breaking news
NTR district News
-
జోగి రమేష్ పై కొనసాగుతున్న వేధింపుల పర్వం
ఇబ్రహీంపట్నం (మైలవరం): చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జోగి రమేష్పై వేధింపులు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యం కేసులో ఇప్పటికే జోగి రమేష్, ఆయన సోద రుడు జోగి రాముఅను అక్రమంగా అరెస్టు చేయగా, తాజాగా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఎకై ్సజ్ శాఖ పోలీసులు విచారణకు హాజరు కావాలని సోమవారం రాత్రి నోటీసులు అందజేశారు. ఈ నెల 3వ తేదీన భవానీపురం ఎకై ్సజ్ శాఖ పోలీస్ స్టేషన్లో విచారణ నిమిత్తం హాజరు కావాలని జోగి రమేష్ కుమారులు జోగి రాజీవ్, జోగి రోహిత్కుమార్, జోగి రాము కుమారులు జోగి రాకేష్, జోగి రామ్మోహన్కు నోటీసులు అందజేశారు. రమేష్, రాము కుమారులకు నోటీసులు -
ఎన్టీఆర్ భరోసాతో పేదల జీవితాలకు చేయూత
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా పింఛన్లు అందిస్తోందని, ఎన్టీఆర్ భరోసా పథకంతో పేదల జీవితాలకు చేయూత లభిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద సోమవారం విజయవాడ గులాబీతోటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పెన్షన్ల పంపిణీ తీరుతెన్నులను పరిశీలించారు. లబ్ధిదారులతో ముచ్చటించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ జిల్లాలో 2,28,968 మంది పెన్షనర్లకు రూ.98.91 కోట్ల మేర పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ -
అమృతలింగేశ్వరుని సన్నిధిలో తనికెళ్ల భరణి
ముక్త్యాల(జగ్గయ్యపేట): గ్రామంలోని కోటి లింగ హరిహర మహా క్షేత్రంలోని కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామి వారిని సోమవారం సినీ నటుడు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. సాధారణ భక్తుడిలా ఆలయంలోకి వచ్చి పూజలు చేశారు. విషయం తెలుసుకున్న అర్చకులు, అధికారులు మరలా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. కోటిలింగాల క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని భరణి అన్నారు. ఆలయ ఈవో హరిదుర్గా నాగేశ్వరరావు, అర్చకులు మణికంఠ, హర్ష పూజల అనంతరం ప్రసాదాలు అందజేశారు. టోల్గేట్ కాంట్రాక్టర్కు రూ.50 వేలు జరిమానా బకాయి చెల్లింపునకు 72 గంటలు గడువు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి టోల్గేట్ కాంట్రాక్టర్ వీఎల్డీ ఏజెన్సీకి దుర్గగుడి అధికారులు రూ.50 వేలు జరిమానా విధించారు. దుర్గగుడి దిగువన అక్రమంగా పార్కింగ్ డబ్బులు వసూలు, భక్తుల బెదిరింపులపై దేవస్థానానికి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్ పలుమార్లు కాంట్రాక్టర్కు నోటీసులు సైతం జారీ చేశారు. అయినా కాంట్రాక్టర్ తీరు మారకపోవడంతో సోమవారం రూ.50 వేలు జరిమానా విధించారు. జరిమానాను 3 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానానికి బకాయి ఉన్న రూ.1,11,98,199ను 72 గంటల్లో చెల్లించాలని ఆదేశించారు. 72 గంటల్లో బకాయి మొత్తం చెల్లించని పక్షంలో టెండర్ షరతుల మేరకు దేవస్థానం రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఒకే నెలలో 10.70 కిలోమీటర్ల మేర స్లీపర్లను పునరుద్ధరించి రికా ర్డు నెలకొల్పినట్లు డీఆర్ఎం మోహిత్ సోనాకియా చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే కారిడార్లలో ఒకటైన విజయవాడ–విశాఖపట్నం ట్రంక్ రూట్లో ఎటువంటి రైళ్ల రద్దుగాని, దారి మళ్లింపు లేకుండా ఈ పనులు చేపట్టినట్లు వివరించారు. ఇంజినీరింగ్, ఆపరేటింగ్, ఎస్అండ్టీ, టీడీఆర్ విభాగాల సమష్టి కృషితో విజయవాడ డివిజన్ ఈ అరుదైన ఘనత సాధించినట్లు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో 28 ట్రాఫిక్ బ్లాక్లను ఏర్పాటు చేశామని, అందులో రెండుసార్లు ఒకే రోజులో రెండు బ్లాక్లను ఏర్పాటు చేయడం దక్షిణ మధ్య రైల్వేలోనే మొదటిసారి కావటం విశేషమన్నారు. దీని కోసం ప్రత్యేకమైన టీఆర్టీ యంత్రాన్ని ఉపయోగించి 352 కేజీల బరువుతో ఉండే స్లీపర్లను తొలగించినట్లు వెల్లడించారు. -
కారు ఢీకొని సెక్యూరిటీ గార్డ్ దుర్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): గుర్తు తెలియని కారు ఢీకొని ఓ సెక్యూరిటీ గార్డ్ దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాణిగారితోట, 18వ డివిజన్లోని తమ్మిన పోతురాజు వీధిలో ఓర్సు వెంకటస్వామి(56) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అతను బందరు రోడ్డులోని ఒక జ్యూయలరీ షాపులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం స్నేహితుని పని మీద రాత్రి 9గంటలకు బందరురోడ్డు వైపు వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళుతూ నేతాజీ వంతెన వద్ద సాయిబాబా గుడి వైపు నుంచి రాణిగారితోట వైపునకు జాతీయ రహదారి దాటుతున్న సమయంలో బెంజిసర్కిల్ వైపు నుంచి వారధి వైపు అతి వేగంగా వెళ్తున్న గుర్తు తెలియని కారు అతనిని బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమా చారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 79 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో 79 ఫిర్యాదులు అందాయి. పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎస్వీడి ప్రసాద్, ఏడీసీపీ ఎం.రాజారావు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నడవలేని వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు తీసుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత స్టేషన్ల ఎస్హెచ్ఓలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులో భూమి, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 38, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 5, కొట్లాటకు సంబంధించి 1, వివిధ మోసాలపై 16, మహిళా సంబంధిత నేరాలపై 5, దొంగతనాలపై 3, ఇతర చిన్న వివాదాలు, సమస్యలపై 11 ఇలా మొత్తం 79 ఫిర్యాదులు అందాయి. -
వీఐపీలకు ఒకలా.. టికెట్లపై మరోలా...
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దేవస్థాన అధికారులు తీసుకుంటున్న పలు నిర్ణయాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు, వీఐపీలు, నూతన వధూవరులు వేద ఆశీర్వచనం అందుకోవాలని భావిస్తారు. ఇందులో నూతన వధూవరులకు దేవస్థానం ఉచితంగా వేద ఆశీర్వచనం అందజేస్తుండగా, వీఐపీలకు, ప్రముఖులకు దేవస్థానం వేద ఆశీర్వచనం అందజేస్తుంది. అమ్మవారి దర్శనం అనంతరం వెలుపలకు వచ్చే మార్గంలో మండపంలో ఆశీర్వచనం అందజేస్తారు. అదే సామాన్య భక్తులు అయితే రూ.500 టికెట్ కొనుగోలు చేయడం ద్వారా వేద పండితుల ఆశీర్వచనం పొందే అవకాశం కలుగుతుంది. అయితే సోమవారం నుంచి మండపం నుంచి ఆశీర్వచనాన్ని ఆలయం బయట రాజగోపురం పక్కనే లక్ష కుంకుమార్చన వేదిక వద్దకు తరలించారు. టికెటు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రమే ఇక్కడ వేద ఆశీర్వచనం అందచేస్తున్నట్లు ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. వీఐపీలు, చైర్మన్ సిఫార్సులపై వచ్చే వారికి మాత్రం అంతరాలయంలో వేద ఆశీర్వచనం అందజేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై భక్తుల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. చైర్మన్, బోర్డు సభ్యులకు వేరు వేరుగా చాంబర్లు దుర్గగుడికి ఎప్పుడు చైర్మన్ నియామకం జరిగినా బోర్డు సభ్యులు ఆ కార్యాలయంలోనే ఉండేవారు. అయితే ప్రస్తుత చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాత్రం బోర్డు సభ్యులు తన చాంబర్లో ఉండేందుకు అంగీకరించలేదు. దీంతో దేవస్థాన అధికారులు బోర్డు సభ్యులకు పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద ప్రత్యేకంగా చాంబర్ను ఏర్పాటు చేశారు. బోర్డు సభ్యుల కోసం వచ్చే వారిని చాంబర్ బయట కూర్చునేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. చైర్మన్ తీరుపై బోర్డు సభ్యులు కినుక వహించి దేవస్థానానికి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. తులాభారానికి సైతం స్థానచలనం దేవస్థాన స్ట్రాంగ్రూమ్ వద్ద ఉన్న తులాభారాన్ని అధికారులు ఇటీవల బోర్డు సభ్యుల చాంబర్ వద్దకు తరలించారు. గతంలో ఉన్న ప్రదేశంలో భక్తులకు అవసరమైన సమాచారాన్ని దేవస్థాన మైక్ రూమ్ సిబ్బంది తెలిపేవారు. భక్తులు తులాభారంగా సమర్పించే బియ్యం, చిల్లర నాణేలు, పసుపు, కుంకుమ, పటికబెల్లం, బెల్లం ఇతర సరుకులను జాగ్రత్తగా దేవస్థాన స్టోర్కు అప్పగించే వారు. తాజాగా మార్పు చేసిన తులాభారం వద్ద దేవస్థాన సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడం, అక్కడ భక్తులు సమర్పించిన సరుకులు దారి మళ్లుతున్నట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విమర్శలకు దారితీస్తున్న మార్పులు -
వైద్య విద్య ఉన్నతమైనది
పీసిమ్స్ ఫ్రెషర్స్ డే వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ గన్నవరం రూరల్: వైద్య విద్య ఉన్నతమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి మండలంలోని చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల 2025 ఫ్రెషర్స్డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు టెలి మెడిసిన్ హాల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంబీబీఎస్ విద్యార్థులకు నిర్వహించిన వైట్ కోట్ సెర్మనీలో తెల్ల కోట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంబీబీఎస్ చదివే అదృష్టం కొందరికే దక్కుతుందన్నారు. సేవా భావం, నైతిక విలువలు, చదువు, వృత్తి పట్ల అంకిత భావం ఉన్నత స్థానానికి తీసుకువెళతాయని విద్యార్థులకు సూచించారు. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైద్య విద్య చదివేందుకు చేరిన విద్యార్థులు ఉత్తమ లక్ష్యంతో ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్కుమార్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఆలిండియా బార్ పరీక్ష
జూపూడి(ఇబ్రహీంపట్నం): ఆలిండియా బార్ పరీక్ష జూపూడి నిమ్రా కళాశాలలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. కళాశాలలో పరీక్ష రాసేందుకు 545 మందిని కేటాయించగా, 538 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఏడుగురు అభ్యర్థులు గైర్హాజరయ్యారన్నారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే అభ్యర్థులు తప్పనిసరిగా ఆలిండియా బార్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉండటంతో ఈ పరీక్షకు ఇటీవల కాలంలో డిమాండ్ పెరిగింది. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ శాఖ అధ్యక్షుడిగా రాజంపేటకు చెందిన డాక్టర్ ఎస్.బాలరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు జనరల్ సెక్రటరీగా విజయవాడకు చెందిన డాక్టర్ మోటూరి సుభాష్చంద్రబోస్, ఫైనాన్స్ సెక్రటరీగా డాక్టర్ తుమ్మల కార్తీక్ బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎల్.కల్యాణ్ప్రసాద్ (విశాఖపట్నం), డాక్టర్ పి.వి.మధుసూదనాచారి(విజయవాడ), డాక్టర్ ఎ.వి.సుబ్బారెడ్డి (మదనపల్లి), జాయింట్ సెక్రటరీలుగా డాక్టర్ జె.ఎస్.శివకుమార్ (కోనసీమ), డాక్టర్ మణిబాబు(ఒంగోలు), డాక్టర్ బి.ఇ.పానిల్ కుమార్(నంద్యాల), డాక్టర్ జి.సునీల్(రాజంపేట) బాధ్యతలు స్వీకరించారు. వీరిని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావు, పూర్వ ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సమరం అభినందించారు. ఐఎంఏ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ బాలరాజు మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది, ఆస్పత్రుల రక్షణ చట్టాన్ని కఠిన తరం చేయాలని పేర్కొన్నారు. మైలవరం: ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి క్రీడా ప్రాంగణంలో వారం రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి డీఏ ఫుట్బాల్ లీగ్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ముగిశాయి. పెన్నా ఎఫ్సీ, తుంగభద్ర ఎఫ్సీ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో రెండు జట్లు చెరో రెండు గోల్స్ చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. అనంతరం రెండు జట్లకు పెనాల్టీలు ఇవ్వగా 2–3 గోల్స్ తేడాతో పెన్నా ఎఫ్సీ విజయం సాధించి మొదటి బహుమతి గెలుచుకుంది. డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, లకిరెడ్డి జయ ప్రకాష్రెడ్డి, లయన్ ఎస్వీఎన్ నివృతరావు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విశ్రాంత డీఎస్డీఓ బి.సుధాకర్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శేషగిరిరావు, ఈసీ మెంబర్ చక్రవర్తి, బుజ్జి, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గన్నవరం: జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఏపీ అంతర్ జిల్లాల రగ్బీ అండర్–14 చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల బాల బాలికల జట్టు పాల్గొన్నాయి. తొలిరోజు బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కృష్ణాజిల్లా జట్టుతో పాటు నెల్లూరు, కడప, కర్నూలు జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. బాలికల విభాగంలో తూర్పుగోదా వరి, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం జట్లు సెమీఫైనల్కు చేరాయి. రెండో రోజు పోటీలు ముగిసిన తర్వాత బాల, బాలికలను రాష్ట్ర జట్లకు ఎంపిక చేస్తారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి.రాంబాబు తెలిపారు. రగ్బీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రామానుజం, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి అరుణ, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీఆర్ కిషోర్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ నేతలు తోట అజయ్కుమార్, సత్యప్రసాద్, వర్మ, నియోజకవర్గ క్రీడా సమన్వయకర్త డి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులపై సర్కార్ నిర్లక్ష్యం
చిలకలపూడి(మచిలీపట్నం): మైదాన ప్రాంత గిరిజనులపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో గిరిజన హక్కుల సాధనకు ఉద్యమించాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ పేర్కొన్నారు. మచిలీపట్నం ఎన్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం గిరిజన ప్రజా సమాఖ్య, విద్యార్థి సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం కేటాయించే నిధులు సద్వినియోగం కావాలంటే చట్టసభల్లో గిరిజనులకు సరైన ప్రాతినిథ్యం ఉండాలన్నారు. 1967లో జిల్లా యూనిట్ స్థానంలో రాష్ట్ర యూనిట్ విధానాన్ని అమలు చేయడంతో గిరిజనులకు నష్టం వాటిల్లిందన్నారు. ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనలను గిరిజన సంఘాలు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానించారు. సమావేశంలో వివిధ గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరి జన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, కార్పొరేటర్ యాకసిరి వెంకటేశ్వరరావు, సుగాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, రవి నాయక్, పద్మరాజు, నాగరాజు, పాండు రంగారావు, కిరణ్, హనుమంతు నాయక్, సత్యనారాయణ, వెంకటరత్నం పాల్గొన్నారు. -
విద్యుత్ వైర్లు చోరీ చేసే ముఠాకు చెక్
కంకిపాడు: ఖాళీగా ఉన్న వెంచర్లలో విద్యుత్ స్తంభాలకు ఉన్న అల్యూమినియం వైర్లను చోరీ చేసే ముఠాకు కంకి పాడు పోలీసులు చెక్ పెట్టారు. చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ జె.మురళీకృష్ణ కథనం మేరకు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన గరికే చందు ఇళ్ల వెంబడి ఉల్లిపాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ మద్యం, పేకాటకు బానిసయ్యాడు. తన గ్రామానికే చెందిన గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, మంగళగిరి మండలం యర్రబాలెంనకు చెందిన పాత ఇనుప కొట్టు నిర్వాహకుడు కుంటిగుర్ల నరసింహరాజుతో కలిసి జల్సాలు తీర్చుకోవటానికి, డబ్బుకోసం విద్యుత్ వైర్లు చోరీని మార్గంగా ఎంచుకున్నారు. కంకిపాడు, జగన్నాధపురం, కొణతనపాడు, ప్రొద్దుటూరు, దావులూరు గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లలో స్తంభాలకు ఉన్న విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్నారన్నారు. గరికే చందుపై గతంలో నాలుగు వైరు చోరీ కేసులు ఉన్నాయి. విద్యుత్ వైర్లు చోరీపై నమోదైన కేసులో భాగంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రొద్దుటూరు గాయత్రీ విహార్ వద్ద గరికే చందు, గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, కుంటిగుర్ల నరసింహరాజు అల్యూమినియం రేకులు ఏరుతూ సంచుల్లో మూట గట్టడాన్ని పోలీసులు గుర్తించారు. గరికే చందు, కుంటిగుర్ల నరసింహరాజు పోలీసులకు చిక్కగా, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. కంకిపాడు పరిసర గ్రామాల్లో అల్యూమినయం వైర్లు చోరీ చేస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైరును స్వాధీనం చేసుకు న్నారు. కేసు నమోదు చేసి నిందితులు చందు, నరసింహరాజును అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టామని సీఐ మురళీకృష్ణ తెలిపారు. కేసు విచారణలో ముఖ్యభూమిక వహించిన ఎస్ఐ డి.సందీప్, పీఎస్ఐ ఎస్.సురేష్, హెచ్సీ కె.చంద్రబాబు, పీసీలు పి.ఎస్.ఎన్.మూర్తి, సయ్యద్ బాజీబాబును ప్రత్యేకంగా అభినందించారు. -
12 నుంచి రాష్ట్ర స్థాయి యోగా పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అనంతపురంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ యోగా చాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి రామ కృష్ణప్రసాద్ తెలిపారు. నగరంలోని యోగాసన స్పోర్ట్స్ అసోసయేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సబ్జూనియర్స్ యోగాసన చాంపియన్షిప్లో భాగంగా ఇప్పటికే జిల్లా స్థాయి పోటీలు నిర్వహించామని, విజేతలు అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 28వ తేదీన మహారాష్ట్రలోని సంఘామూర్లో జరిగే జాతీయ స్థాయి యోగాసన పోటీలకు ఎంపికవుతారన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సంద ర్భంగా ఈ నెల 21వ తేదిన రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మెడిటేషన్ క్లాసులను నిర్వహిస్తున్నా మని గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ ఆంజనేయులు మాట్లాడుతూ.. మెడిటేషన్ క్లాసులకు తమ సంస్థ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. డాక్టర్ పావని ప్రియాంక, అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి దారా కరుణశ్రీ,, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు రాధిక, సెక్రటరీ ప్రేమ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి, సెక్రటరీ రాజేశ్వరి, ఆర్.చరణ్, శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాసన పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు. -
దీక్షల విరమణ ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు)/ భవానీపురం(విజయవాడ పశ్చిమ): భవానీ దీక్షల విరమణ బందోబస్తు ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర అధికారులతో కలిసి ఆదివారం పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ నెల 11 నుంచి 15 వరకూ దీక్షల విరమణలు జరగనున్నాయి. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ పరిసరాలతో పాటు, గిరి ప్రదక్షిణ ప్రాంతాలను సందర్శించారు. పెద్ద సంఖ్యలో పలు ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి మాలధారణ చేసి దీక్ష విరమణకు నగరానికి రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఇతర పోలీస్ అధికారులతో కలిసి టెంపుల్ పరిసర ప్రాంతాలను, స్నాన ఘాట్లను, హోమగుండాలు, ఇరుముడుల స్టాండ్ల ఏర్పాటు, ప్రదేశాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు గిరి ప్రదక్షిణ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు చేసి, దర్శన సమయంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్యూ, దర్శనం అనంతరం భక్తులు వెళ్లే మార్గాలను పరిశీలించి పటిష్ట భద్రతకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. భవానీల సౌకర్యార్థం రెండు ఫుట్బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో డీసీపీ కృష్ణకాంత్పాటిల్, ట్రాఫిక్ డీసీపీ షిరీన్బేగం, ఏసీపీలు డి.పవన్కుమార్, రామచంద్రరావు, సీఐలు పాల్గొన్నారు. -
ముగిసిన యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పరీక్ష
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/ వన్టౌన్(విజయవాడ పశ్చిమ): ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన ఈపీఎఫ్ఓ పరీక్ష– 2025 ముగిసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీకి నగరంలోని 15 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరిగింది. 5,860 మంది అభ్యర్థులకు 2,183 మంది (37.25 శాతం) హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని సీవీఆర్ ఉన్నత పాఠశాల, చిట్టూరి హైస్కూల్, ప్రభాస్ పీజీ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయడానికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇబ్బంది లేకుండా పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన లైజనింగ్ అధికారులు, వెన్యూ సూపర్వైజర్లు, సమన్వయ శాఖల అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు తెలిపారు. చిట్టూరి హైస్కూల్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ లక్ష్మీశ, ఇతర అధికారులు -
పూత ఎండమామిడి
జి.కొండూరు: మామిడి తోటల్లో చెట్లకు పూత కనిపించడంలేదు. ఈ పాటికి పూతతో కళకళలాడాల్సిన చెట్లు వెలవెలబోతున్నాయి. అకాల వర్షాలు, పురుగులు, తెగుళ్ల దాడితో గత ఏడాది తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేవు. సాధారణంగా నవంబరు నెల నుంచి పూత ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటి వరకు 80 శాతానికి పైగా మామిడి తోటల్లో అసలు పూతే కనిపించడంలేదు. ఒకవేళ ఆలస్యంగా పూత వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు, తెగుళ్లను తట్టుకొని నిలబడడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది దిగుబడి 50 శాతానికి పడిపోగా ఈ ఏడాది 30 శాతం దిగుబడి రావడం కూడా కష్టమేనని రైతులు అంచనా వేస్తున్నారు. గతేడాది అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం కూడా అందించకపోవడంతో అప్పులపాలై లబోదిబోమంటున్నారు. మామిడి సాగుతో నష్టాలు వస్తుండడంతో ఏటా పదిశాతం తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నారు. పూత రావడం కష్టమే.. గతేడాది ప్రారంభంలో మామిడి ధర ఊరించినప్పటికీ పురుగులు, తెగుళ్లు, ఆకాల వర్షాలతో కాయ నాణ్యత పడిపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధర పతనమైంది. దీనితో కోత కూలి కూడా వచ్చే అవకాశం లేక రైతులు ఆఖరి కోతలను ఆపేశారు. కాయలు చెట్లపైనే పండిపోయి రాలిపోయాయి. దీని వల్ల చెట్ల కొమ్మల్లో ఉండే బలం మొత్తం తగ్గిపోయి ఈ ఏడాది పూత రావడంలేదని రైతులు చెబుతున్నారు. ఆలస్యంగానైనా పూత వచ్చే అవకాశం ఉండదని మరో ఏడాది గడిస్తే కానీ పూత వచ్చే అవకాశం ఉంటుందని రైతులు చెబతున్నారు. దీని వల్ల ఈ ఏడాది కూడా రైతులు మామిడిపై ఆశలు వదిలేసుకున్నారు. ఏటా నష్టాలే.. ఈ ఏడాది పూత పరిస్థితిని బట్టి 30 శాతం కూడా మామిడి దిగుబడి వచ్చేలా లేదని రైతులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రెడ్డిగూడెం, విస్సన్నపేట, విజయవాడ రూరల్ మండలాల్లో అక్కడిక్కడా కొద్దిపాటు మామిడి తోటల్లో పూత వచ్చి పిందెలు కాస్తున్న క్రమంలో తుపానులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలో 2023–24 సంవత్సరంలో 1.76 లక్షల టన్నుల మామిడి దిగుబడి వచ్చింది. గతేడాది 85 వేల టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. మామిడి కోతల ప్రారంభంలో రెడ్డిగూడెం మండల పరిధి మిట్టగూడెం మ్యాంగో మార్కెట్లో బంగినపల్లి టన్ను రూ.1.20 లక్షలు, తోతాపురి టన్ను రూ.70 వేలు, రసాలు టన్ను రూ.40 వేలకు అమ్ముడుపోగా ఆఖరికి టన్ను బంగినపల్లి రూ.5 వేల నుంచి రూ.10 వేలు, తోతాపురి, రసాలు టన్ను రూ.2 వేల నుంచి రూ.5వేలకు ధర పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో మామిడి సాగు ఇలా.. ఎన్టీఆర్ జిల్లాలో పదహారు మండలాల్లో పదహారు వేల మంది రైతులు 22,896 హెక్టార్లలో మామిడిని సాగు చేస్తున్నారు. మండలాల వారీగా వత్సవాయి మండల పరిధిలో 165 హెక్టార్లు, జగ్గయ్యపేట 295 హెక్టార్లు, పెనుగంచిప్రోలు 244 హెక్టార్లు, నందిగామ 251 హెక్టార్లు, వీరులపాడు 113 హెక్టార్లు, మైలవరం 3,353 హెక్టార్లు, గంపలగూడెం 616 హెక్టార్లు, తిరువూరు 817 హెక్టార్లు, ఎ.కొండూరు 2,336 హెక్టార్లు, రెడ్డిగూడెం 4,450 హెక్టార్లు, విస్సన్నపేట 5,817హెక్టార్లు, జి.కొండూరు 2,324 హెక్టార్లు, కంచికచర్ల 125 హెక్టార్లు, చందర్లపాడు 20 హెక్టార్లు, ఇబ్రహీంపట్నం 18 హెక్టార్లు, విజయవాడ రూరల్ 1,952 హెక్టార్లలో మామిడి తోటలు సాగువుతున్నాయి. గతేడాది పురుగులు, తెగుళ్లతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోగా ఏప్రిల్లో వచ్చిన అకాల వర్షాలు, పెనుగాలులకు జిల్లాలో 15,300 హెక్టార్లలో 50 శాతానికిపైగా కాయలు నేలరాలి తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపినప్పటికీ రైతులకు చిల్లిగవ్వ కూడా పరిహారంగా ఇవ్వలేదు. జిల్లాలో 279 మంది రైతులు మాత్రమే 246 ఎకరాలకు బీమా ప్రీమియం చెల్లించారు. బీమా ప్రీమియం చెల్లించి పంట నష్టపోయిన రైతులకు సైతం ఇంతవరకు బీమా సొమ్ము అందలేదు. -
కార్తికేయుని సన్నిధిలో భక్తజన సందడి
మోపిదేవి: మండల కేంద్రమైన మోపిదేవిలో వేంచేసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా కనిపించింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వర ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆన్లైన్ ఆర్జిత సేవల బుకింగ్ ప్రారంభం సుబ్రహ్మణ్యస్వామి ఆర్జితసేవల పూజలను భక్తులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిసర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం వెల్లడించారు. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సర్పదోష నివారణ, రాహుకేతు పూజలు, శాంతి కళ్యాణం, సుప్రభాతం, అష్టోత్తరపూజ, సహస్ర నామార్చన, అభిషేకం వంటి ఏడు రకాల పూజలకు ఆన్లైన్లో రిజస్టర్ అయి లాగిన్ ద్వారా తేదీ, టైం, స్లాట్ను ముందుగా బుక్ చేసుకోవచ్చని వివరించారు. ● స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆదివారం ఒక్క రోజు వివిధ సేవా టికెట్ల రూపంలో ఆదాయం రూ. 9,82,581 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు -
అల్లకల్లోలంగా హంసలదీవి సాగర తీరం
కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను కారణంగా హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. రెండు రోజులుగా సాగరతీరంలో అలలు ఉధృతి ఎక్కువగానే ఉంది. అయితే ఆదివారం ఆ తీవ్రత మరింత పెరిగింది. సముద్ర అలలు సుమారు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు కూడా ముందుకు చొచ్చుకొచ్చి డాల్ఫిన్ భవనం చుట్టూ చేరాయి. తీరంలోని ఇసుకతిన్నెలు సైతం భారీగా కోతకు గురయ్యాయి. సముద్ర పరిస్థితులు భిన్నంగా ఉండడంతో అటవీ, మైరెన్ పోలీసులు బీచ్లోకి పర్యాట కుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. మరో రెండు రోజుల పాటు బీచ్ గేట్లు మూసే ఉంటాయని అటవీ అధికారులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ పామర్రు: రాష్ట్రంలో నష్టపోయిన ధాన్యం రైతులకు తక్షణమే గిట్టుబాటు ధర కల్పించి ఆదు కోవాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు తమది రైతుల ప్రభుత్వమని రైతులకు అన్నీ బాగా చేస్తున్నామని, గత ప్రభుత్వంలోనే రైతులకు అన్యాయం జరిగిందనే చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఒక్కసారి టీడీపీ నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి రైతుల పరిస్థితిని చూడాలని సూచించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి గిట్టు బాటు ధర కల్పించిందని గుర్తుచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరైతు కూడా సాగులో పరుగు మందులు, ఎరువులు, యారియా దొరకలేదని రోడ్లు ఎక్కిన పరిస్థితి లేదని, టీడీపీ ప్రభుత్వంలో యూరియా దొరక్క రోడ్లెక్కి ధర్నాలు చేసిన పరిస్థితి చూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్సు పాలసీలు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025రైతుల్లో ఆందోళన 7గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.భవానీపురం(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ అన్నప్రసాద వితరణకు ఆదివారం తెలంగాణలోని మేడ్చర్ల వాస్తవ్యులు ఎంవీ రామ్శెట్టి దుర్గాప్రసాద్ రూ.1,00,000 విరాళంగా అందజేశారు.నందిగామ రూరల్: నందిగామలో హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయ ఆవరణలో అయ్యప్ప మహా పడిపూజను కనులపండువగా నిర్వహించారు.కంకిపాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దిత్వా తుపానుగా మారడంతో రైతన్న దిగులు పడుతున్నాడు. తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. బందరు, గుడివాడ, పామర్రు, పెనమలూరు, పెడన నియోజకవర్గాల్లో ఆదివారం ఉదయం నుంచే మోస్తరు వర్షం కురుస్తోంది. సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారుతుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కోత కోసి మార్కెట్కు తరలించేందుకు సిద్ధం చేసిన పంట వర్షం పాలు కాకుండా ఉండటానికి రైతులు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. 3.83 లక్షల ఎకరాల్లో సాగు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.54 లక్షల హెక్టార్లలో (3.83 లక్షల ఎకరాలు) వరి సాగు చేపట్టారు. ప్రధానంగా ఎంటీయూ, బీపీటీ, స్థానిక వరి వంగడాలను రైతులు ఎంపిక చేసుకుని సాగు చేశారు. పదిహేను రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి కోతలు ఆరంభమయ్యాయి. ఇప్పటి వరకూ 287 పీపీసీ క్లస్టర్ల పరిధిలో ధాన్యం సేకరణ జరుగుతోంది. 1.50 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. రోడ్లపైనే ధాన్యం రాశులు జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఎక్కడ చూసినా ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రోడ్డు మార్జిన్లు, రియల్ వెంచర్లలో ధాన్యం కుప్పలుగా పోసి ఉంచారు. మిల్లులకు తరలించడానికి సిద్ధంగా ఉన్నా గోనె సంచులు, రవాణా వాహనాల లభ్యత సజావుగా సాగక పోవడంతో ధాన్యం ఎక్కడిదక్కడే నిలిచిపోతోంది. ఈ నెల మూడో వారంలోనే తుపాను హెచ్చరికలు ఉన్నా వాతావరణ పరిస్థితులు సహకరించడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈసారి మాత్రం వాతావరణం ప్రతికూలంగా మారింది. గోరుచుట్టుపై రోకలి పోటు చందం పంట ఉత్పత్తులను మార్కెట్కు తరలించే క్రమంలో దిత్వా తుపాను గోరుచుట్టుపై రోకలి పోటు చందంగా మారిందని రైతులు వాపోతున్నారు. చిరుపొట్ట, కంకులు గట్టిపడే దశలో మోంథా తుపాను విరుచుకుపడింది. జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సుమారు 40 వేల హెక్టార్లలో (1.10 లక్షల ఎకరాలు) వరి పంట నేలవాలింది. నేలవాలిన పంట వర్షం నీటిలో నాని కంకులు దెబ్బతిన్నాయి. అక్కడక్కడా ధాన్యం కంకులు మొలకెత్తడం, మడమతాలు, మానుగాయ ఏర్పడటంతో రైతులు ఆర్థికంగా నష్టాన్ని చవిచూశారు. ఎకరాకు రూ 35 వేలు పెట్టుబడులు పెట్టగా, కౌలు చెల్లింపులు, పెట్టుబడులు అన్నా చేతికి దక్కితే చాలని భావించారు. ఆఖరికి దిగుబడులు సైతం ఎకరాకు 28 బస్తాలకు (బస్తా 75 కిలోలు) మించి వచ్చిన దాఖలాలు లేవు. మరోసారి ప్రకృతి కన్నెర్ర అందిన కాడికి పంటను మద్దతు ధరకు అమ్ముకుందామని ఆశించిన తరుణంలో దిత్వా తుపాను రూపంలో మరోమారు ప్రకృతి కన్నెర్ర చేయడం తో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే తేమ శాతం ఎక్కువగా ఉందని సాకుగా చూపి బస్తాకు రూ.1,500 మించి ధర దక్కక రైతులు అల్లాడుతున్నారు. ఈ సమయంలో ధాన్యం నిమ్ముకోవడం, తేమశాతం పెరగడంతో తమ పరిస్థితి అధ్వానంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. తుపాను బారిన పంట పడకుండా కాపాడుకునే చర్యల్లో అన్నదాతలు నిమగ్నమవుతున్నారు. -
భజే భవాని
కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో..భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్పలు, భవానీలు, సాధారణ భక్తులు రావడంతో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరగడంతో ఈఓ శీనా నాయక్ సిబ్బందికి సూచనలు చేశారు. ఘాట్ రోడ్డు ద్వారా ఇంద్రకీలాద్రిపైకి వచ్చే వాహనాలను ఓం మలుపు వద్ద క్రమబద్ధీకరించారు. ఘాట్ రోడ్డు వైపు ఇటు మహామండపం వైపు నుంచి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులను బ్యాటరీ వాహనాల్లో తరలించే ఏర్పాటు చేశారు. రూ.500 దర్శనం క్యూతోపాటు అన్ని లైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. లగేజీని క్లోక్ రూమ్లో పెట్టేలా చర్యలు ఇంద్రకీలాద్రిపై భద్రతా చర్యల్లో భాగంగా కాలేజీ బ్యాగులు, లగేజీతో ఆలయ క్యూల్లో ప్రవేశించిన భక్తులను చూసిన ఈఓ శీనానాయక్ వారిని వెనక్కి పంపి లగేజీని క్లోక్ రూమ్లో పెట్టుకుని రావాలని ఆదేశించారు. ఆర్జిత సేవలైన సూర్యోపాసన, చండీ హోమం, లక్ష కుంకుమార్చన తదితర సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రద్దీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు కుమ్మరిపాలెం సెంటర్ నుంచి టోల్గేట్ వరకు వాహనాలను రోడ్డు పక్కన పార్కింగ్ చేయించారు. ఇంద్రకీలాద్రిపై క్యూలో భక్తజనం -
డిప్రెషన్లో నవతరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశాభివృద్ధిలో భాగస్వాములైన నవతరం ప్రస్తుతం డిప్రెషన్తో సతమతమవుతోంది. అయితే దీనికి భయపడొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మన ఆలోచనలు.. ఆచరణలు అన్నీ మెదడుపై ఆధారపడి ఉంటాయి. కర్తవ్యాలను నెరవేరుస్తూ లక్ష్యాలను చేరి ఆనందంగా ఉండటానికి, ఇతర అవయవాలతో పాటు మానసిక ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండేలా చూడాలి. అయితే నేటి యువత డిప్రెషన్తో తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవే నిదర్శనం ● లబ్బీపేటకు చెందిన వెంకటేష్ (పేరు మార్చాం) ఇంజినీరింగ్ సెకండియర్ విద్యార్థి. ఇటీవల తీవ్ర మానసిక ఒత్తిళ్ల కారణంగా మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అతనికి కౌన్సి లింగ్ ఇవ్వగా, సోషల్ మీడియా ప్రభావంతో డిప్రెషన్కు గురైనట్లు తెలిపారు. ● విద్యాధరపురానికి చెందిన నరేష్(పేరు మార్చాం) ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. ఇటీవల చదువుపై దృష్టి పెట్టకపోవడం, ఆహారం సరిగా తీసుకోక పోవడంతో మానసిక నిపుణులను ఆశ్రయించారు. అక్కడ కౌన్సిలింగ్ చేయగా, ‘ఎంత చదివినా మార్కులు రావడం లేదు. తనకంటే స్నేహితులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయని’ డిప్రెషన్కు గురవుతున్నట్లు తెలిసింది. ఇలా నేటి యువత అనేక కారణాలతో మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. నగరంలోని మానసిక నిపుణులను సంప్రదిస్తున్న వారిలో యువతే అధికంగా ఉంటున్నారు. ఒక్కో మానసిక నిపుణుడి వద్దకు నెలకు 15 నుంచి 20 మంది వరకూ డిప్రెషన్కు గురవుతున్న వారు వస్తున్నట్లు చెబుతున్నారు. యువతలో పెరుగుతున్న డిప్రెషన్ ప్రస్తుతం 14 నుంచి 25 ఏళ్ల మధ్య వారు ఎక్కువగా డిప్రెషన్కు గురవుతున్నట్లు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. చిన్న చిన్న కారణాలకే డిప్రెషన్కు లోనై ఆహారం సరిగా తీసుకోక పోవడం, దిగులుగా ఉండటం, చదువుపై దృష్టి పెట్టలేక పోతున్నట్లు చెబుతున్నారు. ఫిజికల్ ఎక్సర్సైజు లేక పోవడం యువతపై ప్రభావం చూపుతోందంటున్నారు. ప్రధానంగా పరీక్షల విషయంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు వైద్య నిపుణులు అంటున్నారు. నేటి యువత ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్కు గురవుతున్నారు. నిజంగా సీరియస్గా ఏమి తీసుకోవాలి, లైట్గా ఏమి తీసుకోవాలో తెలియడం లేదు. దేనికి ఎంత వాల్యూ ఇవ్వాలో కూడా విచక్షణ ఉండటం లేదు. ఇంటర్మీడియెట్, పాఠశాల స్థాయిలో కేవలం సిలబస్ పూర్తి చేయడం, మార్కులు, ర్యాంకులు, బట్టీ చదువులపైనే దృష్టి పెడుతున్నారు. విలువలు, జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడం ఎలా అనే అంశాలను తెలియచేయడం లేదు. డిప్రెషన్కు సోషల్ మీడియా కూడా కారణమే. – డాక్టర్ యు.రాఘవరావు, మానసిక వైద్య విభాగాధిపతి, ప్రభుత్వాస్పత్రి -
వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుమలగిరి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాలుగు రోజుల పాటు జరగనున్న స్వామి వారి పవిత్రోత్సవాలు ఘనంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలుత వాస్తుపూజ, వాస్తు హోమం, రక్షా బంధనం, అంకురారోహణ వంటి కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు తిరునగరి రామ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద అంకురారోహణ నిర్వహించి పవిత్రోత్సవాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సాంబశివరావు, చైర్మన్ భరద్వాజ్, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: జాతీయ తైక్వాండో పోటీల్లో మండలంలోని జూపూడి గ్రామానికి చెందిన కలతోటి దామిని అత్యుత్తమ ప్రతిభ చాటి ఐదు పతకాలు సాధించింది. ఉత్తరప్రదేశ్లో నవంబర్ 21 నుంచి 23 వరకు జరిగిన తైక్వాండో పోటీలో వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో తలపడి రెండు బంగారు, రెండు రజత, ఒక కాంస్య పతకాన్ని గెలుసుకుంది. 55–59 కిలోల విభాగంలో ఆమె పాల్గొంది. ఉమ్మడి కృష్ణా జిల్లా కోచ్ అంకమ్మరావు తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన దామిని గతంలో కూడా వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పతకాలు సాధించింది. దామిని ప్రతిభకు పలువురు అభినందనలు తెలిపారు. గుణదల డాన్ బోస్కో పాఠశాలలో బాలిక 9వ తరగతి చదువుతోంది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025చిలకలపూడి(మచిలీపట్నం): జెడ్పీ సర్వసభ్య సమావేశానికి కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తన బంగ్లా నుంచి జెడ్పీ కన్వెన్షన్ హాలు వరకు శనివారం సైకిల్పై వచ్చారు. మైలవరంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జేఎన్టీయూకే సెంట్రల్ జోన్ వాలీబాల్ ఇంటర్ కాలేజియేట్ టోర్నీ పోటీలు ప్రారంభమయ్యాయి. కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.రాంజీ శనివారం కృష్ణా తరంగ్– 2025 పోస్టర్ ఆవిష్కరించారు. 7 -
అవమానంపై పాలకవర్గం ఆగ్రహం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ నిధు లతో తమకు కేటాయించిన పనులను అర్ధంతరంగా నిలిపివేస్తూ జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. చైర్పర్సన్ ఉప్పాల హారిక, పాలక వర్గ సభ్యుల ప్రమేయం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం జెడ్పీ కన్వెన్షన్ హాలులో చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన శనివారం జరిగింది. తొలుత చైర్పర్సన్ హారిక మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీన పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించి జెడ్పీటీసీ సభ్యులకు ఆయా మండలాల్లో కేటాయించిన 424 పనులను నిలిపివేస్తూ సీఈఓ ఆదేశాలు ఇచ్చారని, తనతో, పాలకవర్గ సభ్యులతో సంబంధం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జెడ్పీటీసీ సభ్యుల ఆమోదంతో తీసుకోవాల్సిన నిర్ణయాన్ని సీఈఓ ఏకపక్షంగా తీసుకోవడం తనను, పాలకవర్గ సభ్యులను అవమానించినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం రోజు మహిళ చైర్పర్సన్ అని కూడా చూడకుండా వ్యక్తిగతంగా విమర్శించడం బాధకలిగించిందన్నారు. దీంతో సభ్యులు ఒక్కసారిగా సీఈఓ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలో బడ్జెట్ ప్రకారం సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించిన పనులను ఏ విధంగా రద్దు చేస్తారని ప్రశ్నించారు. సీఈఓ కన్నమనాయుడు మాట్లా డుతూ.. జెడ్పీలో నిధులు లేకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. బడ్జెట్లో రూపొందించిన ప్రకారం రానున్న రోజుల్లో రూ.20 కోట్ల వరకు స్టాంపు డ్యూటీ నిధులు వస్తాయని, వాటిని అభివృద్ధి పనులకు కేటాయించామని చైర్ పర్సన్ హారిక పేర్కొన్నారు. నిధులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు పనులను ఎలా రద్దు చేస్తారని నిలదీశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 424 పనులు కేటాయించామని, ఇప్పకే 50 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని, అయితే పనులు ప్రారంభం కాలేదని లేఖలు రాయడం ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకోవడం కాదా అని నిల దీశారు. తమను అవమానించేందుకు, తమ మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఎన్నో సార్లు తనను అవమానించినా పట్టించుకోలేదని పేర్కొ న్నారు. ఇప్పుడు పాలకవర్గాన్నే అవమానించారని మండిపడ్డారు. ప్రాణంకన్నా పరువే ముఖ్యం చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడిన అనంతరం జెడ్పీటీసీ సభ్యులు సీఈఓ వైఖరికి నిరసనగా పోడియం వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. తమ పరిధిలో పనులను నిలిపివేయడం అవమానంగా భావిస్తున్నామని, తాము ప్రాణంగా కన్న పరువు ముఖ్యంగా బతుకుతామని, ఇప్పుడు గ్రామస్థులకు ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తమ ప్రమేయం లేకుండా, అత్యవసర సమావేశం నిర్వహించకుండా ఏకపక్షంగానే నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈఓకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నల్లబ్యాడ్జీలతో నిరసన పోడియం ముందు నినాదాలతో మూడు గంటలపాటు నిరసన తెలిపినా సీఈఓలో స్పందన రాకపోవడంతో సభ్యుల్లో మరింత ఆగ్రహం వ్యక్తమైంది. జెడ్పీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఈఓ వ్యవ హరిస్తున్నారని, పనులను రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే వెనక్కు తీసుకోవాలని రెడ్డిగూడెం, ముసునూరు జెడ్పీటీసీ సభ్యులు విజయభాస్కరరెడ్డి, ప్రతాప్, పెనుగంచిప్రోలు, గన్నవరం ఎంపీపీలు మార్కపూడి గాంధీ, అనగాని రవి మిగిలిన సభ్యులతో కలిసి డిమాండ్ చేశారు. సీఈఓను సస్పెండ్ లేదా బదిలీ చేయాలని కోరారు. అప్పటికీ అధికారుల్లో స్పందన లేకపోవడంతో నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయం అయినా బయటకు వెళ్లకుండా నాలుగు గంటల పాటు ఆందోళన చేశారు. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ జోక్యం చేసుకుని కేటాయించిన పనుల్లో ప్రారంభించినవి, వివిధ దశల్లో ఉన్న వాటికి నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటానని, ఆదాయవనరులు రాగానే మిగిలిన పనులు చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. వెనక్కు తగ్గిన సీఈఓ కలెక్టర్ హామీ ఇచ్చానా సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సీఈఓ కన్నమనాయుడు స్పందించి తాజా ఉత్తర్వులు ఇస్తానని హామీ ఇచ్చారు. సభ్యులు లేవనెత్తిన అంశాలను పరిశీలించానని, ఇంజినీరింగ్ అధికారుల నివేదికల్లో తప్పులున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ప్రారంభించిన పనులు కూడా ప్రారంభం కాలేదని ఇంజినీరింగ్ అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ఉందన్నారు. తప్పులను సరిచేసి సభ్యులకు ఇబ్బంది లేకుండా తాజా ఉత్తర్వులు జారీ చేస్తానన్నారు. చైర్పర్సన్ ఉప్పాల హారిక సూచనల ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో పనులకు నిధులు కేటాయిస్తానని చెప్పడంతో సభ్యులు ఆందోళనను విరమించారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న, ఉమ్మడి జిల్లా అధికారులు పలువురు పాల్గొన్నారు. -
రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించాలి
రామవరప్పాడు: రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ రైతులకు సూచించారు. విజయవాడరూరల్ మండలం నిడమానూరు, ఎనికేపాడు గ్రామాల్లో కలెక్టర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం విక్రయించడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రైతులను ప్రశ్నించారు. ఎనికేపాడులోని వీరయ్య రైస్ మిల్లును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో 150 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 13,70,700 గోనె సంచులు ఉన్నాయని పేర్కొన్నారు. ధాన్యం రవాణాకు 1,450 వాహనాలు అందుబాటులో వివరించారు. ఆర్డీఓ కావూరి చైతన్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. హంసల దీవి బీచ్ గేట్లు మూసివేత కోడూరు: తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో హంసలదీవి బీచ్ గేట్లను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజర్ శ్రీసాయి శనివారం ప్రకటించారు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో పాటు నీరు ముందుకు చొచ్చుకొచ్చిందని తెలిపారు. సముద్ర స్థితిగతులతో పాటు భారీ వర్షాల నేపథ్యంలో పర్యాటకుల భద్రత దృష్ట్యా ఈ నెల 30, డిసెంబర్ ఒకటో తేదీన బీచ్ గేట్లను మూసివేస్తున్నామని పేర్కొన్నారు. తీరంలోకి పర్యాటకులను నిషేధించామని స్పష్టంచేశారు. పర్యాటకులు బీచ్కు రావద్దని కోరారు. బీచ్ వద్ద పరిస్థితుల బట్టి గేట్లు తెరిచే తేదీని త్వరలో ప్రకటిస్తామని శ్రీసాయి తెలిపారు. పెనమలూరు: పెనమలూరు మండలంలోని కానూరులో ఉన్న సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సీటీలో మొదటి ఏడాది ఎంబీఏ విద్యార్థి షేక్ కాజామొహిద్దీన్ భారత విశ్వవిద్యాలయాల జట్టుకు ఎంపికయ్యారని యూనివర్సిటీ ఫిజి కల్ డైరెక్టర్ పి.రఘు తెలిపారు. ఆయన శనివారం వివరాలు తెలుపుతూ డిసెంబర్ ఏడు నుంచి 19వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరగనున్న క్రికెట్ పోటీల్లో భారత విశ్వవిద్యాలయ జట్టు నుంచి ఆడతాడన్నారు. ఇండియన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపడంతో జట్టులో స్థానం దక్కిందన్నారు. ఈ సందర్భంగా కాలేజీలో శనివారం కులపతి కేవీ చౌదరి, ఉపకులపతి డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో ఉపకులపతి డాక్టర్ ఎ.వి.రత్న ప్రసాద్ క్రికెట్ జట్టుక ఎంపికై న కాజామొహిద్దీన్ను అభినందించారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ బీసీ స్టడీ సర్కిల్, విజయవాడ ద్వారా సివిల్ సర్వీ సెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించినట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.లక్ష్మీదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు వచ్చే నెల మూడో తేదీ లోగా తమ దరఖాస్తులను విజయవాడ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. అభ్యర్థులకు డిసెంబర్ ఏడో తేదీన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన అభ్యర్థులు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం లేదా 9966849937, 9505094349, 86888 55255 సెల్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ‘నిరసన’ సంతకం
