీపీ(అడ్మిన్) కేజివి సరిత, సైబర్ క్రైమ్ డీసీపీ కె. కృష్ణప్రసన్న, ఏసీపీ భానుప్రకాష్రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: దుర్గగుడి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద నవహారతుల కార్యక్రమం శుక్రవారం పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణానదికి జలహారతులు ఇచ్చారు. అనంతరం నది ఒడ్డున ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంతంలో నవహారతులు ఇచ్చారు. గతంలో కృష్ణానదిలో ఫంటు ఏర్పాటు చేసి నవహరతులు ఇచ్చేవారు. హారతులతో పాటు హారతులు తిలకించడం, ఉచ్ఛరించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించేవారు. ఇప్పుడు నది ఒడ్డున ప్రత్యేక ఏర్పాట్లు చేసి పూజారులు హారతులు ఇచ్చారు. దుర్గ గుడి ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు వెంకటనాగ కిశోర్ కుమార్, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): మృగశిరకార్తె ప్రవేశం సందర్భంగా ఈనెల 8, 9న ఊపిరితిత్తులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు వనమూలికలతో తయారు చేసిన చేపమందు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కొండపల్లికి చెందిన మహ్మద్ మహ్మద్ ఆలీ, మహ్మద్ మసూద్ ఆలీ (జిన్నా) సంయుక్తంగా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, పారిశ్రామిక కాలుష్యం ఈ వ్యాధులకు ప్రధాన కారణాలన్నారు. చేపమందు కోసం వచ్చేవారు ప్రాణంతో ఉన్న బురదమట్ట, కొరమేను చేపపిల్లను వెంట తెచ్చుకోవాలన్నారు. బతికున్న చేపకు వనమూలికల ఔషధం తినిపించి, రోగికి మింగిస్తామని, శాఖాహారులకు అనుపానంతో మందు ఇస్తామని వారు ఆ ప్రకటనలో తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కారును టిప్పర్ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన గొల్లపూడి వెస్ట్ బైపాస్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గొల్లపూడికి చెందిన యడవల్లి ఆంజనేయులు, ఆయన భార్య అంజలిదేవి గుంటూరు నుంచి కారులో గొల్లపూడి బయలుదేరారు. వెస్ట్ బైపాస్లో నల్లకుంట వద్దకు చేరుకున్న కారు గొల్లపూడి వైపు తిరగకుండా కొంతదూరం ముందుకు వెళ్లిపోయింది. ఫీడర్ రోడ్డులో కారు వెనక్కు నడుపుతూ గొల్లపూడి వస్తుండగా టిప్పర్ వచ్చి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీటులో కూర్చున్న అంజలి దేవి( 59) అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న ఆమె భర్త ఆంజనేయులు, మనవడు సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
కోనేరుసెంటర్: మచిలీపట్నంలోని పలు ప్రాంతా ల్లో అనేక నేరాలకు పాల్పడిన ఇద్దరు చైన్ స్నాచర్లను బందరు సీసీఎస్, మచిలీపట్నం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం బందరు ఇన్చార్జ్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు మచిలీపట్నం పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం కై కలూరు మసీదు సెంటర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్, మహమ్మద్ హిమామ్ షరీఫ్ గతంలో మచిలీపట్నంలోని చిలకలపూడి, కొబ్బరితోట, కలెక్టర్ బంగ్లా ప్రాంతాల్లో అనేక నేరాలకు పాల్పడి ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను తెంచుకుపోయారు. శుక్రవారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశాల మేరకు బందరు సీసీఎస్ సిబ్బంది, మచిలీపట్నం స్టేషన్ సిబ్బంది చిలకలపూడి సెంటర్లోని శ్రీపాండురంగా హైస్కూలు సమీపంలో జాయింట్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఖాజా మొయినుద్దీన్, హిమామ్ షరీఫ్ ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా కనిపించారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి వారిద్దరూ కంగారుపడుతుండటంతో అనుమానం వచ్చిన సీసీఎస్ ఎస్ఐ నాగరాజు, మచిలీపట్నం స్టేషన్ ఎస్ఐ జగదీష్ వారిని అడ్డగించి వారి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా ఈ గత నెల 11వ తేదీ రాత్రి కలెక్టర్ బంగ్లా వెనుక ఉన్న ఎన్జీవో కాలనీ సమీపంలో ఒంటరిగా వెళుతున్న మహిళ మెడలో రెండు బంగారు గొలుసులు తెంచుకుపోయినట్లు చెప్పారు. గతంలో చేసిన నేరాల గురించి కూడా పోలీసులకు చెప్పారు. వారిచ్చిన సమాచారం మేరకు గతంలో వారు చేసిన చోరీలకు సంబంధించి వారి నుంచి రూ.8.50 లక్షల విలువ గల 60 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నేరాలకు ఉపయోగించిన పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించటంలో ప్రతిభ కనబరచిన ఎస్ఐలు నాగరాజు, జగదీష్లతో పాటు సీసీఎస్ సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో సీసీఎస్ ఎస్ఐ నాగరాజు, మచిలీపట్నం ఎస్ఐ జగదీష్, ఆయా స్టేషన్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆర్చరీలో సత్తా చాటిన కీర్తన
ఎ.కొండూరు: మండల పరిధి మత్రియా తండా గ్రామానికి చెందిన దారావతు శ్రీరాములు (38) అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి ఇంట్లో నిద్రించాడు. శుక్రవారం ఉదయం భార్య లేచి భర్తను లేపేందుకు వెళ్లగా అతనిలో చలనం లేదు. కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అప్పటికే అతను మృతిచెందాడు. ఉదయం 11 గంటల సమయంలో అంత్యక్రియల కోసం మృతదేహానికి స్నానం చేయిస్తుండగా వంటిపై గాయాలు కనిపించాయి. దీనితో మృతుడి సోదరి బూక్యా చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ గంధం మహాలక్ష్మణుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ కనిపించింది. వేసవి సెలవులు ముగియనుండటంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మరో వైపున ఆదిదంపతులకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటల తర్వాత రద్దీ మరింత అధికం కావడంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. రూ. 300 టికెట్పై బంగారు వాకిలి దర్శనానికి మాత్రమే అనుమతించారు. రద్దీతో వీఐపీలు, సిఫార్సులపై వచ్చిన భక్తులకు సైతం మధ్యాహ్నం రెండు గంటల తర్వాతే అంతరాలయ దర్శనం కల్పించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో.. ఎండ తీవ్రత, వడగాడ్పుల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు దేవస్థానం చలివేంద్రాల ద్వారా చల్లటి మంచినీటితో పాటు మజ్జిగ, లస్సీలను పంపిణీ చేసింది. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహంతో పాటు రాజగోపురం ఎదుట ట్రస్ట్ బోర్డు సభ్యుల కార్యాలయం వద్ద భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. అంతే కాకుండా వాటర్ క్యాన్ల ద్వారా భక్తులు సేదతీరుతున్న చోటికే ఆలయ సిబ్బంది చేరుకుని మంచినీటిని అందించారు. పంచహారతులకు డిమాండ్.. శుక్రవారం నేపథ్యంలో అమ్మవారి పంచహారతుల సేవకు భక్తుల నుంచి డిమాండ్ కనిపించింది. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి పంచహారతుల సేవ నిర్వహించారు. సాయంత్రం 7 గంటల తర్వాత భక్తుల రద్దీ కొనసాగింది. సెలవులు ముగియనుండటంతో భారీగా తరలివచ్చిన భక్తులు -
బెజవాడలో చీకటి సామ్రాజ్యం!
అలవిగాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం.. వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా రెండేళ్లలోనే జనాగ్రహాన్ని చవిచూస్తోంది. కూటమి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో ప్రజానీకం స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. శుక్రవారం విజయవాడ సెంట్రల్, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి, చంద్రబాబు, పవన్కల్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్ల ప్రతులను దహనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు, నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. – సాక్షి నెట్వర్క్ నయవంచనపై బిగిసిన పిడికిళ్లు సాక్షి టాస్క్ఫోర్స్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్(నాని) ఓ పార్లమెంట్ సభ్యుడిపై మరోసారి ఫైర్ అయ్యారు. విజయవాడను భయాందోళనకు గురిచేయడమే కాకుండా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వాటి వివరాలతో తన ఫేస్బుక్ ఖాతాలో పెద్ద పోస్టు పెట్టారు. ఆయన పోస్టులో ఇలా ఉంది.. ప్రస్తుత ఎంపీపై వరుసగా వెలుగులోకి వస్తున్న ఆరోపణలు.. రాజకీయ, వ్యాపార సామాజిక వర్గాల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. భూ ఆక్రమణలు, వివిధ రకాల అక్రమ దందాలు, క్రీడా సంస్థల్లో అవినీతి, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం వంటి అంశాల వెనుక పార్లమెంట్ సభ్యుడి ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉందనే ఆరోపణలు పౌర సమాజంలో కలకలం రేపుతున్నాయి. క్రీడా రంగాన్ని కూడా వదలకుండా సదరు ఎంపీ తన అధికార ప్రభావాన్ని వినియోగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వాణిజ్య సముదాయంపై ఒత్తిళ్ల వివాదం.. నగరంలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఒక ప్రముఖ వాణిజ్య సముదాయానికి సంబంధించి పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంపీ దిశానిర్దేశంతోనే ఒక ప్రవాస భారతీయ మహిళ ఏర్పాటు చేయదలచిన వ్యాపార సంస్థ (బ్రూవరీ) కోసం, సదరు భవనాన్ని రెండేళ్లపాటు అద్దె లేకుండా అందించాలని భవన యజమానిపై ఉన్నతాధికారుల స్థాయి నుంచి ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. భవనాన్ని ఉచితంగా ఇవ్వకపోతే దానిని ‘అనధికార నిర్మాణం’గా పేర్కొంటూ కూల్చివేస్తామని మున్సిపల్ అధికారుల ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం ఉంది. ఒక కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివాదంలో టాస్క్ఫోర్స్ పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతూ, లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా విమర్శలు వస్తున్నాయి. మైలవరం నియోజకవర్గంలో అక్రమాలను ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైనే పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం వారిని నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లడమే కాకుండా, కక్ష సాధింపులో భాగంగా ఏకంగా సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద అక్రమ కేసులు బనాయించారు. ఎంపీ నీడలో రేషన్ బియ్యం స్మగ్లింగ్, ఇసుక, మట్టి మాఫియా, ఫ్లైయాష్ దందా, పేకాట క్లబ్స్, ప్రైవేటు సెటిల్మెంట్స్ యథేచ్ఛగా సాగుతున్నాయి. వారికి టాస్క్ఫోర్స్ అండగా నిలుస్తోంది. విజయవాడలో ఓ విద్యాసంస్థ భూమి ఆక్రమించే యత్నాలు సాగుతున్నాయి. -
పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత
పటమట(విజయవవాడతూర్పు): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన భారీ సైకిల్ ర్యాలీలో బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పాల్గొన్నారు. అశోక్నగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు పర్యావరణ అవగాహన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, భావితరాల భవిష్యత్తు కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందన్నారు. చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులను, హస్తకళల ఉత్పత్తులను వినియోగించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొక్క నాటిన హోమంత్రి.. ఆటోనగర్(విజయవాడతూర్పు): స్థానిక అగ్నిమాపక కేంద్రం ఆవరణలో హోం మంత్రి వి. అనిత మొక్క నాటారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా స్థానిక నోవోటెల్ హోటల్ నుంచి ఆటోనగర్ ఫైర్ స్టేషన్ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫైర్ స్టేషన్ను పరిశీలించారు. అత్యవసర సేవల వివరాలను ఇక్కడి అధికారి జీవీ రామారావుతో పాటు పలువురిని ఆమె అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పి. వెంకటరమణ, అడిషినల్ డైరెక్టర్ జి. శ్రీనివాసులు, జిల్లా అధికారి ఏవీ శంకర్రావు పాల్గొన్నారు. సైకిల్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సవిత -
యువకుడి హత్య కేసులో నిందితులు అరెస్ట్
గన్నవరం: మండలంలోని దావాజీగూడెంలో ఇటీవల జరిగిన యువకుడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు గన్నవరం పోలీస్స్టేషన్లో కేసు వివరాలను సీఐ బీవీ శివప్రసాద్ మీడియాకు వివరించారు. హత్యకు గురైన కంకిపాడు మండలం వేల్పూరుకు చెందిన పామర్తి హేమకుమార్కు గన్నవరం మండలం అల్లాపురానికి చెందిన వెలవెల జయంత్ కుటుంబాల మధ్య గత రెండేళ్లుగా వివాదాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 30వ తేదీన మద్యం తాగిన హేమకుమార్, జయంత్ పరస్పరం ఘర్షణకు దిగారు. వీరిద్దరికీ పరిచయస్తుడైన డొక్కా దిలీప్ ఈ ఘర్షణను అడ్డుకున్నాడు. ఈ తరుణంలో జయంత్ తన బైక్ తాళంతో హేమకుమార్ మెడపై పొడవగా చిన్న గాయమైంది. దీనికి ప్రతీకారంగా జయంత్ కోసం గాలిస్తున్న హేమకుమార్, అతని స్నేహితులు లోకేష్, ఖాదర్ స్థానిక బజాబ్ షోరూమ్ వెనుక ఉన్న మైదానంలో క్రికెట్ ఆడుతున్న డొక్కా దిలీప్పై దాడి చేసి కొట్టారు. అదే రోజు రాత్రి పాటిటెక్నిక్ కాలేజీ సమీపంలో సిగరెట్ తాగుతున్న హేమకుమార్పై జయంత్ దాడి చేసి కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన హేమకుమార్ను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మృతి చెందినట్లు సీఐ శివప్రసాద్ వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడైన జయంత్తో పాటు హత్యకు సహకరించిన అతని స్నేహితులు గుణదీప్, భావధీర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు, హత్య చేసిన తర్వాత పరారయ్యేందుకు వినియోగించిన మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. ఈ ముగ్గురు నిందితులను నూజివీడు కోర్టుకు హాజరుపర్చగా, ఈ నెల 18వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించటంతో నెల్లూరు సెంట్రల్ జైల్కు తరలిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా సీఐ చెప్పారు. -
ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదు చోరీ
కంచికచర్ల: గుర్తు తెలియని దొంగలు ఓ ఇంటి కిచెన్ తలుపులు పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలతో పాటు నగదు దొంగిలించిన సంఘటన కంచికచర్ల మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాఽథ్ కథనం మేరకు మండలంలోని పరిటాల శివారు నక్కలంపేటలో గుత్తా పద్మజ, ఆమె తండ్రి కొమ్మినేని కృష్ణారావు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంటి కిచెన్ డోర్ గడియను విరిచి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం బెడ్రూంలోని కప్బోర్డులను, లాకర్లను తాళాలతో తెరిచి అందులో ఉన్న సుమారు 394 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50వేలు నగదు అపహరించుకుపోయారన్నారు. ఇంటి యజమానురాలు పద్మజ తెల్లవారుజామున 3 గంటలకు మంచినీటి కోసం నిద్ర నుంచి లేవగా కిచెన్ డోర్ పగులకొట్టి ఉండడం, మెయిన్డోర్ కూడా తెరిచే ఉండడం గమనించారన్నారు. దీంతో కంగుతిన్న పద్మజ తన తండ్రి కృష్ణారావును లేపి బీరువా తెరిచి చూడగా బంగారు ఆభరణాలు నగదు పోయాయని గ్రహించారన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా రూరల్ సర్కిల్ సీఐ వైవీవీఎన్ నాయుడుతో కలసి గ్రామానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులను పిలిపించామని తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్ డీసీపీ కంచికచర్ల మండలంలో జరిగిన దొంగతనం గురించి సీఐ వైవీవీఎల్ నాయుడు విజయవాడ రూరల్ డీసీసీ బి.లక్ష్మీనారాయణకు సమాచారం అందించారు. డీసీపీ నందిగామ ఏసీపీ సీహెచ్ శ్రీనివాస్తో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఇంటి యజమానురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపిస్తామని చెప్పారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. ఎగువ నుంచి ఎలాంటి ఇన్ఫ్లో లేదు. 7ఇబ్రహీంపట్నం: మూలపాడులోని బటర్ఫ్లై పార్క్లో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సాక్షి విజయవాడ: విజయవాడలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపగా.. సాయంత్రానికి అంతా చల్లబడింది. -
కాటేస్తున్న కాలుష్యం
కాలుష్యానికి కారణాలివే కాలుష్య ప్రభావ సమస్యలివే ఇవే నిదర్శనాలు ● తాడిగడపకు చెందిన 40 ఏళ్ల వెంకటేష్ గాంధీనగర్లోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తుంటారు. నిత్యం ద్విచక్రవాహనంపై విధులకు వస్తుంటారు. ఇటీవల నీరసంగా ఉండటంతో పరీక్ష చేయించుకుంటే షుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతనికి ఫ్యామిలీ హిస్టరీ కూడా లేక పోవడంతో కాలుష్యమే కారణమై ఉంటుందంటున్నారు. ● భవానీపురానికి చెందిన 38 ఏళ్ల అభిలాష్ మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తుంటారు. విధి నిర్వహణలో భాగంగా నిత్యం బైక్పై తిరుగుతుంటారు. ఇటీవల వాసన గ్రహించలేకపోవడం, డిప్రెషన్కు లోనవుతున్నారు. కాలుష్య ప్రభావమే కారణమంటున్నారు. నివారణకు ఏమి చేయాలి? -
అర్హుల ఓట్లు పోకుండా చూడండి
మచిలీపట్నంటౌన్: అర్హులైన ఏ ఒక్కరి ఓటూ జాబితా నుంచి తొలగించకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్స్(బీఎల్ఏ)లకు ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు గురువారం స్థానిక ఎమ్మార్ ఫంక్షన్ హాల్లో జరిగింది. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, ఆ పార్టీ రాష్ట్ర పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడు కె. సుధాకర్రెడ్డి ఎస్ఐఆర్పై బీఎల్ఏలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పేర్నినాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న బీఎల్వోలు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ కి చెందిన బీఎల్ఏలు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కష్టపడి పని చేయాలన్నారు. గన్నవరం శాసనసభ్యుడు గతాన్ని మరిచి కూటమి అధినాయకుల మెప్పు కోసం విమర్శలు చేస్తున్నారని.. ప్రత్యక్ష ఎన్నికల్లో తాను ఉండనని స్పష్టం చేశారు. డీఎస్సీపై ఆధారాలు చూపగలరా.. డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరగలేదని బుకాయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ సాక్ష్యాలను బయట పెట్టే దమ్ము ఉందా అని పేర్ని నాని సవాల్ విసిరారు. స్పోర్ట్స్ కోటాలో 65అంశాలకు సంబంధించి అమ్మకాలు జరిపిన కూటమి ప్రభుత్వం అర్హులైన డీఎస్సీ అభ్యర్థులను మోసగించిందన్నారు. వారందరూ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి పోరాడుతున్న విధానం స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, దారుణాలు జరిగితే నోరు మెదపని హోం మంత్రి వంగలపూడి అనిత.. సీఎం తనయుడు మంత్రి లోకేష్పై ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం మీడియా ముందు ప్రత్యక్షమవుతున్నారన్నారు. ఎస్ఐఆర్పై అవగాహన సదస్సులో మాజీ మంత్రి పేర్ని నాని -
నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పీవీపీ కృష్ణకుమార్ కుటుంబం రూ.1,00,116, విజయవాడ పటమటలంకకు చెందిన తోట మల్లికార్జునరావు, మల్లేశ్వరి దంపతులు రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనంతో పాటు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఏఈవో వెంకటరెడ్డి తదితరులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను, శేషవస్త్రాలతో దాతలను సత్కరించారు. బస్టాండ్(విజయవాడ పశ్చిమ): విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో మల్టీప్లెక్స్ థియేటర్ గురువారం పునఃప్రారంభం అయ్యింది. కొంతకాలంగా థియేటర్స్లో చిత్రాలు ప్రదర్శించకపోవటంతో ప్రయాణికులు నిరాశకు గురి అవుతున్న నేపథ్యంలో రవి సినిమాస్ యాజమాన్యం ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల సహకారంతో థియేటర్స్ను ఆధునికీకరించి ప్రముఖ న్యాయవాది, పారిశ్రామిక వేత్త సిరిగిరి రవీంద్ర శేఖర్ చేతుల మీదుగా ప్రారంభించింది. తొలి రోజు పెద్ది సినిమాను ప్రదర్శించింది. నిర్వాహకులు రవి మాట్లాడుతూ మల్టీప్లెక్స్లు, మాల్స్లో సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో రవి సినిమాస్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను డిజైన్ చేసిందన్నారు. అనుమతించిన కొత్త చిత్రాలకు ప్రీమియర్ షోల వరకు టికెట్ ధరలను రూ.600 నిర్ణయించామని తర్వాత నుంచి టికెట్ ధర రూ.150 ఉంటుందన్నారు. స్టూడెంట్ ఆఫర్ కింద రూ.130, కపుల్స్కు రూ.130గా టికెట్ రేట్లను నిర్ణయించామన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో డెప్యూటీ తహసీల్దార్లుగా పనిచేస్తున్న వారికి తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ పరిపాలనశాఖ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఇన్చార్జ్ తహసీల్దార్లుగా వ్యవహరిస్తున్న ఆయా మండలాలకు పూర్తిస్థాయిలో తహసీల్దార్లను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బి. లోకరాజు (గుడ్లవల్లేరు), బి. అంకాలు(అవనిగడ్డ), ఏఎన్ శివకుమార్రాజు(పెనమలూరు), కోట జోబాబు (బంటుమిల్లి), జీఆర్వీ భద్రరావు (గుడివాడ ఆర్డీవో కార్యాలయ ఏవో) నియమించారు. కేవీవీఎన్ మల్లేశ్వరరావు (కృత్తివెన్ను), వీఎస్ఆర్కే ప్రసాద్ (గుడివాడ), కట్టా రామశివ (మచిలీపట్నం సౌత్), ఎస్. హేమంత్కుమార్ (కలెక్టర్ కో–ఆర్డినేషన్ సెక్షన్ సూపరిండెండెంట్) నియమించారు. సి. ప్రభు కిషోర్ను కృష్ణాజిల్లా ల్యాండ్ రిఫార్మర్స్ ఆఫీసర్గా, కాగిత వీవీ చంద్రరావు(కోడూరు), ముసునూరి శ్రీహరి కలెక్టరేట్లోని మెజిస్టీరియల్ సెక్షన్ సూపరింటెండెంట్గా, ఎస్. భవానీని మోపిదేవి తహసీల్దార్గా, షేక్ వహీదారహమాన్ను పెడన తహసీల్దార్గా నియమించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణాజిల్లా అండర్–23 ఉమెన్స్ క్రికెట్ జట్టులోని క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను గురువారం పూర్తి చేశామని కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్ర చౌదరి ప్రకటనలో తెలిపారు. కెప్టెన్గా పి.రంగలక్ష్మి, సభ్యులుగా మహమ్మద్ మోహక్, మహమ్మద్ ముస్కానా, మహమ్మద్ అంజుమ్, వి.అక్షయ, ఎం.పూజిత, టి.గుణచంద్రిక, టి.నివేదిత, ఎం.సృజన, ఏ.లక్ష్మణ్ అపర్ణ, వీ.గాయత్రీదేవి, బి.పుష్ప, ఏ.రాణి, వి.వేణుమాధవి, ఎం.లేఖన, సీహెచ్ ధనశ్రీ, కె.కీర్తి, స్టాండ్బైగా ఆర్.చేతన ప్రియ, బి.స్రవంతి, జేఎన్ఎస్ఎస్ యశశ్వని, బి.తమిళికలను ఎంపిక చేశామని తెలిపారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి జైలుశిక్ష
కృష్ణలంక(విజయవాడతూర్పు): మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఆరుగురు వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో ట్రాఫిక్ పోలీసులు గత నెల రోజుల వ్యవధిలో వాహనాల తనిఖీల్లో మద్యం తాగి పట్టుబడిన 84మంది వాహన చోదకులను గురువారం ఒకటో స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి కాసాని సీతామహాలక్ష్మి వారిని విచారించి ఒక వ్యక్తికి మూడు రోజులు జైలు శిక్ష విధించగా మరో ఐదుగురికి ఒక్కొక్కరికి రెండు రోజుల చొప్పున జైలుశిక్ష విధించారు. మిగిలిన 78 మందికి రూ.7లక్షల 80వేలు జరిమానాగా విధించారు. ప్రతిరోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ షిరీన్ బేగం హెచ్చరించారు. -
నూతన విధానంతో రైతులకు ప్రయోజనం
కృష్ణాజిల్లా వ్యవసాయాధికారి జ్యోతిరమణిపామర్రు: ఎరువుల పంపిణీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన సర్వర్ విధానంతో రైతులకు ఎంతో ప్రయోజనం సమకూరుతుందని జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిరమణి పేర్కొన్నారు. స్థానిక బొమ్మారెడ్డి సీతారెడ్డి కల్యాణ మండపంలో జిల్లా స్థాయిలో సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ మండల అధికారులు, వీఏఏలకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన ఎరువుల సరఫరా విధానాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా రైతాంగానికి కావాల్సిన ఎరువులను అందించాలన్నారు. ఎరువుల సర్వర్ విధానంతో పాటుగా ఫెర్టిలైజర్ యాప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దానిని ఏ విధంగా వినియోగించాలని అనే అంశాలను వివరించారు. ప్రతి రైతు నమోదు చేసుకోవాలి.. గుంటూరు ఎరువుల వ్యవసాయ కమిషనర్ కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎగ్రికల్చర్ ఎం. ఆనంద్రావు మాట్లాడుతూ ఫెర్టిలైజర్ యాప్లో ప్రతి రైతు నమోదు అయి ఉండాలన్నారు. కార్యక్రమంలో మార్కెఫెడ్ డీసీవో కె. చంద్రశేఖర్, జిల్లా మేనేజర్ బి. మురళీ కృష్ణ, డీడీఏ ఏ ఆనందరావు, రాష్ట్ర ఫెర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పామర్రు ఏడీఏ బి.స్వర్ణలత, ఏవో శివ నాగరాణి, జిల్లాలోని వీఏఏలు, పీఏసీఎస్ కార్యదర్శులు పాల్గొన్నారు. -
రెండేళ్ల వంచన పాలనపై ప్రజానీకం కన్నెర్ర
దహనమవుతున్న బాండ్ల ప్రతులుసాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇచ్చిన హామీలు మరిచి, రెండేళ్లుగా అరచేతిలో వైకుంఠం చూపుతున్న చంద్రబాబు సర్కారు పనితీరుపై ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ నగరంతో పాటు మండల కేంద్రాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లాయి. టీడీపీ సూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ సంతకాలతో ఇచ్చిన బాండ్ల ప్రతులను వైఎస్సార్ సీపీ శ్రేణులు దహనం చేశాయి. కూటమి రెండేళ్ల పాలనంతా అధ్వానం, దగా మోసం, అవినీతి అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఆయన ఇచ్చిన హామీలకు చంద్రగ్రహణం పట్టిందని నినదించారు. -
గుడివాడలో ‘తమ్ముళ్ల’ వీరంగం
గుడివాడ టౌన్: కృష్ణాజిల్లా గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం జరుగుతుండగా వీరంగం సృష్టించారు. వైఎస్సార్ సీపీ నేతలు నిరసన కార్యక్రమానికి ముందే పోలీసు అనుమతులు తీసుకున్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలుగకుండా చూడాలన్న వారి సూచన మేరకు కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్ సీపీ ర్యాలీ జరుగుతుండగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఆ పార్టీ జెండాలు చేత పట్టుకుని రెండేళ్ల విజయోత్సవం అంటూ పోటీగా ర్యాలీ ప్రారంభించారు. దీంతో ఇరు పార్టీలకు ఇబ్బంది కలుగకుండా పోలీసులు రూట్ మ్యాప్ ఇస్తే దానినీ తెలుగు తమ్ముళ్లు ఉల్లంఘించారు. వైఎస్సార్ సీపీ కార్యక్రమం జరిగే ప్రాంతానికి దూసుకొచ్చి రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. చోద్యం చూసిన పోలీసులు.. పోలీసులు అప్రమత్తమై ఇరుపక్షాలకు నచ్చజెప్పే యత్నం చేశారు. అయినా వినని టీడీపీ నాయకులు వీరంగం సృష్టించారు. దీంతో పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులకు నచ్చ చెప్పి అక్కడ నుంచి పంపేశారు. టీడీపీ నాయకులు మాత్రం జ్యోతీరావ్ పూలే–సావిత్రీబాయ్ పూలే విగ్రహాలకు అప్పటికే వైఎస్సార్ సీపీ శ్రేణులు వేసిన పూలమాలలు తెంచివేసి వారు తెచ్చిన పూలమాలలను వేయడం అధికార మదానికి పరాకాష్టగా నిలిచింది. ఇంత జరుగుతున్నా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. -
నాసిరకం ప్రెజర్ కుక్కర్ల తయారీ
గన్నవరం: మండలంలోని సూరంపల్లితో పాటు విజయవాడ కబేళాలోని అల్యూమినియం కంపెనీల్లో గురువారం భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) అధికారులు దాడులు నిర్వహించారు. బీఐఎస్ విజయవాడ శాఖ శాస్త్రవేత్త, సంయుక్త సంచాలకులు షణ్ముఖ శివపల్లి, ఉప సంచాలకులు డి. వివేక్వర్థన్రెడ్డి, ఎస్ఎస్ఏ ఎ. రాజే నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సూరంపల్లిలోని అల్యూమినియం కంపెనీలో బీఐఎస్ లైసెన్స్ లేకుండా, ఐఎస్ఐ మార్కు లేకుండా ప్రెజర్ కుక్కర్లు తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ కంపెనీలో నిబంధనలకు విరుద్ధంగా తయారైన వివిధ బ్రాండ్ల పేరుతో ఉన్న 7,598 కుక్కర్లను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో మరో కంపెనీ.. అదే విధంగా విజయవాడలోని కబేళా ఇండస్ట్రీయల్ ఏరియాలో ఉన్న మరో కంపెనీలో తనిఖీలు నిర్వహించి నకిలీ ఐఎస్ఐ మార్కు ఉన్న ప్రెజర్ కుక్కర్లు, విడి భాగాలను తయారు చేస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. నాణ్యత ప్రమాణాలను ఉల్లంఘించి తయారు చేసిన 478 ప్రెజర్ కుక్కర్లు, 418 కుక్కర్ బాడీలు, మరో వంద మూతలను స్వాధీనం చేసుకున్నారు. బీఐఎస్ శాస్త్రవేత్తలు, సంయుక్త సంచాలకులు బి. రాజగోపాల్, టి. అర్జున్, కె. సాయికౌషిక్ తదితరులు పాల్గొన్నారు. సదరు కంపెనీ నిర్వాహకులపై బీఐఎస్ చట్టం 2016 ప్రకారం చట్టపరమైన చర్యలతో పాటు జారిమానాలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.41 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.41 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 16 రోజులకు రూ.3,41,39,565 నగదు. 273 గ్రాముల బంగారం, 4.450 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. ఇక విదేశాలకు చెందిన కరెన్సీ సైతం భారీగానే లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. 349 యూఎస్ఏ డాలర్లు, 335 నేపాల్ రూపీ, 1,390 యూఏఈ దిర్హమ్స్, 195 కెనడా డాలర్లు, 200 సౌత్ ఆఫ్రికా రాండ్లు, 100 రష్యన్ రుబీలు, 200 ఓమన్ బైంసాలు, ఐద వేల సిరియా పౌండ్లు లభించాయని వివ రించారు. కానుకల లెక్కింపును దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొనగా, పోలీసులతో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు. ప్రభుత్వాస్పత్రి స్టోర్స్లో డీఎంఈ తనిఖీలులబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలోని డ్రగ్ స్టోర్స్ను బుధవారం రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ విష్ణువర్ధన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం స్టోర్స్లో స్టాక్ ఎంత ఉంది, విని యోగం ఎంత, అత్యవసర మందులు, రెండే ళ్లలో వాడిన మందుల రికార్డులు వంటి వాటిని తనిఖీ చేశారు. స్థానికంగా కొనుగోలు చేసిన మందుల వివరాలు రికార్డులను పరిశీలించారు. సుమారు గంట పాటు ఆయన స్టోర్స్లో తనిఖీ చేశారు. ఆయన వెంట అడిషనల్ డీఎంఈ డాక్టర్ వి.రాధికారెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, ఇతర అధికారులు ఉన్నారు. గతంలో కొనుగోలు చేసిన మందులు, సర్జికల్స్పై ఫిర్యాదుల రావడంతోనే తనిఖీలు నిర్వహించినట్లు ఆస్పత్రిలో చర్చ జరిగింది. అసలు కారణం ఏమిటనేది తెలియరాలేదు. ప్రస్తుతం ఉన్న మందులు, అత్యవసర మందుల స్టాక్ రిజిస్టర్ను కూడా పరిశీలించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): వంకర పాదాలు (క్లబ్ ఫుట్)తో పుట్టిన చిన్నారులను తొలిదశలో గుర్తించి, సరైన సమయంలో చికిత్స పొందితే నయం చేయవచ్చని జిల్లా ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాధవీనాయుడు అన్నారు. ప్రపంచ క్లబ్ఫుట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవీనాయుడు మాట్లాడుతూ వంకర పాదాలతో పుట్టిన పిల్లలను గుర్తిస్తే ఆర్బీఎస్కే ద్వారా చిన్నారులకు ఉచితంగా స్క్రీనింగ్, నిర్ధారణ, చికిత్సలు అందిస్తున్నట్లు వివరించారు. పీడియాట్రిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సునీత మాట్లాడుతూ క్లబ్ ఫుట్ అనేది పుట్టుకతో వచ్చే సమస్య అయినప్పటికీ, సరైన చికిత్స అందితే సాధారణ పిల్లల మాదిరిగా నడవగలగుతారన్నారు. డీఈఐసీ సెంటర్ పీడియాట్రిక్ నిపుణులు డాక్టర్ కె.అమిత, ఫిజియోథెరపిస్టు కె.ప్రసన్న, చైల్డ్ సైకాలజిస్ట్ టి. దుర్గాప్రసాద్, ఎస్.ప్రవీణ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. మూలపాడు(ఇబ్రహీంపట్నం): మూలపాడు సీతాకోకచిలుకల పార్క్ (నగర వనం)ను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు కంచికచర్ల ఫారెస్ట్ డీఆర్వో శివప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. నగరవనంతో పాటు పరిసర అటవీ ప్రాంతంలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురు, శుక్రవారాలు సీతాకోక చిలుకల పార్క్ మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. సందర్శకులను వనంలోకి అనుమతించడం లేదని తెలిపారు. పనులు పూర్తి అయిన తరువాత ప్రవేశాలకు అనుమతి ఇచ్చే తేదీలను ప్రకటించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి, రెండేళ్ల పాలనలో వాటిని అమలు చేయకుండా చంద్రబాబు మోసగించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్దామని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, విజయవాడ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్ అన్నారు. గురువారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకూ నిర్వహించనున్న వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం పోస్టర్ను బుధవారం తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వారి మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అందులో భాగంగా గురువారం మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఇండోర్ సమావేశాలు, 12న భారీ ర్యాలీలు నిర్వహించనున్నామని వివరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ వాటిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని, వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుందన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు కడియాల బుచ్చిబాబు, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య(వర), మాజీ డెప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, మాజీ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలకుమారి, సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డి.అంజిరెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహిస్తామని, ఈ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కోరారు. కలెక్టరేట్లోని శ్రీఏవీఎస్ రెడ్డి హాల్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్ష తన సర్పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం జరిగింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సంబంధించి జిల్లాస్థాయిలో కార్యాచరణను వివరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లకు శిక్షణతో పాటు సన్నద్ధత కార్యకలాపాలు ఈ నెల ఐదు నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను పోలింగ్ బూత్ స్థాయి బీఎల్ఓలకు అందజేసి ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకు సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ జరుగుతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత వీటిని పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ)ను నియమించుకోవాల్సిందిగా రాజకీయ పార్టీలను కోరారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1,792 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. కొత్తగా 129 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, ఎన్నికల డీటీ గోపాల్రెడ్డి, కలెక్టరేట్ సమన్వయ విభాగం అధికారి అనుష్కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
భాషల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మంత్రి ఎస్ఎండీ ఫరూఖ్ వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో భాషల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ అన్నారు. ఏపీ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆవో ఉర్దూ సీఖే’ సమ్మర్ క్యాంప్లో పాల్గొని కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం బుధవారం వన్టౌన్లోని ముసాఫిర్ ఖానాలో జరిగింది. ముఖ్యఅతిథి ఎన్ఎండీ ఫరూఖ్ మాట్లాడుతూ.. ఉర్దూ భాష నేర్చుకునే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ మాట్లాడుతూ.. ఉర్దూ భాష దేశ సాంస్కృతిక వారస త్వంలో కీలక భాగమన్నారు. యువతలో ఉర్దూ భాషపై ఆసక్తి పెంచుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఆవో ఉర్దూ సీఖే’ కార్యక్రమాన్ని విజయవం తంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు టి.డి. జనార్దన్, మైనారిటీ వ్యవహారాల సలహాదారు అహ్మద్ షరీఫ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ మొహమ్మద్ గౌస్ పీర్, వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, బోర్డు సభ్యుడు మెహబూబ్ బాషా, సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా తదితరులు ప్రసంగించారు. -
వి.కొత్తపాలెం పీఏసీఎస్లో జిప్సం అక్రమ నిల్వలు!
