NTR district News
-
తాళం వేస్తే.. ఇల్లు ఖాళీ!
సెలవులకు ఊరెళ్లేవారు తస్మాత్ జాగ్రత్త! ● పగలు రెక్కీ చేసి, రాత్రి వేళ దొంగతనాలు చేస్తున్న నేరగాళ్లు ● విలాసాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న వైనం ● పోలీసుల అదుపులో వరుస చోరీల నిందితులు ● విజయవాడ కృష్ణలంక శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి ఈ నెల మొదటి వారంలో అయోధ్యకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి తాళం పగలకొట్టి ఉండటంతో ఉలిక్కిపడింది. బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని వాంబే కాలనీకి చెందిన పాత నేరస్తుడు ములకల నిరంజన్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీస్ కంట్రోల్ రూం : 112 ఏసీపీ క్రైమ్ : 9440627040 సీఐ క్రైమ్ : 8333993112 లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కోసం : 9440627040– ఎం. రాజారావు, అడిషనల్ డీసీపీ ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సమీప పోలీస్స్టేషన్లో సమాచారం ఇస్తే, లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తారు. ఇంట్లోని ఖరీదైన బంగారు నగలు, నగదును బ్యాంక్ లాకర్లో ఉంచి, అవసరమైనప్పుడు తీసుకోవాలి. ఇళ్లు అద్దెకు ఇచ్చే సమయంలో వారి పర్మినెంట్ అడ్రసు, వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వారి వద్దకు ఎవరైనా వస్తున్నారా, రాత్రి వేళల్లో వారి చర్యలను గమనించాలి. ఇంటి పరిసరాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసు స్టేషన్కు తెలియజేయాలి. రాత్రి వేళల్లో పడుకునే ముందు ఇంటి తలుపులు, కిటికీలు జాగ్రత్తగా వేసుకోవాలి. ఖరీదైన వస్తువులు కిటికీల వద్ద పెట్టవద్దు. ఇంటి తలుపులు, కిటికీలకు ఎలక్ట్రికల్ సెక్యురిటీ అలారమ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. అపరిచిత వ్యక్తులు ఇంటికి రాకుండా చూడాలి. కిటికీలో నుంచి మాట్లాడి పంపించి వేయాలి. పనిమనిషి, సెక్యూరిటీ, వాచ్మెన్ను నియమించే సమయంలో వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఇంటి మెయిన్గేటు, ప్రధాన గుమ్మం వద్ద, హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. -
తప్పని పడిగాపులు
తరగని క్యూలు.. డీజీల్ అందుబాటులో లేకపోవడంతో విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన నిలిచిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంధన సంక్షోభం రైతులు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. పెట్రోల్ అందుబాటులోకి వచ్చినా డీజిల్ కొరత ఇంకా వేధిస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు బస్సులు, కారు ట్రావెల్స్ నిర్వాహకులకు డీజిల్ షాక్ తగిలింది. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు కొన్ని బంకుల వద్ద క్యూ కట్టి దర్శనమిచ్చాయి. అక్కడక్కడ కొన్ని బంకులు తెరుచుకోలేదు. కొన్ని బంకుల యాజమాన్యం లోడ్ రావాల్సి ఉందని, ఈ నేపథ్యంలోనే మూసివేశామ ని వాహనదారులకు సమాధానమిస్తున్నారు. రెండు రోజులుగా వాహనాదారులు బంక్ల వద్ద ఇబ్బందులు పడుతూ వచ్చారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడంతో రద్దీ తగ్గింది. రైతుల కష్టాలు తీరేదెలా? జిల్లాలోని కొన్ని మండలాల్లో 20, 30 గ్రామాలకు ఒకటి రెండు పెట్రోల్ బంకులే అందుబాటులో ఉన్నాయి. అటువంటి చోట రైతులు అసౌకర్యానికి గురయ్యారు. ట్రాక్టర్లు, వరి, మొక్కజొన్న కోసే యంత్రాలు పొలాల్లో ఉంటే సహాయకులు బైక్లపై క్యాన్లతో డీజిల్ అందిస్తూ ఉంటారు. దగ్గర్లో బంకులు లేక పోవడం... ఇవాళ కూడా కొన్ని బంకులు పరిమితులు విధించడంతో రైతుల అవసరాలకు సరిపడా అందలేదని చెబుతున్నారు. ఇక ఆటో వాలాలు దూర ప్రాంత కిరాయిలు రద్దు చేసుకున్నారు. రూ. 200, రూ. 300కే డీజిల్ పోశారని చెబుతున్నారు. ట్రావెల్స్ బస్సుల క్యూ.. నగరంలో హనుమాన్పేట ప్రైవేటు ట్రావెల్స్కు అడ్డా. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులతో ఉదయాన్నే బస్సులు నగరానికి చేరుకుంటాయి. సాయంత్రం ప్రయాణికులతో తిరుగు ప్రయాణం అవుతాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు డీజిల్ కోసం క్యూ కట్టాయి. రాత్రిళ్లు వందల కిలో మీటర్లు ప్రయాణం చేసి వచ్చామని, పగలు నిద్ర పోకుండా డీజిల్ కోసం క్యూలో బస్సులు నిలుపుకోవాల్సి వచ్చిందని డ్రైవర్లు వాపోయారు. జిల్లాలో పలు చోట్ల బంకులు మూసి ఉంచారు. వాహనదారులు అడిగితే లోడ్కు డబ్బులు కట్టామని, లోడ్ వచ్చే వరకు పెట్రోల్, డీజిల్ పోయలేమని సమాధానం చెబుతున్నారు. ధర పెంచిన ప్రైవేటు బంక్లు.. జిల్లాలో ప్రైవేటు బంకులు ధరలు పెంచేశాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109.21 ఉండగా డీజిల్ రూ.97.07గా ఉంది. ప్రైవేటు బంకుల్లో లీటర్కు రూ.5 చొప్పున పెంచేశారు. ప్రైవేటు బంకుల్లో పెట్రోల్ రూ. 114.19కు చేరింది. అసలే ర్యాపిడో, ఓలా, ఊబర్ లతో పాటు ఫ్రీ బస్సుల వల్ల ఆటో కిరాయిలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఆటోకు అవసరమైన డీజిల్ కోసం పెట్రోల్ బంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎక్కడ డీజిల్ దొరుకుతుందో అర్థం కావటం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కేవలం రూ. 200 డీజిల్ మాత్రమే పోస్తున్నారు. దీనివల్ల బేరాలను వదులు కోవాల్సి వస్తోంది. – ఆర్. కృష్ణ, ఆటో డ్రైవర్కుదేలవుతున్న రవాణా వ్యవస్థ ఆయిల్ లోడ్ రాకపోవడంతో తెరుచుకోని బంక్లు గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఆటోలు, కార్లకు పరిమితులు ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లపై పెట్రో కష్టాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులను ఆదుకోవాలి.. ఆటో కార్మికులు ఇబ్బంది పడకుండా డీజిల్, పెట్రోల్ ప్రత్యేకంగా అందించేలా చర్యలు తీసుకోవాలి. – డి. నాయుడు ఆటో డ్రైవర్ -
ఇది సర్కారు తెచ్చిన సంక్షోభం
పెట్రోల్, డీజిల్ కొరత చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతే విజయవాడ భవానీపురంలోని ఓ బంకు వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి వెలంపల్లి విజయవాడ ధర్నా చౌక్ వద్ద మినీ వ్యాన్ను తాడుతో లాగుతూ నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు విజయవాడ మహానాడు రోడ్డు సిగ్నల్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ ఎదుట నిరసన తెలుపుతున్న దేవినేని అవినాష్, ఆటోడ్రైవర్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇంధన కొరత ఏర్పడిందని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. ప్రజలు నమ్మి కూటమికి ఓట్లేస్తే డీజిల్, ఎరువుల కోసం రైతులను, పెన్షన్ల కోసం వృద్ధులను, రేషన్, గ్యాస్ కోసం మహిళలను రోడ్డెక్కించిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం పెట్రోల్ బంక్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తాళ్లతో ఆటోలను లాగుతూ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో దేవినేని రాజశేఖర్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. అవినాష్ తాడుతో ఆటో లాగి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని, ప్రజలకు పెట్రోల్, డీజిల్ కూడా అందించలేకపోతోందన్నారు. సర్కారు వైఫల్యాన్ని జనాలపై రుద్దే ప్రయత్నం చేస్తుందన్నారు. ● విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ధర్నా చౌక్ వద్ద మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వాహనానికి తాళ్లు కట్టి లాగుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి విజన్ లేదన్నారు. అన్ని విషయాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భవానీపురం బ్యాంక్ సెంటర్ వద్ద పెట్రోల్ బంక్ను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ 70శాతం బంకుల్లో నో స్టాక్ బోర్డు కనిపిస్తోందన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అన్నీ ఉన్నాయంటూ అబద్దాలు చెబుతోందన్నారు. ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కు అయ్యిందన్నారు. ధరలు పెంచేందుకు కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. ● తిరువూరు, జగ్గయ్యపేటలో ఆయా నియోజక వర్గాల ఇన్చార్జిలు నలగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వైఎస్సార్ సీపీ నాయకులు అన్ని వర్గాలను రోడ్డున పడేసిందంటూ ఆవేదన ఇంధన కొరతపై జిల్లా వ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసన -
ఉత్సాహంగా చెస్ టోర్నీ
ఉయ్యూరు: ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం రాష్ట్ర 4వ మహాసభలు మంగళవారంతో ముగిశాయి. ఉయ్యూరులోని వీఆర్కేఎం పాఠశాల ఆడిటోరియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్రెడ్డి హాజరై రైతులు, కౌలురైతుల సంక్షేమం, హక్కుల సాధన కోసం చేపట్టాల్సిన అంశాలపై సూచనలు చేశారు. పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలమన్నారు. అనంతరం మహాసభ నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 45మంది సభ్యులతో కూడిన కమి టీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.బలరాం, కార్యదర్శిగా మాగంటి హరిబాబు, కోశాధికారిగా వై.రాధాకృష్ణ, ఉపాధ్యక్షులుగా వి.శ్రీనివాసరావు, రాజబాబు, రామాంజనేయులు, లక్ష్మణస్వామితో కూడిన కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కౌలురైతుల పోరాటాలపై పలు తీర్మానాలను ఆమోదించారు. హనుమాన్జంక్షన్ రూరల్: హనుమజ్జయంతి వేడుకలు మే 7 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయని అభయాంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు తెలిపారు. హనుమాన్ జంక్షన్లోని ఆలయ ప్రాంగణంలో హనుమజ్జయంతి ఉత్సవాల పోస్టర్లు, కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి రోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తామని, ఆలయ అధ్యాత్మిక వేదికపై భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ పావులూరి రామారావు, ఆలయ ప్రధాన అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యులు, పుర ప్రముఖులు, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ట్రాక్ల నిర్వహణ కారణంగా విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–తిరుపతి(18505) రైలును ఈ నెల 29న, తిరుపతి–విశాఖపట్నం (18506) రైలును ఈ నెల 30న తిరుచానూరు –తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 28న చర్లపల్లి–తిరుచిరాపల్లి(07615) రైలు పాకాలా, చిత్తూరుకు బదులుగా రేణి గుంట, మెల్పక్కం క్యాబిన్, కాట్పాడి మీదుగా దారి మళ్లించారు. తిరువన్నమలై–నర్సాపూర్ (07220) రైలు ఈ నెల 30న చిత్తూరు, పాకాలా, తిరుపతికి బదులుగా కాట్పాడి, మెల్పక్కం క్యాబిన్, రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. మే ఒకటో తేదీన కన్యాకుమారి–ఎస్ఎంవీడీ కత్రా (16317) రైలును చిత్తూరు, తిరుపతికి బదులుగా కాట్పాడి, మెల్పక్కం క్యాబిన్, రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. రామేశ్వరం –ఓఖా తిరుపతికి బదులుగా కాట్పాడి, మెల్పక్కం క్యాబిన్, రేణిగుంట మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. -
పల్లెల్లో గుప్పుమంటున్న గంజాయి
మైలవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన నాటి నుంచి గంజాయి పల్లెపల్లెకు పాకింది. మత్తుకు బానిసలైన యువత గంజాయి తాగడంతో పాటు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్న ఘటనలు విస్మయానికి గురి చేస్తు న్నాయి. పట్టణ, నగర ప్రాంతాలతో పాటు పల్లెల్లో సైతం గంజాయి చేరడం నిఘా వైఫల్యానికి అద్దం పడుతోంది. గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు పోలీసులకు పట్టుబడిన ఘటన మైలవరంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బదాస్ లోహోర, గుప్తా హారిజస్ జి.కొండూరు మండలం చేగిరెడ్డిపాడు శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల్లో కొద్ది కాలంగా పనిచేస్తున్నారు. వీరిద్దరితో పాటు ఏలూరు జిల్లా, నూజివీడుకు చెందిన చింతం విజయ్ బాబు, షేక్ మెహర్బాబా, మైలవరానికి చెందిన షేక్ ఆసిఫ్, వెల్వడం గ్రామానికి చెందిన తన్నీరు గోపీకృష్ణ ఒక ముఠాగా ఏర్ప డి మైలవరం, తిరువూరు, నూజి వీడు, ప్రాంతాల్లో గంజాయి విక్రయి స్తున్నారు. బదాస్ లోహోర, గుప్తా హారిజస్ ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి మైలవరం పాత ఎన్ఎస్పీ క్వార్టర్స్ వద్ద ముఠాలోని మిగతా నలుగురుకి అందజేస్తుండగా మంగళవారం ఉదయం పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు ఉన్న మరొక వ్యక్తి పరారయ్యాడు. ఆరుగురు నిందితులు గతంలో గంజాయి కేసులలో పట్టుబడిన వారేనని పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఏసీపీ వై.ప్రసాదరావు ఆధ్వర్యంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సీఐ కె.కిషోర్ బాబు, ఎస్ఐలు కె.సుధాకర్, గిరిసాయి, సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల పట్టుబడిన ఘటనలు ● ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కాచవరం గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన గల ఓపెన్ ప్లాట్లలో ఖాళీ ప్రదేశంలో ఉన్న ముగ్గురు యువకుల నుంచి సుమారు ఆరు కిలోల గంజాయిని ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ నెల నాలుగో తేదీన స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముగ్గురు యువకుల్లో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఈ ఏడాది మార్చిలో కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల రోడ్డులో గంజాయి పొట్లాలు విక్రయిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరిలో కంచికచర్ల మండలంలోని పరిటాలలో ఆరుగురు వ్యక్తుల నుంచి మూడు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్పై దండయాత్రలో భాగంగా ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం ముత్తవరపు కల్యాణ మండపంలో పోలీసులు 95 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 25 మంది గంజాయి తాగినట్లు తేలింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. విజయవాడలో పట్టుబడ్డ మరో ముఠా అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): మరో గంజాయి ముఠా విజయవాడ పోలీసులకు పట్టుబడింది. సింగ్నగర్ పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోని అపార్ట్మెంట్ల ప్రాంతాలను స్థావరాలుగా మార్చుకొని గంజాయి విక్రయిస్తున్న మహిళతో పాటు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పోలీసుల కథనం మేరకు.. న్యూరాజరాజేశ్వరీపేటలోని కేజీఎఫ్ అపార్ట్ మెంట్ల వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా గుమ్మడి సంజయ్, నాగభూషణం, జాన్సీ, లక్ష్మీనారాయణ, అహ్మద్ నావేల్, అన్సార్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా కిలోన్నర గంజాయి దొరికింది. వీరందరిపై గతంలో పలు కేసులు ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వారం రోజుల వ్యవధిలోనే సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడు గంజాయి ముఠాలు పట్టుబడటం గమనార్హం. ఈ మూడు ముఠాల నుంచి మొత్తం పదిన్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, 15 మందిని పోలీసులు అరెస్ట్చేశారు. మైలవరంలో ఆరుగురు గంజాయి విక్రేతలు అరెస్ట్ నిందితుల నుంచి మూడు కిలోల గంజాయి స్వాధీనం వరుసగా పట్టుబడుతున్న గంజాయి ముఠా సభ్యులు -
వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు డిస్ట్రిక్స్ స్పోర్ట్స్ అథారిటీ, డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిచే వేసవి శిక్షణ శిబిరాలను ఎన్టీఆర్ జిల్లాలోని బాల బాలికలు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్డీఓ కె.కోటేశ్వరరావు సూచించారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణ లోని డీఎస్డీఓ కార్యాలయంలో ఆయన మంగ ళవారం విలేకరులతో మాట్లాడారు. ఇందిరాగాంధీ స్టేడియంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొత్తం 50 శిబిరాలు నిర్వహిస్తామన్నారు. 27 క్రీడల్లో శిక్షణ ఇస్తామని వివరించారు. ఎనిమిది నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలు శిక్షణ శిబివరాలను సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. జిల్లా యూత్ వేల్ఫేర్ ఆఫీసర్ కె.రమేష్ పాల్గొన్నారు. అవసరాలకు అందుబాటులో ఇంధనం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో వినియోగదారుల అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. జిల్లాకు నిత్యం ఎనిమిది లక్షల లీటర్ల డీజిల్, ఆరు లక్షల లీటర్ల పెట్రోల్ సరఫరా అవుతోందన్నారు. పెట్రోల్ డీజిల్ సరఫరాపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో మంగళవారం ఉదయం కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిడమానూరు, ఎనికేపాడు, రామవరప్పాడులోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లా డుతూ.. ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇంధన సరఫరాపై ఎలాంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్ నంబర్ 91549 70454లో సంప్రదించాలని కోరారు. ఆయిల్ బంకుల పర్యవేక్షణలో కలెక్టర్ వెంట విజయవాడ రూరల్ తహసీల్దార్ బి.సుగుణ, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన గుడ్లవల్లేరు: మండల కేంద్రమైన గుడ్లవల్లేరులో మే ఒకటో తేదీన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటిస్తారని, పకడ్బందీ ఏర్పాట్ల చేయాలని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. ఆయన మంగళవారం గుడ్లవల్లేరులో పర్యటించారు. ఫార్మా కంపెనీ అధినేత జాస్తి వెంకట్ రూ.15 కోట్లతో నిర్మించిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను సీఎం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బాలాజీతో పాటు ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హెలీప్యాడ్ నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ భవనాన్ని సందర్శించారు. గుడివాడ ఇన్చార్జి ఆర్డీఓ పోతురాజు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, మచిలీపట్నం ఆర్డీఓ సాంబశివరావు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, బీసీ సంక్షేమ సాధికారత అధికారి రమేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీమన్నారాయణుడి సేవలో వైఎస్సార్ సీపీ నేతలు
కోడూరు: మండలంలోని ఉల్లిపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామిని వైఎస్సార్ సీపీ నేతలు మంగళవారం దర్శించుకున్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్బాబు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పండితులు వారికి పూర్ణకుంభతో స్వాగతం పలికారు. ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిజీ వారికి ఆలయ విశిష్టను వివరించారు. అనంతరం 13 యాగశాలల్లో జరుగుతున్న హోమ క్రతువును నేతలు తిలకించారు. వేదికపై అష్టాక్షరీ స్వామిజీ అధ్యక్షతన జరిగిన సభలో ప్రసంగించారు. త్వరలో ఈ క్షేత్రాన్ని తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శిస్తారని చెప్పారు. అనంతరం అష్టాక్షరీ స్వామిజీని వెలంపల్లి, మల్లాది, సింహాద్రి సత్కరించారు. -
జీజీహెచ్లో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ రెండు నెలల పెండింగ్ వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు రెండో రోజైన మంగళవారం కూడా విధులు బహిష్కరించి ఆందో ళన కొనసాగించారు. ఆస్పత్రి ప్రాంగణంలోనే సోమవారం రాత్రి కూడా కార్మికులు నిరసన శిబిరంలోనే ఉన్నారు. తమకు జీతాలు ఎప్పుడు చెల్లించేదీ రాత పూర్వక హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. తమకు జీతాలు రాక పోవడంతో ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, పొదుపు రుణాలు చెల్లించలేక పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వాస్పత్రిలో పాలు, పాత ఆస్పత్రి, దంత వైద్య కళాశాల, సిద్ధార్థ వైద్య కళాశాలల్లో పనిచేసే కార్మికులంతా ఈ నిరసనలో పాల్గొన్నారు. కార్మికులు విధులు బహిష్కరించడంతో మంగళవారం చేయాల్సిన సర్జరీలను వాయిదా వేశారు. ఒక దశలో ఉద్రిక్తత విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న కార్మికులు సూపరింటెండెంట్ కార్యాలయం ముట్టడించేందుకు వెళ్లారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు మూకుమ్మడిగా సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లడానికి వీలులేదని సెంట్రల్ ఏసీపీ దామోదర్, మాచవరం ఇన్స్పెక్టర్ డి.వి. రమణ, పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో అక్కడే కొద్దిసేపు బైఠాయించారు. తమకు పెండింగ్ జీతాలతో పాటు, పీఎఫ్, ఈఎస్ఐ వివరాలు వెల్లడించాలన్నారు. కార్మికులకు సీఐటీయూ నేతలు అండగా నిలిచారు. మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం లబ్బీపేట(విజయవాడతూర్పు): మాతాశిశు మరణాలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం మాతృ, శిశు మరణాలపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ కె.వి.ఎన్. అనీల్కుమార్, ఎన్హెచ్ఎం రివ్యూ అధికారి డాక్టర్ సతీష్కుమార్, స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ రత్న ఫాక్సీ, జీజీహెచ్ స్పెషలిస్టు నిపుణులు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన ఆరు మాతృ మరణాలపై సమీక్షించారు. జగ్గయ్యపేటలో రెండు, వెలగలేరు, చంద్రాల, గోళ్లమూడి, గంపలగూడెంలలో ఒక్కో మాతృమరణం జరిగిందని డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, హై–రిస్క్ కేసులను ముందుగానే గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతీదేవి పాల్గొన్నారు. -
దుర్గగుడి ప్రాంగణంలో దారుణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే మహా మండపం ఆరో అంతస్తులోని మహిళల టాయిలెట్లలోకి ఓ యువకుడు ప్రవేశించాడు. టాయిలెట్కు వెళ్లిన వారిని గోడ ఎక్కి చూడటంతో లోపల ఉన్న ఇద్దరు మహిళలు కేకలు వేశారు. ఆలయ సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని వన్టౌన్ పోలీసులకు అప్పగించారు. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మహా మండపం నాలుగో అంతస్తులో సెక్యూరిటీ సిబ్బందితో ఆలయ ఈఓ, వన్టౌన్ పోలీసులు సమావేశమయ్యారు. అదే సమయంలో మహా మండపం ఆరో అంతస్తులోని టాయిలెట్లలోకి చిట్టినగర్ వాగు సెంటర్కు చెందిన మహేష్ ప్రవేశించాడు. కొద్ది నిమిషాల తర్వాత ఆలయంలో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వర్తిస్తున్న మహిళలు టాయిలెట్ల లోపలకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకునే తరుణంలో గోడపై నుంచి ఎవరో తమను చూస్తున్నట్లు గుర్తించారు. తలపైకి ఎత్తి చూసే సరికి మహేష్ కనిపించడంతో వారు కేకలు వేస్తూ బయటకు పరుగు పెట్టారు. సెక్యూరిటీ సిబ్బంది కేకలతో అక్కడికి చేరుకున్న ఆలయ సిబ్బంది టాయిలెట్లలో ఉన్న మహేష్కు దేహశుద్ధి చేసి నాల్గో అంతస్తులో ఉన్న పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ యువకుడి వన్టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. అతని ఫోన్ను పోలీసులు తనిఖీ చేస్తున్నారని సమాచారం. ఈ ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. -
వేసవి శిబిరాలు.. ప్రతిభకు వేదికలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వేసవి వచ్చేసింది. పరీక్షలు అన్నీ ముగి యడంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కొంత మంది చిన్నారులు వేసవి సెలవులకు అమ్మమ్మ, తాతయ్య, బంధువుల ఇళ్లకు వెళ్లి సెలవులను సరదాగా గడిపి, ఆత్మీయత, అనురాగాలు నింపుకొని వస్తుంటారు. ఇంకొందరు విజ్ఞాన, విహార యాత్రలకు వెళ్తారు. మరి కొందరు విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాల్లో చేరి తమ నైపుణ్యాలను మరింత పెంచుకుంటారు. విద్య, క్రీడలు, యోగ, చిత్రలేఖనం వంటి శిబిరాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పలు సంస్థలు ఉచితంగా, మరి కొన్ని నామమాత్రపు ఫీజుతో వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏ శిబిరం ఎక్కడ జరుగుతోందో తెలుసుకుందాం పదండి.. శిక్షణ శిబిరాల వివరాలు ఇవీ.. ● విజయవాడ అజిత్సింగ్నగర్లోని వివేకానంద సెంటినరీ హైస్కూల్ ఆవరణలో కరాటే, చదరంగం, కర్రసాము, సంగీతం, స్పోకెన్ ఇంగ్లిష్, తెలుగు వెలుగు, కూచి పూడి నృత్యం, భగవద్గీత శ్లోకాలు, హిందీ పరిచయం, డ్రాయింగ్, కంప్యూటర్ కోర్సుల్లో వేసవి శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. వివరాలకు 85002 89429 సెల్ నంబరులో సంప్రదించొచ్చు. ● మొగల్రాజపురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల ఆవరణలో బ్యాడ్మింటన్, యోగా, జిమ్, ఏరోబిక్స్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. వివరాలకు 63041 90057, 99599 59530 సెల్ నంబర్లను సంప్రదించాలి. ● విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు వివిధ క్రీడాంశాల్లో వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. గాంధీనగర్, గురునానక్ కాలనీ, చిట్టినగర్లో కె.ఎల్.రావు స్మిమ్మింగ్ పూల్స్లో స్మిమ్మింగ్లో శిక్షణ ఇస్తారు. బందరురోడ్డులో దండమూడి రాజగోపాలరావు, పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియాల్లో బ్యాడ్మింటన్, సత్యనారాయణపురంలోని జి.వి.ఎస్.శాస్త్రి ఉద్యానవనం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం, భవానీ పురంలోని రోజ్ గార్డెన్ పార్కు ఆవరణలో స్కేటింగ్, పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో యోగాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఆయా కేంద్రాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. ● బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని ఈ–బ్లాక్లో ఉన్న అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం 5.30 నుంచి ఏడు గంటల వరకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాలకు 77318 77444 సెల్ నంబరులో సంప్రదించాలి. ● బందరురోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం (ఎంబీవీకే)లో స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ తరగతులు నిర్వ హిస్తున్నారు. వివరాలకు 94900 98042 సెల్ నంబరులో స్పందించాలి. ● పటమటలోని సర్వోత్తమ గ్రంథాలయ ఆధ్వర్యంలో చిన్నారులకు విజ్ఞానదాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలనే ఉద్దే శంతో లిటిల్ రీడింగ్ చాంప్–2026 పేరుతో పలు కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తు న్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు గ్రంథాలయానికి వచ్చి 100 గంటలకు పైగా పుస్తకం పఠనం చేసిన వారికి బహుమతులను అందజేస్తారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు టాయ్ లైబ్రరీ పేరుతో విద్యార్థుల్లో ఉచ్చారణ మెరుగు పరచడానికి పుస్తకాల్లోని అంశాలను అందరికి వినబడేలా చదవడం, భావ నైపుణ్యాలు పెంపొందించడానికి కథలు చెప్పడం, కథలు రాయడం, వంటి అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తారు. ● మొగల్రాజపురంలోని రావిచెట్టు సెంటర్లో ఉన్న జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో విద్యుత్ వాహన సర్వీసింగ్, రిపేరింగ్, అసెంబ్లింగ్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాలకు 0866 – 2470420 ఫోన్ నంబరులో సంప్రదించాలి. ● మే మూడు నుంచి జూన్ రెండో తేదీ వరకు కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ కోచింగ్ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఎనిమిది నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు బాలబాలికలు మాత్రమే అర్హులు. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం సీ–బ్లాక్లో ఉన్న కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. విజయవాడ లోని సిద్ధార్థ మెడికల్ కళాశాల మైదానంలో శిక్షణ పొందాలనుకునేవారు 91779 91616, అజిత్సింగ్నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో శిక్షణ పొందాలనుకునేవారు 93934 44279, జగ్గయ్యపేటలో శిక్షణ పొందాలనుకునే వారు 93469 68443, నూజివీడులో శిక్షణ పొందాలనుకునేవారు 73863 47777 నంబర్లలో సంప్రదించాలి. ● కృష్ణాజిల్లా క్రీడాభివృద్థి సంస్థ ఆధ్వర్యంలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు ఎనిమిది నుంచి 16 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంతో పాటుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ క్రీడాంశాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్లను నిర్వహించనున్నారు. -
జర్నలిస్టుల రక్షణకు చట్టం చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తేవాలని ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట పత్రికా విలేకరి జగన్మోహన్రెడ్డిని కిరాతకంగా హత్య చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హత్యను నిరసిస్తూ మంగళవారం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. చావా రవి మాట్లాడుతూ.. గంధం మాఫియాపై వరుస కథనాలు రాయడాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు జగన్మోహన్రెడ్డిని హత్య చేశారన్నారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు జర్నలిస్టుల రక్షణ చట్టం తక్షణమే తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ, జర్నలిస్టు నాయకులు దారం వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, నారాయణ, సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
ఉయ్యూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బస్సు క్లీనరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 14 మంది గాయపడ్డారు. రమణ ట్రావెల్స్కు చెందిన బస్సు యానాం నుంచి 33 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరింది. ఉయ్యూరులోని జియో పెట్రోలు బంకు సమీపంలో చేపల లోడుతో ఆగి ఉన్న లారీని అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సు వెనుకగా వచ్చి ఢీకొంది. బస్సు ముందు భాగం నుజ్జునజ్జయింది. బస్సు క్లీనరు తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం సంత చెరువు మార్కెట్ చెందిన ఎరబాల సూర్యచంద్రశేఖర్ (20) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. డ్రైవరుతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన ప్రయాణికులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. తొమ్మిది మంది ప్రయాణి కులు విజయవాడలో, ఐదుగురు ప్రయాణికులు ఉయ్యూరులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్లీనరు సూర్యచంద్రశేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భీతిల్లిన ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యానాం నుంచి బయ లుదేరిన సమయం నుంచి డ్రైవరు అతి వేగంగానే బస్సును నడుపుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. కొత్త హైవే మీదుగా మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటాక జియో పెట్రోలు బంకు వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టడంతో వచ్చిన శబ్దానికి ప్రయాణికులు భీతిల్లారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ఏం జరిగిందో అర్థం కాక ప్రాణభయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఈ ప్రమాదాన్ని పెట్రోలు బంకులో పనిచేస్తున్న సిబ్బంది ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు గుర్తించి క్షతగాత్రులను బయటకు లాగటంలో సహాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.క్లీనరు మృతి, 14 మందికి గాయాలు -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026u8లో ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 7పెండింగ్ వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు రెండో రోజు కూడా విధులు బహిష్కరించి ఆందోళన కొనసాగించారు. జగ్గయ్యపేట: వేదాద్రిలోని యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి తిరుక్కల్యాణ మహోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామి వారి శేషవాహన సేవను నిర్వహించారు. -