లబ్బీపేట (విజయవాడతూర్పు): నూతన వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వ తీరుపై నిరసన సంతకాలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వద్దంటూ ప్రజలంతా సంతకాలతో చంద్రబాబు ప్రభుత్వానికి తేల్చిచెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ శిబిరాల వద్దకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. ఈ విషయంలో తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామంటూ అన్ని వర్గాల ప్రజలు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన సభల్లో ఏకంగా 95 వేల మందికి పైగా సంతకాలు చేశారు. ఇందులో టీడీపీ మద్దతుదారులు కూడా పాల్గొనడం బాబు ప్రభుత్వ దుర్మార్గ విధానాలపై ప్రజల వ్యతిరేకతకు అద్దం పడుతోంది. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యాక్రమాల ద్వారా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సంతకాల సేకరణ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాం. ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గమైందని తమ సంతకం ద్వారా ప్రజలు తేల్చిచెబుతున్నారు. – దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, విజయవాడ తూర్పు నియోజకవర్గం -
హైవేపై నెత్తుటి ధార
కంచికచర్ల: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (హైవే 65) నిత్యం రక్తమోడుతోంది. ఎక్కడో ఒక చోట రోజూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నెత్తుటి ధారకడుతోంది. ఈ రహదారిపై నిత్యం వేలాదిగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. హైవే డిజైన్లో ఉన్న లోపాలే రోడ్డు ప్రమాదాలకు కారణాలని విశ్లేషకులు పేర్కొంటు న్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని గరికపాడు చెక్పోస్టు నుంచి విజయవాడ వరకు 90 కిలో మీటర్ల జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ పరిధిలో ఏదో ఒక చోట రోజూ జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొందరు క్షతగాత్రులవుతు న్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం వాటి నివారణ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు బస్సులదే అగ్రస్థానం జాతీయ రహదారిపై ఎక్కువగా బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువగా ప్రైవేటు బస్సుల వల్ల ప్రమాదాలు జరగడం గమనార్హం. మితిమీరిన వేగంతో బస్సులు నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటంతో పాటు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిం చటం ప్రమాదాలకు కారణమేనని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని సార్లు డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. డిజైన్ లోపం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు 65వ నంబరు జాతీయ రహదారి నిర్మాణానికి సక్రమంగా డిజైన్ చేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించకపోవటంతో పాటు అవసరమైన ప్రదేశాలు, మలుపుల వద్ద ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు, రోడ్డు క్రాస్ చేసే వద్ద జీబ్రా గుర్తులు లేకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వివరిస్తున్నారు. పోలీసులు గుర్తించిన బ్లాక్స్స్పాట్లు జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను పోలీసులు బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. జగ్గయ్యపేట నుంచి గొల్లపూడి వరకు 30 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని తేల్చారు. జగ్గయ్య పేట పరిధిలో షేర్మహ్మద్ పేట క్రాస్ రోడ్డు, తిరు మలగిరి క్రాస్రోడ్డు, గట్టు భీమవరం క్రాస్రోడ్డు, కొణకంచి క్రాస్రోడ్డు, నవాబుపేట, తోటచర్ల, నంది గామ పరిధిలో మునగచర్ల, అనాసాగరం, వై జంక్షన్, అంబారుపేట వద్ద, కీసర సమీపంలో మద్రాస్ కేఫ్, బీజేటీ డిగ్రీ కళాశాల క్రాస్ వద్ద, పేరకలపాడు క్రాస్రోడ్డు, కంచికచర్ల చెరువుకట్ట వద్ద, పరిటాల ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో, దొనబండ క్రాస్రోడ్డు, ఇబ్రహీంపట్నం పరిధిలో కేతనకొండ, మూల పాడు, నిమ్రా మెడికల్ కాలేజీ వద్ద, పశ్చిమ ఇబ్రహీంపట్నం, వీటీపీఎస్కు వెళ్లే కెనాల్, రాయనపాడు క్రాస్రోడ్డు, నల్లకుంట పలు ప్రాంతాల్లో పోలీసులు బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఈ ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల నందిగామ సమీపంలోని అనాసాగరం వద్ద ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు సుగర్లోడుతో వెళ్తున్న లారీని వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా, మరో ఎనిమిది మందికి స్వల్పంగా గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఇటీవల మునగచర్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 28న నందిగామ సమీపంలోని అనాసాగరం వద్ద టైర్ పంక్చరయి రోడ్డుపై ఆగిఉన్న లారీని హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి రోడ్డు వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో హైవేపై రెండేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 754 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. మరో 1500 మంది వరకు గాయాలపాలయ్యారని పోలీస్ అధికారులు తెలిపారు. బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో మొక్కబడిగా ప్లాస్టిక్ డ్రమ్ములు మాత్రమే ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులతో పాటు జీబ్రా గుర్తులు, రెడ్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
ఉపాధి విభాగాధిపతుల పాత్ర కీలకం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు):యువతను ఉద్యోగ సనద్థులుగా చేయడంలో కళాశాల ఉపాధి విభాగాధిపతుల పాత్ర చాలా కీలకమని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కళాశాలల శిక్షణ ఉపాధి విభాగాధిపతుల సమాఖ్య, సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల ఉపాధి విభాగాధిపతుల శిక్షణ కార్యక్రమం (ప్లేస్మెంటర్–2025) సిద్ధార్థ కళాశాల ఆవరణలోని వెబ్నార్ హాలులో శనివారం జరిగింది. వాసంశెట్టి సుభాష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గూగుల్, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఎక్సెంచ్యూర్ వంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థలు మన రాష్ట్రంలో ఆయా సంస్థల శాఖలను ప్రారంభిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి తరుణంలో కళాశాలల నుంచి లక్షల సంఖ్యలో బయటికి వస్తున్న పట్టభద్రులు, యువతను ఉద్యోగ సన్నద్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధి విభాగాధిపతులపైనే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎస్.ఎస్. కన్వెన్షన్ లో డిసెంబర్ 12,13,14 తేదీల్లో నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్పో పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నే ఇంద్రజిత్, ఇన్ఫోసిస్ విశాఖపట్టణం సెంటర్ హెడ్ నర్రా సురేష్, హెచ్సీఎల్ టెక్నాలజీ ప్రతినిధి బొర్రా సురేష్ బాబు మాట్లాడారు. సిద్ధార్థ కళాశాల డీన్ రాజేష్ సీ.జంపాల, ఆంధ్రప్రదేశ్ శిక్షణా ఉపాధి అధికారుల సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ ఎన్వీ సురేంద్ర బాబు, కార్యదర్శి జగదీష్, సంయుక్త కార్యదర్శులు కావూరి శ్రీధర్, హిమబిందు, సభ్యుడు శివ నాగేశ్వరరావు తదితరులున్నారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ -
పనులను రద్దు చేసే అధికారం సీఈఓకు లేదు
జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆమోదంతో తీర్మానం చేసి కేటాయించిన పనులను రద్దు చేసే అధికారం సీఈఓకు లేదని ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ స్పష్టంచేశారు. సమావేశానికి హాజరైన ఆయన సభ్యుల ఆవేదనను చూసిన అధికారు లతో మాట్లాడారు. చైర్పర్సన్, జెడ్పీటీసీ సభ్యుల సమన్వయంతో నడవాల్సిన సీఈఓ ఏకపక్షంగా వ్యవహరించడం భావ్యం కాదన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే జెడ్పీ సర్వసభ్య, స్థాయీ సంఘ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. ఒకసారి పరి పాలన అనుమతులు ఇచ్చాక లోటు బడ్జెట్ ఉన్నప్పటికి రాబోయే నిధుల నుంచి పనులకు బిల్లులు చెల్లించాలని సూచించారు. జెడ్పీ నిధులపై సభ్యులకు అధికారం ఉందా? లేదా? అని నిలదీశారు. సమావేశంలో తీర్మానం చేయడం అంటే అది ఒక హామీ లాంటిదని, దానిని సీఈఓ అవహేళన చేశా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటాయించిన 424 పనుల్లో ఇప్పటి వరకు 50 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను వచ్చే నిధులతో చేపట్టకుండా, ఎమ్మెల్యే లేఖల సిఫార్సులతో నిధులు మళ్లించడాన్ని తప్పుబడ్డారు. -
చిన్నారుల పెదవులపై చిరునవ్వులు!
గన్నవరం రూరల్: చిన్నారుల్లో గ్రహణం మొర్రి, అంగిలి చీలిక, చీలు పెదవి ఇవన్నీ తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తాయి. బిడ్డల జీవితంపై ప్రభావితం చూపుతాయి. దీంతో బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు వేదనతో కుంగిపోతారు. అయితే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతోంది. ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రాం. పైపెదవిలో ఏర్పడే చీలికను గ్రహణం మొర్రి లేదా చీలిక పెదవి అంటారు. ఇది తల్లి గర్భంలోనే ఏర్పడుతుందని, బిడ్డకు పుట్టుకతోనే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. జన్యు లోపాలు, కణజాలం అభివృద్ధిలో సమస్యలు కారణంగా చీలిక పెదవి ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. ఈ సమస్యలకు ఆపరేషన్ స్మైల్ పరిష్కార వేదికగా నిలుస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఆపరేషన్లు చేసి గ్రహణం మొర్రి పెదవులపై చిరునవ్వులు పూయిస్తున్నారు. 2002 నుంచి మొదలైన ఈ కార్యక్రమం ఇప్పటికీ 18వ విడత ఆపరేషన్లతో కొనసాగుతుంది. 40దేశాలకు చెందిన నిపుణులైన 43 మంది వైద్య బృందం సేవల్లో పాల్గొంటుంది. వీరిలో నలుగురు సర్జన్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, డెంటిస్ట్లు, పీడియాట్రిక్ నిపుణులు సేవలందిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకూ ఉచిత ఆపరేషన్ల వైద్య శిబిరం కొనసాగుతుందని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ మెడికల్ కళాశాల బోధనాస్పత్రి ఏవో కె.నవీన్ చెప్పారు. జన్యుపరమైన లోపాలు, కణజాలం అభివృద్ధిలో సమస్యలు, పొగతాగే కుటుంబాల్లో, కట్టెల పొయ్యిపై వంటలు చేసే కుటుంబాల్లో పొగ వల్ల, తల్లులలో న్యూట్రీషన్ లోపాలు, గర్భస్థ సమయంలో మందులు సరిగా వాడకపోవటం వంటి కారణాలు ప్రధానంగా ఈ గ్రహణం మొర్రికి కారణమవుతాయని నిపుణులు చెప్పారు. రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రహణం మొర్రి రోగులు.. శ్రీకాకుళం మొదలుకుని చిత్తూరు వరకూ, మరోవైపు తెలంగాణ జిల్లాల నుంచి ఆపరేషన్లు చేయించేందుకై తమ బిడ్డలను తీసుకుని తల్లిదండ్రులు డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ ఆస్పత్రికి వచ్చారు. వీరందరికీ ఆస్పత్రి యాజమాన్యం వసతి, భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేసింది. మెడికల్ కళా శాల డాక్టర్లు తల్లిదండ్రులను, గ్రహణం మొర్రి బాలలకు అవగాహన కల్పిస్తూ వారిలో మనోధైర్యాన్ని పెంపొందిస్తున్నారు. ఈ నెల 23న ప్రారంభమైన ఆపరేషన్లు రోజుకు 15 చొప్పున చేస్తున్నట్లు వైద్య బృందం సాక్షికి తెలిపింది. మొత్తం 70 సర్జరీలు లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఉన్నత ప్రమాణాలతో వైద్యం... డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ మెడికల్ కళాశాల, భోధన ఆస్పత్రి పార్టనర్ షిప్తో బెంగళూరుకు చెందిన డాక్టర్ సందీప్ రాల్సన్ సర్జరీ టీమ్ లీడర్గా విదేశీ వైద్య బృందం ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ వైద్యం అందిస్తోంది. విదేశీ వైద్య బృందం ప్రతినిధులు మాట్లాడుతూ డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ వైద్య కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు సంపూర్ణ సహకారంతో 18వ విడత ఈ ఆపరేషన్లు చేయడానికి తమకు బలాన్నిచ్చిందని చెప్పారు. ఆపరేషన్ థియేటర్లు, వసతి, నర్సింగ్ కేర్, వైద్యుల సహకారం, పరిపాలన అధికారుల మద్దతు కొండంత అండగా నిలిచాయన్నారు. వారి పార్టనర్ షిప్తో ఇప్పటికీ 1800 ఆపరేషన్లు దిగ్విజయంగా నిర్వహించారన్నారు. ఇది ఒక నిరంతర స్రవంతి అని చెప్పారు. గ్రహణం మొర్రి, అంగిలి చీలిక, చీలి పెదవి ముఖాలపై చిరునవ్వుల వెలుగులు ఆపరేషన్ స్మైల్ లక్ష్యమన్నారు. బాలలతో విదేశీ వైద్య బృందం ప్రతినిధులు మమేకమై ఆటపాటలు, డ్యాన్స్లు చేస్తూ, చిన్న బిడ్డలను లాలిస్తూ వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలోని కొత్తగూడెం, భద్రాద్రి, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నారు. మరింత మందికి ఈ సమాచారం తెలియాలని, వారందరికీ ఆపరేషన్ స్మైల్ ద్వారా సేవలందించి వారిలో ఉన్న ఆత్మన్యూనతను తొలగించి వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలపటమే లక్ష్యమన్నారు. ఆపరేషన్ స్మైల్ అందించే సేవలు ఎంతో గొప్పవి. గ్రహణం మొర్రితో పుట్టిన బిడ్డల తల్లిదండ్రుల వేదనను తొలగించే మహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ బిడ్డలు ఆత్మన్యూనతలోకి వెళ్లకుండా బాల్యంలోనే సమస్య తొలగిస్తున్నారు. ఈ యజ్ఞంలో భాగస్వాములు కావటం అదృష్టంగా భావిస్తున్నాము. రెండు రాష్ట్రాల నుంచి రోగులు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. విదేశీ వైద్య బృందం ఈ సేవలలో పాల్గొనడం ద్వారా ప్రతి ఒక్కరికీ సేవా భావం ఉండాలన్న గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. ఆపరేషన్ స్మైల్ స్పూర్తిని అందరం స్వీకరించాలి. –డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల డైరెక్టర్ జనరల్ ఆపరేషన్ స్మైల్తో గ్రహణం మొర్రికి శాశ్వత పరిష్కారం తల్లిదండ్రుల వేదనకు స్వస్తి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో 43 మంది విదేశీ వైద్య బృందంతో సేవలు ఆంధ్రా, తెలంగాణ నుంచి వచ్చిన రోగులకు ఉచిత ఆపరేషన్లు -
● 7 లక్షల మంది మాలధారులు వస్తారని అంచనా● ఏకాంతంగా ఆర్జిత సేవలు
11 నుంచి భవానీ దీక్షల విరమణ భవానీపురం(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ తెలిపారు. శనివారం తన చాంబర్లో దుర్గగుడి ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. దీక్షల విరమణ 11వ తేదీ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతితో ముగుస్తుందని తెలిపారు. ఈ ఐదు రోజులపాటు దాదాపు ఏడు లక్షల మందికిపైగా భవానీ భక్తులు దీక్ష విరమణకు ఇంద్రకీలాద్రికి తరలి వస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రతిష్టాపన, శత చండీయాగం, గిరి ప్రదక్షిణ వంటి ప్రధాన క్రతువులు జరుగుతాయని వివరించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక క్యూలైన్లు, వెయిటింగ్ హాళ్లు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రసాదం, అన్నదానం పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, బందో బస్తు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా డిసెంబర్ 11 నుంచి 16వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసి ఏకాంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ నాలుగో తేదీన కలశజ్యోతి మహోత్సవం జరుగుతుందని తెలిపారు. -
మానసికోల్లాసానికి క్రీడలు దోహదం
మైలవరం: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల హానరరీ చైర్మన్ లకిరెడ్డి జయప్రకాష్రెడ్డి తెలిపారు. కళాశాలలో జేఎన్టీయూకే సెంట్రల్ జోన్ వాలీబాల్ ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ పోటీలు శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ నెల 29, 30 రెండు రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జయప్రకాష్రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుంటారని చెప్పారు. కళాశాలలో క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఈ టోర్నమెంట్లో ఆయా జిల్లాలకు చెందిన 44 ఇంజినీరింగ్ కళాశాలల వాలీబాల్ టీమ్లు పాల్గొంటున్నాయని తెలిపారు. డాక్టర్ జీపీ రాజు మాట్లాడుతూ క్రీడల ద్వారా క్రమ శిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయని పేర్కొన్నారు. క్రీడలు ద్వారా శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉంటారన్నారు. ఆయా టీమ్ల నుంచి యూనివర్శిటీ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన టీమ్ జేఎన్టీయూకే కాకినాడలో డిసెంబర్ 10వ తేదీ నుంచి జరగబోయే సౌత్ జోన్ ఆలిండియా టోర్నమెంట్లో పాల్గొంటుందని వివరించారు. కళాశాల ప్రెసిడెంట్ జి. శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అప్పారావు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రమేష్రెడ్డి, సెలక్షన్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, ఎల్. కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా పీడీ డాక్టర్ యన్వీ రాజ్కుమార్ వ్యవహరించారు. -
అతివేగానికి రెండు ప్రాణాలు బలి
●జాతీయ రహదారిపై డివైడరును ఢీకొన్న బైక్ ● ఇద్దరు దుర్మరణం కంకిపాడు: అతి వేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. బైక్ డివైడరును ఢీకొనటంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విజయవాడ–మచిలీపట్నం జాతీయరహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కంకిపాడు మండలం కోలవెన్ను శివారు కోమటిగుంటలాకులకు చెందిన సందోలు నరసింహులు (45), ఉయ్యూరుకు చెందిన పచ్చిగళ్ల దానియేలు (25) బంధువులు. శుక్రవారం నరసింహులు ఉయ్యూరు వెళ్లి బంధువులను కలిశాడు. రాత్రి పొద్దుపోయిన తరువాత తనను స్వగ్రాౖమమైన కోమటిగుంట లాకులు వద్ద దింపాలని కోరటంతో పచ్చిగళ్ల దానియేలు బైక్పై నరసింహులును దించేందుకు బయలుదేరాడు. వీరి బైక్ నెప్పల్లి సెంటరు దాటిన తరువాత ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి మధ్యన ఉన్న డివైడరును ఢీకొన్న బైక్ వేగంగా డివైడరు మధ్యన ఉన్న చెట్లను ఢీకొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో నరసింహులు, దానియేలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్, అదనపు ఎస్ఐ తాతాచార్యులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రెండు మృతదేహాలు రోడ్డు మధ్యన పడి ఉండటాన్ని ఉదయం వరకూ ఎవరూ గుర్తించలేదు. కనీసం 108కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది కూడా శనివారం ఉదయం 8 గంటల తరువాతే. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సైతం అదే సమయంలో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నందిగామ టౌన్:పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం పక్కనున్న అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఓ వ్యక్తి ఐదవ అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన దున్న వెంకట్రావ్ (54) గత కొంత కాలంగా పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం పక్కనున్న అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తులో అద్దెకుంటున్నాడు. ఈయన టైలర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం సమయంలో కిందకు దూకటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య వివరాలు తెలియాల్సి ఉంది. -
అధ్వానంగా సాగర్ మేజర్లు
చంద్రబాబు కంటే తుపానే నయం మోపిదేవి(అవనిగడ్డ): చంద్రబాబు ప్రభుత్వం కంటే మొంఽథా తుఫానే నయమని అది సగం మంది రైతులనే నష్టపరచగా, ఈ ప్రభుత్వం రైతులందరినీ ముంచేసిందని వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. రైతువిభాగం జోనల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుతో కలసి కృష్ణాజిల్లా చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. రహదారుల వెంబడి, పొలాల పక్కన ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడారు. మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో రైతుసేవా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ రైతులను పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులపై మీడియాలో వార్తలు రావడం, వైఎస్సార్ సీపీ నాయకులు పల్లెల్లో పర్యటిస్తున్నందునే అధికారులు, సిబ్బంది కదిలారని అన్నారు. ధాన్యాన్ని ఎందుకు కొనరు?. సాగు ఆరంభంలో 1318 అనే రకం విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేసిందని, తీరా పంట పండించిన తరువాత ఆరకం ధాన్యాన్ని కొనకపోతే రైతులు ఏమై పోవాలని పేర్ని నాని ప్రశ్నించారు. విత్తనాలు, ఎరువులు సరిగా సరఫరా చేయలేకపోయిన ప్రభుత్వం, కనీసం రైతులు పండించిన ధాన్యాని అయినా మంచి రేటుకు కొనుగోలు చేయాలన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. మిల్లర్లపై ఆధారపడితే మీరెందుకు? రైతులు చమటోడ్చి పండించిన ధాన్యాన్ని రైస్మిల్లర్లు, బేరగాళ్ల (మధ్యవర్తుల) దయాదాక్షిణ్యాల మీద అమ్ముకోవాల్సిన ఆగత్యం ఏమిటని పేర్ని నాని ప్రశ్నించారు. నేడు ఎక్కడ చూసినా రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునే దృశ్యాలే కనబడుతున్నాయన్నారు. రైతు సేవాకేంద్రాల్లో సంచులు అందుబాటులో లేవని, రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలంటే మిల్లర్లపైనే ఆధార పడాల్సి వస్తుందన్నారు. ఈ మాత్రం దానికి ప్రభుత్వం ఎందుకని నిలదీశారు. ఇదేనా సీఎం చంద్రబాబుకు ఉన్న 40 ఏళ్ల అనుభవం అని ప్రశ్నించారు. ఇందుకు చంద్రబాబే ఎందుకు? ఎవరిని కుర్చీ ఎక్కిచ్చినా సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశారు. మొదట్లో ఎమ్మార్వోలు ధాన్యం కొనుగోలు చేసేవారని, తరువాత బ్యాంకులు, పీఏసీఎస్లు ద్వారా కొన్నారని, అవి కూడా పోయి ఈరోజు ప్రైవేటు వ్యక్తులతో కొనుగోలు కేంద్రాలను నడిపిస్తూ రైతుల వెన్నువిరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే కూటమి పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కనబడకపోవడం శోచనీయమన్నారు. మంత్రి నాదెండ్ల కనిపించరే.. మంత్రి నాదెండ్ల మనోహర్ నెలరోజుల కిందట ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారని, అందులో హాయ్ అని మెసేజ్ పెడితే ఓయ్ అని మీ ఊర్లోకి వస్తామని చెప్పిన ఆయన ఒక్క ఊరికన్నా వచ్చారా అని పేర్ని నాని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా రోడ్లు వెంట, సందుల వెంట ధాన్యం పెట్టుకుని రైతులు ఇబ్బందులుపడుతుంటే ఓయ్ అంటూ మంత్రి నాదెండ్ల ఎందుకు రావడం లేదని నిలదీశారు. -
సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
విజయవాడలీగల్: ప్రజలు సైబర్ నేరాల బారినపడకుండా అవగాహన కల్పిస్తూ వారి ఆస్తులను కాపాడుతున్నామని విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎస్వి రాజశేఖర్బాబు అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్లో న్యాయవాదులకు శుక్రవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా పోలీసు కమిషనర్ ఎస్వి రాజశేఖర్బాబు మాట్లాడుతూ నగరంలో హెల్మెట్లు వాడకం తప్పనిసరి చేయడంతో ఎక్కువ మంది ప్రజలు హెల్మెట్లు ధరిస్తున్నారన్నారు. దీంతో 87శాతం వాహన ప్రమాదాలలో మరణాలు తగ్గాయని తెలిపారు. నగరం నలుమూలల సీసీకెమెరాల ఏర్పాటుతో నేరశాతం తగ్గిందని వివరించారు. సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న మాట్లాడుతూ సైబర్ నేరాల తీరు, వాటిని నిలువరించేందుకు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం సీపీ, డీసీపీలను బిబిఎ అధ్యక్షులు ఎ.కె.బాషా, గవర్నింగ్ బాడీ, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్కుమార్, వేముల హజరత్తయ్య గుప్తా, న్యాయవాదులు సత్కరించారు. కిడ్నీ వ్యాధి బాధితురాలు మృతి తిరువూరు: కిడ్నీవ్యాధి బారిన పడి ఏకొండూరులో మరో మహిళ గురువారం రాత్రి మృత్యువాత పడింది. ఏకొండూరు చైతన్యనగర్కు చెందిన బాణావతు పీరీ(55) ఎనిమిదేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోంది. వ్యాధి తీవ్రతతో మృతిచెందింది. పీరీ మృతదేహాన్ని సీపీఎం నాయకులు పానెం ఆనందరావు, జెట్టి వెంకటేశ్వరరావు, అమ్మిరెడ్డి, కుమార్నాయక్ సందర్శించి నివాళులర్పించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 20257సుబ్రహ్మణ్యుని సేవలో.. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ ఇ.సాంబశివప్రతాప్ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. లబ్బీపేట: వైద్య విద్యార్థుల కోసం రూ.35లక్షలతో బస్సును అందజేసిన డాక్టర్ యలమంచిలి రాజారావును ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు సత్కరించారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. -
హామీల అమలుకు డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికల ప్రచారం, యువగళం పాదయాత్రలోనూ రాష్ట్రమంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.వలరాజు, బందెల నాసర్జీ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మంత్రి లోకేష్ విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు. తన చేతగానితనంతో విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తుంటే విద్యాసంస్థల్లో రాజకీయ ప్రసంగాలు చేయకూడదంటున్న మంత్రి నారా లోకేష్, యువగళం పాదయాత్రలో విద్యార్థులతో రాజకీయం చేయలేదా? అని ప్రశ్నించారు. మంత్రి లోకేష్ తన ప్రాపకం పెంచుకునేందుకే విద్యార్థి సంఘాల నేతలతో చర్చించారని, హామీల అమలుపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని, అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని, మూసివేసిన పాఠశాలలను తెరిపిస్తామని హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిన వైనాన్ని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ధర్నా చౌక్ నుంచి బయటకు వస్తున్న విద్యార్థులను పోలీసులు నియంత్రించారు. ఆ సమయంలో పోలీసులు, విద్యార్థి సంఘ నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థులు రోడ్డుపై భైఠాయించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ మస్తాన్ షరీఫ్, బండి చలపతి, నాగభూషణ్, నవ్య శ్రీ సాయికుమార్, రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.కార్తీక్, హనుమంతు ప్రతాప్, నాగరాజు, శేషం మహేంద్ర, మాధవ్, ప్రవీణ్, బాబ్జి, రవి, తేజ, వెంకట్ యామిని, భవిత, షణ్ముఖ్ ప్రియ, భాను, మౌలిక, ప్రమొద తదితరులు పాల్గొన్నారు. -
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు
నందిగామ రూరల్: లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన నందిగామ పట్టణ శివారు అనాసాగరం సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు జగ్గయ్యపేట నుంచి సిమెంట్ లోడుతో అవనిగడ్డ వెళ్తున్న లారీని గురువారం అర్ధరాత్రి సమయంలో అనాసాగరం సమీపంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వస్తున్న కారు వెనుకగా బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయవాడ లబ్బీపేటకు చెందిన చెరుకూరు చంద్రశేఖర్ (54) అక్కడికక్కడే మృతి చెందగా కారు డ్రైవర్ యలమంచిలి జగదీష్తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న సీఐ వైవీఎల్ నాయుడు సిబ్బందితో అక్కడకు చేరుకుని మృతదేహాన్ని, క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వాహనాలను పక్కకు తొలగించి ట్రాపిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్ బిట్రా పుల్లారావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా మృతుడు చంద్రశేఖర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నాడు. రూ.కోట్లు విలువ చేసే కారు ప్రమాదంలో నుజ్జునుజ్జయింది. ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు -
ఆక్స్ఫర్డ్ స్కూల్ ఘటనపై విద్యాశాఖ అధికారుల విచారణ
ఇబ్రహీంపట్నం: అయ్యప్ప దీక్షలో ఉన్న విద్యార్థిని కొట్టిన గుంటూరు ఆక్స్ఫర్డ్ పాఠశాలపై మండల విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ‘అయ్యప్ప దీక్షలో ఉన్న బాలికను కొట్టిన టీచర్’ అనే కథనం ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు స్పందించారు. ఆక్స్ఫర్డ్ స్కూల్పై విచారణ చేపట్టాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈవో–2 మాలిని పాఠశాలలో విచారణ జరిపారు. బాలికను గొడ్డును బాదినట్లు కొట్టడంపై స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.శిరీషను వివరణ కోరారు. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయురాలిపై చర్యలకు యాజమాన్యానికి సిఫార్స్ చేసినట్లు వివరణ ఇచ్చారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయ్యప్ప దీక్షలో ఉన్నందుకు కొట్టలేదని, క్లాస్లో డల్గా ఉన్నందుకు కొట్టినట్లు వివరించారు. కొట్టడం తప్పేనని ఒప్పుకున్నారు. యాజమాన్యం సూచనలతో టీచర్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలో సేకరించిన విషయాలు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎంఈవో–2 మాలిని తెలిపారు. హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం వేలేరులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన మారెళ్ల రమేష్ (33) గత కొంతకాలంగా భార్య, పిల్లలతో విభేదించి ఒంటరిగా నివసిస్తున్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవించే రమేష్ శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, మృతుడు రమేష్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటరిగా ఉంటున్న రమేష్ కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ఎవరైనా ఆత్మహత్యకు పురిగొల్పి ఉండవచ్చనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హనుమాన్జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు జగ్గయ్యపేట: అదుపు తప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై తిరుమలగిరి ఆర్చి సమీపంలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గౌరవరం గ్రామంలో వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం కోదాడకు చెందిన కంచల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, బంధువులు ఏడుగురు ఆటోలో వచ్చారు. కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి 11 గంటల సమయంలో ఆటోలో వెళ్తుండగా తిరుమలగిరి ఆర్చి సమీపంలోకి వెళ్లే సరికి బ్రేక్ ఫెయిల్ కావటంతో సమీపంలోని కాల్వలోకి ఆటో పల్టీ కొట్టింది. దీంతో శ్రీనివాసరావు(55) అక్కడికక్కడే మృతి చెందగా.. ఆటోలో ఉన్న వెన్నా వెంకట రెడ్డి, అనుపోజు వెంకట రమణలకు తీవ్ర గాయాలు కావటంతో ఖమ్మం తరలించారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. చిల్లకల్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ అక్కడకు చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
బైక్ చోరీలు.. గంజాయి విక్రయాలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసి, వాటితో గంజాయిని సేకరించి విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వన్టౌన్లోని సీసీఎస్ పోలీసుస్టేషన్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో క్రైం ఏడీసీపీ ఎం. రాజారావు వివరించారు. జల్సాల కోసం.. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడప గ్రామానికి చెందిన గుడిసె భానుప్రకాష్(22) గతంలో కూలి పనులు చేసే వాడు. మద్యం ఇతర దురలవాట్లకు బానిసై వచ్చే ఆదాయం జల్సాలకు చాలక పోవడంతో సులభంగా డబ్బు సంపాదించి విలాసాలు చేయడానికి బైక్ దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నాడు. దానికి అదే ప్రాంతానికి చెందిన మరో మైనర్ బాలుడితో కలిసి బ్యాంకులు, షాపింగ్ మాల్స్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశాలలో రెక్కీ నిర్వహిస్తూ అదను చూసుకుని పార్కింగ్ చేసిన మోటార్ సైకిల్స్ని దొంగిలిస్తున్నారు. విజయవాడ టు ఏజెన్సీ వయా కాకినాడ.. విజయవాడ, పెనమలూరు ఇతర జిల్లాల్లో దొంగిలించిన మోటార్ సైకిల్స్ని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ కోట నండూరుకు చెందిన వడ్లమూరి గంగాధర్ (గంగు భాయ్, గంగు) అనే వ్యక్తికి వీరు అందిస్తారు. గంగుభాయ్ తనతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మరొక నలుగురు వ్యక్తులు కొర్ర ఎలియా(రితిక్), గెమ్మిల్లి త్రినాథ్ (బత్తు), పొంగి శివ, పంతాల కొండబాబు (బాలరాజు, బాల)తో కలిసి ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్లి, మోటార్ సైకిళ్లు అక్కడ వారికి ఇచ్చి.. డబ్బులకు బదులుగా వారి వద్ద నుంచి గంజాయి తీసుకుని వస్తుంటారు. వీరందరూ కలిసి ఆ గంజాయిని విజయవాడ పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయాలు చేస్తుంటారు. పటమటలో అదుపులోకి.. ఈ ముఠా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు, కృష్ణాజిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్కు సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, కాకినాడకు సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, తెలంగాణకు సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మొత్తం 14 మోటార్ సైకిళ్లను చోరీ చేశారు. వీటిపై విజయవాడ కమిషనర్ రాజశేఖర్బాబు ఆదేశాల మేరకు నిఘా ఉంచిన సీసీఎస్ పోలీసులు శుక్రవారం వారికి అందిన సమాచారం మేరకు పటమట ఆటోనగర్ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులను, ఒక మైనర్ బాలుడిని అదుపులోనికి తీసుకుని విచారించారు. సిబ్బందికి అభినందన.. వారి వద్ద నుంచి 14 మోటార్ సైకిల్స్, ఐదు కిలోల గంజాయిని స్వాదీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. గంజాయి విలువ సుమారు లక్ష వరకూ ఉంటుందని, వాహనాల విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని ఏడీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా మోటార్సైకిల్స్, గంజాయిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ సీఐ పీ.శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్స్ ఎం. సురేష్, ఎస్. వేణు గోపాల్, కానిస్టేబుల్స్ అప్పలరాజు, ఫణిరాజు పటమట పోలీసు సిబ్బంది ఏఎస్ఐ విజివిడి.ప్రసాద్, హెడ్ కానిస్టేబల్, ఎస్.కిషోర్బాబులను కమిషనర్ రాజశేఖర్బాబు అభినందించినట్లు ఏడీసీపీ రాజారావు వివరించారు. -
ప్రత్యేక రైళ్లు డిసెంబర్ వరకు పొడిగింపు
రైల్వేస్టేషన్( విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతా ల నుంచి ఇప్పటికే నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను డిసెంబర్ నెలాఖరు వరకూ పొడిగించి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్ ప్రకటనలో తెలిపారు. రైళ్లు ఇవే.. డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి బుధవారం సంబల్పూర్–ఈరోడ్ (08311), డిసెంబర్ 5 నుంచి జనవరి 2 వరకు ప్రతి శుక్రవారం ఈరోడ్–సంబల్పూర్ (08321), డిసెంబర్ 1 నుంచి 29 వరకు ప్రతి సోమవారం విశాఖపట్నం–తిరుపతి (08583), డిసెంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి మంగళవారం తిరుపతి–విశాఖపట్నం (08584), డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి బుధవారం విశాఖపట్నం–తిరుపతి (08547), డిసెంబర్ 4 నుంచి జనవరి 1 వరకు ప్రతి గురువారం తిరుపతి–విశాఖపట్నం (08548), డిసెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం విశాఖపట్నం– చర్లపల్లి (08579), డిసెంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం చర్లపల్లి–విశాఖపట్నం (08580), డిసెంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం విశాఖపట్నం–బెంగళూరు (08581), డిసెంబర్ 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం బెంగళూరు–విశాఖపట్నం (08582), డిసెంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం భువనేశ్వర్–యశ్వంత్పూర్ (02811), డిసెంబర్ 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం యశ్వత్పూర్–భువనేశ్వర్ (02812), డిసెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం సోలాపూర్–అనకాపల్లి (01477), డిసెంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం అనకాపల్లి–సోలాపూర్ (01478), డిసెంబర్ 1 నుంచి 29 వరకు ప్రతి సోమవారం షాలీమార్–ఎంజీఆర్ చైన్నె (02841), డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి బుధవారం ఎంజీఆర్ చైన్నె–షాలీమార్ (02842) రైళ్లు నడవనున్నాయి. -
అపూర్వ సాయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్ధులు యలమంచిలి హైమవతి, డాక్టర్ రాజారావు రూ.35లక్షల విలువగల బస్సును వైద్యకళాశాలకు బహూకరించారు. వైద్య విద్యార్థులు పాత ఆస్పత్రికి, గ్రామీణ ప్రాంతాలకు వెవెళ్లేందుకు వీలుగా అందజేసిన ఈ బస్సును ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, కామినేని శ్రీనివాస్, డాక్టర్ యలమంచిలి రాజారావు, డాక్టర్ హైమావతి,వె వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ గోవిందు, న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ బాబ్జి శ్యామ్కుమార్,, పూర్వ విద్యార్థులు డాక్టర్ వీఎన్ వరప్రసాద్, డాక్టర్ అమ్మన పాల్గొన్నారు. మహిళా విద్యకు ఆద్యుడు పూలే కేయూ ఉపకులపతి ఆచార్య కె.రాంజీ కోనేరుసెంటర్: అఖండ భారతదేశంలో మహిళా విద్యకు ఆద్యుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని సందర్భంగా శుక్రవారం విశ్వవిద్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉపకులపతి రాంజీ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం రావడానికి వందేళ్ల ముందే మహిళా విద్య అవశ్యకతను గుర్తించి వారి కోసం పాఠశాలలు, వసతి గృహాలు కట్టించిన నిజమైన సామాజిక ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. అందుకే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన గురువు ఫూలే అని ప్రకటించుకున్నారన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు తీసుకురావడానికి ఫూలేనే స్ఫూర్తిగా నిలిచారని గుర్తుచేశారు. కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష తదితరులు ప్రసంగించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, సహాయ ఆచార్యులు దుర్గా ప్రసాద్, శాంతి కపా, కవిత, రామాంజనేయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నిర్వహించే డిసెంబర్ –2025 టర్మ్ ఎండ్ పరీక్షలు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకూ జరుగుతాయని ఇగ్నో ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె. సుమలత ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో ఆరు పరీక్ష కేంద్రాలను విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూల్, అనంతపురం ప్రాంతాలలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులందరికీ హాల్ టికెట్స్ ఇగ్నో వెబ్ సైట్ నందు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్స్ని ఇగ్నో విశ్వవిద్యాలయపు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబందించి అభ్యర్థులు తమతమ అధ్యయన కేంద్రాలను థియరీ పరీక్షల అనంతరం సంప్రదించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కొత్తపేటలోని హిందూహైస్కూల్ ప్రాంగణంలో గల ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా, ఈ మెయిల్ ద్వారా గాని లేదా 0866–2565253 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. గోశాల నిర్మాణానికి భూమి పూజ భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి పోరంకిలో ఉన్న వేద పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించనున్న గోశాలకు శుక్రవారం భూమి పూజ చేశారు. సుమారు 40–50 గోవులకు ఆశ్రయం కల్పించనున్న ఈ గోశాల నిర్మాణ భూమి పూజను ఆలయ వైదిక కమిటీ, స్థానాచార్యులు వి.శివప్రసాద్ శర్మ నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధి), కార్యనిర్వహణాధికారి వీకె శీనా నాయక్ పాల్గొని భూమి పూజ చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబు, అధికారులు పాల్గొన్నారు. -
ఒకే రోజు మూడు ఘటనలు..సైబర్ మోసాలతో జరభద్రం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని విద్యుత్శాఖలో పనిచేసే ఇంజినీర్ను సైబర్ నేరగాళ్లు బెదిరించి రూ.34.65 లక్షలు కొట్టేశారు. అతని వద్ద డబ్బులు లేక పోతే పర్సనల్ లోన్ పెట్టించి మరీ తమ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. వారు చెప్పే మాటలకు భయబ్రాంతులకు గురైన ఇంజినీర్ వేరే వారికీ చెప్పకుండా, వారు అడిగిన మొత్తం ఇచ్చేసిన తర్వాత మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బెంగళూరులో కేసు అని చెప్పి.. విద్యుత్శాఖలో ఇంజినీర్(38) ఎనికేపాడులో నివాసం ఉంటారు. అతనికి ఈ నెల 20న తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. ‘మీ పేరున ఈ ఏడాది జూలై 2న బెంగుళూరులో సిమ్కార్డు రిజిస్ట్రేషన్ అయి ఉందని, ఆ నంబర్ నుంచి కొందరు మహిళల వీడియోలు, ఫొటోలు సర్క్యులేట్ అవడంతో బెంగళూరు అశోక్నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిపారు. కేసు నంబర్ సైతం తెలియజేసి రెండు గంటల్లో స్టేషన్లో ఉండాలన్నారు. దీంతో కంగుతిన్న ఇంజినీర్ తాను విజయవాడలో ఉంటానని చెప్పడంతో సరే లైన్లో ఉండూ అంటూ మరో నంబర్కు కలిపారు. అవతలి నుంచి మాట్లాడుతూ మీ ఆధార్ నంబర్ చెప్పమని అడిగారు. నంబర్ చెప్పగానే మీ పేరున ముంబైలో ఉమెన్ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ కేసులు నమోదై ఉన్నట్లు చెప్పారు. వెంటనే అరెస్టు చేస్తామని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. మీ ముంబైలో ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. దాని నుంచి రూ.3కోట్ల లావాదేవీలు కూడా చేశారంటూ డెబిట్ కార్డు కూడా ఉందని, దాని నుంచి ఉమెన్ ట్రాఫికింగ్లో మయన్మార్, కొలంబియా, ఫిలిప్పీన్స్కు విమాన టికెట్స్ కూడా బుక్ చేశారంటూ మరింత బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి ప్రతి రెండు గంటలకు ఒకసారి 20, 21, 22 తేదీల్లో ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సీబీఐకి ట్రాన్స్ఫర్ అంటూ.. కాగా ఈ నెల 24న కేసు ఫైల్చేసి సీబీఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటూ సీబీఐ ప్రొఫైల్ ఉన్న నంబర్తో వాట్సాప్ కాల్ చేశారు. మీ అకౌంట్ నుంచి రూ.3కోట్లు లావాదేవీలు జరిగినవి.. 10 శాతం కమీషన్ రూ.30 లక్షలు, ష్యూరిటీ రూ.65 లక్షలు డిపాజిట్ చేయాలని చెప్పారు. అంత డబ్బులు తన వద్ద లేవని చెప్పగా, ప్రభుత్వ ఉద్యోగివి కదా లోన్ తీసుకోమంటూ సలహా ఇచ్చారు. దీంతో ఎస్బీఐలో పర్సనల్ లోన్ తీసుకుని రూ.34.65లక్షలు వారు చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.34.65 లక్షలు కొట్టేసిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమృతంతో పాటు హాలాహలం పుట్టిందట! సౌకర్యాలెన్నో తెచ్చిన డిజిటల్ సాంకేతికత విసురుతోన్న తాజా సవాళ్లను చూస్తే అదే గుర్తొస్తోంది. రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు, పెచ్చుమీరుతోన్న డిజిటల్ స్కామ్లే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ‘డిజిటల్ అరెస్ట్’బారినపడిన ఓ ఇంజినీర్ రూ. 34.65లక్షలు, రూపాయికి అర్దరూపాయి లాభం అంటూ సైబరాసురుడు విసిరిన వలకు పడిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రూ.7లక్షలు, స్టాక్ మార్కెట్ పేరుతో మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఏకంగా రూ. 43.51లక్షలు నష్టపోయిన ఉదంతాలు అమాయకుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. చదువుకున్న, ఉన్నత స్థాయి ఉద్యోగులే తమ కష్టార్జితాన్ని పోగోట్టుకోవడం చూస్తుంటే అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. -
చేనేత సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం
కృష్ణలంక(విజయవాడతూర్పు): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతున్నా చేనేత సమస్యలు పరిష్కరించలేదని, చేనేతలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆరోపించారు. గవర్నర్పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రూ.25వేలు పథకాన్ని అమలు చేయాలని, చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన రూ.203 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చని పక్షంలో ఫిబ్రవరి 2026లో జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురుగుడు సత్యనారాయణ, వృత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ మన్నూరు భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు. -
యంత్రాంగం కదలకపోతే పోరాటం చేస్తాం..