కోడూరు: మండలం లోని వి.కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీ ఎస్)లో భారీగా అక్రమ జిప్సం నిల్వలు బయటపడ్డాయి. ఎలాంటి ఇన్వాయిస్, ఓఫామ్, రవాణా పత్రాలు లేకుండా సుమారు 300 కట్టల జిప్సంను గోడౌన్లో నిల్వ ఉంచినట్లు తనిఖీల్లో తేలింది. సొసైటీ చైర్పర్సన్, జనసేన నాయకుడు రేపల్లె పిచ్చేశ్వరరావు బ్లాక్ మార్కెట్ నుంచి తెప్పించిన జిప్సంను రైతులకు విక్రయించాలని సొసైటీ సీఈఓ తోట శ్రీకాంత్పై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా విక్రయించలేనని సీఈఓ నిరాకరించడంతో చైర్పర్సన్ పిచ్చేశ్వరరావు ఆయనపై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సీఈఓ జిల్లా సహకార బ్యాంక్ సీఈఓ శ్యామ్ మనోహర్కు ఫిర్యాదు చేయగా, ఆయన ఆదేశాల మేరకు కోడూరు కృష్ణా బ్యాంక్ సూపర్వైజర్ ఫణీంద్రబాబు విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా చైర్పర్సన్ స్పందించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. ‘నా పీఏసీఎస్కు వచ్చి విచారణ చేయడానికి నువ్వు ఎవరు’ అంటూ సూపర్వైజర్పై కూడా చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనిఖీలు చేసిన వ్యవసాయ అధికారులు విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికా రులు వి.కొత్తపాలెం పీఏసీఎస్ గోదామును బుధవారం తనిఖీ చేశారు. ఏఓ శ్రీధర్ నేతృత్వంలో వీఏఏలు జిప్సం నిల్వలను పరిశీలించారు. ఎలాంటి రికార్డులు లేని 300 కట్టల జిప్సం నిల్వలు బయటపడటంతో వాటి విక్రయాలపై ‘స్టాప్ సేల్’ ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో సంబంధిత ఓఫామ్లు, ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏఓ తెలిపారు. జిప్సం నిల్వలు ఉన్న గోదాముకు తాళాలు వేసి విక్రయాలు జరపరాద్దంటూ నోటీసు అంటించారు. రైతులకు అందాల్సిన సబ్సిడీ జిప్సం స్థానంలో అక్రమంగా తెచ్చిన జిప్సం విక్రయించే ప్రయత్నాలు చేసేందుకు పూనుకున్న చైర్పర్సన్, జనసేన నాయకుడు పిచ్చేశ్వరరావు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టు ద్వారా పదవి దక్కించుకొని చైర్పర్సన్ ఇలాంటి అక్రమలకు పాల్పడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. -
కన్నూమన్ను కానక..
చెలరేగుతున్న అధికార పార్టీ మట్టి మాఫియా సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అక్రమ సంపాదన కోసం ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే స్థాయికి చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగు తమ్ముళ్లు దిగజారారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొండలను పిండి చేసి, చెరువులను చెరబట్టి, వాగులు, వంకలు, ఏరులు, నదులు ఇలా ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాకు తెరలేపి రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. అయాచితంగా వస్తున్న అక్రమ సంపాదన నేపథ్యంలోనే వారి మధ్య వివాదం మొదలైంది. వాటాల్లో తేడాలు రావడంతో పాటు అక్రమ దందాల్లో తమ పెత్తనమే సాగాలంటూ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి వర్గం ఇలా మూడు వర్గాలుగా విడిపోయి ఒకరి గుట్టును మరొకరు సోషల్ మీడియా వేదికగా రట్టు చేస్తున్నారు. దీంతో పచ్చనేతల బాగోతం బహిరంగమైంది. అయినా వెనక్కు తగ్గని కొందరు అధికార పార్టీ నాయకులు సొంత పార్టీ నాయకులపైనే కేసులు నమోదు, అరెస్టులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా తన్నులాటే.. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీలో వర్గపోరు మొదలైంది. మైలవరం నియోజకవర్గంలో ఇప్పటికే నియోజకవర్గ ప్రజాప్రతినిధి వర్గంతో పాటు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి వర్గం, జనసేన వర్గం మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, అతని కుటుంబ సభ్యుల్లో ఒకరైన షాడో నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్న వ్యక్తి చేస్తున్న కమీషన్ల దందా, మట్టి, గ్రావెల్ తవ్వకాలను ప్రశ్నిస్తూ రెడ్డిగూడెం మండలానికి చెందిన తెలుగు యువత మండల మాజీ అధ్యక్షుడు ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ సీనియర్ నేత ఉయ్యూరు రమేష్రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో వీరిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కేసులు బనాయించి అరెస్టు చేయించారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఏమాత్రం తీసిపోకుండా పార్లమెంటు ప్రజాప్రతినిధి మైలవరంతో పాటు, విజయవాడ రూరల్ మండలంలో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. -
దుర్గమ్మ ఆలయానికి రూ. 2.25లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పెనమలూరుకు చెందిన కిలారు రామ్మోహనరావు కుటుంబం మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసిన రామ్మోహనరావు తన భార్య విశాలక్ష్మి పేరిట ఉచిత ప్రసాద వితరణకు రూ.1.25లక్షలు, మల్లేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి రూ. 50వేలు, గోసంరక్షణ పథకానికి రూ. 50వేలను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. పామర్రు: కృష్ణాజిల్లా పామర్రు మండలం ఉండ్రపూడి–పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయానికి దాతలు వెండి కిరీటాన్ని మంగళవారం సమర్పించారు. ఉండ్రపూడికి చెందిన మేకా శ్రీహరి రావు, నున్న రాంబాబు మనవడు మేకా అర్జున్ సాన్విక్ స్వామివారికి 975 గ్రాముల బరువుగల వెండి కిరీటం సమర్పించారు. కిరీటం విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ తాడిశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. దాతలకు శేష వస్త్రాలను అందించి సత్కరించారు. అలాగే దేవిరెడ్డి సుదర్శన్రెడ్డి హైమావతి దంపతులు, తోట సుధారాణి, జువ్వనపూడి శోభన్రాజు, కోటేశ్వరమ్మ దంపతులు కలిసి స్వామివారికి 25 కేజీల పులిహోరను ప్రసాదంగా అందజేశారని ఈవో పీవీఎన్వీ ప్రసాదరావు తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజ సేవలో యువత భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో యూత్ టైమ్ బ్యాంక్ పేరుతో రోగులకు విద్యార్థులు అందిస్తున్న సేవలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ యూత్ టైం బ్యాంక్ ద్వారా యువత తమ సమయాన్ని సమాజానికి అంకితం చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై కూడా సేవలు విస్తరించాలంటూ యువజన సంక్షేమ శాఖ జిల్లా ముఖ్య కార్యనిర్వాహణాధికారి కొల్లేటి రమేష్ను ఆదేశించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆర్ఎంవో తదితరులు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): ఎల్నినో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయ కార్యాచరణకు సంబంధించిన పుస్తకాన్ని కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఆయన చాంబర్లో ఆవిష్కరించారు. 2026– 27 సంవత్సరంలో వాతావరణ పరిస్థితులను బట్టి వివిధ పంటలను ప్రకృతి వ్యవసాయం సాగు పద్ధతులు, పరిష్కార మార్గాలను పుస్తకంలో ప్రచురించినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిని వ్యవసాయశాఖ సిబ్బంది, రైతు సాధికార సంస్థ సిబ్బంది, రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లా వ్యవసాయాధికారి జ్యోతి రమణి, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి, వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్.మణిధర్ ఉన్నారు. -
డిగ్రీ.. డీగ్రేడ్!
అస్తవ్యస్తంగా ఉన్నత విద్యా వ్యవస్థవన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో సాధారణ డిగ్రీ విద్యాసంవత్సరం అస్తవ్యస్తంగా మారింది. సాధారణంగా విద్యా సంవత్సరం అనగానే జూన్ మాసంలో ప్రారంభమై మార్చి లేదా ఏప్రిల్ మాసాంతానికి పూర్తి కావటం పరిపాటి. కానీ 2025–2026 డిగ్రీ కోర్సులో చేరిన మొదటి ఏడాది విద్యార్థుల విద్యా సంవత్సరం జూన్ వచ్చినా పూర్తి కాకపోవటంతో గందరగోళంగా మారింది. గడిచిన విద్యా సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర సాధారణ డిగ్రీ మొదటి సంవత్సరం చేరిన వారు సెమిస్టర్ విధానంలో ఇప్పటి వరకూ తమ కోర్సు తొలి ఏడాదిలో కావాల్సిన సెమిస్టర్లు పూర్తికాకపోవటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. కృష్ణా వర్సిటీలో మరీ దారుణం.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న కళాశాలలు కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతుంటాయి. వర్సిటీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసి తదనుగుణంగా అందులో పరీక్ష ఫీజు చెల్లింపు, పరీక్ష జరిగే తేదీను ప్రకటిస్తుంది. ఈ క్రమంలో జూన్ 27 నుంచి సుమారుగా సెకండ్ సెమిస్టర్ థియరీ పరీక్షలు ఉండవచ్చని, ఏప్రిల్ 20వ తేదీ వరకూ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాగే థియరీ పరీక్షలు ముగిసిన తరువాత ప్రాక్టికల్స్ సైతం ఉంటాయని ఆ షెడ్యూల్లో ప్రకటించింది. అయితే పరీక్షల తేదీలను మాత్రం నిర్ధిష్టంగా ప్రకటించకపోవడం గమనార్హం. అంటే జూన్, జూలై మాసాంతం వరకూ ఈ పరీక్షలు జరిగినా, ద్వితీయ ఏడాది విద్యాసంవత్సరం ఆగస్టు చివర లేదా సెప్టెంబర్ మాసాల్లో ప్రారంభమయ్యే అవకాశముంది. డిసెంబర్ వరకూ అడ్మిషన్లు.. గడిచిన రెండు మూడేళ్లుగా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను డిసెంబర్ వరకూ కొనసాగించటంతో ఈ అస్తవ్యస్తమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఏప్రిల్ లేదా మే మాసంలో ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు వెలువడుతున్నాయి. ఆ ఫలితాలు వచ్చిన వెంటనే డిగ్రీ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాల్సిన ఉన్నత విద్యాశాఖ ఆ దిశగా సకాలంలో చర్యలు చేపట్టకపోవటంతో ఈ విధమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇంజినీరింగ్ తదితర ఇతర కోర్సుల అడ్మిషన్లు ప్రక్రియ పూర్తయిన తరువాత సాధారణ డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ ప్రకటించటం, డిసెంబర్ వరకూ అడ్మిషన్లను నిర్వహించటంతో ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. దయనీయంగా అధ్యాపకుల పరిస్థితి విద్యా సంవత్సరం ఏటా సకాలంలో పూర్తికాకపోవటంతో అధ్యాపకుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సెకండ్ సెమిస్టర్ పరీక్షలు మార్చి లేదా ఏప్రిల్లో జరగకపోవటంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు మేలోనూ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. విశ్వవిద్యాలయం సెలవులు ప్రకటించినా అటానమస్ కళాశాలలు మాత్రం పని చేస్తుండటంతో అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయం ప్రకటించిన షెడ్యూల్ అనుసరించాల్సిన అటానమస్ కళాశాలలు తమకు వాటితో సంబంధం లేదంటూ ఇష్టారాజ్యంగా తరగతుల నిర్వహణ చేస్తుండటంతో మంచి వేసవిలోనూ విద్యార్థులు, అధ్యాపకులు తరగతులకు హాజరుకావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సరిదిద్దాలి.. కరోనా సమయంలో తలెత్తిన పరిస్థితులతో విద్యా సంవత్సరంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రెండుమూడేళ్లు మాత్రం ఇబ్బందులు తతెత్తి విద్యాసంవత్సరం ఆలస్యమైంది. అయితే ఆ పరిస్థితుల నుంచి బయట పడినప్పటికీ ఇతర కోర్సుల సీట్లు నిండిన తరువాత సాధారణ డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి ప్రకటిస్తుంది. దాంతో పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఇప్పటికైనా దిగజారు తున్న పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్ సరిదిద్దాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అనేక అటానమస్ డిగ్రీ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఆయా కళాశాలలన్నీ ఉన్నత విద్యామండలి ఆదేశాలకు అనుగుణంగా సొంతంగా సెమిస్టర్ పరీక్షలను నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తుంటాయి. అయితే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అన్ని అటానమస్ కళాశాల్లోనూ దాదాపుగా సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కాలేదు. ఆ కళాశాలలన్నీ జూన్ లేదా జూలై మాసాల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు సెకండ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నాయి. దాంతో ఏ విద్యాసంవత్సరంలో తాము ఉన్నామో అర్థం కాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. -
ప్రజలందరికీ వెన్నుపోటు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. తన 40 ఏళ్ల అనుభవంతో వైఎస్ జగన్ కంటే మంచి పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఈ నెల 4 నుంచి 12 వరకూ చేపట్టనున్న ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాల పోస్టర్లను మంగళవారం గుణదలలోని కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా మేనిఫెస్టో దహన కార్యక్రమాలు మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. కూటమి హయాంలో ఏ నష్టాలు జరిగాయో ప్రజలకు వివరిస్తామని, టీడీపీ, జనసేన, బీజేపీలకు బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తామన్నామన్నారు. మోసాల చంద్రబాబు.. ప్రజలను ఇప్పటికీ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు అన్నారు. నిరుద్యోగ భృతి ఒక్కరికీ ఇవ్వడం లేదని, మెగా డీఎస్సీతో దగా చేశారన్నారు. వృద్ధులకు 50 ఏళ్లకే పింఛన్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని, తల్లికి వందనం పేరుతో వేల మందికి ఎగనామం పెట్టారన్నారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి రెండేళ్ల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మహిళలకు 18 ఏళ్లు నిండితే నెలకు రూ.1500 అన్నారని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. చేతకాని మాటలు చెబుతూ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని మండిపడ్డారు. మాజీ జెడ్పీ చైర్ పర్సన్ నల్లగట్ల సుధారాణి, రాష్ట్ర సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, బండి పుణ్యశీల, సర్నాల తిరుపతిరావు, రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
దేవుడి భూమి స్వాధీనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎట్టకేలకు మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూమిని దేవదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు కూత వేటు దూరంలో గొల్లపూడిలో ఎకరం రూ.10కోట్ల విలువ చేసే39.99 ఎకరాలు, అంటే రూ.400కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నామని ఆలయ ఈవో గోపాలరావు ధ్రువీకరించారు. మే నెల 22వ తేదీన సాక్షి దినపత్రికలో ‘ఇక దేవుడే దిగిరావాలేమో’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో దేవదాయశాఖ అధికారులు స్పందించారు. భూమికి నలువైపులా ‘బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూమిగా సర్వే నంబర్ల సహా పేర్కొన్నారు. ఈ భూమి పరిరక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు మే నెల 26నే షార్ట్ టెండర్లు పిలిచామని ఈవో తెలిపారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందన్నారు. తక్కువ ధర రూ.10లక్షలకు కోట్ చేసిన కాంట్రాక్టర్ పని అప్పజెప్పామని, రెండు, మూడు రోజుల్లో ఫెన్సింగ్ ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయన్నారు. దీంతో ధార్మిక సంస్థల పేరుతో పార్లమెంటు ప్రజా ప్రతినిధి భూమి స్వాధీనం చేసుకొనే కుట్రలకు కూడా తెరపడినట్లు అయ్యింది. కాగా కోర్టు ఉత్తర్వుల ప్రకారం భూమిలో 4నుంచి 6 అడుగుల మేర వేసిన మట్టిని త్వరిత గతిన తొలగించాలని పలు సంఘాలవారు దేవదాయశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని షామియానా, టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా (స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ) గుర్తించి, ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. అసోసియేషన్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు పాల్నొన్నారు. ఈ సందర్బంగా షేక్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ రంగంలో నాలుగు లక్షల మంది వరకూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. అయితే సీజన్ లేని సమయంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తమ రంగానికి రాయితీపై రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన కార్యవర్గం ఎన్నిక.. అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా షేక్ బాషా, కార్యదర్శిగా సీహెచ్వీ సుబ్బారావు, కోశాధికారిగా లక్ష్మీనరసారెడ్డి, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. అసోసియేషన్ ప్రతినిధి సుబ్బారావు, విజయవాడ వర్తక సంఘం అధ్యక్షుడు జీఎల్ మల్లికార్జునరావు, కార్యదర్శి టీవీ రమణ, కోశాధికారి సన్నపు లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ -
కలలు విరిసే.. కనులు మెరిసే
వైద్య విద్యార్థుల్లో స్నాతకోత్సాహంలబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 29, 30వ వార్షిక స్నాతకోత్సవాన్ని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో యూనివర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయిసుధీర్ పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. తొలుత రాష్ట్ర గవర్నర్ చేతుల మీదగా 29వ స్నాతకోత్సవంలో ఐదుగురికి, 30వ స్నాతకోత్సవంలో నలుగురికి డాక్టరేట్స్ ప్రదానం చేశారు. అలాగే సూపర్స్పెషాలిటీ కోర్సులు చేసిన వారికి 29వ స్నాతకోత్సవంలో ఆరుగురికి, 30వ స్నాతకోత్సవంలో ఐదుగురికి గవర్నర్ చేతుల మీదగా గోల్డ్మెడల్స్ అందజేశారు. ఒక్కడికే ఎనిమిది గోల్డ్ మెడల్స్.. అతిథులు, వీసీ డాక్టర్ పి. చంధ్రశేఖర్లు 29వ స్నాతకోత్సవంలో 62, 30వ స్నాతకోత్సవంలో 61 గోల్డ్మెడల్స్ ప్రదానం చేశారు. కాకినాడకు చెందిన సాయి అనిరుథ్ అత్యధికంగా 8 గోల్డ్మెడల్స్ అందుకోగా, కర్నూలుకు చెందిన పెరిగెల నమ్రత 6 బంగారు పతకాలు అందుకున్నారు. తిరుపతికి చెందిన ఆయుర్వేద విద్యార్థిని ఆర్ఎస్వీ సరిత రెండు గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ అందుకోగా, విజయవాడకు చెందిన ఆయుర్వేద విద్యార్థిని సీహెచ్ తులసీ అర్చన లక్ష్మి రెండు గోల్డ్, మూడు సిల్వర్ మెడల్స్ అందుకున్నారు. గుంటూరుకు చెందిన కవలలు ఐ.సుమన, ఐ.సంజన స్నాతకోత్సవాలలో ఒక్కొక్కరు రెండు బంగారు పతకాలు సాధిండం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బీడీఎస్ చదువుతున్న ఈ ఇద్దరు ప్రతిష్టాత్మకమైన పీఎఫ్ఏ ఇంటర్నేషనల్ అవార్డు, డాక్టర్ ఆర్ అహ్మద్ నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ప్రసుతం ఎండీఎస్ చదువుతున్న వీరు పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు.హెల్త్ యూనివర్సిటీ 29, 30వ స్నాతకోత్సవాల్లో 123 మందికి మెడల్స్ సాయి అనిరుథ్కు 8, నమ్రతకు 6 గోల్డ్ మెడల్స్ పలువురికి డాక్టరేట్ల ప్రదానం -
కృష్ణా జిల్లా వ్యవసాయాధికారిగా జ్యోతిరమణి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా వ్యవసాయాధికారిగా కె. జ్యోతిరమణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యవసాయాధికారిగా పనిచేసిన ఎన్. పద్మావతి శనివారం పదవీవిరమణ చేశారు. ఈ స్థానంలో కృష్ణాజిల్లా వనరుల కేంద్రం డెప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్గా ఇటీవల బదిలీ అయిన రమణిను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. -
బయోగ్యాస్ సరఫరాకు పాయింట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో వంటగ్యాస్ అవసరమైన ప్రాంతాల్లో బయో గ్యాస్లైన్ వేసేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారి వాణి సోమవారం పరిశీలించారు. అందులో భాగంగా రోగులు, డ్యూటీ వైద్యులకు ఆహారం సిద్ధం చేసే డైట్ క్యాంటీన్, వైద్య విద్యార్థుల యూజీ, పీజీ హాస్టల్స్, నర్సింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజ్లలో డైట్లను ఆమె పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రి సమీపంలో బయోగ్యాస్ లైన్ ఉన్నందున, ఆస్పత్రిలో అవసరమైన ప్రాంతాలకు సరఫరా లైన్ వేసేందుకు పాయింట్లు గుర్తించారు. తొలుత ఆస్పత్రి, హాస్టల్స్కు బయోగ్యాస్ లైన్ వేసిన తర్వాత, ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ప్రైవేటు హోటల్స్, కాఫీ స్టాల్స్కు కూడా సరఫరా చేసేందుకు ఆస్పత్రి అధికారులతో చర్చించారు. ఆమె వెంట అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్) జె. లక్ష్మీకుమారి తదితరులు ఉన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అమలవుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేసే సమయంలో కనీసం అరగంట సమయం కేటాయించి ఒక వీధిని ఎంపిక చేసుకుని అక్కడ కనిపించే వ్యర్థాలను తొలగించేలా చూడాలన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, యువత ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఫణిధూర్జటి కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానం, అధికారుల భాగస్వామ్యం తదితర అంశాలపై అధికారులకు వివరించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పవిత్ర సంగమం వద్ద 5వ తేదీ నుంచి ప్రారంభించే కృష్ణమ్మ హారతుల ఏర్పాట్లను దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులు సోమవారం పరిశీలించారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్కు చేరుకున్న అధికారులు ఏర్పాట్ల గురించి చర్చించారు. సంగమం వద్ద హారతుల నిర్వహణకు అవసరమైన సామగ్రిని భద్రపరుచుకునేందుకు తగినన్ని ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. 5వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు నవహారతులు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో దుర్గగుడి స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఏసీ రంగారావు, ఈఈ ఎల్.రమా, వైదిక కమిటీ సభ్యులు ఉన్నారు. తిరువూరు పీఎస్ ఎదుట బాలిక కుటుంబం ఆత్మహత్యాయత్నం తిరువూరు: బాలికతో సచివాలయ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీసులు స్పందించకపోవడంతో ఆ బాలిక కుటుంబసభ్యులు సోమవారం తిరువూరు పోలీసుస్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. కొమ్మిరెడ్డిపల్లిలోని సచివాలయ ఉద్యోగి బంకా మధు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గతనెల 17న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన బాలిక తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ, అక్క సోమవారం రాత్రి తిరువూరు పోలీసుస్టేషన్ ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. బాధితులను పోలీసులు తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టీడీపీకి చెందిన నాయకుల ఒత్తిడి మేరకు ఎస్ఐ శాతకర్ణి కేసు నమోదు చేయకుండా నిందితుడికి కొమ్ము కాస్తున్నారని బాధితులు వాపోయారు. -
అర్జీ పునరావృతమైతే అధికారులదే బాధ్యత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సమగ్ర సమాచారంతో, అర్జీదారుడి సంతృప్తే లక్ష్యంగా స్పష్టతతో పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నందు పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్ర సమాచారంతో నిర్దేశించిన గడువులోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిబంధనలను పాటిస్తూ అర్జీదారుడు సంతృప్తే లక్ష్యంగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పునరావృతమయ్యే అర్జీలకు సంబంధిత జిల్లా స్థాయి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు లోపు అర్జీలను పరిష్కరించాల్సిందేనని, పరిష్కారం సంబంధిత అధికారులు పరిధిలో ఉండి కూడా పెండింగ్ ఉంటే చర్యలు తప్పవన్నారు. అర్జీల వివరాలు ఇవి.. పీజీఆర్ఎస్ ద్వారా మొత్తం 167 అర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు. వీటిలో ఎంఏ యూడీ–36, రెవెన్యూ– 22, పంచాయతీరాజ్– 21, పోలీస్–16, ఏపీఎస్డబ్ల్యూఐఆర్ఈఎస్ –7, హెల్త్ –7, పౌర సరఫరాలు–6, ఇరిగేషన్ –6, విద్య –5, డీఆర్డీఏ –4, టెక్నికల్ ఎడ్యుకేషన్ –3, హౌసింగ్–3, ఆర్డబ్ల్యూఎస్ –3, ఏపీఎస్ ఆర్టీసీ–3 డ్వామా–2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ –2, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్–2, మహిళా, శిశు సంక్షేమం–2, పశుసంవర్ధక శాఖ –2, సోషల్ వెల్ఫేర్–2, ఏపీసీపీడీసీఎల్ –2, క్రీడలు, ఆర్ అండ్బీ, ఉద్యానవనం, బ్యాంకు సంబంధిత, విభిన్న ప్రతిభావంతులు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, సహకార సంఘాలు, ఎండో మెంట్స్, ఎకై ్సజ్, కార్మిక శాకలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ వచ్చిందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహ, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ప్రత్యేక అధికారి జి.జ్యోతి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసింది. ఎన్నికల సమయంలో లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసింది. మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీగా మార్చింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీలో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రజలకు, నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాలి. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
దగా డీఎస్సీపై దద్దరిల్లిన కలెక్టరేట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక నిరసన కార్యక్రమం సోమవారం జరిగింది. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య ఆధ్వర్యంలో యువత భారీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. తొలుత కోర్టు సముదాయం సమీపంలోని రమాక్లాత్ సెంటర్ వద్ద నుంచి కలెక్టరేట్కు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. మెగా లీక్.. దగా డీఎస్సీ, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి, డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలి.. అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. ఆంక్షలు.. అడ్డంకులు.. శాంతియుతంగా ర్యాలీ చేస్తూ కలెక్టరేట్కు చేరుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, యువతను పోలీసులు గేటు వద్దనే అడ్డుకున్నారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లనీకుండా గేట్లు మూసివేశారు. ఆ సమయంలో పోలీసులు, వైఎస్సార్ సీపీ నాయకులకు మధ్య స్వల్పంగా వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు యువతను తోసివేశారు. తోపులాటలో యువత చొక్కాలు చిరిగిపోయాయి. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేసేందుకు కొద్దిమందిని అనుమతించారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, తిరువూరు ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాసు, జగ్గయ్యపేట ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్యతో పాటు మరికొందరు నాయకులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్లో వైఎస్సార్ సీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్యక్రమంలో నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, అవుతు శ్రీనివాసరెడ్డి, పోతిన మహేష్, ఏ రవిచంద్ర, విద్యార్థి, యువజన, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఎంపికై న, ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు చెబుతున్నారు. వారిలో చాలా మందికి ఒక్కరికీ ఉద్యోగాలు రాలేదు. పరీక్ష నిర్వహణలో పారదర్శకత లోపించింది. లక్షలాది రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలి. నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. – నలగట్ల స్వామిదాసు, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, తిరువూరు రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ నిర్వహించింది. నిరుద్యోగులను నిండా ముంచింది. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే నిర్బంధించింది. కలెక్టరేట్లోకి ప్రవేశం లేకుండా చేసింది. యువతను అడ్డుకుని చొక్కాలు చించివేశారు. పోలీసులు దౌర్జన్యం చేశారు. డీఎస్సీలో అన్ని దశల్లో అక్రమాలు జరిగాయి. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. – తన్నీరు నాగేశ్వరరావు, ఇన్చార్జి, జగ్గయ్యపేట -
సుస్థిరాభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు
విజయవాడలో ప్రారంభమైన ఎస్సీఐఏపీ సదస్సులో వక్తలుపటమట (విజయవాడ తూర్పు): పట్టణాల సుస్థిరాభివృద్ధి కోసం స్థానికసంస్థలు వినూత్న కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) కమిషనర్ ధ్యాన్చంద్ర చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో), గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (జీఈఎఫ్), కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయూఏ) సంయుక్త ఆధ్వర్యంలో సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ (ఎస్సీఐఏపీ) అంశంపై విజయవాడలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును సోమవారం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ డైరెక్టర్ సురభి మాలిక్ ప్రారంభించారు. ● వీఎంసీ కమిషనర్ ధ్యాన్చంద్ర మాట్లాడుతూ నగరపాలక సంస్థ స్వచ్ఛత, ఘనవ్యర్థాల నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి రంగాల్లో ఉత్తమ విధానాలను అమలు చేస్తోందన్నారు. ● యునిడో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ నంద్పాల్ సింగ్, నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దీపికా లేలే ఎస్సీఐఏఈ చేస్తున్న సేవలను తెలిపారు. ● వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ డీకార్బనైజింగ్ సిటీస్ అంశంపై నిర్వహించిన ప్యానెల్ చర్చలో నిపుణులు పట్టణ ఘనవ్యర్థాల నిర్వహణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, తక్కువ కార్బన్ ఆధారిత అభివృద్ధి విధానాలపై చర్చించారు. ● ఎన్ఐయూఏ డైరెక్టర్ డాక్టర్ డెబోలినా కుండు, ఎన్ఐయూఏ రిసోర్స్ అండ్ వేస్ట్ విభాగాధిపతి పరమితా దత్తా డే, ఐసీఎల్ఈఐ సౌత్ ఏషియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇమాని కుమార్, గుంటూరు మునిసిపల్ కమిషనర్ కె.మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా జరగలేదు..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాలు లక్షల్లో ఇచ్చాం. ఎక్కడా అవకతవకలు జరగలేదు. పూర్తి పారదర్శకంగా జరిగాయి. ఈ ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసింది. అన్యాయం జరిగిన అభ్యర్థులు కోర్టుకు వెళ్లినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి అన్న నమ్మకం మీకుంటే వాస్తవాలు బయటపెట్టాలి. – మొండితోక జగన్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే -
గుట్కా, ఖైనీకి యువత దూరంగా ఉండాలి
నో టుబాకో డే ర్యాలీలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశలబ్బీపేట(విజయవాడతూర్పు): ఊపిరితిత్తులు, క్యాన్సర్ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేసి, పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈగల్ టీమ్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పొగాకు వినియోగంతో మన శరీరంలోని ప్రధాన అవయవాలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. యువతే లక్ష్యం.. యువతను లక్ష్యంగా చేసుకుని పొగాకు పరిశ్రమలు అనుసరిస్తున్న ప్రచార వ్యూహాలను గుర్తించి వాటిని ఎదుర్కొనేందుకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ అన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల పరిసరాల్లోని అక్రమ పొగాకు విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. నేషనల్ టుబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ రాష్ట్ర అధికారులు డాక్టర్ గీతాపద్మజ, డాక్టర్ సౌజన్యలక్ష్మిలతో పాటు రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి. సమరం, ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ జె. ఇందుమతీదేవి పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోండి
వత్సవాయి: ఆయా పంటల సాగులో రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయాధికారి డీఎంఎఫ్ విజయకుమారి సూచించారు. ఆదివారం మండల కేంద్రం వత్సవాయిలోని విత్తనాల షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు నమ్మకమైన షాపులో నాణ్యమైన విత్తనాలను తీసుకుని సాగు చేసినట్లయితే ఇబ్బందులు ఉండవన్నారు. రైతులు విత్తనాలను కొనుగోలు చేసిన తరువాత తప్పకుండా రశీదులు తీసుకుని వాటి మీద బ్యాచ్ నంబర్ ఉండేటట్లు చూసుకోవాలన్నారు. తీసుకున్న రశీదులను పంట పూర్తమ్యే వరకు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలని తెలిపారు. ఒకవేళ విత్తనాలలో లోపం ఉన్నట్లయితే సదరు రశీదుతో షాపుల మీద కేసు పెట్టుకునే అవకాశం ఉంటుదని తెలిపారు. కార్యక్రమంలో ఏవో జి. సత్యనారాయణ పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ పథకానికి విజయవాడ లబ్బీపేటకు చెందిన ఎం. నరేంద్ర జ్యోతి రూ. 1,00,116ల విరాళాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి నిత్యాన్నదానానికి సికింద్రాబాద్ సికింద్రాబాద్ వెంకటాపురానికి చెందిన వి. కల్కి చరణ్, శివానిల పేరిట కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో దర్శనం కల్పించి ప్రసాదాలు, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటం అందచేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్ఎంసీ), గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి స్వీకరించిన దరఖాస్తుల్లో ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, స్టెచ్చర్ బేరర్స్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ జాబితాపై అభ్యంతరాలను జూన్ 1 నుంచి 3 వరకూ స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. మెరిట్ జాబితా జిల్లా అధికారిక వెబ్సైట్ ntr.ap.gov.inలో పరిశీలించవచ్చని ఆయన తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం అర కిలో వెండిని కానుకగా సమర్పించారు. విజయవాడకు పేరువీటి స్వరూప రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. రూ.1.36లక్షల విలువైన అరకిలో వెండిని చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. ఉత్సాహంగా క్రికెట్ టోర్నీతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్లో 50 జట్లు తలపడగా.. ఆదివారం సులోచన, మొబిన్ సీసీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. బహుమతి ప్రదానోత్సవానికి ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హాజరై గెలుపొందిన మొబిన్ సీసీ జట్టుకు కప్ ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిచారు. ఈగల్ ఎస్పీ నగేష్బాబు, డీఎస్పీ శాంతరాజ్ పాల్గొన్నారు. -
లారీ బోల్తా
తప్పిన పెనుప్రమాదం మధురానగర్(విజయవాడసెంట్రల్): రామవరప్పాడు నుంచి కండ్రిక వైపు వెళ్తున్న లారీ ప్రమాదవశావత్తూ బోల్తాపడింది. ఘటనలో అదృష్టవశావత్తూ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీ 05 టీఎఫ్ 1839 లారీ రామవరప్పాడు మొదటి ఫ్లైఓవర్ ఎక్కుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇన్ హోటల్ బ్యాక్సైడ్ పుట్ఫాత్ మీదుగా విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. లారీ పెద్ద శబ్దం చేస్తూ బోల్తాపడింది. అదృష్టవశావత్తూ అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న గుణదల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. క్రేన్ సాయంతో లారీను తొలగించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో లారీ బోల్తాపడటంపై స్థానికులు, వాహనచోదకులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. -
బియ్యం బకాసురులు!