మహిళలను కించపరిస్తే
పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు తీసుకునేందుకు సైతం పోలీసు అధికారులు భయపడుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు శాఖలను ఎంతలా దిగజార్చారో ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ నేతల భార్యలను ఉద్దేశించి ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై గతంలో ఫిర్యాదులు చేసినా పోలీసులు ఇంత వరకూ పట్టించుకోలేదు. దీంతో మరోసారి ఫిర్యాదు చేసేందుకు పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జిల్లా నేతలు నాయకులు సోమవారం పోలీస్ కమిషనరేట్కు వెళ్లారు. అయితే వారి నుంచి ఉన్నతాధికారులు ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో ఆ కార్యాలయంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు అందజేశారు. అనంతరం కార్యాలయం బయట పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థ బండారం బయటపడింది వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతల భార్యల గురించి ఏబీఎన్ రాధాకృష్ణ అగౌరవంగా మాట్లాడి కించపరిచాడని విమర్శించారు. ఏబీఎన్ చానల్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసినా, ఫిర్యాదులు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీస్ వ్యవస్థ బండారం బయటపడిందన్నారు. మహిళలను కించపరిచిన ఏబీఎన్ రాధాకృష్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాము ఫిర్యాదు చేస్తుంటే ఆ లెటర్ తీసుకోవటానికి కూడా భయపడుతున్నారని విస్మయం వ్యక్తంచేశారు. టీడీపీ నేతలకు పోలీసులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నిజంగా మహిళలు అంటే గౌరవం ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బూతు చానల్లో మహిళలపై విమర్శలు మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. బూతు చానల్లో సభ్య సమాజం తలదించుకునేలా తమ కుటుంబ సభ్యులైన మహిళలపై విమర్శలు చేశారని మండిపడ్డారు. ఇవే విమర్శలు వారి కుటుంబ సభ్యులపై చేసుకోగలరా అని ప్రశ్నించారు. ఈ విమర్శలను చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ సమ ర్థిస్తారా అని నిలదీశారు. చంద్రబాబుది రాక్షస ఆనందమని, అసభ్య పదజాలాన్ని ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. దీనిని తప్పు అని చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా దిగజారి వ్యవహరిస్తున్నారని, ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి రేపు తప్పక వస్తుందని హెచ్చరించారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పకపోతే ఏ రోజైనా తామే చెప్పిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏబీఎన్ రాధాకృష్ణ అంతలా బూతులు మాట్లాడుతున్నా చర్యలు తీసుకుండా చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్, మంత్రులు సమర్థ్ధిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, వైఎస్సార్ సీపీ జగ్గయ్య పేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, గుంటూరు పార్టీమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు. ఆయనపై ఫిర్యాదు తీసుకునేందుకు భయపడుతున్న పోలీసులు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు పొరపాటున చిన్న మాట మాట్లాడి, వెంటనే క్షమాపణ చెప్పినా జైల్లో వేశారని, మరి మహిళలను కించపరిచేలా మాట్లాడిన రాధాకృష్ణను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని గతంలోనూ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, దానిపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మళ్లీ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే తీసుకోవడానికి పోలీసులు భయపడుతున్నారని పేర్కొన్నారు. రాధాకృష్ణపై సాక్ష్యాధారాలు సహా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. మహిళలను కూటమి నేతలు ఇబ్బంది పెడుతున్నా చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శాప్ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్లు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడలపై ఆసక్తిని పెంపొందించేకు మేలో తమ సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్లు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఎ.రవి నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి తెలిపారు. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని శాప్ ప్రధాన కార్యాలయంలో రవి నాయుడు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది నుంచి 16 ఏళ్ల లోపు పిల్లల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందించి ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సమ్మర్ కోచింగ్ క్యాంప్లను నిర్వహిస్తా మని చెప్పారు. రాష్ట్రంలోని 423 మండలాల్లో 1,020 ప్రాంతాల్లో 55 క్రీడా విభాగాల్లో కోచింగ్ క్యాంప్లు జరుగుతాయని పేర్కొన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపుల నిర్వహణపై డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. క్యాంప్ల పనితీరును పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ల్లో అవసరమైన క్రీడా సామగ్రి కోనుగోలుకు నిధులను కేటాయించామని తెలిపారు. శాప్ ఏఓ వెంకట రమణ నాయక్ పాల్గొన్నారు. -
ఎన్టీటీపీఎస్ రీజనల్ కార్యవర్గం ఎన్నిక
ఇబ్రహీంపట్నం: ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోదుగు మోహనరావు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీటీపీఎస్ నూతన రీజనల్ కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. రీజనల్ అధ్యక్షుడిగా షేక్ సలీమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, ఉపాధ్యక్షులుగా సుబ్బారావు, పార్వతి, రత్నరావు, రీజనల్ కార్యదర్శిగా రవీంద్రకుమార్, సహాయ కార్యదర్శిగా రవికుమార్, సత్తిరాజు, ప్రవీణ్కుమార్, కోశాధికారిగా కిషోర్, పబ్లిసిటీ కార్యదర్శిగా ఏసుదాసును ఎన్నుకున్నారు. అనంతరం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సభ్యులు కార్మికుల సమస్యలపై పోరాటం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు మోహనరావు సూచించారు. -
ఇంధన ఇబ్బంద్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో డీజిల్, పెట్రోల్ కష్టాలు కొనసాగుతున్నాయి. రెండో రోజైన సోమవారం బంకుల వద్ద పెద్ద క్యూలైన్లు దర్శనమిచ్చాయి. గ్రామీణ ప్రాంతా ల్లోని బంకుల్లో డీజిల్ కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇంధన కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవం మరోలా ఉంది. ఇంధన కొరత రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. రైతుల అవసరాలకు సరిపడా డీజిల్ అందుబాటులో లేనిపరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్, కార్లు, హార్వెస్టర్లకు డీజిల్ పంపిణీలో కోత విధించారు. ఒక్కో ట్రాక్టర్కు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా డీజిల్ పంపిణీచేస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో తెరిచి ఉన్న ప్రతి బంకు వద్ద భారీ క్యూలైన్లు ఉన్నాయి. ఉదయం నుంచి రద్దీ కొనసాగుతోంది. దూరప్రాంత ప్రయాణాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారు పెట్రోల్ బంక్ల వద్దే గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంక్ల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులను నియమించారు. ప్రతి బంక్లోనూ నగదు మాత్రమే స్వీకరిస్తూ ఫోన్పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ చెల్లింపులకు స్వస్తి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అన్ని వర్గాలకు ఈ దుస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 321 బంకులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మొత్తం 321 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ బంకుల్లో రోజువారీ అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో లేదు. ఇంధనం లేక ఆదివారం మూత పడిన పలు బంకులు సోమవారం సైతం తెరుచుకోని పరిస్థితి నెలకొంది. బంకుల రోజు వారీ అవస రాల కంటే పది శాతం అదనంగా ఇంధనం అందుబాటులో ఉంచుతామని అధికారులు చెప్పినప్పటికీ ఎక్కడా ఆ పరిస్థితి లేదని ప్రజలు మండిపడుతున్నారు. మొక్కజొన్న, వరి కోతలు వివిధ దశల్లో ఉన్నాయి. వరి కోతకు యంత్రాలు, కల్లాల్లో నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు ట్రాక్టర్లు అవసరం. డీజిల్ కొరతతో ఈ యంత్రాలు నిలిచిపోయాయి. డీజిల్ కొరత కారణంగా రైతుల అవసరాలకు సరిపడా ఇంధనం సరఫరా చేయడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు మానుకుని బంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరాలకు మించి డీజిల్, పెట్రోల్ పోయించుకోవడంతో సమస్య ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఇంధన కొరతను అధికారులు అంగీకరించడం లేదు. తిరువూరు, పెనుగంచిప్రోలు, వత్సవాయి, వీరులపాడు, గంపలగూడెం మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొక్క జొన్న చివరి దశకు వచ్చింది. హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు సరిపడా ఇంధనం పోయడం లేదు. పెనుగంచిప్రోలులో ఏడు బంకులు ఉండగా కేవలం ఒక్క బంకులోనే డీజిల్ అందుబాటులో ఉంది. దీంతో రైతులు ఆ బంక్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆయిల్ క్యాన్లతో పెద్ద క్యూ ఏర్పాటు చేశారు. ఇక్కడ కారు, ట్రాక్టర్, హార్వెస్టర్లకు రూ.1000, ఆటోలకు రూ.200 విలువైన డీజిల్ కొడుతున్నారు. క్యాన్లు తీసుకెళ్లిన వారికి పది లీటర్ల చొప్పున డీజిల్ పోస్తున్నారు. ఇది ఏ మాత్రం సరిపోదని రైతులు ఆందోళన చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలోనూ అరకొరగానే డీజిల్ లభిస్తోంది. ఇక్కడ ట్రాక్టర్కు 20 లీటర్ల చొప్పున పోస్తున్నారు. గంపలగూ డెంలో ఓ బంక్ వద్ద మండుటెండలో రైతులు క్యాన్లతో డీజిల్ కోసం నిరీక్షించారు. తిరువూరులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ట్రాక్టర్లకు కూపన్లు అందజేస్తున్నారు. వత్సవాయి మండలంలో అందుబాటులో ఉన్న బంకుల్లో ట్రాక్టర్కు రూ.500 చొప్పున డీజిల్ పోస్తుండంతో రైతులు పనులు నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెడ్డిగూడెంలో ఓ బంక్ వద్ద ట్రాక్టర్లు క్యూ కట్టాయి. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో అక్వా రైతులు డీజిల్ కోసం ఓ బంక్ ఎదుట ఆందోళనకు దిగారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల బంకుల్లో ఇంధనం సరిపడా ఉంచా లని కోరుతున్నారు. విజయవాడ నగరంలో ఏ తెరిచి ఉన్న బంక్ వద్ద చూసినా భారీ క్యూలైన్లు దర్శనమి చ్చాయి. కొన్ని బంకులను రెండో రోజు సోమవారం కూడా తెరవలేదు. బందరు రోడ్డులోని ఐఓసీఎల్ పైలెట్ బంక్, సబ్ కలెక్టర్ కార్యాలయ పెట్రోల్ బంక్, పోలీసు ప్రెట్రోల్ బంకుల్లో ఉదయం నుంచి రద్దీ కనిపించింది. గంటల కొద్ది క్యూ కొనసాగింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోశారు. నగరాల్లో ట్రావెల్స్, ఆటోవాలాలు, హోల్ సేల్ మార్కెట్లో సరుకు రవాణా ఆటోలు, ఐషర్ , మెటల్, మట్టి రవాణా లారీలు బంకుల వద్ద క్యూ కట్టాయి. కొన్ని ప్రైవేటు బంకులు డీజిల్, పెట్రోల్ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుందోనన్న ఆందోళనలో కార్మికులు ఉన్నారు. విజయ వాడ కలెక్టరేట్ వద్ద ఆటో కార్మికులు ఇంధన కొరత తీర్చాలంటూ ఆటోలకు తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపారు. -
పీజీఆర్ఎస్కు 134 అర్జీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీలకు సరైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ జరిగింది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం జేసీ ఇలక్కియ మాట్లాడుతూ.. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మొత్తం 134 అర్జీలు అందాయన్నారు. వీటిలో శాఖల వారీగా ఎంఏయూడీకి 80, పోలీస్ శాఖ 30, పీఆర్ 19, హెల్త్ 8, రెవెన్యూ, ఏపీసీపీడీసీఎల్కు ఏడు చొప్పున, ఆర్డబ్ల్యూఎస్ ఐదు, విద్య, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులుకు నాలుగు చొప్పున, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ మూడు, ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్, సమన్వయ విభాగం (కలెక్టరేట్), దేవదాయ, ఎల్డీఎం, ఆర్టీసీ, పౌర సరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, డీఆర్డీఏ, మత్స్య, ఆహార భద్రత, ఐసీడీఎస్, అటవీ, కార్మిక, మెప్మా, గనులు, ఎకై ్సజ్, సాంఘిక సంక్షేమం శాఖలకు సంబంధించి మిగిలిన అర్జీలు అందాయి. విజయవాడ నగరంలో పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. టిడ్కో ఇళ్లు కేటాయించాలని, పేదలు నివాసం ఉంటున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని, రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని కోరారు. అంతకు ముందుకు కలెక్టరేట్ ఆవరణలో ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేపట్టారు. -
1న పమిడిముక్కల మండలంలో సీఎం పర్యటన