వాయుగుండాలు, తుఫాన్ల నేపథ్యంలో తక్షణమే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. నూర్చిన వెంటనే సంచులిచ్చి ధాన్యాన్ని మిల్లుకు తోలి రైతు నష్టపోకుండా ప్రభుత్వం చూడాలన్నారు. రేపటి నుంచి అధికార యంత్రాంగం కదలకపోతే వైఎస్సార్సీపీ తరపున జిల్లా, మండల కేంద్రాల్లో పోరాటం చేస్తామని పేర్ని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం మచిలీపట్నం అధ్యక్షుడు జి రాజు, ఆ పార్టీ అవనిగడ్డ, మోపిదేవి మండల కన్వీనర్లు రేపల్లె శ్రీనివాసరావు, గరికపాటి వెంకటేశ్వరరావు (బుల్లిబాబు), పలువురు నాయకులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ సన్నిధిలో నిత్యం జరిగే అన్నప్రసాద వితరణకు భక్తులు విరాళాలు అందజేశారు. హైదరాబాద్ అమీర్పేట ఎస్ఆర్నగర్కు చెందిన సారంపాటి మణి రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఆమె పేరిట రూ.1,01,116, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన శీతాల రవి, కుటుంబసభ్యులు రూ.1,00,000 అన్నప్రసాద వితరణకు విరాళం అందజేశారు. దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి వేదా శీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
167 మొబైల్ ఫోన్లు రికవరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోయిన 167 మొబైల్ ఫోన్లను సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు. వాటిని పోగొట్టుకున్న వారికి పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఆదేశాల మేరకు గురువారం సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసన్న మాట్లా డుతూ.. మొబైల్ ఫోన్ పోయినట్లు తమకు అందిన ఫిర్యాదుల మేరకు మొబైల్ సెంట్రల్ ఎక్యుప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) సేవల ద్వారా రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేశామని తెలిపారు. ఇప్పటి వరకూ 2,467 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని పేర్కొన్నారు. ఫోన్లు తీసుకునేందుకు వచ్చిన వారికి పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ బి.రాజశేఖర్, ఇన్స్పెక్టర్లు గుణరామ్, దుర్గాప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామవరప్పాడు: కృష్ణలంక పోస్ట్ ఆఫీస్లో సబ్ పోస్ట్మాస్టర్గా పని చేసిన నెమలికంటి మనోజ్ కుమార్ నివాసాన్ని గురువారం ప్రసాదంపాడులో పోస్టల్ డిమార్ట్మెంట్ అధికారులు జప్తు (సీజ్) చేశారు. మనోజ్కుమార్ విధులను దుర్వినియోగం చేసి సుమారు రూ.1.31 కోట్లు గోల్మాల్ చేశారు. పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఎం.నరసింహ స్వామి నేతృత్వంలో పోస్టల్ అధికారులు, ఏఎస్పీలు అలీ, దేవానంద్, పీఆర్ఐపీలు ఎం.వెంక టేశ్వరరావు, శ్రీనివాసరెడ్డితో కూడిన బృందం గ్రామ రెవెన్యూ అధికారి, పోలీసుల సహకారంతో ఇంటికి సీల్ వేశారు. ప్రసాదంపాడులోని వెంటేశ్వర నిలయం అపార్టుమెంట్లో ఫస్ట్ ఫ్లోర్లోని ఎఫ్ఎఫ్–1 ఫ్లాట్కు తాళాలు వేసి సీల్ వేశారు. 2022లో కృష్ణలంక పోస్ట్ ఆఫీస్లో నెమలికంటి మనోజ్కుమార్ సబ్ పోస్ట్మాస్టర్గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఖాతాదారులకు చెందిన సుమారు రూ.1.31 కోట్లను దారి మళ్లించి దుర్వినియోగం చేశారు. అప్పట్లో ఈ ఘటన వెలుగు చూడటంతో విచారణ చేసిన అధికారులు మనోజ్ కుమార్పై కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల్లో భాగంగా ప్రసాదంపాడులోని ఆయన నివాసాన్ని జప్తు చేసి పోస్టల్ డిపార్టుమెంట్కు అటాచ్ చేశారు. ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ నరసింహ స్వామి మాట్లాడుతూ.. మనోజ్కుమార్ రూ.1.31 కోట్లు గోల్మాల్ చేసిన కేసులో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం అతని నివాసాన్ని జప్తు చేశామన్నారు. అతనిపై సీబీఐ కేసు కూడా నడుస్తోందని తెలిపారు. అతనికి ఇబ్రహీంపట్నంలో కూడా ఆస్తి ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. జప్తు చేసిన నివాసాన్ని త్వరలో వేలం వేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమమని తెలిపారు. -
విభిన్న ప్రతిభావంతుల్లో మనోధైర్యం పెంచే క్రీడలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విభిన్న ప్రతిభవంతులు సకలాంగులకు దీటుగా క్రీడల్లో రాణించి సత్తా చాటాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. వైకల్యం మనిషికే గాని మనసుకు కాదన్నారు. విభిన్నప్రతిభావంతుల్లో మనోధైర్యం పెంచేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభవంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి ప్రారంభించారు. తొలుత జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన తోడ్పాటు అందిస్తే ఎటువంటి విజయాలనైన సొంతం చేసుకుంటారని, ఆంధుల తొలి టీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో మన దేశం విజయం సాదించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. భారత్ జట్టులో స్థానం పొంది విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్లు టి.దీపిక, కరుణకుమారిని ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతో పాటు వారిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఇటువంటి క్రీడా పోటీలు దోహదపడతాయన్నారు. వైకల్యాన్ని గురించి ఆలోచించక క్రీడాలలో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభావంతుడు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని కలెక్టర్ కోరారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేయతగా భావించాలన్నారు. సమాజంలో అన్ని రంగాలలో రాణించేలా విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సహకార కార్పొరేషన్ చైర్మన్ జి.నారాయణ స్వామి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా సహాయ సంచాలకుడు వి.కామరాజు మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతులకు జిల్లా స్థాయిలో జూనియర్, సీనియర్ మహిళలు, పురుషుల విభాగాల్లో చెస్, క్యారమ్స్, సాఫ్ట్ బాల్, వాలీబాల్, రన్నింగ్, ట్రై సైకిల్ రేస్, షాట్ఫుట్ వంటి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాల లకు చెందిన 300 మందికి పైగా విభిన్న ప్రతిభావంతులు పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పర్యవేక్షకులు ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. పరుగుపందెంలో పాల్గొన్న విభిన్న ప్రతిభావంతులువిభిన్న ప్రతిభావంతుల క్రీడలను ప్రారంభిస్తున్న కలెక్టర్ లక్ష్మీశఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి క్షేమం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మహంతీపురం పరిధిలో గురువారం నాలుగేళ్ల చిన్నారి తప్పి పోవడంతో తల్లిదండ్రులు కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సకాలంలో స్పందించిన స్థానికుల సహకారంతో బాలుడిని గుర్తించి తల్లికి అప్పగించారు. ఏలూరు జిల్లా పాతూరు గ్రామానికి చెందిన నాగుల్మీరా, మీరాబీ దంపతుల కుటుంబం మహంతీపురంలోని ఓ వివాహానికి హాజరైంది. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న తరుణంలో నాగుల్మీరా కుమారుడు నాలుగేళ్ల జాహిద్ ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చి తప్పిపోయాడు. కొంత సేపటి తరువాత జాహిద్ కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు కంగారు పడుతూ చుట్టు పక్కల వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం కొత్తపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఇంతలో స్థాని కులు రోడ్డుపై బాలుడు ఏడుస్తూ వెళ్లడాన్ని గమనించారు. అదే సమయంలో బాలుడి కోసం గాలిస్తున్న పోలీసులు బాలుడిని గుర్తించి తల్లికి అప్పగించారు. కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళా పీఠంలో 2025–26 విద్యా సంవత్సరానికి నాట్యంలో ప్రవేశాల ఇంటర్వ్యూలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. 133 మంది ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్నారని కళాపీఠం వైస్ ప్రిన్స్పాల్ డాక్టర్ చింతా రవిబాలకృష్ణ తెలిపారు. సర్టిఫికెట్ కోర్సుకు 47, డిప్లొమా 30, యక్షగానం 18, సాత్విక అభి నయం 10, మాస్టర్ ఆఫ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్(ఎంపీఏ)కు 28 మంది దర ఖాస్తు చేసుకున్నారని వివరించారు. సాత్విక అభినయం, యక్షగానం, ఎంపీఏకోర్సులకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలన, ఇంటర్వ్యూలను గురువారం కళాపీఠంలో నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, పసుమర్తి హరినాథశాస్త్రి పాల్గొన్నారు. స్లీప్వెల్ అగరుబత్తీల్లో పురుగు మందుల అవశేషాలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్లీప్వెల్ అగరు బత్తీల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు తేలడంతో విజయవాడలోని దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. గురువారం వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశ్వరరావు, అర్బన్, రూరల్ వ్యవసాయాధికారులు తేజస్విని, రఘురాంతో కలిసి వన్టౌన్లోని గొల్లపూడి రాధకృష్ణమూర్తికి చెందిన స్టాక్ పాయింట్ను తనిఖీ చేశారు. అతని వద్ద రూ.69.24 లక్షల విలువైన స్లీప్ వెల్ అగరుబత్తీల విక్రయాలు నిలుపుదల చేశారు. స్లీప్వెల్ అగరుబత్తీల్లో మేపర్ ఫ్లూత్రీన్ అనే పురుగు మందు అవశేషాలు ఉన్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ తేల్చిందని ఏడీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కంపెనీ అగరుబత్తీలు పొగ పీల్చడం వల్ల శ్వాస కోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాల తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నగరంలో ముగ్గురు స్టాకిస్టుల గోడౌన్లు తనిఖీ చేసినట్లు తెలిపారు. స్లీప్వెల్ అగరుబత్తీలు స్టాక్ పెట్టి విక్రయించే వారిపై క్రిమి సంహారక చట్టం, సంహారక రూల్ ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
డయేరియాపై అప్రమత్తం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగర పాలక సంస్థ సరఫరా చేసే నీరు తాగడంతో పాత రాజరాజేశ్వరిపేటలో పలువురు డయేరియా బారిన పడినట్లు వచ్చిన సమాచారం మేరకు వైద్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఎపిడమిక్ బృందంతో ఆ ప్రాంతానికి చేరుకుని డయారియా కేసులపై ఆరా తీశారు. వీఎంసీ, సచివాలయ సిబ్బందితో కలిసి డయేరియా సోకినట్లు సమాచారం వచ్చిన ప్రాంతంలో ఇంటింటి సర్వేచేశారు. దీంతో సుబ్బరాజు ఫ్లాట్స్లోని ఒక 26 ఏళ్ల మహిళ అక్యూట్ డయేరియల్ డిసీస్ (డయేరియా) స్వల్ప లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆమెతో పాటు, మరో ముగ్గురికి స్వల్పంగా లూజ్ మోషన్స్ అయినట్లు వైద్యశాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వారు కోలుకున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. పాత రాజరాజేశ్వరిపేటలో వైద్య బృందాల సర్వే ఆ ప్రాంతంలోని మంచినీటి కుళాయిల నుంచి మురుగు నీరు వస్తోందని స్థానికులు చెప్పడంతో, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, అవకాశం ఉంటే ఆర్ఓ వాటర్ తాగాలని డీఎంహెచ్ఓ సుహాసిని సూచించారు. 14 వైద్య బృందాలతో డయేరియా కేసులు గుర్తించేందుకు సర్వే చేశామన్నారు. అలా 1234 ఇళ్లు, 3,745 మంది జనాభాను కవర్ చేస్తూ రాపిడ్ సర్వే చేసినట్లు తెలిపారు. వైద్య బృందాలు ఆ ప్రాంతంలోని అన్ని ఇళ్లకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్, జింక్ మాత్రలు పంపిణీ చేసినట్లు చెప్పారు. వీఎంసీ శానిటేషన్ పనులు, క్లోరినేషన్ను బలోపేతం చేయాలని ఆదేశించారు. ఆ ప్రాంతంలో సేకరించిన నీటి నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. రోజువారీ సర్వే, శానిటేషన్ పర్యవేక్షణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఈ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉన్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. -
ముగిసిన కల్యాణ మహోత్సవాలు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో షష్ఠి కల్యాణ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజు గురువారం ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో వేదపండితులు కొమ్మూరి ఫణి కుమార్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్కుమార్ శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్యశర్మ బ్రహ్మత్వంలో ఉదయం 6 గంటలకు ప్రాతఃకాలార్చనలు, గోపూజ, నిత్యహోమం, బలిహరణ, పంచామృతస్నపన, వసంతోత్సవం, మహా పూర్ణాహుతి, తీర్థప్రసాద వినియోగం, ఉదయం 11 గంటలకు శేషవాహనంపై రావివారిపాలెం గ్రామం వరకు శ్రీ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. దారి పొడవునా భక్తులు స్వామివారికి కానుకలు చెల్లించి హారతులు అందుకున్నారు. రాత్రి 7 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, 8 గంటలకు శ్రీ స్వామివారికి పుష్పశయ్యాలంకృత పర్యంకసేవ భక్తిభావంతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, చెన్న కేశవ పాల్గొన్నారు. -
బీపీఎస్ ద్వారా అవకాశం కల్పించిన ప్రభుత్వం
● విజయవాడలో పెద్ద ఎత్తున అనధికారిక భవనాలు ● ఇప్పటి వరకు 679 గుర్తింపు ● ఇప్పటికే బీపీఎస్ కోసం 113 దరఖాస్తులు ● ఎల్ఆర్ఎస్ స్కీం కింద మరో 2,279 దరఖాస్తులు ● క్రమబద్ధీకరించుకోకపోతే ఇబ్బందులు తప్పవంటున్న అధికారులు సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ నగరంలో అనధికారిక కట్టడాలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. అధికార పార్టీ నాయకుల అండ దండలతో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా కట్టారు. వాటిని క్రమబద్ధీకరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా అనధికారిక భవనాలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్–2025) పథకాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం అనుమతులు లేని భవనాలు, అదనపు అంతస్తులు, నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలను క్రమబద్ధీకరించుకొనే అవకాశం కల్పించింది. ఈ పథకం 1985 జనవరి1 నుంచి 2025ఆగస్టు 31వ తేదీ, మధ్యన జరిగిన నిర్మాణాలకు వర్తించనుంది. బీపీఎస్ పథకం వస్తుందనే సమాచారంతో నగరంలో పెద్ద ఎత్తున అక్రమార్కులు అధికార పార్టీ నేతల అండ దండలతో అనధికార కట్టడాలకు తెరలేపారు. ఈ క్రమంలో 2025 ఆగస్టు31 తర్వాత అనుమతులు తీసుకోకుండా కట్టిన భవనాలపైన ప్రస్తుతం నగరపాలక సంస్థ అధికారులు కన్నెర్ర చేస్తున్నారు. అలాంటి భవనాలను గుర్తించి, తొలగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు వారి పరిధిలోని అనధికార నిర్మాణాలను గుర్తించి ప్రతి రోజు వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. దీంతో పాటు బీపీఎస్ స్కీంకు సంబంధించి భవన యజమానులకు అవగాహన కల్పిస్తూ, క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విజయవాడలో ప్రస్తుతం బీపీఎస్ స్కీం పరిధిలోకి 679 భవనాలు వస్తాయని నగరపాలక సంస్థ ప్రణాళిక విభాగం అధికారులు గుర్తించారు. దీని సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో 113 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగరంలోని మూడు సర్కిళ్లలో దాదాపు 1500 అనధికారిక భవనాలు ఉండే అవకాశం ఉందని ప్లానింగ్ అధికారులు భావిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం) దీనికి సంబంధించి మొదటి విడతలో 1,076 దరఖాస్తులు వచ్చాయి. మరోసారి ప్రభుత్వం గడువు పెంచి 2026 జనవరి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొనే గడువు పెంచింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మొదటి విడత దరఖాస్తుతో కలిపి 2,279 దరఖాస్తులు వచ్చాయి. నందమూరి నగర్ ఆంధ్రప్రభ కాలనీలో నిర్మిస్తున్న అక్రమ అంతస్తులు -
గడువులోపు దరఖాస్తు చేసుకోండి..
ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోపు అనధికార భవనాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. విద్యుత్తు, నీటి సరఫరాను నిలిపివేస్తాం. బ్యాంకు లోన్లు రావు. ఆ ఆస్తిని అమ్ముకొనే వెసులుబాటు ఉండదు. పన్ను సైతం డబుల్ వేస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకొని దరఖాస్తులను అర్హత కలిగిన లైసెన్స్, టెక్నికల్ పర్సన్ ద్వారా అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 31.12.1997కు ముందు నిర్మించిన భవనాలకు ప్రభుత్వం క్రమబద్ధీకరణ రుసుంపై 25 శాతం రాయితీ మంజూరు చేస్తోంది, దీనిని సద్వినియోగం చేసుకోవాలి. – కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ సిటీ ప్లానర్, నగర పాలక సంస్థ -
‘తూర్పు’లో 95వేలకు పైగా సంతకాల సేకరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైద్య కళాశాలలు పీపీపీ పేరుతో ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల్లో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 95 వేలకు పైగా సంతకాలు సేకరించినట్లు ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్ తెలిపారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఇచ్చిన గడువుకి పది రోజుల ముందుగానే రాష్ట్రంలోనే అత్యధికంగా 95 వేలకు పైగా సంతకాలు సేకరించినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అంటూ ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసినట్లు ఆయన చెప్పారు. విద్యార్థులు, యువతతో పాటు, గత ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసిన వాళ్లు సైతం వైద్య కళాశాలల విషయంతో తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సంతకాలు చేసినట్లు అవినాష్ తెలిపారు. వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలనేది ప్రజల ఆకాంక్షగా ఈ సంతకాల సేకరణ ద్వారా తెలియజేశారన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్య, వైద్యం అందాలంటే ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలని ఆయన తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
భలే గుడ్లు!
గోలీ సైజులోని గుడ్లను చూపుతున్న కృష్ణారావుకృష్ణాజిల్లా కోడూరు మండలం ఊటగుండం గ్రామానికి చెందిన చేబోయిన కృష్ణారావు పెరట్లోని ఓ కోడి పెట్టిన గుడ్లు గోలీ సైజులోనే ఉన్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఎంతో ఆసక్తిగా వాటిని తిలకిస్తున్నారు. సాధారణంగా కోడిగుడ్డు దీర్ఘవృత్తాకారం(అండాకారం)లో ఉంటూ సుమారు 50 నుంచి 60 గ్రాముల మధ్య బరువు ఉంటుంది. అయితే ఆ కోడి బుధ, గురు వారాల్లో నాలుగు గుడ్లు పెట్టగా, అవి 10 గ్రాముల లోపే ఉండడంతో పాటు వృత్తాకారంలో ఉన్నాయి. – కోడూరు -
క్యాన్సర్ వైద్య సేవలు మెరుగు పరుస్తాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ సర్వజన ఆస్పత్రిలో క్యాన్సర్ వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఇందులో భాగంగా లీనాక్ (లీనియర్ యాక్సిలరేటర్) పరికరాన్ని అందుబాటులోనికి తెచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సర్వజన ఆస్పత్రి అభివృద్ధిపై సమావేశం జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావుతో కలిసి అభివృద్ధిపై చర్చించారు. క్యాన్సర్ వెద్య సేవల్లో ముఖ్యమైన లినాక్ పరికరాన్ని విజయవాడ జీజీహెచ్లో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తూ విజయవాడ జీజీహెచ్లో ‘లినాక్’ ఏర్పాటుకు అవసరమైన స్థలం గుర్తింపు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి (సామాజిక బాధ్యత) ఆర్థిక సహకారం మార్గాలను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చర్చల్లో పాల్గొన్న డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ పరికరం సమకూర్చేందుకు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. నర్సింగ్ విద్యార్థుల కోసం.. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు హాస్టల్ విషయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఔషధ నియంత్రణ శాఖ భవనాన్ని తాత్కాలికంగా ఉపయోగించుకునేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానని మంత్రి సత్యకుమార్ చెప్పారు. సమావేశంలో డీఎంఈ డాక్టర్ రఘునందన్, అదనపు డీఎంఈ డాక్టర్ వెంకటేశ్, విజయవాడ జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాం, అంకాలజిస్ట్ విభాగ అధిపతి డాక్టర్ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
కేంద్ర మంత్రికి స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు గురువారం గన్నవరం విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. అమరావతిలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ నుంచి విచ్చేశారు. విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి డి. రోనాల్డ్ రోస్, గుడివాడ ఆర్డీఓ జి. బాలసుబ్రహ్మణ్యం, జిల్లా ఆడిట్ అధికారి సూర్యభాస్కరరావు స్వాగతం పలికారు. సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో వంద శాతం ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు పేర్కొన్నారు. గురువారం సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో జరిగిన ఎన్టీఆర్ జిల్లాలోని సబ్జెక్ట్ టీచర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు బ్లూ ప్రింట్, మోడల్ పేపర్స్పై పూర్తి అవగాహన కలిగి, డీ గ్రేడ్లో ఉన్న విద్యార్థులు కూడా తప్పనిసరిగా పాస్ అయ్యేలా చూడాలని సూచించారు. ప్రతిభావంతులైన విద్యార్థులు 550 నుంచి 600 మార్కులు సాధించేలా ఉపాధ్యాయు లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. డిసెంబర్ నుంచి అమలు కాబోయే వంద రోజుల యాక్షన్ ప్లాన్ను పక్కాగా అమలు చేయాలన్నారు. -
నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్కు చెందిన ఎం. నారాయణ స్వామి కుటుంబం రూ.1,01,116, హైదరాబాద్ చందానగర్కు చెందిన సత్విక్, సంహిత రూ.1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. పెనమలూరు: కాలానుగుణంగా స్మార్ట్ నగరాల నిర్మాణం చాలా అవసరమని ఏపీ సీఆర్డీఏ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్.గోపాలకృష్ణారెడ్డి అన్నారు. కానూరు సిద్ధార్థ డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో గురువారం సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 3వ అంతర్జాతీయ స్మార్ట్ సస్టైనబుల్ సిటీస్ సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. భవిష్యత్తు విజన్ దృష్టిలో పెట్టుకుని స్మార్ నగరాల నిర్మాణం చేయాలన్నారు. సివిల్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఉపకులపతి డాక్టర్ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 54 టెక్నికల్ పేపర్లు ఎంపిక చేశామని తెలిపారు. సీఆర్డీఏ చీఫ్ ఇంజినీర్ సీహెచ్ ధనుంజయ, సీవిల్ హెచ్ఓడీ డాక్టర్ వి.మల్లికార్జున, సిద్ధార్థ అకాడమీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణు, పలువురు పాల్గొన్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలో ట్రాఫిక్ను నియంత్రించడానికి అవసరమైన 100 బారికేడ్లలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ట్రాఫిక్ విభాగానికి అందజేసింది. గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగంకు సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠరెడ్డి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మంజుల బారికేడ్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా షిరీన్ బేగం మాట్లాడుతూ బారికేడ్ల వల్ల ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి, ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కలిగించే విధంగా తయారు చేశారన్నారు. ట్రాఫీక్ ఏసీపీ రామచంద్రరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నందిగామ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పేర్కొన్నారు. మండలంలోని అంబారుపేట, ఐతవరం, కేతవీరునిపాడు గ్రామాలలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా, సాఫీగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద తూకం, నాణ్యత పరీక్ష, తేమ శాతం రవాణా ఏర్పాట్లు, తదితర అంశాలను రైతులకు వివరించారు. అనంతరం మునగచర్ల గ్రామంలోని రైసు మిల్లును తనిఖీ చేసి స్టాకు వివరాలు, రికార్డులను పరిశీలించారు. ఆర్డీవో బాలకృష్ణ, తహసీల్దార్ సురేష్బాబు, వ్యవసా య శాఖ ఏవో నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
అయ్యప్ప దీక్షలో ఉన్న బాలికను కొట్టిన టీచర్
ఇబ్రహీంపట్నం: అయ్యప్ప దీక్ష తీసుకున్న ఓ బాలికను ‘ఈ వయసులో నీకు పూజలెందుకు’ అంటూ ఓ టీచర్ చితకబాదింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో గురువారం జరిగింది. కంచికచర్ల మండలానికి చెందిన దంపతులు ఇబ్రహీంపట్నంలో అద్దె ఇంట్లో ఉంటూ తమ ఇద్దరు కుమార్తెలను గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదివిస్తున్నారు. మూడో తరగతి చదువుతున్న చిన్న కుమార్తె ఇటీవల అయ్యప్ప మాల ధరించింది. రోజూ దీక్ష దుస్తుల్లో స్కూలుకు రావడం ఇష్టలేని ఇన్చార్జ్ టీచర్ రేవతి ఆ బాలికను వారిస్తూ వస్తోంది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుత్ను బాలిక గురువారం తరగతి గదిలో నిద్రపోయింది. దీనిని గమనించిన రేవతి ఈ వయస్సులో పూజలెందుకు? రాత్రులు నిద్ర లేకుండా తరగతిలో నిద్రపోవడం ఎందుకు? అంటూ ఆగ్రహించింది. ఫ్లోరింగ్ ఊడ్చే మాప్ కర్రతో ఇష్టానుసారంగా బాలికను కొట్టింది. చేతులు, కాళ్లు, వీపు, నడుంపై ఎర్రగా కందిపోవడంతో బాలిక భోరున ఏడ్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. పోలీసులు వెంటనే పాఠశాల వద్దకు వచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో విద్యార్థిని తల్లిదండ్రులు కేసు పెట్టకుండా వదిలేశారు. టీచర్ కొట్టిన దెబ్బలతో బాలిక శరీరంపై ఏర్పడిన గాయాలు -
వంశధార జట్టుపై కొల్లేరు జట్టు విజయం
మైలవరం: ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి డీఏ ఫుట్బాల్ లీగ్ పోటీలు మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్నాయి. గురువారం ఉదయం జరిగిన మొదటి మ్యాచ్లో కొల్లేరు, వంశధార జట్లు తలపడ్డాయి. కొల్లేరు 4–1 గోల్స్ తేడాతో వంశధారపై గెలుపొందింది. గోదావరి, విశాఖ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ 1–1 గోల్స్తో డ్రాగా ముగిసింది. మధ్యాహ్నం జరిగిన మొదటి మ్యాచ్లో పెన్నా, కోరమాండల్ జట్లు తలపడ్డాయి. పెన్నా జట్టు 3–0 గోల్స్ ఆధిక్యతతో కోరమాండల్ జట్టుపై గెలుపొందింది. రెండో మ్యాచ్లో తుంగభద్ర జట్టు నల్లమల జట్టుపై 4–2 గోల్స్ ఆధిక్యతతో గెలిచింది. ఈ మ్యాచ్లకు ముఖ్యఅతిథులుగా డైరెక్టర్, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ పర్వతనేని సుభాష్బాబు, ఏరియా లీడర్ మూలుపూరి ఉపేంద్ర, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ జి.రవీంద్ర రానా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున వై.శేషగిరిరావు, బి.చక్రవర్తి, జి.ఎస్.ఎస్ పవన్కుమార్, పండరి శ్రీనివాస్ పోటీలను పర్యవేక్షించారు. -
7 సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టులు ఖాళీ
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఏడు సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలో భర్తీ చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.కె.బాలాజీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలిపారు. గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులయిన కలెక్టర్లతో ఎన్నికల అంశా లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి మాట్లాడుతూ.. జిల్లాలో ఏడు సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పెడన, మోపిదేవి, బంటుమిల్లి, కృత్తివెన్ను, కోడూరు, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాలకు తహసిల్దార్లు లేరన్నారు. కోర్టు తీర్పు వచ్చిందని త్వరలో వాటిని భర్తీ చేస్తామన్నారు. జిల్లాలో నాలుగు రెవెన్యూయేతర ఓటరు నమోదు అధికారులు (ఈఆర్వోలు) ఉన్నందున వారి స్థానంలో డెప్యూటీ కలెక్టర్ల పేర్లతో ప్రతిపాదనలు పంపించామని, వాటిని ఆమోదించాలని కోరారు. జిల్లాలో 73 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉందని, వాటికి బూత్ స్థాయి అధికారులను కూడా గుర్తించామన్నారు. ఓటర్ల జాబితా మ్యాపింగు, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ఈఆర్వోలకు, ఏఈఆర్వోలకు ఎన్నికల ఉప తహసీల్దారులకు, సీనియర్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా 15.45 లక్షలకు 6.42 లక్షల ఓటర్ల మ్యాపింగ్తో 42 శాతం పూర్తిచేశామన్నారు. జిల్లాకు అందిన 1769 బూత్ స్థాయి అధికా రుల గుర్తింపు కార్డులను పంపిణీ చేశామన్నారు. జిల్లాలో కేవలం ఒక క్లెయిమ్ ఫారం అపరిష్కృతంగా ఉందని దానిని త్వరలో పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో 18,136 ఎపిక్ కార్డులందగా అందులో ఇప్పటికే 15,849 కార్డులను ఓటర్లకు పంపిణీ చేశామని వివరించారు. మిగిలినవి త్వరలో పంపిణీ చేస్తామన్నారు. బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ కార్యక్రమానికి సంబంధించి 135 అభ్యర్థనలు రాగా అన్ని పరిష్కరించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ కె.చంద్రశేఖరరావు, మచిలీపట్నం ఆర్డీఓ స్వాతి, డీఎస్ఓ మోహన్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు. -
కల్లాల్లో ధాన్యం.. కళ్లలో దైన్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ: ఖరీఫ్ సాగు ఆరంభం నుంచీ అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. దిగుబడులు తగ్గి, మద్దతు ధర కూడా దక్కకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మోంథా తుపాను దెబ్బ నుంచి కోలుకోక ముందే బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత కలవర పెడుతోంది. అల్పపీడనం తుపానుగా మారక ముందే ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం విక్రయించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల రైతు సేవా కేంద్రాల్లో గోనె సంచులు లేవు. మిల్లర్లేమో ధాన్యం కొనబోమని తెగేసి చెబుతున్నారు. ఆంక్షలతో విసిగిన రైతులు పంటను దళారులకు తెగనమ్ముతున్నారు. కొన్ని చోట్ల తుపాను భయంతో పంటపూర్తిగా పక్వానికి రాకముందే రైతులు నూర్పిళ్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 3.98 లక్షల ఎకరాల్లో వరి సాగు కృష్ణా జిల్లాలో 3.85 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. పది లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. 7.90 లక్షల టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా నిర్ణయించారు. 287 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే లక్ష ఎక రాల్లో కోతలు పూర్తవగా కేవలం 12,290 మంది రైతుల నుంచి 1.04 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. జిల్లాలో ప్రధానంగా పెడన, గూడూరు, మచిలీపట్నం, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, పామర్రు, కంకిపాడు, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా ధాన్యం నిల్వలే కనిపిస్తున్నాయి. కల్లాల్లో, రోడ్ల పక్కన ధాన్యం రాశులు పేరుకుపోయాయి. అధిక తేమ శాతం పేరిట మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ధాన్యం అరబెట్టేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు కాటా వేసిన ధాన్యం రవాణాకు వాహనాల కొరత వేధిస్తోంది. ఒక్కో మండలానికి ఒక్కో నిబంధన ధాన్యం కొనుగోలుకు ఒక్కో మండలంలో ఒక్కో విధంగా నిబంధనలు అమలు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా 17 శాతం తేమ ఉంటే ఏ గ్రేడ్ రకం ధాన్యం 76 కిలోల బస్తాను రూ.1,792 చొప్పున కొనాలి. ఒక్కొక్క శాతం తేమకు రూ.18 తగ్గిస్తారు. అప్పుడే కోసిన పంట 27 శాతం తేమ మించదు. దీనిని రూ.1,612 చొప్పున కొనాలి. కొన్ని మండలాల్లో 17 శాతం పైబడి ఎంత శాతం ఉన్నా రూ.1,550 చొప్పునే కొంటున్నారు. అంటే బస్తాకు రూ.240 వరకూ రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు 30 బస్తాల దిగుబడి వస్తే రైతులు రూ.7,200 నష్టపోతున్నారు. రైతు సేవా కేంద్రంలో 17 శాతం తేమ వచ్చిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద చూపిస్తే 20 శాతం వస్తోంది. అదేమని అడిగితే అక్కడ ఉన్నవి పాత మిషన్లు, తమవి కొత్తవి అని మిల్లర్లు చెబుతున్నా రని రైతులు పేర్కొంటున్నారు. విసిగిపోయిన రైతులు బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకు తక్కువకే దళారులకు విక్రయిస్తున్నారు. టీడీపీ నాయకులు సిఫార్సు చేస్తేనే.. ధాన్యం కొనుగోళ్లకు టీడీపీ నేతల సిఫారసు తప్పని సరిగా మారింది. సొసైటీ ప్రెసిండెట్ లేదా గ్రామంలో ముఖ్యనాయకులు చెబితేనే ధాన్యం ముందుకు కదులుతోంది. ప్రధానంగా గుడివాడ, పెనమ లూరు, పామర్రు, పెడన నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. దీంతో రైతులు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ శాఖ, వ్యవసాయ క్షేత్రాల ద్వారా సరఫరా చేసిన కొన్ని రకాల ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదు. 1318, 1218, 1262, 5204 వంటి రకాలను రెండు లక్షల ఎకరాలకు పైగా రైతులు సాగు చేశారు. ఈ రకాలను కొనేందుకు మిల్లర్లు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మోంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలేదు. పైరు నేల వాలి దిగుబడి తగ్గి నష్టపో యిన రైతులకు మిగిలిన పంటను విక్రయించేందుకూ కష్టాలు తప్పడంలేదు. ధాన్యంలో తేమ తగ్గించేందుకు రోడ్లపై రోజుల తరబడి ఆరబెడుతున్నారు. ఆరిన ధాన్యాన్ని మిల్లర్లకు తోలాంటే లారీల కొరత వేధిస్తోంది. దీనిని సాకుగా తీసుకున్న దళారులు సిండికేట్గా మారి బస్తా ధాన్యాన్ని రూ.1000కే కొంటామంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం స్పందించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలి. – కై లే అనిల్కుమార్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
సదరం స్లాట్లు.. దివ్యాంగుల పాట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): దివ్యాంగులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న వారికి రీ వెరిఫికేషన్ పేరుతో కోత విధించిన చంద్రబాబు ప్రభుత్వం, కొత్త వారికి ధ్రువ పత్రాలు జారీలోనూ వివక్ష చూపుతోంది. దివ్యాంగులు వైకల్య ధ్రువీకరణ కోసం వైద్య పరీక్షలకు దరఖాస్తు చేసుకుందామని గ్రామ/వార్డు సచివాలయాలకు వెళితే అక్కడి సిబ్బంది సదరం సైట్ మొరాయిస్తోందని చెబుతున్నారు. గతంలో ఆన్లైన్ చేసిన వారికి వెయిటింగ్లిస్ట్ ఇచ్చారు. దానికి సంబంధించి కొందరికి పరీక్ష తేదీలు ఖరారు కాలేదు. మరోవైపు పూర్తి స్థాయి వైకల్యం ఉండి, మంచంలోనే ఉన్న వారికి రూ.15 వేల పింఛన్ ఇస్తా మని చెప్పినా, ఇప్పటి వరకూ ఆ సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో ప్రతి సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ పేరిట నిర్వహించే గ్రీవెన్స్కు దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తులు కుప్పలుగా వస్తున్నాయి. వాటిని ఏమి చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇబ్బందులు ఇలా.. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ పొందేందుకు అనేక సమస్యలు ఎదు ర్కొంటున్నారు. ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా తమకేమీ తెలియదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్పమైన ఆదేశాలు ఇవ్వాలి. గతంలో స్లాట్ బుక్చేసుకుని వెయిటింగ్ లిస్ట్ ఉన్న వారికి పరీక్ష తేదీని ఖరారు చేయాలి. పూర్తిస్థాయి దివ్యాంగులుగా బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందిన వారికి దానిని అప్లోడ్ చేసే ఆప్షన్ ఓపెన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. – వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పింఛన్ కోసం కలెక్టరేట్కు వచ్చివెళ్తున్న దివ్యాంగుడు (ఫైల్)దివ్యాంగుల్లో పూర్తి వైకల్యంతో మంచంపైనే ఉన్న వారికి రూ.15 వేల పింఛన్ ఇస్తానని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అర్హత ఉన్న వారు సదరం ద్వారా మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుని ధ్రవ పత్రాలు తీసుకున్నారు. వాటిని మరలా అప్లోడ్చేస్తేనే పింఛన్కు అర్హత సాధిస్తారు. ఆ సైట్లో ఆ ఆప్షన్ కనిపించడం లేదని దివ్యాంగులు చెబుతున్నారు. ఇలాంటి వాళ్లు సచివాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు చొరవ చూపాలని దివ్యాంగులు కోరుతున్నారు. -