రేషన్ దుకాణాలకు రాకముందే పక్కదారి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ దుకాణాలకు రాకుండానే దారి మళ్లుతోంది. గతంలో బియ్యాన్ని పాలిథీన్ సంచుల్లోకి మార్చి తరలించేవారు. ఇపుడు ఏకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ముద్రలతో ఉన్న గన్నీ బ్యాగులను యథాతథంగా ఉంచి పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకటో తేదీ లోపే కొన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం మాయమవుతోంది. ప్రభుత్వం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్ని నిబంధనలు విధించినా అక్రమార్కులు శత ‘కోటి’ ఉపాయాలు ఆలోచించి చాక చక్యంగా దారి మళ్లిస్తున్నారు. ఈ తంతు అధికారులకు తెలిసినప్పటికీ నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. జిల్లాలో పరిస్థితి.. జిల్లాలో మొత్తం 957 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 5,96,378 మంది కార్డుదారులు ఉన్నారు. నెల నెలా 8,339 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. ఇందులో 80శాతం వరకు దారిమళ్లుతోంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. బియ్యం మాఫియాకు కాసులు కురిపిస్తోంది. రేషన్ డీలర్లు కొందరు రింగ్గా ఏర్పడి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. డీలర్ల నుంచి సేకరించి బడా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మామూళ్ల మత్తులో.. బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం తెలిసినప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. బియ్యం వ్యాపారులు నెలనెలా అధికారులకు మామూళ్లు పంపుతున్నామంటూ బాహాటంగానే చెబుతున్నారు. ఒక్కో రేషన్ షాపు నుంచి ఇంత మొత్తం అని రేటు నిర్ణయించి అధికారులకు మామూళ్లు ముట్టజెబుతున్నారు. ఒకరిద్దరు డీలర్లు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే వారిని నాయకుల ద్వారా, అధికారుల ద్వారా భయపెట్టి దారికి తెచ్చుకుంటున్నారు. కేసులు బనాయిస్తామని, రేషన్ షాపు రద్దు చేస్తామని వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. విజయవాడ నగరంలో ఒక్కో రేషన్ షాపు నుంచి అధికారులకు రూ.1750 నుంచి రూ. 2వేల వరకు రేషన్ డీలర్లే వసూలు చేసి అధికారులకు ముట్టజెపుతున్నట్లు సమాచారం. ఆ డీలర్ కనుసన్నల్లోనే మాఫియా.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఓ రేషన్ డీలర్ కనుసన్నల్లోనే రేషన్ అక్రమ రవాణా జరుగుతోంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో డీలర్లంతా ఇతనికే బియ్యం విక్రయించాలని అధికారులతో ఒత్తిడి చేయిస్తున్నారు. కూటమి నేతల అండదండలతోనే బియ్యం అక్రమ రవాణా సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం పౌర సరఫరా శాఖలో ప్రతి అధికారికి తెలిసినప్పటికీ అతని వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రతినెలా 20వ తేదీ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా అవుతోంది. ఒకటే తేదీ నుంచి కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ దుకాణానికి చేరిన బియ్యం పంపిణీకి ముందే అక్రమ రవాణా జరుగుతోంది. వయో వృద్ధులకు ఒకటో తేదీ కంటే ముందు నుంచే బియ్యం సరఫరా చేయాలన్న నిబంధన ఉంది. దీన్ని అడ్డుపెట్టుకుని ఒకటో తేదీన బియ్యం పంపిణీ ప్రారంభానికి ముందే అక్రమంగా తరలిస్తున్నారు. వయో వృద్ధులతో పాటు ఇతర కార్డుదారులకు పంపిణీ చేయాల్సిన మొత్తం అక్రమంగా తరలిపోతోంది. అధికారులు తనిఖీ చేస్తే వృద్ధులకు పంపిణీ చేశామని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా జేసీ రేషన్ డీలర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. జేసీ ఆదేశాల నేపథ్యంలో రెండు రోజులుగా విజయవాడ నగరంతో పాటు జిల్లాలోనూ రేషన్ షాపులపై దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయాల్సిన బియ్యం ఇప్పటికే దుకాణాల నుంచి తరలివెళ్లినట్లు తెలిసింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ షాపులు తనిఖీ చేయగా స్టాక్ వ్యత్యాసాలు బయటపడ్డాయి. 4 షాపులను అధికారులు తనిఖీ చేయగా ఇందులో రెండు షాపుల్లో సరుకు తరలిపోయినట్లు గుర్తించారని సమాచారం. ఆయా షాపులు నిర్వహిస్తున్నట్లు డీలర్లు తాము అందుబాటులో లేమంటూ చెప్పడంతో షాపులకు తాళాలు వేసినట్లు తెలిసింది. పశ్చిమంలో బినామీ పేరుతో నడుస్తున్న షాపునకు అధికారులు తాళం వేశారు. ఇక్కడ మాఫియాగా మారిన రేషన్ డీలర్ కింది స్థాయి అధికారుల ద్వారా సర్దుబాటు చేస్తున్నట్లు తెలిసింది. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో విజయవాడ విద్యార్థి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం నిర్వహించిన కీ బోర్డు సంగీత వాయిద్య బృందంలో విజయవాడకు చెందిన చిన్నారికి స్థానం లభించింది. నగరంలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న మైఖల్ డేవిడ్ మందా ఫిబ్రవరిలో హైదరాబాద్లో జోరాస్ట్రియన్ క్లబ్లో గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో కీబోర్డ్ సంగీత వాయిద్య పోటీల్లో పాల్గొన్నాడు. 22 దేశాల నుంచి సుమారు 2000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు హాజరై ఏకంగా గంట సమయం వరకు ఆగకుండా ప్రదర్శన చేశారు. 777 మంది ఎంపిక కాగా ఈ ప్రదర్శనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో స్థానం లభించింది. ఈ సందర్భంగా హల్లెల్ మ్యూజిక్ స్కూల్ అధినేత అగస్టిన్ దండింగి చేతుల సర్టిఫికెట్ ప్రదానోత్సం ఈ నెల 29వ తేదీన హైదరాబాద్లో జరిగింది. మైఖల్ డేవిడ్ మందా సర్టిఫికెట్ను అందుకున్నారు. -
వైభవంగా ఇంద్ర‘గిరి ప్రదక్షిణ’
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అధిక జ్యేష్ఠ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం వైభవంగా సాగింది. తెల్లవారు జామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు, ఈవో దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన పూల వాహనాన్ని ఆది దంపతులు అధిరోహించగా, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదిదంపతులతో పాటు దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య గిరిప్రదక్షిణ కనుల పండువగా సాగింది. ఒకే నెలలో రెండు పర్యాయాలు గిరి ప్రదక్షిణ జరగడం విశేషం. మే 1వ తేదీ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ జరగగా, మే 31వ తేదీ అధిఖ జ్యేష్ఠ పౌర్ణమి రావడంతో మరోమారు ఆదివారం గిరిప్రదక్షిణ జరగింది. ప్రదక్షిణ ఇలా.. దుర్గగుడి నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ ఊరేగింపు కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆది దంపతులకు భక్తులు పూజా సామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కుంకుమతో పాటు పులిహోర ప్రసాదాలను పంపిణీ చేసింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం -
రైల్వే ఉద్యోగుల కనీస వేతనం పెంచాలి
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైల్వే అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన ఉద్యోగులకు కనీస వేతనం రూ.69వేలుగా ఉండాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (ఎన్ఎఫ్ఐఆర్) జాతీయ అధ్యక్షుడు మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మే 19న హైదరాబాద్కు వచ్చిన వేతన సంఘ ప్రతినిధులకు రైల్వే ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో నూతన పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని, ఫిట్మెంట్ 3.83 శాతంగా ఉండాలని, కనీస వేతనం రూ.69వేలుగా నిర్ణయించాలని, అదే విధంగా ఇంటి అద్దె అలవెన్సులు మార్చాలని, ఇంక్రి మెంట్ పెంపు ఐదు శాతం ఉండాలని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న రైల్వే ఉద్యోగులు, కార్మికులకు ప్రత్యేక అలవెన్సులు అందజేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. -
ఆర్టీజీఎస్తో మిస్సింగ్ కేసు ఛేదన
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): సాంకేతిక పరిజ్ఞానంలో భాగమైన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) ఉపయోగించి అదృశ్యమైన ఓ వ్యక్తి ఆచూకీని అజిత్సింగ్నగర్ పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న నల్లమిల్లి యోహాన్ (40) గత నెల 20వ తేదీ అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో క్రైమ్ నంబర్ 157/2026 గా కేసు నమోదు చేసిన పోలీసులు తమ ప్రత్యేక బృందాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినా ఆ తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ లభించలేదు. అనంతరం యోహాన్ ఫొటోను ఆర్టీజీఎస్ వ్యవస్థలో అప్లోడ్ చేయగా ఏలూరు జిల్లా కామవరపుకోట పరిసర ప్రాంతంలోని కెమెరాల్లో అదృశ్యమైన అతను కనిపించినట్లు అలర్ట్ అందింది. దీంతో పోలీసు బృందాలు ఆ ప్రాంతానికి వెళ్లి సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. తప్పిపోయిన వ్యక్తిని గుర్తించి క్షేమంగా నగరానికి తీసుకువచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును చేధించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. -
వెంటిలేటర్పై వైద్యారోగ్యం!
పేదలకు పెద్దన్నలా సేవలందించాల్సిన ప్రభుత్వాస్పత్రికి పెద్ద రోగం వచ్చిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వస్తే బాగుపడతాం అనే నమ్మకం ప్రజల్లో క్రమంగా సన్నగిల్లుతోంది. ఇటీవల కాలంలో ఆస్పత్రిలో సేవలు సక్రమంగా అందడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. అందుకు ఆస్పత్రిలో ఇటీవల చోటుచేసుకుంటున్న మరణాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్క మే నెలలోనే ఏకంగా 570 మరణాలు సంభవించడం భయాందోళనలు రేకెత్తిస్తోంది. అమ్మో.. పెద్దాస్పత్రి అంటున్న రోగులులబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ సర్వజన ఆస్పత్రిలో డెత్రేట్ పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు రోజుకు 12 నుంచి 15 వరకూ మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు అవి 20కి పెరిగాయి. అంతేకాదు ఒక్క మే నెలలోనే ఏకంగా 570 మరణాలు నమోదు కాగా, ఎండలు అధికంగా ఉన్న ఒక్కరోజే 42 మరణాలు సంభవించాయి. ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు దిగజారుతున్నాయనేందుకు ఇవే నిదర్శనంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిపుణులైన వైద్యులు ఉన్నా, మెరుగైన వైద్యం అందించేందుకు కనీస సౌకర్యాలు కొరవడినట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించలేక పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సౌకర్యాల లేమితోనేనా? ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర సమయంలో ప్రాణ వాయువు అందించే వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఒకప్పుడు వెంటిలేటర్లు 80 వరకూ ఉండేవి, వాటిలో చాలా వరకూ పాడైపోవడంతో వాటిని పక్కన పెట్టేశారు. ప్రస్తుతం 35 వరకూ ఉన్నాయి. వాటిలో ఎన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఎంపీ నిధుల నుంచి నాలుగు వెంటిలేటర్లు అందజేశారు. వాటిని ట్రామాకేర్ వార్డులో ఏర్పాటు చేశారు. ఇంకా ఐసీయూల్లో తీవ్ర మైన కొరత ఉంది. ప్రాణాపాయంతో వచ్చిన వారిని ఉంచేందుకు వెంటిలేటర్లు అందుబాటులో ఉండని పరిస్థితి తలెత్తుతోంది. ఎక్కువ మరణాలు సంభవించడానికి అది కూడా ఒక కారణమనే అనుమానాలు ఉన్నాయి. గతంలో ఖరీదైన అత్యవసర ఇంజెక్షన్స్ను ముందుగానే కొనుగోలు చేసి ఉంచేవారు. ఇప్పుడు అవి అవసరమైనప్పుడు అత్యవసరంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొంత జాప్యం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా డెత్రేట్ పెరగడానికి అనేక కారణాలున్నట్లు అంచనా వేస్తున్నారు. పర్యవేక్షణాలేమి కూడా.. ఆస్పత్రిలో వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం కొరవడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోగి ప్రాణాలు పోతున్నాయని చెప్పినా, వార్డుల్లో ఉండే సిబ్బంది పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కనీసం కుర్చీలో నుంచి రోగి వద్దకు వచ్చే పరిస్థితి కూడా సిబ్బందిలో కనిపించడం లేదు. మరోవైపు కొందరు వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుపైనే మక్కువ చూపుతున్నారు. మొక్కుబడిగా రావడం. ఎఫ్ఆర్ఎస్ వేయడం, వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా వైద్యం అందించడంలో నిర్లక్ష్యం కూడా రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. ఇప్పటికై నా అధికారులు, వైద్యులు, సిబ్బందిలో జవాబుదారీతనం వచ్చేలా చూడాలనే డిమాండ్ పెరుగుతోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టని సర్కారు ఒక్క రోజే 42మంది మృతిప్రభుత్వాస్పత్రిలో రోగులు పిట్టల్లా రాలుతున్నారు. 2026లో జనవరిలో 523, ఫిబ్రవరిలో 524, మార్చిలో 417, ఏప్రిల్లో 484, మేలో 570 మరణాలు అధికారికంగా నమోదయ్యాయి. అంతేకాదు మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న మూడు రోజుల్లో ఒకరోజు 42 మరణాలు నమోదు కాగా, మరోరోజు 39 మరణాలు, ఇంకోరోజు 36 మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకూ 570 మరణాలు సంభవించాయి. అందుకు ప్రధాన కారణం అధిక ఉష్ణోగ్రతలుగా చెబుతున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. అంతేకాదు ఆస్పత్రికి వచ్చేసరికే మరణించిన వారు మరో 15 నుంచి 20 మంది ఉంటారని అంచనా. ఈ బ్రాట్ డెత్లు ఆస్పత్రి రికార్డుల్లో నమోదు కావు. విజయవాడ జీజీహెచ్లో ఒక్క నెలలోనే 570 మరణాలువైద్య రంగం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం తగదు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చేది ఎక్కువగా పేద ప్రజలే. వారికి నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరత ఉందని రెండేళ్లుగా చెబుతున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేయాలి. – దేవినేని అవినాష్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ -
కారుపై అకస్మాత్తుగా విరిగిపడిన భారీ వృక్షం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రయాణిస్తున్న ఒక కారుపై రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం అకస్మాత్తుగా విరిగిపడిన సంఘటన ఆదివారం సాయంత్రం విద్యాధరపురంలో చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు కారు నడుపుతున్న వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సేకరించిన సమాచారం మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విద్యాధరపురం సితార జంక్షన్ నుంచి కుమ్మరిపాలెం సెంటర్ వైపు వెళుతున్న ఏపీ 39డబ్ల్యూఎన్ 4335 నంబర్ గల వెర్టిగ కారు చెరువు సెంటర్ సమీపంలో రోడ్ పక్కనే ఉన్న చిన్న సాయిబాబా గుడి వద్దకు వచ్చేసరికి కొన్నేళ్లనాటి పురాతన భారీ వృక్షం ఒక్క సారిగా విరిగి కారుపై పడింది. దీంతో స్థానికులతోపాటు వాహనచోదకులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు భవానీపురం పోలీసులకు, నగరపాలక సంస్థ అధికారులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన వచ్చిన వారు స్థానికుల సహకారంతో కారులో ఇరుక్కుపోయిన వ్యక్తిని అతికష్టంపై బయటకు తీశారు. స్వల్ప గాయాలతో బయటపడిన అతనికి ప్రాథమిక చికిత్స చేయించారు. పోలీసుల సమాచారం మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేట రాజీవ్ కాలనీకి చెందిన కొక్కిలిగడ్డ రాజశేఖర్ (45) ట్రావెల్స్ కారు నడుపుతూ ర్యాపిడో నిమిత్తం విజయవాడకు వచ్చారు. ప్యాసింజర్ను దింపేసి తిరిగి తాడేపల్లి వెళిపోతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. కారు డ్రైవ్ చేస్తున్న రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో అక్కడ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారుపై పడింది పెద్ద వృక్షం కావడంతో కారుకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి సితార జంక్షన్కు వెళ్లే ఈ అంబేడ్కర్ రోడ్లో నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రహదారిలో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భారీ వృక్షాలను తొలగించాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. -
తిరుపతమ్మ హుండీ ఆదాయం రూ.91.95 లక్షలు
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.91.95 లక్షలకు పైగా నగదును కానుకలు, మొక్కు బడిగా సమర్పించారు. వీటిని శనివారం అమ్మవారి మండపంలో లెక్కించారు. 60 రోజులకు ఆలయంలో మొత్తం హుండీల్లోని కానుకలు లెక్కించగా నగదు రూపంలో రూ.91,95,850, మిశ్రమ బంగారం 25 గ్రాములు, వెండి 380 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. యూఎస్ఏ డాలర్లు 123, లండన్ పౌండ్స్ 30, బ్రెజిల్ 20 డాలర్లు, సెంట్రల్ బ్యాంక్ 6 లిబియా దినార్స్ వచ్చాయన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. కానుకల లెక్కింపును ఈఓ, ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు చుంచు రమేష్బాబు, గ్రూప్ టెంపుల్స్ ఈఓలు సీహెచ్ జయప్రకాష్, బీవీ సుబ్బారావు పర్యవేక్షించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ (మెన్ అండ్ ఉమెన్) చాంపియన్షిప్లో తమ యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఒంగోలు శారద కాలేజ్ ఆఫ్ ఫిజియో థెరపీకీ చెందిన విద్యార్థి ఎం.రమేష్ను ఎంపిక చేశామని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్స్ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ త్రిమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 120 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగం పోటీల్లో రమేష్ పాల్గొంటారని పేర్కొన్నారు. పోటీలు చైన్నెలో వచ్చే నెల 3 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ టి.సాయిసుఽధీర్, అధ్యాపకులు.. రమేష్ను శనివారం యూనివర్సిటీ ఆవరణలో అభినందించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడలతో ఆరోగ్యం, ఐక్యతాభావం పెంపొందుతాయని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్థి అధికారి (డీఎస్డీవో) కె.కోటేశ్వరరావు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడా విభాగం ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లాలో పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో శిక్షణ పొందిన వారు క్యాంపులు ముగిసిన తర్వాత కూడా ఆయా క్రీడల్లో శిక్షణను కొనసాగించాలని సూచించారు. ఏపీ క్రీడా ప్రాథికార సంస్థ(శాప్) డైరెక్టర్ సంతోష్, యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎన్టీఆర్ జిల్లా అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రతినిధులు దుర్గారావు, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్ మోసాలపై సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించడమే ఎన్టీఆర్ పోలీస్ ఖాకీ స్టూడియో లక్ష్యమని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, జరగక ముందే ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్కు ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శనివారం ముగిసింది. సీపీ మాట్లాడుతూ శిక్షణ పొందిన సిబ్బంది సైబర్ నేరాలు, వివిధ ఆన్లైన్ మోసాలు, ఓఎల్ఎక్స్ యాప్ ద్వారా జరిగే మోసాలు వంటి వాటిపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. తక్కువ మాటలతో ఎక్కువ సందేశాన్ని ఇచ్చేలా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ సరిత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 20267లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్జిల్లా డీఎంహెచ్ఓ సుహాసిని పదవీ విరమణ చేయడంతో, డెప్యూటీ డీఎంహెచ్ఓగా ఉన్న ఇందుమతిదేవి ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి .పెనమలూరు: యనమలకుదురు శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద భక్తులు శనివారం గిరిప్రదక్షిణ చేశారు. ఆలయంలో భక్తులు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు.భవానీపురం: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న స్నాతకోత్సవాల ఏర్పాట్లను వైస్ చాన్సలర్ చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు. -
మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాదక ద్రవ్యాల మత్తుతో యువత విలువైన జీవితం చిత్తు కాకూడదని, వాటి నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటు చేసిన నషా ముక్త్ భారత్ అభియాన్ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి సమన్వయం సమావేశం శనివారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో డ్రగ్స్పై దండయాత్ర విజయం, జిల్లాలో నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు, ఈగల్ ఆపరేషన్స్, డీ అడిక్షన్ కేంద్రం సేవలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, హాట్స్పాట్స్ తనిఖీలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకుంటే కలిగే నష్టాలను వివరించారు. జిల్లాలోని గుర్తించిన సుమారు 150 హాట్ స్పాట్ల్లో కీలకమైన ప్రాంతాల్లో రాత్రిపూట కూడా అత్యాధునిక నైట్ విజన్ డ్రోన్లతో నిఘా ఉంచాలని సూచించారు. 1972 టోల్ఫ్రీ నంబరు గురించి ప్రజలకు తెలియజేసేలా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా ఫోరం ఫర్ చెల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఎం.ఫణి ధూర్జటి, డీఈవో చంద్రకళ. ఈగల్ అధికారులు ఎం.రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు -
జూన్ నుంచి అందుబాటులోకి అన్నదాన, లడ్డూపోటు భవనాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దుర్గమ్మ సన్నిధిలోని నూతనంగా నిర్మించిన అన్నదానం, ప్రసాదాల పోటులను జూన్ నెల నుంచి వినియోగించాలని ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ నిర్ణయించారు. దుర్గగుడిలో చేపట్టిన అభివృద్ధి పనుల తీరుపై ‘సాక్షి’ ఈ నెల 14న ‘నత్తేనయం’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దుర్గగుడి మాస్టర్ ప్లాన్లో చేపట్టిన అభివృద్ధి పనుల ఆలస్యం, భక్తుల ఇబ్బందులను ఈ కథనం కళ్లకు కట్టినట్లు వివరించింది. శనివారం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశం జరగగా ఆలయ చైర్మన్, ఈవో ఈ కథనంలో వెల్లడించిన దుర్గగుడి అభివృద్ధి పనులపైనే ప్రధానంగా చర్చించారు. గత ఏడాది దసరా ఉత్సవాలు, భవానీ దీక్ష విరమణల సమయంలోనే అన్నదానం, లడ్డూపోటు భవనాల పనులు తుది దశకు చేరుకొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటి వరకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని ఆలయ అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం అన్నదాన భవనంలో వెలుపల తుది పనులు జరుగుతున్నాయని, మరో పక్షం రోజుల్లో పూర్తి చేస్తామని ఈవో పేర్కొన్నారు. మరో వైపున జూలై 15 నుంచి ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభం కానుండటంతో అప్పటిలోగా అన్నదానాన్ని నూతన భవనంలోకి తరలించేలా చూడాలని సూచించారు. సారె సమర్పించిన ప్రతి భక్తుడికి అన్న ప్రసాదం ప్రస్తుతం మహా మండపం రెండో అంతస్తులో రోజూ సుమారు 5 వేల మందికి అన్న ప్రసాదం పంపిణీ చేస్తుండగా, నూతన అన్నదాన భవనంలో పది వేల మందికి అందించేలా నిర్మాణం జరిగింది. సారె సమర్పించిన ప్రతి ఒక్కరికీ అన్న ప్రసాదం అందాలంటే నూతన భవనంలోనే సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. మరో వైపున లడ్డూ పోటు దాదాపు పూర్తి కాగా ఆ భవనంలో కూడా లడ్డూ తయారీకి అవసరమైన గ్యాస్ పొయ్యిలు, ఇతర మిషనరీని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఉత్సవాల సమయంలో లడ్డూలను కనకదుర్గానగర్లోని ప్రసాదాల కౌంటర్లోకి తరలించడం పెద్ద సమస్యవుతోంది. కొత్త భవనం అందుబాటులోకి వస్తే ఆసమస్య పరిష్కరం కానుంది. అర్జున వీధిలో దేవస్థాన కాటేజీ ప్రతిపాదనలు సిద్ధం దుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం అర్జున వీధిలో నూతన కాటేజీ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని రాధాకృష్ణ పేర్కొన్నారు. కనకదుర్గనగర్, అర్జున వీధిల్లో ఉన్న షెడ్డుతో పాటు పక్కనే ఉన్న ప్రయివేటు స్థలాన్ని తీసుకుని దేవస్థానం నూతన కాటేజీలను నిర్మించాలని ప్రతిపాదనలు చేసిందన్నారు. రెండో ఘాట్ రోడ్డు పనులు కూడ త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. దుర్గమ్మకు చెందిన ఆస్తులు, పొలాలు, భూములను రక్షించేందుకు ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిపి ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ట్రస్ట్ బోర్డులో మొత్తం 25 అంశాలు చర్చకు వచ్చాయి. -
డాక్టర్ సుహాసిని సేవలు స్ఫూర్తిదాయకం
ఉద్యోగ విరమణ సభలో పలువురు వక్తలులబ్బీపేట(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓగా డాక్టర్ మాచర్ల సుహాసిని అందించిన సేవలు యువ వైద్యులకు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఉమ్మడి కృష్ణాజిల్లా డీఎంహెచ్ఓగా 18 నెలల పాటు పనిచేసిన ఆమె, ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైన నాటి నుంచి నాలుగేళ్ల రెండు నెలల పాటు సమర్థంగా సేవలు అందించారని పలువురు ప్రశంసించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని ఉద్యోగవిరమణ సభ శనివారం గవర్నర్పేటలోని ఐవీ ప్యాలెస్లో జరిగింది. సభలో జేసీ ఇలక్కియతో పాటు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మావతి, గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ గణపతిరావు, స్టేట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ దేవితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని సుదీర్ఘకాలం పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతిదేవి, డీఐఓ డాక్టర్ శరత్బాబు, ఎన్హెచ్ఓ డీపీఎంఓ డాక్టర్ నవీన్, ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ మాధవీనాయుడు, స్టాటికల్ ఆఫీసర్ లక్ష్మోజీ, జిల్లాలోని వైద్యాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కోడూరు: హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ మార్పులతో రెండు రోజుల నుంచి అలలు ఉధృతి ఎక్కువగానే ఉంది. శనివారం మరింత అధికమైంది. సముద్ర అలలు సుమారు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. తీరంలోని ఇసుకతిన్నెలు సైతం భారీగా కోతకు గురయ్యాయి. పౌర్ణమి ఘడియలు కావడంతో సముద్రుడి హోరుతో తీరప్రాంతం ప్రతిధ్వనిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో అటవీ అధికారులు ముందు జాగ్రత్తగా తీరం గేట్లను మూసివేశారు. -
నేడు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం శనివారం ఉదయం 10గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో జరగనుంది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ బోర్రా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు ఆలయ ఈవో శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు, ఏఈవోలు హాజరుకానున్నారు. 31న గిరి ప్రదక్షిణ.. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ 31వ తేదీన జరగనుందని వైదిక కమిటీ పేర్కొంది. 31వ తేదీ తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులతో గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు. అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ కుమ్మరి పాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. 3న కానుకల లెక్కింపు.. దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించే కానుకలు, ముడుపులు, మొక్కబడులను జూన్ 3వ తేదీన లెక్కించనున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు మహా మండపం ఆరో అంతస్తులో కానుకల లెక్కింపు ప్రారంభం కానుంది. లెక్కింపును దేవస్థానం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడంతో పాటు ఆలయ అధికారులు, పోలీసు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు మధ్య లెక్కింపు జరగనుంది. -