పామర్రు: మే ఒకటో తేదీన ముఖ్యమంత్రి చంద్ర బాబు పామర్రు నియోజకవర్గంలో పర్యటిస్తారని, సంబంధిత అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. సోమవారం ఉదయం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడుతో కలిసి పడిముక్కల మండలంలో కలెక్టర్ పర్యటించారు. మండలంలోని కపిలేశ్వరపురం వద్ద పొలాల్లో చేపట్టిన హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పమిడిముక్కల గ్రామంలో ప్రజా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తరువాత వీరంకి లాకులు వద్ద ఎన్టీఆర్ కాలనీలో పింఛన్ల లబ్ధిదారులు చాగంటిపాటి సాయి ప్రసన్న, గుర్రం జగదీశ్వరి, కట్ట సుబ్బమ్మ తదితరులతో మాట్లాడారు. ఈ పర్యటనలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఉయ్యూరు ఇన్చార్జి ఆర్డీఓ పి.డి.హరిహరనాథ్, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, పంచాయతీ రాజ్ ఎస్ఈ రమణరావు, డ్వామా పీడీ శివ ప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్, డీఎల్డీఓ రాజేష్, డీఎల్పీఓ సంపత్కుమారి తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దాడులు, వేఽధింపులకు గురైన మైనార్టీలు వెనకడుగు వేయక ధైర్యంగా ఫిర్యాదు చేయాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు మునవరి బేగం సూచించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆమె సోమవారం విజయవాడ వచ్చారు. గాంధీనగ ర్లోని ఫిల్మ్ చాంబర్లో మైనారిటీలతో ప్రత్యేకంగా సమావేశమై, ముఖాముఖీ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మైనార్టీలు తమ అభిప్రాయాలు, సమస్యలను వినతిపత్రం రూపంలో కమిషన్ సభ్యురాలికి అందజేశారు. ఈ సందర్భంగా మునవరి బేగం మాట్లాడుతూ.. మైనార్టీలపై దాడులు, వేధింపులకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకునేలా కమిషన్ పనిచేస్తోందన్నారు. అనంతరం నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాతీయ అధ్యక్షుడు జాన్ మస్క్ మాట్లాడుతూ.. మైనారిటీ వర్గాల అభ్యున్నతి, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జాతీయ మైనారిటీ కమిషన్ పర్యటిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గురు ద్వారా అధ్యక్షురాలు కరం వీర్కౌర్, ముస్లిం లీగ్ అధ్యక్షుడు బషీర్ అహ్మద్, నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.నవీన్కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎ.చింతయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ 30 శాతం ప్రకటించాలని కోరుతూ ధర్నా చౌక్లో ఫ్యాప్టో చేపట్టిన మూడు రోజుల నిరాహార దీక్షలు సోమవారంతో ముగిశాయి. మూడో రోజు నిరాహార దీక్ష శిబిరం నుంచి ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ జూన్ నెలలో చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మూడో రోజు దీక్షలను సీనియర్ నాయకుడు సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ చిరంజీవి మాట్లాడుతూ.. వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నదే తమ ప్రధాన డిమాండులని పేర్కొన్నారు. మే 31వ తేదీలోపు సమస్యలను పరిష్కరించకపోతే జూన్లో ప్రత్యక్ష కార్యాచరణకు ఫ్యాప్టో సిద్ధపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు ఎం. కృష్ణయ్య, ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్లు కె.నర హరి, కాకి ప్రకాష్రావు, సీహెచ్.రమేష్, సీహెచ్.వెంకటేశ్వర్లు, బుప్యూటీ సెక్రటరీ జనరళ్లు ఎన్.వెంకటేశ్వర్లు, కె.బసవలింగా రావు తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్ బంకులో కలెక్టర్, ఎస్పీ తనిఖీలు
గూడూరు: కృష్ణా జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరతపై ప్రజలు భయాందోళనలు చెంద వద్దని కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. మండల కేంద్రమైన గూడూరులో జాతీయ రహదారి వెంబడి ఉన్న పెట్రోల్ బంకును ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలసి కలెక్టర్ బాలాజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకు యాజమాన్యం, వాహనదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బంకులో ఆయిల్ సరఫరా నమోదు చేసే రిజిస్టర్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. వాస్తవానికి జిల్లాలో డీజిల్ కొరత లేదన్నారు. ఆదివారం సాధారణంగా డీజిల్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. యుద్ధం నేపథ్యంలో డీజిల్, పెట్రోలు దొరుకుతుందో లేదో అన్న భయాందోళనతో కొంత మంది అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారని వివరించారు. వాస్తవంగా వినియోగదారులకు అవసరమైనంత డీజిల్ అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు, మార్కెటింగ్ యజమానులందరితో మాట్లాడామని తెలి పారు. బంకుల్లో అవసరమైనంత డీజిల్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఎవరైనా అవసరానికి మించి డీజిల్, పెట్రోలు నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ మోహన్బాబు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, సీఐ అబ్దుల్ నబీ తదితరులు పాల్గొన్నారు. -
‘జలధార – జలహారతి’లో పూడికతీత పనులు
రెడ్డిగూడెం: ఎన్టీఆర్ జిల్లాలో జలధార – జలహారతిలో భాగంగా చెరువులు, కాలువల్లో పూడికతీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచి భూగర్భ జలాలను పరిరక్షిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేటలో ఊర చెరువు సప్లయ్ చానల్ పూడిక తీత పనులను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 339 చెరువులు ఉన్నాయని, వాటిలో నీటినిల్వ సామర్థ్యం, భూగర్భ జలాలు పెంచటానికి జలధార – జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. జిల్లాలో మినీ రిజర్వాయర్లు, డ్యాముల్లో పది టీఎంసీల సామర్థ్యం నీటిని నింపుతామన్నారు. జిల్లాలో ఎ.కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లో భూగర్భ జలాలు ఎనిమిది నుంచి 11 మీటర్ల లోతున ఉన్నాయని, వాటిని పెంచుకునేందుకు చర్యలు చేపట్టా మని పేర్కొన్నారు. జలధార – జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాను సశ్యశ్యామలం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.రాము, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ పార్థసారథి, తహసీల్దార్ జె.సుశీలాదేవి, రెడ్డిగూడెం ఎంపీడీఓ జె.ప్రభాకరరావు, ఇరిగేషన్ డీఈఈ, ఏఈలు, ఏపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో హెడ్కానిస్టేబుల్ దుర్మరణం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న హెడ్కానిస్టేబుల్ కొండపల్లి శ్రామికనగర్ వద్ద 30వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మరో ఐదు నిముషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన అతను మృతిచెందడంతో ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు కొండపల్లి ఎస్టీ కాలనీకి చెందిన మొగిలి ప్రభుకుమార్(56) వీరులపాడు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా ఆరు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో కొండపల్లి కొత్తగేటు సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్కు ఢీకొట్టాడు. ఈప్రమాదంలో రోడ్డుపై పడిన ప్రభుకుమార్ తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. 108 వాహనంలో విజయవాడ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృత్యువాత పడ్డారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇబ్రహీంపట్నం: ఈలప్రోలు చేపల చెరువుల వివాదంలో టీడీపీ నాయకులు అరాచకాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. గుంటుపల్లికి చెందిన ప్రజాప్రతినిధి అనుచరులు కంచికచర్లకు చెందిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ రామకృష్ణను రంగంలోకి దించి మత్స్యశాఖ అధికారులకు మామూళ్లు ఇవ్వాలని చెరువు లీజుదారుడు బలే లక్ష్మణరావుతో రూ.1.10 లక్షలు ఫోన్పే చేయించారు. ఆ తర్వాత గుంటుపల్లి టీడీపీ నాయకులు ఆ నగదును తమకు ఫోన్పే చేయించుకున్నారు. మీడియాను మేనేజ్ చేయాలని ఓ పీడీఎఫ్ పేపర్ రిపోర్టర్ను లీజుదారుల వద్దకు తీసుకెళ్లి ఇతను మండలానికి పెద్ద రిపోర్టర్ అని పరిచయం చేసి రెండు సార్లుగా రూ.40 వేలు ఫోన్పే చేయించుకున్నారు. తిరిగి ఆ నగదు రిపోర్టర్కు కొంత ఇచ్చి మిగిలింది ప్రజాప్రతినిధి అనుచరులు నొక్కేశారు. విద్యుత్ బిల్లు రూ.2 లక్షలు పెండింగ్ ఉందని అందుకే చేపల వాహనం అడ్డుకున్నామని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొల్లేరు వాసులు విద్యుత్ శాఖకు కట్టిన డిపాజిట్ రూ.2.60 లక్షలు ఉందని, మీటర్ రద్దు చేసుకుంటే ఆ నగదు బకాయి కింద జమ చేసుకుంటారని చెబుతున్నారు. చేపల చెరువు వ్యవహారంలో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తిరుపతమ్మ ఆలయంలో మార్పులకు శ్రీకారం
పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో నూతన మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. కొంతకాలంగా ఆలయంలో ప్లేట్ కనెక్షన్ పెరగటంతో హుండీల ఆదాయం తగ్గుతోందని అధికారులు భావించారు. దీనిలో భాగంగా ప్లేట్ కనెక్షన్ నియంత్రించటానికి చర్యలు చేపట్టారు. ప్లేట్ లేకుండా ఏక హారతి అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో హుండీల ద్వారా వచ్చే ఆదాయం ఇటీవల లెక్కింపులో 45 రోజులకు రూ.10 లక్షల వరకు పెరిగిందని అధికారులు అంటున్నారు. అయితే కేవలం ప్లేట్ కనెక్షన్ నివారణకు చర్యలు చేపట్టిన అధికారులు బహిరంగ వేలంలో ఆదాయం ఎందుకు తగ్గిందో దానిపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. తిరుమల మాదిరిగా భక్తులకు దర్శనం.. అమ్మవారి ఆలయంలో తిరుమలలో మాదిరిగా దర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేయటంపై భక్తులు సంతోషం వ్యక్తం వేస్తున్నారు. ఇప్పటి వరకు ఆలయంలో రూ.50 టికెట్, ఉచిత దర్శనం చేసుకునే భక్తులు దూరం నుంచి క్యూలో వచ్చి అంతరాలయంలోని అమ్మవారిని దర్శిచుకుంటూ ముందుకు వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసాలకు వచ్చి అమ్మవారిని కనులారా దర్శించుకునేందుకు సరైన సమయం కూడా దొరికేది కాదు. దీంతో భక్తులు ఎంతో నిరాశకు గురయ్యేవారు. దీనిని గమనించిన అధికారులు తిరుమల తరహాలో అంతరాలయం ఎదురుగా వచ్చి అమ్మవారిని దర్శించుకునేలా క్యూలైన్లో మార్పులు చేశారు. దీనివల్ల భక్తులు క్యూలైన్లో అమ్మదారిని అంతరాలయం వచ్చేంత వరకు ఎక్కువ సేపు అమ్మవారిని చూసే అవకాశం కలిగింది. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం.. అమ్మవారి దర్శన టికెట్లు తీసుకునే విధానాన్ని మరింత సులభతరం చేస్తూ దేవస్థాన అధికారులు సెల్ఫ్ సర్వీస్ కియోస్క్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. కరూర్ వైశ్యాబ్యాంక్ వారు 3 కియోస్క్ యంత్రాలను ఆలయానికి అందజేశారు. ఈయంత్రాల సాయంతో క్యూర్ కోడ్ను స్కాన్ చేసి అమ్మవారి దర్శనం టికెట్లుతో పాటు సేవలు, కేశఖండన, ఈ–హుండీ, ఆలయ సమాచారం తెలుసుకోవచ్చు. భక్తులు టికెట్లు కోసం బారులు తీరకుండా సులభంగా ఈయంత్రం సాయంతో టికెట్లు పొందవచ్చు. ఆదాయం పెంపుపై దృష్టి పెట్టిన అధికారులు అమ్మ దర్శనంలో మార్పులు -
ప్రభుత్వ వైఫల్యంతోనే పెట్రోల్, డీజిల్ కొరత
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం, అనాలోచిత విధానాలే కారణమన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. ఇంధన సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా సాధారణ ప్రజలు, ఉద్యోగులు, రైతులు, రవాణా రంగానికి చెందిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద క్యూలో నిలబడాల్సి వస్తోందని, ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదని, అప్పట్లో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా సమయంలో కూడా వైఎస్ జగన్ ధైర్యంగా, సమర్థవంతంగా పరిస్థితిని ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పెట్రోల్, డీజిల్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
నిబంధనలు పాటించకుంటే లీజ్ రద్దు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో వ్యాపారాలు సాగిస్తున్న వారు దేవస్థాన నియమ నిబంధనలను పాటించాలని లేకుంటే లీజ్ రద్దు చేస్తామని ఈవో శీనానాయక్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ప్రాంగణంలోని దుకాణదారులు, కాంట్రాక్టర్లు, లీజుదారులతో ఈవో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. దేవస్థానం నిర్ధేశించిన సమయాన్ని పాటించాలని ఆదేశించారు. ప్రతి దుకాణం ఎదుట ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని, అధిక ధరలకు విక్రయించినట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు. దుకాణాలు, కాంట్రాక్టర్ల వద్ద పని చేసే సిబ్బంది ఆధార్ కార్డులతో పాటు వారి ఫొటోలతో కూడిన ఐడీ కార్డులను తప్పనిసరిగా ధరించాలన్నారు. దుకాణదారుల మధ్య ఎటువంటి వివాదాలు, గొడవలు, పోలీసుల కేసులు వంటి అంశాలను తీవ్రంగా పరిగణించి లీజ్ రద్దు చేస్తామని చెప్పారు. అద్దె బకాయిలు ఉన్న వారు వెంటనే బకాయిలు చెల్లించాలని, దుకాణాలకు కేటాయించిన స్థలం హద్దు దాటితే చర్యలు తీసుకుంటామన్నారు. క్లోక్రూమ్, చెప్పుల స్టాండ్, కొబ్బరి కాయలు కొట్టే వారు డబ్బులు వసూలు వంటి ఫిర్యాదులపై తగిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఏసీ రంగారావు, ఏఈవో రమేష్బాబు, లీజెస్ విభాగం అధికారులు, సిబ్బంది, దుకాణదారులు పాల్గొన్నారు. ఆదివారం ఆలయ ఈవో శీనానాయక్ దుర్గగుడి ప్రాంగణంలోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. -
మనసు ప్రశాంతతకు యోగా దోహదం
భవానీపురం(విజయవాడపశ్చిమ): తన జీవితాన్ని యోగా మార్చిందని, నిత్యం యోగా చేసేవారికి సాధారణ రోగాలు దరి చేరకపోవడంతో పాటు మనసుకు ప్రశాంతత చేకూరుతుందని ప్రముఖ యోగాచార్యులు, శ్రీ వేంకటేశ్వర యోగ సేవా కేంద్రం(మంగళగిరి) వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర యోగ సేవా కేంద్రం విజయవాడ నగర శాఖల ఆధ్వర్యంలో వెయ్యి యోగా శిక్షణా శిబిరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భవానీపురం –2 శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విరాట్ యోగా – 1000’ కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత డాక్ట్ వేంకటేశ్వర యోగి జీవిత విశేషాలతో రూపొందించిన ‘అధునాతన యోగి – ఆదర్శ పథగామి’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. వెయ్యి శిక్షణ శిబిరాల్లో ఉచితంగా యోగా నేర్పిన గురువులు, సహకరించిన కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. రెండున్నర దశాబ్దాల నుంచి గురువుల కృషితో సుమారు రెండున్నర లక్షల మంది యోగా నేర్చుకోగలిగారని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భవానీపురం – 2 శాఖ అధ్యక్షుడు బొమ్మిశెట్టి తిరుమల రమేష్ మాట్లాడుతూ తమ శాఖ కార్యవర్గ సభ్యుల సహకారంతో గురువులను సత్కరించి గౌరవించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని భవానీపురం –2 శాఖ ఉపాధ్యక్షులు కొయ్య సూరిబాబు, ఊటుకూరి శ్రీమన్నారాయణ, ప్రధాన కార్యదర్శి తుమ్మలపెంట నాగేశ్వరరావు, కోశాధికారి కొత్తమాసు రత్నాకరరావు, మంజుల యోగి మాతాజి, వేమన యోగి గురూజీలు నిర్వహించారు. -
యువత భవిష్యత్తుకు ఈగల్ వ్యవస్థ ఏర్పాటు
పెనమలూరు: యువత భవిష్యత్తును దృష్టిలోఉంచుకోని రాష్ట్రంలో ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ రవికృష్ణ అన్నారు. కానూరు స్కాట్స్పైస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం ఎస్ఆర్ఆర్ ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ –2026ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం యువత భవిష్యత్తుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈగల్ వ్యవస్థ రక్షణ కవచంలా దాదాపు 70 లక్షల మంది విద్యార్థులు డ్రగ్స్, గంజాయి, ఇతర మాదవద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం సంస్థ లక్ష్యమన్నారు. భారతీయ యువతను బలహీనపరచటం ద్వారా దేశ భవిష్యత్తు దెబ్బతీయాలని విదేశీ శక్తులు చేస్తున్న కుట్రను యువత తిప్పికొట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే మహత్తర అవగాహన కార్యక్రమాన్ని ఈగల్ నిర్వహిస్తుందన్నారు. ఈగల్ కాల్ సెంటర్ 1972కు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని వివరించారు. చెస్ ఆడటం వలన యువత చురుకై న ఆటోచనలతో ఉంటారన్నారు. కార్యక్రమంలో ఏసీఏ చైర్మన్ కేవీవీ శర్మ, ఏసీఏ అధ్యక్షుడు ఎ.సురేష్, కార్యదర్శి కె.జగదీష్, టోర్నమెంట్ డైరెక్టర్ పి.రేణుక, పాఠశాల చైర్మన్ వీరమాచినేని వంశీ, డైరెక్టర్ వీరమాచినేని శాంతి, సీఈఓ కొడాలి జాహ్నవి, ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ, ఈగల్ సెల్ సీఐ రవీంద్ర, ఎస్ఐ.వీరాంజనేయులు, ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా ఘనరాగ పంచరత్న కీర్తనల గోష్టిగానం