మానుగాయ తెగులును పరిశీలించిన కలెక్టర్
గుడ్లవల్లేరు: మండలంలోని వేమవరప్పాలెంలో వరి పంటను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ బుధవారం పరిశీలించారు. వరికి మానుగాయ సోకినట్లు ఆయన పరిశీలనలో తేలింది. మచిలీపట్నం నుంచి గుడివాడ వైపు ప్రయాణించే క్రమంలో పెడన–గుడివాడ ప్రధాన రహదారిపై రైతులు ఆరబెట్టిన ధాన్యపు రాశులను కలెక్టర్ పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతు అబ్దుల్ సలాం ఒకటిన్నర ఎకరంలో పండించిన ఎంటీయూ 1318 రకం ధాన్యాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. యంత్రంతో కోత కోసి ధాన్యాన్ని ఆరబెట్టానని రైతు తెలి పారు. చేను ఈనిన సమయంలో మోంథా తుపాను ప్రభావంతో వర్షాలు పడ్డాయని, కంకులు తడిసి మానుగాయ తెగులు వచ్చిందని కలెక్టర్ బాలాజీకి రైతు వివరించారు. సహకార వ్యవస్థ గొప్పది హనుమాన్జంక్షన్ రూరల్: పాల ఉత్పత్తిలో దేశం అగ్రగామిగా నిలబడటంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో పాడిరైతుల సహ కార సంఘాలు కీలకంగా ఉన్నాయని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వీరవల్లిలోని ‘ప్రాజెక్టు కామథేను’ పాల ఉత్పత్తుల కార్మాగారంలో కృష్ణా మిల్క్యూనియన్ వజ్రోత్సవం, జాతీయ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన పలు కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫ్యాక్టరీ ఆవరణలో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన వేడుకల్లో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో సహకార వ్యవస్థ గొప్పదన్నారు. ఈ వ్యవస్థలో రాజకీయాలు ప్రవేశిస్తే లక్ష్యం దెబ్బతింటుందన్నారు. కృష్ణామిల్క్ యూనియన్ 60 ఏళ్ల విజయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం పాడిరైతులకు రూ.11 కోట్ల బోనస్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి బాలవర్ధనరావు, కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు పాల్గొన్నారు. శృతిలయల సమ్మేళనం స్వరాత్మిక గాత్రం విజయవాడకల్చరల్: శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో 32వ జాతీయ సంగీతోత్సవంలో భాగంగా జీవీఆర్ సంగీత కళాశాలలో గోకరాజు గంగరాజు కళావేదికపై బుధవారం స్వరాత్మిక నిర్వహించిన గాత్ర సంగీత సభ రెండు గంటల పాటు స్వరలయ సమ్మేళనంలా సాగింది. వర్ణంతో ప్రారంభించి పలు కీర్తనలను ఆలపించారు. ఆర్.దినకర్ వయోలిన్పై, మృదంగంపై వి.వి. ఎస్.ప్రకాష్, ఘటంపై కె.వి.రామకృష్ణ సహకరించారు. శ్రీ సద్గురు సంగీతసభ సభ్యులు ప్రకాష్, గౌరీనాథ్, గాయత్రి గౌరీనాథ్, బి.హరిప్రసాద్, జె.ఎస్.ఎస్.ప్రసాద్శర్మ, వీర్ సుబ్ర హ్మణ్యం పాల్గొన్నారు. గురువారం సాయంత్రం విఖ్యాత గాత్ర విద్వాంసుడు సాయి విఘ్నేష్ గాత్ర కచేరీ జరగనుంది. భవిరి రవికి డాక్టరేట్ నాగాయలంక: మండలకేంద్రమైన నాగాయలంకకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు భవిరి రవి న్యూఢిల్లీలోని కాలిఫోర్నియా పబ్లిక్ యూనివర్సిటీ నుంచి డి.లిట్ పట్టా పొందారు. బుధవారం జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయనకు విశ్వవిద్యాలయం డీన్ అండ్ అంబాసిడార్ ఆఫ్ మదగస్కర్ డాక్టర్ రఘు నాథ్ పార్కర్ చేతుల మీదుగా డీ లిట్ అందు కున్నారు. 48ఏళ్లుగా తాను మిమిక్రీ రంగంలో ఉంటూ, ప్రజా సేవలు కొనసాగిస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టరేట్ అందచేసిందని భవిరి రవి తెలిపారు. భవిరి రవి 12 వేలకు పైగా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చారు. అమెరికా, అబుదాబీ, బహ్రెయిన్, దుబాయ్, షార్జా, మారిషస్, మలేషియా, సింగపూర్ తదితర దేశాలలో రవి మిమిక్రీ ప్రదర్శనలిచ్చి ప్రఖ్యాతి పొందారు. భవిరికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్బాబు, అంబటి శ్రీహరి ప్రసాద్ తదితరులు అభినందనలు తెలిపారు. -
ప్రగతి సూచికల్లో ఏ గ్రేడ్ సాధించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర – 2047 సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో ప్రతి శాఖకు చెందిన ప్రగతి సూచికల్లో పురోగతి కనిపిస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఇదే వేగంతో కృషిచేస్తూ నూరు శాతం ఏ గ్రేడ్ వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని శ్రీపింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కీలక ప్రగతి సూచికలు (కేపీఐ)పై వ్యవసాయ, అనుబంధ రంగాలు, మహిళా – శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, విద్య తదితర శాఖల అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించి 563 కీలక ప్రగతి సూచికలకు సంబంధించి మండలాల వారీగా స్కోర్లు, గ్రేడ్లపై సమీక్షించారు. కొన్ని శాఖలు కొన్ని సూచికల్లో ఇంకా బీ, సీ గ్రేడ్లలో ఉన్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. పటిష్ట ప్రణాళికతో సమ న్వయంతో ఏ గ్రేడ్కు చేరాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు, ద్రవ వ్యర్థాల నిర్వహణ, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణం, ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ఎత్తు, బరువు వంటి ఆరోగ్య ప్రమాణాలు తదితరాలపైనా దృష్టిసారించాలన్నారు. ఉద్యాన పంటల దిశగా రైతులను ప్రోత్సహించడంతో పాటు అందుబాటులో పథకాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా పశు సంవర్ధక రంగానికి సంబంధించి యానిమల్ షెల్టర్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాలు వచ్చే సాగు కార్యకలాపాలు దిశగా అధికారులు రైతులను ప్రోత్సహిందాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఈ సమావేశంలో సీపీఓ వై.శ్రీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జనవరి 23, 24 తేదీల్లో రీసెర్చ్ కాన్క్లేవ్
పోస్టర్ ఆవిష్కరించిన సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ చాన్స్లర్ చౌదరిపెనమలూరు: సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో వచ్చే ఏడాది జనవరి 23, 24 తేదీల్లో రీసెర్చ్ కాన్క్లేవ్ –2026 నిర్వహిస్తున్నామని ఆ వర్సిటీ కులపతి కేవీ చౌదరి అన్నారు. ఆయన యూనివర్సిటీలో బుధవారం రీసెర్చ్ కాన్క్లేవ్–2026 పోస్టర్ ఆవిష్కరించి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కులపతి చౌదరి మాట్లాడుతూ కాన్క్లేవ్ పరిశోధన, పరిశ్రమలు–అకడమిక్ భాగస్వామ్యం బలోపేతం చేయటం, నూతన ఆవిష్కరణలకు వేదికగా ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు రీసెర్చ్ కాన్క్లేవ్లో పాల్గొంటారన్నారు. ఉపకులపతి ప్రొఫెసర్ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రీసెర్చ్ కాన్క్లేవ్లో పాల్గొనటానికి జనవరి 5వ తేదీ వరకు నమోదు, జనవరి 8వ తేదీ ఫైనల్ రౌండ్ నోటిఫికేషన్ ఉంటుందన్నారు. సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఎంబీఏ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయని చెప్పారు. ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, రిజిష్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, డీన్లు పాల్గొన్నారు. -
ఆస్తి
భూ వివాదాల నేపథ్యంలో కుటుంబ సభ్యుల పరస్పర దాడులు సరిహద్దులు, దారుల సమస్యలు ఉన్నప్పుడు ఇరువర్గాలు రెవెన్యూ శాఖను సంప్రదించి పరిష్కరించుకోవాలి. వారసత్వ ఆస్తుల విషయంలో వివాదాలు ఉంటే కోర్టుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. భూ వివాదాలు ఉన్నప్పుడు ఓపికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇగోలకు పోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటే కేసులలో ఇరుక్కుపోతారు. దాడుల వల్ల ఇరు వర్గాల కుటుంబాలు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నష్టపోతారు. – రావూరి రమేష్బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, మైలవరంఆస్తుల ముందు.. రక్త సంబంధాలు, పేగు బంధాలు, దాంపత్య బాంధవ్యాలు కూడా నిలవడం లేదు. ఆస్తుల కోసం, భూముల కోసం మనిషి మృగంలా మారుతున్నాడు. క్షణికావేశంలో కన్నవారు, తోబుట్టువులు అనేది కూడా చూడటం లేదు. తన అవసరాల కోసం భూమిని అమ్మకోనీయలేదని తండ్రిని చంపిన కొడుకు.. తండ్రికి ఆస్తిలో వాటా పంచలేదని నాయనమ్మని చంపిన మనవడు.. తన పేరుమీద భూమి రాయలేదని తండ్రిపై దాడికి తెగబడిన కొడుకు.. భూమి కోసం మహిళపై దాడి చేసిన భర్త వైపు బంధువులు.. భూ వివాదంలో బంధువులతో కొట్లాటకు దిగిన రెవెన్యూ అధికారి.. ఇలాంటి హృదయ విదారక ఘటనలు చూసి, సమాజం ఎటు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంటోంది.. ముఖ్యంగా మైలవరం నియోజక వర్గంలో ఆస్తుల కోసం దాడులు, హత్యలు ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జి.కొండూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రభుత్వ పాలనను విజయవాడ నుంచి కొనసాగించడం వల్ల విజయవాడకు ఆనుకొని ఉన్న మైలవరం నియోజకవర్గంలో భూముల ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నియోజకవర్గం మొత్తం విస్తీర్ణం 2,48,195.51ఎకరాలుగా ఉండగా, వ్యవసాయ భూమి 38,200హెక్టార్లు ఉంది. అయితే ఇటీవల అమరావతి రాజధాని పేరుతో ప్రభుత్వం అనేక గ్రాఫిక్స్లను విడుదల చేయడంతో భూముల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందన్న ఆశ స్థానికుల్లో రెట్టింపైంది. ఈ ఆశతో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునేందుకు ఇష్ట పడటంలేదు. ఈ క్రమంలో దారుల విషయమై, సరిహద్దుల విషయమై వివాదాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా ఉమ్మడి కుటుంబాల్లో వాటాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా చెడు వ్యసనాలకు బానిసలైన వారసులు చేసిన అప్పులు తీర్చలేక భూములు అమ్మేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో దాడులు చేసి హత్యలు చేస్తున్నారు. భూ వివాదాలపై కుటుంబ సభ్యులు ఆవేశాలకు పోకుండా ఆలోచనతో మాట్లాడుకొని పరిష్కరించుకోవడంతో పాటు ఫిర్యాదులు అందగానే రెవెన్యూ శాఖ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించకుండా వెంటనే స్పందిస్తే వివాదాలు కొంత మేర తగ్గే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. భూ వివాదాల్లో దాడులు మచ్చుకు కొన్ని.. ● మైలవరం మండల పరిధి బొర్రాగూడెం గ్రామానికి చెందిన పొన్నూరు సత్యనారాయణకు గ్రామంలో 2.10ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి తన పేరుమీద రాయాలంటూ గత కొంత కాలంగా రామ్కిరణ్ తండ్రి సత్యనారాయణపై గొడవ పడుతున్నాడు. ఇదిలా ఉండగా ఈ భూమిలో ఉన్న మామిడి చెట్లను కలప కోసం తండ్రికి తెలియకుండా రూ.1.15లక్షలకు రామ్కిరణ్ విక్రయించాడు. ఈ విషయమై ఈ నెల 24వ తేదీన తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం జరిగి రామ్కిరణ్ తండ్రిపై దాడికి తెగబడ్డాడు. అదే సమయంలో రామ్కిరణ్ పక్కనే ఉన్న సత్యనారాయణ మేనల్లుడు కోడూరు నవీన్ సైతం దాడికి సహకరించడంతో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ● ఈ నెల 17వ తేదీన మైలవరం మండల పరిధి పోరాటనగర్ గ్రామంలో భూ వివాదమై, జరిగిన దాడిలో గ్రామానికి చెందిన ఆంగోతు జయ గాయాలతో మైలవరం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. మద్యం మత్తులో ఉన్న తన భర్త నుంచి సంతకాలు సేకరించిన భర్త వైపు కుటుంబ సభ్యులు భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణను అడ్డుకున్నందుకు తనపై దాడి తెగబడ్డారని మీడియాకు వెల్లడించారు. ఐదేళ్లుగా జరుగుతున్న ఈ వివాదాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. ● మైలవరం మండల పరిధి మొర్సుమల్లి పంచాయతీలోని ములకలపెంట గ్రామానికి చెందిన కడియం పుల్లారావు చెడు వ్యసనాలకు బానిసై భారీగా అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చేందుకు పొలం అమ్ముతానంటూ తండ్రి శ్రీనివాసరావు(57)కి చెప్పడంతో అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన సాయంత్రం తండ్రి పొలంలోకి వెళ్లిన సమయంలో కర్రతో దాడి చేసి తండ్రిని హతమార్చి జైలుపాలయ్యాడు. తన తండ్రికి ఆస్తిని పంచడం లేదనే కోపంతో జి.కొండూరు మండల పరిధి చెవుటూరు గ్రామానికి చెందిన ఉమ్మడి శివసచ్చీంద్ర కుమార్ కొడుకు వేణుగోపాలరావు తన నాయనమ్మ ఉమ్మడి హైమావతి(65)ని జూలై 1వ తేదీన ఉదయం పొలంలో పశువులను మేపుతుండగా కర్రతో దాడి చేసి స్పృహ కోల్పోయిన తర్వాత వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి తగలబెట్టాడు. -
కనుల పండువగా కార్తికేయుని కల్యాణం
మోపిదేవి: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న మోపిదేవిలోని శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారి షష్ఠి కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామవరప్రసాద రావు ఆధ్వర్యంలో వేదపండితుడు కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ప్రధానార్చకుడు బుద్దు పవన్కుమార్ శర్మ, ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్యశర్మ ఆధ్వర్యంలో స్వామివార్ల కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దేవదాయశాఖ తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణ వేడుకను కనులారా తిలకించారు. జెడ్పీటీసీ సభ్యుడు మెడబలిమి మల్లికార్జునరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, తహసీల్దార్ ఎం.హరనాథ్, దేవస్థానం సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, చల్లపల్లి, అవని గడ్డ సీఐలు ఈశ్వరరావు, యువకుమార్, ఎస్ఐ పామర్తి గౌతమ్కుమార్, కె.వై.దాస్ పలుశాఖల అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
తగ్గిన దిగుబడులు.. పెరిగిన ఖర్చులు
మోంథా తుపాను వల్ల ఈ సంవత్సరం దిగుబడులు భారీగా తగ్గాయి. గతంలో ఎకరాకు 40 బస్తాలకు పైబడి దిగుబడి వచ్చిన పొలాల్లో ఈ ఏడాది 30 బస్తాలకు లోపే వస్తోంది. ఎకరాకు పది బస్తాల వరకు దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. తుపాను వల్ల పడిపోయిన పొలాలను యంత్రాలతో కోయించేందుకు ఎరకాకు రూ.5 వేల చొప్పున ఖర్చవుతోంది. పైగా ధాన్యాన్ని ఐదు రోజులు ఆరబెట్టాల్సి వస్తోంది. ఎకరా ధాన్యం ఆరబెట్టేందుకు ఇద్దరు కూలీలు అవసరం. మహిళలు రోజుకు రూ.500, పురుషులు రూ.700 చొప్పున కూలి తీసుకుంటున్నారు. యంత్రంతో కోసిన ధాన్యం విక్రయించేందుకు నాలుగైదు రోజులు ఆరబెట్టాలి. దీంతో రైతులకు ఎకరాకు రూ.5 వేల వరకు అదనంగా ఖర్చవుతోంది. ఇలా ఈ ఏడాది దిగుబడులు తగ్గడం, ఖర్చులు పెరగడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలినట్టయింది. -
పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని గోదావరి, రాజమండ్రి, కడియం సెక్షన్లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా జనవరి నెలలో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు పూర్తిగాను, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. పూర్తిగా రద్దు చేసిన రైళ్లు ఇవి.. జనవరి 29, 31 తేదీల్లో విజయవాడ–విశాఖపట్నం (12718/12717), జనవరి 29న విజయవాడ–రాజమండ్రి (67262/67261), జనవరి 28న రేణిగుంట–కాకినాడ పోర్టు (17249), జనవరి 29న కాకినాడ పోర్టు–రేణిగుంట (17250), జనవరి 28 నుంచి 31 వరకు గుంటూరు–విశాఖపట్నం (17239), జనవరి 29 నుంచి 31 వరకు విశాఖపట్నం–గుంటూరు (17240), జనవరి 29, 30న లింగంపల్లి–విశాఖపట్నం(12806), జనవరి 28, 29 తేదీలలో విశాఖపట్నం–లింగంపల్లి(12805), జనవరి 29, 31న రాజమండ్రి–విశాఖపట్నం(67285/67286), జనవరి 27న తిరుపతి–పూరి(17480), జనవరి 28న పూరి–తిరుపతి(17479), జనవరి 27న కాకినాడ పోర్టు–లింగంపల్లి (12775), జనవరి 28న లింగంపల్లి–కాకినాడ టౌన్(12776), ఈ నెల 28న తిరుపతి–విశాఖపట్నం(22708), జనవరి 29న విశాఖపట్నం–తిరుపతి (22707), జనవరి 29, 31న విజయవాడ–కాకినాడ పోర్టు (17257/17258), జనవరి 29న విజయవాడ–రాజమండ్రి(67202/67201), నర్సాపూర్–రాజమండ్రి (67246), రాజమండ్రి–భీమవరం జంక్షన్(67241), జనవరి 28, 29న మచిలీపట్నం–విశాఖపట్నం (17219) రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు.. చెంగల్పట్టు–కాకినాడ పోర్టు (17643) జనవరి 28న భీమవరం టౌన్–కాకినాడ పోర్టు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అదే విధంగా కాకినాడ పోర్టు– పుద్దుచ్చేరి (17655) ఈ నెల 29న కాకినాడ పోర్టు–భీమవరం టౌన్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లింపు.. జనవరి 28న విజయవాడ డివిజన్లోని గోదావరి స్టేషన్ మీదుగా నడవాల్సిన అలప్పుజ–ధనాబాద్ (13352) రైలును కొవ్వూరు, రాజమండ్రి, కడియం మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. అదే విధంగా బల్హార్షా, వరంగల్లు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ మీదుగా నడవాల్సిన హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(12804) రైలు జనవరి 28న నాగ్పూర్, దుర్గ్ జంక్షన్, లకోలి, సింగాపూర్ రోడ్డు, విశాఖపట్నం మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): పూర్తిగా పరిపక్వానికి రాకుండా వరి పంట కోయవద్దని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎన్. పద్మావతి బుధవారం ఓ ప్రకటనలో రైతులకు సూచించారు. ముందుగా వరి పంట కోస్తే మిల్లుకు చేరిన ధాన్యం ఎక్కువగా తప్ప, తాలు గింజలు ఉండే అవకాశం ఉంటుందన్నారు. గింజ నాణ్యత సరిగా ఉండటమే కాకుండా పూర్తిగా తయారు కాకపోవటం, గింజ బరువు తక్కువగా ఉండటం, కాటాలో అనుకున్న దానికంటే తక్కువ బరువు నమోదు అవుతుందన్నారు. ధాన్యం మిల్లులో ఆడించినప్పుడు ముక్కలు అయ్యి హెడ్ రైస్ రికవరీ శాతం తగ్గుతుందన్నారు. దీని కారణంగా రైతుకు సరైన మద్దతు ధర లభించదన్నారు. ఇందుకోసం రైతులు జాగ్రత్త వహించి వరి పంట పూర్తిగా తయారయిన తర్వాతనే కోతలు ప్రారంభించాలన్నారు. తుపాను లేక అధిక వర్షాలు కురిసే సూచనలు ఉన్నప్పుడు వరి కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. ఇప్పటికే కోత కోసి ఉంటే కుప్పలు వేసుకుని ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పి సంరక్షించుకోవాలని సూచించారు. మైలవరం: ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి డీఏ ఫుట్ బాల్ లీగ్ పోటీలు మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి స్టేడియంలో రెండో రోజు బుధవారం హోరాహోరీగా కొనసాగాయి. మొదటి మ్యాచ్లో పెన్నా 3–1గోల్స్ ఆధిక్యంతో వంశధార జట్టుపై, రెండో మ్యాచ్లో గోదావరి జట్టు 4–0 గోల్స్ ఆధిక్యంతో కొల్లేరు జట్టుపై గెలుపొందింది. మధ్యాహ్నం జరిగిన మొదటి మ్యాచ్లలో విశాఖ జట్టు నల్లమల జట్టుపై 4–1 గోల్స్ ఆధిక్యంతో, తుంగభద్ర జట్టు కోరమాండల్ జట్టుపై 2–1 గోల్స్ ఆధిక్యతతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లకు ముఖ్య అతిథులుగా చాంబర్ ఆఫ్ కామర్స్ మైలవరం అధ్యక్షుడు సీహెచ్ మధుసూదనరావు, మైలవరం సర్పంచ్ మంజుభార్గవి పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్టీపీసీ 42వ సబ్ జూనియర్స్ నేషనల్ ఆర్చరీ చాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ కాంపౌండ్ బాయ్స్ టీమ్ బంగారు పతకాన్ని సాధించింది. బుధవారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో పంజాబ్ టీమ్పై 218–232 తేడాతో ఏపీ కాంపౌండ్ బాయ్స్ టీమ్లోని ఆర్చర్లు పి.చరణ్శ్రీకర్, ఎం. సుహాస్, ఈ.సాయి రాధాకృష్ణమూర్తి, కె.బుద్దేశ్వరరావు బంగారు పతాకాన్ని సాధించారు. క్రీడాకారులను ఓల్గా ఆర్చరీ అకాడమీ చీఫ్ కోచ్, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేసన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బీవీ రమణ, కోశాధికారి చెరుకూరి కృష్ణకుమారి, ఉపాధ్యక్షుడు గొట్టిపాటి ప్రేమ్కుమార్, కోచ్లు నవీన్కుమార్, ఈ.సాహిత్, టి.శివశంకర్ మేనేజర్ కమల్కిషోర్ అభినందించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025ఆర్డీఓ కార్యాలయం తనిఖీ గుడివాడటౌన్: స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ బుధవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన పలు రికార్డులను పరిశీలించారు. ఇంద్రకీలాద్రి: విజయవాడ నగరంలోని వన్ టౌన్కు చెందిన వి.రాజేంద్రప్రసాద్, శివపార్వతి బుధవారం దుర్గగుడి వేద పరిరక్షణ ట్రస్ట్కు రూ.1,11,116 విరాళం సమర్పించారు.7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు అంతే వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు. -
భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ ప్రజ లకు అనుక్షణం తోడుగా, నీడగా నిలిచి రక్షిస్తున్న రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. రాజ్యాంగం చూపిన బాటలో నడిచి ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. స్వతంత్ర భారతావనిని అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థతో సగర్వంగా నిలిపిన రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26న ఆమోదించుకున్నామని గుర్తుచేశారు. దేశ చరి త్రలో అపూర్వమైన ఈ ఘట్టానికి గుర్తుగా ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకొంటున్నామని వివరించారు. రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు, ఆదర్శాలను తెలుసుకోవడం ద్వారా మనం ఎంత గొప్ప ప్రజాస్వామ్యంలో ఉన్నా మనేది స్పష్టమవుతుందన్నారు. రాజ్యాంగ విశిష్టతను తెలుసుకోవడమనేది ఏదో ఒక్క రోజుకే పరిమితం చేసుకోకుండా రోజూ రాజ్యాంగం గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటూ ప్రగతి పథంలో పయనించాలని సూచించారు. రాజ్యాంగ రూపకల్పనకు విశేష కృషిచేసిన డాక్టర్ అంబేడ్కర్ వంటి మహనీయుల బాటలో యువత నడుస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. విజేతలకు బహుమతి ప్రదానం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పాఠశాల విద్యాశాఖ నియోజకవర్గ స్థాయిలో క్విజ్, వక్తృత్వం, వ్యాస రచన విభాగాల్లో పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో విజేతలకు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పతకాలు అందజేశారు. రాజ్యాంగ పీఠికను చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు బాగా చదువుకొని మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో అడుగులేస్తూ పయనించాలని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. డీఈఓ యు.వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మైలవరం: మండలంలోని కీర్తి రాయుని గూడెంకు చెందిన బట్టు గోపరాజు(22) మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై బయటికి వెళ్లి అతి వేగంగా వాహనం నడుపుతూ కీర్తిరాయునిగూడెం గ్రామం శివారు రెడ్డిగూడెం రోడ్లో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో మృతి చెందా డు. మరుసటి రోజు గ్రామస్తులు చూసి మృతుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చా రు. తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యుల కు అప్పగించినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నారంటూ వచ్చిన పుకార్లు అవాస్తవమని వైద్యశాఖ, పోలీసుశాఖ అధికారులు తేల్చారు. ర్యాగింగ్ అంటూ పుకార్లతో పాటు, ఓ పత్రికలో (సాక్షి కాదు) కూడా వార్త రావడంతో అధికారులు విచారణ జరిపారు. వైద్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎంఈ కార్యాలయంలోని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (విజిలెన్స్) వైద్య కళాశాలకు వచ్చి విచారణ జరిపారు. మాచవరం పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగ సిబ్బంది కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. కాగా పోలీసులు ర్యాగింగ్ లాంటిది ఏమీ జరగలేదని అది ఫాల్స్ అని తేల్చేశారు. వైద్య శాఖ అధికారులు రెండు రోజుల కిందట 2023 బ్యాచ్ పార్ట్–1 విద్యార్థులకు, హౌస్సర్జన్లకు మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని, ర్యాగింగ్ లాంటిది ఏమీ లేదని వివరించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రత్యేకంగా ఉంటున్నారని, వారికి ఏర్పాటు చేసిన పూర్తిస్థాయి సెక్యూరిటీ వివరాలను విచారణకు వచ్చిన డాక్టర్ వెంకటేష్కు తెలిపారు. -
సీఐ సతీష్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పరకామణి కేసులో సాక్షిగా ఉన్న సీఐ సతీష్ కుమార్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అనుమానాలు వ్యక్తం చేశారు. సతీష్కుమార్ మృతిపై ప్రత్యేక సిట్ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీఐ సతీష్ కుమార్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ.. సీఐ సతీష్ కుమార్ హత్యపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలన్నారు. పరకామణి ఘటనలో సాక్షిగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన సతీష్కుమార్ మృతిపై ప్రభుత్వం స్పందించిన తీరును తప్పుబట్టారు. ఈ ఘటనపై త్వరలోనే డీజీపీని కలిసి నిందితులను శిక్షించాలని కోరతామన్నారు. సతీష్కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.వి ఎస్.ఎన్ మూర్తి, రిటైర్డ్ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్, ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, బీసీ కులాల జేఏసీ అధ్యక్షుడు లంక వెంకటేశ్వరరావు, కుమ్మర క్రాంతి కుమార్, వి.వి.రావు, పి.సతీష్, సోము మహేష్, చందు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు -
28,29 తేదీల్లో పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): పీడీఎస్యూ 24వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 28,29 తేదీల్లో రాజమహేంద్రవరంలోని అంబేడ్కర్ భవన్లో జరుగుతాయని యూనియన్ జాతీయ కన్వీనర్ ఎం.రామ కృష్ణ తెలిపారు. ప్రెస్క్లబ్లో మహాసభల వాల్ పోస్టర్లపే ఆయన మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాసభలను ప్రొఫెసర్ టి.సత్యనారాయణ ప్రారంభిస్తారని తెలి పారు. విద్యారంగం శాస్త్రియ దృక్పథంపై ఏపీ విద్యాపరిరక్షణ కమిటీ కన్వీనర్ డి.రమేష్ పట్నాయక్, జాతీయోద్యమంలో – విద్యార్థుల పాత్రపై సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు పి.టాన్యా, విద్యారంగం సవాళ్లు – విద్యార్థుల కర్తవ్యాలపై తన ప్రసంగ పాఠాలు ఉంటా యని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి జీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.6 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయలేదన్నారు. సంక్షేమ హాస్టల్లో చదు వుతున్న విద్యార్థులు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణ అంటే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనని పేర్కొన్నారు. విద్యారంగ సంక్షోభంపై చర్చించి భవిష్యత్ కర్తవ్యలు రూపొందించడానికి జరిగే మహాసభలను జయప్రదం చేయాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్ర మంలో పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు ఆర్.వేణు, పి.వైష్ణవ్, కె.హేమ, మణికంఠ, భాను, రవిశంకర్, ఆసియా, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పూసల దండల సేకరణకు రూ.8.67 లక్షలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్షల విరమణ అనంతరం మాలధారులు విడిచిపెట్టే పూసల దండలను సేకరించే హక్కు కోసం రూ.8.67 లక్షలు చెల్లించేందుకు ఓ కాంట్రాక్టర్ ముందుకు వచ్చారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్ని ధిలో మంగళవారం పూసల దండల సేకరణ హక్కు కోసం బహిరంగ వేలం జరిగింది. దేవస్థానం డిపాజిట్ను రూ.20 వేలుగా నిర్ణయించగా, 13 మంది కాంట్రాక్టరు పాల్గొన్నారు. గత ఏడాది ఈ వేలం ధర రూ.6.05 లక్షలు పలకగా, ఈ ఏడాది దేవస్థానం పాటను రూ.7 లక్షలుగా నిర్ణయించింది. బహిరంగ వేలం క్రమ క్రమంగా పెరిగింది. జి.దుర్గారావు రూ. 8.67 లక్షలు చెల్లించేందుకు ముందు కొచ్చారు. టెండర్ ప్రక్రియను ఏఈఓ ఎన్.రమేష్బాబు, ఆలయ లీజెస్ విభాగం అధికారులు పర్యవేక్షించారు. ఆలయ సిబ్బందితో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు (బుల్లాబ్బాయ్), రాఘవరాజు తదితరులు పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ పెట్టాడన్న ఆరోపణపై వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ షేక్ ఆదం షరీఫ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో నివసిస్తున్న షరీఫ్ ఇంటికి కొత్తపేట పోలీసులు మంగళవారం వేకువజాము నాలుగు గంటల సమయంలో వెళ్లి తలుపులు తట్టారు. బయటకు వచ్చిన ఆయన ఫోన్ను సీఐ కొండలరావు లాక్కుని పరిశీలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నట్టు ఫిర్యాదులు అందాయని చెబుతూ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ విషయం తెలిసిన జెడ్పీ వైఎస్ చైర్పర్సన్ గరిక పాటి శ్రీదేవి, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు స్టేషన్కు తరలి వచ్చారు. సీఐ కొండలరావును కలిసి మాట్లాడారు. అరెస్టయిన షరీఫ్తో మాట్లాడి ధైర్యం చెప్పారు. సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టినవారిని అరెస్ట్ చేయవద్దని సుప్రీం కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ పోలీసులు వాటిని ధిక్కరిస్తూ వ్యవహరించటం రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అక్రమ అరెస్ట్లు జరుగుతున్నాయని విమర్శించారు. రాత్రికి షరీఫ్ను పోలీసులు వదిలిపెట్టారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ – అనకాపల్లి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును మార్చి వరకు పొడిగిస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం తెలిపారు. సికింద్రాబాద్ – అనకాపల్లి ప్రత్యేక రైలు (07055) డిసెంబర్ నాలుగు నుంచి మార్చి 26వ తేదీ వరకు ప్రతి గురువారం, అనకాపల్లి – సికింద్రాబాద్ రైలు (07056) డిసెంబర్ ఐదు నుంచి మార్చి 27వ తేదీ వరకు ప్రతి శుక్రవారం నడుస్తాయి. అశ్లీల నృత్యాలు చేసిన హోంగార్డు సస్పెన్షన్ కోనేరుసెంటర్(మచిలీపట్నం): మహిళతో అశ్లీలంగా నృత్యం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఓ హోంగార్డుపై ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. బి.అజయ్ కుమార్ కంకిపాడు రూరల్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఉయ్యూరు మండలం గండిగుంటపాలెం గ్రామంలో పిల్లల సమక్షంలో ఓ మహిళతో అశ్లీలంగా నత్యం చేస్తూ వీడియో తీయించుకున్నాడు. ఆ వీడియోను స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం కాస్త అధికారుల దృష్టికి వెళ్లింది. మహిళతో హోమ్ గార్డ్ అశ్లీల నృత్యం విషయాన్ని అధికారులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరిపించిన ఎస్పీ వాస్తవాలు తెలుసుకొని మంగళవారం హోంగార్డు అజయ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
సుబ్రహ్మణ్య షష్ఠి కల్యాణోత్సవాలు ప్రారంభం
మోపిదేవి: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి షష్ఠి కల్యాణ మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వర ప్రసాదరావు ఆధ్వర్యంలో వేదపండితుడు కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్కుమార్ శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి సుబ్రహ్మణ్య శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు దేవదాయ ధర్మదాయ శాఖ తరఫున పట్టు వస్త్రాలను స్వామివార్లకు సమర్పించారు. ఆ పట్టు వస్త్రాలతో స్వామివార్లను అందంగా అలంకరించారు. సాయంత్రం యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణ, అంకురారోపణ, వాస్తుపూజ, బలిహరణను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలుగ్రామాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి వార్లను దర్శించుకున్నారు. నూతన సంవత్సర కాలెండర్ ఆవిష్కరణ 2026వ సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఆవిష్కరించారు. ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, చెన్నకేశవ, చల్లపల్లి సీఐ ఈశ్వరావు, ఎస్ఐ గౌతమ్ కుమార్, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి సాధ్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగుల సమష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులు అందిస్తున్న సహకారం మరువలేనిదని, ప్రజలకు పారదర్శకమైన సేవలందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో భాగస్వాములు కావాలని కోరారు. కలెక్టర్గా బాధ్య తలు చేపట్టి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి.సత్యనారాయణ రెడ్డి, సహాధ్యక్షుడు వేమూరి ప్రసాద్, కార్యదర్శి డి.రమేష్, నగర అధ్యక్షుడు సి.వి.ఆర్.ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా, నగర కార్యవర్గ సభ్యులు మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావ డంలో ఉద్యోగులు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక, సేవారంగాల్లో వార్షికవృద్ధి లక్ష్య సాధనకు సమష్టి కృషి అవసరమన్నారు. జిల్లాలో ఏడా దిగా సాధించిన విజయాలు అధికారులు, ఉద్యోగుల సమన్వయంతో సాధ్యమయ్యాయని పేర్కొ న్నారు. ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే త్వరితగిన పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటానని భరోసా కల్పించారు. ఏపీ ఎన్జీనో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి.ఎస్.ఎన్.రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించేందుకు ఉద్యోగులూ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు వి.వి. ప్రసాద్, పి.రమేష్, బి.సతీష్ కుమార్, ఎం.రాజుబాబు, డి.విశ్వనాథ్, బి.వి.రమణ, రామకృష్ణ, మహిళా ప్రతినిధి కె.శివలీల, నగర కార్యవర్గ సభ్యులు సి.వి.ఆర్.ప్రసాద్, ఎస్కే నజీరుద్దీన్, వి.రాజశేఖర్, దిలీప్ కుమార్, కె.మధుసూదన రావు, శ్రీనివాసరావు, విజయశ్రీ, సాగర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
చివరి గింజ వరకు ధాన్యం కొనాలి
తోట్లవల్లూరు: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన తోట్లవల్లూరులో ఆయన మంగళవారం రాత్రి పర్యటించారు. మొంథా తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని అనిల్కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. నాణ్యత, నిబంధనల పేరుతో అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయకుండా సకాలంలో ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలన్నారు. రైతులకు అవసరమైన గోనె సంచులను రైతు సేవాకేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచా లని కోరారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1790కు ధాన్యం కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. విపత్తులతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవటంలో చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం అన్యాయమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితులు దాపురిస్తున్నాయని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉన్నామని గుర్తుచేశారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వటంతోపాటు రైతుభరోసా కేంద్రాల ద్వారా విస్తృత సేవలు అందించినట్లు తెలిపారు. వరదలు, విపత్తులతో పంటలు దెబ్బతిన్న రైతులకు సకాలంలో ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీని అందజేసినట్లు అనిల్కుమార్ గుర్తు చేశారు. వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘనత వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ -
శివగంగ సొసైటీలో నిధుల గోల్మాల్!