ఒకటో తేదీ నుంచి యోగా ఉత్సవాలు
పెనమలూరు: కానూరులో యోగా శక్తి సాధనసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం కానూరులో వివరాలు తెలుపుతూ జూన్ 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కానూరు అశోక్నగర్ ఇండియన్ ఓం కార్యాలయంలో ఉత్సవాలు ప్రారంభించి నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలలో భాగంగా అవగాహన సదస్సులు, ఆరోగ్య శిబిరాలు, వైద్య కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ముఖ్యంగా నొప్పులకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విజయవాడ, పిఠాపురం, రేపల్లె, గుడివాడ, ఉయ్యూరు, బాపట్ల, విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలలో పాల్గొనే వారు 9000347369కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని మాకాల సత్యనారాయణ సూచించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం బ్యారేజీ 56వ కానా వద్ద మృతదేహం ఉన్నట్లు వన్టౌన్ పోలీసులకు సమాచారమందింది. దానిపై పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని వద్ద ఎటువంటి గుర్తింపు కనపడలేదు. మృతుని వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. వన్టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణాలు బలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వంలో అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నామని ఫోన్లు చేస్తే అధికారులు స్పందించడం లేదన్నారు. ఆ శాఖ నిర్లక్ష్యం కారణంగానే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయన్నారు. విద్యుత్ షాక్తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, అప్రకటిత విద్యుత్ కోతలు ఆపాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు ఎస్ఈ కార్యాలయంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. నిర్లక్ష్యమే కారణం.. అవినాష్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా హోంగార్డు జానీ చనిపోయారన్నారు. అలాగే ఈట్స్ట్రీట్లో ప్రైవేటు వ్యక్తులు జనరేటర్, గ్యాస్, వాటర్ పేరిట దందా చేస్తున్నారని ఆరోపించారు. రోజుకు ఒక్కో షాపు నుంచి రూ. వెయ్యి నుంచి రూ. 1500 వసూలు చేస్తున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తుల జనరేటర్ దందా కారణంగా ఈట్ స్ట్రీట్లో సూర్యప్రకాష్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని మృతుల కుటుంబాలకు చెరో రూ.50లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో అప్రకటిత విద్యుత్ కోత కొనసాగుతోందన్నారు. కొండ ప్రాంతాలు, కరకట్ట ప్రాంతాలు, కాలనీల్లో రాత్రి 9 గంటలకు విద్యుత్ నిలిచిపోతే మరుసటి రోజు ఉదయం 6గంటలకు సరఫరా ఇస్తున్నారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం పెద్దలు, అధికారులు బుద్ది తెచ్చుకుని ప్రజానీకానికి మంచి చేయాలన్నారు. తక్షణమే బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలన్నారు. లోపించిన జవాబుదారీతనం.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగరంలో విద్యుత్ శాఖ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలు, ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అధికారులు విద్యుత్ కోతలు లేవని చెబుతున్నారని, కానీ సమయం, సందర్భం లేకుండా రెండు, మూడు గంటల పాటు అర్ధరాత్రి వేళల్లో విద్యుత్ కోతలు పెడుతున్నారన్నారు. నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ పూర్తిగావిఫలమయ్యాయన్నారు. జవాబు దారీతనం లోపించిందన్నారు. గాలి వానలకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫల మైందన్నారు. ఇవి ప్రభుత్వ హత్యలే.. మాజీ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొద్దిపాటి గాలివానకే విజయవాడ నగరంలో అతలాకుతలం అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఒక్కరోజే రెండు నిండు ప్రాణాలు బలైపోయాయన్నారు. ఇవి పూర్తిగా ప్రభుత్వ హత్యలేనన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. -
జౌళి రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి
కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హనుమాన్జంక్షన్ రూరల్: జౌళి పరిశ్రమ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో మోహన్ స్పిన్టెక్స్ ఫ్యాక్టరీని శుక్రవారం ఆయన సందర్శించారు. రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత, మోహన్ స్పిన్టెక్స్ ఎండీ వల్లభనేని సుధాకర్ చౌదరి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లవల్లి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఏపీలో విస్తృత అవకాశాలు.. ఆంధ్రప్రదేశ్లో జౌళి పరిశ్రమ రంగంలో ఎదిగేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జౌళి రంగానికి రూ.10,860 కోట్లు మేర ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రకటించిందన్నారు. ఈ ప్రొత్సాహాకాల్లో ఏపీ అత్యధిక వాటాను సొంతం చేసుకోవాలని సూచించారు. అనంతరం మోహన్ స్పిన్టెక్స్ పరిశ్రమ ప్రాంగణంలో ఆయన మొక్క నాటారు. అక్కడ ఉన్న పుంగనూరు ఆవులు, దూడలను పరిశీలించారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, కలెక్టర్ డీకే బాలాజీ, కేంద్ర సిల్క్ బోర్డ్ సభ్య కార్యదర్శి శివకుమార్, డైరెక్టర్ గిరీష, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి నీరబ్కుమార్, కేంద్ర జౌళి కార్పోరేషన్ గుంటూరు డివిజన్ డెప్యూటీ డైరెక్టర్ ధనశేఖరన్, చేనేత, జౌళి శాఖ ఏడీలు పాల్గొన్నారు. విద్యుత్ తీగలే.. యమపాశాలై.. పమిడిముక్కల: విద్యుత్ షాక్కు గురై ఇంటర్ విద్యార్థిని ముళ్లపూడి అంకిత(17) మృతి చెందిన ఘటన శుక్రవారం లంకపల్లిలో చోటు చేసుకొంది. స్థానికుల కథనం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన అంకిత స్నానం చేసేందుకు లంకపల్లి మెయిన్ పాఠశాల వద్ద పంపు వద్దకు నీటి కోసం వెళ్లింది. గురువారం రాత్రి వీచిన ఈదురుగాలులకు పంపుపై చెట్టు కొమ్మలు, విద్యుత్ తీగలు తెగి పడి ఉన్నాయి. ఇది గమనించని అంకిత నీరు పట్టేందుకు ప్రయత్నించగా.. తెగిపడిన వైర్లలో విద్యుత్ ప్రవహించడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కర్రలతో విద్యుత్ వైర్లను పక్కకు జరిపి చూడగా అప్పటికే అంకిత మృతి చెందింది. దీంతో అంకిత తల్లిదండ్రులు ఇశ్రాయేలు, నాగమణి కన్నీరుమున్నీరుగా విలపించారు. కూలీపనులు చేసుకొంటూ కుమార్తెను చదివించుకొంటున్నామని ఆవేదన చెందారు. అంకిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. సమాచారం అందిన వెంటనే ఎన్ఐ బి.శ్రీను, విద్యుత్ ఏడీ సుందరరావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. పెనమలూరులో మరో యువకుడు మృతి పెనమలూరు: చెత్త సేకరించి అమ్ముకునే యువకుడు ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటనపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పటమట జేడీనగర్కు చెందిన ఏసురాణి, కొండయ్యలకు ముగ్గురు పిల్లలు. వారి కుమారుడు చల్లా శ్రీను(17)తో కలిసి చెత్త ఏరుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కాగా శుక్రవారం ఏసురాణి, కొండయ్య చెత్త సేకరణ కొసం రామవరప్పాడుకు వెళ్లగా శ్రీను కానూరు కొత్త ఆటోనగర్కు వచ్చాడు. అయితే మధ్యాహ్నం 12గంటలకు చెత్త కొట్టు యజమాని ఏసురాణికి ఫోన్ చేసి కొత్త ఆటోనగర్ రెండో లైన్లో కరెంట్ ఆఫీస్ పక్కన శ్రీను చనిపోయి ఉన్నాడని సమాచారం తెలపటంతో ఘటనా స్థలం వద్దకు ఏసురాణి, భర్త కొండయ్య వెళ్లారు. డ్రెయినేజీలో విద్యుత్ తీగలు పడి ఉండగా ప్రమాదవశాత్తూ శ్రీను విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటనపై తల్లి ఏసురాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కానూరు సబ్స్టేషన్ అప్గ్రేడ్నకు చర్యలు
పెనమలూరు: కానూరు కొత్తఆటోనగర్ సబ్స్టేషన్ను అప్గ్రేడ్ చేయటానికి ఏపీసీడీసీఎల్ చైర్మన్ ఆండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి ఆమోదించారని ఈఈ ఆపరేషన్స్ పి.హరిబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం సీఎండీ పుల్లారెడ్డి, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వీఎస్ఎన్.మూర్తి ఆటోనగర్ సబ్స్టేషన్ను పరిశీలించారన్నారు. ఈ ఈ హరిబాబు వివరాలు తెలుపుతూ కానూరు ఆటోనగర్ 33/11 కేవీ సబ్స్టేషన్ పై విపరీతంగా లోడ్ పడుతున్నందున సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకోని రూ 125 కోట్లతో కానూరు ఆటోనగర్ సబ్స్టేషన్ను 132 కేవీ సబ్స్టేషన్ను అప్గ్రేడ్ చేస్తామన్నారు. దీంతో గంగూరులో ఉన్న 132 కేవీ సబ్స్టేషన్పై లోడ్ గణనీయంగా తగ్గుతుందన్నారు. పెనమలూరు, పోరంకి, తాడిగడప తదితర ప్రాంతా లోడ్ తగ్గి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని వివరించారు. కాగా పెదపులిపాక కరకట్ట దిగువున 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మించటానికి అధికారులు స్థలం పరిశీలించారు.పెదపులిపాక, యనమలకుదుఉఉ గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయటానికి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ హనుమయ్య, విద్యుత్ శాఖ డీఈలు,ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాలు విడిచిన టన విజయవాడ రూరల్ జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. చల్ల ఏసుబాబు, నాగలక్ష్మి దంపతులు వైఎస్సార్ కాలనీలో బ్లాక్ నంబర్ 240 ఎఫ్ఎఫ్ 2లో నివసిస్తున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరూ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పెద్ద కుమార్తె చల్లా మాధవి (5) ఇతర పిల్లలతో ఆడుకుంటూ కాలనీలోని రోడ్డుకు అవతల ఉన్న బ్లాక్ నంబర్ 224 వద్దకు వెళ్లింది. అక్కడ చేతికి అందే ఎత్తులో ఉన్న విద్యుత్ బార్ వద్ద ఆడుకుంటుంది. ఆ సమయంలో విద్యుత్ బాక్స్లో ఏర్పాటు చేసిన వైర్లు చేతికి తగలటంతో కరెంట్ షాక్ కొట్టి చిన్నారి చనిపోయింది. తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి భోరున విలపించారు. రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీపీఎం డిమాండ్.. విషయం తెలుసుకుని కాలనీకి చేరుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోయి సత్యబాబు మాట్లాడుతూ రక్షణ లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ బార్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలు మార్లు ఫిర్యాదు చేశామని, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వలనే చిన్నారి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి విద్యుత శాఖ రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈవీ నారాయణ, నగర కార్యదర్శివర్గ సభ్యులు కె.సూరిబాబు, కె.రవి, జి.వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
దోచుకొచ్చి.. దొరల్లా అమ్మేస్తున్నారు!
సాక్షి, టాస్క్ఫోర్స్: దొంగ బంగారం కొనుగోలుకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కేంద్రంగా మారింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా దందా సాగుతోంది. కొందరు స్థానిక వ్యాపారులు ఈ దొంగ బంగారాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ నేరగాళ్లకు సహకరిస్తున్నారు. భారీగా బంగారం వ్యాపారం.. రాష్ట్ర స్థాయిలోనే జగ్గయ్యపేటలో బంగారం, వెండి వస్తువులు తయారీ, కొనుగోళ్లకు ఎంతో ప్రసిద్ధి. వందేళ్లుగా ఇక్కడ క్రయ విక్రయాలు కోట్ల రూపాయల్లో జరుగుతాయి. పట్టణంలో 95కి పైగా బంగారు, వెండి దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజు బంగారం మూడు కేజీలు, వెండి 5 నుంచి 10 కేజీల వరకు కొనుగోళ్లు జరుగుతాయి. ప్రతి నెలలో 25 రోజుల పాటు 80 నుంచి 100 కేజీల బంగారం, వెండి 100 నుంచి 200 కేజీల వ్యాపార అమ్మకాలు జరుగుతాయి. దీంతో దుకాణాలు నిత్యం వినియెగదారులతో కళకళలాడతాయి. దొంగలకు పేట అడ్డా.. తెలంగాణకు సరిహద్దుగా జగ్గయ్యపేట ప్రాంతం ఉండటంతో దొంగలు దోచుకున్న బంగారాన్ని అమ్ముకునేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోదాడ, సూర్యా పేట, హుజుర్నగర్, మల్లారెడ్డిగూడెం, ఏపీలోని గుంటూరు, పల్నాడుజిల్లా పరిధిలోని పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మాచర్ల, నరసరావుపేట, ప్రాంతాల్లో అపహరించిన బంగారం వస్తువులను ఈ ప్రాంతంలోని కొన్ని బంగారు దుకాణాలకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతినెల సూమారు 500 గ్రాముల నుంచి కిలో వరకు అపహరించిన బంగారు వస్తువులను అమ్మకాలు చేస్తుంటారు. ఇందుకు యజమానులు కూడా సంబంధించిన బిల్లులను కూడా చూడకుండా వస్తువులను కొనుగోలు చేసి వాటికి బదులుగా నగదును చెల్లిస్తున్నారు. మఫ్టీలో పోలీసులు.. పేట పట్టణానికి పోలీసులు అధికంగా రికవరీ కోసం వస్తున్నారు. ప్రతినెలలో కనీసం 10 నుంచి 15 సార్లు దొంగతనానికి గురైన బంగారాన్ని రికవరీ చేసేందుకు నల్గొండ, గుంటూరు, దాచేపల్లి మిర్యాలగూడకు చెందిన పాలీసులు మఫ్టీలో దుకాణాల వద్దకు బంగారం అమ్మిన వ్యక్తులను తీసుకుని వస్తుంటారు. నామమాత్రంగా రికవరీలు.. గడిచిన రెండేళ్లలో ఏపీ–తెలంగాణ పోలీసులు నామమాత్రంగా రికవరీలు చేస్తున్నారు. 2025లో ఏప్రిల్లో కోదాడలో 100గ్రాముల బంగారం అపహరించిన కేసులో పోలీసులు పట్టణంలోని ఓ దుకాణంలో విక్రయించగా అపహరించిన దొంగ సమాచారం మేరకు యజమానిని అరెస్ట్ చేశారు. అదే ఏడాది నేల కొండపల్లిలో మూడు తులాల బంగారాన్ని ఓ దుకాణంలో రికవరీ చేశారు. తాజాగా ఈ నెల 19న పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు వచ్చి ఓ దుకాణంలో 100గ్రాముల బంగారం రికవరీ చేసేందుకు దొంగను బేడీలతో దుకాణానికి తీసుకువచ్చి విచారించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు.. జగ్గయ్యపేటలో కోట్లాది రుపాయల బంగారు క్రయ విక్రయాలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఇక్కడ బంగారం ఎక్కడి నుంచి వస్తోంది? అందుకు సంబంధించిన రికార్డులు, అనుమతులు ఉన్నయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దొంగ బంగారం కొనుగోలుకు కేంద్రంగా జగ్గయ్యపేట నేరగాళ్లకు సహకరిస్తున్న కొందరు వ్యాపారులు రాష్ట్ర సరిహద్దు కావడంతో యథేచ్ఛగా దందా తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా రికవరీ కేసులు పట్టణంలో వరుసగా ఇటువంటి సంఘటనలు జరుగుతుండటంతో యజమానులకు, దొంగలకు మధ్య బలమైన బంధం ఉందనే విమర్శలు వస్తున్నాయి. రికవరీకి పోలీసులు దుకాణాలకు వస్తే కొందరు వర్తక సంఘ నాయకులు వారితో మాట్లాడి, సెటిల్మెంట్ చేసి పంపించి వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేసుకోవడం, కేసును క్లోజ్ చేయడం వరకూ పోలీసులు పరిమితం అవుతుండగా.. బంగారం కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. -
కుట్రలను తిప్పి కొట్టండి
జాబితాలను సరిచూడండి.. ● వైఎస్సార్ సీపీ బీఎల్ఏలతో మాజీ మంత్రి పేర్ని నాని ● పామర్రులో ఎస్ఐఆర్, జాబితా మ్యాపింగ్పై అవగాహన పామర్రు: వైఎస్సార్ సీపీకి చెందిన ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్(బీఎల్ఏ) తన పరిధిలో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్(బీఎల్వో)ల నుంచి మ్యాపింగ్ కాని లిస్టులను తీసుకుని, ఈనెల 30 తేదీ నాటికి వాటిని మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. స్థానిక ఆరేపల్లి కల్యాణ మండపంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)పై బీఎల్ఏలకు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ ఇంతకు ముందే టీడీపీ నేతలు తమ వారికి మ్యాపింగ్ చేశారని, మిగిలిన 35శాతం మాత్రమే బీఎల్వోల వద్ద మ్యాపింగ్ కాకుండా లిస్టులో ఉందని అన్నారు. ఈ లిస్టులను ప్రతి బీఎల్ఏలు తీసుకుని దానిలో ఉన్న పార్టీ సభ్యులతో పాటు పార్టీ సానుభూతిపరుల పేర్లను కూడా తీసుకుని వాటికి కూడా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇది చాలా కీలకమన్నారు. పామర్రులోని 243 బూత్లలోని బీఎల్ఏలకు వారికి సంబంధించిన బీఎల్వోల ఫోన్ నంబర్లు, పేరులను మీకు అందజేస్తామని చెప్పారు. అధికార పార్టీ నాయకులు ఇప్పుడు హైబ్రీడ్ మీటింగ్లను ఏర్పాటు చేసి, రెండు రోజుల పాటు ‘జయము జయము లోకేష్’ అంటూ భజన చేస్తూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప.. రాష్ట్ర అభివృద్ధి గురించి కాని రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క మాట మాట్లాడిన పరిస్థితి లేదని విమర్శించారు. ● రాష్ట్ర పోలింగ్ బూత్ వింగ్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను డిజిటల్ స్క్రీన్పై వివరించామని తెలిపారు. గతంలో 2002లో స్పెషల్ సమ్మర్ రివిజన్ సర్వే నిర్వహించారని, ప్రస్తుతం 2025డేటా ఆధారంగా ఈ సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నారని, బీఎల్ఏలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండాలన్నారు. ● ఎస్ఐఆర్ జోన్ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ ప్రతి బీఎల్ఏ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. గ్రామాల్లోని ఓట్ల పోకుండా తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ● పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నియోజకవర్గంలో ఏవిధమైన అభివృద్ధి చేయకుండా డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సైకిల్పై తిరుగు తూ తప్పులు కప్పిపుచ్చుకుంటున్నారన్నారు. పామర్రు నియోజకవర్గ పరిశీలకుడు వేములకొండ తిరుపతిరావు, పామర్రు ఎంపీపీ దాసరి అశోక్ కుమార్, జెడ్పీటీసీ జొన్నల రామ్మోహన్రావు, నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్షులు కాకర్ల వెంకటేశ్వరరావు, యలమంచిలి గణేష్బాబు, రాజులపాటి రాఘవరావు, కళ్లం వెంకటేశ్వరరెడ్డి, గోగం సురేష్, బూత్ వింగ్ అధ్యక్షుడు సమ్మెట ఆంజనేయులు, వైస్ ఎంపీపీలు ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆరుమళ్ల రమాదేవి, కొడమంచిలి మహేష్, పామర్రు పట్టణ అధ్యక్షుడు నందిపాటి సురేష్రెడ్డి, ట్రేడ్ యూని యన్ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి శ్రీనివాసరావు, బీసీ సెల్ అధ్యక్షుడు ఆళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం వచ్చాకే పనులు ప్రారంభించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం నార్త్ మండలం పొట్లపాలెం పంచాయతీ పరిధిలోని కొత్తపూడి గ్రామ దళిత, పేద రైతుల పొలాల్లో ముందస్తు సమాచారం లేకుండా హైటెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు మార్కింగ్ ఇవ్వటం పట్ల మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సంబంధించి గ్రామస్తులు గురువారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతు పలికేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ రైతులకు తాను అండగా ఉంటానన్నారు. 1994–95లో అప్పటి ప్రభుత్వం ఈ ప్రాంతంలోని దళిత, పేద కుటుంబాలకు జీవనాధారంగా తలొక ఎకరం భూమి పట్టాలు ఇచ్చిందన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆ పేదల కలలను నిజం చేస్తూ పట్టా భూములన్నింటికి సర్వ హక్కులతో కూడిన ప్రైవేటు ఆస్తులుగా (ప్రీ హోల్డ్) మార్చటం జరిగిందన్నారు. కాని నేడు మచిలీపట్నం పోర్టు అవసరాల పేరుతో ఆ భూములను నిలువునా ముంచేందుకు అధికారులు సిద్ధమయ్యారని ఆరోపించారు. హైటెక్ విద్యుత్ లైన్లతో భూమి విలువ పతనం... ఈ హైటెక్ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు వచ్చి పొలాల మధ్యలో హెవీ విద్యుత్ టవర్ల కోసం మార్కింగ్ చేయటంపై రైతులు కన్నీరు, మున్నీరవుతున్నారన్నారు. లైన్ల ఏర్పాటు వల్ల భూమి విలువ శూన్యంగా మారుతుందని, భవిష్యత్తులో ఆ భూమిని ఎవరు కొనలేరని కనీసం బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికి కూడా పనికిరాకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఈ ఎకరం భూమే జీవనాధారమని దీనిని కూడా కోల్పోతే వారి బతుకులు అంధకారమవుతాయన్నారు. అత్యుత్తమ పరిహారం అందించాలి... విద్యుత్లైన్ల ఏర్పాటు కోసం పూర్తి భూసేకరణ జరపాలని, విద్యుత్ టవర్లు వేసి వదిలేయటం కుదరదని పేర్ని నాని తేల్చి చెప్పారు. ఆలైన్లు వెళ్లే పొలాలను ప్రభుత్వం కొనుగోలు చేసి భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా రైతులు సంతోషపడేలా అత్యుత్తమ పరిహారాన్ని అందించాలని కోరారు. రైతులు చిరునవ్వుతో భూములను అప్పగించేలా నష్టపరిహారం చెల్లించిన తరువాతే పనులను ప్రారంభించాలని సూచించారు. పేద రైతుల పొలాల్లో బలవంతంగా పనులు చేపడితే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మట్టా మోహననాంచారయ్య, వన్నెంరెడ్డి రామకృష్ణ, గాజుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సమాచారం లేకుండా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు తగదు బలవంతంగా పనులు చేపడితే ఊరుకోబోం రైతులకు మద్దతు పలికిన మాజీ మంత్రి పేర్ని నాని -
నిత్యాన్నదానానికి విరాళం
విజయవాడరూరల్: జనగణన–2027 ప్రక్రియకు సంబంధించి జిల్లాలో ఇళ్ల జాబితా, ఇళ్లగణన (హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్)కార్యక్రమం అత్యంత పారదర్శకంగా బాధ్యతాయుతంగా జరుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. దేశ ప్రగతికి, సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు జనగణన గణాంకాలు కీలక పునాదిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. గురువారం విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో కొనసాగుతున్న ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జనగణన సిబ్బంది ఇంటింటికి వెళ్లే సమయంలో ప్రజలు సరైన, పూర్తి వివరాలను తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత కచ్చితత్వంతో, దోషరహితంగా డేటాను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ ముగింపు దశలో ఉన్నందున కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): గ్రామీణ స్థాయి నుంచి యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి టాటా స్టీల్ లిమిటెడ్ వంటి సంస్థల సహకారం అందించడం మంచి పరిణామమని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణీ చెప్పారు. నగరంలోని బందరురోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో శాప్ లీగ్స్కు సంబంధించిన టాటా స్టీల్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ మ్యాచ్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.భరణీ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువ ఫుట్బాల్ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు జంషెడ్పూర్లోని టాటా ఫుట్బాల్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు టాటా స్టీల్ లిమిటెడ్తో శాప్ భాగస్వామ్యం కుదుర్చుకుందన్నారు. టాటా స్టీల్ లిమిటెడ్ స్పోర్ట్స్ చీఫ్ ముకుల్ చౌదరి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభను గుర్తించి వారిలో నైపుణ్యాలకు పదును పెట్టేందుకు తమ సంస్థ శాప్తో భాగస్వామ్యం అయ్యిందన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు హామీలు గుప్పించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసేత్తడం లేదని ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణ విమర్శించారు. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం 10వ నగర మహాసభ గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆర్. కనకారావు, కె. రవీంద్ర అధ్యక్షతన జరిగింది. ముందుగా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం జెండాను రామకృష్ణ ఎగురవేశారు. ఇఫ్టూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.రమణ, జీఆర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆటో కార్మికుల పాలిట శాపంలా మారిన జీవో నంబర్ 20ను రద్దు చేయాలన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక.. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులుగా టి. శ్రీను, ఆర్. కనకారావు, గౌరవాధ్యక్షులుగా ఎం. రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా భాస్కర్, సహాయ కార్యదర్శిగా ఎన్. శ్రీను, కోశాధికారిగా కె. నాని ఎన్నికయ్యారు. వీరితో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. -
ఘాట్ రోడ్డు మరమ్మతులు వాయిదా
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్రోడ్డు మరమ్మతు పనులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో క్షేత్ర స్థాయిలో కార్మికులు పని చేయడం కష్టతరమని, అదే సమయంలో రోడ్డు రిపేరు పనులకు ఉపయోగించే రసాయనాల మిక్సింగ్లో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆర్అండ్బీ అధికారులు తేల్చి చెప్పారు. గురువారం దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆర్అండ్బీ విభాగం అఽధికారులు ఘాట్రోడ్డును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎండల తీవ్రత, వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండటంతో రోడ్డు పగుళ్లు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రస్తుతానికి ఘాట్రోడ్డు మరమ్మతు పనులను నిలిపివేసి, భక్తుల రాకపోకలతో పాటు వాహనాల రాకపోకలకు అనుమతించాలని దేవస్థానం నిర్ణయించింది. శుక్రవారం నుంచి ఘాట్రోడ్డుపైకి భక్తుల రాకపోకలను అనుమతిస్తారు. 5 నుంచి సంగమం వద్ద పవిత్ర హారతులు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ నదీ హారతులను జూన్ 5వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించేందుకు దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. సంగమం వద్ద హారతులను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని దుర్గగుడి ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నవహారతులను శాస్త్రోక్తంగా, ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలను ఇవ్వాలని వైదిక కమిటీని కోరారు. -
మహానాడుకు రండి.. చీరలు అందుకోండి
టీడీపీ నేతల వ్యూహం భవానీపురం(వియవాడపశ్చిమ): మాయ మాటలు, తాయిలాల పంపిణీతో ప్రజలను ఆకట్టుకోవడంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు టీడీపీ నేతలు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ మీటింగ్లకు జనాల్ని ఎలా రప్పించుకునేందుకు సకల విద్యలు ప్రయోగిస్తున్నారు. ఇదే ఆనవాయితీ గురువారం మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామ పార్టీ నాయకులు కూడా కొనసాగించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని రెండు రోజులపాటు గొల్లపూడిలోని పద్మావతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఆ మీటింగుకు జనాలను రప్పించేందుకు స్థానిక నేతలు మీటింగ్కు హాజరయ్యే వారికి రూ.300, బిర్యానీ, మహిళలకు చీరల పంపిణీ ఉంటుందని ప్రచారం చేసి రప్పించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో కురిసిన గాలివానకు విద్యుత్ షాక్కు గురై ఒకరు మృతి చెందారు. నగరానికి చెందిన వ్యక్తి ఇందిరాగాంధీ స్టేడియం పక్క రోడ్డులోని ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్టుకు వచ్చాడు. ఆకస్మికంగా గాలివాన రావడంతో విద్యుత్ తీగలు తెగిపడి తగలడంతో షాక్ కు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన వ్యాపారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న సూర్యారావుపేట పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వివరాలు తెలియ రాలేదు. -
రారు.. రానని అనరు!