విజయవాడకల్చరల్: శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న సద్గురువు త్యాగరాజ స్వామి 259వ జయంతి సందర్భంగా వారం రోజులుగా నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఘనరాగ పంచరత్నకీర్తనలను విఘ్నేస్వర స్తుతితో ప్రారంభించారు. పలు కీర్తనలను 200 మంది విద్వాంసులు, వాద్యకళాకారులు ఏకకాలంలో ఆలపించారు. గౌరీనాథ్, గాయత్రి గౌరీనాథ్, చారుమతి పల్లవి, మోదుమూడి సుధాకర్, అంజనా సుధాకర్, వేమూరి విశ్వనాథ్, దుర్గాభవాని, పలువురు విద్వాంసులు పాల్గొన్నారు. త్యాగరాజ స్వామి కృతులకు నృత్యాభిషేకం కూచిపూడి నాట్యాచార్యుడు చింతారవి బాల కృష్ణ బృందం త్యాగరాజ స్వామి రచించిన కీర్తనలకు నృత్యాలను అభినయించారు. కార్యక్రమంలో భాగంగా త్యాగరాజ స్వామి రచించిన ఉత్సవ సంప్రదాయ కీర్తనలను సంగీత విద్వాంసుడు ఎన్సీహెచ్ బుచ్చయ్యాచార్యులు బృందం ఆలపించారు. పవళింపు సేవతో త్యాగరాజ స్వామి 259 జయంతి ఉత్సవాలు ముగిశాయి. సంస్థ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్, సభ్యులు హరి ప్రసాద్, వీర్ సుబ్రహ్మణ్యం నిర్వహించారు. -
10 వేల బ్యాంకు పోస్టులు భర్తీ చేయాలి
నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆటోనగర్(విజయవాడతూర్పు): దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో 10 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటినీ తక్షణమే భర్తీ చేయాలని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ) సెంట్రల్ జనరల్ కార్యదర్శి ఎల్.చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన రీజినల్ కమిటీ సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఏపీలో మూడు వేలకు పైగా క్లర్క్, నాలుగు వేల వరకు అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 1,000 మంది ఆర్మీ గార్డుల కొరత కూడా ఉందన్నారు. తక్షణమే సిబ్బందిని నియమించకపోతే ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అంతకు ముందు ఆల్ఫా టీ క్యాంటీన్ నుంచి ఏటీఏ హాలు వరకు బ్యాంకు సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. -
దుర్గమ్మ అన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు ఆదివారం విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ చింతల్కు చెందిన కమ్మిరి సునీల్, పావని దంపతులు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,00,516ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. గుడివాడకు చెందిన జి.ఉమాదేవి కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. పెనమలూరు: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వైఎంసీఏ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ప్రముఖ విద్యా సంస్థల అధినేత డాక్టర్ టి.సుమన్ త్యాగరాజ్ను నియమించారు. ఈ మేరకు ఆదివారం వివరాలు తెలుపుతూ సుమన్ త్యాగరాజ్ కానూరులో షాన్రాక్ ఇంటర్నేషనల్ పాఠశాలతో పాటు విజయవాడలో సెయింట్ జోన్స్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ను నిర్వహిస్తున్నారు. ఆయన సౌత్, ఈస్ట్ జోన్ ఇండియా రీజన్ వైఎంసీఐ చైర్మన్గా ఉన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వైఎంసీఏ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఆయన 2026–29 వరకు పదవిలో ఉంటారు. యువత అభివృద్ధి, సామాజిక సేవలు, విద్యా ప్రమాణాలు పెంపొందించడంతో సుమన్ త్యాగరాజ్ ఎనలేని కృషి చేస్తున్నారు. ఆయనకు పదవి రావడంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. బస్టాండ్(విజయవాడపశ్చిమ): పండిట్ నెహ్రూ బస్టేషన్లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసింది. పీఎన్బీఎస్ అరైవల్ బ్లాక్ మెదటి అంతస్తులో సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం సెలవు దినం కావటంతో వివిధ దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణం ప్రయాణికులతో కిటకిట లాడుతుంది. ఒక్కసారిగా బస్టాండ్లో మంటలు చెలరేగటంతో ప్రయాణికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మెదటి అంతస్తులో ఉన్న కార్యాలయాల్లోని పాత ఫర్నిచర్ను బయట బాల్కానీలో ఉంచారు అవి అగ్ని ప్రమాదంలో కాలీ బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అగ్ని మాపక సిబ్బంది తెలిపారు. ఆదివారం కావడంతో సిబ్బంది ఎవరూ లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రదర్శన విజయవంతం
పెనమలూరు: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రదర్శనలో స్థానిక క్రీడాకారులు విజయవంతంగా పాల్గొని ఉత్తమ ప్రదర్శించారు. ఈ మేరకు ఆదివారం యనమలకుదురుకు చెందిన వాన్కాన్ డో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఏపీ చీఫ్ ఎస్.దుర్గారావు వివరాలు తెలుపుతూ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం వి.విఠల్ ఆధ్వర్యంలో గిన్నీస్ వరల్డ్ రికార్డుకు 20 నిముషాల పాటు కాటా నిరంతర ప్రదర్శన 10 రాష్ట్రాల నుంచి రెండు వేల మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. యనమలకుదురు, విజయవాడ ప్రాంతాల నుంచి తమ విద్యార్థులు 11 మంది విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొని సత్తాచాటారని చెప్పారు. పాల్గొన్న విద్యార్థుల్లో ఉప్పల మురళీమోహిత్, ఆరేపల్లి షణ్ముఖశ్రీహర్ష, ఆరేపల్లి దోలవెంకటశుభాష్, కొరె మోక్షిత, బెజవాడ కార్తీక్సాయి, బెజవాడ లక్ష్మణనాగశ్రీనివాస్, నైనా, దేవరకొండ హేమశ్రీ, వంశీకృష్ణ, ప్రభుకిరణ్రెడ్డి, మోహనప్రగ్న పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపారన్నారు. పి.జానకిరాములు, ఉప్పల కోటేశ్వరరావు విద్యార్థులకు స్ఫూర్తినింపారని చెప్పారు. గిన్నిస్బుక్ ప్రదర్శన విజయవంతంగా ముగిసిందని, త్వరలో వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు అందుతాయన్నారు. -
అమ్మ సన్నిధిలో విద్యార్థుల సెల్ఫోన్లు 12 చోరీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి దర్శనానికి విచ్చేసిన 12 మంది విద్యార్థులు తమ సెల్ఫోన్లను మోపెడ్ సీట్ కింద భద్రపరుచుకోగా, వాటిని చోరీ చేసిన ఘటన ఆదివారం జరిగింది. అమరావతిలోకి ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన 12 మంది విద్యార్థులు అమ్మవారినిని దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. తమ బైక్లను కనకదుర్గానగర్లో నూతనంగా నిర్మిస్తున్న క్యూకాంప్లెక్స్ కింద పెట్టి తమ సెల్ఫోన్లను ఒక మోపెడ్ సీట్ కింద బాక్స్లో భద్రపరుచుకున్నారు. సుమారు గంట తర్వాత తిరిగి వచ్చే సరికి మోపెడ్ సీట్ తెరిచి ఉండటంతో కంగారుపడి చూడగా లోపల బ్యాగ్ కింద పెట్టిన 12 సెల్ఫోన్లు మాయమయ్యాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆలయ సిబ్బంది పోలీస్ అవుట్పోస్ట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సీసీ కెమేరాలను పరిశీలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వన్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లారు. -
17న విజయవాడలో బీసీ మేథోమధన సదస్సు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీసీల ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా మే 17న విజయవాడలో బీసీ మేథోమధన సదస్సు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. నగరంలోని బెంజ్సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో మే 17 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సులో బీసీ సంఘ నాయకులు, ఉద్యోగులు, మేధావులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ ఐలాపురం హోటల్లో సదస్సు నిర్వహణపై బీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీసీల మేథోమధన సదస్సులో జనగణనలో బీసీల కుల గణన సక్రమ నిర్వహణపై సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. బీసీ రక్షణ చట్టం, 50 ఏళ్లకే సామాజిక పెన్షన్ వంటి వాగ్ధానాలు త్వరితగతిన అమలు చేసేందుకు ఒత్తిడి చేసేలా చర్చ జరుగుతుందని చెప్పారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, యువజన అధ్యక్షుడు పారుపల్లి మహేష్, మేకా వెంకటేశ్వరరావు, కొల్లూరు హనుమంతరావు, గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, జేఎల్ కుమార్, బి.శివ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కార్డియాక్ ఎనస్థీషియాపై సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్డియాక్ ఎనస్థీషియాలో అధునాతన పద్ధతులపై నగరంలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఆదివారం సదస్సు జరిగింది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం సహకారంతో సిద్ధార్థ వైద్య కళాశాల ఎనస్థీషియా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఆశ్రమ్, పిన్నమనేని సిద్ధార్థ, నిమ్రా, ఎన్ఆర్ఐ, ప్రభుత్వ సిద్ధార్థ కళాశాలలకు చెందిన 250 మంది ఎనస్థీషియా పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత ఈ సదస్సును వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయుష్ ఆస్పత్రి చీఫ్ కార్డియాక్ ఎనస్థీషియన్ డాక్టర్ వై. రమేష్ బాబు గతంలో ఉన్న విధానాలు, ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అడ్వాన్స్డ్ సిస్టమ్స్పై యువ వైద్యులకు అవగాహన కలిగించారు. సిద్ధార్థ వైద్య కళాశాల ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ సొంగా వినయ్కుమార్ అధ్యక్షత వహించగా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అకడమిక్ సెనేట్, పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భీమేశ్వర్, సెయింట్ ఆన్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి. కిరణ్కుమార్ తదితరులు పాల్గొని పలు అంశాలపై ప్రసంగించారు. ఈ సదస్సుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులుగా డాక్టర్ సి. శ్యామ్కుమార్ వ్యవహరించారు. సుబ్బారాయుడి ఆలయంలో సినీనటుడు పూజలు మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ప్రముఖ సినీనటుడు బాబీసింహా కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు బుద్ధు సతీష్ శర్మ, విరూప్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. -
స్వీయ గణనతో కచ్చితమైన సమాచారం
ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్)తో కచ్చితమైన డేటాతో పాటు అత్యంత పారదర్శకత, సమయం ఆదాకు వీలుంటుందని, ప్రతిఒక్కరూ స్వీయ గణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానం వద్ద జేసీ ఇలక్కియ 5కే రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ ప్రగతికి కీలమైన ప్రణాళికలు, విధానాల రూపకల్పనకు దోహదం చేసే జనగణన ప్రక్రియలో భాగంగా ఈ నెల 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఎస్ఈ.సీఈఎన్ఎస్యూఎస్.జీవోవి.ఇన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను పొందుపరుచుకోవచ్చన్నారు. విశ్వసనీయ డేటా.. సెన్సస్ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడం వల్ల విశ్వసనీయ డేటాతో పాటు విస్తృత ప్రజా భాగస్వామ్యానికి, సమయం ఆదాకు దోహదం చేస్తుందన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా సెన్సస్ ఇన్చార్జ్ రమణ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ ఎ.రవీంద్ర, ఆర్డీవో టీవీ సతీష్, జిల్లా యువజన సంక్షేమ అధికారి కొల్లేటి రమేష్, డీ ఎస్డీవో కోటేశ్వరరావు, మెజిస్టీరియల్ సెక్షన్ సూప రింటెండెంట్ ఎం.వెంకటరామయ్య పాల్గొన్నారు. -
ఎండలో బంకుల చుట్టూ..
డీ మార్ట్కు వెళ్లి సరుకులు తీసుకుని ఇంటికి వచ్చే క్రమంలో నా బైక్లో పెట్రోల్ కొట్టిద్దామని బంకుకు వెళ్లాను. పెట్రోల్ లేదన్నారు. దీంతో మండే ఎండలలో ఆరు పెట్రోల్ బంకుల చుట్టూ తిరిగాను. ఎక్కడా పెట్రోల్ లేదని చెప్పటంతో ఏంచేయాలో పాలుపోలేదు. బైక్లో ఉన్న పెట్రోల్, బంకుల చుట్టూ తిరగటానికే ఖర్చయ్యిపోయింది. అదృష్టవశావత్తూ ఒక బంకులో గంటసేపు క్యూలైన్లో ఉంటే రెండు వందల రూపాయల పెట్రోల్ దొరికింది. బతుకుజీవుడా అంటూ ఇంటికి చేరుకున్నా. – కన్నయ్య శ్రీనివాస్, గుణదల -
ఇంధన కొరతతో అల్లాడుతున్న రాష్ట్రం
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్రంలో మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద ప్రజలు క్యూ కుడుతున్నారని, సరుకుల రవాణా నిలిచిపోయిందని, 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు మాత్రం మొద్దు నిద్ర పోతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అగచాట్ల మాటున పేద, మధ్య తరగతి కుటుంబాల బతుకులు నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిపై చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్కు స్పృహ లేకుండా పోతోందన్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష పెట్టిన తరువాత కొరత మరింత ఎక్కువైందన్నారు. ఈరోజు కూరగాయలు, పండ్లు, సరుకులు రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి నెలకొందని, కాంక్రీట్ మిక్చర్లు ఆడటం లేదని, కూలీలకు పని దొరకటం లేదని, ఇదంతా బ్లాక్ మార్కెటర్లకు పండుగలా మారిందని పేర్కొన్నారు. అనుభవం ఏమైంది? రాష్ట్రం కోసం కేంద్రంలో నడుస్తున్న మోదీ ప్రభుత్వంలో కూటమి ఎంపీలతో మీ పలుకుబడిని వాడలేరా అని చంద్రబాబును పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు తన పలుకుబడిని హద్దులు లేని అప్పులు తీసుకురావడానికి, వైఎస్సార్ సీపీ నాయకుల మీద ఈడీ సోదాలు, సీబీఐ కేసులు పెట్టడానికే వాడుతున్నారని విమర్శించారు. ఇలా అని సాక్షాత్తూ చంద్రబాబు తమ్ముడే చెబుతున్నారన్నారు. 2047వ సంవత్సరానికి రాష్ట్రాన్ని ఉద్దరిస్తానని చెబుతున్న చంద్రబాబు ఈవాళ ప్రజలు పడుతున్న కష్టాలను చూడరా అని నిలదీశారు. ముగ్గురూ ముగ్గురే.. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పది రోజులుగా నారా లోకేష్ కనిపించటం లేదని పేర్ని నాని విమర్శించారు. పవన్కల్యాణ్కు ఆరోగ్యం బాగోదు, చంద్రబాబు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. తక్షణం చంద్రబాబు మేల్కొని సొరకాయ కోతలు ఆపి మోదీతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇబ్బందుల నుంచి ప్రజలను గట్టెక్కించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. సింగపూర్కు వెళ్లిన మంత్రులకు ప్రశ్న.. నీతి, నిజాయితీలకు, అవినీతి రహిత పాలనకు ప్రపంచంలో పెట్టింది పేరుగా సింగపూర్ను భావిస్తుంటారని, చంద్రబాబు సావాసం కోసం సింగ పూర్ మంత్రి ఈశ్వరన్ ఇక్కడకు వచ్చి ఆయన దగ్గర అవినీతిని నేర్చుకుని అక్కడ అవినీతి పాలయ్యారని పేర్ని నాని గుర్తుచేశారు. ఇప్పుడు ఏడుగురు రాష్ట్ర మంత్రులు సింగపూర్కు వెళ్లటం వల్ల ఆ దేశస్తులు చెడిపోకుండా ఉంటే చాలన్నారు. వ్యవసాయం లేని చోటికి వ్యవసాయ మంత్రి వెళతారని, పరిశ్రమలు ఎలా పెట్టుకోవాలో నేర్చుకోవడానికి పరిశ్రమల మంత్రి లేకుండానే వెళ్లారని ఎద్దేవా చేశారు. మునిసిపాలిటీలు, ఆర్అండ్బీలకు రోడ్లు వేయడానికి నిధులు ఇవ్వరు కాని సింగపూర్కు వెళ్లి వీరు ఏం నేర్చుకుంటారో చూడాలన్నారు. ఐదారు కోట్ల రూపాయలు వారి పర్యటనకు లెక్క రాసుకోవడం తప్ప మంత్రుల సింగపూర్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, లంకే వెంకటేశ్వరరావు, బందెల థామస్నోబుల్, తిరుమలశెట్టి ప్రసాద్, చలమలశెట్టి గాంధీ, ఐనం తాతారావు తదితరులు పాల్గొన్నారు. -
బంకులు బంద్!