● రూ.5 కోట్లకు పైగా గల్లంతైనట్లు ఆరోపణలు ● ఆందోళన చెందుతున్న రైతులు, డిపాజిటర్లు ● సొసైటీ సీఈఓను సస్పెండ్ చేసిన అధికారులు చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం నగరంలోని శివగంగ సొసైటీలో నిధులు గోల్మాల్ అయినట్లు తెలుస్తోంది. సొసైటీ సీఈఓ కొల్లూరి రాజేష్ 2021వ సంవత్సరం నుంచి సొసైటీ నిధులను సొంత నిధుల్లా వాడుకుని స్వాహా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అప్పటి నుంచి రైతులకు ఇచ్చిన లోన్లకు సంబంధించి వారు చెల్లించిన సొమ్ముకు సరైన మొత్తంలో రశీదులు ఇవ్వకపో వటం, సొసైటీలో డిపాజిట్ చేసిన నగదును ఫోర్జరీ సంతకాలతో స్వాహా చేసినట్లు తెలుస్తోంది. సొసైటీ సభ్యులు నిబంధనల ప్రకారం స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటే ధ్రువపత్రాలు సమ ర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు వారి పొలం కాగితాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రుణాలు పొందుతారు. రుణాలు పొందే రైతులు సొసైటీ ద్వారా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్లో రుణం తీసుకుంటారు. ఈ రుణానికి సంబంధించి నిర్ణీత సమయంలో రుణం చెల్లించేందుకు వచ్చిన రైతుల వద్ద నుంచి కట్టాల్సిన సొమ్మును తీసుకుని, దానికి సంబంధించి ఎటువంటి రికార్డులు నిర్వహించకుండా సొంతంగా సొసైటీ సీఈఓ కై ంకర్యం చేసినట్లు విచారణలో తేటతెల్లమైంది. డిపాజిటర్ల సొమ్ము ఫోర్జరీ సంతకాలతో స్వాహా కొంత మంది సభ్యులు ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో సహకార సంఘంలో డిపాజిట్లు చేశారు. వీటిని సహకార కేంద్ర బ్యాంకులో తిరిగి డిపాజిట్ చేయాల్సి ఉంది. ఆ డిపాజిట్ల సొమ్ముపై సొసైటీ సీఈఓ కొల్లూరి రాజేష్ కన్నుపడి డిపాజిట్దారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.60 లక్షల వరకు స్వాహా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న సభ్యుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన అనంతరం పాలకవర్గ సమావేశంలో పెట్టి తీర్మానం చేయాలి. ఆ తరువాత, సహకార కేంద్ర బ్యాంకు ఆ దరఖాస్తులను పరిశీలించి రుణాలు మంజూరు చేస్తుంది. అయితే సహకార బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వకుండా తానే రుణాలు మంజూరు చేసి, నిధులను లావాదేవీల ద్వారా తన ఖాతాకు మళ్లించుకున్నట్లు తెలుస్తోంది. గత ఏప్రిల్లో సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేశారు. దీంతో లావాదేవీలన్నీ కంప్యూటర్ ద్వారా నిర్వహించాల్సి ఉంది. అయితే శివగంగ సొసైటీలో లావాదేవీలను మాన్యువల్గా చేసినట్లు విచారణ చేసిన అధికారులు గుర్తించినట్లు సమాచారం. అధికారుల విచారణకు సహకరించని సీఈఓ సహకార సంఘంలో 2021వ సంవత్సరం నుంచి జరిపిన లావాదేవీల్లో నిధులు కై ంకర్యం చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు సహకారశాఖ అధికా రులు 51 నోటీసు ఇచ్చి విచారణ చేపట్టారు. ఈ విచారణలో సంఘంలో సీఈఓ చేసిన లావాదేవీలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలన్నీ సమ ర్పించాల్సి ఉంది. అయితే సీఈఓ వారికి అందు బాటులో లేకుండా ఆ ధ్రువీకరణ పత్రాలన్నీ తన స్వాధీనంలో ఉంచుకుని విచారణకు సహకరిం చటం లేదని సహకారశాఖ అధికారులు చెబుతున్నారు. సొసైటీలో నిధుల కై ంకర్యంలో సుమారు రూ.5 కోట్ల మేర జరిగి ఉంటుందని సొసైటీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిధుల స్వాహాపై విచారణ చేస్తున్న అధికారి పి.రాము రికార్డుల పరిశీలన అనంతరం తన దృష్టికి వచ్చిన వివరాలతో నివేదిక రూపొందించి డివిజనల్ సహకారశాఖ అధికారి వి.వి.ఫణికుమార్కు అందజేసి సొసైటీ సీఈఓ కొల్లూరి రాజేష్పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. డీసీఓ కె.చంద్రశేఖరరెడ్డి, కేడీసీసీ బ్యాంకు సీఈఓ ఎ.శ్యామ్మనోహర్ మంగళవారం శివగంగ సొసైటీ సీఈఓ కొల్లూరి రాజేష్ను సస్పెండ్ చేశారు. సొసైటీ నిధుల విషయంపై సహకారశాఖ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా తాము విచారణ చేపడుతున్నామని, పూర్తయిన వెంటనే ఎంత నిధులు స్వాహా అయ్యాయో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
దుర్గమ్మకు కానుకగా బంగారపు నానుతాడు, మంగళసూత్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు చిత్తూరుకు చెందిన భక్తురాలు రూ. 3.50 లక్షల విలువైన బంగారపు నానుతాడు, మంగళసూత్రాలను కానుకగా సమర్పించారు. చిత్తూరుకు చెందిన లక్ష్మీశిల్ప 27గ్రాముల బంగారంతో నానుతాడు, మంగళసూత్రాలను తయారు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. బంగారు ఆభరణాన్ని ఉత్సవాల సమయంలో అమ్మవారికి అలంకరించాల్సిందిగా దాత ఆలయ అధికారులను కోరారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. మైలవరం: ౖమెలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ డీఏ లీగ్ మ్యాచ్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగుతోంది. మంగళవారం పెన్నా జట్టు 2–0 ఆధిక్యంతో గోదావరి జట్టుపై విజయం సాధించింది. కోరమాండల్పై వంశధార జట్టు 0–1 గోల్స్ తేడాతో గెలిచింది. మూడో మ్యాచ్ కోల్లేరు వర్సెస్ నల్లమల జట్ల మధ్య జరగ్గా కొల్లేరుపై 2–1 గోల్స్తో నల్లమల విజయం సాధించింది. 4వ మ్యాచ్లో విశాఖ జట్టుపై తుంగభద్ర 0–2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లకు ముఖ్య అతిథులుగా జాస్తి వెంకటేశ్వరరావు, ఎల్జీఎం కోఆర్డినేటర్, జి. రవీంద్ర పాల్గొన్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శేషగిరిరావు, టోర్నమెంట్ చైర్మన్ బి. చక్రవర్తి తదితరులు హాజరయ్యారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో ఆరోగ్య సేవలు, కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ప్రోగ్రామ్ అధికారులకు సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్న ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ అధికారులతో మంగళవారం డీఎంహెచ్ఓ 13 కీలక ఆరోగ్య సూచికల్లో జిల్లా పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా సేవలు బలోపేతం, అన్ని పారామీటర్లలో 100% విజయాన్ని నిర్ధారించడానికి స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ఆరోగ్య సేవల్లో సెప్టెంబర్లో జిల్లా 6వ స్థానంలో నిలిచిందని, ప్రస్తుతం 4వ స్థానానికి చేరుకున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఇందుమతి, డీపీఎంఓ డాక్టర్ నవీన్, డాక్టర్ మాధవి నాయుడు, డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్ స్నేహ సమీరా, డాక్టర్ సునీల్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం), వీవీప్యాట్లను నిల్వ ఉంచిన గోడౌన్కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నెలవారీ సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గల ఈవీఎం, వీవీప్యాట్ల గోడౌన్ను అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతోపాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, వైఎస్సార్ సీపీ ప్రతినిధి యరడ్ల ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
షరామామూళ్లే!
పన్ను చెల్లింపులు..● విజయవాడ కేంద్రంగా రూ. కోట్ల హోల్సేల్ వస్త్ర వ్యాపారం ● పన్నులు మాత్రం నామమాత్రమే ● రైల్వేస్టేషన్ నుంచి బిల్లులు లేకుండా భారీగా సరుకు దిగుమతి ● చోద్యం చూస్తున్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ● గతంలో నిఘా పెట్టి మరీ మామూళ్లు దండుకున్నట్లు ఆరోపణలు వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ కేంద్రంగా కోట్లాది రూపాయల హోల్సేల్ వస్త్ర వ్యాపారం జరుగుతున్నా.. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు మాత్రం నామమాత్రంగానే ఉంటు న్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి పరిసర ప్రాంతాలకు నిత్యం వందల బేళ్లు రెడీమేడ్ దుస్తులు దిగుమతి అవుతుంటాయి. వాటికి ఎటువంటి బిల్లులు ఉండటం లేదు. అయినప్పటికీ పట్టించుకునే అధికారులు కరువయ్యారు. రైల్వేస్టేషన్ నుంచి వివిధ వాహనాల్లో యథేచ్ఛగా సరుకు బయటకు వచ్చి ఆయా దుకాణాలకు చేరుతున్నా.. అధికార యంత్రాంగానికి ఏమాత్రం తెలియకపోవటం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పలు మార్గాల్లో బయటకు.. విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సరుకు వివిధ మార్గాల్లో బయటకు వస్తోంది. సరుకు సాధారణంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న మార్గం ద్వారా బయటకు రావాల్సి ఉంది. కొంతమంది పాతబస్తీ తారాపేట వద్ద రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఉన్న మార్గం ద్వారా బయటకు సరుకును తీసుకెళ్తుంటారు. అయితే వీటి ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు నిఘా ఉంటుందనే ఆలోచనతో వ్యాపార వర్గాలు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ఫారం మీదుగా డీఆర్ఎం ఆఫీస్ సమీపంలో బయటకు వచ్చే మార్గం ద్వారా బేళ్లను వ్యాపారులు తీసుకుళ్తుంటారు. ఈ మార్గం ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సరుకు బయటకు తీసుకెళ్లి తమతమ దుకాణాలకు చేర్చుకుంటారు. ఎటువంటి బిల్లులు లేకుండా రాష్ట్రాలు దాటి సరుకు నగరానికి చేరుకోవటం చాలా సులువుగా జరిగిపోతుంది. పండుగ సీజన్లో భారీగా.. సాధారణంగా పండుగల సమయంలో రెడీమేడ్ సరుకు భారీగా దిగుమతి అవుతుంది. అందులోనూ సంక్రాంతికి రెండు మాసాల ముందుగానే సరుకు హోల్సేల్లర్లు నగరానికి తెప్పించుకుంటారు. డిసెంబర్ క్రిస్మస్, కొత్త సంవత్సరాది, సంక్రాంతి పర్వదినం.. ఈ మూడు ముఖ్యమైన పండుగలకు భారీగా వస్త్ర వ్యాపారం జరుగుతుంది. వాటిని గమనంలో ఉంచుకొని ఈ రెండు మాసాలు వ్యాపార వర్గాలు తమ సరుకును భారీగా తీసుకొస్తారు. దానిని రైల్వే ద్వారా తెచ్చుకుంటున్నారు. వాటికి ఎటువంటి బిల్లులు లేకుండా నేరుగా నగరానికి తీసుకొస్తున్నారు. రైల్వేస్టేషన్ నుంచి వారివారి దుకాణాలకు యథేచ్ఛగా చేర్చుకుంటారు. రెండు మాసాలు నిఘా ఉంచినా.. రైల్వేస్టేషన్ నుంచి భారీగా సరుకు నగరానికి వస్తున్న విషయం తెలుసుకున్న వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు గత ఏడాది ఇదే సీజన్లో దీనిపై నిఘా ఉంచారు. సుమారు రెండు మాసాలు పూర్తిగా తమ సిబ్బందికి ఈ రైల్వేస్టేషన్ వద్ద విధులు కేటాయించారు. రెండు మూడు షిఫ్టుల్లో సిబ్బంది రైల్వేస్టేషన్ వద్ద కాపలా కాశారు. విచిత్రమేమిటంటే అన్ని రోజులు విధులు నిర్వర్తించినా ఒక్కటంటే ఒక్క కేసూ నమోదు చేయలేదు. విధులు నిర్వర్తించిన సిబ్బందికి ఒక్క బేలు సైతం కనపడకపోవటం సర్వత్రా విస్మయానికి గురి చేసింది. దీనిపై చాలా ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. బిల్లులు లేకుండా అక్రమంగా వస్తున్న వస్త్ర సరుకు నిల్వల కారణంగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్నులను వ్యాపారులు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఇటీవల పన్ను శాతం తగ్గినప్పటికీ బిల్లులు లేని సరుకు నిల్వలు విక్రయాల ద్వారా అసలు ప్రభుత్వానికి లెక్కలు తెలియకుండా పోతుంది. తద్వారా కేవలం వాణిజ్య పన్నుల శాఖ మాత్రమే కాకుండా మిగిలిన శాఖలకు సైతం రావాల్సిన పన్నులను ఎగొట్టడానికి ఆస్కారమేర్పడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వేస్టేషన్ ద్వారా వచ్చే సరుకుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా ఉంచటం ద్వారా ప్రభుత్వ శాఖలకు రావాల్సిన పన్నులు సక్రమంగా అందటానికి వీలుంటుంది. ఆ దిశగా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
ఆస్పత్రులు తనిఖీ చేసిన కృష్ణా జిల్లా వైద్యాధికారి
పెనమలూరు: కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్ యుగంధర్ మండల పరిధిలో రెండు ఆస్పత్రులను తనిఖీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యధికారి యుగంధర్ మంగళవారం కానూరు నాగార్జున ఆస్పత్రి, పోరంకి కామినేని ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఈ ఆస్పత్రులపై ఫిర్యాదులో రావటంతో రోగులకు ఇక్కడ అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, ఆరోగ్య శ్రీ పథకం అమలును పరిశీలించారు. ఆస్పత్రుల్లో పలు రికార్డులు తనిఖీ చేశారు. ఆస్పత్రులు నిబంధనల ప్రకారం పని చేయాలని, రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని సూచించారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
హైకోర్టును తప్పుదోవ పట్టించే యత్నం
● ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ● అక్రమ నిర్మాణాలు తక్షణం నిలిపివేయాలని ఆదేశం కంచికచర్ల: జాతీయ రహదారి–65పై ఆర్టీసీ బస్టాప్ స్థానంలో అధికార పార్టీ నేతలు ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే దీనిపై గ్రామస్తులతో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు వేల్పుల ప్రశాంతి హై కోర్టును ఆశ్రయించడంతో అక్రమ కట్టడాలని నిలిపివేయాలని కోర్టు స్టే ఇచ్చింది. అయితే వారు ఆ ఆదేశాలు పాటించకుండా.. పాటిస్తున్నట్లు కోర్టును నమ్మించే యత్నం చేశారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిర్మాణాలు తక్షణమే నిలిపివేసేలా చూడాలని జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక అధికారులను ఆదేశించింది. ఆదాయ వనరుగా మార్చుకునేందుకు.. కీసర ప్రధాన కూడలి వద్ద హైవే అధికారులు 2004లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాప్ను నిర్మించారు. ఆ బస్ షెల్టర్ను పడగొట్టి, ఆ స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టేందుకు పచ్చనేతలు పూనుకున్నారు. సుమారు 15 గదులు నిర్మిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారపార్టీ నాయకులు బస్షెల్టర్ను పడగొడుతున్నా కనీసం నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోలేదు. అంతేకాకుండా 30 ఏళ్ల క్రితం ఆ ప్రదేశంలో చిన్న చిన్న బడ్టీకొట్లు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్న వారిని సైతం అక్కడి నుంచి వెళ్లగొట్టారు. దీంతో వారు జీవనోపాధి కోల్పోయారు. హైకోర్టు ఉత్తర్వులు ఇలా.. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులతో కలిసి జెడ్పీటీసీ సభ్యురాలు వేల్పుల ప్రశాంతి ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించారు. వీరి వాదనలు విన్న న్యాయస్థానం అక్రమ కట్టడాలు తక్షణమే నిలిపివేయాలని పది రోజుల కిందట ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ పచ్చ పార్టీ నేతలు ఇష్టారీతిన కట్టడాలు నిర్మిస్తుండటంతో మరోసారి ఆమె హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీడియో సైతం చూపడంతో అక్రమ కట్టడాలు కట్టకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, కంచికచర్ల తహసీల్దార్, గ్రామ పంచాయతీ కార్యదర్శులదేనని కోర్టు తీర్చునిచ్చింది. బుధవారం జిల్లా కలెక్టర్, తహసీల్దార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. -
సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సర్వదర్శనం క్యూలైన్లో వచ్చే సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనాన్ని ఉచితంగా కల్పించేందుకు దుర్గగుడి ట్రస్ట్బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ప్రతి మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య వచ్చే భక్తులను ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించేందుకు దేవస్థాన ట్రస్ట్బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఈ కార్యక్రమానికి ట్రయల్ రన్ నిర్వహించారు. సర్వ దర్శనంలో వస్తున్న భక్తులను రూ.500 టికెట్ క్యూలైన్లోకి మళ్లించి వారికి అంతరాలయ దర్శనం కల్పించారు. సుమారు 1500 మందికి ఈ అవకాశం పొందినట్లు అధికారులు తెలిపారు. సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనాన్ని పరిశీలించామని, త్వరలో జరిగే బోర్డు సమావేశంలో చర్చించి దేవదాయ శాఖ కమిషనర్ ఆమోదం నిమిత్తం పంపే ఆలోచన చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
ముడుపులతో జల్సా..
రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందికి వ్యాపార వర్గాల నుంచి భారీగా ముడుపులు వెళ్తుంటాయనే విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే వ్యాపారులు రైల్వేస్టేషన్ నుంచి ఎంత భారీ సరుకు నిల్వలు తీసుకొచ్చినా వారి జోలికి వెళ్లరనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఆ శాఖ దిగువస్థాయి సిబ్బంది ఈ ప్రాంతంలో విధులు నిర్వర్తించి అటు వ్యాపారులకు, ఇటు అధికారులకు మధ్య వారిధిగా ఉండి ముడుపులు సర్దుబాటు చేసేవాడనే విమర్శలు ఉన్నాయి. అయితే స్థాయికి మించి వసూళ్లకు దిగటంతో వ్యాపారులు ఏసీబీని ఆశ్రయించి పట్టించారనే కొంతమంది ఉద్యోగులే చెబుతున్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025u8లో ముందుకు సాగని వెస్ట్ బైపాస్ పనులు● చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా పరిష్కారం కాని సమస్య ● గత ప్రభుత్వ హయాంలోనే 96శాతం మేర పనులు పూర్తి ● నున్న వద్ద కొలిక్కి రాని విద్యుత్తు టవర్ల సమస్య ● ఈనెల 20నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ బైపాస్ రోడ్డులోకి మళ్లింపు ● వచ్చే ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి అవుతాయంటున్న అధికారులు అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3600 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 43.0610 టీఎంసీలు.సాక్షి ప్రతినిధి, విజయవాడ: వెస్ట్ బైపాస్కు చిక్కు ముడి వీడటం లేదు. దాదాపు 96శాతం పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయినా.. విద్యుత్ టవర్ల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్యాకేజీ–3 కింద చిన అవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు నిర్మించాలని ప్రణాళిక చేశారు. ఈ పని విలువ రూ.1,148కోట్లు కాగా, పనులను మెగా సంస్థ ఫిబ్రవరి 2021లో చేపట్టింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు శరవేగంగా ముందుకు సాగాయి. ఈ రహదారి కోసం 14 గ్రామాల్లో 188.92 హెక్టార్ల భూసేకరణ చేశారు. ఇందుకోసం రూ.416 కోట్లు ఖర్చు చేశారు. విజయ వాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు చెక్ పెట్టాలనే కృత నిశ్చయంతో పనులను పరుగు పెట్టించారు. జనవరి 2024కు బైపాస్ అందుబాటులోనికి తెచ్చే విధంగా 96శాతం మేర పనులను పూర్తి చేశారు. కొంత మంది రైతులు కోర్టుకు వెళ్లి విద్యుత్తు టవర్ల మార్పిడి ప్రాంతంలో పనులు పూర్తి కాకుండా అడ్డుకొన్నారు. మూడు చోట్ల పనులు ఆగిపోయాయి. 90మీటర్ల మేర జక్కంపూడి, నున్న ప్రాంతంలో విద్యుత్తు టవర్లు ఉన్న ప్రాంతంలో రోడ్డు పనులు ఆగిపోయాయి. ఆ సమస్య చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా కొలిక్కి రాలేదు. ఈనెల 20వ తేదీ నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలను వెస్ట్ బైపాస్ రోడ్డులో అనుమతించారు. పనులన్నీ పూర్తి అయ్యాక పశ్చిమ బైపాస్ మొదలయ్యే చిన్న అవుటుపల్లి దగ్గర, ఎన్హెచ్–16 అనుసంధాన పనులు పూర్తి కాలేదు. ఇంకా నున్న దగ్గర విద్యుత్తు టవర్ల సమస్య అలాగే ఉంది. ఈ నేపథ్యంలో పనులు వచ్చే ఏడాది పిభ్రవరి నాటికి గాని పనులు పూర్తి కావని అధికారులు పేర్కొంటున్నారు. ప్యాకేజీ –4 గొల్లపూడి నుంచి కాజ వరకు పనులు 88 శాతం మేర మాత్రమే పూర్తయ్యాయి. పలు చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ పనులు దాదాపు నాలుగు, ఐదు నెలలు పడుతుందనే భావన వ్యక్తం అవుతోంది. ఈ పనులు పూర్తి అయితే కాని చైన్నె వైపు వెళ్లే వాహనాలను బైపాస్కు మళ్లించే అవకాశం లేదు. 7హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం కానుమోలులోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిని ఆయుష్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు.మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో స్వామి షష్ఠి కల్యాణ మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. జక్కంపూడికి సంబంధించి ఉన్న లైన్లనే ఎత్తు పెంచే విధంగా రైతులతో ఒప్పందం కుదరటంతో అక్కడ సమస్య ప్రస్తుతం పరిష్కారం అయ్యింది. దీంతో అక్కడ విద్యుత్తు టవర్ల ఎత్తు పెంచే పనులు సాగుతున్నాయి. అయితే నున్న వద్ద విద్యుత్తు టవర్లకు సంబంధించిన సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. కోర్టులో ఈ వివాదం నడుస్తోంది. రైతులు అక్కడ విద్యుత్తు టవర్ల ఎత్తు పెంచాలని కోరుతున్నారు. అయితే ఆ ప్రాంతంలో 5 విద్యుత్తు టవర్ల మార్పిడికి సంబంధించి 75 శాతం పనులు పూర్తి అయ్యాయి. దీంతో విద్యుత్తు టవర్ల ఎత్తు పెంచితే అక్కడ ఇప్పుడు నిర్మించిన టవర్లకు సంబంధించిన వ్యయం వృథా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు రోడ్డులో కొన్ని చోట్ల మట్టిని సక్రమంగా రోలింగ్ చేయకపోవడంతో సమస్య తలెత్తింది. రోడ్డు బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు వద్ద కుంగినట్లు అధికారులు గుర్తించి, మరమ్మతు పనులు చేపట్టారు. రోడ్డు నిర్వహణ 15 ఏళ్ల పాటు కాంట్రాక్టు సంస్థదే కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. -
దుర్గమ్మకు రూ.12.82 లక్షల వెండి సామగ్రి సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ప్రకాశం జిల్లాకు చెందిన భక్తులు రూ.12.82లక్షల విలువైన వెండి సామగ్రి కానుకగా సమర్పించారు. చీమకుర్తికి చెందిన మారమ్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. కుటుంబంలో ఒక్కో సభ్యుడు అమ్మవారికి పూజలు, నివేదనలు సమర్పించేందుకు అవసరమైన వెండి సామగ్రిని తయారు చేయించి అందజేశారు. సుమారు 7.37 కిలోల వెండితో తయారు చేయించిన సామగ్రిని ఆలయ ఈవో శీనానాయక్కు అందించారు. ఎం. శివపార్వతి వెండి పళ్లెం (1.258కిలోలు), ఎం. వెంకటరెడ్డి వెండి గిన్నె (1.096), ఎం. శైలజ వెండి పళ్లెం (1.198), గోపిరెడ్డి సుధీర్రెడ్డి వెండి పళ్లెం (1.279), ఎం.పిచ్చమ్మ వెండి ప్లేట్(1.286), ఎం.వెంకట నాగజ్యోతి వెండి ప్లేట్ (1.286)లను ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
రైతుల గుండెల్లో దడదడ
అవనిగడ్డ: వాయుగుండం హెచ్చరికతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంటలు చేతికందే సమయంలో వాతావరణ మార్పులతో ఎలాంటి నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందనని ఆందోళన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణాజిల్లాలో రైతులు వరికోతలను ముమ్మరం చేశారు. యంత్రాలతో కోసిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అవస్థ పడుతున్నారు. పంటను రహదారుల వెంట ఆరబెట్టుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. వాయుగుండం హెచ్చరికతో వరికోతలు ముమ్మరం కృష్ణా జిల్లాలో ఈ ఏడాది 3.85 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. ప్రస్తుతం పామర్రు, మొవ్వ, ఉయ్యూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో 25 శాతం వరికోతలు జరిగినట్టు అధికారుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈ నెల 24వ తేదీ సోమవారం బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడనుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం ఘంటసాల మండలంలో పలుచోట్ల చిరుజల్లులు పడటంతో ఆరబెట్టిన ధాన్యంను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. ఇటీవల వచ్చిన మోంథా తుపాను దెబ్బకు దిగుబడులు బాగా తగ్గాయని పలువురు తెలిపారు. ఆరబెట్టుకునేందుకు అవస్థలు రైతులు పంటను ఆరబెట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్టర్ల ద్వారా రోడ్ల పక్కకు చేర్చి కూలీలతో ధాన్యాన్ని ఆరబెట్టు కుంటున్నారు. సాయంత్రం 5 గంటలకే మంచు రావడంతో ధాన్యంను రాసులుగా చేర్చి పట్టాలు కప్పిస్తున్నారు. దీంతో ఎకరాకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకూ ఖర్చులు పెరిగిపోతున్నాయని కొంతమంది రైతులు తెలిపారు కలవర పెడుతున్న మానుకాయ పదిహేను రోజుల నుంచి మంచు పెరగడంతో వరిపొలాలకు మానుకాయ ఎక్కువగా కనపడుతోంది. కంకులు పాలు పోసుకునే దశలో మంచు బిందువులు లోపలకు వెళ్లడంతో మానుకాయ వస్తుందని చెప్పారు. దీంతో ఎకరాకు రెండు, మూడు బస్తాలు దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో సాగుచేసిన ఎంటీయూ 1318 రకం మిల్లర్లు కొనక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ జిల్లాలో ఎకరాకు 15 బస్తాల నుంచి 25 బస్తాల వరకూ కౌలు పలుకుతుంది. రెండో పంట అపరా అయ్యే పొలాలకు 20 నుంచి 25 వస్తాలు కౌలు ఇస్తున్నారు. మెంథా తుపాను దెబ్బకు 28 బస్తాలకు మించి దిగుబడులు రావడం లేదు. దీంతో ఈ పంటలో ఖర్చులు కూడా రావని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 35 బస్తాలు అవుతాయనుకుంటే 28 అయ్యాయి ఎకరంన్నర్ర కౌలుకు సాగు చేశాను. ఇటీవల వచ్చిన తుపానుకు పంట వాలిపోయింది. అంతకు ముందు పంటను చూసి 35 బస్తాలకు పైగా దిడుబడి వస్తుందనుకున్నాను. తీరా యంత్రంతో కోయిస్తే 28 బస్తాలే దిగుబడి వచ్చింది. ఇందులో 24 బస్తాలు కౌలుకే ఇవ్వాలి. – కాగిత కాళేశ్వరరావు, రైతు, మోపిదేవి 1318 రకం కొనడం లేదు ఘంటసాల వ్యవసాయ క్షేత్రం నుంచి సరఫరా చేసిన ఎంటీయూ 1318 రకం 30 ఎకరాల్లో సాగుచేశాను. స్థానిక సిబ్బందితో చెబితే జీపీఎస్ వాహనాలు సమకూరుస్తామని చెబితే సగం పొలం వరకూ యంత్రాలతో కోయించారు. శాంపిల్స్ తీసుకుని చల్లపల్లి, ఘంటసాల మండలంలోని పలు మిల్లులకు వెళితే ఈ రకం కొనడం లేదని చెప్పారు. ఇప్పుడేమో వాయుగండం అంటున్నారు. కోసిన పంటను ఏమిచేయాలో తెలియడం లేదు. – గొరిపర్తి రాజేష్, కౌలురైతు, ఘంటసాల -
అన్నదాతల సాధికారతకు రైతన్నా.. మీకోసం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అన్నదాతల సాధికారతే లక్ష్యంగా డిసెంబర్ 2వ తేదీ వరకు ‘‘రైతన్నా మీకోసం.. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. సోమవారం వ్యవసాయ, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ఆయన ‘రైతన్నా మీకోసం’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతు సేవా కేంద్రం సిబ్బంది, వ్యవసాయ అనుబంధ శాఖలు, శాస్త్రవేత్తల సమన్వయంతో ఇంటింటికి వెళ్ళి రైతులను ప్రత్యక్షంగా కలుస్తారన్నారు. ముఖాముఖి చర్చ నిర్వహిస్తారన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, వ్యవసాయంలోకి సాంకేతికతను చొప్పించడం, పండించిన పంటల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటివి సాధించడానికి ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ– పిఎం కిసాన్, రాయితీపై విత్తనాలు లాంటి తదితర ఆర్ధిక మద్దతు కల్పించడం వంటి అంశాల గురించి ప్రతీ రైతుకు తెలియజేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమం ద్వారా వ్యవసాయంతో పాటు, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, సమర్థ నీటి వినియోగానికి ప్రతి నీటిబొట్టును సద్వినియోగ పరచడానికి బిందు సేద్యాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాయితీపై కంబైన్డ్ హార్వెస్టర్లు మరియు డ్రోన్లను అందించడం, ధాన్యం కొనుగోలు చేయడం, పంటల సాగులో కృత్రిమ మేధస్సును ఉపయోగించడం ద్వారా మరింత కచ్చితమైన సమాచారంతో చీడపీడల నుండి నష్ట నివారణ, తద్వారా ఖర్చులు తగ్గించడం, చేపల రొయ్యల పెంపకందార్లకు రాయితీపై విద్యుత్ సరఫరా, ప్రతి నియోజకవర్గంలో రైతు బజార్లు, పట్టణ ప్రాంతంలో మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేయడం లాంటి ప్రభుత్వం అందించే వివిధ ప్రోత్సాహాలను రైతులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ గ్రీవెన్స్కు 69 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి 69 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నడవలేని వికలాంగులు, వృద్ధుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 31, భార్యాభర్తలు, కుటుంబ కలహాలవి 06, కొట్లాటలు 03, వివిధ మోసాలపై 04, మహిళా సంబంధిత నేరాలపై 05, దొంగతనాలు 04, చిన్న వివాదాలు, ఘటనలపై 16 ఫిర్యాదులు అందాయి. రైల్వే స్టేడియంలో ఘనంగా పారా స్పోర్ట్స్ మీట్ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ డివిజన్లోని రైల్వే స్టేడియంలో సోమవారం పారా స్పోర్ట్స్ మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పలు క్రీడా పోటీల్లో డివిజన్లోని దివ్యాంగ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం పి.ఈ ఎడ్విన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందిలో ఆత్మసైర్ధ్యం, పట్టుదల, సాధికారితను పెంపొందించడంలో భారతీయ రైల్వే నిబద్దత కలిగి ఉందని తెలిపారు. ఇటువంటి పారా క్రీడల్లో పాల్గొడం ద్వారా వారిలో ఐక్యత, సమాన అవకాశాలు పెరుగుతాయన్నారు. -
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య
జి.కొండూరు: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని చెవుటూరు గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలలోకి వెళ్తే ... చెవుటూరు గ్రామానికి చెందిన గూడూరు బలరామిరెడ్డి(35) కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు గుంటూరు జిల్లాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో టెక్నిషియన్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. టెక్నీషియన్గా చేరక ముందు పలు వ్యాపారాలు చేసి అప్పులు చేశాడు. అప్పులు భారమై తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఇటీవల మద్యం తాగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి బలరామిరెడ్డిని వెంటనే మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి గూడూరు శ్రీనివాసరెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. మృతుడుకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
వక్ఫ్ ఆస్తులు.. ముస్లిం సమాజ ఊపిరి
లబ్బీపేట(విజయవాడతూర్పు): వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజానికి ఊపిరి లాంటివని, ప్రాణాలు పణంగా పెట్టయినా వాటిని రక్షించుకుంటామని పలు ముస్లిం సంఘాల నేతలు పేర్కొన్నారు. కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజుజు డిసెంబరు 5 లోగా వక్ఫ్ ఆస్తులను వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని విధించడం అన్యాయమని, ఇంత తక్కువ సమయంలో నమోదు అసాధ్యమని వారు పేర్కొన్నారు. లబ్బీపేటలోని అల్ మునీర్ ఫౌండేషన్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్ మాట్లాడుతూ ముస్లిం సమాజానికి ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీల ఆస్తుల నమోదులో తీవ్రమైన సాంకేతిక సమస్యలను సత్వరం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఆస్తుల నమోదు గడవు పొడింగించాలి.. ఏప్రిల్ 2025 బిల్లు రూపొందిన నాటికి వక్ఫ్ జాబితాలో చేరి ఉన్న భూములన్నిటిని తిరిగి వక్ఫ్ ’ఉమీద్ పోర్టల్’ లో చేర్చాలని, ప్రతి ఆస్తి వాటి హద్దులు వైశాల్యం ,ప్రాపర్టీ ఫోటోలు, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ సహాయంతో ముజావర్లు, సంరక్షణ చేసే బాధ్యులు, ప్రతి ఆస్తిని డిసెంబర్ 5 , 2025 లోగా నమోదు చేయాలని కేంద్రం డెడ్ లైన్ విధించిందన్నారు. కేవలం 2 వారాల్లో వక్ఫ్ నమోదు కాల పరిమితి ముగుస్తుందని, రాష్ట్రంలో దాదాపు 65 వేల ఎకరాలు వక్ఫ్ భూములు ఉన్నాయి. అందులో 4748 సంస్థలు వక్ఫ్ బోర్డు గెజిట్లో నమోదై ఉన్నాయని, వాటన్నిటినీ యథాతథంగా తిరిగి ఉమీద్ పోర్టల్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జామియాత్ అహిలే హదీస్ ప్రతినిధి మౌలానా నసీర్ ఉమ్రి, జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధి మొహమ్మద్ లుక్మాన్, ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు ముఫ్తి యూసఫ్ అలి తదితరులు పాల్గొన్నారు. -
బూడిద లారీలను అడ్డుకొని లారీ ఓనర్ల నిరసన
జి.కొండూరు: ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ బూడిద లోడింగ్ వ్యవహారంలో బూడిద ప్రభావిత గ్రామాలకు లోడింగ్ చేసిన ధరకే తమకు లోడింగ్ చేయాలంటూ జి.కొండూరు, మైలవరం మండలాల పరిధిలోని లారీల ఓనర్లు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. చెవుటూరు గ్రామ శివారులోని ముప్పైవ నంబరు జాతీయ రహదారిపై బూడిద లారీలను అడ్డుకున్నారు. వీటీపీఎస్ బూడిద రవాణాను ఇటీవల ప్రైవేటు సంస్థలకు అప్పగించిన నేపథ్యంలో తమకు ఉచిత లోడింగ్ చేయాలంటూ ఇబ్రహీంపట్నంలో బూడిద చెరువు ప్రభావిత గ్రామాల లారీల ఓనర్లతో పాటు మైలవరం, జి.కొండూరు మండలాల పరిధిలోని 60 లారీల ఓనర్లు సైతం నెల రోజులపాటు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ క్రమంలో లారీకి లోడింగ్ చార్జీ చెల్లించి రవాణా చేసుకునేందుకు కాంట్రాక్టరు ఒప్పుకోవడంతో ప్రభావిత గ్రామాల లారీలతో పాటు కాంట్రాక్టరుకు చెందిన లారీల ద్వారా బూడిద రవాణా కొనసాగుతోంది. అయితే తాము కూడా నిరాహార దీక్షలో పాల్గొంటే తమకు ఉచిత లోడింగ్ లేకుండా ప్రభావిత గ్రామాల లారీలకు మాత్రమే ఉచిత లోడింగ్ చేయడం దుర్మార్గమని, ప్రభావిత గ్రామాల లారీ ఓనర్లను నమ్మి దర్నాలో పాల్గొని తాము మోసపోయామని మైలవరం, జి.కొండూరు మండలాల లారీల ఓనర్లు నిరసనకు దిగారు. తాము కాంట్రాక్టరు నిర్ణయించిన ధరకు రవాణా చేయడం వల్లన నష్టపోతున్నామంటూ తమకు కూడా బూడిద ప్రభావిత గ్రామాల లారీ ఓనర్లకు ఇచ్చిన మినహాయింపుతోనే లోడింగ్ చేయాలంటూ జి.కొండూరు, మైలవరం మండలాల పరిధిలోని లారీ ఓనర్లు బూడిద లారీలను అడ్డుకున్నారు. లారీల ఓనర్లకు సీఐటీయూ నాయకులు మద్దతుగా నిలిచారు. జాతీయ రహదారిపై వివాదం చెలరేగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున జి.కొండూరు పోలీసులు రంగంలోకి దిగి లారీల ఓనర్లను అదుపులోకి తీసుకోవడంతో నిరసన కార్యక్రమానికి తెరపడింది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2025విజయవాడలోని కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్స్కు విశేష స్పందన లభించింది. ఈ ప్రదర్శనను వివిధ పాఠశాలల విద్యార్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.మైలవరంలో సోమవారం రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడల్లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): డిజిటల్ అరెస్ట్ అనేది లేనేలేదని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. సీపీ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేలా ‘సైబర్ సురక్ష’ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించారు. అందులో భాగంగా సైబర్ నేరాలకు సంబంధించి మోసపో యిన వారిలో అధికంగా సీనియర్ సిటిజన్లు ఉండటంతో సీపీ కార్యాలయంలో వృద్ధులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారని, సైబర్ నేరాలు పెనుసవాలుగా మారాయని, వాటిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీడియో కాల్ చేసి అరెస్టు చేస్తున్నట్టు బెదిరించినప్పుడు భయపడవద్దన్నారు. సీబీఐ, పోలీసు, కస్టమ్, ఈడీ, జడ్జీలు వీడియో కాల్లో అరెస్టు చేయరని వివరించారు. బాధితులు వెంటనే పోలీసులను సంప్రదిస్తే ఇటువంటి మోసాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ నగదు బదిలీ చేస్తే 24 గంటల్లోపు సమీప పోలీసులకు లేదా సైబర్ సెల్ నెంబర్ 1930కి సమాచారం ఇవ్వాలని సూచించారు. డిజిటల్ అరెస్టుపై ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేయాలని కోరారు. ఈ సదస్సులో సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న, ఏసీపీలు రాజశేఖర్, బానుప్రకాష్రెడ్డి, సీపీ గుణరామ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేవి నగరం మధ్యలో విస్తరించి ఉన్న కొండప్రాంతాలు. ఆ ప్రాంతాల ప్రజలు కొండంత భయంతో జీవనం కొనసాగిస్తున్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న కొండ ప్రాంతవాసులు వర్షం పడితే ఎక్కడ కొండ చరియలు విరిగి పడతాయోనని అనుక్షణం భయపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యా యని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. 20 డివిజన్లలో కొండప్రాంతాలు నగరపాలక సంస్థ పరిధిలో 64 డివిజన్లు ఉన్నాయి. సుమారు 20 డివిజన్లలో కొండ ప్రాంతాలు ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గంతో పాటుగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఆయా కొండ ప్రాంతాల్లో సుమారుగా రెండున్నర లక్షల మందికిపైగా ప్రజలు నివాసాలను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అత్యధి కంగా పశ్చిమ నియోజకవర్గంలోని మల్లికార్జునపేట, కొత్తపేట, ఆంజనేయవాగు, చిట్టినగర్, లంబాడీ పేట, పాలప్రాజెక్ట్, కబేళా, రామరాజ్యనగర్, విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్ తదితర ప్రాంతాలకు సమీపంలోని కొండలపై నివాసాలు ఉన్నాయి. నగరంలో నివాస స్థలాల ధరలు ఎక్కువగా ఉండటం, ఇళ్ల అద్దెలు సైతం భారీగా ఉండటంతో పేద ప్రజలు కొండప్రాంతాల్లో నివసించేందుకు మొగ్గుచూపుతున్నారు. కొండ ప్రాంతాల్లో రేకులతో లేదా రెండు గదులతో పక్కా భవనాలు నిర్మించుకుని కుటుంబాలతో నివసిస్తున్నారు. ప్రాణాలు పోతున్నా నిర్లక్ష్యం వీడని ప్రభుత్వం కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి పలువురి ప్రాణాలు పోతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. మూడు నియోజకవర్గాల్లోని కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ జారిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పశ్చిమ నియోజకవర్గంతో పాటుగా మొగల్రారాజపురంలోని పలు ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై స్థానికులు మండి పడుతున్నారు. ఆమోదం పొందినా అమలేదీ? నగరంలోని పలు కొండ ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణానికి నగరపాలకసంస్థ కౌన్సిల్లో ఆమోదం లభించింది. అయితే పనులు మాత్రం ప్రారంభంకాలేదు. రక్షణ గోడల నిర్మాణంలో మునిసిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల పనులను ప్రారంభించినా మధ్యలో నిలిపివేశారని పేర్కొంటున్నారు. నిధులు లేవని, ప్రభుత్వం నుంచి స్పష్టత లేదనే పలు కారణాలు చూపుతూ రక్షణ గోడల నిర్మాణాలను నిలిపివేస్తున్నారని మండిపడుతున్నారు. 7నగరంలోని మూడు నియోజకవర్గ పరిధుల్లోని కొండ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. భారీ వర్షం కురిసిన సమయంలో కొండ చరియలు విరిగి పడటం, కొండరాళ్లు జారిపడటం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ కొండచరియలు విరిగిపడితే పేదల ఇళ్లు ధ్వంసం కావడంతోపాటు, వాటిలో నివసిస్తున్న వారు ప్రాణాలు కోల్పోతున్నారు. మోంథా తుపాను సమయంలో కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని గొల్లపాలెంగట్టు, విద్యాధరపురం తదితర ప్రాంతాల్లో కొండ చరియలు జారిపడ్డాయి. రక్షణ గోడలు (రిటైనింగ్ వాల్స్) దెబ్బతిని కిందకుజారాయి. తూర్పు నియోజకవర్గంలోనూ కొండపైన రక్షణ గోడలు జారాయి. వాటికి ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదు. గడచిన ఆరు మాసాలుగా ప్రతి నెలలోనూ ఒకటి రెండు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరిగిన చాలా సంద ర్భాల్లో ప్రాణనష్టం సైతం సంభవించిన దాఖలాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోంది. పాలకుల తీరుతో మునిసిపల్ అధికారులు ఏ పనులూ చేపట్టడం లేదు. చాలా కొండ ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం ఉన్నా పనులు ప్రారంభం కావటంలేదు. టెండర్లు పిలవటం లేదు. ఎప్పుడు వర్షం పడినా కొండ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. ఉన్నతాధికారులు, కూటమి ప్రభుత్వ పాలకులు స్పందించాలి. నగరంలోని కొండ ప్రాంతాల్లో ఉన్న తక్షణం రక్షణ గోడల నిర్మాణం చేపట్టాలి. – బోయి సత్యబాబు, సీపీఎం, పశ్చిమ నగర కార్యదర్శి -
కృష్ణమ్మకు వైభవంగా మహావస్త్ర సమర్పణ