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ముస్లింలు ప్రత్యేక నమాజ్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులతో పాటు, ఖాళీ ప్రాంగణాల్లో సామూహిక ఈద్ నమాజ్ నిర్వహించారు. త్యాగం, విధేయత, దాతృత్వం, సోదరభావం వంటి గొప్ప సందేశాలను ఈ పర్వదినం ప్రపంచానికి తెలియజేస్తోందని ముస్లిం పెద్దలు వివరించారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన సామూహిక ఈద్ నమాజ్లను చిత్రాల్లో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆలయాల పరిపాలనను ప్రభుత్వం గాలికి వదిలేసిందని సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఆలయాల పరిరక్షణతో పాటుగా నిత్యం జరిగే వైదిక కార్యక్రమాలు, భక్తులకు కల్పించాల్సిన వసతులు.. ఇలా ఆయా దేవుని సన్నిధిని పర్యవేక్షించాల్సిన దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు వాటిని పూర్తిగా గాలికొదిలేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, వాటి ఆధ్వర్యంలో ఉన్న ఆస్తులను అధికార పార్టీ నేతలకు అందించే కార్యక్రమంలో మాత్రం బిజీగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అధికారులు తమకిష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. వారంలో ఒక్కరోజూ రారు.. ఉమ్మడి జిల్లాలో చాలా మంది కార్యనిర్వహణాధికారులకు ఒకటి, రెండు లేదా ఇంకా ఎక్కువ ఆలయాల బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. వారివారి లాబీయింగ్తో పాటుగా రాష్ట్ర స్థాయి అధికారుల సహాయ సహకారాలతో వీలైనన్ని ఎక్కువ ఆలయాల బాధ్యతలు చూస్తుంటారు. అయితే వారంలో ఒక రోజైనా ఆయా ఆలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. కనీసం ముఖ్యమైన రోజుల్లోనైనా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆయా ఆలయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ నెల మొత్తం మీద మూడు నాలుగు రోజులు కూడా ఆయా ఆలయాలకు వెళ్లని అధికారులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా విజయవాడలో ఒక్క ఆలయంలో విధులు నిర్వహిస్తున్నా, నాలుగైదు రోజులకు ఒకసారి కూడా అక్కడ కనిపించని వారు చాలా మంది ఉన్నారని పలువురిపై ఆరోపణలు ఉన్నాయి. వారికే కీలక బాధ్యతలు.. ఆరోపణలు ఉన్న వారికి ఏసీ కార్యాలయంలో బాధ్యతలు సహాయ కమిషనర్ కార్యాలయంలో డెప్యూటేషన్పై ఇతర ఆలయాలు సత్రాల నుంచి వచ్చిన అధికారులపై పలు ఆరోపణలు ఉన్నట్లు ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా గతంలో కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించిన దస్త్రాలు మాయం చేసిన వారు, భూముల విక్రయించటం, హుండీ చోరీ తదితర ఆరోపణలు ఉన్న వ్యక్తులు సహాయ కమిషనర్ కార్యాలయంలో ఎలా విధులు నిర్వర్తిస్తారని దేవదాయ శాఖ ఉద్యోగులు సైతం ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల ఆస్తులకు సంబంధించి అధికార పార్టీ నేతలకు సహాయ మందించే లక్ష్యంతో కొంతమంది పని చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దేవదాయ శాఖకు చెందిన వివిధ స్థాయిల్లోని అధికారుల తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం భూముల వ్యవహారంతో పాటుగా గుడివాడలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం స్వామి వారి కిరీటం అంశంపై అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పైకి కనిపించే అంశాలు కొన్ని మాత్రమే అని ముడుపులతో చాలా విషయాలు బయటకు రాకుండా అధికారులు తొక్కిపెడుతున్నారని ఉద్యోగులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం విధానాల ఫలితంగానే దేవదాయ శాఖ అధికారులు సైతం దారుణంగా వ్యవహరిస్తున్నారని సర్వత్రా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలో ఉన్న పలు ఆలయాలకు సంబంధించి పని చేస్తున్న అధికారులు ఒక చోట జీతం తీసుకుంటూ మరో చోట పని చేయటంపై భక్తులు మండి పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో లక్ష్మీనారాయణశెట్టి సూపరింటెండెంట్గా పని చేస్తున్నారు. జిల్లాలోని వేలాది ఆలయాల పర్యవేక్షణకు సంబంధించిన విధులను నిర్వర్తించాల్సిన ఆయన.. పెద్ద అవుటుపల్లి గ్రూప్ టెంపుల్స్కు కార్యనిర్వహణాధికారిగా సైతం వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా సత్యనారాయణపురం శివాలయంలో బి. గంగాధర్ గ్రేడ్–2 కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్నారు. ఆయనే జిల్లా సహాయ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా డెప్యూటేషన్పై పని చేస్తున్నారు. జి.కొండూరు గ్రూప్ టెంపుల్స్కు గ్రేడ్–2 కార్యనిర్వహణాధికారిగా కె. నాగరాజు కొనసాగుతున్నారు. నాగరాజు ఆ బాధ్యతలతో పాటుగా సహాయ కమిషనర్ కార్యాలయంలోనూ డెప్యూటేషన్పై పని చేస్తున్నారు. పాతబస్తీలోని చల్లంరాజు వారి సత్రం కార్యనిర్వహణాధికారిగా సుబ్బారెడ్డి పని చేస్తున్నారు. ఆయన సైతం సహాయ కమిషనర్ కార్యాలయంలో డెప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే రీతిలో చాలా మంది తమతమ ఆలయాలు, సత్రాల నిర్వహణను వదిలేసి సహాయ కమిషనర్ కార్యాలయంలో డెప్యూటేషన్పై పని చేయటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వారంలో ఒక్కరోజూ ఆలయాలకు రాని వైనం గాడి తప్పుతోన్న పాలన ఇటీవల పలు ఆలయాల్లో ఘటనలతో ఇబ్బందికర పరిస్థితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు -
పనుల్లో నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం
కంకిపాడు: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు ప్రహసనంగా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పనులు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ఈ కారణంగా రూ.కోట్ల నిధులు వెచ్చించినా అవి నిరుపయోగంగా మారుతున్నాయి. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2026–27 సంవత్సరానికి గానూ 31.54 లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 3.09 లక్షల జాబ్కార్డులు ఉండగా 1.40 మంది కార్డుదారులను ఉపాధి పనులకు వచ్చే వారిగా గుర్తించారు. ఈ ఏడాది 1.22 లక్షల మందితో ఉపాధి హామీ అధికారులు ఇండెంట్ పెట్టారు. 1.77 లక్షల పనులను గుర్తించగా, 198 పనులు ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులకు గానూ ఈ ఏడాది మే నెల 5వ తేదీ వరకూ వేతనాలు చెల్లింపులు జరిగాయి. రూ 70.86 కోట్లు వేతనాల రూపంలో కూలీలకు చెల్లింపులు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అస్తవ్యస్తంగా పనులు... లక్ష్యం భారీగా నిర్దేశించుకున్నా ఆశించిన స్థాయిలో పనులు జరగటం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఉపాధి పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. ఈ సీజన్లో పంట బోదెల తవ్వకాలు, చెరువుల పూడికతీత పనులను చేపట్టారు. ఉద్యానశాఖ పనులకు కార్యాచరణ రూపొందించారు. అయితే రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ సీజన్లో పంట బోదెల తవ్వకాలు చేపట్టారు. నిర్దేశిత లోతు, వెడల్పున తవ్వకాలు చేపడుతున్నారు. కానీ పనులు మాత్రం నిబంధనలకు అనుగుణంగా సాగటం లేదు. బోదెల తవ్వకంలో వచ్చిన మట్టిని కూలీలు బోదెల గట్లపైన పడేయాలి. కానీ కూలీలు బోదె అంచులు లోపలి వైపునే మట్టిని పడేస్తున్నారు. కొన్ని చోట్ల నేలను పారలతో చెక్కుకుంటూ, కాలువ అంచులను సైతం నిర్దేశిత లోతు కనిపించేలా చెక్కుతూ చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. ఉపాధి పనుల్లో అధికారుల పర్యవేక్షణ లోపం ప్రధానంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కూలీలు, మేట్ల పనితీరుపై పర్యవేక్షణ కొరవడటంతో పనులు నిరుపయోగంగా మారుతున్నాయి. కాలువలకు నీరు విడుదల చేసిన సమయంలో కాలువల అంచుల్లో మట్టి కరిగి బోదెలు పూడుకుపోయే పరిస్థితి నెలకొంది. తద్వారా కాలువ చివరి భూములకు సాగునీరు చేరాలనే లక్ష్యం నెరవేరకుండా పోతోంది. ఉపాధి పనులు నిర్వహించినా మట్టి గట్ల మీద వేయకుండా పనులు చేసుకుంటూ పోతే ప్రయోజనం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒకే పని రెండు సార్లు.. గతంలో నిర్వహించిన సామాజిక తనిఖీల్లో తనిఖీ బృందాలు ఒకే కాలువ పూడికతీత రెండు పర్యాయాలు చేపట్టారని, కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ అనేక సభల్లో సమస్య లేవనెత్తారు. దీనికి ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారుల నుంచి సొమ్ము రికవరీ చర్యలూ తీసుకున్నారు. దీన్ని బట్టి అధికారుల పనితీరు క్షేత్రస్థాయిలో ఏ మేరకు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రహసనంగా ఉపాధి హామీ పనులు రూ.కోట్ల నిధులు వెచ్చించినా నిష్ప్రయోజనం సాగునీటి సరఫరా సమయంలో తిరిగి యథాస్థితికి కాలువలు ఉపాధి పనుల్లో నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలకు అనుగుణంగా పనులు జరగకపోతే అధికారులుపై చర్యలు ఉంటాయి. నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి. పనుల్లో లోపాలు తలెత్తితే సహించేది లేదు. ఉపాధి పనులు ఉపయుక్తంగా సాగాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. ఉపాధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. శివప్రసాద్ యాదవ్, డ్వామా పీడీ, కృష్ణాజిల్లా -
పెట్రోల్, డీజిల్పై అదనపు వ్యాట్, సెస్లను రద్దు చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజల్లపై వసూలు చేస్తున్న అదనపు వ్యాట్, రోడ్డు డెవలప్మెంట్ సెస్లను తక్షణమే రద్దు చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి.సాంబిరెడ్డి, ఎం.వి.ఆంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్ధికశాఖా మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు మెమొరాండాలను ఈ మెయిల్ ద్వారా పంపినట్లు పేర్కొన్నారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అమెరికా ఆదేశించిందని రష్యా వద్ద చౌకగా లభించే ఆయిల్ను కొనకపోవడం, 2002లో నాటి ఎన్డీఏ ప్రభుత్వం నియంత్రిత ధరల విధానాన్ని రద్దు చేయటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు పెట్రోల్, డీజల్ ధరలు పెరగటానికి ప్రధాన కారణాలని అన్నారు. ప్రభుత్వరంగంలోని ప్రతి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఏటా వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయని వాటి వార్షిక నివేదికలు తెలియజేస్తున్నాయని, అయినా నష్టాలలో ఉన్నాయని జరుగుతున్న ప్రచారం తప్పు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు కారణమవుతున్నాయని చెప్పారు. పెట్రోల్, డీజల్లపై పన్నులు, సెస్లు, డివిడెండ్ల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు రూ.7.57లక్షల కోట్లు చేరుతున్నాయని, అందులో కేంద్ర ఖజానాకు రూ.4.24లక్షల కోట్లు, రాష్ట్ర ఖజానాకు రూ.3.33 లక్షల కోట్లు చేరుతున్నాయని వివరించారు. మన రాష్ట్రంలో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ ఉందని, అదనపు వ్యాట్ పెట్రోల్పై లీటరుకు రూ.4, డీజిల్పై రూ.3.07, రోడ్డు డెవలప్మెంట్ సెస్ పేరుతో లీటరుకు ఒక రూపాయి, దానిపై మరల వ్యాట్ వసూలు చేస్తున్నారని, వీటి ద్వారా ఏటా సుమారు రు.25 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరుతుందన్నారు. వీటిలో కొంత తగ్గించినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్లపై ఉన్న అదనపు వ్యాట్ను, రోడ్డు డెవలప్మెంట్ సెస్ను పూర్తిగా రద్దుచేయాలని,పెట్రోల్, డీజిల్లపై వసూలు చేస్తున్న 31శాతం, 22.5శాతం వ్యాట్ను కనీసం 20 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్లపై కేంద్రం విధిస్తున్న పన్నులను కొంతమేరైనా తగ్గించటం, నియంత్రిత ధరల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కోశాధికారి వి.సుందర రామరాజు, పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి అవనిగడ్డ పున్నారావు పాల్గొన్నారు. నియంత్రిత ధరల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ -
చదరంగంతో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపు
ఈగల్ టీమ్ చీఫ్ ఎ.రవికృష్ణ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చదరంగంఆడటం వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఈగల్ టీమ్ చీఫ్ ఎ.రవికృష్ణ చెప్పారు. హరియాణాకు చెందిన గ్రాండ్మాస్టర్ హిమాన్షు శర్మ ఆధ్వర్యంలో గుణదలలోని నెక్ట్స్జెన్ స్కూల్ ఆవరణలో జరుగుతున్న జరుగుతున్న ఫ్రీ చెస్ కోచింగ్ క్యాంప్ను రవికృష్ణ గురువారం సందర్శించారు. హిమాన్షుతో కలిసి కొద్దిసేపు చెస్ ఆడారు. చెస్ ఆటలో నెక్ట్స్ లెవల్కు వెళ్ళడానికి ఇలాంటి క్యాంపులు దోహదం చేస్తాయని రవికృష్ణ చెప్పారు. ఉచితంగా క్యాంప్ నిర్వహిస్తున్న చెస్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై శుక్రవారం విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో గోగినేని రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఖమ్మం నుంచి విజయవాడ వస్తూన్న నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని గుర్తించిన విధుల్లోని సిబ్బంది విజయవాడ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించడంత హెడ్కానిస్టేబుల్ రాజా సిబ్బందితో కలసి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుని వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, వంటిపై మెరున్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాల్సిందిగా కోరారు. గృహోపకరణాలు అగ్నికి ఆహుతి జగ్గయ్యపేట అర్బన్: విద్యుత్ శాఖ వైఫల్యం కారణంగా హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా కావడంతో అగ్ని ప్రమాదం జరిగి రూ.4 లక్షల విలువైన గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన జగ్గయ్యపేట పట్టణంలో గురువారం జరిగింది. స్థానిక బలుసుపాడు రోడ్లోని శ్రీకనకదుర్గమ్మ ఆలయం ఆర్చ్ ఎదురుగా ఉన్న గోనుగుంట్ల ధనుంజయ గృహంలో తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పడకగదిలో నిద్రిస్తున్న ధనుంజయ తండ్రి మీద నిప్పులు పడి బట్టలు కాలిపోవడంతో తేరుకుని ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏసీ, టీవీ, కబోర్డులు, కరెంట్ వైరింగ్, కరెంట్ సామాన్లు పూర్తిగా దగ్దం అయి, గోడలు ధ్వంసం అయ్యాయి. కరెంట్ హై వోల్టేజ్ వలన ప్రమాదం జరిగిందని గుర్తించే లోగా నష్టం జరిగిపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. -
కారు భైక్ ఢీ.. యువకుడు దుర్మరణం
ఎ.కొండూరు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం గోపాలపురంలో గురువారం ఉదయం చోటు చేసు కుంది. సేకరించిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం పెనుబల్లి మండలం సూరయ్యబంజర గ్రామానికి చెందిన మాలావతు నాగు (26)కు భార్య, కుమారుడు ఉన్నారు. నాగు గురువారం రేపూడి గ్రామం నుంచి బయలుదేరి సూరయ్య బంజరు వెళ్తున్న క్రమంలో మణుగూరు నుంచి విజయవాడ వెళ్తున్న కారు బైక్ను బలంగా ఢీ కొట్టింది. దీంతో నాగు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే బైక్ పూర్తిగా దగ్దమైంది. సమాచారం అందుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కౌలు రైతుల రక్షణకు నూతన చట్టం తేవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కౌలు రైతుల రక్షణకు నూతన చట్టం తేవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల వాగ్దానం మేరకు కౌలు రైతులకు తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వాటి ఆధారంగానే వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకు, మార్కెట్ తదితర పథకాలన్నీ వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విజయవాడలోని దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర సమితి విస్తృత సమావేశం సంఘం అధ్యక్షుడు ఎ.కాటమయ్య అధ్యక్షతన బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కౌలు రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కౌలు రైతుల రక్షణకు నూతన చట్టం కావాలన్నారు. రెండేళ్లుగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయకపోవడం దారుణమన్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు కేవలం పంట హామీపైనే రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలున్నా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. గ్రామ సభలు నిర్వహించి భూ యజమాని ప్రమేయం లేకుండానే కౌలురైతులను గుర్తించి, గుర్తింపు కార్డులు జారీ చేయా లని డిమాండ్ చేశారు. దేవాలయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు సైతం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. కౌలు రైతుల సమస్యలపై జూన్ ఒకటో తేదీన కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందారావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు దొంత కృష్ణ, నేలపాల రామకృష్ణ, పి.వి. జగన్నాథం, వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిపై కొండచిలువ కలకలం
● ఉడతను నోట కరచుకొని చెట్టుపై నుంచి పడిన సర్పం ● భయంతో మెట్ల పూజలను నిలిపివేసిన భక్తులు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో పాత మెట్ల మార్గంలో బుధవారం ఉదయం కొండచిలువ కలకలం రేపింది. ఈ మార్గంలో వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలకు పక్కనే చెట్టు ఉంది. బుధవారం తెల్లవారుజామున ఆరున్నర గంటల సమయంలో చెట్టుపై నుంచి సుమారు ఐదు అడుగుల పొడవైన కొండ చిలువ కింద పడింది. ఉడతను పట్టుకునే క్రమంలో అది కింద పడటంతో ఆ సమయంలో ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు బెంబేలెత్తిపోయి కేకలు వేశారు. అమ్మవారి మెట్లకు పూజలు నిర్వహించేందుకు వచ్చిన మహిళలు సైతం కంగారు పడి కిందకు దిగిపోవడం కనిపించింది. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలిపిన అర్చకుడు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరాడు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న శానిటేషన్ సిబ్బంది కొండ చిలువను పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. పది రోజుల కిందట ఇదే మెట్ల మార్గంలో శ్లాబ్ పెచ్చులు ఉడి పడి చిన్నారి గాయపడింది. మంగళవారం క్యూలైన్ మార్గంలో భక్తుడికి కుక్క కరిచింది. ఇప్పుడు తాజాగా బుధవారం కొండ చిలువ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32,1710 టీఎంసీలుగా నమోదైంది. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రులో కొలువైన శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవ స్థానజ వార్షికోత్సవాలు బుధవారం వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించారు. జక్కంపూడి వైఎస్సార్ కాలనీ రోడ్డులోని ఎస్కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్లో తొమ్మిది జిల్లాల ఎన్సీసీ విద్యార్థులకు రైఫిల్ షూటింగ్ శిక్షణ బుధవారం ప్రారంభమైంది. 7 -
దేదీప్యమానంగా డోకిపర్రు
ఘనంగా శ్రీ వేంకటేశ్వరుని దేవస్థాన వార్షికోత్సవాలు డీఎంహెచ్వో డాక్టర్ మాచర్ల సుహాసిని లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభ) ఐడీని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, దానితో అనేక ప్రయోజనాలు ఉన్నట్లు ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ అభ ఐడీపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలని వైద్య సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. అభ ఐడీతో హెల్త్ రికార్డులు డిజిటల్గా భద్రంగా ఉంటాయని, ఒక్కసారి ఐడీ క్రియేట్చేసి, మనం ఎప్పుడు టెస్ట్లు చేయించుకున్నా, ఆ ఐడీలో రికార్డు అవుతాయన్నారు. గతంలో ఫైల్స్ను భద్రపర్చాల్సిన అవసరం ఉండదని ఆమె తెలిపారు. ల్యాబ్ రిపోర్టులు, వైద్యుని ప్రిస్క్రిప్షన్ వంటి ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ గా పొందవచ్చున్నారు. ధ్రువీకరించిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ద్వారా టెలి కన్సల్టేషన్ సేవలు పొందవచ్చునని పేర్కొన్నారు. కాబట్టి 14– అంకెల ప్రత్యేక హెల్త్ ఐడెంటి నెంబర్, అభను పొందండి డిజిటల్ అవ్వండి అనే నినాదంతో అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. -
నిధులు దోచుకో.. పరికరాలు దాచుకో!
● వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో పిల్లలకు అందని పౌష్టికాహారం, క్రీడా పరికరాలు ● విడుదలైన రూ. 5.78 లక్షల నిధులు ఏమైనట్టో.. ● ఈ నెల 31తో ముగియనున్న వేసవి క్రీడా శిక్షణ ● అధికారుల తీరుపై విమర్శల వెల్లువ మచిలీపట్నంఅర్బన్: క్రీడలకు విడుదల చేసిన నిధులు దోచుకుంటూ, ప్రభుత్వం అందించిన క్రీడా పరికరాలు దాచుకుంటున్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఉచిత వేసవి శిక్షణా శిబిరాల కోసం ప్రభుత్వం రూ. 5,78,860 విడుదల చేసింది. అందులోనే రూ.1.53 లక్షలు అవసరమైన ఆట పరికరాల కొనుగోలు, ఒకొక్క కోచ్కు రూ. 2 వేలతో పాటు రవాణా ఖర్చులకు రూ. వెయ్యి, శిక్షణకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి రోజుకు రూ.10 చొప్పున పౌష్టికాహారం అందించేందుకు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఖాతాకు నిధులు అందాయి. పిల్లలకు ఇచ్చే రూ.10లో రూ.4 విలువైన చిక్కీ, మిగిలిన రూ.6తో ఇతర పౌష్టికాహారం అందించాలని ఉంది. అయితే శిబిరాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం పంపిం చిన చిక్కీలు సైతం పంపిణీ చేసిన పరిస్థితి లేదు. కేవలం శిక్షణ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ, పిల్లలకు అందాల్సిన సదుపాయాలను నిర్లక్ష్యం చేస్తూ నిధులు దోచుకుంటున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు అధికారులు. వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు: అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ తదితర క్రీడలకు సంబంధించిన పరికరాలతో పాటు, అదనపు కొనుగోళ్ల కోసం రూ.1.53 లక్షల నిధులు జిల్లాకు విడుదలయ్యాయి. క్షేత్రస్థాయిలో మాత్రం హర్డిల్స్ మినహా ఇతర పరికరాలు ఇప్పటివరకు శిక్షణ కేంద్రాలకు చేరలేదు. విడుదలైన నిధులతో అవసరమైన పరికరాల కొనుగోలు ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతోందని, వేసవి శిబిరాల పేరుతో నిధులు పక్కదారి పడుతున్నాయని క్రీడావర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొనుగోలు ప్రతిపాదనలు ఇలా: జిల్లాలో ప్రస్తుతం 16 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు మాత్రమే నిర్వహిస్తుండగా, వాటిలో 18 రకాల క్రీడలకు సంబంధించిన శిక్షణ అందుబాటులో ఉంది. అయితే జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మాత్రం 55 రకాల క్రీడా పరికరాల కొనుగోలుకు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలపై క్రీడా వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్వహిస్తున్న క్రీడల సంఖ్యకు మించి పరికరాల కొనుగోలు ప్రతిపాదనలు ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖేలో ఇండియా కేంద్రాల నిర్వహణ: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఈత కొలను, బాక్సింగ్, హాకీ క్రీడలకు జిల్లా స్థాయి ఖేలో ఇండియా శిక్షణా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. ఖేలో ఇండియా కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం వార్షికంగా రూ.5 లక్షల పునరావృత గ్రాంట్తో పాటు, రూ.5 లక్షల వన్టైమ్ గ్రాంట్ను అందిస్తోంది. కృష్ణాజిల్లాలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో స్విమ్మింగ్కు సంబంధించి ఖేలో ఇండియా కేంద్రం కొనసాగుతున్నప్పటికీ, గత రెండేళ్లుగా స్విమ్మింగ్, హాకీ కోచ్లు లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కోచ్లు పేరుతో నిధులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ నిర్వహణ కూడా సరిగా లేదని, నీటిని సమయానికి మార్చకపోవడం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో పిల్లలు ఈత కొలనుకు రావడం లేదు. -
మహిళ హత్యకేసులో నిందితుడు అరెస్టు
● వివాహేతర సంబంధంలో ఉన్న వ్యక్తే నిందితుడు ● మృతురాలిది కై కలూరు మండలం వింజరం ● నిందితుడిని అరెస్టు చేసిన కంకిపాడు పోలీసులు కంకిపాడు: మహిళ హత్య కేసులో నిందితుడిని కంకిపాడు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్థానిక పోలీసుస్టేషన్లో సీఐ జె.మురళీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి హత్యకేసు వివరాలను వెల్లడించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ... ఏలూరు జిల్లా కై కలూరు మండలం వింజరం గ్రామానికి చెందిన జొన్నాదుల మేరీ (33) కృష్ణాజిల్లా పెడన మండలం షేరివత్తర్లపల్లి గ్రామానికి చెందిన తోకల వినోద్బాబు అలియాస్ వినోద్కుమార్తో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఇటీవల వీరిద్దరూ తెన్నేరు గ్రామంలోని ఇటుకల బట్టీల వద్ద పనులకు వచ్చారు. జొన్నాదుల మేరీ శివకుమార్ భార్యాభర్తలు. అయితే కై కలూరులోని ఓ హోటల్లో మేరీ పనిచేస్తూ ఉండేది. అక్కడికి ట్రాక్టరు నడిపే పనులకు వచ్చిన వినోద్బాబుతో పరిచయం ఏర్పరుచుకుంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అదే క్రమలో వినోద్బాబు, మేరీలు తెన్నేరులో ఇటుకల బట్టీల పనులకు వచ్చారు. అనుమానంతో గొంతు నులిమి చంపేశాడు.. మేరీ తాను పనిచేసిన హోటల్లో వంట మేసీ్త్రతో చనువుగా మాట్లాడటం వినోద్బాబుకు నచ్చలేదు. ఈ విషయమై ఇరువురు మధ్య తరచూ వాగ్వాదం జరిగేది. ఈనెల 24వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నైట్ ప్యాంటుతో మేరీ మెడకు బిగించి ఊపరాడకుండా చేసి హత్యచేసి పరారయ్యాడు. ఘటనపై మృతురాలి భర్త శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పడి నిందితుడు వినోద్బాబు కోసం విస్తృతంగా గాలించారు. నిందితుడిని కంకిపాడు సమీపంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్ఐ డి.సందీప్, ఉయ్యూరు రూరల్ఎస్ఐ కె.సురేష్ పాల్గొన్నారు. కేసు దర్యాప్తులో క్రియాశీలకంగా వ్యవహరించిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
జూన్ 15 నుంచి సర్ సర్వే
వైద్య కళాశాల పనులను త్వరగా పూర్తిచేయాలి చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం ప్రభుత్వ వైద్యకళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ సందర్శించి వివిధ భవనాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కళాశాల పరిపాలనా విభాగం తరగతి గదులు, భోజన శాల విద్యార్థుల వసతి గృహాలు తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కలెక్టర్ వెంట ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్చార్జ్ వైస్ప్రిన్సిపాల్ డాక్టర్ ఆషాలత, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ బలోపేతానికి యువశక్తి కృషి లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థాపకత శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాన్ని (ఈటీఎంపీ) ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఎంఈడీసీ)తో భారతీయ యువ శక్తి ట్రస్ట్ (బీవైఎస్టీ) ఒక ఆసక్తి పత్రంపై సంతకాలు చేసింది. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళా వేదికలో జరిగిన ‘ఒక కుటుంబం – ఒక వ్యవస్థాపకుడు ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026’ సందర్భంగా ఈ ఆసక్తి పత్రాలను పరస్పరం మార్చుకున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా క్రమబద్ధమైన శిక్షణ, మార్గదర్శకత్వం, డిజిటల్ లెర్నింగ్, పర్యావరణ వ్యవస్థ నిర్మాణ చర్యల ద్వారా నానో సూక్ష్మ పరి శ్రమలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. అధికారిక వెబ్సైట్లో ఎస్ఎస్సీ మార్కుల మెమోలు మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ హైస్కూళ్ల విద్యార్థులకు సంబంధించిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల మార్కుల మెమోలను అధికా రిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాలల లాగిన్లలో షార్ట్ మెమోలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్లోడ్ చేసి పాఠశాల ముద్ర, సంతకంతో విద్యార్థులకు అందజేయాలని సూచించారు. విద్యార్థుల పేరు, ఇంటిపేరు, జన్మతేదీ తదితర వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులతో సమ గ్రంగా పరిశీలించి ధ్రువీకరించాలని పేర్కొన్నారు. అధికారిక వెబ్సైట్లో స్కూల్ లాగిన్ సవరణల ఆప్షన్ ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ నాలుగో తేదీ వరకు అందుబాటులో ఉంటుందని సూచించారు. అవసరమైన సవరణలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని పాఠశాలలకు తగిన సూచనలు జారీ చేసి పర్యవేక్షించాలని డీఈఓ సూచించారు. -
సూపర్ ప్రెజర్ బెలూన్ ఆవిష్కరణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్పేస్ టెక్నాలజీపై యువత ఆసక్తి పెంచుకుని పరిశోధనల వైపు దృష్టి పెట్టాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు సూచించారు. విజయవాడలోని ఇందిరాగాంఽధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో ఏరో స్పేస్ స్టార్టప్ కంపెనీ రెడ్ బెలూన్ పేరుతో రూపొందించిన సూపర్ ప్రెజర్ బెలూన్ను బుధవారం ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ స్పేస్ టెక్నాలజీ ద్వారా సేకరించిన సమచారం రైతులు, ప్రజలు, వ్యాపారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. సూపర్ ప్రెజర్ బెలూన్ భూమి నుంచి 25 కిలో మీటర్లపైకి వెళుతుందని తెలిపారు. ఏరో స్పేస్ స్టార్టప్ కంపెనీ సహా వ్యవస్థాపకుడు కిరణ్ మాట్లాడుతూ అనుకోని ప్రమాదం జరిగినప్పుడు మూలాలను తెలుసుకోవడానికి సూపర్ ప్రజర్ బెలూన్లో అమర్చిన సాంకేతిక వ్యవస్థ దోహదపడుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు చౌకగా టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ కనెక్టవిటీని ఈ బెలూన్ ద్వారా అందించవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్, లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. -
సీఎం చంద్రబాబుది క్రెడిట్ చోరీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనంలోని కన్వెన్షన్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అంబేడ్కర్ స్మృతి వనంలోని కన్వెన్షన్ సెంటర్ను వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయన బుధవారం సందర్శించారు. కన్వెన్షన్ సెంటర్ వద్ద సెల్ఫీ దిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014–19 మధ్య చంద్రబాబు అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి విస్మరించారని గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ నడిబొడ్డున రూ.400 కోట్లు ఖర్చు చేసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం, 200 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని గుర్తుచేశారు. బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను భావితరాలకు తెలిపేలా డిజిటల్ మ్యూజియం, మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారని పేర్కొ న్నారు. కన్వెన్షన్ సెంటర్ చాలా బాగుందని చంద్రబాబు సైతం బేషరతుగా మెచ్చుకున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం తనదేనని చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడటంపై మండిపడ్డారు. ఈ రెండేళ్లలో ఏం చేశారో ప్రకటించాలి వైఎస్ జగన్ కంటే ఎక్కువ చేస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిందని, ఈ రెండేళ్లలో ఆయన కంటే ఎక్కువ ఏం చేశారో మహానాడు వేదికగా ప్రకటించాలని సీఎం చంద్రబాబును మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తన రెండేళ్ల పరిపాలన గురించి ప్రజల ముందుకు వచ్చి చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. రెండేళ్ల పాలనలో ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘వంగవీటి మోహన రంగాను ఎవరు హత్య చేశారో మీకు తెలియదా? రంగా హత్య తర్వాత మీ మంత్రులు ఎందుకు రాజీనామా చేశారో’ సమాధానం చెప్పా లని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు గుండె సుందర్ పాల్, గుడిసె శ్యామ్బాబు, మాతా మహేష్, వెంకటరామిరెడ్డి, తోపుల వరలక్ష్మి, పేరం త్రివేణి, పసుపులేటి కోటేశ్వరరావు, డాక్టర్ రాంబాబు, సురేష్, మనోహర్, మజ్జి రాము తదితరులు పాల్గొన్నారు. -
గాలి వీస్తే విద్యుత్ కట్కట
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: అనధికార విద్యుత్ కోతలు ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్నపాటి గాలులు వీస్తే చాలు ఆ ప్రాంతంలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. మండుతున్న ఎండలు, ఉక్కపోతకు అనధికార విద్యుత్ కోతలు తోడవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్వహణ లోపమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 220 కేవీ / 132 కేవీ ఈహెచ్టీ (ఎక్స్ట్రా హై టెన్షన్) లైన్లు, వాటి కింద ఉన్న ఫీడర్లలో ఓవర్లోడ్ పడితే ఆ ప్రాంతాల్లో అనధికార కోతలు విధిస్తు న్నారని సమాచారం. ఓవర్ లోడ్ నమోదయ్యే ప్రాంతాల్లో ప్రభుత్వం ముందుగా కొత్త లైన్లు వేయకపోవడం, ఉన్న లైన్లను అప్గ్రేడ్ చేయకపోవడం, ఈహెచ్టీ సబ్స్టేషన్ నిర్మాణాలు చేపట్టనందు వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గుణదల నుంచి ఆటోనగర్, గుణదల నుంచి గంగూరు, తాడికొండ నుంచి తాడేపల్లి 132 కేవీ లైన్ల పరిధిలో ఓవర్ లోడ్ కారణంగా వాటి పరిధిలోని ఫీడర్లలో అనధికారి కంగా విద్యుత్తు కోతలు విధిస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు, రాత్రి పది నుంచి 12 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. జనవరిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గరిష్ట వినియోగం రోజుకు 18 మిలియన్ యూనిట్లు. మంగళవారం విద్యుత్ వినియోగం 27.54 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఈ పెరుగుదలను ముందుగా అంచనా వేసి, దానికి అనుణంగా చర్యలు తీసుకోవడంలో విద్యుత్ శాఖ యంత్రాంగం పూర్తిగా విఫలం కావడంతో అనధికార కోతలు తప్పడం లేదు. గుణదల విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో మంగళవారం ఎగసిపడుతున్న మంటలువిజయవాడ నగరంలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు వైర్లు తెగి ఏడు ఫీడర్ల పరిధిలో గంటల తరబడి విద్యుత్ లేకుండా పోయింది. మంగళవారం రాత్రి గుణదలలో లైన్లు లూజుగా ఉండి, నిప్పురవ్వలు రాలి, గడ్డి తగలబడటంతోపాటు, ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ పరికరాలు దగ్ధమయ్యాయి. దీంతో గన్నవరం, గూడవల్లి, గుణదల, పాలిటెక్నికల్ కాలేజీ, ఎనికేపాడు ప్రాంతాల్లో మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. ఈ నెల 22వ తేదీనే గుణదలలో లైన్ల నుంచి నిప్పురవ్వలు పడినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో మంగళవారం ప్రమాదం జరిగింది. మైలవరం, జగ్గయ్యపేట, చిల్లకల్లు ప్రాంతాల్లో ఈదురు గాలుల కారణంగా సోమవారం నాలుగు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం రాత్రి వీచిన గాలులకు మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఫీడర్లు ట్రిప్పయ్యి రెండు, మూడు గంటల పాటు విద్యుత్ నిలిచిపోయింది. -
‘ఎస్కేపీవీవీ’లో ఎన్సీసీ రైఫిల్ షూటింగ్ శిక్షణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్ర బెటాలియన్ 17(ఎ) నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) కాకినాడ పరిధిలోని తొమ్మిది జిల్లాల ఎన్సీసీ విద్యార్థులకు రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇచ్చేందుకు విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి వైఎస్సార్ కాలనీ రోడ్లోని ఎస్కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ కమిటీ ముందుకు వచ్చింది. కోస్తా ఆంధ్రాలోని ఎన్సీసీ క్యాడెట్లకు ఆయుధాలను ఉపయోగించడం, గురి చూడటం, కాల్పులు జరపడంలో శిక్షణ ఇచ్చేందుకు ఫైరింగ్ క్యాంప్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి హైస్కూల్ ఇది. బుధవారం హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్కూల్ ఇన్చార్జ్ సెక్రటరీ/కరస్పాండెంట్ తూనుకుంట్ల శ్రీనివాసు మాట్లాడుతూ విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపుతోపాటు క్యాడెట్లలో ధైర్యం, ఏకగ్రతను పెంచడమే ఫైర్ రేంజ్ ఏర్పాటు మఖ్య ఉద్దేశమన్నారు. దేశానికి సేవలు అందించే ఆర్మీ, అగ్నివీర్లలో చేరేందుకు ఎన్సీసీ ద్వారా అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. శిక్షణ జేసీఓ సుబేదార్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ క్యాడెట్ కార్ఫ్స్ వార్షిక శిక్షణలో భాగంగా క్యాడెట్లకు అబ్ట్పాకిల్ ట్రైనింగ్, ఫైరింగ్ ప్రాక్టీస్, టెంట్ పిచింగ్, ఫిజికల్ ట్రైనింగ్, డ్రిల్, వెపన్ ట్రైనింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అంశాలలో సమగ్ర శిక్షణ ఇస్తామని వివరించారు. బెటాలియన్ పరిధిలోని 537 మంది క్యాడెట్లకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీపై గెస్ట్ లెక్చర్స్.. ఎస్కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీ వంటి అంశాలపై నిపుణులతో గెస్ట్ లెక్చర్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.శ్యామల మాట్లాడుతూ క్యాడెట్లలో దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఈ ఫైరింగ్ క్యాంప్ దోహదపడుతున్నారు. కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అజిత్ సింగ్ తోమర్, సుబేదార్ మేజర్ అనిల్ కుమార్ దహియ, కెప్టెన్ కేపీటీ విజయభాస్కర్ పాల్గొన్నారు. -
మత్స్యకారుల నిరసన
పాలకాయతిప్పలో ● టూరిజం బోటు తరలింపును అడ్డుకున్న గంగపుత్రులు ● పర్యాటకం పేరుతో జీవనోపాధిపై దెబ్బకొడుతున్నారని ఆగ్రహం కోడూరు: సముద్ర వేటపై ఆధారపడి జీవనం సాగించే పాలకాయతిప్ప మత్స్యకారులు అటవీ అధికారులపై నిరసనకు దిగారు. పర్యాటక అభి వృద్ధి పేరుతో అటవీ అధికారులు సముద్ర శింకు వద్ద నుంచి సాగర సంగమం వరకు బోటు టూరిజం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యేక ట్రాలీపై టూరిజం బోటును అధికారులు సముద్రతీరానికి తీసుకువచ్చారు. దీనిని గమనించిన పాలకాయతిప్ప మత్స్యకారులు కరకట్ట వద్దే బోటు ఉన్న ట్రాలీని అడ్డుకొని శింకు వద్దకు వెళ్లడానికి వీలు లేదంటూ వాహనం ముందు బైఠాయించారు. జీవనోపాధికే ప్రమాదమంటూ భావోద్వేగం తరతరాలుగా సముద్ర శింకు వద్దే తమ వేట పడవలను నిలిపి, ఇక్కడే నుంచే సముద్ర వేటకు బయలుదేరి వెళ్తామని మత్స్యకారులు తెలిపారు. తుపాన్లు, అలల ప్రభావం ఎక్కువగా ఉండే సమయంలో కూడా ఈ ప్రాంతమే తమకు భద్రత కల్పించిందని, అలాంటి ప్రదేశాన్ని ఇప్పుడు టూరిజం అవసరాల కోసం వినియోగించాలనే ప్రయత్నం, తమ జీవనోపాధిపై ప్రభావం చూపు తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సముద్రం మా జీవితం.. పడవ మా ఆస్తి.. ఈ శింకే మా ఆశ్రయం’ అంటూ మత్స్యకారులు భావోద్వేగానికి లోన య్యారు. గ్రామపెద్దలు, మత్స్యకార సంఘాల నేలతో చర్యలు జరపకుండా అటవీ అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వేట పడవలను వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులు సూచించడం అసాధ్యమని, అటవీ అధికారులే టూరిజం స్పాట్ను వేరే ప్రాంతానికి మార్చుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. గతంలో ఈ విషయాలను పాలకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని మత్స్యకారులు వాపోయారు. వివాదాన్ని సద్దుమణిచిన పోలీసులు టూరిస్ట్ బోటును తీసుకువస్తున్న ప్రత్యేక ట్రాలీని మత్స్యకారులు అడ్డుకోవడం అటవీ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అవనిగడ్డ సీఐ యువకుమార్, ఎస్ఐ చాణిక్య ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మత్స్యకారులతో మాట్లాడి వారి అభ్యంతరాలను తెలుసుకున్నారు. అనంతరం బోటును దింపకుండా తిరిగి అదే లారీలో వెనక్కి పంపించడంతో ఉద్రికత్త సద్దుమణిగింది. -
భయపెడుతున్న బుడమేరు ఆక్రమణలు
●ఆదాయ వనరుగా మారిపోయిన ‘ఆపరేషన్ బుడమేరు’● సెంట్రల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలతో దందా! ● ‘మామూళ్ల’ మత్తులో కన్నెత్తి చూడని అధికారులు ● వరదొస్తే ప్రళయం తప్పదని స్థానికుల ఆందోళన సాక్షిప్రతినిధి,విజయవాడ: బుడమేరు.. ఈ పేరు వింటే నే విజయవాడ నగర ప్రజలు నేటికీ వణికిపోతుంటారు.. రెండేళ్ల క్రితం బుడమేరు వరదలు సృష్టించిన బీభత్సం స్థానిక ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తూనే ఉంది.. కొద్దిపాటి చినుకులు పడినా.. తుపాను వస్తోందనే హెచ్చరిక వినినా.. ఎటు నుంచి ఏ వరద ముంపు తమను ముంచేస్తుందోనంటూ ఆందోళన చెందుతూనే ఉన్నారు. వేలాది మంది ప్రజలు రోడ్డున పడినా.. వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగినా.. పదుల సంఖ్యలో అమాయక ప్రజలు అసువులు బాసినా.. ప్రభుత్వ పాలకులు, సంబంధిత అధికారులు అవేవి తమకు పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధి అండదండలతో.. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో బుడమేరులో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. బుడమేరులో మట్టి, రాళ్లు పోసేసి పూడ్చేయడం.. వాటిని ప్లాటుగా మార్చేసి.. దొంగ సర్వే నంబర్లతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం.. నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను చేపట్టడం చేస్తున్నారనే విమర్శ లు గుప్పుమంటున్నాయి. ప్రజాప్రతినిధికి ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే ఇద్దరు వ్యక్తులు బుడమేరు ఆక్రమణల్లో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. మామూళ్ల మత్తులో.. స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిళ్లు రావడం.. ఆక్రమణ దారుల నుంచి ముడుపులు అందుతుండటంతో బుడమేరులో ఇంత యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, కార్పొరేషన్ టౌన్ప్లానింగ్, నీటి పారుదల శాఖ అధికారులెవ్వరూ కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శలు వస్తున్నాయి. బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెబుతున్నా, ఫిర్యాదులు అందు తున్నా ‘మామూళ్ల’ మత్తులో అస్సలు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి అనుచరుడైన వ్యక్తితో కొంతమంది టౌన్ప్లానింగ్ అధికారులు కుమ్మక్కయ్యారనే విమర్శలు న్నాయి. కొంతమంది ఇరిగేషన్ అధికారులకు కూడా పెద్ద మొత్తంలో ఆమ్యామ్యాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవే నిదర్శనాలు.. స్థానిక న్యూరాజరాజేశ్వరీపేట, ఇందిరానాయక్నగర్, రామకృష్ణాపురం, సన్సిటీ కాలనీ, భరతమాత మందిర చివర భాగం, అయోధ్యనగర్ నుంచి న్యూఆర్ఆర్పేటకు వెళ్లే దారి, రాఘవేంద్ర థియేటర్ సమీపంలోని బుడమేరులో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయి. బుడమేరును పూడ్చేసి ప్లాట్లుగా మార్చడమే కాకుండా.. ఇక్కడ బఫర్ జోన్లలో భవనాలు, షెడ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు బుడమేరులో ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బుడమేరు వరదల్లో మేమంతా ఆర్థికంగా చాలా చితికిపోయాం. ఆ ప్రభావం నుంచి నేటికీ కోలుకోలేదు. వరదలు వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ ఆక్రమణలను తొలగించకపోగా కొత్తగా అడుగడుగునా బుడమేరును పూడ్చేస్తున్నారు. ఇలా అయితే కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా బుడమేరు కదిలే మార్గం లేక మళ్లీ ముంపు సమస్య వస్తుంది. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి మా కన్నీటి ఘోషను ఆలకించి బుడమేరును, మా కుటుంబాలను కాపాడాలని కోరుకుంటున్నాం. – ఎస్.దుర్గారావు, న్యూఆర్ఆర్పేట -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026u8లో అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. 7ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు మంగళవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. గాంధీనగర్: జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రూపొందించిన పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
పటమట(విజయవాడతూర్పు): పటమట పీఎస్ పరిధిలోని నిర్మల జంక్షన్ దగ్గరలో సర్వీస్ రోడ్డులోని ఎంపైర్ హోటల్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద సుమారు 50 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. మంగళవారం ఉదయం స్థానికులు సమాచారంతో అక్కడికి చేరుకున్న పటమట పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారన్నారు. మృతుని శరీరంపై షర్టు లేకుండా బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, అతని పేరు వివరాలు తెలియ రాలేదని, వివరాలు తెలిసినవారు పటమట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
అప్పులు.. అభాసుపాలు!