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా పెట్రోల్, డీజిల్ కొరత విజయవాడ భవానీపురంలో తాత్కాలికంగా మూసివేసిన పెట్రోల్బంక్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారు లు బంకుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ఏ బంక్ వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వాహనదారులకు సమాధానం చెప్పలేక కొందరు ఏకంగా బంకులు మూసివేశారు. బంకుల వద్ద అడ్డంగా తాళ్లు, బారికేడ్లు, ఆయిల్ డబ్బాలు పెట్టేశారు. కొన్ని బంకుల్లో యాజమాన్యం సిబ్బందిని కూడా పంపించి వేసింది. ఇంధనం స్టాక్ ఉన్న ఒకటి అర బంకుల వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, రవాణా వాహనాలు పెట్రోల్, డీజిల్ కోసం వేచి ఉండటంతో ర్యాలీని తలపిస్తోంది. వాహనదారులు గంటల కొద్దీ క్యూలైన్లో పాట్లు పడుతున్నారు. మండుటెండలో ద్విచక్ర వాహనాలపై భార్య, చంటి పిల్లలతో వచ్చి నానా అవస్థలు పడ్డారు. ఇదీ పరిస్థితి.. ఎన్టీఆర్ జిల్లాలో 186, కృష్ణా జిల్లాలో 145 మొత్తం 321 పెట్రోల్ బంక్లు ఉన్నాయి. వీటిల్లో 321 బంకు ల్లో డీజిల్ నిల్వలు లేవు. కేవలం 20 శాతం బంకుల్లో మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉంది. ఆదివారం ఉదయం నుంచి 80శాతం బంకులు మూసివేశారు. ఫలితంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్టాక్ ఉన్న బంకుల్లో పెట్రోల్ రూ. 100, రూ.200 మించి పోయడం లేదు. కార్లు, ఇతర వాహనాలకు పరిమితంగా పెట్రోల్ నింపుతున్నారు. కొన్ని బంకుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నో స్టాక్.. నో స్టాక్.. బందరు రోడ్డులోని ఓ బంకు వద్ద భారీగా కార్లు నిలిచిపోయాయి. స్టేడియం వద్ద నుంచి బెంజ్ సర్కిల్ వర కు రోడ్డు పొడవునా కార్లు క్యూ కట్టాయి. విజయవాడ గాంధీనగర్లో జైళ్ల శాఖ నిర్వహిస్తున్న బంక్ మూసివేశారు. అలాగే గొల్లపూడిలోని యూనియన్, రాఘ వయ్య పార్క్ సమీపంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తున్న బంక్ సైతం మూతపడ్డాయి. ఆటోనగర్ ప్రాంతంలోని బంకులు మూసివేయడంతో వాహ నాలు నిలిచిపోయాయి. ఐఓసీఎల్, హెచ్పీ, బీపీ, నయారా, జియో బంకులు పూర్తిగా మూతవేశారు. తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా బంకుల వద్ద రవాణా వాహనాలు నిలిపివేశారు. ముఖ్యంగా గ్రామీణ మండలాల్లో ఏ బంకులోనూ డీజిల్ అందుబాటులో లేదు. వ్యవసాయ పనుల కోసం వెళ్లే ట్రాక్టర్ల యజమానులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ధాన్యం గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రవాణా నిలిచిపోయింది. కానరాని డెలివరీ బాయ్స్ నగరంలో డీజిల్ ఆటోలు సగానికిపైగా రోడ్ల మీదకు రాలేదు. కొన్ని బంకుల్లో ఆదివారం ఉదయం నామ మాత్రంగా డీజిల్ విక్రయాలు జరిగాయి. వాటిల్లో ఆటోలు భారీగా క్యూ కట్టాయి. కొన్ని ఆటోలకు మాత్రమే డీజిల్ అందడంతో మిగిలిన వారు వెనుదిరిగారు. ఎక్కడైనా వాహనాలు నిలిచిపోతే బాటిల్లో పెట్రోల్ తెచ్చుకునేందుకు అవకాశం లేకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. రోడ్లపై రయ్ రయ్ అంటూ దూసుకుపోయే స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్ వంటి పలు సంస్థల డెలివరీ బాయ్స్ పెట్రోల్ కొరత కారణంగా పెద్దగా కనిపించలేదు. ఇంధన కొరత కారణంగా లాక్ డౌన్ నాటి పరిస్థితులు చూస్తున్నామని ట్రావెల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇంధనం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ వాహనదారులు మండిపడుతున్నారు. ఎన్నడూ లేనిది ఒక్కసారి బంకులన్నీ నో స్టాక్ బోర్డులు పెట్టడం వెనుక కృత్రిమ కొరతేకారణమంటున్నారు. బంకులు మూసివేసినా ఏ ఒక్క అధికారి అటువైపు వచ్చి పరిస్థితిపై దృష్టి పెట్టలేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజిల్, పెట్రోల్ డీలర్లు బంకుల యాజమాన్యానికి అప్పు ఇవ్వడం లేదని, క్యాష్ అండ్ క్యారీ అనడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని సీనియర్ మేనేజర్ ఒకరు తెలిపారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్ లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరం నందు సోమవారం ఉదయం 10గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. గుడ్లవల్లేరు: శ్రీ కొండలమ్మవారి సన్నిధి ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. పాలు పొంగళ్లను పొంగించిన మహిళా భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. -
మార్మోగిన నారాయణ మంత్రం
కోడూరు: అభినవ మేల్కోటగా పేరుగాంచిన ఉల్లిపాలెం శ్రీగోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామివారి క్షేత్రం నారాయణ మంత్రంతో మార్మోగింది. ఆలయంలో జరుగుతున్న శ్రీమన్నారాయణ మహాయజ్ఞ ఉత్సవాలు ఎనిమిదో రోజుకు చేరాయి. ఆదివారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ప్రత్యేక తిరుచ్చిపై స్వామివార్లను రుగ్వేద యాగశాలకు తీసుకువెళ్లి హోమక్రతువులను ప్రారంభించారు. ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజీయర్ స్వామిజీ పర్యవేక్షణలో రుత్వికులు 108 హోమగుండాల వద్ద ధన్వంతరి మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. 13 యాగశాలల్లో రుత్వికులు హోమక్రతువు జరపగ్గా, ఇష్టి హోమగుండాల వద్ద భక్తులు యజ్ఞానాన్ని నిర్వహించారు. 45మంది దంపతులు ధన్వంతరి మహాయజ్ఞంలో పాల్గొని పూజలు చేశారు. యజ్ఞం అనంతరం పూర్ణాహుతిని భక్తిప్రపత్తులతో జరిపారు. అనంతరం భక్తమండళ్ల సభ్యులు భజనలు చేస్తూ భక్తిగీతాలను ఆలపించారు. చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. యజ్ఞాలు అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ మాడవీధుల వెంట నగరోత్సవాన్ని నిర్వహించారు. పోలీసు అధికారుల పూజలు.. మహాయజ్ఞ ఉత్సవాల్లో అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్, సీఐ యువకుమార్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. అష్టాక్షరీ స్వామిజీ డీఎస్పీ, సీఐ దంపతులను సత్కరించి ప్రసాదాలను అందించారు. 29న జరిగే రాజగోపుర మహాకుంభ ప్రోక్షణకు ఏర్పాటు చేసే బందోబస్తుపై డీఎస్పీ అష్టాక్షరీ స్వామిజీతో చర్చించారు. ఎస్ఐ చాణిక్య–పూర్ణమాధురి దంపతులు ధన్వంతరి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. కనులపండువగా సాగిన ధన్వంతరి మహాయజ్ఞం -
తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మ వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావటంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువ జాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి భక్తులకు ఆలయ వేద పండితులు దిలీప్కుమార్ సౌజన్యంతో ఆలయం వారు నిరంతరాయంగా మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేద తీరారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రావటంతో గ్రామంలో ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడ్డాయి. దుర్గమ్మకు కానుకగా బంగారు హారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు ఆదివారం రూ. 3.54లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన వేమూరి శివరామప్రసాద్ కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి సుమారు 23 గ్రాముల బంగారం, రూ. 3,54,292 విలువ కలిగిన బంగారు హారాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు నేడు పామర్రుకు కృష్ణా కలెక్టర్ చిలకలపూడి(మచిలీ పట్నం): వారం రోజులుగా వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవుపై వెళ్లిన కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం విధులకు హాజరుకానున్నారు. ఇప్పటి వరకు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ఇన్చార్జ్ కలెక్టర్గా వ్యవహరించారు. కాగా సోమవారం ఉదయం కలెక్టర్ డీకే బాలాజీ పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలో పర్యటించనున్నారు. మే 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పమిడిముక్కలలోని ఎన్టీఆర్ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హాజరుకానున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం మచిలీపట్నం కలెక్టర్లో జరిగే మీకోసం కార్యక్రమానికి హాజరవుతారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): జబ్బు చేసి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ప్రతిరోగికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అన్నారు. ఆయన ఆదివారం జీజీహెచ్ లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా న్యూరాలజీ, కార్డియాలజీ వార్డులను సందర్శించి, ఆయా వార్డులోని రోగులతో మాట్లాడారు. వైద్యం సక్రమంగా అందుతుందా, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అటెండెంట్స్తో పాటు, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే సత్వరమే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. అదే విధంగా రోగులు వాడే టాయిలెట్స్ను పరిశీలించి, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట డెప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ సూర్యమంగాదేవి తదితరులు ఉన్నారు. -
పచ్చనేతల దందా
కొల్లేటి వాసులపై కొల్లేరులో పరిచయమైన గుంటుపల్లికి చెందిన వ్యక్తుల ద్వారా ఈలప్రోలు చెరువుల లీజుకు తీసుకున్నాం. లీజు కాగితాలు అన్నీ వారు తయారు చేయించారు. లీజులో 25 శాతం వాటా వారే రాయించుకున్నారు. చివరకు చేపల చెరువులు కూడా మా నుంచి లాగేసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి సమస్య పరిష్కరించలేదు. స్థానికుల వైపే మొగ్గు చూపారు. మాకు న్యాయం చేసేవారు లేరు. పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ కూడా దాడిచేశారు. –బలే లక్ష్మణరావు, చేపల చెరువు లీజుదారుడు కొల్లేరు వాసులకు చేపలు, రొయ్యల సాగు తప్ప వేరే కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు అస్సలు తెలియవు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న టీడీపీ నేతలు మా ప్రాంతంలో సాగు చేసుకుంటే తాము అండగా ఉంటామని మాయమాటలు చెప్పి తీసుకువచ్చి ఇప్పుడు వారిని బెదిరిస్తూ దందాకు దిగుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి వారు సాగు చేసుకుంటుంటే పైసా కూడా పెట్టకుండా 25 శాతం వాటా తీసుకుంటున్నారు. అదీ కాక ప్రజాప్రతినిధికి ఇవ్వాలంటూ ఏడాదికి రూ.10 లక్షలు చొప్పున గత ఎనిమిదేళ్లుగా రూ.80 లక్షలు కాజేశారు. ఇప్పుడు అది కూడా చాలదన్నట్టు ఎనిమిదేళ్ల లీజు కాలంలో నాలుగేళ్ల పట్టుబడి పూర్తిగా వారికిచ్చేయాలంటూ బెదిరిస్తున్నారు. ఇదేమి దౌర్జన్యమంటూ ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. ఈ విషయం ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పాపం..ఆ కొల్లేరు వాసులు లబోదిబోమంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: కొల్లేరు ప్రాంతంలో చేపల చెరువుల కోసం భూములు ఆక్రమణకు గురవుతున్నాయని 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొల్లేరు ప్రాంతంలో అనేక చేపల చెరువులు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన బలే లక్ష్మణరావు తన బంధువులతో కలసి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామలోని 40 ఎకరాల సొసైటీ చెరువును ఏడాదికి రూ.10 లక్షలు లీజు చెల్లించి గడిచిన ఎనిమిదేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. దీంతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన మరో 10 ఎకరాల్లో సొంతంగా చెరువు తవ్వించి ఏడాదికి రూ.10 లక్షల చొప్పున లీజు చెల్లిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధి అనుచరులుగా చెలామణి అవుతున్న గుంటుపల్లికి చెందిన ముగ్గురు టీడీపీ నేతలు బలే లక్ష్మణరావును బెదిరించి చెరువులు స్వాధీనం చేసుకునే కుట్రలకు తెరతీశారు. చేపలు పట్టకుండా అడ్డుకుంటున్నారు. పట్టిన చేపలు అమ్మకానికి వెళ్లకుండా అడ్డు తగులుతూ అరాచకం సృష్టిస్తున్నారు. బెదిరింపులతో అగ్రిమెంట్... బలే లక్ష్మణరావు ఎనిమిదేళ్ల క్రితం ఈలప్రోలు గ్రామంలో ఓ సొసైటీకి చెందిన చేపల చెరువులు లీజుకు తీసుకునే సమయంలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ నేతల సహాయం కోరాడు. స్థానికులుగా తాముంటే మీ వ్యాపారానికి ఎటువంటి ఢోకా ఉండదని వారు నమ్మించారు. అవసరమైతే ప్రజాప్రతినిధి అండదండలు మీకు ఉండేలా చూస్తామని నమ్మబలికారు. అగ్రిమెంట్ తయారు చేయిస్తామని చెప్పి 25 శాతం వాటా వారికి కూడా ఉండేలా బెదిరించి రాయించుకున్నారు. అంతేకాకుండా ఏడాదికి చేపల చెరువుల లీజు రూ.80 లక్షలతో పాటు ప్రజాప్రతినిధికి ఇవ్వాలని గత ఎనిమిదేళ్లుగా ఏడాదికి రూ.10లక్షల చొప్పున రూ.80 లక్షలు మొత్తం రూ.1.60 కోట్లు వసూలు చేశారు. అయితే ఇంతవరకూ బాగానే ఉంది. రెండేళ్ల క్రితం తీసుకున్న 10 ఎకరాలకు సంబంధించి 25 శాతం వాటాతో సంతృప్తి పడని పచ్చ నేతలు నాలుగేళ్లు పట్టుబడి మొత్తం తమకు వదిలేయాలంటూ లక్ష్మణరావుపై వత్తిడి చేయడం ప్రారంభించారు. లక్షలకు లక్షలు పెట్టుబడి తాము పెట్టి పట్టుబడి మీకు ఎలా వదిలేస్తామని లక్ష్మణరావు ఎదురుతిరిగాడు. దీంతో ఈ వివాదం సదరు ప్రజాప్రతినిధి వద్దకు చేరింది. ఈ సందర్భంగా రూ.80 లక్షల నగదు విషయం కొల్లేరు వాసులు బయట పెట్టడంతో ఇరకాటంలో పడిన ప్రజాప్రతినిధి తన పేరుతో ఏడాదికి రూ.10లక్షలు వసూలు చేయడం ఏమిటని తన అనుచరులను సున్నితంగా మందలించారు. అయితే చేపల చెరువు పంచాయితీని ఎటూ తేల్చకుండా వదిలేయడంతో ఆయన అనుచరులు చెలరేగిపోతున్నారు. పట్టిన చేపలను సైతం అమ్మకానికి తరలించకుండా అడ్డుకున్నారు. 20 రోజుల క్రితం లీజు చెల్లింపు విషయంలో మాటామాటా పెరిగి కొల్లేరు వాసులపై దాడికి తెగబడ్డారు. దాడి ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 9 మందిపై ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధి వద్ద పంచాయితీ... చేపల చెరువుల్లో జరిగిన అన్యాయాన్ని ప్రజాప్రతినిధి వద్ద చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయిందని కొల్లేరు వాసులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధి వివాదాన్ని ఎటూ తేలనివ్వడంలేదని, చెరువు వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తామే ఏర్పాటు చేశామని, జనరేటర్, కంటైనర్, ఇతరత్రా సుమారు రూ.75 లక్షల సామగ్రి ఉందన్నారు. సమస్య పరిష్కరిస్తే తమ సామగ్రి తాము తరలించుకు పోతామన్నారు. తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలులో టీడీపీ నేతల వివాదంలో చిక్కుకున్న చేపల చెరువు -
భద్రతా ప్రమాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పరిశ్రమ ల్లో భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా క్రైసిస్ గ్రూప్ (డీసీజీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున, ప్రతి సంస్థ పటిష్ట భద్రతా నిబంధనలను పాటించడం తప్పనిసరి అన్నారు. లోటుపాట్లు ఏవైనా ఉంటే వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు. రసాయన విపత్తులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఈ నెల 30న జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం ఐవోసీఎల్ టెర్మినల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఫ్యాక్టరీల్లో గ్యాస్ లీకేజ్, అగ్ని ప్రమాదాలు వంటివి జరక్కుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా సేఫ్టీ ఆడిట్ నివేదికలు పంపాలన్నారు. అత్యవసర సమయాల్లో స్పందించే విధానంపై కార్మికులకు అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని సూచించారు. సమావేశంలో కర్మాగారాల డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజు, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, వివిధ పారిశ్రామిక సంస్థలు, కర్మాగారాల ప్రతినిధులు, భద్రతాధికారులు పాల్గొన్నారు. కంటి ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మచిలీపట్నంఅర్బన్: జిల్లాలోని కంటి వైద్య ఆసుపత్రులు, క్లినిక్లు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్ సూచించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేట్ కంటి వైద్యులు, ఎన్జీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్లు, ఆసుపత్రులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా లభించే ప్రయోజనాలను వివరించారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ జి.భానుమూర్తి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే కృష్ణాజిల్లా ఐబాల్ సేకరణలో 510 శాతం పురోగతి సాధించి రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. పాఠశాల విద్యార్థుల కంటి పరీక్షల్లో రెండవ స్థానం, శుక్లాల శస్త్ర చికిత్సల్లో రాష్ట్రంలో టాప్ టెన్లో ఎనిమిదో స్థానం సాధించినట్లు తెలిపారు. విద్య, పరిశోధనా రంగాల్లో మార్పులకు శ్రీకారం లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏడాది కాలంలో విద్య. పరిశోధన, పరిపాలన రంగాల్లో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ అన్నారు. ఆయన వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదిలో పరిపాలనా పరంగా 27, 28వ స్నాతకోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు తెలిపారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్తో ప్రత్యేకంగా సమావేశమై అకడమిక్ ప్రమాణాల పెంపుపై చర్చించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, పకడ్బందీ పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. వైద్య విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ నిపుణులతో వెబెక్స్ సమావేశాలను నిర్వహించామన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని రీసెర్చ్డే నిర్వహించి పరిశోధనలకు పెద్దపీట వేశామన్నారు. వైద్య విద్యార్థుల మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల నివారణపై ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధ, ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ ఐ.రమేష్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