నాగాయలంక: మండల కేంద్రమైన నాగాయలంక వద్ద నిరంతరం ప్రవహిస్తున్న పవిత్ర కృష్ణానదికి సోమవారం భక్తులు మహా వస్త్ర సమర్పణను వేడుకగా నిర్వహించారు. సర్వ పాపహరణిగా సాగర జలాలతో కలిసి తమను నిరంతరం తరింపజేస్తున్న నదీమతల్లికి కృతజ్ఞతగా 500 చీరలను సమర్పించారు. సాయంత్రం ఐదు గంటలకు నాగాయలంక ప్రధాన కూడలి నుంచి ఫెర్రీ రోడ్డులో 2,750 మీటర్ల పొడవైన చీరల తోరణంతో మహిళలు ప్రదర్శనగా కృష్ణానది ఒడ్డుకు చేరుకున్నారు. తొలుత అంబా సాయి కౌశిక్ శర్మ బ్రహ్మత్వంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు కృష్ణానదికి పూజ చేసి చీర, పసుపు, కుంకుమలు సమర్పించారు. బాపట్లలోని సాయిబాబా మందిరం నుంచి 30 మంది శిష్య బృందంతో సాయిస్వామి వచ్చి చీరల సమర్పణ పూజలో పాల్గొన్నారు. చీరల తోరణాన్ని ఇవతల తూర్పు వైపు కృష్ణవేణి మాత విగ్రహం నుంచి పడవల సాయంతో అవతల దక్షిణం వైపు తీరానికి చేర్చారు. కృష్ణా–ఉమ్మడి గుంటూరు జిల్లాల అనుసంథానంగా నదిపై జరిగిన ఈ కార్యక్రమంలో అవతలివైపు మహిళలు పూజలు జరిపారు. అనంతరం నది ఒడ్డున కృష్ణవేణి మాత విగ్రహానికి వేద పండితులు విశేష పూజ జరిపి నవ హారతులు సమర్పించారు. క్షేత్రం చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, మండలి వెంకట్రామ్, మండవ బాలవర్ధిరావు, తలశిల రఘుశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి సుబ్రహ్మణ్య షష్ఠి కల్యాణోత్సవాలు
మోపిదేవి: మండల కేంద్రమైన మోపిదేవి గ్రామంలో వేంచేసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్యషష్ఠి కల్యాణ మహోత్సవాలు మంగళవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆలయ ఈఓ దాసరి శ్రీరామవరప్రసాదరావు సోమవారం విలేకరులతో మాట్లాడారు. వైదిక కార్యక్రమాలను అనుసరించి వేద పండితుడు కొమ్మూరు ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్కుమార్ శర్మ బ్రహ్మత్వంలో షష్ఠి కళ్యాణ మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలు ముగిసే వరకు ఆర్జిత సేవలన్నింటిని రద్దుచేశామని తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారుడిగా అలంకరిస్తామని, రాత్రి ఏడు గంటలకు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణ, అంకురారోపణ, వాస్తుపూజ జరుగుతాయని వివరించారు. ఈ సందర్భంగా ఆలయాని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడా రంగంలో దేశానికీ, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడంలో మహిళా క్రీడాకారులు ముందంజలో ఉన్నారని శాప్ చైర్మన్ ఎ.రవి నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధి మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో అస్మిత ఖేలో ఇండియా సాఫ్ట్ టెన్నిస్ లీగ్ పోటీలను రవి నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడారంగంలో మహిళలు రాణించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాప్ గుర్తింపు ఉన్న టోర్నమెంట్లలోనే క్రీడాకారులు పాల్గొనాలని చెప్పారు. క్రీడాకారిణులను పరిచయం చేసుకొని, అభినందనలు తెలిపారు. శాప్ బోర్డు సభ్యుడు ఎస్.సంతోష్ కుమార్, డీఎస్డీఓ కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో సోమ వారం జరిగిన ఖడ్గమాలార్చనలో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారి ఖడ్గమాలార్చనలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ ఏఈఓ వెంకట రెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం మల్లేశ్వర స్వామిని అయ్యన్నపాత్రుడు దర్శించుకున్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అభిషేకానికి నాగాయతిప్ప గ్రామానికి చెందిన అయ్యప్పలు పాల కావళ్లతో సోమవారం గ్రామోత్సవం చేశారు. దారి పొడవునా భక్తులు అందించిన పాలు సేకరించి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. బంధుమిత్రులతో పాటు పలువురు అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు. -
మొక్కుబడిగా ‘రైతన్నా మీ కోసం’
ఘంటసాల: మండల కేంద్రమైన ఘంటసాలలో సోమవారం జరిగిన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. ‘రైతన్న మీ కోసం’ వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఘంటసాల పీఏసీఎస్ చైర్మన్ బండి పరాత్పరరావు, టీడీపీకి చెందిన అయినపూడి యశోదర, దోనేపూడి విజయలక్ష్మితో మాత్రమే మంత్రి ముఖా ముఖీ నిర్వహించారు. తుపానుకు పంటలు దెబ్బ తిన్న రైతులు తమ సమస్యలపై నిలదీస్తారన్న భయంతోనో ఏమో ఎంపిక చేసిన మహిళా రైతులతో మాత్రమే మాట్లాడారు. మంత్రి తీరుపై అన్న దాతలు విస్మయం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎవరైనా మిల్లర్లు ధాన్యం కొనుగోలులో తేమశాతం తదితర విషయాలపై రైతులను ఇబ్బందులు పెడితే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. పంటలు బాగా పండుతున్నందుకు సంతోషంగా ఉన్నా గిట్టుబాటు ధరలేక బాధపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. డిమాండ్ ఆధారంగా పంటలు పండించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, డైరెక్టర్ మంజీర్ జిలాని సమూన్, జేసీ ఎం.నవీన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్.పద్మావతి, ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
సమస్య పరిష్కారంలో ఉదాసీనత తగదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కరించడంలో అధికారులు ఉదాసీనత విడనాడాలని, చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవా లని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. అర్జీలకు ఎండార్స్మెంట్ నంబర్ ఇచ్చి పరిష్కరిస్తామని చెప్పి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రోజులో ఒక్క గంట అర్జీల పరిష్కారంపై దృష్టి పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. అర్జీకి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు అర్జీదారుడు చెప్పే విషయాన్ని ఓపిగ్గా వినాలన్నారు. కింది స్థాయిలో జరుగుతున్న జాప్యాన్ని, అలసత్వం, అర్జీదారుడు పడుతున్న ఇబ్బందులు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంతవరకు జిల్లా అధికారుల స్థాయిలోనే పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో 182 అర్జీలు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 182 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 53 అర్జీలువచ్చాయి. శాఖల వారీగా అందిన అర్జీలు.. మునిసిపల్ 31, పోలీస్ 18, పంచాయతీరాజ్ 8, విద్య శాఖ 8, విద్యుత్ 7, విభిన్న ప్రతిభావంతులు 6, సర్వే 6, రవాణా 6, డీఆర్డీఏ 5, వైద్య, ఆర్యోగ 5, హౌసింగ్ 3, అర్అండ్బీ 3, కోఆపరేటివ్ 2, సాంకేతిక విద్య 2, దేవదాయ 2, సాంఘిక సంక్షేమం 2, మత్స్య, కార్మిక, డ్వామా, రిజిస్ట్రే షన్, ఇరిగేషన్, బీసీ వెల్ఫేర్, పొల్యూషన్, ఏపీఐఐసీ, ట్రజరీ, పౌరసరఫరాలు, వ్యవసాయ, గునులు, బ్యాంకుకు సంబంధించి ఒక్కో అర్జీ వచ్చాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ లక్ష్మీశ -
పర్యాటక హబ్గా బెజవాడ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సోమ వారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. జిల్లాలో సేవారంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో భాగంగా టూరిజం ప్యాకేజీ వివరాలతో త్వరలో ఆంధ్రా ట్యాక్సీ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెస్తా మన్నారు. దీని పర్యవేక్షణను జిల్లా యంత్రాంగమే చూస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో టెంపుల్ టూరిజంతోపాటు, హిస్టారికల్ పర్యాటకానికి మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే కొంత మంది యువకులను గుర్తించి గైడ్లుగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు పర్యాటక ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా, మరుగు దొడ్లు, రహదారులు వంటి ప్రాథమిక మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆంధ్రా ట్యాక్సీ యాప్ పర్యాటకులకు ఏకీకృత వేదికగా సేవలు అందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఏడాదికి కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్ అందుబాటులోకి వస్తుందన్నారు. మూలపాడు పార్కును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దుర్గగుడితో పాటు పవిత్ర సంగమం, చుట్టుపక్కల ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షించనున్నాయని పేర్కొన్నారు. ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డు సాధించి యోగాంధ్ర స్ఫూర్తిని దశదిశలా వ్యాప్తి చేశామన్నారు. దసరా ఉత్సవాలకు దుర్గగుడికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సమష్టి కృషితో నిర్వహించామన్నారు. త్వరలో జరిగే భవానీ దీక్షల విరమణలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఎ.కొండూరు మండలానికి కృష్ణా జలాలు ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్య ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బందితో కలిసి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎ.కొండూరు మండలానికి కృష్ణా జలాలను కొత్త సంవత్సరంలో అందిస్తామ న్నారు. ప్రత్యేక అధికారుల బృందాలతో నిరంతరం హాస్టళ్లను తనిఖీ చేస్తున్నామని వివరించారు. ప్రజా భద్రతా చర్యల్లో భాగంగా ఆలయాలతో పాటు సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్లు తదితరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చి హోటళ్లలో తనిఖీలను ముమ్మరం చేశామని పేర్కొన్నారు. రైతు బజార్లలో తూకాల్లో తేడాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, తూనికలు, కొలతల శాఖ అధికారులతో ప్రత్యేకంగా దాడులు చేయించి, కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. అంబేడ్కర్ స్మృతి వనం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుందన్నారు. కల్చరల్ అండ్ టూరిజం శాఖకు పర్యవేక్షణ బాధ్యతను అప్పజెప్పామని, పెండింగ్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటున్నామని వివరించారు. కొత్త ఆవిష్కరణలకు చేయూత యువతరం కొత్త ఆలోచనలను, పరిశ్రమల స్థాపన దిశగా నడిపించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) చేయూత అందిస్తోందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఇంక్యుబేషన్, ఆర్థిక మద్దతు, శిక్షణ, మార్కెటింగ్ ఇలా వివిధ అంశాల్లో ఎనికేపాడులోని ఆర్టీఐహెచ్ హబ్ స్పోక్ సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ఈ స్పోక్ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. పరిశ్రమలు స్థాపించే ఔత్సాహికులకు ఇది ఎంత గానో ఉపయోగ పడుతుందన్నారు. సుస్థిర ఆర్థిక వృద్ధి దిశగా... తలసరి ఆదాయంతో పాటు జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ప్రగతికి సమగ్ర కార్యాచరణతో పనిచేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 563 కీలక ప్రగతి సూచికల్లో (కేపీఐ) అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో హరిత విస్తీర్ణాన్ని పెంచేందుకు గ్రామం యూనిట్గా లక్ష్యాలను నిర్దేశించామన్నారు. 25 శాతం ఉన్న హరిత విస్తీర్ణాన్ని దశల వారీగా 33 శాతానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. జిల్లాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పండుగ శోభ ఉట్టి పడేలా ముగ్గులు, సంప్రదాయ వంటకాల పోటీలు, బుల్షో వంటి కార్యక్రమాలతో జిల్లా ప్రజలలు, ఎన్ఆర్ఐలను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. వెస్ట్ బైపాస్ రోడ్డు పనులకు సంబంధించి చిక్కుముడులు వీడుతున్నాయని, ఫిబ్రవరి నాటికి పనులను పూర్తి చేస్తామని తెలి పారు. ఇప్పటికే హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను వెస్ట్ బైపాస్కు అనుమతించినట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, వారు మరో పది మందికి ఉపాధి కల్పించేలా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సంఘాల్లోని ఫ్యాషన్ డిజైనర్ల ఉత్పత్తులతో ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసేందుకు చొరవ చూపుతున్నామని తెలిపారు. -
ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీ’
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థులు ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం సంపాదించేలా చేయడంతో పాటుగా మ్యాథ్స్ సబ్జెక్టుపై ఉన్న భయాన్ని దూరం చేసేందుకు సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డులో ఉన్న నలంద విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో స్పెల్ బీ క్వార్టర్ ఫైనల్ రౌండ్, మ్యాథ్ బీ సెమీ ఫైనల్ రౌండ్ పరీక్షలు ఆదివారం జరిగాయి. విద్యార్థులు వారు చదువుతున్న తరగతులను బట్టి మొత్తం 4 కేటగిరీలుగా విభజించి ఈ పరీక్షలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో.. స్పెల్ బీ పరీక్షలో కేటగిరీ–1లో 135, కేటగిరీ–2లో 196, కేటగిరీ–3లో 320, కేటగిరీ–4లో 193 మంది పరీక్షకు హాజరయ్యారు. మ్యాథ్ బీ పరీక్షలో కేటగిరీ–1లో 92, కేటగిరీ–2లో 112, కేటగిరీ–3లో 140, కేటగిరీ–4లో 135 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తం 1,323 మంది విద్యార్థులు పరీక్షలను రాశారు. ఈ పరీక్షలకు మెయిన్ స్పాన్సర్గా డ్యూక్స్ వాఫేతో పాటుగా రాజమండ్రిలోని ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి. లెక్కలపై ఉన్న భయం కొంత తగ్గింది. లెక్కలను సులభతరంగా ఎలా చేయాలనే విషయంపై ఈ మ్యాఽథ్ బీ పరీక్షకు హాజరు కావడం వల్ల కొంత అవగాహన ఏర్పడింది. పరీక్షను చాలా బాగా రాశాను. – అభిషేక్, 2వతరగతి, షామ్రాక్ స్కూల్స్పెల్లింగులను ఎలా చదవాలో తెలిసింది. ఇంగ్లిష్ భాష మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు సైలెంట్ అవుతాయి. ఆ పదాలు ఏవీ అనే విషయంపై అవగాహన ఏర్పడింది. ఎన్నో కొత్త పదాల స్పెల్లింగులను తెలుసుకున్నాను. – ఆహిల్ ఫర్హాన్, 5వ తరగతి, కేకేఆర్ గౌతమ్ స్కూల్ఇలాంటి పరీక్షలకు విద్యార్థులు హాజరు కావడం వల్ల వారికి పరీక్షలపై ఉన్న భయం పోతుంది. దాని వల్ల విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలను రాస్తారు. పరీక్షకు ప్రిపేర్ అయ్యే సమయంలో సబ్టెక్టుపై అవగాహన పెంచుకునేందుకు అవకాశం లభిస్తోంది. – కె.ప్రసాద్రెడ్డి, విద్యార్థి తండ్రిపెద్ద ఎత్తున హాజరైన విద్యార్థులు ఇలాంటి పరీక్షలకు విద్యార్థులు హాజరవడం వల్ల వారిలో నైపుణ్యాలు పెరుగుతాయి. పాఠశాలలో రాసే పరీక్షలకు ఇలాంటి పోటీ పరీక్షలకు మధ్య తేడా ఉంటుంది. ఇది వారి భవిష్యత్తుకు బాగా ఉపకరిస్తుంది. – పి.కుమారి, విద్యార్థి తల్లి -
మొండికేస్తున్న వాహన్
రవాణా శాఖ సేవల్లో తీవ్ర జాప్యం లబ్బీపేట(విజయవాడ తూర్పు): రవాణా శాఖలో దేశ వ్యాప్తంగా ఒకే వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో పరివాహన్ పోర్టల్ను ప్రవేశ పెట్టారు. ఈ పోర్టల్ ద్వారా గతేడాది జూలైలో కొన్ని సేవలు, డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో అన్ని సేవలు అందించేలా ఆదేశాలు ఇచ్చారు. ఇది జరిగి దాదాపు ఏడాదిన్నర కావొస్తున్నా ఇంకా పురిటి కష్టాలు దాటలేదని వాహనదారులు అంటున్నారు. అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. అంతేకాదు ఏదైనా సమస్య వస్తే, జిల్లా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే తమ పరిధి కాదంటున్నారని, రాష్ట్ర కార్యాలయానికి వెళ్తే అక్కడ కొన్ని పనులు చేస్తూ, మరికొన్నింటికీ చేతులెత్తేస్తున్నట్లు వాపోతున్నారు. అదేమంటే ఢిల్లీ నుంచి ఆపరేట్ అవుతుందని చెబుతున్నారని, దీంతో కార్యాలయాల చుట్టూ తిరగలేక విసుగెత్తిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని సేవలు పోర్టల్ ద్వారానే.. ప్రస్తుతం రవాణా కార్యాలయం నుంచి అందించే అన్ని సేవలు పోర్టల్ ద్వారానే పొందాల్సి ఉంది. వాహనాల రిజిస్ట్రేషన్, ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్, ఇన్సూరెన్స్లు, వాహన ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్లు కొత్తవి పొందడం, రెన్యూవల్ వంటి అన్ని రకాల సేవలు పరివాహన్ పోర్టల్ ద్వారానే అందిస్తున్నారు. దీంతో ఈ పోర్టల్ ఒక్కోసారి మొరాయిస్తుండటంతో వాహనదారులు పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందంటున్నారు. ఫిట్నెస్కు చేయి తడపాల్సిందే.. వాహనాల ఫిట్నెస్ తనిఖీని ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దానిని నున్నలో ఏర్పాటు చేశారు. అక్కడకు వాహనాలు తనిఖీ కోసం వెళ్లినప్పుడు ఏదొక సాకు చూపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వాహనదారులు అంటున్నారు. అంతేకాకుండా అక్కడకు వెళ్లిన తర్వాత వారి డ్రైవర్లే వాహనాన్ని లోపలికి తీసుకెళ్లి చెక్ చేయిస్తున్నారు. దీంతో గ్లాస్ క్రాక్ ఉందని, టాప్ సరిగా లేదని అనేక లోపాలు చూపుతూ ఫిట్నెస్ ఇచ్చేందుకు ముడుపులు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ముడుపులు అందితే లోపాలున్నా ఫిట్నెస్ ఇచ్చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పరివాహన్ పోర్టల్తో లారీ ఓనర్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ పోర్టల్ అప్డేట్ కాలేదు. దీంతో మన లారీలు ఆ రాష్ట్రానికి వెళ్లినప్పుడు నంబరు స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ లేదని ఫైన్ వేసే పరిస్థితి ఉంది. అంతేకాక ఇటీవల ఆర్సీ బుక్లో ఒక లెటర్ తప్పుగా ఉంటే సరిచేసేందుకు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. గతంలో లారీలు కొన్ని నెలలు ఆపినప్పుడు ఆ సమయానికి ట్యాక్స్ మినహాయించే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు రోజుల తరబడి లారీలను నిలపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇతర వాహనదారులు కూడా ఈ పోర్టల్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. – వైవీ ఈశ్వరరావు, సౌత్ జోన్ ఉపాధ్యక్షుడు, ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ -
బాస్కెట్బాల్ బాలుర విజేతగా కృష్ణా
నూజివీడు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి బాలుర, బాలికల అండర్–17 బాస్కెట్బాల్ పోటీలలో భాగంగా బాలుర విజేతగా ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు, బాలికల విజేతగా ఉమ్మడి తూర్పుగోదావరి జట్లు నిలిచాయి. మూడు రోజులుగా నూజివీడులో నిర్వహిస్తున్న బాస్కెట్ బాల్ పోటీలు ముగిశాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహించిన ఈ పోటీలకు 13 బాలుర జట్లు, 13 బాలికల జట్లు పాల్గొన్నాయి. బాలుర, బాలికల ఫైనల్స్ పోటీలను ఆదివారం నిర్వహించారు. బాలుర ఫైనల్స్లో ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు, తూర్పుగోదావరి జట్లు తలపడగా ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు ఆద్యంతం ఆధిక్యత కనబరిచి 39–18తో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టుపై గెలుపొంది విజేతగా నిలిచింది. దీంతో కృష్ణా జిల్లా జట్టు వరుసగా 8వ సారి విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో.. బాలికల విభాగంలో తూర్పుగోదావరి జట్టు, గుంటూరు జట్లు ఫైనల్స్కు చేరాయి. ఫైనల్ మ్యాచ్లో తూర్పుగోదావరి జట్టు గుంటూరుపై 23–6తో గెలుపొంది విజేతగా నిలిచింది. బాలికల ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఆద్యంతం తూర్పుగోదావరి జట్టు ఆటగాళ్లు ప్రతిభ కనబరిచి జట్టును విజయపథాన నడిపారు. బాలుర విభాగంలో మూడు, నాలుగు స్థానాల్లో గుంటూరు, చిత్తూరు నిలవగా, బాలికల విభాగంలో మూడు, నాలుగు స్థానాల్లో కృష్ణా, వైజాగ్ జట్లు నిలిచాయి. గెలుపొందిన జట్లకు ట్రోఫీలను రూరల్ ఎస్ఐ జ్యోతిబసు, బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కరస్పాండెంట్ బండి శ్యామ్ చేతుల మీదుగా అందజేశారు. పోటీలను కార్యనిర్వాహక కార్యదర్శి వాకా నాగరాజు పర్యవేక్షించారు. -
బ్రో.. డ్రగ్స్ వద్దు, సైకిల్ తొక్కు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన బాధ్యత ఉందని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని డీజీపీ హరీష్కుమార్గుప్తా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ‘ఈగల్’ విభాగాధిపతి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికృష్ణ ఆధ్వర్యంలో ‘ఫిట్ ఇండియా – సండే ఆన్ సైకిల్ ర్యాలీ’లో భాగంగా ‘డ్రగ్స్ వద్దు బ్రో – సైకిల్ తొక్కు బ్రో’ నినాదంతో ఆదివారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్సింగ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్ ర్యాలీ జరిగింది. డీజీపీ హరీష్కుమార్గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డ్రగ్స్ వినియోగం ఆపేందుకు సమాజం ముందుకు రావా లని కోరారు. ఎవరికై నా డ్రగ్స్ సంబంధిత సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలపాలన్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా -
ముగిసిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు
అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ భవానీపురం(విజయవాడపశ్చిమ): ఏపీ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. సాహితీవేత్త కొమ్మవరపు విల్సన్రావు అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో పలువురు కవులు, సాహితీవేత్తలు పాల్గొని తమతమ అంతరంగాలను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ ప్రజల్లో మానవత్వం, ప్రేమతత్వాన్ని పెంపొందించేందుకు కవులు, రచయితలు, కార్టూనిస్ట్లు కృషి చేయాలన్నారు. పాలసీ మేకర్స్ సాహితీ వేత్తలయితే.. నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య చల్లపల్లి స్వరూపారాణి మాట్లాడుతూ పాలసీ మేకర్స్, బ్యూరోక్రాట్లు సాహితీ వేత్తలయితే నిర్ణయాలు తీసుకోవడంలో సున్నితత్వం ఉంటుందని తెలిపారు. శోకం నుంచే శ్లోకం పుట్టిందని వాల్మీకి మహర్షి ద్వారా నిరూపితమైందని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో గ్రంథాలయం ఉండాలి.. అమరావతి సాహితీ మిత్రులు వ్యవస్థాపకులు డాక్టర్ రావి రంగారావు మాట్లాడుతూ అమరావతిలో కోట్లాది రూపాయలతో గ్రంథాలయాన్ని నిర్మించటం కాదని.. ప్రతి పాఠశాలలో లైబ్రరీ ఉండేలా చూడాలని పేర్కొన్నారు. మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు కలిమిశ్రీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్ జీవీ పూర్ణచంద్, డాక్టర్ నక్కా విజయరామరాజు, పాతూరి అన్నపూర్ణ, గోవిందరాజు సుభద్రాదేవి, చిన్ని నారాయణరావు, పీ శ్రీనివాస గౌడ్, పుప్పాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన కోగంటి వెంకట కృష్ణారావు, ప్రజ్ఞ రూ.1,01,116 విరాళాన్ని ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు.నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. 9ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యనమస్కారాలు, సూర్యోపాసన సేవను ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. -
బెంగళూరు–నాందేడ్ ఎక్స్ప్రెస్కు అదనపు కోచ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణీకుల రద్దీ, వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల సౌకర్యార్థం బెంగళూరు–నాందేడ్ ఎక్స్ప్రెస్కు అదనపు కోచ్లను జతచేసి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ శనివారం ఒక ప్రకటలో తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు బెంగళూరు–నాందేడ్ (16593) రైలుకు, డిసెంబర్ 3వతేదీ నుంచి 17వ తేదీ వరకు నాందేడ్–బెంగళూరు (16594) ఎక్స్ప్రెస్ రైళ్లకు ఒక 3ఏసీ కోచ్, ఒక జనరల్, ఒక స్లీపర్ క్లాస్ కోచ్ను అదనంగా జోడించి నడుపుతామని వివరించారు. కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయంలో 16(అ) ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో శనివారం ఎన్సీసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.రాంజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ సేవా విలువలను కొనియాడారు. ఎన్సీసీ క్రమశిక్షణ, నాయకత్వం, దేశం పట్ల సేవా భావాన్ని కలిగిస్తుందని తెలిపారు. యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.విజయ కుమారి మాట్లాడుతూ ఎన్సీసీ శిక్షణ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏఎన్ఓ లెఫ్టినెంట్ డాక్టర్ డి.రామశేఖరరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ క్యాడెట్లు క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యతను అలవర్చుకుంటారని అన్నారు. అనంతరం ఎన్సీసీడే సందర్భంగా క్యాడెట్లు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక చట్టంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో క్యాడెట్లు పోస్టర్ ప్రదర్శనలు, చర్చా వేదికలు, అవగాహన సందేశాలు అందిస్తూ విద్యార్థుల్లో చైతన్యం నింపారు. అనంతరం క్యాంపులో పాల్గొన్న క్యాడెట్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
జాతీయ సమైక్యతను చాటిన జానపద నృత్యాలు
విజయవాడ కల్చరల్: ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్యర్యంలో నెల వారీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాకు చెందిన కళాకారుల బృందం ప్రదర్శించిన జానపద నృత్యాలు జాతీయ సమైక్యతను చాటాయి. ప్రాంతాలు, కళారూపాలు వేరైనా కళాకారులకు ఎల్లలు లేవని నృత్య ప్రదర్శనలు రుజువు చేశాయి. మూడు ప్రాంతాల భాషా సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ ప్రదర్శనలు త్రివేణీ సంగమంలా సాగాయి. విశాఖపట్నానికి చెందిన స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ బృందం నిర్వాహకుడు నాగరాజు పర్యవేక్షణలో డి.లక్ష్మి, స్నేహిత, ఎస్. జోషిత, బి.పూజిత, చందన, వై.ఇందిర, బి.గీతిక, బి.అంజలి, అప్పలనాయుడు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో ప్రదర్శించే అంశాలను ప్రదర్శించారు. రిథమ్స్ డ్యాన్స్ అకాడమీ, పశ్చిమబెంగాల్కు చెందిన పశ్చిమ బెంగాల్, చత్తీస్ ఘడ్ గ్రామీణ ప్రాంతాలలో ప్రదర్శించే నృత్యాలను ప్రదర్శించారు. ట్రైబల్ ఫోక్ ఆర్ట్స్ సెంటర్ ఒడిశా బృందం ఒడిశా జీవిన విధానం చాటేలా నృత్యాలను మనోహరంగా ప్రదర్శించారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన నాట్యాచార్యులు పాల్గొన్నారు. అకాడమీ నిర్వాహకులు ఎన్.లలిత్ ప్రసాద్, సాంస్కృతిక సమితి కార్యదర్శి బీవీఎస్ ప్రకాష్ కళాకారులను సత్కరించారు. అధ్యాపకుడు డాక్టర్ సత్యశ్రీనివాస్ నిర్వహించారు. -
వెలుగు కార్యాలయంలో రికార్డులు తనిఖీ
పెనమలూరు: మండల పరిధిలోని వెలుగు కార్యాలయంలో డ్వాక్రా సభ్యులు చెల్లించిన రుణాల సొమ్ము గోల్మాల్ జరిగిన ఘటనపై అధికారులు శనివారం రికార్డులు తనిఖీ చేశారు. పెనమలూరులో ఒక వీవోఏ డ్వాక్రా సభ్యులు చెల్లించిన రుణాల సొమ్ము స్వాహా చేసిన ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమై ప్రాథమికంగా తనిఖీ చేయగా రూ.25 లక్షల నిధులు మాయమయ్యాయని తేలింది. మండలంలోని ఆరు గ్రామాల్లో 873 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. దాదాపు 8,730 మంది సభ్యులు ఉన్నారు. వీవోఏలు 26 మంది ఉండగా, సీసీలు నలుగురు ఉన్నారు. అయితే డ్వాక్రా సభ్యులు సీ్త్ర నిధి కింద తీసుకున్న రుణాలు స్వాహా అయ్యాయి. పెనమలూరు మండలంలో వీవోఏ 19 గ్రూపు సభ్యులు రుణాల కింద చెల్లించిన రూ.25 లక్షలు స్వాహా చేసినట్లు తేలింది. ఈ ఘటన డ్వాక్రా సభ్యుల్లో కలకలం రేపింది. ‘సాక్షి’లో ఈ ఘటనపై వార్త రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. పెనమలూరు గ్రామంలో ఉన్న 300 గ్రూపులకు 9 మంది వీవోఏలు ఉండగా రుణాల కింద సభ్యులు చెల్లించిన నిధుల జమ సక్రమంగా జరిగిందా లేదా అనే విషయమై విచారణ చేపట్టారు. రుణాల జమలో నిర్లక్ష్యం మండల పరిధిలో సీ్త్రశక్తి కింద డ్వాక్రా సభ్యులు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నారు. వీవోఏలు ఆ రుణాలను గ్రామైఖ్య సంఘాల ద్వారా సీ్త్రశక్తి నిధికి తిరిగి జమ చేయాల్సి ఉంది. అయితే గత కొద్దికాలంగా నిధులు సీ్త్రశక్తి నిధికి సక్రమంగా జమ చేస్తున్నారా లేదా అనే విషయమై సీసీలు, అధికారులు తనిఖీ చేయకుండా నిర్లక్ష్యం చూపించారు. ఆడిట్లు సక్రమంగా చేయలేదన్న ఆరోపణలు సైతం వినబడుతున్నాయి. అధికారుల తనిఖీ మండల వెలుగు కార్యాలయంలో ఏజీఎం మునిరత్నం, మేనేజర్ కిరణ్కుమార్ శనివారం తనిఖీలు చేశారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు, వీవోఏల ద్వారా చెల్లించిన సొమ్ము వివరాలపై రికార్డులు పరిశీలించారు. రూ.25 లక్షలు నిధుల తేడా వచ్చినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. నిధుల రిక వరీపై వీవోఏ సునీత, సంఘ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు ఏజీఎం మునిరత్నం తెలిపారు. త్వరలో పీడీ ప్రత్యేక టీమ్ వేసి పూర్తిస్థాయిలో రికార్డులు తనిఖీ చేయిస్తారన్నారు. రికార్డులు పూర్తిస్థాయి లో పరిశీలిస్తే కాని నిధులు ఏ మేరకు గోల్మాల్ అయ్యాయో తేలనుంది. గోల్మాల్ అయిన నిధులు రూ.25 లక్షలు -
కార్మిక చట్టాల నిర్వీర్యంపై యుద్ధభేరి
మధురానగర్(విజయవాడసెంట్రల్): స్వాతంత్య్రం అనంతరం కార్మికులు సాధించుకున్న హక్కులను హరించేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కార్మికులు యుద్ధభేరి మోగించారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతం రెడ్డి అన్నారు. విజయవాడ భగత్సింగ్ రోడ్డులోని వైఎస్సార్ ట్రేడ్యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేతన బోర్డులో గతంలో కార్మిక సంఘాల నాయకులు సైతం సభ్యులుగా ఉండేవారని, కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన కార్మిక వ్యతిరేక చట్టాలతో కార్మిక సంఘాలకు వేతన బోర్డులో చోటు లేకుండా చేశారని ఆయన అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి వాటి స్థానే నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్, వాజ్పేయి ప్రధానులుగా ఉన్న సమయంలో కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేయాలని చూస్తే దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నడిచిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 85.86 లక్షల మంది అసంఘటితరంగ కార్మికులకు మోదీ తీసుకురానున్న నూతన చట్టాలు ఇబ్బందిగా మారుతాయన్నారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతన చట్టాలు హరించే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక శక్తి చంద్రబాబు మోదీ ఏ విధానం అనుసరిస్తే చంద్రబాబు రాష్ట్రంలో అదే విధానాలను అనుసరిస్తున్నాడని, కార్మిక వ్యతిరేక శక్తిగా చంద్రబాబు మారుతున్నాడని గౌతంరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇటువంటి చట్టాలను తీసుకురావడంతోనే 400 పైగా కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని అన్నారు. మోదీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈనెల 26వ తేదీన కార్మికుల ఆందోళన జరగనుందని, ఈ ఆందోళనకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. రాష్ట్రంలో జరిగే ఆందోళనలో కార్మికులతో కలిసి పాల్గొంటామని, కార్మికులకు అండగా ఉంటామని అన్నారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా కొనసాగిన వైఖరి చరిత్రలో లేదని గుర్తుచేశారు. ఇప్పటికై నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తీరు మార్చుకోవాలని గౌతంరెడ్డి సూచించారు. -
భాషా, సంస్కృతులు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): తెలుగు భాషా, సంస్కృతులు దేశ ఔన్నత్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. కవులు, రచయితలు, కళాకారులు వారివారి రంగాలలో అందిస్తున్న సేవలతో భారతీయత వెల్లివిరుస్తుంది. అటువంటి వారిని ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఏపీ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా శనివారం తొలి రోజు కార్యక్రమాలను కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రచయితలు, కవులు, కళాకారులను ఆదరించే ప్రాంతం వర్ధిల్లుతుందన్నారు. ఆధునిక జీవనశైలిలో మసకబారుతున్న కళలు, సాంస్కృతిక సంపదను పరిరక్షించుకుంటూ వాటిని భావి తరాలకు అమూల్యమైన వారసత్వ సంపదగా అందించేందుకు కవులు, రచయితలు, కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చేవారికి జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు. జానపద కళలను పరిరక్షించుకోవాలి అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కొందరు పరభాష, సంస్కృతికి లోనవుతున్న తరుణంలో మనదైన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భాష నశిస్తే సంస్కృతి కూడా నశించిపోతుందన్నారు. కర్నాటక సంగీతమైనా త్యాగరాజ కీర్తనలను తెలుగులోనే పాడాలన్నారు. కనుమరుగవుతున్న జానపద కళలను నిలుపుకొనేందుకు కృషి చేయాలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ సంస్కృతికి ఒక వృత్తి ఉందని, అందులో పారిశ్రామికం, సినిమా, వ్యవసాయం, పత్రిక తదితర కల్చర్లు ఉన్నాయని చెప్పారు. ఇంకా మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ నిర్వాహకుడు కలిమిశ్రీ , ఆకాశవాణి విశ్రాంత సంచాలకురాలు ముంజులూరి కృష్ణకుమారి, చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్ చైర్మన్ నారాయణరావు, మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, ఏపీ సృజనాత్మకత సంస్కృతి సమితి సీఈఓ రేగుళ్ల మల్లికార్జునరావు, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్, పుట్టా సురేంద్ర, వేముల హజరత్తయ్య గుప్తా తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. కార్టూన్ల పోటీకి వచ్చిన కార్టూన్లను కళాక్షేత్రం ఆడిటోరియం ప్రాంగణంలో ప్రదర్శించారు. -
4న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని డిసెంబర్ 4వ తేదీన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 4వ తేదీ తెల్లవారుజామున 5–55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన పూలవాహనంపై శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉండగా, ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయి ద్యాల నడుమ జరిగే గిరి ప్రదక్షిణలో భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది పాల్గొంటారు. సాయంత్రం కలశజ్యోతి మహోత్సవం భవానీ దీక్షలను పురస్కరించుకుని డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం కలశజ్యోతి మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 6–30 గంటలకు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి కలశజ్యోతి ఊరేగింపు ప్రారంభమవు తుంది. సత్యనారాయణపురం నుంచి ప్రారంభ మయ్యే కలశజ్యోతి ఊరేగింపు బీఆర్టీఎస్ రోడ్డు, లెనిన్ సెంటర్, పాత బస్టాండ్, కంట్రోల్ రూమ్, కెనాల్ రోడ్డు మీదగా కనకదుర్గనగర్కు చేరుకుంటుంది. కనకదుర్గనగర్లో భవానీలు, భక్తులు కలశజ్యోతులను సమర్పించి మహా మండపం మీదగా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. కలశజ్యోతులను సమర్పించేందుకు కృష్ణా, గుంటూరుతో పాటు ఎన్టీఆర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్ణాహుతితో ముగిసిన కార్తిక మాసోత్సవాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన కార్తిక మాసోత్సవాలు శుక్రవారంతో పరిసమాప్తమయ్యాయి. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం వేద ఆశీర్వచనం, ప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. శుక్రవారం నుంచి అర్థమండల దీక్షలు ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు మాలధారణ చేశారు. భక్తులకు గాజుల పంపిణీ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం మహిళా భక్తులకు ఆలయ చైర్మన్, ఈవో గాజులను పంపిణీ చేశారు. గత నెల యమ ద్వితీయను పురస్కరించుకుని దుర్గమ్మకు గాజులతో విశేషంగా అలంకరించారు. దేవస్థాన ప్రాంగణంలో అలంకరించిన గాజులను శుక్రవారం భక్తులకు అందజేశారు. -
అదృశ్యమైన వ్యక్తి మృతి
ఉయ్యూరు: అదృశ్యమైన వ్యక్తి పుల్లేరు కాలువలో శవమై తేలాడు. ఉయ్యూరు పట్టణంలోని రావిచెట్టు సెంటర్లో నివసించే కుంచవరపు రవికుమార్ 20 ఏళ్లుగా మీ–సేవ కేంద్రం నిర్వహిస్తున్నాడు. మంచి వ్యక్తిగా, సౌమ్యుడిగా పేరుపొందిన రవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్ల గాలించి ఆచూకీ లభించ కపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కుటుంబ సభ్యుల సాయంతో రావిచెట్టు నుంచి ఫ్లోరా వంతెన వరకు సీసీ కెమెరాలను పరిశీలించారు. రవికుమార్ బుధ వారం అర్ధరాత్రి రెండు గంటల రెండు నిమిషాలకు పుల్లేరు కాలువపై ఫ్లోరా వంతెన వద్ద సంచరించినట్లు గుర్తించారు. అనారోగ్యంతో బాధపడుతూ, మతిస్థిమితం కోల్పోయి ఉండటంతో కాలువలో దూకి ఉంటాడన్న అనుమానంతో గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. గురువారం రాత్రి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు శుక్రవారం ఎన్డీ ఆర్ఎఫ్ బృందాన్ని రప్పించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రవికుమార్ మృతదేహం అమ్మనకాలనీ సమీపంలో కాలువలో లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామారావు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేం
విద్యార్థి సంఘాలతో మంత్రి నారా లోకేష్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేమంటూ మంత్రి నారా లోకేష్ చెప్పడంపై విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమై విద్యారంగ సమస్యలపై చర్చించారు. సమావేశంలో పాల్గొన్న ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, పీడీఎస్ఓ సంఘాల నేతలు ఎన్నికల హామీలు అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. మంత్రితో సమావేశం అనంతరం విద్యార్థి, యువజన సంఘాల నేతలు విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి లోకేష్తో సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు వెల్లడించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలా? అంటూ లోకేష్ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే విషయంలో వెనక్కు తగ్గేదే లేదని మంత్రి తేల్చి చెప్పారన్నారు. ఆరోగ్యశ్రీ అమలు చేయాలంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించక తప్పదన్నారన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భవిష్యత్లో పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ప్రసన్నకుమార్, పీడీఎస్యూ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, పీడీఎస్ఓ కోశాధికారి భాను మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిలుపుదల చేయని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి వ్యవహారంలో మంత్రి లోకేష్ పునరాలోచన చేయాలన్నారు. విద్యాసంస్థల్లోకి రాజకీయ పార్టీ జెండాలతో ప్రవేశించకూడదంటూ ఇచ్చిన జీవో 1ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ఇద్దరు విద్యార్థులను రక్షించిన పోలీసులు
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు పాఠశాల విద్యార్థులను కృష్ణలంక పోలీసులు రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు.. మొగల్రాజపురానికి చెందిన 10, 12 సంవత్సరాల వయసున్న ఇద్దరు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని ఇళ్లలో చెప్పి ఈత కొట్టేందుకు నేరుగా కృష్ణా నది వద్దకు వచ్చారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలోని శనైశ్వర స్వామి గుడి వద్ద నుంచి కృష్ణానది ఇసుక తిన్నెల్లో నడిచి ఈత కొట్టడానికి ఇద్దరు బాలురు వెళ్తుండగా పోలి పాఢ్యమి సందర్భంగా బీటు విధులు నిర్వహిస్తున్న కాని స్టేబుళ్లు జమేషు, ఎస్.కె.జానీ గమనించారు. హుటాహుటిని వారి వద్దకు చేరుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించి వారికి సమాచారం ఇచ్చారు. ఇద్దరు పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