గుడ్లవల్లేరు: చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘స్వర్ణ పంచాయతీ’ సైట్తో అవస్థలు తప్పడం లేదు. దీని కారణంగా జిల్లాలోని చాలా పంచాయతీలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. కృష్ణా జిల్లాలో 486గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఎన్నో పంచాయతీలకు బిల్లులు కాకపోవటంతో పరిపాలన కుంటు పడుతోంది. జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖలో ఉన్నతాధికారుల అండదండలున్న కొంతమంది గ్రామ కార్యదర్శులకు మాత్రం భారీ మొత్తంలో బిల్లులు సత్వరమే విడుదల చేసేందుకు కొన్ని శక్తులు సహకరిస్తున్నాయి. కానీ మైనర్ పంచాయతీల్లో కనీసం చాటింపు వేయించేందుకు రూ.500 డ్రా చేయాలన్నా కష్ట సాధ్యమవుతోంది. లక్ష్యాలకు దూరంగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ స్వచ్ఛపథం, స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర పథకాల లక్ష్యాన్ని పంచాయతీలకు అప్పగించింది. కానీ ఆ లక్ష్యాన్ని చేరేందుకు ఆయా పంచాయతీలు నానా అగచాట్లకు గురవుతున్నాయి. ● మేజర్, మైనర్ పంచాయతీల పరిధిలోని రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నా.. సీఆర్డీఏకు జమ అవుతున్నాయే తప్ప అందులో పంచాయతీలకు రావలసిన నిధులు అందడం లేదు. ● ఎన్నో ఏళ్లగా గ్రామ పంచాయతీలకు సర్కార్ ఇవ్వవలసిన స్టాంప్ డ్యూటీ నిధులను ఇవ్వటం లేదు. కేవలం పంచాయతీలకు వచ్చే నాన్ ట్యాక్స్, ఇంటి పన్నులు, నీటి పన్నులకు సంబంధించిన అరకొర నిధులతోనే పాలనా కాలాన్ని వెలిబుచ్చుతున్నారు. ● దీంతో నెలాంతపు ఖర్చులు, సిబ్బంది జీతాలు తలకు మించిన భారంగా మారాయి. ● మంచినీటి మోటార్ల రిపేర్లు, మురుగు కాల్వల్లో పూడికతీత వంటి పనులకు, పని వారికి వెంటనే డబ్బును అప్పటికప్పుడే చెల్లించకపోవటంతో ఆ పనులు చతికలబడిపోతున్నాయి. ● జిల్లా ఉన్నతాధికారుల అనుమతి లేనిదే చెత్త చేరవేసే వాహనాలకు సైతం కనీసం పెట్రోల్, డీజిల్ కూడా ఉండటం లేదు. ● రోజువారీ అవసరాల్ని బట్టి పంచాయతీల పరిధిలో పని చేసే మిషనరీలతో పాటు పని వారికి సొమ్ము చెల్లించలేక పోతున్నారు. ● కొన్ని పంచాయతీల్లో గత మార్చి వరకు చేయించిన పనులకు బిల్లులు చెల్లించవలసి ఉంది. ఏప్రిల్ నుంచి ఎం బుక్ ద్వారా చెల్లించవలసిన బిల్లులు కూడా కొన్ని పంచాయతీల్లో చెల్లించవలసి ఉంది. ● ఇదంతా ఏప్రిల్ నుంచి వచ్చిన నూతన స్వర్ణ పంచాయతీ సైట్లో సవరణలే కారణమని పంచాయతీలు భావిస్తున్నాయి. అప్పులూ కరువు.. బిల్లుల ఫ్రీజింగ్ వల్ల పంచాయతీలకు పెట్టుబడులు పెట్టే నాథులు కూడా కరువయ్యారు. గతంలో ఇలాంటి ఇబ్బందులు వచ్చినపుడు గ్రామ కార్య దర్శులే ఖర్చు పెట్టేవారు. ఇపుడు వారికి అప్పులు ఇచ్చేవారు కూడా కరువయ్యారు. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం పూర్తి కావటంతో ప్రత్యేకాధికారులు ఆ స్థానే వచ్చారు. కానీ వారు కూడా ఈ ఖర్చులను పెట్టేందుకు ససేమిరా అంటున్నారు. స్వర్ణ పంచాయతీ సైట్తో తిప్పలు బిల్లులు రాక కార్యదర్శులు సతమతం బ్లీచింగ్, పైపులైన్ల రిపేర్లకు నిధులు లేవు అప్పుల్లో కూరుకుపోతున్న పంచాయతీలు పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలను విడుదల చేస్తున్నామని చెప్పుకునే జిల్లా అధికారులు.. చర్యలు మాత్రం కంటి తుడుపుగా ఉంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తూతూమంత్రంగానే కొన్ని పంచాయతీలకే బిల్లులు ఆమోదిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. కొన్ని పంచాయతీలకై తే కనీసం బ్లీచింగ్కు బిల్లులను చెల్లించటంలో కూడా విఫలమవుతున్నారు. మంచినీటి పథకానికి చెందిన పైపులైన్ల రిపేర్ల ఖర్చుల బిల్లులకు మోక్షం లేకుండా పోయింది. నెలాంతపు ఖర్చుల బిల్లులు రాక నెలల తరబడి నానా ఇబ్బందుల్లో పంచాయతీలు ఉన్నాయి. -
అధిక ఉష్ణం.. జనాలకు అదే కష్టం!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, చందర్లపాటు ప్రాంతాల్లో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రత 47.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఎ. కొండూరులో 44.1 డిగ్రీలు నమోదైంది. కాగా కృష్ణాజిల్లాలోని కంకిపాడు, పెనమలూరులో అత్యధికంగా 45.8 డిగ్రీల నమోదు కాగా, ఘంటసాల, పమిడిముక్కలలో 45.5. మచిలీపట్నంలో 45.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పని ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని చెబుతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఎండలో తిరగవద్దని సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎండల తీవ్రత దృష్ట్యా కార్మికులు, కర్షకులు వడగాడ్పులకు గురై మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో మంగళవారం సైతం వడదెబ్బ మరణాలు జరిగాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రతకు గురికాకుండా ఉండటం, ఎక్కువగా మంచినీరు తాగడంతో పాటు, కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం, మజ్జిగ సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 47.3, కృష్ణాలో 45.8 డిగ్రీలు నమోదు -
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందాలి
● 1912 టోల్ ఫ్రీ నంబర్ ఎల్లప్పడూ అందుబాటులో ఉండాలి ● ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ వవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడ గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి మంగళవారం సర్కిల్ పరిధిలోని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఆపరేషన్స్)తో వర్చువల్ విధానంలో సమీక్షించారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించి ముందుగానే ప్రజలకు సమాచారం తెలియజేయాలని సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ 1912, 83309 11912 వాట్సప్ నంబర్ సేవలను మరింత పటిష్టంగా అందించాలన్నారు. ప్రతి సర్కిల్ పరిధిలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వర్షాలు, ఈదురుగాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తినా వెంటనే పునరుద్ధరణకు చర్యలు చేపట్టి, వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూచించారు. నిర్మాణంలో సబ్ స్టేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, సీజీఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ(పీసీ–పీఎన్డీటీ) చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. సమన్వయ శాఖల అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం, ఏఆర్టీ–సరోగసీ చట్టాల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ సునీల్ కుమార్ హాజరైన సమావేశంలో కమిటీ చైర్మన్, కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడారు. పటిష్టంగా చట్టం అమలు..జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫిర్యాదులు వస్తే వాటిని త్వరితగతిన విచారించి, తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతమున్న స్కానింగ్ కేంద్రాలకు అదనంగా కొత్త రిజిస్ట్రేషన్లకు, రెన్యువల్ దరఖాస్తులు, మార్పుచేర్పుల (మోడిఫికేషన్) దరఖాస్తులను కమిటీ పరిశీలించి, ఆమోదం తెలిపింది. సరోగసీకి సంబంధించిన ఆరు దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, వాసవ్య స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జి.రేష్మీ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ, ఎన్హెచ్ఎం డీపీఎంవో డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
మరికొన్ని రోజులు ఇదే తీవ్రత..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. విజయవాడతో పాటు పలు రూరల్ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కొద్దిపాటి వర్షం కురిసినప్పటికీ, సోమవారం ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు వడగాడ్పులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వడగాడ్పుల ప్రభావానికి గురైన చాలామంది పిట్టల్లా రాలుతున్నారు. బయటకు వచ్చిన వారే కాదు, ఇళ్లలో ఉన్న వారు సైతం హీట్స్ట్రోక్కు గురవుతున్నారు. అలాంటి వారు తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతుల వంటి సమస్యలతో ఆస్పత్రుల దారి పడుతున్నారు. వడదెబ్బ మృతుల్లో అధికంగా శ్రమ జీవులు, యాచకులే ఉంటున్నారు. పెనమలూరు: జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్కు చెందిన తులసిరాణా(60) పోరంకిలో అపార్టుమెంట్లో కార్పెంటర్ పనికి వచ్చాడు. అతను శుక్రవారం పని చేస్తున్న సమయంలో ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బకు గురై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అతనిని చికిత్సకై ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న తులసి రాణా ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి అల్లుడు మనోజ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామానికి చెందిన తంగిరాల వినోద్బాబు(34) భవన నిర్మాణ పనుల్లో భాగంగా టైల్స్ వేస్తుంటాడు. ఆదివారం పనికి వెళ్లిన వినోద్బాబు సాయంత్రం ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఉయ్యూరులోని సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో విజయవాడ జీజీహెచ్కి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం వేకువ జామున మృత్యువాత పడ్డాడు. కాగా వినోద్బాబుకు తొలుత వైద్యుల పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పారని, తర్వాత పోస్టుమార్టం చేయకుండానే పంపించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సిద్ధార్థ జంక్షన్ సమీపంలోని నివాసం ఉంటున్న వెల్డింగ్ పనులు చేసే కార్మికుడు గొంగటి చంటి(45) వడదెబ్బతో మృతి చెందాడు. చంటి భార్య గతంలోనే చనిపోవడంతో తల్లి యశోదమ్మతో కలిసి సిద్ధార్థ జంక్షన్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నం వేళ చికెన్ తీసుకువస్తానని చెప్పి చంటి బయటకు వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిద్ధార్థ కళాశాల చెట్టు కింద మీ అబ్బాయి స్పృహతప్పి పడిపోయాడని స్థానికులు చంటి తల్లి యశోదమ్మకు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే వచ్చి 108లో నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికే చంటి మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ● విజయవాడ సూర్యారావుపేటలో హోటల్ కార్మికుడు, హనుమాన్పేటలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు వడదెబ్బకు గురై మృతి చెందారు. తిరువూరురూరల్: మండలంలోని వావిలాలలో వడదెబ్బకు ఇరువురు మృతిచెందారు. ఆదివారం రాత్రి షేక్ షఫీ కమృన్(87) అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించేలోపు మృతిచెందారు. వడదెబ్బకు ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన టైలరింగ్ వృత్తి నిర్వహించే షేక్ నాగుల్మీరా (52) శనివారం విధినిర్వహణలో ఉండగా వడదెబ్బకు గురయ్యారు. 108 అంబులెన్సులో తిరువూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం షేక్ నాగుల్మీరా మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇరువురు సంతానం. ఇబ్రహీంపట్నం: మండుతున్న ఎండలకు తట్టుకోలేక వడదెబ్బ సోకి ఆవు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం ఖాజీమాన్యంలో సోమవారం జరిగింది. ఇప్పటి వరకూ కొండపల్లి మునిసిపాలిటీలో ఎండవేడి గాలులకు మూడు ఆవులు చనిపోయాయి. మృతి చెందిన ఆవును కొండపల్లి మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్పై తీసుకెళ్ల్లి సమాధి కార్యక్రమం నిర్వహించారు. పశువులు వడదెబ్బకు గురైతే సకాలంలో వైద్య సేవలు అందించేందుకు టోల్ఫ్రీ నెంబర్ 1962కు ఫోన్ చేయాలని పశు వైద్యాధికారులు సూచించారు. గన్నవరం: ఉంగుటూరుకు చెందిన షేక్ మౌలాలి(42) స్థానిక బుద్ధవరం రోడ్డులోని ఫీడ్ మిక్చర్ తయారీ కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కర్మాగారం ఆవరణలో సోమవారం పనిచేస్తుండగా వడదెబ్బకు గురై మౌలాలి ఒక్కసారిగా కుప్ప కూలిపోయి మృతి చెం దాడు. స్థానిక వెంకటేశ్వర థియేటర్ కాంప్లెక్స్లో టైలరింగ్ షాపులో పనిచేస్తున్న తాళ్లూరి విజయ్ కూడా వడదెబ్బకు గురై షాపులో మృతి చెందాడు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): అంబాపురం తోటమూల సెంటర్ వద్ద రోడ్డు మీద ఒక వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఆరా తీయగా సదరు మృతుడి వివరాలు ఎవరికీ తెలియదని సమాధానమొచ్చింది. అలాగే ఎండ వేడి తాళలేక మృతి చెంది ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు. దానిపై కొత్తపేట పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగ్గయ్యపేట: మండలంలోని బలుసుపాడుకు చెందిన బండ్ల శాంతమ్మ (80) ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తుంటుంది. ఎప్పటి మాదిరిగానే పనులకు వెళ్లి మధ్యాహ్న సమయంలో రావటంతో వడదెబ్బ తగిలి అస్తస్థతకు గురవటంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. మండలంలోని కె.అగ్రహారం గ్రామానికి చెందిన బొడ్డు శ్రీను(47) వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఆదివారం కూడా పొలం పనులకు వెళ్లి రాత్రికి ఇంటికి చేరాడు. దీంతో రాత్రి స్పృహ తప్పటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వీరులపాడు: మండలంలోని జుజ్జూరు గ్రామానికి చెందిన కోపూరు మోషే (70) రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం కూడా తన పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి రాగానే అలసటగా ఉందని కుటుంబ సభ్యులకు తెలపటంతో గ్రామంలోని వైద్య సేవలందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 మంది మృతి మృతుల్లో కష్టజీవులు, యాచకులే అధికం పీఎం చేస్తేనే వడదెబ్బగా గుర్తింపు ఆస్పత్రుల్లో పీఎం చేయకుండానే పంపేస్తున్న వైనం ఉమ్మడి కృష్ణాలో మరో ఐదు రోజుల పాటు ఎండలు ఇదే తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎవరూ ఉదయం 10 గంటల తర్వాత, సాయంత్రం 4 గంటల్లోపు బయటకు రావద్దని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా వడగాడ్పుల ప్రభావానికి వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, మద్యం తాగిన వారు త్వరగా గురయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వడదెబ్బగా నమోదు ఎలా?వడదెబ్బకు మృతి చెందినట్లు అధికారుల లెక్కల్లోకి ఎక్కాలంటే పోస్టుమార్టం రిపోర్టు తప్పనిసరి అని చెబుతున్నారు. కానీ జిల్లాలో వడదెబ్బ మృతులకు పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాలను బంధువులకు ఇచ్చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వడగాడ్పులకు మృతి చెందిన వారిని తొలుత ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందిన వారికి కూడా పోస్టుమార్టం నిర్వహించడం లేదు. మరి వడదెబ్బగా ఎలా నమోదు అవుతుందో అధికారులకే తెలియాలి. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
గన్నవరం: ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై గన్నవరం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. స్థానిక శ్రీనగర్కాలనీలో కాజ రజితకుమారి(58) జ్యోతి పేరిట పిండిమరను నడుపుతున్నారు. ఏడేళ్ల క్రితం ఆమె భర్త మృతి చెందగా, ఆమె ఇరువురు కుమార్తెలు అమెరికాలో ఉంటున్నారు. దీంతో ఆమె స్థానిక దావాజీగూడెం రోడ్డు పక్కన ఉన్న జీకేఆర్ అపార్ట్మెంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంటి పనులు చేసేందుకు వచ్చిన పని మనిషి బెడ్రూమ్లో మంచం పక్కన రజితకుమారి కింద పడి మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీధర్ నేతృత్వంలో అక్కడికి చేరుకున్న సిబ్బంది మృతురాలి నోరు, ముక్కు వద్ద రక్తం ఉండటంతో అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేపట్టారు. అపార్టుమెంట్లోని సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. పోలీసుల అదుపులో అనుమానితురాలు.. ఆదివారం రాత్రి 10.30గంటల సమయంలో నాలుగు నెలలు క్రితం రజితకుమారి పాత ఇంట్లో అద్దెకు ఉండి వెళ్లిన సుష్మ, ఆమె కుమారుడు అజయ్ ప్లాట్కు వచ్చినట్లుగా నిర్ధారించారు. అంతే కాకుండా రాత్రి 11 గంటల సమయంలో తల్లీకొడుకులు హడావుడిగా గేటు దూకి వెళ్లే ప్రయత్నంలో అపార్టుమెంట్ వాచ్మెన్ గమనించినట్లుగా విచారణలో తేలింది. రజితకుమారి మెడలోని బంగారు గొలుసు, ఆమె బ్యాగ్లోని నగదు మాయమైనట్లుగా గుర్తించారు. దీంతో డబ్బు, నగలు కోసమే రజితకుమారిని హత్యచేసి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే సుష్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. క్లూస్ టీమ్ను కూడా రంగంలోకి దింపి నిందితుల వేలిముద్రలను సేకరించారు. అమెరికాలో ఉన్న కుమార్తెలు వచ్చే వరకు రజిత మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. నగదు, నగల కోసం హత్య చేశారా? అనుమానితులను విచారిస్తున్న పోలీసులు -
వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది!
తెన్నేరు మహిళది హత్యేనని తేల్చిన పోలీసులు కంకిపాడు: వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది. ఉంచుకున్నోడే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. అనుమానాస్పద మృతిని పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. కలిసి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది.. ఏలూరు జిల్లా కై కలూరు మండలం వింజరం గ్రామానికి చెందిన జొన్నాదుల మేరీ(33) తనతో వివాహేతర సంబంధం నడుపుతున్న తోకల వినోద్కుమార్ అనే వ్యక్తితో పది రోజులు క్రితం తెన్నేరు గ్రామంలోని ఇటుక బట్టీల వద్దకు పనికి వచ్చింది. తరచూ వీరు ఇక్కడికి పనులకు వస్తుంటారు. అదే విధంగా ఇద్దరూ ఇటుక బట్టీలకు వచ్చారు. ఈనెల 24వ తేదీన బట్టీల వద్ద ఎవరూ లేని సమయంలో వారు ఉండే పాకలో మేరీ, వినోద్కుమార్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వినోద్కుమార్ మెడకు గుడ్డతో బిగించి హత్య చేసినట్లు మృతు రాలి భర్త శివకుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొన్నాడు. ఘటనాస్థలాన్ని సందర్శించిన కంకిపాడు సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్, సిబ్బంది వివరాలు సేకరించి హత్యకేసు నమోదు చేశారు. అనుమానమే కారణమా? గత కొద్ది రోజులుగా మేరీ వేరే వ్యక్తులతో మాట్లాడుతుండటంతో అనుమానం పెంచుకుని ఇదే విషయమై వినోద్కుమార్ తరచూ గొడవలు పడేవాడని స్థానికులు చెబుతున్నారు. హత్యకు ఇది కూడా కారణంగా పోలీసులు భావిస్తున్నారు. లేక మరేదైనా కారణం అయ్యి ఉంటుందా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో.. హత్యకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు వినోద్కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మేరీ మృతి అనంతరం అక్కడి నుంచి కంకిపాడు వచ్చిన వినోద్కుమార్ భోజనం పార్సిల్ను ఓ మిత్రుడికిచ్చి మేరీకి ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి ఉడాయించినట్లు తెలుస్తోంది. భోజనం ఇచ్చేందుకు వెళ్లిన వ్యక్తి ద్వారా హత్య జరిగిన ఘటన వెలుగు చూసిందని స్థానికులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ద్వారా నిందితుడిని గుడివాడ పరిసరాల్లో అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం కంకిపాడు స్టేషన్కు ఉంచినట్లు సమాచారం. -
వడదడ!