డీజిల్కు కటకట..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు పెట్రోలు బంకుల్లో శనివారం అకస్మాత్తుగా డీజిల్, పెట్రోలు కొరత ఏర్పడింది. దీంతో చాలా బంకుల వద్ద సుమారు అర కిలోమేటరు మేర వాహనాలు బారులు తీరాయి. కొన్ని బంకుల్లో ఏకంగా నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. చల్లపల్లిలో ఓ బంకులో ఐదు రోజుల డీజిల్ నిల్వలు కేవలం మూడు గంటల వ్యవధిలో అయిపోయాయని ఆ బంకు యజమాని చెప్పారు. విజయవాడ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, రామవరప్పాడు రింగ్ వద్ద ఉన్న పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. – సాక్షి, విజయవాడ ఫొటోగ్రాఫర్ -
ప్రశాంతంగా పాలిసెట్–2026
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ నిర్వహించే పాలిసెట్ జిల్లాలో శనివారం ప్రశాంతంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంతో పాటు తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలో మొత్తం 25 పరీక్ష కేంద్రాల్లో శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది. జిల్లాలో మొత్తం 7567 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.విజయసారథి చెప్పారు. పాలిసెట్ పరీక్ష ఫలితాలతో పాటుగా కౌన్సెలింగ్ షెడ్యూల్ను కూడా త్వరలోనే ప్రకటిస్తారని ఆయన తెలిపారు. -
వైద్యాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
సూపర్ స్పెషాలిటీల్లో వైద్యుల కొరత గ్యాస్ట్రో ఎంట్రాలజీ : ప్రొఫెసర్ –1 అసిస్టెంట్స్ ప్రొఫెసర్స్–2 న్యూరోసర్జరీ : అసిస్టెంట్ ప్రొఫెసర్స్–2 సీటీవీఎస్ : అసిస్టెంట్ ప్రొఫెసర్స్–2 న్యూరాలజీ : అసిస్టెంట్ ప్రొఫెసర్స్–2 కార్డియాలజీ : ప్రొఫెసర్ –1, అసిస్టెంట్ ప్రొఫెసర్–1 జనరల్ మెడిసిన్ : ప్రొఫెసర్స్–2 లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాణాపాయంలో ఉన్న రోగులకు సేవలు అందించడంలో కీలకమైన సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్యుల కొరత నెలకొంది. ఏకంగా మూడు విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక్కరు కూడా లేని దయనీయ స్థితి. మరో రెండు కీలక విభాగాల్లో ఒక్కొక్కరు అసిస్టెంట్లు ఉండగా, మరో విభాగంలో ప్రొఫెసర్ లేని వైనం. దీంతో రోగులకు సేవలు అందించడంలో తీవ్రజాప్యం నెలకొంటోంది. గంటల కొద్దీ ఓపీలో వేచి ఉండాల్సి వస్తోందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైద్యులను భర్తీ చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేలా పాలన కొనసాగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులో సేవలు దిగజారాయంటున్నారు. కీలక విభాగాల్లో కొరత వైద్య సేవలు అందించడంలో కీలకమైన సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోనే వైద్యుల కొరత ఉంది. ప్రతి విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు లేక ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంది. కానీ ప్రభుత్వాస్పత్రి న్యూరోసర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సీటీవీఎస్ విభాగాల్లో ఒక్కరు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేని దయనీయ స్థితి నెలకొంది. అంతేకాదు గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ప్రొఫెసర్ కూడా లేరు. ఒకే ఒక్క వైద్యుడు విభాగాన్ని నడపాల్సి వస్తోంది. మరోవైపు కార్డియాలజీలో ప్రొఫెసర్ లేరు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉంది. న్యూరాలజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉంది. రోగుల సేవల్లో ఇబ్బందులు సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరోసర్జరీ ఓపీ సేవలు వారంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తుంటారు. ఆ విభాగాల్లో నిర్వహించే ఓపీలకు 300 నుంచి 350 మంది వరకూ రోగులు వస్తుంటారు. ఒకరిద్దరు వైద్యులే ఉండటంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం కష్టతరంగా మారుతోంది. అంతేకాదు గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఒకే ఒక్క వైద్యుడు ఉండటం, 300 మందికి వైద్య పరీక్షలు, వార్డుల్లో కేసులు, ఇతర వార్డుల్లో ఉన్న వారిని చూడటం కష్టంగా మారుతోంది. రోగులు వైద్య సేవలు పొందడంలో జాప్యం జరుగుతోంది. న్యూరాలజీలో సైతం ఒక్కరే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండటం, ఓపీ రోజుల్లో 350 మంది వరకూ రోగులు వస్తుండటంతో ఓపీ ముగిసే సరికి మధ్యాహ్నం 3 గంటలు దాటుతోంది. ప్రొఫెసర్లే కాల్ డ్యూటీలు చేయాల్సివస్తోంది అత్యవసర కేసు వచ్చినా, వార్డులో ఉన్న వారి పరిస్థితి విషమిస్తున్నా అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటే వాళ్లే మానిటరింగ్ చేస్తుండే వాళ్లు. ఏదైనా అత్యవసరం అయితే ప్రొఫెసర్, హెచ్ఓడీలకు సమాచారం ఇస్తారు. కానీ ప్రస్తుతం కీలకమైన న్యూరోసర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సీటీవీఎస్ విభాగాల్లో అసిస్టెంట్లు లేని కారణంగా ప్రొఫె సర్/హెచ్ఓడీలు కాల్ డ్యూటీలు చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంది. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోనే ఈ దయనీయ స్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని వైద్య రంగానికి చెందిన వారు అంటున్నారు. వైద్యుల నియామకాలు చేపడితే అసిస్టెంట్లు వస్తారని అంటున్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలి. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పూర్తి స్థాయిలో వైద్యులను నియమించి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి. ప్రభుత్వం తీరుతో ప్రభుత్వాస్పత్రులపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఆ పరిస్థితి మారేలా చర్యలు తీసుకోవాలి. –డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కోనేరుసెంటర్: కృష్ణా వర్సిటీని ప్లాస్టిక్ రహిత ప్రాంగణంగా మారుస్తామని వీసీ కె.రాంజీ తెలిపారు. శనివారం పచ్చదనం– పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం నవీముంబైకి చెందిన హరికృష్ణారెడ్డి దంపతులు, దిగమర్రుకు చెందిన అన్నం వంశీకృష్ణ దంపతులు విరాళాలు సమర్పించారు. మచిలీపట్నంటౌన్: జనగణన– 2027కు సంబం ధించి శనివారం మచిలీపట్నంలో 5కే రన్ను నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. 7 -
ప్రజల భాగస్వామ్యంతోనే మలేరియా నివారణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): దోమలను నివారించడం ద్వారానే మలేరియా సోకకుండా చూడగలమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నియంత్రణ, అవగాహనపై శనివారం పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మలేరియాకు కారణమైన దోమలను పూర్తిగా నియంత్రించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికున్ గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయని, దోమలు వ్యాప్తిచెందకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. నగరంలో కాలువలు డ్రైన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా నగర పాలక సంస్థ, జలవనరుల శాఖ అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ ప్రక్రియను ప్రతి సచివాలయానికి అనుసంధానించాలని అన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతిదేవి, డీఐఓ డాక్టర్ శరత్బాబు, ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ మాధవీ నాయుడు, నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి, జిల్లా మలేరియా అధికారి రాజునాయక్, బయాలజిస్ట్ కామేశ్వరరావు, ఎపిడమాలజిస్ట్ డాక్టర్ సునీల్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతతో సాగు చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): వ్యవసాయం చేసే రైతులు, కౌలు రైతులు సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యంత్ర పరికరాలను ఉపయోగించి సాగు చేయాలని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ అన్నారు. ఉయ్యూరు వీరమ్మతల్లి దేవాలయ ఆవరణలో ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర 4వ మహాసభలో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఎగ్జిబిషన్ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశాలను శోధించాలన్నారు. అవసరం మేరకే ఎరువులు, పురుగు మందులు వాడాలని, అనవసరంగా మందులు విచ్చలవిడిగా వాడకూడదని సూచించారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో హార్టికల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక రంగాల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోందన్నారు. కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా ఒక యాప్ను తీసుకొచ్చారని, దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చేలా యాప్ను రూపొందించారని, దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కౌలు రైతు లేనిదే వ్యవసాయమే లేదు మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కౌలు రైతు లేనిదే వ్యవసాయమే లేదన్నారు. వ్యవసాయానికి కౌలు రైతులే మూలమైనా అప్పుల వల్ల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. గతంలో కౌలు చట్టాలు రద్దయ్యాయని తెలియక భూ యజమానులు కౌలు రైతులకు సంతకం పెట్టడం లేదన్నారు. సంతకం పెడితే భూ యజమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం తరఫున ప్రకటన ఇవ్వాలని కోరారు. ఈ ఎగ్జిబిషన్లో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు ఉపయోగించే వివిధ రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు, డ్రోన్లను ప్రదర్శించారు. భారత రైతాంగ ఉద్యమఘట్టాల ఫోటోలను ప్రదర్శించారు. కె. విశ్వమోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, మాగంటి హరిబాబు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు కె.చంద్రశేఖర్, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీవీ లక్ష్మణస్వామి, పి.రంగారావు, శివనాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. నవీముంబైకి చెందిన జి.హరికృష్ణరెడ్డి, ఆశాకృష్ణ దంపతులు అమ్మవారి వేద పరిరక్షణ ట్రస్ట్కు రూ. 1.16 లక్షలు, ఆలయంలో జరుగుతున్న ఉచిత మజ్జిగ వితరణకు రూ. 23 వేల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అన్నదానానికి రూ. లక్ష విరాళం పాలకొల్లు దిగమర్రుకు చెందిన అన్నం వంశీకృష్ణ, కిన్నెర దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో నీటి భద్రత సాధనకు జలధార–జలహారతి కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణగా చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలో 439 చెరువులున్నాయని.. ఇవన్నీ నిండితే 10 టీఎంసీల నీటిని పట్టి ఉంచొచ్చని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వీటి సామర్థ్యం 6.4 టీఎంసీలుగా ఉందని, ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు జలధార కింద వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఫీడర్ చానళ్లు, చెరువుల్లో పూడికతీతతోపాటు వివిధ పనుల చేపడుతున్నారన్నారు. రీచార్జి పిట్స్, పర్కొలేషన్ ట్యాంకుల నిర్మాణం పాత జలవనరుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. స్లూయిస్ మరమ్మతులు, ఫీడర్ ఛానళ్ల అభి వృద్ది వంటివాటిపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు జిల్లాలో వేసవి నేపథ్యంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. మనుషులు, పశుపక్ష్యాదుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, పీ4 కింద మంచి మనసున్న వారు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. ఏవైనా ఇబ్బంది ఉంటే 91549 70454 కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయొచ్చని తెలిపారు. -
వెనుక నుంచి ఆటోను ఢీకొన్న కారు
కంచికచర్ల: ముందు వెళ్తున్న ఆటోను వెనుకనుంచి వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో ఆటోడ్రైవర్తో పాటు ప్రయాణికురాలు మృతి చెందిన ఘటన కంచికచర్లలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల మండలం కీసరకు చెందిన షేక్ బాబు(55) ఆటోడ్రైవర్ కిరాయి కోసం కంచికచర్ల వెళ్లాడు. అనంతరం కంచికచర్ల నుంచి నందిగామ కిరాయికి బయలుదేరాడు. కంచికచర్లలోని ప్రణీత కాలనీకి చెందిన పసుపులేటి కృష్ణమ్మ స్టీలు సామాన్ల వ్యాపారం చేసుకునేందుకు కీసర ఆటో ఎక్కింది. కంచికచర్ల పేరకలపాడుపాడు పెట్రోలు బంక్ సమీపంలోకి రాగానే విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కారు ముందు వెళుతున్న ఆటోను బలంగా ఢీకొంది. ఘటనలో ఆటోడ్రైవర్ బాబు అక్కడికక్కడే మృతి చెందగా మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆటో కందకంలోకి పల్టీ కొట్టి నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నారు. ఆటోడ్రైవర్ బాబుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.ఆటోడ్రైవర్తో పాటు మహిళ మృతి -
బందరులో 5కే రన్
మచిలీపట్నంటౌన్: జనగణన – 2027కు సంబంధించి 5కే రన్ను శనివారం నగరంలో నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం. నవీన్ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. భారతదేశ జనగణన జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ మీదుగా తిరిగి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు 5కే రన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవో సాంబశివరావు, ట్రైనింగ్ డెప్యూటీ కలెక్టర్ నిఖిల, కలెక్టరేట్ ఏవో రాధిక, కమిషనర్ బాపిరాజు, వివిధ శాఖల ఉద్యోగులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పామర్రు: విజయవాడ–మచిలీ పట్నం జాతీయ రహదారిలో కారు అదుపు తప్పి కాల్వలోకి పడిన సంఘటన శనివారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు ఓ కారులో దంపతులు ప్రయాణిస్తున్నారు. ఈ కారు స్థానిక 14వ మైలు రాయి వద్దకు చేరుకోగానే అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న దంపతులకు గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు కారులో ఉన్న వారిని బయటకు తీశారు. వారిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవింగ్చేసే వ్యక్తి నిద్రమత్తులోకి జారడమే దీనికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 3 నుంచి జూన్ 2వ తేదీ వరకు క్రికెట్ కోచింగ్ శిబిరాలను నిర్వహించనున్నామని కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలు మాత్రమే సమ్మర్ క్యాంప్లో పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోచింగ్ శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విజయవాడ ఎంజీ రోడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని సీ–బ్లాక్లో ఉన్న కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల మైదానంలో శిక్షణ పొందాలనుకునేవారు 91779 91616, అజిత్సింగ్నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో 93934 44279, జగ్గయ్యపేటలో 93469 68443, నూజివీడులో శిక్షణ పొందాలనుకునేవారు 73863 47777 నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. -
మెప్మా ఎన్నికలో హైడ్రామా!