జీజీహెచ్లో అరుదైన స్వరపేటిక శస్త్ర చికిత్స
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్యూబర్ఫోనియా వ్యాధి కారణంగా మహిళ స్వరంతో మాట్లాడుతున్న 19 ఏళ్ల యువకుడికి జీజీహెచ్లో వైద్యులు అరుదైన, టైప్–3 థైరోప్లాస్టీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్ర చికిత్స అనంతరం సాధారణ పురుషుడి స్వరంతో ఆ యువకుడు మాట్లాడగలుగుతున్నాడు. ఏలూరు జిల్లాకు చెందిన 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థి కొంతకాలంలో గొంతు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. మహిళ స్వరంతో మాట్లాడుతున్నాడు. చికిత్స నిమిత్తం ఈఎన్టీ విభాగానికి రాగా, ఇక్కడి వైద్యులు పరీక్షలు చేసి అతడికి ప్వూబర్ఫోనియా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ కె.రవి, వైద్య బృందం థైరోప్లాస్టీ శస్త్ర చికిత్స నిర్వహించి ఆ యువకుడికి సాధారణ స్వరం తీసుకొచ్చారు. ఈ నెల ఆరో తేదీన శస్త్ర చికిత్స చేయగా, ఆ యువకుడు ప్రస్తుతం పురుషుడి స్వరంతో మాట్లాడగలుగుతున్నాడు. అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించిన డాక్టర్ కె.రవి, ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ ఎస్.వినయ్ను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నవరపు వేంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అభినందించారు. -
బీఎస్ఎన్ఎల్ వాయిస్ ఓవర్ వైఫై సేవలు ప్రారంభం
మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో స్వదేశీ 4జీ సేవలు, సరికొత్త టవర్లను ప్రారంభించిన దరిమిలా ఆకర్షణీయమైన టారిఫ్లతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఎ.రాబర్ట్ జెరార్డ్ రవి సూచించారు. స్థానిక చుట్టుగుంటలోని సంస్థ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. స్వదేశీ 4జీ సేవలు ప్రారంభించినందున రాష్ట్రంలో చేపట్టాల్సిన విధివిధానాలను వివరించారు. బీఎస్ఎన్ఎల్ వద్ద ఉన్న నాణ్యమైన స్పెక్ట్రమ్, ఫైబర్ వంటి వనరులను వినియోగించుకునే కార్పొరేట్ సంస్థలను కలిసి, వారికి టెలికాం సేవలు అందించడంలో, సేవల నాణ్యతను మరింత పెంచాల్సిందిగా సూచించారు. తొలుత సరికొత్త సర్వీసు వాయిస్ ఓవర్ వైఫై సేవలను సీఎండీ రాబర్ట్ జెరార్డ్ రవి, టెలికాం ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలంతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రాబర్ట్ జెరార్డ్ రవి మాట్లాడుతూ వాయిస్ ఓవర్ వైఫైతో వినియోగదారులు టవర్ నెట్వర్క్ లేని ప్రాంతాల్లో సైతం అక్కడ ఉన్న వైఫై జోన్ ద్వారా వాయిస్ సేవలు పొందొచ్చని తెలిపారు. అనంతరం విజయవాడ నుంచి అమరావతి రోడ్డు మార్గంలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను పరిశీలించే డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అవసరమైన చోట నెట్వర్క్ లభ్యత పెంపొందించే చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. -
జీవనం కష్టమవుతోందని మత్స్యకారుల ఆవేదన
ఇబ్రహీంపట్నం: దళారుల చర్యలతో తమ జీవనోపాధి మార్గాలు మూసుకుపోతున్నాయని పలువురు మత్స్యకారులు జిల్లా మత్స్యశాఖ అధికారి చక్రాణి దృష్టికి తీసుకొచ్చారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మత్స్యకారులను ఉద్దేశించి చక్రాణి మాట్లాడుతూ.. త్వరలో భారీ ఎత్తున కృష్ణా నదిలో చేప పిల్లలను వదులుతామన్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు తమ ఆవేదన వినిపించారు. రాత్రింబవళ్లు నదిపై జీవించే తమకు ప్రభుత్వ సహకారం అందడం లేదన్నారు. పెద్దపెద్ద భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నవారికే ఈ ప్రభుత్వంలో లబ్ధిచేకూరుతుందని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. చేపలు పట్టే వలంటే తెలియని వారు మత్స్యకారుల ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపించారు. వారి వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. అటువంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
30న జింఖానా మైదానంలో కాపునాడు స్వర్ణోత్సవ సభ
భవానీపురం(విజయవాడపశ్చిమ): కాపునాడు స్వర్ణోత్సవ సభ కార్యక్రమ ఆహ్వాన పత్రికను విజయవాడలోని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం కార్యాలయంలో కాపు సామాజికవర్గ నాయకులు శుక్రవారం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆకుల శ్రీనివాస్కుమార్ మాట్లా డుతూ... ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఐదు గంట లకు గాంధీనగర్లోని జింఖానా మైదానంలో కాపునాడు స్వర్ణోత్సవ సభ జరుగనుందని తెలిపారు. కాపునాడు ఏర్పడిన 50 ఏళ్ల కాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని, వాటన్నింటిని అధిగమించి స్వర్ణోత్సవం దిశగా ప్రయాణించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాపు సామాజికవర్గ సమస్యల పరిష్కారం కోసం కాపునాడు రాజీ లేని పోరాటం చేస్తోందని తెలిపారు. కాపునాడు చేపట్టిన ఉద్యమాలకు నాయకత్వం వహించిన మిరియాల వెంకట్రావు వంటి ఎందరో మహానుభావుల బాటలో కాపు నాయకులు పని చేస్తున్నా రని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం, మాచవరం ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ చోడిశెట్టి కృష్ణప్రసాద్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రత్నం రమేష్, కాపునాడు విజయవాడ అర్బన్ అధ్యక్షుడు పరుచూరు కరుణాకర్ (చిన్న), దుర్గా బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ అల్లం పూర్ణచంద్రరావు, రెడ్డిపల్లి సురేష్, వెంపటి ప్రభు, పసుపు లేటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ–పీఎన్డీటీ) చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని, సమన్వయ శాఖల అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం, ఏ ఆర్టీ–సరోగసీ చట్టాల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎ. సత్యానంద్ హాజరైన సమావేశంలో కమిటీ చైర్మన్, కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫిర్యాదులు వస్తే వాటిని త్వరగా విచారించి, తగు చర్యలు తీసుకోవాలన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని.. చట్టంలోని నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు వైద్య, ఆరోగ్య, సీ్త్ర శిశు సంక్షేమం, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న స్కానింగ్ కేంద్రాలకు అదనంగా కొత్త రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 13 దరఖాస్తులు, 13 రెన్యువల్ దరఖాస్తులు, 19 మార్పుచేర్పుల (మోడిఫికేషన్) దరఖాస్తులను కమిటీ పరిశీలించి, చర్చించి, ఆమోదం తెలిపింది. సరోగసీ కి సంబంధించిన నాలుగు దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. కొత్తగా స్కానింగ్ కేంద్రాల ఏర్పాటుకు, రెన్యువల్కు, మార్పులు, చేర్పులకు వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే కమిటీకి నివేదించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. గర్భిణులకు ఉపయోగపడే యోగాసనాల పోస్టర్ను కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని, ఆడపిల్లలను రక్షించాలని తెలిపే పోస్టర్లను కూడా కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. సమావేశంలో డీఎంహెచ్వో ఎం.సుహాసిని, వాసవ్య స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జి.రేష్మీ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ, ఎన్హెచ్ఎం డీపీఎంవో డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
అమరావతి బాలోత్సవం బ్రోచర్ ఆవిష్కరణ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఎనిమిదో అమరావతి బాలోత్సవం బ్రోచర్ను బాలోత్సవ్ కమిటీ సభ్యుడు పి.కామేశ్వరరావు అధ్యక్షతన కొండపల్లిలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామేశ్వరరవు మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివే సంస్కృతికి బదులు ఇష్టపడి చదివే పరిస్థితులు రావాలన్నారు. బాలోత్సవ్ కమిటీ కార్యదర్శి వెనిగళ్ల మురళీమోహన్ మాట్లాడుతూ.. ఈ బాలోత్సవంలో 43 అకడమిక్లు, 17 సాంస్కృతిక విభాగాల్లో 60 రకాల పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీలు డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరుగుతాయని పేర్కొన్నారు. రెండు, మూడు, నాలుగు తరగతుల విద్యార్థులు సబ్ జూనియర్లుగా, ఐదు, ఆరు, ఏడు తరగతుల వారు జూనియర్లుగా, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు సీనియర్లుగా పోటీల్లో తలబడతారని వివరించారు. డిసెంబర్ నాలుగో తేదీలోపు దరఖాస్తులు అందించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 63059 54249 సెల్ నంబరులో సంప్రదించాలని కోరారు. డాక్టర్ మామిడి మోహన రావు, జేవీవీ సభ్యులు పాల్గొన్నారు. -
కొండెక్కిన పూజా సామగ్రి ధరలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలోని దుకాణాల్లో పూజా సామగ్రి ధరలు కొండెక్కాయి. ధరల తగ్గింపుపై ఆలయ ఈఓ, చైర్మన్, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని చెబుతున్న దుర్గగుడి అధికారులు, ట్రస్ట్ బోర్డు కార్యవర్గం ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడమే ఇందుకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడికి ఏ అధికారి వచ్చినా, ఎవరు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నా సామాన్య భక్తులకు ఒరిగింది ఏమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలన్నా ప్రయివేటు దుకాణాల్లోనే కొనుగోలు చేయాల్సివస్తోంది. అయితే ఆ దుకాణాల్లో పూజా సామగ్రి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కొబ్బరి కాయ మొదలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువు ధరలైనా ఆకాశాన్నంటుతున్నాయి. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పూజా సామగ్రిని విక్రయించుకునేందుకు వ్యాపారులకు అనుమతులు జారీ చేస్తుంది. బహిరంగ వేలం ద్వారా దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దేవస్థానానికి అద్దె చెల్లిస్తున్నామనే నెపంతో దుకాణదారులు ఇష్టానుసారంగా పూలు, కొబ్బరి కాయలు, చీరలు, ఆట వస్తువులు ఇలా అవకాశం ఉన్న ప్రతి వస్తువును బహిరంగ మార్కెట్ కంటే రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. అయితే దేవస్థానం కొన్నాళ్లగా దుకాణాల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తోందే తప్ప అది ఆచరణలోకి రావడం లేదు. ఆదేశాలు బేఖాతరు దుర్గగుడి ఈఓగా బాధ్యతలు స్వీకరించిన శీనానాయక్ తొలి నాళ్లలో గోశాల వద్ద దుకాణాలను పరిశీలించారు. దేవస్థానం నిర్ణయించిన స్థలం కంటే ముందుకు వస్తే చర్యలు తప్పవని, పూజా సామగ్రి ధరలు భక్తులందరికీ తెలిసేలా నెల లోగా ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని లీజెస్ విభాగం అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత జూన్ 18న దుర్గగుడి ఏసీ రంగారావు ఆధ్వర్యంలో లీజెస్ విభాగం మహామండపం ఐదో అంతస్తులోని దుకాణాలతో పాటు గోశాల వద్ద దుకాణాలను తనిఖీ చేసింది. ఏసీ కూడా పూజా సామగ్రితో పాటు ఇతర వస్తువుల ధరలు భక్తులందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవస్థాన ఆదేశాలను భేఖాతరు చేస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ నెల మూడో తేదీన దుర్గగుడి చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు సైతం దుకాణాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ముక్కచీరలతో పాటు భక్తులకు విక్రయిస్తున్న పూజా సామగ్రిని పరిశీలించారు. ధరల పట్టిక ఏర్పాటు చేయలేదా అని దుకాణదారులను ప్రశ్నించారు. బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదే శించారు. అయితే దేవస్థాన ఈఓ, ఏసీ, చైర్మన్ ఇలా ఎంత మంది చెప్పినా వ్యాపారులు ధరల బోర్డులు ఏర్పాటు చేయలేదు. ధరల బోర్డులను ఏర్పాటు చేయాల్సిన ఇంజినీరింగ్ విభాగానికి ఆలయ అధికారులంటే లెక్కలేని తనంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
భక్తిశ్రద్ధలతో కోటి దీపోత్సవం
ఇబ్రహీంపట్నం: కార్తికమాసం చివరిరోజు పురస్కరించుకుని పవిత్ర సంగమం వద్ద కోటి దీపోత్సవం కొండపల్లి మునిసిపాలిటీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి వైభవంగా జరిగింది. ఎంపీ కేశినేని చిన్ని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ జ్యోతిని వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అర్చకుల వేదమంత్రోచ్చరణలతో స్థానిక ప్రజాప్రతినిధులు, మునిసిపాలిటీ అధికారులు వైభవంగా జరిపించారు. భక్తుల శివనామస్మరణలతో ఆ ప్రాంతం మార్మోగింది. శివపార్వతుల కల్యాణం అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో పలువురు భక్తులు కోటి దీపాలు వెలిగించారు. దీపాల వెలుగుల్లో పవిత్ర సంగమం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఎంపీ చిన్ని, కలెక్టర్ లక్ష్మీశను మునిసిపల్ పాలకవర్గం సత్కరించి జ్ఞాపికలు అందజేసింది. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, కమిషనర్ రమ్యకీర్తన, పలువురు కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు. -
దేవుని సొమ్ముకు భద్రత కరువు
జి.కొండూరు: దొంగలు ఆలయాలల్లో వరస చోరీ లకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ముసుగు ధరించి, సీసీ కెమెరాలకు చిక్కకుండా దొంగలు తీసుకుంటున్న జాగ్రత్తలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. భద్రత, నేరాల అదుపు, కేసుల సత్వర పరిష్కారం కోసం సురక్ష–360 పేరుతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినా జరుగుతున్న వరస చోరీలు ఆందోళన కలిగిస్తు న్నాయి. ముఖ్యంగా ఆలయాల్లో చోరీలు జరగడం చూసి దేవుడి సొమ్ముకే భద్రత లేకపోతే ఇక తమ పరిస్థితి ఎంత అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పర్యవేక్షణ లేకనే.. సాధారణంగా ఇళ్లలో చోరీ చేయాలంటే అంత సులువు కాదు. గ్రామాలకు దూరంగా ఉన్న ఆలయాల వద్ద రాత్రి సమయంలో ఎవరూ ఉండరు. ఆలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ సరిగా లేకపోయినా, దేవాలయాల కమిటీల పర్యవేక్షణ లోపం దొంగలకు అవకాశంగా మారు తుంది. హుండీలు, దేవుడికి అలంకరించే వెండి, బంగారు ఆభరణాలను కచ్చితంగా ఆలయంలో ఏక్కడో ఒక చోట దాచి ఉంచుతారనే అంచనాతో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. దేవాలయ కమిటీలు సమన్వయంతో వ్యవహరించి సీసీ కెమెరాలు సరిగా పనిచేసేలా చూడటంతోపాటు, విలువైన ఆభరణాలను బ్యాంకు లాకర్లలో ఉంచి అవసరమైనప్పుడు స్వామి వార్లకు అలంకరించేలా జాగ్రత్తలు తీసు కుంటే చోరీలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. సవాలుగా మారిన చోరీలు ఆలయాల్లో వరసగా జరుగుతున్న చోరీలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా రోజుకొకచోట చోరీ జరుగుతుండటంతో స్థానికు లతో కలిసి దొంగల ముఠా ఈ చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానం కలుగుతోంది. చోరీలకు పాల్పడేది ఒకటే దొంగల ముఠానా లేక వేరు వేరు వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నారా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. విజయవాడ సీపీ ఆధ్వర్యంలో సురక్ష – 360 కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 10,500 కెమెరాలను ప్రముఖ ప్రదేశాలు, ఆలయాలు, చర్చిలు, మసీ దుల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ, రాష్ట్రీయ రహదారులు, ముఖ్య కూడళ్లలో ప్రభుత్వానికి సంబంధించిన 1,907 సీసీ కెమెరాలు ఇప్పటికే ఉన్నాయి. అయినా చోరీలు జరగడం, దొంగలను గుర్తించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 20257పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వెయ్యి క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 41.99800 టీఎంసీలు. ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ మధురానగర్కు చెందిన పళని స్వామి సాయిచరణ్ పేరిట కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళం సమర్పించారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లా గ్రంథా లయ సంస్థ పర్సన్ ఇన్చార్జ్గా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకవర్గాన్ని నియమించకపోవటంతో జేసీని పర్సన్ ఇన్చార్జిగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ జీఓ విడుదల చేశారు. -
హిందీ నాటక పోటీల్లో విజయవాడ డివిజన్ సత్తా
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సికింద్రాబాద్లో ఈ నెల 17న జరిగిన జోనల్ స్థాయి హిందీ నాటక పోటీల్లో విజయవాడ డివిజన్ మొదటి స్థానం కై వసం చేసుకుంది. విజయవాడ బృందం ప్రదర్శించిన ‘అఖండ పర్వ్’ నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంది. విజయవాడలోని మెయిల్ ట్రైన్ మేనేజర్ ఎం. గోపాల్ కృష్ణ దర్శకత్వంలో పలు విభాగాల సిబ్బంది అత్యుత్తమ ప్రదర్శనతో వారి పాత్రలకు జీవం పోశారు. ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ లైటింగ్, ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్స్, ఉత్తమ కాస్ట్యూమ్స్, ఉత్తమ మేకప్, ఉత్తమ సంగీతం, ఉత్తమ స్టేజ్ డెకరేషన్, ఉత్తమ సహనటుడు, ఉత్తమ నటి ఇలా తొమ్మిది వ్యక్తిగత అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ నెల 18న సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో జరిగిన బహుమతుల ప్రదాన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ చేతుల మీదుగా విజయవాడ డివిజన్ బృందం అవార్డులను అందుకుంది. గురువారం నాటక బృంద సభ్యులు డీఆర్ఎం మోహిత్ సోనాకియాను మర్యాద పూర్వకంగా కలుసుకుని సాధించిన అవార్డులను చూపించారు. బృంద సభ్యులను డీఆర్ఎం ప్రత్యేంగా అభినందించారు. ఏడీఆర్ఎం పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, పలు బ్రాంచ్ల అధికారులు, సీనియర్ రాజభాష అధికారి హేమంత్ వాడేకర్ తదితరులు పాల్గొన్నారు. బృందాన్ని అభినందించిన డీఆర్ఎం మోహిత్ సోనాకియా -
నేడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యలపై శుక్రవారం రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఈ శాఖకు సంబంధించి గుర్తింపు పొందిన సంఘాల నేతలతో ఆ శాఖ కమిషనర్, ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పేరుతో జరిగే సమావేశంలో ఉద్యోగ సంఘాలు అనేక సమస్యలు లేవనెత్తనున్నాయి. సమావేశం అజెండాపై ఇప్పటికే ఆయా సంఘాల నేతలు రెండు రోజులుగా వివిధ రూపాల్లో చర్చించారు. అధికారాలకు కోత.. సర్కిల్ కార్యాలయాల్లో పని చేస్తున్న జీఎస్టీఓ అధి కారులకు సంబంధించి గతంలో ఉన్న అధికారాల్లో కొన్నింటిపై ఆ శాఖ కోత విధించింది. ఫలితంగా సమస్యలు తలెత్తుతున్నాయని, పూర్తి స్థాయి విధి నిర్వహణకు అడ్డంకిగా ఉందని ఆయా సంఘాల నేతలు చెబుతున్నారు. తిరిగి అధికారాలు కల్పించే అంశంపైనా చర్చించాలని నేతలు కోరుతున్నారు. వివిధ జిల్లాల ఉద్యోగులను అమరావతి పరిధిలోకి బదిలీపై తీసుకొచ్చారు. దీంతో ఆయా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బదిలీపై వచ్చిన వారిని తమ మాతృస్థానాలకు పంపాలని సంఘాలు కోరుతున్నాయి. న్యాయస్థానాల్లో ఉన్న కేసులు పరిశీలన, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీటీ కార్యాలయాలకు సంబంధించి ఉద్యోగులకు కేవలం బదిలీలపై కాకుండా ఉద్యోగోన్నతులపై కేటాయించాలని సంఘాల నేతలు కోరుతున్నారు. -
యువతకు దేశ సేవలో పాల్గొనే అవకాశం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్)లో ఉద్యోగ అవకాశాలపై శుక్రవారం విజయవాడ లయోల కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్లో భారత వాయుసేన అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీతో కలెక్టర్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఇంటర్, తత్సమాన విద్యార్హతలు (పాలిటెక్నిక్, ఐటీఐ) ఉన్న విద్యార్థినీవిద్యార్థులు ‘అగ్ని వీర్ –వాయు’గా భారత వాయుసేనలో చేరొచ్చని సూచించారు. 17 సంవత్సరాల ఆరు నెలల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్య వయసుగల యువతీయువకులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. చిన్న వయసులోనే దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుందని, దీనిని యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల భర్తీ అధికారి, సికింద్రాబాద్ 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కరీంనగర్, పెద్దపల్లి, గుంటూరు, పల్నాడు జిల్లాలలో ‘అగ్ని వీర్ –వాయు’పై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ఇంటర్ తత్సమాన కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కు లతో పాటు, ఇంగ్లిష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులు పొందిన వారు ‘అగ్ని వీర్ – వాయు’కు అర్హులని స్పష్టంచేశారు. యువత, తల్లిదండ్రులు ఈ అవగాహన సదస్సుకు హాజరు కావాలని కోరారు. తిరువూరు డివిజన్లో శనివారం మరో అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
పెద్ద దిక్కుకు నిర్లక్ష్యపు జబ్బు
విజయవాడ జీజీహెచ్లో ఆధునిక వైద్య పరికరాల కొరత లబ్బీపేట(విజయవాడతూర్పు): పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ పెద్ద దిక్కుగా నిలవాల్సిన విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) సర్కారు నిర్లక్ష్యం కారణంగా కునారిల్లుతోంది. ఆధునిక వైద్య పరికరాలను సమకూరిస్తే మరింత నాణ్యమైన సేవలు అందిస్తామని పాల కులు, ఉన్నతాధికారులకు ఆస్పత్రి వైద్యులు విన్నవించినా స్పందన కనిపించడంలేదు. అరకొరగా ఉన్న మొండి పరికరాలతో కుస్తీ పడుతూ వైద్య సేవలు అందించడంతోపాటు శస్త్ర చికిత్సలు చేయాల్సి దయనీయ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాస్పత్రిలో నైపుణ్యం కలిగిన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆధునిక పరికరాలు లేక పోవడంతో పూర్తిస్థాయిలో సేవలు అందించలేక పోతున్నారు. అవసరమైన పరికరాలు లేకపోవడంతో అత్యవసర సమయాల్లో రోగులను గుంటూరు ప్రభుత్వాస్ప త్రికి వెళ్లాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. కావాల్సిన పరికరాలు ఇవీ.. గుడివాడకు చెందిన 50 ఏళ్ల రోగి కిడ్నీల వాపుతో బాధపడుతూ 20 రోజుల కిందట ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. అతడిని క్యాజువాలిటీలో పరీక్షించిన వైద్యులు యూరాలజీ విభాగంలో ఆధునిక పరికరాలు లేకపోవడంతో గుంటూరు వెళ్లాలని సూచించారు. చేసేది లేక, అంబులెన్స్ మాట్లాడుకుని గుంటూరు తరలివెళ్లాడు. విజయవాడ గాంధీనగర్కు చెందిన ఓ మహిళ విరేచనంలో రక్తం పడుతుండటంతో ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెకు పెద్దపేగు పరీక్ష చేసేందుకు కొలనోస్కోపీ అందుబాటులో లేక పోవడంతో గుంటూరు వెళ్లాలని వైద్యులు సూచించారు. ఆమె ఆ పరిస్థితిలో అంత దూరం వెళ్లలేక స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంది. ఇలా నిత్యం అనేక మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాస్పత్రిల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రభుత్వం చొరవ కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులు ఏది కావాలన్నా స్పందించే వారే ఉండటం లేదు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల సమీక్షల్లో సమస్యలపై వైద్యులు ఏకరువు పెడుతున్నా స్పందన శూన్యం. దీంతో రోగులు ఆధునిక సేవలు అందడం లేదు. గత ప్రభుత్వ హయాంలో సమకూర్చిన పరికరాలతోనే వైద్యులు కుస్తీ పట్టాల్సి వస్తోంది. దీంతో రోగులకు ఒక్కోసారి ఇబ్బందులు తప్పడం లేదు. వెంటిలేటర్లు, వర్క్స్టేషన్ల కొనుగోలుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. కొద్దిరోజుల్లోనే అందుబాటు లోకి రానున్నాయి. మరిన్ని పరికరాలు సమకూరనున్నాయి. రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నాం. – డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్, జీజీహెచ్ -
పల్స్ పోలియోపై సమీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): డిసెంబరు 21వ తేదీన నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంపై గురువారం ఎన్టీఆర్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీఐఓ డాక్టర్ శరత్, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహణపై డీఎంహెచ్ఓ దిశా నిర్దేశం చేశారు. ఒకే విధమైన, సకాలంలో పల్స్పోలియో యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు అవసరమైన చర్యలను వివరించారు. హైరిస్క్ ఏరియాల గుర్తింపు, స్లమ్ ఏరియాలో ఉన్న జనాభాలోని పిల్లల కోసం మైక్రో ప్లాన్లు, కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలను వివరించారు. వందశాతం పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా క్షేత్రస్థాయి సమన్వయం, సత్వరం స్పందించడం, పర్యవేక్షణను బలోపేతం చేయడం వంటి అంశాలపై డాక్టర్ సుహాసిని చర్చించారు. సరైన బూత్ నిర్వహణ, పోలియో చుక్కలు వేయించుకోని వారిని గుర్తింపు వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలు ప్రాంతాల సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా జేసీ ఆకస్మిక తనిఖీలు
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను సందర్శించిన ఆమె మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఉపాధ్యాయు లను ఆదేశించారు. ఎ.కొండూరులో వెంకట సాయి మిల్లును తనిఖీ చేసి ధాన్యం త్వరితగతిన రైతుల నుంచి సేకరించి సకాలంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైనన్ని గన్నీ బ్యాగులు సరఫరా చేయాలని ఆదేశించారు. కంభంపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా జేసీ పరిశీలించారు. తిరువూరు మండలం లక్ష్మీపురంలో ధాన్యం కళ్లాలను పరిశీలించి, దళారులకు ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల్లో విక్రయించాలని రైతులకు సూచించారు. విస్సన్నపేట మండలం తాతకుంట్లలో స్వామిత్ర సర్వే పరిశీలించారు. రెడ్డిగూడెం, మద్దులపర్వ గ్రామాల్లోనూ జేసీ ఇలకియా ధాన్యం అమ్మకాల్లో రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. తిరు వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి, పౌరసరఫరాల డెప్యూటీ తహసీల్దారు శ్వేత, తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, రెడ్డిగూడెం తహసీల్దార్లు పాల్గొన్నారు. 24 నుంచి జాతీయ సంగీతోత్సవాలు విజయవాడ కల్చరల్: నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల వేదికగా శ్రీ సద్గురు సంగీత సభ ఈ నెల 24 నుంచి వారం రోజులు 32వ వార్షిక జాతీయ సంగీతోత్సవాలు నిర్వహించనుంది. 24వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు వి.దీపిక, వి.నందిక గాత్ర యుగళంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 25న నిరంజన్ దిండోడీ, 26న స్వరాత్మిక శ్రీకాంత్, 27న సాయి విఘ్నేష్, 28న సర్వేపల్లి సోదరీమణులు, 29న లంక తేజస్విని గాత్ర కచేరీలు జరుగుతాయి. 29న సమాగతి పేరుతో జగల్ బందీగా విదుషి శ్రీవిద్య, అంగార సిన్హా కూచిపూడి నృత్యం, శుభానాగరాజ్ ఒడిస్సీ నృత్య ప్రదర్శన జరుగుతుంది. 30వ తేదీన వయోలిన్ విద్వాంసుడు పాలపర్తి నాగేశ్వరరావుకు సంగీత విద్వన్మణి బిరుదు ప్రదానం చేస్తారు. అనంతరం ఆయన వయోలిన్ కచేరి జరుగుతుంది. బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడికి అరుదైన పురస్కారం జగ్గయ్యపేట అర్బన్: జగ్గయ్యపేట బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాం సుబ్బారావుకు అరుదైన పురస్కారం లభించింది. 75 ఏళ్లకు పైబడి బంగారు ఆభరణాల వ్యాపారంలో కొనసాగుతున్నందుకు ఏపీ జెన్ అండ్ జ్యువెలరీ ఫెయిర్, ఏపీ బులియన్ మర్చంట్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రత్యేక పురస్కారం అందజేయనుంది. ఈ నెల 21వ తేదీన విజయవాడలోని ఓ హోటల్లో సుబ్బారావు దంపతులను బులియన్ మర్చంట్, జ్యువెలరీ అండ్ జెమ్ ఫెయిర్ నిర్వాహకులు సత్కరించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఈ అరుదైన పురస్కారం అందుకుంటున్న ఏౖకైక బులియన్ మర్చంట్గా సుబ్బారావు ఘనత సాధించనున్నారు. ఈ సందర్భంగా షరాబు వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి కొంకిమళ్ల మల్లికార్జునరావు, షరాబు వ్యాపారులు, స్వర్ణకారులు హర్షం వ్యక్తం చేశారు. -
గౌతంరెడ్డి కారుకు నిప్పుపెట్టిన నిందితుడు అరెస్ట్
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి కారుకు నిప్పు పెట్టిన నిందితుడిని ఎస్ఎన్ పురం పోలీసులు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎస్.వి.వి లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. గత నెల 12న గౌతమ్రెడ్డి కార్యాలయంలోని కింది ఫ్లోర్లో ఉంచిన కారును గుర్తు తెలియని వ్యక్తి పెట్రోలు పోసి నిప్పటించి పరారయ్యాడు. ఈ ఘటనలో కారు పాక్షికంగా కాలిపోయింది. దీనిపై అదేరోజు గౌతంరెడ్డి మెయిల్ ద్వారా పోలీస్ కమిషనర్, ఎస్ఎన్పురం ఇన్స్పెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుని కోసం గాలింపు చేపట్టారు. పాత నేరస్తుడి పనే.. ఇటీవల ఒక న్యూస్ చానల్ డిబెట్లో గౌతంరెడ్డి తన అభిమాన నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని జీర్ణించుకోలేకే హైదరాబాద్, బండ్లగూడకు చెందిన పాత నేరస్తుడు హరికోటి లెనిన్ అనే వ్యక్తి గౌతంరెడ్డి కారుపై పెట్రోలు పోసి నిప్పు అంటించినట్లు సీఐ లక్ష్మీనారాయణ వెల్లడించారు. 2005కి ముందు పెజ్జోనిపేటలో నివాసముండే నిందితుడు అనంతరం హైదరాబాద్కు మకాం మార్చాడు. ఇతనిపై గతంలో సత్యనారాయణపురం, కృష్ణలంక, మాచవరం, సూర్యారావుపేట, గవర్నరు పేట పోలీస్ స్టేషన్లలో 15 దొంగతనాల కేసులతో పాటు సస్పెక్ట్ షీటు ఉంది. ఈ క్రమంలో సుమారు రెండు నెలల క్రితం యూట్యూబ్లో గౌతంరెడ్డి ఒక టీవీ చానెల్లో ముఖాముఖీ ప్రోగ్రాంలో తన అభిమాన నేతను విమర్శించి మాట్లాడటాన్ని చూసి జీర్ణించుకోలేకపోయాడు. అందుకు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే గత నెల 12న హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి గౌతంరెడ్డి ఇంటి పరిసరాలలో రెక్కి నిర్వహించాడు. ఆయన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో నిలిపిన కారును దగ్ధం చేసే ఉద్దేశంతోనే బాటిల్లో పెట్రోలు తీసుకువచ్చి ఎవరు లేని సమయంలో కారు వెనుక భాగంలో పెట్రోలు పోసి నిప్పు అంటించి అక్కడ నుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అందుబాటులోకి సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. గురువారం సత్యనారాయణపురం మట్టిరోడ్డులో ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. సమావేశంలో ఉమెన్ ఎస్ఐ సౌజన్య, సిబ్బంది పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన సీఐ లక్ష్మీనారాయణ -
అందుబాటులోకి నూతన యాగశాల
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దాతలు రూ.5కోట్లు వెచ్చించి నిర్మించిన యాగశాల గురువారం నుంచి వినియోగంలోకి వచ్చింది. కార్తిక అమావాస్యను పురస్కరించుకుని గురువారం నూతన యాగశాలలో గణపతి హోమం, నవగ్రహ హోమం, చండీహోమాలను ఆలయ అర్చకులు అంత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నూతన యాగశాలలో హోమాలను నిర్వహిస్తుండటంతో యాగశాలను పూలు, అరటి చెట్లు, మామిడి తోరణాలతో అలంకరించారు. చండీహోమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు హాజరయ్యారు. అమావాస్య నేపథ్యంలో చండీహోమానికి పెద్ద ఎత్తున ఉభయదాతలు నూతన యాగశాలకు విచ్చేశారు. గతంలో విశేష పర్వదినాలైన పౌర్ణమి, అమావాస్య, దశమి, ఏకాదశి, మూలా నక్షత్రం వంటి రోజులలో టికెట్ల సంఖ్యను కుదించడంతో పాటు ఆరుబయట కూర్చోవాల్సి వచ్చేదని భక్తులు పేర్కొన్నారు. నూతన యాగశాలలో సువిశాలమైన ప్రాంగణంలో ఉభయదాతలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో హోమంలో పాల్గొనే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నూతన యాగశాలలో ఉభయదాతల సౌలభ్యం కోసం చేపట్టాల్సిన కొన్ని మార్పులను భక్తులు సూచించారు. సహస్ర లింగార్చన సేవ.. కార్తిక మాసం ముగింపును పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై గురువారం మల్లేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలను నిర్వహించారు. సహస్ర లింగార్చన సేవను ఆలయ అర్చకులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షణలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సహస్ర లింగార్చన అనంతరం స్వామి వారిని ఆలయ చైర్మన్ రాధాకృష్ణ దంపతులు దర్శించుకున్నారు. నేడు పూర్ణాహుతి.. కార్తిక మాసం ముగింపును పురస్కరించుకుని శుక్రవారం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలోని యాగశాలలో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. విశేష పర్వదినాల్లో దుర్గమ్మ భక్తులకు తప్పిన ఇక్కట్లు -
బిల్ కలెక్టర్లకు ఉద్యోగోన్నతులు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని పలు మండలాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది బిల్ కలెక్టర్లకు జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి లభించింది. కలెక్టర్ డీకే బాలాజీ ఆయన చాంబర్లో ఉద్యోగోన్నతి పత్రాలను వారికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ, డీపీవో కార్యాలయ ఏవో సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గృహ నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్లో గృహాల నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వివిధ స్థాయిలలో ఉన్న గృహాల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. లబ్ధిదారు బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని చెప్పారు. గృహ నిర్మాణంలో ప్రజల సంతృప్తే గీటురాయి అని చెప్పారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలని, నిర్మాణాలు పూర్తి చేసే దిశగా ప్రోత్సహించాలని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) 2.0 సర్వే నిర్వహిస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల మంజూరు జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ పీడీ రజనీకుమారి పాల్గొన్నారు. గూడూరు: కృష్ణా యూనివర్సిటీకి గూడూరులో కేటాయించిన భూముల అన్యాక్రాంతంపై అధికారులు స్పందించారు. ఈనెల 4న ‘వర్సిటీ భూములు కృష్ణార్పణం’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన యూనివర్సిటీ అధికారులు తమకు కేటాయించిన భూములను చూపాలంటూ జిల్లా కలెక్టర్ను కలిశారు. కలెక్టర్ సూచనతో వర్సిటీ ఇంజినీర్ బాబు సిబ్బందితో గురువారం గూడూరు మండల రెవెన్యూ అధికారులను సంప్రదించారు. దీంతో తహసీల్దార్ డి.రాజ్యలక్ష్మి, మండల సర్వేయర్ కె.మురళీకృష్ణ సిబ్బందితో కలసి క్షేత్రస్థాయికి వెళ్లారు. యూనివర్సిటీకి గూడూరు మండలంలో రెండు చోట్ల కేటాయించిన భూముల పటాలను స్థానిక రెవెన్యూ అధికారులకు వర్సిటీ వారికి చూపారు. వెంకటేశ్వరస్వామి గుడి వెనుక భాగంలో కేటాయించిన 19 ఎకరాలకు రోవర్ సహాయంతో హద్దులు చూపించారు. పటాన్పేట ప్రాంతంలో కేటాయించిన 25.58 ఎకరాలకు సంబంధించిన హద్దులు చూపడానికి రెండు రోజుల సమయం కోరారు. -
జల్సాల కోసం బైక్ల చోరీ
పామర్రు: రోజువారీ ఖర్చుల కోసం బైక్లను కాజేసి.. తాకట్టు పెడుతూ జల్సాలు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కృష్ణాజిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు తెలిపారు. పామర్రులోని పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కోట్లో భాస్కర్రెడ్డి, పామర్రు మండలం జుఝవరం గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. కాగా ఇటీవల పామర్రులోని ఓ వైన్స్ దుకాణంలో జరిగిన గొడవలో భాస్కర్రెడ్డిని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అతను బైక్ దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని ఎస్ఐ ఉన్నతాధికారులకు తెలియజేయగా.. గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ పర్యవేక్షణలో పామర్రు సీఐ సుభాకర్, ఎస్ఐ విచారించగా అతను పామర్రు, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, కంకిపాడు, విజయవాడ తదితర ప్రాంతాలలో మొత్తం 45 బైక్లు దొంగిలిచినట్లు ఒప్పుకున్నాడు. అలా దొంగిలించిన బైక్లను రూ.2వేల నుంచి రూ.3వేలకు తాకట్టు పెట్టి తన అవసరాలను తీర్చుకుంటున్నాడు. రూ. 22.50లక్షల విలువ.. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి బైక్లను రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.22.50లక్షలు దాకా ఉండొచ్చని ఎస్పీ చెప్పారు. వీటిలో 26 బైక్లపై కేసులపై నమోదు అయినట్లు గుర్తించామని, మిగిలిన 19 బైక్లపై ఏ విధమైన కేసులు నమోదు కాలేదని వివరించారు. 19 వాహనాలు ఏ స్టేషన్ పరిధిలో చోరీ చేశాడో ధ్రువీకరణ కావలసి ఉందని పేర్కొన్నారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సుభాకర్, ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, ట్రైనీ ఎస్ఐ సత్యకళ, ఏఎస్ఐ అన్సారీ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుళ్లకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
పెడన: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాల పాలైన ఘటన పెడన మండల మడక వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెడన మండలం లంకలకలువగుంట గ్రామానికి చెందిన మువ్వల చిన వెంకటేశ్వరరావు(60), చిరంగి నాగమల్లేశ్వరరావు(50) మడక గ్రామంలోని ఒక తోటలో రోజువారి కూలీ పనులకు గత రెండు, మూడు రోజులుగా వస్తున్నారు. అలాగే గురువారం ఉదయం కూడా గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరి 216 జాతీయ రహదారి మీదుగా బంటుమిల్లి వైపు నుంచి మడక వద్దకు వస్తున్నారు. రెండు, మూడు నిమిషాల్లో తోటలోకి వెళ్లే వారే. అయితే వీరి ద్విచక్ర వాహనం ముందుగా ఆటో వెళ్తుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని చూడకుండా రోడ్డును క్రాస్ చేశారు. అదే సమయంలో వేగంగా వస్తున్న కారు వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, నాగమల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఆందోళన.. విషయం తెలిసిన మృతుని కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. బంధువులు, గ్రామస్తులు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై, కారుకు అడ్డంగా బైఠాయించారు. పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. నాగేంద్రప్రసాద్, ఎస్ఐ జి. సత్యనారాయణ, ఏఎస్ఐ లక్ష్మణరావు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబసభ్యులతో మాట్లాడి ఆందోళనలు విరమింపజేశారు. కారు నడుపుతున్న వ్యక్తిని, కారును పోలీస్ స్టేషన్కు తరలించారు. నరసాపురానికి చెందిన కారుపై ఎమ్మెల్యే అని స్టిక్కర్ ఉండటం గమనార్హం. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట.. వెంకటేశ్వరరావు మృతదేహానికి మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో పీఎం పూర్తవ్వగానే బంధువులు, గ్రామస్తులు అంబులెన్సులో గ్రామానికి తీసుకువెళ్లకుండా పెడన పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. కారుతో ఢీ కొన్న వారిని బయటకు పంపించాలని, వారితో తాము మాట్లాడుకుంటామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెడన సీఐ కె నాగేంద్రప్రసాద్, ఎస్ఐ సత్యనారాయణ వెంకటేశ్వరరావు కుమారుడికి చెప్పడంతో మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. -