కంకిపాడు @ 48.2 డిగ్రీలుభానుడి భగభగలకు పిట్టల్లా రాలుతున్న జనంఉమ్మడి కృష్ణాలో సోమవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగాయి. కాగా రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణాజిల్లా కంకిపాడు, పెనమలూరులో అత్యధికంగా 48.2 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు ఉయ్యూరులో 46.6డిగ్రీలు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఉంగుటూరుల్లో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నంలో 46.3, నందిగామలో 45.9, వీరులపాడులో 45.7, విజయ వాడలో 44.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వచ్చే నాలుగు రోజుల్లో కూడా వడగాడ్పులు విజృంభిస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో సోమవారం తెలుగు పరీక్షతో ప్రారంభమయ్యాయి. జిల్లాలో 25 పరీక్ష కేంద్రాల్లో సోమవారం 1,680 మంది విద్యార్థులను కేటాయించారు. అందులో 1,298 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు విద్యార్థుల హాజరు శాతం 77.3గా ఉంది. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ సోమవారం పరిశీలించారు. పటమట కేబీసీజెడ్పీ బాలుర హైస్కూల్, సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం హైస్కూల్, ముత్యాలంపాడులోని జీఎస్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల తదితర పరీక్ష కేంద్రాలను ఆమె తనిఖీ చేసి పరిశీలించారు. అలాగే మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 15 పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. సోమవారం ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణానదిలో దూకి యువకుడు మృతి చెందిన సంఘటన వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుర్తు తెలియని యువకుడు కృష్ణానదిలో కనిపించటంతో సోమవారం ఉదయం బ్యారేజీ సమీపంలోని వ్యక్తులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా ఆదివారం రాత్రి నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉన్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు. దీనిపై వన్టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు వన్టౌన్ పోలీసులకు సమాచారమందించాలని అధికారులు కోరారు. గుణదల(విజయవాడ తూర్పు): మద్యం మత్తులో చేతికందిన కత్తితో తన స్నేహితుడి పై దాడి చేసిన ఘటనలో ఓ వ్యక్తిని మాచవరం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం మసీదు వీధికి చెందిన బండి వంశీబాబు(31) పెయింటింగ్ పనిచేస్తుంటాడు. ఈ నెల 24వ తేదీ రాత్రి పని ముగించుకుని తన స్నేహితులైన రాజు, వెంకట్లతో కలసి స్థానికంగా ఉన్న ఓ బార్ వద్ద మద్యం తాగారు. ఈ సమయంలో వంశీబాబుకు రాజుల మధ్య వాగ్వివాదం తలెత్తింది. క్షణికావేశానికి గురైన వంశీ కూరగాయలు తరిగే కత్తితో రాజుపై దాడికి దిగాడు. ఈ ఘటనలో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. బార్ యజమాని మాచవరం పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజును వైద్యం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. ఉద్రేకంలో కత్తితో దాడి చేసిన వంశీబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
దుర్గమ్మ పంచహారతుల సేవలో కలెక్టర్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఆలయ ప్రాంగణంలో మరిన్ని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దుర్గగుడి అధికారులకు సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ సోమవారం దుర్గమ్మ పంచహారతుల సేవలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు కలెక్టర్ లక్ష్మీశ ఆలయ ప్రాంగ ణానికి చేరుకోగా, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. పంచహారతుల సేవలో పాల్గొన్న అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద దేవస్థాన ఆధ్వర్యంలో నడుపుతున్న ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్న భక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజగోపురం ఎదుట ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులతో మాట్లాడారు. దుర్గగుడి ఈఈ ఎల్. రమా, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026ఆక్రమణలు ఇలా... అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఆలయ పూర్వ ఈఓ డి.భ్రమరాంబ అమ్మవారి అన్నదానానికి సోమవారం రూ.1.01 లక్షల విరాళం సమర్పించారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్ నేరాల నియంత్రణకు అత్యాధునిక ఏఐ సాంకేతికతను వినియోగించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. నేరాలు జరగకముందే ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఖాకీ స్టూడియోను ప్రారంభించింది. అందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్కు ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ కార్యక్రమం సోమ వారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు మాట్లాడుతూ.. సాంకేతికత ఎంత వేగంగా అభి వృద్ధి చెందుతుందో, అంతకంటే వేగంగా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ సాంకేతికంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సరికొత్త మోసాలు నిరంతరం పుట్టుకొస్తూనే ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. నేరం జరగకముందే ప్రజల్లో అవగాహన కల్పించడం మిన్న అనే కోణంతో సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా ఎన్టీఆర్ పోలీస్ ఖాకీ స్టూడియో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. సమాజంలో సైబర్ భద్రత, మహిళల భద్రత, పిల్లల సంరక్షణ, రోడ్డు భద్రతపై ఒక బలమైన బాధ్యతాయుతమైన సంస్కృతిని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు షిరీన్బేగం, కె.జి.వి. సరిత, కె.కృష్ణప్రసన్న, లక్ష్మీనారాయణ, పలువురు సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన శ్రీరామ రాజేష్, భాను దంపతులు సోమ వారం రూ.1,00,116 విరాళం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు ఈ విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ అధికారి బర్మా ప్రసాద్, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బస్టాండ్(విజయవాడ పశ్చిమ): విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సొమవారం సాయంత్రం తనిఖీ చేశారు. బస్టేషన్లోని ఎరైవల్ బ్లాక్, డిపార్చర్ బ్లాక్, సిటీ టెర్మినల్లోని వివిధ ప్లాట్ఫాంలను పరిశీలించారు. వేపవిలో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యలపై ఆర్టీసీ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. మంచినీటి సౌకర్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని చొట్ల తాగునీటి కూలర్లును ఏర్పాటు చేసి ప్రయాణికులకు తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడా లని ఆదేశించారు. బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులకు ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితిల్లో ఉన్న ప్రయాణికులకు వైద్య సేవలు అందించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డెప్యూటీ సీటీఎం పవన్కుమార్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు కచ్చితంగా సమయపాలన పాటించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశించారు. జిల్లాలో పీహెచ్సీల్లో కొత్తగా చేరిన వైద్యులు, యూపీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ఐఎంఏ హాలులో నిర్వహించిన ఈ సమావేశంలో కొత్తగా చేరిన వైద్యులకు విధులపై దిశా నిర్దేశం చేశారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ అభ ఐటీ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) క్రియేట్ చేయా లని, మొదటిగా స్టాఫ్నర్సు లాగిన్లో ఎంటర్ చేసి, వైద్యాధికారి లాగిన్ ద్వారా వారిని పరీక్షించాలని సూచించారు. ఈ సదస్సులో ఉప జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఇందుమతీదేవి, డీఐఓ డాక్టర్ శరత్బాబు, డీపీఎంఓ డాక్టర్ నవీన్, ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ మాధవి నాయుడు, డీపీఓ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఘాట్రోడ్డును ఆలయ అధికారులు మంగళవారం నుంచి మూసివేయనున్నారు. ఘాట్రోడ్డులో జూన్ 12వ తేదీ వరకు మరమ్మతులు కొనసాగనున్నాయి. ఆర్అండ్బీ శాఖ పర్యవేక్షణలో ఈ పనులను చేపట్టినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఘాట్ రోడ్డుపైకి ఎటు వంటి వాహనాలను అనుమతించేది లేదని ఆలయ ఈఓ శీనానాయక్ ప్రకటించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు మహామండపం మెట్లు, లిఫ్టు మార్గం ద్వారా కొండపైకి చేరుకోవాలని ఆలయ అధికారులు సూచించారు. అమ్మవారి దర్శనం అనంతరం మహామండపంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయ మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకోవాలని పేర్కొన్నారు. ఘాట్ రోడ్డు అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల నేపథ్యంలో భక్తులు దేస్థానానికి సహకరించాలని కోరారు. జి.కొండూరు: నాగార్జున సాగర్ కాలువకు వాటా ప్రకారం సాగు నీరు తీసుకురావడంలో పాలకులు విఫలమయ్యారు. కాలువలను కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారు. ఇదే అదునుగా పంటపొలాలకు జీవజలం అందించాల్సిన కాలువలను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. కాలువలను పూడ్చి వెంచర్లలో కలిసేస్తున్నారు. మైనర్, సబ్ మైనర్ కాలువలు పూర్తిగా మాయమైపోతుండగా మేజర్ డిస్ట్రిబ్యూటర్ కాలువలు ఆక్రమణకు గురై రియల్ ఎస్టేట్ వెంచర్లకు ప్రధాన రహదారులుగా మారుతున్నాయి. పూర్వ వైభవం లేక... నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాలువగా పిలవబడే లాల్ బహుదార్ కాలువ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణాజిల్లాలోని చివరి ఆయకట్టు వరకు 179 కిలో మీటర్లు మేర ఉంది. ఈ ప్రధాన కాలువ కింద ఉమ్మడి కృష్ణాజిల్లాలో 4,04,760 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రధాన కాలువ నుంచి మేజర్ డిస్ట్రిబ్యూటర్లు, మైనర్లు, సబ్ మైనర్ కాలువలు తిరువూరు నియోజకవర్గంలో 92 కిలోమీటర్ల మేర, మైలవరం నియోజకవర్గంలో 66.802 కిలోమీటర్లు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో 174 కిలోమీటర్లకు మేర విస్తరించి ఉన్నాయి. అయితే రాష్ట్ర పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాటా కింద రావాల్సిన సాగునీరు సక్రమంగా అండంలేదు. దీంతో పాటు జోన్–3లో ఉన్న చివరి ఆయకట్టుకు ఆసలు నీరే రాకపోవడంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న జోన్–2,3 పరిధిలో కాలువలు దశాబ్దాలుగా నిరుపయోగంగా మారాయి. ఈ కాలువల నిర్వహణను సైతం ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో నిరుపయోగంగా ఉన్న కాలువలను రియల్టర్లు, కాలువలను ఆనుకొని ఉన్న రైతులు ఆక్రమించడంతో అవి కనుమరుగువుతున్నాయి. భవిష్యత్తు ప్రశ్నార్థకమే... సాగర్ కాలువలు మాయమైపోతే భవిష్యత్తులో సాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. సాగర్ కాలువ జోన్–3 పరిధిలోని తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, విజయవాడరూరల్, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచిక చర్ల, వీరులపాడు మండలాల్లో ఎక్కువగా సాగర్ కాలువలు మాయమైపోతున్నాయి. ఒకవేళ చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే జోన్–3 కింద ఉన్న ఈ మండలాల పరిధిలోని సాగుభూమికి ఈ కాలువల ద్వారానే సాగునీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కాలువలు కనుమరుగైపోవడం వల్ల మళ్లీ కాలువలు తవ్వాల్సి వస్తే అదనంగా ఖర్చుతో పాటు నీటి సరఫరా మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. భద్రాచలం నేషనల్ హైవేపై బైఠాయించి ఆందోళన చేస్తున్న రైతులు ఎ.కొండూరు: దీర్ఘకాలంగా రైతులు సాగుచేసుకుంటున్న భూములను ఎంఎస్ఎంఈలకు ఏకపక్షంగా ఇవ్వడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో సోమవారం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. మండలంలోని చీమలపాడు రెవెన్యూలోని రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఉన్న 318 ఎకరాలకు పైగా రైతుల భూములను దొడ్డిదారిన ఎంఎస్ఎంఈలకు పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. మూడు నెలలుగా తమకు ఎలాంటి సమాచారం లేకుండా, ఆన్లైన్లో భూములను తొలగిస్తూ, సర్వే నంబ ర్లను మార్చేస్తూ అధికారులు తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారని రైతులు మండిపడ్డారు. రామ చంద్రాపురం సమీపంలోని రిజర్వు అటవీ భూమిలో చెట్టుపట్టాల కింద సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు అధికారపార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రికార్డుల్లో అటవీ భూమిగా ఉన్నప్పటికీ ఎంఎస్ఎంఈలకు అక్రమంగా ఎలా కేటా యిస్తారని ప్రశ్నించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్పు చేసి ఎంఎస్ఎంఈలకు కట్ట బెట్టేందుకు రికార్డులు తారుమారు చేశారని విమర్శించారు. హడావుడిగా శంకుస్థాపనకు ఏర్పాట్లు ఎంఎస్ఎంఈ సంస్థలకు భూములు పంపిణీ చేసి, ఆ సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేసేందుకు ఆదివారం సాయంత్రం అధికారులు హడావుడిగా ఏర్పాట్లు చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రినుంచే శంకుస్థాపన ఏర్పాట్లను అడ్డుకు న్నారు. అయినప్పటికీ భూములను పంపిణీ చేసేందుకు సోమవారం ఉదయం యత్నించడంతో భద్రాచలం జాతీయ రహదారిపైకి చేరుకొని బైఠాయించి దిగ్బంధించారు. దీంతో అధికారులు ఎంఎస్ఎంఈలకు భూకేటాయింపు వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘ జిల్లా నాయకుడు ఆంజనేయులు, జిల్లా కౌలురైతు సంఘం ప్రధాన కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి.ఆనంద రావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్. సుధాకర్, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.అమ్మిరెడ్డి రైతులకు సంఘీభావంగా నిలిచారు.● మండుటెండ.. ప్రొటోకాల్ తంటా అసలే బెజవాడలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో ఎండ మంటలు పుట్టిస్తోంది. సోమవారం మిట్ట మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బందరు రోడ్డులో పోలీసులు ప్రొటోకాల్ పేరుతో ట్రాఫిక్ను నిలిపేశారు. సీఎం చంద్రబాబు ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న మార్గంతోపాటు రెండో వైపునా వాహనాలను ఆపేశారు. మండుటెండలో వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – కిషోర్, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ 7జాయింట్ కలెక్టర్ ఇలక్కియసాగర్ కాలువలను కనుమరుగు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జోన్–3లో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న చివరి ఆయకట్టుకు కొన్నేళ్లుగా సాగర్ జలాలు రావడంలేదు. కాలువల నిర్వహణ కూడా సక్రమంగా లేదు. ఇప్పటికే పలు చోట్ల కాలువలు పూర్తిగా మాయమయ్యాయి. కాలువలు పూర్తిగా కనుమరుగైతే భవిష్యత్లో ఆయకట్టు ప్రమాదంలో పడుతుంది. – ఏలూరి శివాజీ, వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లా -
కనుమురుగు కష్టం!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నగరంలో డ్రెయినేజీ అస్తవ్యస్తంగా మారింది. అవుట్ ఫాల్, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వర్షాలు వచ్చినప్పుడు మంత్రులు, అధికారులు హడావుడీ చేయడం తప్ప క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు శూన్యం. చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులుగా మారిపోతున్నాయి. ఇక భారీ వర్షం పడితే గంటల తరబడి రోడ్లపైనే మురుగు తిష్టవేస్తోంది. వర్షం పడినప్పుడు కొన్ని రోడ్లలో ప్రయాణించాలంటే ప్రజలు వణుకుతున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించి అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాకాలానికి ముందే మురుగు కాలువల్లో పూడికతీత చేపట్టాల్సిన నగర పాలక సంస్థ అధికారులు నామ మాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. పూడికతీత అంతంత మాత్రమే.. మురుగునీరు, వర్షపు నీటి పారుదలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 142 కిలోమీటర్ల మేర మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్లు, 302 కిలో మీటర్ల మేర మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జెండా చెట్టు, కేఎల్రావు నగర్, కబేళా, నైజాంగేటు సెంటర్ అవుట్ ఫాల్ డ్రెయిన్లు బుడమేరు కాలువలో కలుస్తాయి. డ్రెయిన్లలో సక్రమంగా పూడిక తీయకపోవడంతో మురుగునీటితో పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్నగర్, ప్రకాష్నగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, ఉడా కాలనీ, కండ్రిక ప్రాంతాల నుంచి వచ్చే నీరు కండ్రిక పంపింగ్ స్టేషన్ వాగు ద్వారా బుడమేరులో కలుస్తుంది. ఈ నియోజకవర్గంలో అవుట్ ఫాల్ డ్రెయిన్ వ్యవస్థ సక్రమంగా లేక ఇబ్బందులు తప్పడం లేదు. వరద నీరు డ్రెయిన్ల ప్రవహించకపోగా వెనక్కి తన్ని కాలనీలు, రోడ్లు ముంపుబారిన పడుతున్నాయి. డ్రెయినేజీ అస్తవ్యస్తంగా ఉండటంతో వల్లే రెండేళ్ల కిందట వచ్చిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రధాన డ్రెయిన్లయిన గుంటతిప్ప, పుల్లేరు, బుడమేరులో పూడిక నామమాత్రంగా తీశారు. తూర్పు నియోజకవ ర్గంలో పుల్లేటి కాలువ, గుంటతిప్ప డ్రెయిన్లు ప్రధానమైనవి. ఎల్అండ్టీ అవుట్ పాల్ డ్రెయిన్లు ఉన్నా పనిచేయటం లేదు. మొగల్రాజపురంలో కొండ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు రోడ్ల పైనే తిష్టవేస్తోంది. ప్రధాన డ్రెయిన్లు ప్రవహించే లబ్బీపేట, పిన్నమనేని పాలిక్లినిక్, గాయత్రీనగర్, ఎల్ఐసీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, గుణదల, భారతీనగర్, గురునానక్ కాలనీ, మరుతి కో–ఆపరేటివ్ కాలనీ, ఆటోనగర్, అజిత్సింగ్ నగర్, మధురానగర్, పాయకాపురం, బెంజిసర్కిల్, పంటకాలువ రోడ్డు, తోటవారి వీధి, ఊర్మిళా నగర్, నిర్మల కాన్వెంట్ రోడ్డు, కృష్ణవేణి రోడ్డు, రమేష్ ఆస్పత్రి ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై మురుగు, వర్షపునీరు పొంగి ప్రవహించి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డు ఎక్కడ ఉందో డ్రెయిన్ ఎక్కడ ఉందో తెలియక పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన అవుట్ ఫాల్ డ్రెయిన్లలో ఎప్పటికప్పుడు సిల్టు, వ్యర్థాలను తొలగించడంలో నరగపాలక సంస్థ అధికారులు విఫలం అవుతున్నారు. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారిస్తే తప్ప సమస్య పరిష్కరం అయ్యే మార్గం కనిపించటం లేదు. రూ.7.25 కోట్లతో పనులు ఈ ఏడాది మేజర్ మురుగు కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత పనుల కోసం నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో రూ.7.25 కోట్లతో 128.91 కిలో మీటర్ల మేర పూడికతీత పనులను చేపట్టారు. మేజరు డ్రెయిన్లు 480.02 కిలోమీటర్లు, మీడియం డ్రెయిన్లు 245.01 కిలో మీటర్ల మేర మరమ్మతులు తూతూ మంత్రంగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం సమీపిస్తోంది. డ్రెయిన్లలో పూడికతీత పూర్తిస్థాయిలో జరగడంలేదు. ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలంలో నగర వాసులకు మురుగు కష్టాలు తప్పేలా లేవని పలువురు పేర్కొంటున్నారు. నగరంలో ఎక్కడా పూడికతీత పనులు జరుగుతున్నట్లు కనిపించడం లేదు. రైతు బజార్లలో, టీ స్టాల్ వద్ద, ప్రధాన కూడళ్లలో స్వచ్ఛభారత రేటింగ్ కోసం ఓటీపీల నమోదు ప్రక్రియ మాత్రం భారీగా జరుగుతోంది. వేసవి తాపం వల్ల పారిశుద్ధ్య పనులకు కార్మికుల హాజరు తగ్గింది. అనుకున్నంత స్థాయిలో అదనపు సిబ్బందిని నియమించిన దాఖలాలు లేవు. రుతు పవనాలు త్వరలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా పూడికతీత పనులు జరగడంలేదని భావిస్తున్నా. – బుద్దె రాజా, ప్రధాన కార్యదర్శి, విజయవాడ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) -
అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న ప్రతి అర్జీపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా ఆయా సమస్యలను పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ఆదేశించారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహంతో కలిసి అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దే శించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. నిబంధనలను పాటిస్తూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 124 అర్జీలు అందాయన్నారు. వీటిలో పోలీస్ శాఖకు సంబంధించి అత్యధికంగా 24 అర్జీలు అందాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 23, ఎంఏయూడీ 14, పంచాయతీ రాజ్ 11, సాంఘిక సంక్షేమం 9, విద్య 8, పౌర సరఫరాలు 6, డీఆర్డీఏ 5, ఉపాధికల్పన 4, ఏపీ సీపీడీసీఎల్ 3, హెల్త్ 2, గ్రామీణ నీటి సరఫరా 2, విభిన్న ప్రతిభావంతులు 2, సహకార 2, కార్మిక 2, హౌసింగ్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ ఇంజినీర్, అటవీ, వక్ఫ్ బోర్డు, ప్రజా రవాణా, దేవదాయ శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ స్వీకరించినట్లు జేసీ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ -
ఏపీ హైకోర్టు పరీక్షకు 541 మంది హాజరు
పెడన: మండలంలోని నందమూరు శ్రీవాసవి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఆదివారం ఏపీ హైకోర్టు పరీక్ష–2026 ప్రశాంతంగా జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ బీఆర్ఎస్ రెడ్డి, అడ్మిన్ పి. అశోక్కుమార్ తెలిపారు. మూడు షిప్టులలో జరిగిన ఈ పరీక్షకు 540 మందికి 364 మంది హాజరవ్వగా 176 మంది ఆబ్సెంట్ అయ్యారన్నారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు జరిగిన పరీక్షకు 180 మందికి 120 మంది హాజరవ్వగా 60 మంది రాలేదని తెలిపారు. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు జరిగిన పరీక్షకు 180 మందికి 118 మంది హాజరవ్వగా 62 మంది ఆబ్సెంట్ అయ్యారని పేర్కొన్నారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు జరిగిన పరీక్షకు 180 మందికి 126 మంది హాజరవ్వగా 54 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మచిలీపట్నంఅర్బన్: స్థానిక వైజేఆర్ డీఎంఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఏపీ హైకోర్టు సర్వీసెస్ పరీక్ష–2026 ప్రశాంతంగా జరిగిందని సెంటర్ హెడ్ ఎండీ నజీబ్ అహ్మద్ తెలిపారు. మొత్తం 300 మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, 177 మంది హాజరై పరీక్ష రాశారని, 123 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. మొదటి షిప్ట్ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు నిర్వహించగా, 100 మందికి 65 మంది హాజరై, 35 మంది గైర్హాజరయ్యారు. రెండో షిఫ్ట్లో 100 మందికి 52 మంది హాజరై, 48 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మూడో షిఫ్ట్లో 100 మందికి 60 మంది హాజరై, 40 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. -
బండి తీయాలంటే భయం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): పెట్రోల్, డీజిల్ ధరల బాదుడుతో సామాన్యుడు బండి తీయా లంటే భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రజల ఆదాయం పెరగకున్నా ఇంధన ధరలు ౖపైపెకి ఎగబాగుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ రూ.114.40, లీటర్ డీజిల్ ధర రూ.102.13కు చేరింది. ధరల ప్రభావం నిత్యావసరాలు, వ్యవసాయ, రవాణా రంగంపై తీవ్రంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 186, కృష్ణాలో 175 బంకులు ఎన్టీఆర్ జిల్లాలో పలు కంపెనీల పరిధిలో 186 బంకులు పని చేస్తున్నాయి. వీటితో ప్రతి రోజూ 8 లక్షల లీటర్ల డీజిల్, 6 లక్షల లీటర్ల పెట్రోల్ సరఫరా అవుతోంది. కృష్ణా జిల్లాలో 175 బంకులు ఉన్నాయి. డీజిల్ 3.30 లక్షల లీటర్లు, పెట్రోలు 2.30 లక్షల లీటర్లు విక్రయిస్తున్నారు. బాదుడుకు తెర తీసింది ఈ నెల 15న ప్రభుత్వం తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ఆ తర్వాత 19న మరోసారి పెంచింది. శనివారం ఉదయం ఇంకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి బాదుడుకు తెరతీసింది. మూడు విడతల్లో లీటర్ పెట్రోల్పై రూ. 5.20, లీటర్ డీజిల్పై రూ. 5.05 వరకు ధర పెరిగింది. ఈ ధరల పెరుగుదల ఇంతటితో ఆగుతుందన్న నమ్మకం లేదని, రాబోయే రోజుల్లోనూ పెరిగే అవకాశం ఉందని బంక్ల యాజమాన్యం చెబుతోంది. నెలవారీ ఆదాయం పెరగడం లేదని, ఖర్చులు అధికమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. నెలకు సగటున 30 లీటర్ల పెట్రోల్ వినియోగించే సామాన్యుడిపై ధరల పెరుగుదల కారణంగా డైరెక్ట్గా రూ. 150 భారం పడుతుంది. మొత్తంగా ధరల పెంపు కారణంగా జిల్లాలో వాహనచోదకులపై ఏటా రూ. 250 కోట్ల పై చిలుకు అదనపు భారం పడుతుంది. ఆకాశన్నంటుతున్న నిత్యావసరాలు పెట్రోల్, డీజిల్ ధరలు రవాణా రంగంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపడంతో నిత్యావసరల ధరలు పెరిగిపోయాయి. కూరగాయల ధరలు అధికమయ్యాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. చిరు ఉద్యోగులు అవస్థ పడుతున్నారు. ఆదాయంలో అధిక భాగంగా గ్యాస్, నిత్యావసరాలు, కూరగాయలకే ఖర్చవుతుందని సామాన్యులు వాపోతున్నారు. ఆటో, మోటారు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులన్నీ యంత్రాలతోనే చేయాల్సిన పరిస్థితి. ప్రతి పనికి ట్రాక్టర్ వినియోగించాల్సి రావడం.. డీజిల్ ధర పెరగడంతో పొలాలు దుక్కులు, పంటల సాగుకు సిద్ధం చేసేందుకు అధికంగా పెట్టుబడి అవుతుందని ఆందోళన చెందుతున్నారు. గతేడాది గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి చూశామని, తొలకరి ప్రారంభానికి ముందే డీజిల్ ధరలు పెంచితే వ్యవసాయం చేయడం ఎలా అని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు పెట్రోల్ ధర రూ. 109.21 డీజిల్ ధర రూ. 97.07 గా ఉంది తేదీ పెట్రోల్ డీజిల్ 15న 112.50 100.22 19న 113.45 101.17 23న 114.40 102.13 -
గుణదల కొండకు పోటెత్తిన భక్తజనం
గుణదల(విజయవాడ తూర్పు): వేసవి సెలవుల నేపథ్యంలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తజనం పోటెత్తారు. ఓ వైపు భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా 43 డిగ్రీల ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా యాత్రికులు తమ భక్తి ప్రపత్తులను చాటుతున్నారు. క్రైస్తవ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కాలినడకన కొండ శిఖరాగ్రానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సాధారణ రోజుల్లో.. దేశంలో రెండో అతి పెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన గుణదల ఆలయంలో ప్రతీ రోజు భక్తులు వేలాదిగా వస్తుంటారు. కొండ ఎగువన ఉన్న మరియమాతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. కొబ్బరికాయలు కొట్టడం, చెట్లకు ఉయ్యాలలు కట్టడం, కొవ్వొత్తులు వెలిగించడం, పసిపిల్లలకు నామకరణాలు వంటి కార్యక్రమాలు ప్రతి నిత్యం జరుగుతుంటాయి. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం పుణ్యక్షేత్ర గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. ప్రధానాలయంలో సైతం సమష్టి దివ్యబలి పూజలు, దివ్య సత్ప్రసాద ఆరాధనలు జరుగుతుంటాయి. పుణ్యక్షేత్రానికి వచ్చిన యాత్రికులంతా తప్పని సరిగా కొండ శిఖరాగ్రానికి చేరుకుని అక్కడ ఉన్న ఏసుక్రీస్తు శిలువను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో జరిగే మేరీమాత ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. వేసవి సెలవుల కారణంగా.. విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం సెలవులు ఉన్న కారణంగా సుదూర ప్రాంతాల నుంచీ యాత్రికులు గుణదల పుణ్యక్షేత్రానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు దినాల్లో భక్తుల సంఖ్య మరింత గణనీయంగా పెరుగుతుంది. సాధారణ రోజుల్లో, వాతావరణం అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో యాత్రికుల రాకపోకలు చెప్పుకోదగిన విధంగా ఉంటాయి. కానీ ఈ ఏడాది ఎండలు మండిపోతున్న క్రమంలో ప్రజలు వేసవి తాపానికి ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ గదులకే పరిమితమై ఎండ తీవ్రత నుంచీ తమను తాము రక్షించుకుంటున్నారు. ఈ పరిస్థితులలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి రికార్డు స్థాయిలో యాత్రికులు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మండుటెండల్లో సైతం గుణదల కొండకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణ.. వేసవి తీవ్రతకు భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయ పరిసరాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పుణ్యక్షేత్ర ప్రాంగణాలన్నింటితో పాటు కొండ ఎగువ ప్రాంతాలలో సైతం తాగునీటి వసతి కల్పించారు. ఎండ తీవ్రతకు అనారోగ్యానికి గురికాకుండా యాత్రికుల కోసం పుణ్యక్షేత్ర ఆవరణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీ మండుటెండను సైతం లెక్కచేయని భక్తులు కొండ శిఖరాగ్రాన ప్రత్యేక ప్రార్థనలు వేసవి సెలవుల కారణంగా గత నెల రోజులుగా గుణదల మేరీమాత ఫుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారాలు, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య మరింతగా ఎక్కువగా ఉంది. ఎండలను దృష్టిలో ఉంచుకుని పుణ్యక్షేత్రానికి చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. తాగునీరు, చలువ పందిళ్లు సిద్ధం చేశాం. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాం. – యేలేటి విలియం జయరాజు, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ -
అనుమానాస్పద స్థితిలో బిహార్ వాసి మృతి
చిట్టేల(వత్సవాయి): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం గ్రామ శివారులోని రైస్మిల్లు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బిహార్ రాష్ట్రానికి చెందిన రామ్కిషన్మహతి(42) నెల రోజుల క్రితం రైస్మిల్లులో హమాలీగా పని చేయడానికి వచ్చాడు. నెల రోజులు పనిచేసిన తరువాత వేరే చోట పనికి వెళ్లాడు. మరలా తిరిగి శనివారం సాయంత్రం మరలా చిట్టేల గ్రామంలో గతంలో పనిచేసిన రైస్మిల్లు వద్దకే వచ్చాడు. రాత్రి 9 గంటల సమయం వరకు తోటి కూలీలతో పని చేసి భోజనం కూడా చేశాడు. కాగా ఆదివారం సాయంత్రం రైస్మిల్లు సమీపంలోని చెట్టు కింద రామ్కిషన్మహతి మృతదేహాం ఉండడాన్ని తోటి కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జగ్గయ్యపేట ఎస్ఐ శంకర్నాయక్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్య పేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసునమోదు చేశారు. అయితే మృతదేహంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. -
వృక్ష విలాపం!