‘పది’కి సన్నద్ధం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్షల ప్రక్రియలో తొలి అంకానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. 2026 మార్చిలో జరిగే పరీక్షలకు సంబంధించి ఈ నెల 13 నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. 25వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన జిల్లాలోని ఉన్నత పాఠశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న రెగ్యులర్, ఫెయిల్ అయిన అభ్యర్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంది. అపరాధ రుసుంతో.. పదో తరగతి ఫీజు చెల్లించే అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించుకోవచ్చు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అదే తేదీ లోగా నామినల్ రోల్స్ పూర్తి చేసి ఆ తరువాత పాఠశాల లాగిన్ లోని లింక్ ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీఎఫ్ఎంఎస్ ద్వారా కానీ, చలానా ద్వారా కానీ పరీక్ష ఫీజు చెల్లిస్తే నిరుపయోగమవుతుందని అధికారులు పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుంతో నవంబర్ 26 నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకూ చెల్లించవచ్చు. డిసెంబర్ నాలుగు నుంచి పదో తేదీ వరకూ రూ.200 అపరాధ రుసుంతో చెల్లించవచ్చు. అదేవిధంగా డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకూ రూ.500 అపరాధ రుసుంతో చెల్లించే వీలుంటుంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రికగ్నైజేషన్ పెండింగ్ ఉన్న పాఠశాలల ఆన్లైన్ లాగిన్స్ అందుబాటులో ఉండవు. గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసుకున్న పాఠశాలలు సంబంధిత డీఈవో కార్యాలయంలో సంప్రదించి లాగిన్ను ఎనేబుల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే.. పూర్తి చేసిన దరఖాస్తులన్నీ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు వివరాలను నామినల్ రోల్స్కు ప్రాతిపదికన తీసుకుంటారు. తప్పొప్పులకు ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ బాలురు బాలికలు మొత్తం ఏపీ మోడల్ స్కూల్స్ 65 63 128 ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ 128 398 526 ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ 52 193 245 బీసీ వెల్ఫేర్ 80 0 80 కేజీబీవీస్ 0 110 110 ఎంపీపీ జెడ్పీపీ 3,157 3,502 6,659 మునిసిపల్ 1,231 1,277 2,508 ప్రైవేట్ ఎయిడెడ్ 350 560 910 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 8,896 7,452 16,348 ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్(బ్లైండ్) 31 16 47 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 11 2 13 (డఫ్ అండ్ డంబ్) రాష్ట్ర ప్రభుత్వం 143 40 183 టీడబ్ల్యూ ఆశ్రమ స్కూల్ 40 0 40 మొత్తం 14,184 13,613 27,797 జిల్లాలోని వివిధ మేనేజ్మెంట్ స్కూల్స్లో పదో తరగతి విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పరీక్షల విభాగం పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించింది. దాని ప్రకారం పరీక్ష ఫీజులను చెల్లించాలి. నిర్ణయించిన ఫీజుల కన్నా అధికంగా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే చెల్లించాలి. – యూవీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్ జిల్లా -
పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
గూడూరు/పెడన/పమిడిముక్కల/కోనేరుసెంటర్: రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా జరిపేందుకు క్షేత్ర స్థాయిలో యంత్రాంగం పని చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే ధాన్యానికి 24 గంటలలోనే రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నామన్నారు. కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా మంత్రి బుధవారం గూడూరు, పెడన, పమిడిముక్కల మచిలీపట్నం తదితర మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు వెంబడి ఆరబోసిన ధాన్యం రాశులను పరిశీలించారు. బందరు మండలం సుల్తానగరంలోని సీతారామాంజనేయ రైస్ మిల్లును సందర్శించారు. మిల్లు నిర్వహణ, రైతుల నుంచి ధాన్యాన్ని ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్కు సంబంధించి ఇప్పటి వరకు 2.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు 16 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. 32,793 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించగా వారి ఖాతాలలో రూ.560 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బంది రాకుండా 6.34 కోట్ల గన్నీ సంచులు సిద్దంగా ఉంచామని వివరించారు. కౌలు కార్డు లేకున్నా ఈ పంట నమోదు చేసుకున్న కౌలు రైతుల నుంచి కూడా ధాన్యం సేకరిస్తున్నామని వెల్లడించారు. కౌలు రైతుల సంక్షేమానికి 50 వేల టార్పాలిన్ పట్టాలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర పౌరస రఫరాల సంస్థ వైస్ ఛైర్మన్ ఎండీ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి, ఆర్డీఓ స్వాతి తదితరులు పాల్గొన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -
వెట్టి చాకిరి చేయిస్తే కఠిన చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వెట్టి చాకిరి చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. జిల్లాలో వెట్టి చాకిరి నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వెట్టి చాకిరి నిర్మూలన కోసం జిల్లాస్థాయి నిఘా – పర్యవేక్షణ సంఘాన్ని (విజిలెన్స్ – మానిటరింగ్ కమిటీ) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో వెట్టి చాకిరి నిర్మూలనపై సమావేశం జరిగింది. లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాస్థాయి కమిటీకి కలెక్టర్ చైర్ పర్సన్గా, జాయింట్ కలెక్టర్ కన్వీనర్గా ఉంటారని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, పీడీ డీఆర్డీఏ, పీడీ డ్వామా, లీడ్ బ్యాంకు మేనేజర్, జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ, పోలీస్ శాఖల ప్రతినిధులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కమిటీకి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఈ కమిటీ గ్రామాలు, పట్టణాలలో వెట్టి చాకిరి బాధితులను గుర్తించి, సంబంధిత వ్యక్తులపై చర్యల కోసం జిల్లా కలెక్టర్కు నివేదిస్తుందని, ఆ బాధితుల పునరావాసానికి సూచనలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ సంఘం నోడల్ అధికారి – కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ జి.ధనలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, డీఆర్డీఏ పీడీ నాంచారరావు, డీపీఓ లావణ్య కుమారి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రియాంక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డాక్టర్ కీర్తి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ -
బంగారు దుకాణ యజమానికి మహిళల టోకరా
తిరువూరు: పాత నగ ఇచ్చి కొత్త నగలు కొనడానికి వచ్చామని ముగ్గురు మహిళలు బురిడీ కొట్టించారు. మహిళలు వెళ్లిపోయాక నగ గిల్టుదని గ్రహించిన దుకాణ యజమాని లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బుధవారం జరిగింది. బంగారు నగలు కొనేందుకంటూ తిరువూరులోని ఓ నగల దుకాణానికి ముగ్గురు మహిళలు వచ్చారు. గోల్ట్ కోటెడ్ బ్రాస్లెట్ను దుకాణ యజమానికి ఇచ్చారు. 88 శాతం స్వచ్ఛత చూపడం, హాల్మార్కు కూడా ఉండటంతో వాటిని తీసుకుని 8.5 గ్రాముల బంగారు గొలుసు, రూ.85 వేల నగదు, 40 గ్రాముల వెండి గొలుసు ఆ మహిళలు తీసుకున్నారు. వారు వెళ్లి పోయిన తర్వాత ఆ నగలను క్షుణ్ణంగా పరీక్షించగా బంగారు పూత పూసినవిగా తేలింది. దీంతో యజమాని పోలీసుల్ని ఆశ్రయించాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలుగా అనుమానించిన పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సీసీ టీవీలో రికార్డయిన మహిళల చిత్రాలను అన్ని పోలీసుస్టేషన్లకు పంపినట్లు పోలీసులు తెలిపారు. -
లైసెన్స్డ్ ఇంజినీర్ల సంఘ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా లైసెన్స్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం అయ్యింది. నగరంలోని సత్యనారాయణపురంలో ఎన్టీఆర్ జిల్లా లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సలహాదారులు డీఎల్ నారాయణ, ఎం.లింగేశ్వరరావు ఆధ్వర్యాన జరిగింది. ఈ సందర్భంగా 2025–27 సంవత్సరాలకు నూతన కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా వి.రామకృష్ణప్రసాద్, కార్యదర్శిగా అరిగెల చంద్రశేఖర్ ఉపాధ్యక్షులుగా ఎస్ సుధాకర్, కె.శ్రీహరి, సంయుక్త కార్యదర్శిగా ఏ చంద్రశేఖర్, కోశాధికారిగా పి.సుధాకర్ ఉపకోశాధికారిగా ఎం.మధన్మోహన్, న్యాయ సలహాదారులుగా ఇ.బాలాజీ బాబు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎం.విశ్వనాధరావు, కె.శరత్ బాబు, బి.రవిమోహన్లతో పాటు మరో 8 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు వి.రామకృష్ణప్రసాద్,అరిగెల చంద్రశేఖర్ మాట్లాడుతూ వీఎంసీ, సీఆర్డీఏ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామని అన్నారు. సిబ్బందికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. తమపై నమ్మకంతో తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నికలను వెల్పేర్ అసోసియోషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ (వాఎల్టీపీ) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎం.సుధాకర్ నిర్వహించారు. -
సహకార రంగంలో విస్తృత అవకాశాలు
నున్న(విజయవాడరూరల్): సహకార రంగంలో విస్తృతమై అవకాశాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని లాభాల దిశగా పయనించాలని జిల్లా కోపరేటివ్ అధికారి ఎస్.శ్రీనివాసరెడ్డి అన్నారు. 72వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా బుధవారం నున్న గ్రామంలో సహకార వారోత్సవాల కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకులు కేవలం రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వడం వాటిని వడ్డీలతో తిరిగి చెల్లించుకోవడంతో పాటు నేడు కేంద్ర ప్రభుత్వం వైద్యం, పర్యాటక, ఓలాక్యాబ్స్, విద్యారంగం ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాల దిశగా తీసుకెళ్ళ వచ్చునన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ పేరుతో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందన్నారు. అందులో భాగంగా కంప్యూటరీకరణ చేయడం జరుగుతుందన్నారు. సహకార రంగం బలోపేతం కావడానికి పాలకవర్గాల నాయకత్వం పటిష్టంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. సహకార రంగంలో రుగ్మతలను రూపుమాపి ఆర్ధిక వ్యవస్థను పెంపొందించడానికి భారతదేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ కృషి చేశారని, ఆయన పుట్టిన రోజు నవంబర్ 14 నుంచి వారం రోజుల పాటు సహకార వారోత్సవాలను జరుపుకొంటున్నామని గుర్తు చేశారు. వ్యవసాయ రుణాలను పొందటానికి వృద్ధాప్యంలో రైతులు బ్యాంకులకు రవాలని నిబంధన పెట్టారని ఆ నిబంధనలు సడలించి బ్యాంక్ ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని జమ చేయాలని ఎంపీటీసీ సభ్యుడు పోలారెడ్డి ప్రసాద్రెడ్డి, మరి కొందరు రైతులు విజ్ఞప్తి చేశారు. రైతులకు ఆ సదుపాయం కల్గించే విధంగా చర్యలు తీసుకొంటామని చెప్పారు. సొసైటీ ఛైర్మన్ కలకోటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విభాగ సహకార అధికారి కిరణ్కుమార్, నున్న సొసైటీ నివేదికను వివరించారు. రాష్ట్రంలోని ముందంజలో ఉన్న సొసైటీల్లో నున్న ఒకటన్నారు. డైరెక్టర్లు గంపా శ్రీనివాసరావు, పామర్తి శ్రీనివాసరావు, అసిస్టెంట్ రిజిష్ట్రార్ ధర్మారావు, సీఈఓ టి.రమేష్బాబు పాల్గొన్నారు. -
విజయ భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా
విజయవాడలీగల్: విజయభాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్పై తీర్పు గురువారానికి వాయిదా పడింది. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ శాఖా మంత్రి, వారి కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై మాలపాటి భాస్కరరెడ్డిని అక్రమంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో విచారణ పూర్తయింది. ఆర్చరీ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): లాస్ ఏంజిల్స్లో 2028లో జరగబోయే ఒలింపిక్స్లో పతకం సాధించడమే తన లక్ష్యమని ఆర్చరీ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్ చెప్పారు. ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్–2025లో రికర్వ్ విభాగంలో బంగారు పతకం సాధించిన ఆయన బుధవారం విజయవాడలోని చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీని సందర్శించారు. ముందుగా తన గురువు లెనిన్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధీరజ్ మాట్లాడుతూ ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో బంగారు పతకం పొందడం తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నారు. డిసెంబర్లో హైదరాబాద్లో జరుగనున్న సీనియన్ నేషనల్ చాంపియన్షిప్, వచ్చే ఏడాది జనవరిలో టోక్యోలో జరగనున్న ఆసియా క్రీడలు, 2027 జరిగే ఆర్చరీ ప్రపంచ చాంపియన్షిప్లో కూడా పతకాల సాధనే లక్ష్యంగా పూర్తి స్థాయిలో సాధన చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను ఆర్చీరీ ర్యాంకింగ్లో భారతదేశంలో నంబర్–1 స్థానంలో, ప్రపంచంలో 13వ స్థానంలో ఉన్నానని చెప్పారు. అకాడమీ చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆసియా చాంపియన్షిప్ సెమీ ఫైనల్లో కొరియా దేశానికి చెందిన క్రీడాకారులను ధీరజ్ ఓడించడం భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి వంటిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బెవర వెంకట రమణ, ఉపాధ్యక్షుడు బి.శ్రావణ్కుమార్, గొట్టిపాటి ప్రేమ్కుమార్, జాతీయ ఆర్చరీ క్రీడాకారులు చెరుకూరి డాలి శివాని, సంయుక్త తదితరులు ఽధీరజ్ను సత్కరించారు. మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిఘా సంస్థ మాజీ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి అధికారులు స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షణ చేసిన వారు నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందజేశారు. నిత్యాన్నదాన పథకానికి విరాళాలు పెదకాకాని: పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి బుధవారం విజయవాడకు చెందిన తిరుక్కోవల్లూరి సాంబమూర్తి పేరు మీద వారి సతీమణి శోభ రూ. 50,116 అందజేశారు. అలానే గుంటూరుకు చెందిన నందిగామ సాంబశివరావు, నర్రా రామమూర్తి, గింజుపల్లి గోపాల్స్వామిల పేరు మీద నందిగామ శిరీష, ప్రసాద్రెడ్డి దంపతులు దేవస్థాన నిత్య అన్నదాన పథకానికి రూ. 50 వేలు విరాళంగా అందజేశారు. దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి చిత్రపటం అందజేశారు. -
విద్యార్థి దశ నుంచి పుస్తక పఠనం అవసరం
గన్నవరం: విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరు పుస్తక పఠనం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. సబ్జెక్టులపై తోటి విద్యార్థులతో చర్చించడం ద్వారా విజ్ఞానం మరింత పెరుగుతుందన్నారు. బుధవారం ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన అక్కడ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహార పదార్ధాల నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు కలిగి ఉండాలని సూచించారు. కేవలం మార్కుల కోసమే కాకుండా భవిష్యత్లో నూతన ఆవిష్కరణలు చేసే జ్ఞానం కోసం పాటు పడాలన్నారు. ముఖ్యంగా మౌఖిక, రాతపూర్వక కమ్యూనికేషన్లను అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో గుడివాడ డీవైఈఓ కొండా రవికుమార్, ఎంపీడీఓ ఈ.సత్యకుమార్, హెచ్ఎం సిహెచ్. అనిత పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2025u8లో ● బస్తర్ నుంచి కానూరుకు మావోలు ఎలా వచ్చారు? ● 28 మంది మావోల కదలికలు గుర్తించని స్థానికులు ● నంబర్ లేని జీప్లో వచ్చి ఆహారం ఇచ్చిన వ్యక్తి ఎవరు? ● దేవ్జీ ఎక్కడ? పెనమలూరు: కానూరు కొత్త ఆటోనగర్లో మావోయిస్టులు షెల్టర్ తీసుకోవటం మిస్టరీగా మారింది. పైగా వసతులు లేని భవనంలోని పైన ఒకే ఫ్లోర్లో 28 మంది మావోలు ఎలా ఉన్నారు? వారికి నంబర్ లేని జీప్లో వచ్చి మూడు పూటలా ఆహారం ఇచ్చింది ఎవరు? మావో కార్యదర్శి తిప్పిరి తిరుపతి(దేవ్జీ) అంగరక్షకులు పట్టుబడ్డారని పోలీసులు చెబుతుండగా.. అసలు దేవ్జీ ఏమయ్యారు? ఇలా అనేక శేష ప్రశ్నలకు పోలీసు అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కానూరులో మావోయిస్టుల షెల్టర్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానూరు ఆటోనగర్లో భవనంలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 28 మందిని అరెస్టు చేశారు. వీరంతా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా దళ సభ్యులేనని పోలీసులు తెలిపారు. అందులో 9 మంది మావో కార్యదర్శి తిప్పిరి తిరుపతి(దేవ్జీ) అంగరక్షకులు అని పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే మావోయిస్టులు పట్టుబడిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌరహక్కుల సంఘ నేతలు కూడా ఖండిస్తున్నారు. కానూరు ఆటోనగర్లో భవనంలోకి మావోయిస్టులు ఎలా వచ్చారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ నుంచి ఏవోబీ మీదుగా దాదాపు 600 కిలోమీటర్లు ప్రమాణించి కానూరుకు 28 మంది మావోలు రావడం అంటే మాటలు కాదు. పైగా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేయగా భవనంలో ఉన్న మావోయిస్టులు అసలు ఏమాత్రం ప్రతిఘటించలేదు. ఎటువంటి ఫైర్ కూడా జరగలేదు.. పోలీసుల జాయింట్ ఆపరేషన్ చాలా తేలికగా ముగిసింది. భవనంలో 28 మంది మావోయిస్టులు తల దాచుకున్నా.. ఎక్కడా కదలికలు లేవని స్థానికులు తెలిపారు. ఏనాడు ఒక్కరు కూడా భవనం నుంచి బయటకు రాలేదని చెబుతున్నారు. నంబర్ ప్లేట్ లేని జీప్లో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మూడు పూటలా సంచుల్లో ఆహారం ఇచ్చారని ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. 10 రోజుల నుంచి మాత్రమే జీప్లో ఆహారం వచ్చిందని చెబుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం భవనం గుమాస్తా భవనంలో ఫ్యాన్లో ఏర్పాటు చేశాడని తమ వద్ద నిచ్చెన తీసుకు వెళ్లినట్లు స్థానికంగా ఉన్న కార్మికులు తెలిపారు. మరి భవనం గుమాస్తాను పోలీసులు విచారించారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. మావోలు షెల్టర్ తీసుకున్న భవనం ఎదురుగా పని చేస్తున్న నాగార్జున అనే వ్యక్తి వివరాలు తెలుపుతూ నంబర్ లేని జీప్ రావటం కార్మికులందరం చాలా సార్లు చూశామన్నారు. ఆహారం ఇచ్చిన తరువాత సదరు వ్యక్తి కొద్ది సమయం ఇక్కడే ఉండేవాడని తెలిపారు. తమకు ఎలాంటి అనుమానం రాలేదని చెప్పారు. మావోలు పట్టబడ్డారంటే నమ్మలేక పోతున్నామని, ఇప్పుడు భయం వేస్తోందని చెబుతున్నారు. మావోలపై జాయింట్ ఆపరేషన్ జరిగిన సమయంలో భవనం ఎదురుగా పని చేస్తున్న కార్మికుల ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోలు ఉన్న భవనంలో కింద భాగంలో ఉన్న గోడౌన్ సిబ్బంది కూడా 28 మంది మావోలు భవనంలో ఉన్నట్లు గుర్తించలేక పోయారు. పట్టుబడిన 28 మంది మావోయిస్టుల్లో 16 మందిని పెనమలూరు, 12 మందిని ఉయ్యూరు రూరల్ పోలీస్స్టేషన్కు బుధవానం వేకువజామున పోలీసులు తీసుకు వచ్చారు. ఉయ్యూరు, పెనమలూరు పీహెచ్సీ వైద్యులు మావోయిస్టుల ఎత్తు, బరువు, బీపీ, సుగర్, హెచ్బీ వైద్య పరీక్షలు చేశారు. ప్రత్యేక బందోబస్తు వాహనాలలో విజయవాడ కోర్టుకు తరలించారు. రాయన భాగ్యలక్ష్మి సంపతి విజిత 7రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా జరిపేందుకు క్షేత్ర స్థాయిలో యంత్రాంగం పని చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బుధవారం దర్శించుకున్నారు. విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం అవసరమని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. ఉంగుటూరు జెడ్పీ హై స్కూలులో మధ్యాహ్న భోజన అమలు తీరును పరిశీలించారు. -
కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి
● సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యామ్ప్రసాద్ ● ఆర్ఎస్ఎస్ శత వార్షికోత్సవం సందర్భంగా వన సమారాధన చల్లపల్లి: ప్రతి ఒక్కరూ కుటుంబం వ్యవస్థకు, బాధ్యతలకు, ప్రకృతి పరిరక్షణకు, సమాజ శ్రేయస్సుకు ప్రాముఖ్యతను ఇవ్వాలని సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ కె.శ్యామ్ప్రసాద్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధి కార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని నడకుదురు ఉసిరి వనంలో బుధవారం కార్తిక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరువోలు బుచ్చిరాజు అధ్యక్షతన జరిగిన సభలో శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి బాధ్యతగా ఉండాలన్నారు. భారతదేశంలో తొలిసారి అంటరాని తనం నిర్మూలన ఉద్యమం ప్రారంభమైంది కృష్ణా జిల్లాలోనే అని చరిత్రను వివరించారు. ఆర్ఎస్ఎస్ మతం కోసమే కాదు.. ఆర్ఎస్ఎస్ అనేది కేవలం మతం కోసమో, ఒక కులం కోసమో కాదని.. భారతీయుడైన ప్రతి ఒక్కరూ అందులో చేరేందుకు అవకాశం ఉందని సీనియర్ కాలమిస్టు, కార్టూనిస్టు దుగ్గరాజు శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కామర్సు సుబ్రహ్మణ్యం, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు జన్ను జగదీష్, హిందు బంధువులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా విచ్చేసి వన సమారాధనలో పాల్గొన్నారు. -
అక్రమాలకు నిలయాలుగా ‘ఉత్తుత్తి’ కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలు... ఎన్టీఆర్ జిల్లాలో సీసీఐ ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జగ్గయ్యపేట, మైల వరం నియోజకవర్గంలోని మైలవరం, ఏ కొండూరు, తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కనీస మద్దతు ధరను క్వింటాకు నాణ్యతను బట్టి రూ.7,710 నుంచి రూ. 8,110గా నిర్ణయించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ఒక్క దానిలో కూడా పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయడంలేదు. దళారుల సహకారంతో పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేయించి సీసీఐ అధికారులు లబ్ధి పొందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు పత్తిని దళారుల వద్ద అమ్ముకోవద్దని సీసీఐ ద్వారా పత్తిని విక్రయించాలని అధికారపార్టీ నేతలు రైతులతో చెబుతున్నారు. సీసీఐ అధికారులు కేవలం ప్రజా ప్రతినిధుల దృష్టికి మరల్చేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణాలు హాస్యాస్పదం.. కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయకపోవటంపై సీసీఐ అధికారులు హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్నారు. కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన పత్తిని గుంటూరులోని మిల్లుల వద్దకు రవాణా చేసేందుకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ టెండర్లు పిలిచామని, ఆ టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవటంతో పత్తిని కొనుగోలు చేయలేకపోతున్నామని కుంటి సాకులు చెబుతున్నారు. అయితే టెండర్ల ప్రక్రియ ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉన్నా కాని సీసీఐ అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీని ద్వారా తమను అసహానికి గురిచేసి.. దళారులను ఆశ్రయించేలా చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. దళారుల నుంచి పత్తి కొనుగోలు చేయటం ద్వారా సీసీఐ అధికారులు ట్రాన్స్పోర్టు కిరాయిని దోచుకుంటున్నారు. రైతుల వద్ద ఉన్న పత్తికి దళారులు క్వింటాకు రూ. 4వేల నుంచి రూ. 5వేలు ధరను మాత్రమే ఇచ్చి దోచుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని రైతులు మొత్తం 87,908 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. అయితే తుపా ను ప్రభావంతో కురిసిన వర్షాలకు కొంత మేర పత్తి పంట దెబ్బతింది. గతంలో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి రాగా.. ఈ ఏడాది 5 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చిందని రైతులు అంటున్నారు. ఈ లెక్కన 4,39,540 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. కానీ ప్రభుత్వం సీసీఐ ద్వారా కేవలం 400 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి, ఏదో గొప్పపని చేసినట్లు ప్రకటనలు గుప్పిస్తోంది. కేంద్రాలు ప్రారంభించినా.. పంట కొనుగోలు చేయని సీసీఐ అడ్డగోలుగా దోచుకుంటున్న దళారులు వారికే కొమ్ము కాస్తోన్న సీసీఐ పట్టించుకోని చంద్రబాబు సర్కారు ఎన్టీఆర్ జిల్లాలో 87,908 ఎకరాల్లో పత్తి సాగు చంద్రబాబు సర్కారు పత్తి రైతు సమస్యలపై దృష్టి సారించడం లేదు. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు రైతుల నుంచి పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని పిలిపించారు. కానీ వారు మాత్రం ప్రజా ప్రతినిధుల మాటను లెక్క చేయకుండా పాత పాటే పాడుతున్నారు. రవాణా టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొనుగోలు కేంద్రాల నుంచి పత్తిని కొంటామని చెబుతున్నారు. అయితే నిర్ధిష్టమైన తేదీని ప్రకటించలేకపోతున్నారు. రైతులు మాత్రం ఈ ఏడాది పత్తికి నాణ్యతతో సంబంధం లేకుండా పూర్తి మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. -
నిత్యాన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి మంగళవారం పలువురు భక్తులు విరా ళాలు సమర్పించారు. బెజవాడ సత్యనారాయణపురానికి చెందిన కె.రవికుమార్ కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేసింది. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీకి చెందిన రాలీ గణపతిరావు, లీల దంపతులు శిరీష, విశాల్, ఆద్య, దినేష్, యశ్వంత్ పేరిట రూ.1,00,116 విరా ళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. మచిలీపట్నం అర్బన్: యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) వ్యక్తులకు మాత్రమే కాకుండా సమాజానికే పెద్ద ఆరోగ్య సవాలుగా మారిందని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏఎంఆర్ వారోత్సవాల పోస్టర్లు, బ్యానర్లను మంగళవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అనవసరంగా మందులు వాడటం ఏఎంఆర్కు ప్రధాన కారణమని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు మాత్రమే మందులు తీసుకోవాలని, హైజీన్, పరిశుభ్రత చర్యలను పాటించాలని సూచించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ పి.యుగంధర్ మాట్లాడుతూ.. ఏఎంఆర్ కారణంగా ఇన్ఫెక్షన్ల చికిత్స కష్టతరం అవడంతో పాటు మరణాల రిస్క్ పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రపంచ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ ఈ నెల 24 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎల్ఏటీఓ డాక్టర్ అంబటి వెంకట్రావు, డాక్టర్ గోపాలకష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల తయారీదారులకు నూతన సాంకేతికతపై హస్తకళల ఎగుమతి, ప్రోత్సాహక సంస్థ (ఈపీసీహెచ్), అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్ ఆధ్వ ర్యంలో శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. డిజైన్, టెక్నాలజీ డెవలప్మెంట్పై రెండు నెలలు శిక్షణ ఇస్తారు. వివిధ నూతన అంశాలతో కూడిన మెలకువలపై శిక్షణ ఇస్తారని ఈపీసీహెచ్ ఇండియా – దక్షి ణాది రాష్ట్రాల సంచాలకుడు కలవకొలను నాగ తులసీరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొమ్మల తయారీలో నైపుణ్యం పెంచుకుని అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఎగుమతులు జరిగేలా తీర్చిదిద్దాలన్నారు. జౌళి మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణ లక్ష్మి మాట్లాడుతూ.. వివిధ రకాల బొమ్మల తయారీలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ అసిస్టెంట్ మేనేజర్ చినిమిల్లి దివాకర్, యేసు, డిజైనర్ ప్రాసంజిత్ మహంతి, పలువురు కళాకారులకు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): ప్రతిభావంతులైన విద్యార్థుల్లోని ఆలోచనాత్మక సామర్థ్యాలను వెలికితీయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న క్రీడాపోటీల వాల్పోస్టర్లను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. స్టెమ్ క్రీడా పోటీలు – 2026లను వీర్నాల బాలాజీ నేతృత్వంలో జనవరి 8, 9 తేదీల్లో సంక్రాంతి పండుగను పురస్కరించు కుని నిర్వహిస్తామని కలెక్టర్ఈ సందర్భంగా తెలిపారు. చెస్, క్విజ్, డిబేట్, మ్యాథ్ ఒలంపియాడ్, సైన్స్ ఒలంపియాడ్ వంటి విభాగాల్లో ఈ పోటీల్లో నిర్వహిస్తామన్నారు. -
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో అడుగులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో అడుగులేద్దామని, సమష్టి కృషితో పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లాను రోల్మోడల్గా తీర్చిదిద్దుదామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో జిల్లాకు సంబంధించి రూ.69 వేల కోట్లతో 100 ఎంఓయూలు కుదిరాయని తెలిపారు. వివిధ అనుమతులకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 6,037 దరఖాస్తులు రాగా 5,949 దరఖాస్తులు పరిష్కారమయ్యాయని చెప్పారు. వివిధ పారిశ్రామిక అభివృద్ధి విధానాల కింద 18 క్లెయిమ్లకు రూ.1.54 కోట్ల ప్రోత్సాహకాలకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, డీపీఓ పి.లావణ్యకుమారి, సాంఘిక సంక్షేమ అధికారి రమాదేవి, ఎల్డీఎం కె.ప్రియాంక, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, విఽవిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హై అలర్ట్
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లా28 మంది మావోయిస్టుల పట్టివేతతో ఉలిక్కిపడిన బెజవాడపెనమలూరు: యనమలకుదురులో వేంచేసిన శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారికి శాంతికల్యాణం నిర్వహించారు.మోపిదేవిలో వేంచేసిన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు.సాక్షి ప్రతినిధి, విజయవాడ: మావోయిస్టులు పట్ట్టుబడటంతో విజయవాడ ఉలిక్కిపడింది. నాలుగు చోట్ల ఆయుధాల డంప్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. నగర శివారులో ఉన్న కానూరు కొత్త ఆటోనగర్లో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, కృష్ణా జిల్లా పోలీసులు పక్కా సమాచారంతో మంగళవారం సోదాలు చేపట్టారు. ఛత్తీస్గఢ్కు చెందిన 28 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వారంతా కొత్త ఆటోనగర్లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని షెల్టర్గా చేసుకొని ఉండటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం విజయవాడ నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచారు. మావోయిస్టులు ఉండే అవకాశమున్న అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. నగరంలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉన్నారా? ఆయుధాల డంపులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పట్టుబడిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేస్తున్నారు. వీఐపీల భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఈ మేరకు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పట్టుబడిన మావోయిస్టులను టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఇంటెలిజెన్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. మావోయిస్టులు నగరానికి ఎలా వచ్చారు? వారు ఇక్కడ ఉండటానికి ఎవరు సాయం చేశా రనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. మావోయిస్టులు ఆశ్రయం పొందేందుకు విజయ వాడనే ఎందుకు ఎంచుకున్నారనే కోణంలో కూడా ఆరాతీస్తున్నారు. మావోయిస్టులు ఆయుధాలతో షెల్టర్ జోన్కు రారు. కేవలం ఆశ్రయం మాత్రమే పొందుతారు. అయితే ఆయుధాల డంపులు సైతం ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఈ నేపథ్యంలో ఎవరినైనా లక్ష్యంగా చేసేందుకు ఇక్కడ మకాం వేశారా అనే అనుమానం సైతం వ్యక్తం అవుతోంది. గతంలోనూ షెల్టర్ జోనే.. 40, 50 ఏళ్ల క్రితం బెజవాడ నక్సలైట్లకు షెల్టర్ జోన్గా ఉండేది. అప్పట్లో విజయవాడ శివారు ప్రాంతాలైన కృష్ణలంక, విద్యాధరపురం, క్రీస్తురాజపురం, మొగల్రాజపురం కొండ ప్రాంతాలు వారికి స్థావరాలుగా ఉండేవి. తొలుత విజయవాడలో 1990–92 ప్రాంతంలో కసూర్తిబాయి పేటలో ప్రజాకోర్టు నిర్వహించి ఒకరి కాళ్లు నరికేశారు. కృష్ణలంకలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఇద్దరిని హత మార్చి వారి శవాలను బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో పడేశారు. నక్సలైట్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య ఇక్కడే షెల్టర్ తీసుకున్నారు. సున్నపు బట్టీల సెంటర్ అప్పట్లో నక్సలైట్లకు కీలక స్థావరంగా ఉండేది. వారు భూపోరాటాలు చేసినట్లు నగర వాసులు గుర్తుచేసుకుంటున్నారు. ఆడపిల్లతో అనుచితంగా వ్యవహరించిన వారి ఆట కట్టించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం నుంచే చాలా మంది నాయకులుగా ఎదిగి నక్సలైట్ల ఉద్యమంలో పాల్గొన్నారని పలువురు పేర్కొంటున్నారు. అనారోగ్యం, గాయపడిన వారికి విజయవాడ కేంద్రంగానే చికిత్సలు చేసేవారని అంటున్నారు. గతంలో ఇక్కడ పట్టుబడిన వారిని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసినట్లుగా చెబుతున్నారు. 30 ఏళ్లుగా విజయవాడలో పోలీసుల యాక్టివిటీ పెరగడం, వ్యాపారాల పరంగా వృద్ధి చెందటం, ఉపాధి అవకాశాలు పెరగడంతో క్రమేపీ మావోయిస్టుల ఉనికి లేకుండా పోయింది. తాజాగా 28 మంది మావోయిస్టులు పట్టుబడటంతో నగరం ఉలిక్కి పడింది. కానూరు ఆటోనగర్లో భవనంలో మావోయి స్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతోనే దాడులు చేసి 28 మంది మావోలను అదుపులోకి తీసుకున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు విలేకరులకు తెలిపారు. వ్యూహం ప్రకారం దాడులు చేయటానికే మావోయిస్టులు వచ్చారని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు పలు నగరాలకు వచ్చారన్న సమాచారం ఉందని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారని వివరించారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి బృందాన్ని పట్టుకున్నామని తెలిపారు. కానూరు ప్రజలతో పాటు ఆటోనగర్లో పని చేస్తున్న కార్మికులు సైతం మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారని తెలిసి కంగారుపడ్డారు.మావోయిస్టుల పట్టివేత అనంతరం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ మండలంలోని రామవరప్పాడులో నలుగురు, మండల కేంద్రమైన గన్నవరం పరిసరాల్లో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. తమ సానుభూతిపరురాలైన ఓ మహిళ ద్వారా కానూరు న్యూ ఆటోనగర్లో మావోయిస్టులు భవనాన్ని అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది. గో సంరక్షణలో ప్రభుత్వం విఫలం -
ప్రైవేటు నిర్లక్ష్యం
ప్రాణాలు తీస్తున్న నుజ్జునుజ్జయిన కావేరి ట్రావెల్స్ బస్సుకంచికచర్ల: ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాలను బలితీసుకుంటోంది. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో ట్రావెల్స్ బస్సులు వరుసగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున కర్నూలు జిల్లా కల్లూరు మండలం చినటేకూరు వద్ద ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆ వాహనం మంటల్లో చిక్కుకుని 20 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం విదితమే. పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు గ్రామం వద్ద 2017 ఫిబ్రవరి 28వ తేదీన దివాకర్ ట్రావెల్స్ బస్సు రోడ్డు మధ్యలో ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లిన ప్రమాదంలో పదిమంది మృత్యువాత పడ్డారు. తాజాగా నందిగామ సమీపంలోని అనాసాగరం వద్ద మంగళవారం తెల్లవారుజామున మరో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు అనాసాగరం వద్ద సుగర్ లోడుతో వెళ్తున్న లారీని అతివేగంతో వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా, మరో ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అధిక వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎక్కువగా ప్రైవేటు బస్సులే ప్రమాదాలబారిన పడుతున్నాయి. ఈ బస్సులు గరిష్టంగా 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంగా రాకపోలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి నాలుగు గంటల్లోనే విజయవాడ చేరుతున్నాయి. నందిగా మలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్లే దాసరి ట్రావెల్ బస్సు ఎయిర్ పైపు కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా వద్ద లీకై ంది. పెద్ద శబ్దంతో బస్సు ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదే రోజు హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న బైక్ను, అనంతరం ట్యాంకర్ను ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అయితే కారులోని వారు క్షేమంగా బయటపడ్డారు. ఇటీవల మునగచర్ల వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గత ఏడాది 420 మంది, ఈ ఏడాది 328 మంది మృతి చెందారు. 1,200 మందికి పైగా గాయపడ్డారు. రాత్రి సమయాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీసులు తెల్లవారు జాము రెండు నుంచి ఐదు గంటల మధ్యలో స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాహనాలను ఆపి, డ్రైవర్లకు నీరు అందించి, ముఖం కడుక్కుని కొంత సేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ప్రయాణం కొనసాగించేలా చూస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటి వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నందిగామ, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ బ్లింకర్లను, రంబుల్ స్టిక్లను ఏర్పాటు చేశారు. నందిగామలోని అనాసాగరం ఫ్లై ఓవర్పై సుగర్ లోడుతో వెళ్తుతున్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైందని పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. కాళ్లు, చేతులు విరిగిన వారిని విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. మిగిలిన ప్రయాణికులను ప్రత్యామ్నాయ బస్సుల్లో వారి గమ్యస్థానాలకు తరలించామని తెలిపారు. -
భార్యను హత్య చేసిన భర్త
మంగళగిరి టౌన్: వేరే వ్యక్తితో కలిసి ఉంటున్న భార్యను భర్త గొంతునులిమి హత్య చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... పెనమలూరు మండలం పెదపులిపాకలో శంకరరెడ్డి తన భార్య లక్ష్మీపార్వతి (29)తో ఉంటున్నాడు. మిఠాయి కార్కానాలో మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఎనిమిది నెలల క్రితం మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అయిదు నెలల క్రితం మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని గ్రామానికి లక్ష్మీపార్వతి వచ్చింది. స్థానికంగా ఎలక్ట్రీషియన్గా పనిచేసే మహేష్తో పరిచయం ఏర్పడింది. మంగళగిరి మండలం పరిధిలోని యర్రబాలెంలో ఇద్దరు కలిసి నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న శంకరరెడ్డి మంగళవారం మధ్యాహ్నం లక్ష్మీపార్వతి నివాసానికి వెళ్లి గొడవ పడ్డాడు. పెద్దగా వాగ్వాదం జరిగింది. లక్ష్మీపార్వతి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లింది. శంకరరెడ్డి కూడా ఆమెను వెంబడించి లోపలికి వెళ్లి గడి పెట్టాడు. భార్య గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ సీఐ బ్రహ్మం సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని వైద్యశాలకు పంపారు. శంకరరెడ్డి పరారీలో ఉన్నాడని, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