ఒకప్పుడు కృష్ణమ్మ ఒడిలో పచ్చని చెట్లు, చల్లని గాలులతో కళకళలాడిన విజయవాడ నేడు కాంక్రీట్ జంగిల్లా మారిపోయింది. అభివృద్ధి, రోడ్ల విస్తరణ పేరుతో మహా వృక్షాలను కూల్చేస్తున్నారు. దీని ఫలితమే నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. స్వచ్ఛమైన గాలి కరువై ఊపిరి పీల్చడం కష్టమవుతోంది. లబ్బీపేట(విజయవాడతూర్పు): పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్న విజయవాడ నేడు కాంక్రీట్ జంగిల్లా మారిపోయింది. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ రణగొణ ధ్వనులే. జనాభా పెరుగుతున్న కొద్దీ పచ్చదనం మాయమవుతోంది. ఉన్న కొద్దిపాటి చెట్లు కూడా ఎక్కువగా స్థానికేతర జాతులే. ఈ సంఖ్య తగ్గే కొద్దీ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రభావం పడుతుంది. పరోక్షంగా భూగర్భ జలాలు, వర్షపాతం తగ్గడం, అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. జనవాస ప్రాంతాల్లో కనీసం 20 శాతం మేర మొక్కలు ఉండాల్సి ఉండగా, నగరంలో అత్యంత తక్కువ నాలుగు శాతమే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. నగరంలో ప్రతి వృక్ష విలాపంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. అరకొరగానే.. ఒకప్పుడు ఎంజీ రోడ్డు, కార్ల్మార్క్స్ రోడ్లతోపాటు, ఇతర ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపులా పచ్చని చెట్లు ఉండేవి. ట్రాఫిక్ పెరగడంతో రోడ్ల విస్తరణ పేరుతో వాటిని కొట్టేశారు. నగరపాలక సంస్థ ఉద్యానశాఖ గతంలో నిర్వహించిన సర్వేలో కేవలం 22,407 చెట్లు మాత్రమే ఉన్నట్లు తేలాయి. చిన్నా చితకా కలిపి మరో 30 వేలు వరకూ ఉండొచ్చని అంచనా. నగరం 60 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. దీనికి తగ్గట్లుగా మొక్కలు లేవు. స్థానిక జాతులైన మర్రి, రావి, మేడి, వేప, మారేడు, వెలగ, గానుగ, తుమ్మ, జువ్వి, గంగరావి, నేరేడు, ఉసిరి, కుంకుడు, కొబ్బరి, తాటి, మద్ది వంటి వాటి సంఖ్య తక్కువగా ఉన్నట్లు తేలింది. ఎర్రతురాయి, పచ్చతురాయి, నిద్రగన్నేరు, జామాయిల్, అశోక, బురుగుడు వంటివి స్థానికేతర రకాల కిందకు వస్తాయి. దెబ్బతింటున్న జీవ వైవిధ్యం స్థానిక వృక్షజాతులతో చాలా ప్రయోజనాలు ఉన్నట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వీటిపైనే పక్షులు ఎక్కువగా వాలతాయి. సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తదితర వాటిని ఇవి ఆకర్షిస్తుంటాయి. వీటి సంఖ్య తగ్గేకొద్దీ జీవవైవిధ్యం దెబ్బతింటుంది. నగరంలో గతంలో కనిపించే ఎన్నో పక్షులు నేడు మచ్చుకై నా లేవు. పిచ్చుకల్లో ఐదు రకాలు ఉండేవని, వాటిలో ఒకటి మాత్రమే కనిపిస్తోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అవీ నగర శివారు ప్రాంతాల్లోనే అంటున్నారు. గుణదల కొండపై గతంలో రాబందులు ఉండేవంటున్నారు. ఒకప్పుడు నగరంలో విహ రించే నేత పక్షి, నేడు దివిసీమకే పరిమితమైంది. పక్షిజాతులు అంతరించి జీవవైవిధ్యం దెబ్బతింటున్నట్లు పర్యావరణ నిపుణులు చెపుతున్నారు. -
విద్యుదాఘాతంతో రామాలయం ట్రస్ట్ కార్యదర్శి మృతి
పెనమలూరు: పోరంకి శ్రీనగర్కాలనీలో ఉన్న శ్రీకోదండరామాలయం ట్రస్ట్ కార్యదర్శి చక్రహరి కనకరాజు(75) విద్యుదాఘాతానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 19న కనకరాజు ఇంటి వద్ద భవన నిర్మాణ కార్మికుడు వెంకటశివరామ్ ఇనుప రాడ్లను భవనం పై అంతస్తుకు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు ఇనుప రాడ్లు తగిలాయి. వెంటనే అతను రాడ్లు వదిలేయటంతో కింద ఉన్న కనకరాజుపై పడ్డాయి. ఈ ఘటనలో కనకరాజు విద్యుదాఘాతానికి గురై ఒళ్లు కాలి గాయపడ్డారు. ఆయనను వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకై తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కనకరాజు పోరంకి శ్రీనగర్కాలనీలో కోదండ రామాలయం నిర్మాణంలో విశేష కృషి చేశారు. అదే విధంగా రామాలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కనకరాజు మృతికి ట్రస్ట్ సభ్యులు, స్థానికులు ప్రగాఢ సంతాపం తెలిపి నివాళులర్పించారు. కంకిపాడు: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని తెన్నేరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు, పోలీసుల కథనం మేరకు.. కై కలూరు మండలం ఇంజరం ప్రాంతానికి చెందిన జొన్నాదుల మేరీ(33), వినోద్తో కలిసి తెన్నేరులో ఇటుక బట్టీల వద్ద పనిచేసేందుకు 10 రోజుల క్రితం వచ్చింది. ఆదివారం మేరీ ఇటుక బట్టీల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యా.. ఆత్మహత్యా.. మేరీ మృతిపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మేరీ కలిసి ఉంటున్న వ్యక్తి వినోద్ ఎవరు, అతని నేపథ్యం ఏంటి? అనే కోణంతో పాటుగా ఆత్మహత్యకు పాల్పడిందా, లేదా హత్యకు గురైందా ?, అయితే అందుకు గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కంకిపాడు సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్ సమాచారం సేకరిస్తున్నారు. హనుమాన్జంక్షన్రూరల్: బాపులపాడు మండలం కోడూరుపాడులో నిర్వహిస్తున్న మట్టి అక్రమ తవ్వకాల్లో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని రాళ్లకుంట చెరువు నుంచి మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అతి వేగంతో నడపటంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ చందు వరుణ్(21) తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాక్టర్ నుంచి కింద పడిన వరుణ్ కాలు విరగటంతో చికిత్స నిమిత్తం హుటాహుటినా విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసుకున్న వరుణ్ తన తండ్రికి చేదోడువాదోడుగా ఉండేందుకు ట్రాక్టర్ నడుపుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
మొక్కలతో పర్యావరణానికి మేలు
మొక్కలు పర్యావరణాన్ని రక్షిస్తే, అది మనల్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం బాధ్యతగా గుర్తించాలి. నేను పదేళ్లుగా మొక్కలు పంపిణీ చేస్తున్నా. వర్షాకాలం ప్రారంభంలో తమ ఆస్పత్రికి వచ్చే ప్రతిరోగికి ఒక పండ్ల మొక్కను అందజేస్తా. అంతేకాదు గ్రామాలు, కాలనీల్లో మొక్కలు పెంచేందుకు ఉచితంగా అందజేస్తున్నా. పర్యావరణం బాగుంటేనే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవిస్తాం. – డాక్టర్ కె. వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణులు -
పెట్రోల్ ధరల విషయంలో చంద్రబాబు హామీ ఏమైంది
పెనుభారం ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రోజు ప్రజలపై అసలైన బాదుడును మొదలుపెట్టారు. రోజుకో రూపాయి చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. ఎన్నికల ముందు చెప్పిందొకటి ఇప్పుడు చేస్తోందకటి. పెంచిన ధరలు తగ్గించాలి. – కామరాజ్హరీష్, బీసీ నేత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో మోదీ మోసం సరే.. చంద్రబాబు హామీ ఏమైంది? వీటి ధరలను వరుసగా పెంచడం దేశ ప్రజలను మోసం చేయడమే. ప్రభుత్వం సీఎన్జీ ధరలను రెండుసార్లు, పెట్రోల్, డీజిల్ ధరలను మూడుసార్లు పెంచింది. ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరల గురించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించకపోగా వరుసగా పెంచుతున్నారు. రాష్ట్రం విచ్చలవిడిగా పన్నులు విధించడమే ధరల పెరుగుదలకు కారణం. అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ధరలు తగ్గించాలి. –దాది శ్రీనివాసరావు, ఇఫ్టూ -
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష
గుడివాడరూరల్: బైండోవర్లో ఉన్న వ్యక్తి మళ్లీ నేరానికి పాల్పడటంతో జైలుకు పంపిన సంఘటన జిల్లాలో తొలిసారి చోటు చేసుకుందని గుడివాడ డీఎస్పీ పాలా శ్రీనివాస్ తెలిపారు. స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్లో సీఐ కొండపల్లి శ్రీనివాస్తో కలసి ఆదివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ స్థానిక వాంబేకాలనీకి చెందిన గొల్లపల్లి పోతురాజు గతంలో పలు నేరాల్లో నిందితుడన్నారు. భవిష్యత్లో నేరాలకు పాల్పడకుండా సెక్షన్ 129(ఈ) బీఎన్ఎస్ఎస్ ప్రకారం ఏడాది పాటు బైండోవర్ చేశామని చెప్పారు. 444 మందిపై బైండోవర్ కేసులు.. పోతురాజు పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఈనెల 15న మళ్లీ నేరానికి పాల్పడటంతో కేసు నమోదు చేసి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(తహసీల్దార్)కు నివేదించామన్నారు. ష్యూరిటీ, డబ్బు కట్టలేకపోవడంతో డిటెన్షన్ ఉత్తర్వుల జారీ కాగా వన్టౌన్ సీఐ కొండపల్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి జైలుకు తరలించారని చెప్పారు. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 444 మంది నిందితులపై బైండోవర్ కేసులున్నాయన్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశాల మేరకు పట్టణ ప్రజల శాంతిభద్రలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. బైండోవర్లో ఉన్న వ్యక్తులు మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇది గుణపాఠమని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. ● ఈ నెల 13న కారు ప్రమాదంలో తల్లి గంగాభవాని మృతి ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు కిలేశపురం(ఇబ్రహీంపట్నం): కిలేశపురం గ్రామంలో ఈనెల 13న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుంటుపల్లి వెంకట జితేంద్ర (22) చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఈనెల 13న తన తల్లి గుంటుపల్లి గంగాభవానీతో కలిసి ఇంటికొచ్చిన బంధువులకు శుభశకునం కోరుతూ కారుకు ఎదురొచ్చిన సమయంలో మరో కారు ప్రమాదంలో తల్లి ఆరోజే మృత్యువాత పడగా కుమారుడు వెంకట జితేంద్ర తీవ్రమైన గాయాలతో చికిత్స కోసం వైద్యశాలలో చేర్చారు. 10 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచాడు. పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం యువకుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 10 రోజుల వ్యవధిలో తల్లి కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బీటెక్ చదువుతున్న కుమారుడు ప్రయోజకుడై కుటుంబానికి బాసటగా నిలుస్తారనే తండ్రి రమేష్ ఆశించిన తరుణంలో భార్యతో పాటు కుమారుడిని కోల్పోవడంతో అతనిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. శోకసంద్రంలో నిండిన ఆ కుటుంబం గ్రామస్తులతో కలసి అశ్రునయనాలతో వెంకట జితేంద్ర మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
మధురానగర్(విజయవాడసెంట్రల్): రైల్వే మిక్స్డ్ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల 25 వసంతాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆదివారం సత్యనారాయణపురం రైల్వే కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగాయి. దేశ విదేశాలలో వివిధ హోదాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవా రంగాలలో స్థిరపడిన 2000–2001 బ్యాచ్ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకుని తమ అనుభవాలను పంచుకున్నారు. 25 సంవత్సరాల తరువాత కలుసుకోవటంతో ఒకింత ఆనందం, ఉద్వేగానికి లోనయ్యారు. విద్యార్థి దశలో కలిసి చదివిన స్నేహితులు పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పూర్వ విద్యార్థులు సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. విద్యార్థి దశలో ఏర్పడిన స్నేహబంధాలు జీవితాంతం నిలిచిపోతాయని పేర్కొన్నారు. కాలం మారినా అనుబంధాలు మారవని, ఇలాంటి కలయికలు మానసిక ఆనందాన్ని నూతన ఉత్తేజం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలు ఉత్సాహంగా జరిగాయి. 25 వసంతాల స్నేహబంధాన్ని గుర్తు చేసుకుంటూ సిల్వర్ జూబ్లీ కేక్ కట్ చేసి మిఠాయిలు, జ్ఞాపికలు పంపిణీ చేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించిన పూర్వ విద్యార్థులు డాక్టర్ నోవా సందీప్, లక్ష్మీకాంత్, రాజేంద్ర, ధరన్, సాయి శివలను అభినందించారు. -
కార్తికేయుని ఆలయంలో భక్తుల రద్దీ
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమాన్జంక్షన్రూరల్: చైన్నె – కోల్కతా జాతీయ రహదారిపై హనుమాన్జంక్షన్ శివారులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. సినిమా స్టంట్స్ను తలపించేలా కారు ఒక్కసారిగా భారీ శబ్దంతో గాల్లో పైకి లేచి, మూడు పల్టీలు కొట్టి రోడ్డుపై పడింది. ఏలూరు వైపు వెళ్తున్న కారు హైవే మధ్యలోని డివైడర్ను దాటుకుని అవతల వైపు రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు. కారు నుజ్జునుజ్జకావటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంతటి ఘోర ప్రమాదం జరిగి కారు ధ్వంసమైనప్పటికీ డ్రైవర్కు స్వల్ప గాయాలు మినహా, ఆ కారులోని మిగిలిన ప్రయాణికులకు ఒక్క దెబ్బ కూడా తగలలేదు. పల్టీలు కొట్టిన కారులో నుంచి అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటకు రావటం ప్రమాద ఘటన చూసిన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. నెల్లూరు నుంచి ఏలూరు వెళ్తున్న ఈ కారు టైర్ పంక్చర్ కావటంతో ప్రమాదం జరిగింది. కర్ణాటకలో విజయవాడ టెక్కీ మృతి యశవంతపుర: సరదాగా వీకెండ్ గడుపుదామనుకున్న టెక్కీ మృతి చెందారు. నదిలో రబ్బరు బోటులో వేగంగా విహరించే సమయంలో అనూహ్యంగా విద్యుత్ షాక్ కొట్టి ఐటీ ఇంజినీర్ మృతి చెందిన ఘటన కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లా జోయిడా తాలూకా గణేశగుడి వద్ద కాళీ నదిలో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన మహేశ్ (27) మృతుడు. ఈయన బెంగళూరులో టెక్కీగా పనిచేసేవాడు. వీకెండ్ కావడంతో నలుగురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఓ రిసార్ట్లో బస చేసి, అక్కడే నదిలో రాఫ్టింగ్ చేయడానికి వెళ్లారు. నదిలో నుంచి పడవలోకి ఎక్కుతుండగా పక్కనే రిసార్టుకు చెందిన పెద్ద పంపుసెట్టు నుంచి విద్యుత్ నీటిలో ప్రసారమైంది. దీంతో మహేశ్కు షాక్ తగిలి నీట మునిగి మరణించాడు. మిగతా వారికి కూడా షాక్ తగిలింది కానీ అంత ప్రభావం చూపించలేదు. అతడి మృతదేహాన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. రాఫ్టింగ్ చేసే ప్రాంతాలలో ఇలాంటి పంపుసెట్ల అమర్చవద్దని స్థానికులు హెచ్చరించినా రిసార్ట్ యాజమాన్యం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
వాన.. ఉపశమనం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వారం రోజులుగా తీవ్రమైన ఎండలతో నిప్పుల కొలిమిలా మారిన నగరం ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో పాటు, ఈదురు గాలులు వీయడంతో ఒక్కసారిగా చల్లపడింది. అప్పటి వరకూ బయటకు రావడానికి సాహసించని నగర ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం పొందారు. వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతున్నాయి. పడమటి గాలులు వీయడంతో పలువురు వడదెబ్బకు గురయ్యారు. కొందరు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందగా, మరికొందరు మృత్యువాత పడ్డారు. రాత్రి 10 గంటల వరకూ వేడి గాలులు వీస్తూనే ఉండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు సాహసించలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కురిసిన చిరుజల్లులతో వాతావరణం ఒక్కసారిగా చల్ల బడి ప్రజలకు ఊరట కలిగింది. అయితే ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగాయి. కస్తూరిభాయిపేటలో విద్యుత్ వైర్లు తెగడంతో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. -
పర్యావరణానికి ముప్పు
గ్రీనరీని అభివృద్ధి చేయకండా నగరం కాంక్రిట్ జంగిల్లా ఉంటే, రానున్న రోజుల్లో పర్యావరణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పుటికే అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో అనువైన ప్రాంతాల్లో మొక్కలు పెంచాలి. గ్రీన్ హైవేస్ పాలసీ ఆధారంగా జాతీయ రహదారుల వెంబడి ఎన్హెచ్ఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కిలోమీటర్కు 333 మొక్కలను పెంచాల్సి ఉంది. మొక్కలు పెంచడంతో పక్షుల జాతులను కాపాడుకొని, జీవ వైవిధ్యానికి ముప్పలేకుండా చూడవచ్చు. – డాక్టర్ తుమ్మల శ్రీకుమార్, పర్యావరణ నిపుణులు -
ప్రశాంతంగా ముగిసిన యూపీఎస్సీ పరీక్ష
వన్టౌన్(విజయవాడపశ్చిమ): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని విజయవాడలో 23 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 10,119 మంది అభ్యర్థులను కేటాయించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, పరీక్ష అబ్జర్వర్లు కాటమనేని భాస్కర్, వాకాటి కరుణ నగరంలోని వివిధ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకూ జరిగింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ అభ్యర్థ్ధులను లోపలకు అనుమతించారు. 10,119 మంది అభ్యర్థులకు ఉదయం పేపర్–1కు 6,137 (60.65 శాతం) మంది, మధ్యాహ్నం పేపర్–2కు 6,073 (60.02 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జేసీ ఇలక్కియపరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అన్ని కేంద్రాల వద్ద వసతులు ఏర్పాటు చేశారు. సమయం దాటడంతో గేట్ వద్ద యువతి నిలిపివేత నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభమయ్యే అరగంట ముందుగా గేట్లను మూసివేయాలని యూపీఎస్సీ ఆదేశించింది. ఆ ప్రకారం విజయవాడలోని కేబీఎన్ కళాశాల వద్ద అధికారులు సరిగ్గా తొమ్మిది గంటలకు గేట్ మూసివేశారు. కొద్ది సేపటికి గుంటూరుకు చెందిన యువతి గేట్ వద్దకు చేరుకుంది. నిబంధనల ప్రకారం గేట్ తీయడానికి లేదని అధికారులు ప్రకటించారు. దాంతో ఆ యువతి తీవ్ర నిరాశకు గురైంది. అయితే ఆమె గంట ముందుగానే అక్కడకు చేరుకొని కారులో చదువుకుంటూ ఉండిపోయిందని తెలిసింది. -
జాతీయ స్థాయి నాటకోత్సవాలు ప్రారంభం
గుడివాడటౌన్: కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటకోత్సవాలు ఆదివారం ఎస్పీఎస్ హైస్కూల్ గ్రౌండ్స్లో ప్రారంభమయ్యాయి. 26వ తేదీ వరకు నాటకోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 24వ తేదీ మహాపురుషుడు మండలి, 25న కపిరాజు, సహన, 26వ తేదీ అమ్మచెక్కిన బొమ్మ, ఖడ్గ తిక్కన నాటికలు ప్రదర్శిస్తారన్నారు. ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకు చెందిన ప్రముఖ నాటక సంస్థలు ఇందులో పాల్గొంటాయన్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి ప్రదర్శనలు ప్రారంభమవుతాయని తెలిపారు. గుడివాడ టౌన్: రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీ కమిషనర్ బాబు.ఎ పాలనలో వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు అన్నారు. స్థానిక బస్స్టాండ్ సమీపంలోని కోడె ఫంక్షన్ హాలులో ఆదివారం అసోసియేషన్ జిల్లా సభ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ విభజించు – పాలించు విధానం అమలు చేస్తూ ఆయన ఉద్యోగుల మధ్య, సహకార సంఘాల బ్యాంకులకు చెందిన అనేక మంది మేనేజర్లు, సూపర్ వైజర్ల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని చెప్పారు. పాత కంప్యూటర్లను ఉద్యోగులకు ఇచ్చి డిజిటలైజేషన్ అంటూ ఇబ్బందులపాల్జేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఖాతాల్లో ఎక్కువ వడ్డీ చూపించి వారికి రుణాలు భారంగా ఉండేలా చేస్తున్నారన్నారు. దీంతో రైతులు సహకార సంఘాల ఉద్యోగస్తులను నమ్మే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం జీవో నంబర్ 322ను వెంటనే రద్దు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు హనుమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్.రమేష్బాబు, కోశాధికారి నాగరాజు, సుజాత తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): బక్రీద్ సందర్భంగా జంతువుల అక్రమ రవాణా, వధ వంటి నేరాలను అరికట్టేందుకు పోలీస్శాఖ నుంచి నోడల్ అధికారిగా అదనపు డీసీపీ జి. రామకృష్ణను నియమించారు. ఈ మేరకు సీపీ రాజశేఖరబాబు ఆదేశాలు జారీ చేశారు. జంతు పరిరక్షణ చట్టాలను అమలు పరిచే దిశగా హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ తరఫున ఈ నియామకం చేసినట్లు తెలిపారు. నగరంలో ఎక్కడైనా జంతువులపై జరుగుతున్న నేరాలు, హింసపై నోడల్ అధికారి 94904 93192కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ ఆధ్వర్యాన ఆదివారం నగరంలోని రైల్వేస్టేషన్లో హైడ్రేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వర్షా సోనాకియా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వలంటీర్లతో కలసి 1వ నంబర్ ప్లాట్ఫాంలో మజ్జిగ పంపిణి చేశారు. ఆమె మాట్లాడుతూ వేసవిలో ప్రయాణికులు, సిబ్బంది డీహెడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉందన్నారు. వారి ఆరోగ్యం దృష్ట్యా రైళ్లలోని ప్రయాణికులు, సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సెక్రటరీ నిహారిక, జాయింట్ సెక్రటరీ జ్ఞానప్రసూన, విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వడగాడ్పులకు ప్రజలు విలవిల
లబ్బీపేట(విజయవాడతూర్పు): వేసవి తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వడడ్పులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. కూలీ పనులకు వెళ్లి కొందరు, యాచకులు మరికొందరు, అత్యవసర పనులపై తిరిగే ఇంకొందరు వడగాడ్పుల ప్రభావంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజుల్లో దాదాపు 28 మంది మృతికి వడదెబ్బ కారణంగా భావిస్తున్నారు. శనివారం విజయవాడ నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురిని ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీకి తీసుకురాగా, అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. విజయవాడ వన్టౌన్లో ఒకరు, సత్యనారాయణపురంలో ఒకరు, బస్టాండ్లో మరో ఇద్దరు, ఇబ్రహీంపట్నంలో ఒకరు, గంపలగూడెం మండలం గాదెవారిగూడెంలో ఒకరు, గంపలగూడెం పడమట దళితవాడలో ఒకరు మృతిచెందారు. శుక్రవారం సైతం వడ గాడ్పుమరో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 మంది మృత్యువాత పడ్డారు. విజయవాడ నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను సైతం పోలీసులు మార్చురీకి తరలిస్తున్నారు. వీటిని పోస్టుమార్టం నివేదిక అనంతరమే వడదెబ్బ మరణాలుగా నిర్ధారిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. రెండు రోజుల్లో 30 మంది వరకూ... ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల్లో 30 మంది వరకూ వడదెబ్బతో మృత్యువాడ పడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే తొమ్మిది మంది ఉన్నారు. వారిలో సత్యనారాణపురం స్టేషన్ పరిధిలో శనివారం ఒకరు మృతి చెందగా, శుక్రవారం సీతారామపురం, కస్తూరి భాయిపేట, రాఘవయ్యపార్కు, బీసెంటు రోడ్డు, ఎల్ఐసీ భవనం, సింగ్నగర్ తదితర ప్రాంతాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. ఇబ్రహీంపట్నం మండలం కేతన కొండలో 32 ఏళ్ల పఠాన్ నాగుల్మీరా కూలి పనులకు వెళ్లి వడదెబ్బకు గురై మృత్యువాడ పడ్డాడు. విజయవాడ తూర్పులో రెండు రోజుల్లో గుణదలలో 44 ఏళ్ల శరత్బాబుతో పాటు, ప్రభుత్వాస్పత్రి వద్ద 60 ఏళ్ల వృద్ధురాలు మృత్యువాత పడింది. వారితో పాటు శనివారం ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీకి వచ్చిన మరో ముగ్గురు మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు. విజయవాడ పశ్చిమలో శుక్రవారం ముగ్గురు, శనివారం ఒకరు మృత్యువాత పడ్డారు. కృష్ణాజిల్లాలో పెనమలూరు, పెడన, గుడివాడ, వేకనూరు, తోట్లవల్లూరు, మోపిదేవిలో ఒక్కో మరణం నమోదైంది. ఇలా మొత్తం ఉమ్మడి కృష్ణాలో ఇప్పటి వరకూ 30 మంది వరకూ ఎండల తీవ్రతతో మరణించారు. ఉమ్మడి జిల్లాలో శనివారం కూడా వడగాడ్పులు కొనసాగాయి. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా నందిగామలో 44.6 డిగ్రీలు, కంచికచర్లలో 44.3, రెడ్డిగూడెంలో 43.6, జగ్గయ్యపేటలో 43.7, విజయ వాడలో 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో సైతం 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. విజయవాడ నగరంలో మధ్యాహ్నం నుంచి వడ గాడ్పుల ప్రభావం పెరిగింది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
కాలువల్లో అవినీటి ప్రవాహం
పనులు చేయకుండానే నిధులు మింగేసేందుకు సన్నాహాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: సాగు నీటితో కళకళలాడాల్సిన పంటకాలువల్లో అవి‘నీటి’ ప్రవాహం జోరందుకుంది. ఫలితంగా వచ్చే ఖరీఫ్ సీజన్లో శివారు పొలా లకు నీటి తడులు అందక ‘పానీ’పట్టు యుద్ధాలు తప్పేలా లేవు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంట కాలువలు, ఇరిగేషన్ డ్రెయిన్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. కాలువలు అన్నీ పూడిక, గుర్రపు డెక్క, తూటి కాడ, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. పూడిక, గుర్రపు డెక్క, తూటికాడ తొలగించడంతోపాటు అక్కడక్కడా కాంక్రీట్ పనులు, లాకుల షట్టర్లకు మరమ్మతులు చేయాల్సింది. ఇటీవల కాలువల్లో 833 పనులు చేపట్టేందుకు రూ.37.9 కోట్లు మంజూరు చేశారు. పనుల కేటాయింపునకు స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ముందుగానే 30 శాతం నిధులు కమీషన్ కింద ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. మే నెలలోనే సాగు నీరు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాలువలకు సాగునీరు విడుదల చేస్తే మరమ్మతులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు మింగేసే అవకాశం ఉండటంతో పచ్చనేతలు కమీషన్ల కోసం పట్టు పడుతున్నారు. ఫలితంగా కాలువల నిర్వహణ కోసం కేటాయించిన పనుల్లో అవినీతి ఊట ప్రవహిస్తోంది. గత ఏడాదీ ఇదే తంతు... గత ఏడాది కాలువల నిర్వహణ పనులను సకాలంలో మంజూరు చేయలేదు. కాలువలకు సాగు నీరు విడుదల చేసిన తరువాత రూ.25 కోట్ల విలువైన 666 పనులను మంజూరు చేశారు. ఎక్కువ శాతం పనులను తూతూ మంత్రంగానే జరిగాయి. ఫలితంగా సాగునీరు పుష్కలంగా ఉన్నా చివరి ఆయకట్టు రైతులు నీరు అందక ఇబ్బందిపడ్డారు. గత ఏడాది జూన్ 18 తేదీన కాలువులకు సాగునీరు వదలగా, జూలై చివరి వరకు మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. కాలువల్లో నీటి ప్రవాహంతో చాలా వరకు తూటి కాడ దిగువకు కొట్టుకుపో కాంట్రాక్టర్లకు తొలగించినట్టు బిల్లులు చేసుకున్నారు. దీంతో పెడన, అవనిగడ్డ, నియోజకవర్గాలో శివారు రైతులకు సాగు నీరు అందలేదు. కోడూరు మండలంలోని బసవానిపాలెం, ఊటగుండం, రామకృష్ణాపురం గ్రామాలకు వెళ్లే 14వ నంబర్ కాలువ డెక్క, తూటుకాడతో అధ్వానంగా మారింది. స్వతంత్య్రపురం, ఉల్లిపాలెం, హరిపురం గ్రామాలకు సాగు, తాగునీరు అందించే 11వ నంబర్ కాలువ మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయింది. పులిగడ్డ నుంచి దివిసీమకు వచ్చే అవనిగడ్డ ప్రధాన పంట కాలువ, అవనిగడ్డ నుంచి దిగువకు సాగు నీందించే కోడూరు, నాగాయలంక ప్రధాన పంట కాలువల్లో రెండేళ్ల నుంచి పూడికతీత పనులు చేయలేదు. దీంతో ఈ కాలువలు అన్నీ పూడికతో మేట వేశాయి. ఫలితంగా పులిగడ్డ ఎగువన ప్రధాన పంటకాలువ పొంగిపొర్లుతున్నా దిగువ పొలాలకు సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇరిగేషన్ డ్రెయిన్ల దుస్థితి ఇదీ.. చంద్రయ్య, కొమరవోలు డ్రెయిన్ల మరమ్మతులకు గత ఏడాది డిసెంబర్లోనే రూ.33 కోట్లు మంజూరైనా, స్థానిక ప్రజాప్రతినిధులు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవడంతో పనులు ముందుకు సాగలేదు. ఏప్రిల్ 11వ తేదీన కొమరవోలు డ్రెయిన్ మరమ్మతులను రూ.7.72 కోట్లతో ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రారంభించినా, రెండు రోజులపాటు మాత్రమే తూతూ మంత్రంగా ఈ పనులు జరిగాయి. ఈ నిధులను తినేసేందుకు రంగం సిద్ధమైందని విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో డ్రెయిన్ల పరిస్థితి అధ్వానంగా మారింది. మరో వైపు బుడమేరుకు పడిన గండ్లను ఇప్పటికీ పూడ్చలేదు. ప్రధాన పంట కాలువల్లో పూడిక మేట వేసి చాలా చోట్ల మట్టిదిబ్బలుగా దర్శనమిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పలుచోట్ల ప్రధాన పంట కాలువల్లో గుర్రపుడెక్క, తూడు పెరిగిపోయాయి. వీటిని తొలగించకుండా, పూడిక తీయకుండా కాలువలకు సాగునీరు వదిలినా పంట పొలాలకు సక్రమంగా చేరే పరిస్థితి లేదు. – బీమా బాబూరావు, రైతు, తిప్పపాలెం, నాగాయలంక మండలం దివిసీమలోని నాగాయలంక, కోడూరు, మంచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లో దెబ్బతిన్న అవుట్ఫాల్ స్లూయిస్లను ఆధునికీకరిస్తామని డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ గత ఏడాది అక్టోబర్లో హామీ ఇచ్చారు. వీటికి సంబంధించి రూ.50 కోట్లతో డీపీఆర్ పంపినా నిధులు మంజూరు కాలేదు. దీంతో ఈ ఏడాదీ అవుట్ఫాల్ స్లూయిస్లకు మరమ్మతులు, ఆధునికీకరణ పనులు లేనట్టేనని రైతులు వాపోతున్నారు. కొద్దిపాటి వర్షాలు పడినా 1.30 లక్షల ఎకరాలు ముంపు బారిన పడతాయని ఆందోళన చెందుతున్నారు. వేసవిలోనే పంట కాలువలకు మరమ్మతులు చేపట్టాలి. వర్షాలు పడితే పనులు సక్రమంగా జరగవు. పంట కాలువలు, ఇరిగేషన్ డ్రెయిన్లు, పంట బోదెల్లో పూడిక తీతపనులు చేపట్టాలి. ఈ పనులను సక్రమంగా నిర్వహిస్తేనే పంట పొలాలలకు సాగునీరు సక్రమంగా అందుతుంది. త్వరిత గతిన పనులు పూర్తి చేసి ఖరీఫ్ సీజన్కు సాగునీరు సక్రమంగా అందేలాచూడాలి – కె.ఎస్.ఆర్.దాసు, రైతు జమీదగ్గుమిల్లి -
మండుతున్న ఎండలు.. ఆగుతున్న గుండెలు
సాక్షి నెట్వర్క్: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పుల ధాటికి జనం గుండెలు ఆగిపోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో శనివారం పది మంది మత్యువాత పడ్డారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కేతనకొండ గ్రామానికి చెందిన పఠాన్ నాగుల్ మీరా (32) తన సోదరుల భాగస్వామ్యంతో చికెన్ షాపు నిర్వహిస్తాడు. షాపులో శుక్రవారం అంతా పనిచేశాడు. సాయంత్రానికి తీవ్రమైన జ్వరం రావడంతో జూపూడిలోని వైద్యశాలలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. గంపలగూడెం మండలం గాదెవారిగూడెం గ్రామానికి చెందిన పసుపులేటి నరసింహారావు(64) శనివారం తన దిన చర్యలో భాగంగా గ్రామంలో తన సమకాలికులతో గడిపి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. దడగా ఉందంటూ కుటుంబసభ్యులను మజ్జిగ అడిగి తాగాడు. మంచంపై పడుకున్న కొద్దిసేపటికి పరిస్థితి విషమించడంతో ఆర్ఎంపీ వైద్యుడ్ని రప్పించేలోగా మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులున్నారు. గంపలగూడెం పడమట దళివాడకు చెందిన కోట ప్రవీణ్(35) శనివారం ఉదయం మామిడి కోతకని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం మూడున్నర సమయంలో పంచాయతీ కార్యాలయం సమీపాన గల మంచినీటి ట్యాప్ వద్ద పడిపోయి ఉన్నట్లు స్థానికులు గమనించారు. సమాచారం తెలిసి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కొటికలపూడిలో దివ్యాంగురాలు.. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు మేకా నిర్మల (55) భర్త లేకపోవడంతో కూలి పనులు చేసుకుంటూ తన కుమారుడి వద్ద ఉంటోంది. ఇటీవల ఆరోగ్యం సహకరించక ఇంటి వద్దనే ఉంటోంది. శనివారం మధ్యాహ్నం ఊపిరాడటం లేదని కుటుంబ సభ్యులకు చెప్పింది. జ్వరం కూడా ఉండటంతో ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. వడదెబ్బతోనే మరణించినట్లు బంధువులు తెలిపారు. కూర్చున్న చోటే కుప్పకూలిన యాచకులు... విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఇద్దరు గుర్తుతెలియని యాచకులు వడదెబ్బతో మృతి చెందారు. సేకరించిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బస్టాండ్ పరిసరాలలో యాచన చేసి జీవనం సాగిస్తున్నారు. వీరు శనివారం సాయంత్రం 43, 44 ప్లాట్ఫామ్ వద్ద వడదెబ్బ వల్ల కూర్చున్న చోటే కుప్ప కూలిపోయారు. వీరి వయస్సు ఒకరికి 55, మరొకరి 60 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. కృష్ణలంక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కంచికచర్ల మండలంలో మరో వృద్ధురాలు.. కీసరలో ఉంటున్న ఓ వృద్ధురాలు శనివారం వడదెబ్బకు మృతి చెందింది. వీరులపాడు మండలం నందలూరు గ్రామానికి చెందిన ఎన్ రాజమ్మ(62) కొంతకాలంగా కంచికచర్ల మండలంలోని కీసర ప్రధాన సెంటర్ వద్ద ఉంటోంది. శుక్రవారం ఆమె ఎండవేడికి తట్టుకోలేక ఓ టైలర్ షాపు వద్ద కుప్ప కూలిపోయింది. గమనించిన ప్రవేటు ఎలక్ట్రీషియన్ శ్రీకాంత్ 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ వాహన సిబ్బంది వచ్చి ఆమెను పరీక్షించి ప్రథమ చికిత్స అందజేశారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తారాపేటలో గుర్తుతెలియని వ్యక్తి... విజయవాడ వన్టౌన్ తారాపేట రాజకుమారి థియేటర్ సమీపంలోని ఓ అరుగుపై గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు శనివారం పోలీసులకు సమాచారం అందింది. వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎటువంటి గుర్తింపు లభించలేదు. ఎండకు తాళలేక మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరు కాకుండా శనివారం విజయవాడ సత్యనారాయణపురంలో ఒకరు, జీజీహెచ్లో కూడా ఒక యాచకుడు వడదెబ్బ కారణంగా మృతి చెందినట్టు తెలిసింది. మృతి చెందిన యాచకులు ఎన్టీఆర్ జిల్లాలో వడదెబ్బకు పది మంది మృతి -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 523.90 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకు 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.హనుమాన్జంక్షన్లో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, 173 గ్రాముల బంగారు ఆభరణా లను స్వాధీనం చేసుకున్నారు. గంపలగూడెం: బడి పిలుస్తోంది ప్రచార రథం శనివారం తిరువూరు సాయిబాబా గుడి వద్ద ప్రారంభమైంది. అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో సదుపా యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 7 -
బడి ఈడు పిల్లలు పాఠశాలల్లోనే ఉండాలి
వత్సవాయి: బడి ఈడు పిల్లలందరూ తప్పని సరిగా పాఠశాలల్లోనే ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని భీమవరం, మక్కపేట గ్రామాల్లో ఆయన శని వారం పర్యటించారు. ‘బడి పిలుస్తోంది’లో భాగంగా విద్యార్థుల ఇళ్లకు కలెక్టర్ స్వయంగా వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. మండలంలో 563 మంది బడి బయట ఉన్న చిన్నారులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ చిన్నారులను పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో జరుగుతున్న పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అనంతరం లింగాలలో ఇటీవల అభివృద్ధిచేసిన డొంకరోడ్లను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘరాం, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్తో కలిసి ప్రారంభించారు. డీఈఓ చంద్రకళ, మండల ప్రత్యేకాధికారి విజయకుమారి, ఎంపీడీఓ ఎన్.రాంబాబు, ఎంఈఓ ఎల్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్నకు శ్రీకారం పటమట(విజయవాడతూర్పు): రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మునిసిపల్ వ్యవహారాల శాఖ నాలుగు వారాల ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. విజయవాడ సాంబమూర్తి రోడ్డులోని కూర్మయ్య బ్రిడ్జి వద్ద శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మునిసిపల్ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ బి.అనిల్ కుమార్రెడ్డి, మునిసిపల్ ధ్యానచంద్ర, ఆపరేషన్ క్లీన్ స్వీప్ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ జి.సమరం తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ హెచ్ ఆర్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి సూచించారు. శనివారం 132 కేవీ విజయవాడ ఆటోనగర్ సబ్స్టేషన్ను ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ – హెచ్ఆర్ డైరెక్టర్ మూర్తి సందర్శించి లోడ్స్ మానిటరింగ్ నిర్వహించారు. సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు, లోడ్ పంపిణీ పరిస్థితులను పరిశీలించి, ఓవర్లోడ్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇంజినీర్లు , విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యవర్గం పెనమలూరు: కృష్ణాజిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ (కేడీఎఫ్ఏ)కార్యవర్గం ఎన్నిక కానూరులో శనివారం జరిగింది. తొలుత జనరల్బాడీ సమావేశం నిర్వహించారు. ఎన్నికల అధికారిగా హైకోర్టు న్యాయవాది స్టాలిన్, ఒలంపిక్ అసోసియేషన్ పరిశీలకుడు మహేష్, ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ పరిశీలకుడు జి.పవన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రకియ నిర్వహించారు. అధ్యక్షుడిగా జి.అనిల్కుమార్, ఉపాధ్యక్షులుగా ఆర్.సురేష్బాబు, మక్కె సురేష్, జి.రాధమ్మ, కోశాధికారిగా నరహర వెంకట రవికుమార్, సభ్యులుగా బ్యూలారాణి, కన్యాకుమారి, తిరుపతమ్మ, కె.మణిబాబు, మస్తాన్, కె.రాజా, రాజు, డి.రాజేష్, మధు, సైపుల్లా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్ఏ ట్రెజరర్ విజయ్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, కోనసీమ జిల్లా అధ్యక్షుడు నీలాద్రి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శేషగిరి తదితరులు పాల్గొన్నారు.