తిరువూరు: తిరువూరు మున్సిపాలిటీలోని మెప్మా టీఎల్ఎఫ్ కార్యవర్గ ఎన్నికలో టీడీపీలోని రెండు గ్రూపుల మధ్య శనివారం హైడ్రామా నడిచింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించేందుకు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. శనివారం పట్టణంలోని 33 మంది సభ్యుల్లో 29 మంది విచ్చేశారు. ఎంపీ వర్గానికి చెందిన కొలికపోగు రామకోటమ్మను అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ 26 మంది ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు డెక్కా నవ్యను ఆ పదవికి ప్రతిపాదించారు. ఎంపీ వర్గం మెప్మా కార్యవర్గ ఎన్నికను ఏకపక్షంగా నిర్వహించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆందోళనకు ఉపక్రమించారు. ఎంపీ అనుచరులు ఆయనకు పోటీగా ఆందోళన చేపట్టారు. రామకోటమ్మను అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని ఎంపీ వర్గం నినాదాలు చేసింది. తాత్కాలికంగా ఎన్నిక వాయిదా వేయాలని మున్సిపల్ కమిషనర్కు మెప్మా ప్రాజెక్టు డైరెక్టరు సమాచారమిచ్చినా అధికారులు లేకుండానే మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ ఎన్నిక చెల్ల దని, మళ్లీ ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. -
ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ‘మంగినపూడి’
మంత్రి రవీంద్ర కోనేరుసెంటర్: మంగినపూడి బీచ్ను రాష్ట్రంలోనే ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధులు రూ. 96.78 లక్షల వ్యయ అంచనాతో మచిలీపట్నం నియోజకవర్గంలోని మంగినపూడి బీచ్ వద్ద మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పనకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడ పర్యాటకంతో పాటు మత విశ్వాసాలకు సంబంధించిన సంప్రదాయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుండటంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగిందని చెప్పారు. ఇందులో భాగంగా ఆధునిక మరుగుదొడ్లు, కాఫీ షాప్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏపీఎండీసీ ద్వారా సీఎస్ఆర్ నిధుల కింద ఉపయోగిస్తారన్నారు. డచ్, బ్రిటీష్, పోర్చుగీస్ కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు ఉన్న నేపథ్యంలో విదేశీయులు కూడా ఈ ప్రాంతంపై ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి ‘కొండ’!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖలో అతనొక దిగువస్థాయి ఉద్యోగి. కానీ ఏకంగా అవినీతి నిరోధక శాఖ అతనిపై వలపన్ని పట్టుకొని అరెస్ట్ చేసే స్థాయిలో అవినీతికి పాల్పడి సంచలనం సృష్టించిన సంఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ గవర్నరుపేట సర్కిల్ కార్యాలయంలో కొండపల్లి శ్రీనివాసరావు ఆఫీస్ సబార్డినేట్గా (అటెండర్గా) పని చేస్తున్నాడు. అతనిపై అనేక ఆరోపణలు వస్తుండటంతో అవినీతి నిరోధక శాఖ గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన వలపన్ని పట్టుకుంది. రూ.16 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అనంతరం కొండపల్లి శ్రీనివాసరావు రిమాండ్ విధించగా ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చాడు. అలాగే ఆ శాఖలో సస్పెన్షన్లో ఉన్నాడు. ఆదాయానికి మించి ఆస్తులు.. తాజాగా కొండపల్లి శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా అవినీతి నిరోధక శాఖ విచారణలో వ్యక్తమైంది. దాంతో ఆయనపై మరో కేసు నమోదు చేసి శుక్రవారం నగరంలోని శ్రీనివాసరావు ఇంటితో పాటుగా ఆయన బంధువులకు చెందిన మరో రెండు ఇళ్లలో మొత్తం మూడు ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేసి సోదాలు నిర్వహించారు. అందులో వెండి, బంగారంతో పాటుగా పలు, ఆస్తి పత్రాలు కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో వెలుగు చూసిన ఆస్తులలో ఒక భవనం, ఒక ఇంటి స్థలం, ఐదు బంగారు బిస్కెట్లతో కలిపి సుమారు 760 గ్రాముల బంగారం, సుమారు 7,800 గ్రాముల వెండి, బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ. 22లక్షల నగదు నిల్వలు, కొంత మొత్తంలో చేతి నగదు, విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, రెండు మోటార్ సైకిళ్లు, విలువైన గృహోపకరణాలు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ నిందితుడు, ఆయన భార్య, కుమారుడి పేర్ల మీద ఉన్నాయి. ఇవన్నీ విజయవాడ నగర పరిధిలోనే ఉన్నాయి. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లుగా అధికారులు ప్రకటించారు. కొండపల్లి శ్రీనివాసరావును నిబంధనల ప్రకారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
అమ్మో.. నిమ్మ!
నిమ్మకాయల ధరహాసంతో వినియోగదారుల కళ్లు బైర్లు! వత్సవాయి: ఉమ్మడి జిల్లాలో భానుడు సెగలు కక్కుతున్నాడు. ఎండ తీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. విపరీతమైన వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు అందరూ చల్లని పానీయాల వైపు చూస్తున్నారు. అందులో నిమ్మరసానికి ప్రథమ స్థానం ఉంటుంది. అయితే ఆ నిమ్మ ధరలు చూస్తే.. అమ్మో అనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎక్కి కూర్చొంది. ప్రస్తుతం మార్కెట్లో నిమ్మకాయ ధర ఒకటి పది రూపాయల వరకు కాయ సైజును బట్టి అమ్ముతున్నారు. అంటే డజను కాయలు దాదాపు రూ. 100 నుంచి రూ. 120కి విక్రయిస్తున్నారు. డిసెంబర్ వరకు కాయ రెండు రూపాయలు వరకు ఉన్న ధర.. వేసవికాలం పుణ్యమా అని పదికి చేరింది. -
మలేరియాను సమూలంగా నిర్మూలిద్దాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): మలేరియాను సమూలంగా నిర్మూలించి, మలేరియా రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించి, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ జిల్లాలో మలేరియాపై నిరంతరం పోరాటం చేస్తూ, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మలేరియా అధికారి రాజు నాయక్, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతిదేవి, ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాధవీనాయుడు, డీపీఎంఓ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. పటమట(విజయవాడతూర్పు): అమృత్ 2.0 పనులను మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డెప్యూటీ సెక్రటరీ గ్రేస్ లాల్రిండికి పచువా శుక్రవారం పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని కనకదుర్గా నగర్లో నిర్మాణంలో ఉన్న ఈఎస్ఎల్ఆర్ను పరిశీలించి, పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సీఈ సత్యకుమారి, ఏపీయూ ఎఫ్ఐడీసీ ఎస్ఈ ఎన్వీ రావు, పీడీఎంసీటీం లీడర్ టి. ఆంజనేయులు, వీఎంసీ సర్కిల్–3 ఈఈ జి. సామ్రాజ్యం పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడలపై యువత మక్కువ చూపడం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందవచ్చని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి (అండర్–19) రవికాంత అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఎన్టీఆర్ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్ శుక్రవారం జరిగింది. అండర్–15, అండర్–19 బాయ్స్ అండ్ గరల్స్ విభాగంలో వేర్వేరుగా పోటీలను నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు వైజాగ్లో మే నెలలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి జట్టులో ఎంపికై న క్రీడాకారులను ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్థి అధికారి కె.కోటేశ్వరరావు పతకాలు అందజేసి అభినందించారు. ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ వేడినీటి కాలువ వంతెనపై వెళ్తున్న కారులో అనూహ్యంగా మంటలు చెలరేగిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న వారు కారును నిలిపేసి కిందకు దిగారు. సమీపంలో ఉన్న వాహనదారులు ఆగి ఉన్న లారీల్లోని బక్కెట్లతో కాలువలో నీటిని తీసుకొచ్చి చెలరేగిన మంటలపై పోయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక సమస్యతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. నీరు అందుబాటులో లేని ప్రదేశంలో మంటలు చెలరేగి ఉంటే కారు మొత్తం దగ్ధమై ఉండేది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి అపాయం జరగలేదు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కారును రోడ్డుపై నుంచి పక్కకు తరలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
వెల లేక విలవిల!
దిగుబడీలా..తిరువూరు: ఏటా వేసవిలో మామిడి కాయల ఎగుమతులు, దిగుమతులతో కళకళలాడే తిరువూరు డివిజన్లోని మార్కెట్లు ఈ ఏడాది దిగుబడి లేక వెలవెలబోతున్నాయి. దీర్ఘకాలంగా మామిడి తోటల సాగుతో జీవనం సాగించే రైతాంగం వాతావరణ ప్రతికూలత, ఉన్న తోటల్లో తెగుళ్లతో పూత, పిందె రాలిపోయి వాటిని కోనేవారు ముందుకు రాలేదు. తిరువూరు డివిజన్లోని ఐదు మండలాల్లో 60వేల ఎకరాల మామిడి తోటలుండగా ఈ ఏడాది 30వేల ఎకరాల్లో నామమాత్రంగా కాపు నిలిచింది. మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న బంగినపల్లి రకం మామిడికాయలు మాత్రం పూర్తిగా కనుమరుగవడంతో ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, చైన్నె తదితర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఈ ఏడాది ముఖం చాటేశారు. మామిడి సీజన్లో ఎగుమతి, దిగుమతి కూలీలు, దళారులు, లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్ల డ్రైవర్లు వందలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతుండగా, మార్కెట్ ప్రతికూలతతో పరిస్థితి తారుమారైంది. తెగుళ్లతో నష్టాలు.. ఏటా పూత దశలోనే ప్రారంభమవుతున్న తెగుళ్లు పిందెదశలో ఉద్ధృతమై కాపు నేలరాలిపోయి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఈ ఏడాది సైతం నల్లతామర, తేనెమంచు తెగుళ్లతోపాటు ఇతర తెగుళ్ల కారణంగా మామిడికాయలు నేలరాలిపోతున్నాయి. తోతాపురి, చిన్న రసాలు, పెద్ద రసాల దిగుబడి సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్లో గిరాకీ లేకపోవడంతో తక్కువ ధరకే అమ్మక తప్పని స్థితి నెలకొంది. వాతావరణ ప్రభావంతో రైతులు భయపడి సీజన్ ప్రారంభం నుంచే ఎదుగుదల రాకపోయినా కాయలు కోసి అమ్మేసుకోవడంతో ధర గిట్టుబాటు కావట్లేదు. సీజన్ మొదట్లో తోతాపురికి టన్ను రూ.25వేలు, రసాలు రూ.35వేల చొప్పున ధర పలకగా, ప్రస్తుతం సగం ధర కూడా రావట్లేదని రైతులు వాపోతున్నారు. బంగినపల్లి రకానికి టన్ను రూ.30వేలకు పైగా ధర పలుకుతున్నా మార్కెట్లో కనిపించట్లేదు. మామిడి రుచి చూద్దామని ఆశించేవారికి డజను కాయలు వందలాది రూపాయల ధర పలుకుతుండటంతో వెనక్కు తగ్గుతున్నారు. -
కబళిస్తున్న
కాలకూటం! ఏ.కొండూరులో విజృంభిస్తున్న కిడ్నీ భూతంతిరువూరు: ఏకొండూరు మండలంలో కిడ్నీవ్యాధి శాశ్వత నివారణకు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు పేదలకు అక్కరకు రావట్లేదు. కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరాకు ఇబ్రహీంపట్నం నుంచి ఏకొండూరు మండలానికి పైపులైన్ల ఏర్పాటు ప్రక్రియ రెండేళ్లుగా నత్తనడకన సాగుతోంది. కిడ్నీ రోగాల బారిన పడిన వారికి ఏకొండూరు, తిరువూరులలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ వ్యాధి నివారణకు అవసరమైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవట్లేదు. నెఫ్రాలజిస్టులను నియమించి సకాలంలో చికిత్స అందిస్తే గిరిజనులు కిడ్నీ వ్యాధి కారణంగా మృత్యు ఒడిని చేరకుండా అరికట్టవచ్చని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఏకొండూరులో ఇదీ పరిస్థితి.. ప్రస్తుతం ఏకొండూరు మండలంలో 23 మంది కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకుంటుండగా, 2 శాతం సీరం క్రియాటిన్తో 175 మంది, 1.5 శాతం క్రియాటిన్తో 81 మంది చికిత్స పొందుతున్నారు. జలజీవన్ మిషన్ పథకంలో సుమారు రూ.45కోట్ల వ్యయంతో అన్ని గ్రామాలకు రక్షిత మంచినీరందించడంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని పలు గ్రామాల కిడ్నీ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైతన్యనగర్, కుమ్మరకుంట్ల, ఏకొండూరు, గోపాలపురం, అట్లప్రగడ, కోడూరు, మారేపల్లి, చీమలపాడు, కృష్ణారావుపాలెం, మాధ వరం, కేశ్యా తండా, ఏకొండూరు తండా, రేపూడి తండా, పెదతండా, గామా తండాలలో మూడు నెలల్లో 10కి పైగా కిడ్నీ రోగుల మరణాలు సంభవించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రాజెక్టు పూర్తయ్యేదెప్పుడు? కిడ్నీ రోగాల బారిన పడకుండా ఏకొండూరు మండలంలోని అన్ని గ్రామాలకు, తండాలకు కృష్ణా నదీ జలాలందించే పైలెట్ ప్రాజెక్టుకు పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిచేసి నీరందిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు ప్రకటించినప్పటికీ కార్యాచరణలో అడుగు ముందుకు పడలేదు. గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులకు రక్షిత నీరందించడానికి ప్రధాన పైపులైన్ల నిర్మాణం, ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరందించే ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతాయో అధికారులు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి సరఫరా చేస్తున్న నీరు పాత పైపులైన్ల లీకేజీతో పలుచోట్ల వృథాగా పోతోంది. అన్ని గ్రామాల్లో కొత్త పైపులైన్లు నిర్మిస్తామని గతంలో అధికారులు చెప్పినా పాత పైపులైన్లతోనే సరఫరా చేస్తున్నారు. రక్షిత మంచినీరందక కిడ్నీవ్యాధి బారిన పడిన గిరిజనులకు డయాలసిస్ చేయించడంతో పాటు సత్వర చికిత్స అందించాలి. నెఫ్రాలజిస్టును రెగ్యులర్ ప్రాతిపదికన నియమించి ఏకొండూరు ఆస్పత్రిలో వైద్యసేవలు లభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డయాలసిస్ బారిన పడిన వారికి పౌష్టికాహారం కూడా సక్రమంగా అందించాలి. – మేకల డేవిడ్, ఏకొండూరు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో యుద్ధప్రాతిపదికన ఏకొండూరు మండలానికి కృష్ణా జలాలు అందించేందుకు నిధులు కేటాయించి పనులు చేపట్టగా... గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగారుస్తోంది. అధికారుల పర్యవేక్షణాలోపం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఏకొండూరు మండలంలో గిరిజనులు కిడ్నీవ్యాధి బారిన పడి చనిపోతున్నారు. వెంటనే పైలెట్ ప్రాజెక్టు పూర్తిచేసి అన్ని గ్రామాలకూ కృష్ణా జలాలు అందించాలి. – నల్లగట్ల స్వామిదాసు, తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి -
పర్యావరణ అనుమతుల కోసం హెల్ప్ డెస్క్
లబ్బీపేట(విజయవాడతూర్పు): పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పి. శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలు అన్ని వర్గాల పరిశ్రమలకు(రెడ్, ఆరెంజ్, గ్రీన్) అనుమతులు పొందేందుకు ఏపీఓసీఎంఎంఎస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉందన్నారు. చాలా పరిశ్రమలు దరఖాస్తులను పూరించేందుకు కన్సల్టెంట్లపై ఆధారపడుతున్నట్లు తెలిపారు. దీంతో దరఖాస్తులను పూర్తిగా పూరించకపోవడం, అవసరమైన పత్రాలను సమర్పించకపోవడంతో పరిశీలనలో జాప్యం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ పీసీబీ చైర్మన్, సభ్య కార్యదర్శి ఈ విషయాన్ని గమనించి దరఖాస్తుల పరిశీలనలో ప్రాంతీయ కార్యాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించినట్లు తెలిపారు. వారి ఆదేశాల మేరకు విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
కృష్ణా వర్సిటీలో ప్రాంగణ ఎంపికలు
కోనేరుసెంటర్: కృష్ణా యూనివర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులకు శుక్రవారం ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య కె. రాంజీ లాంఛనంగా ప్రారంభించారు. టాటా ఎలక్ట్రానిక్స్, కియా మోటార్స్ తదితర కంపెనీలు10కి పైగా కృష్ణా యూనివర్సిటీకి విచ్చేసి విద్యార్థులను ఎంపిక చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ గతేడాది మాదిరిగా ప్రతి విద్యార్థికి ఉద్యోగావకాశం కల్పించి ఈ నెలాఖరులో అచీవర్స్ డే పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పిలిపించి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈరోజు జరిగిన ప్రాంగణ ఎంపికల్లో వర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల నుంచి 228 మందిని ఫైనల్ రౌండ్కి ఎంపిక చేసినట్టు వర్సిటీ ప్రాంగణ ఎంపికల డైరెక్టర్ ఆచార్య వైకే సుందర కృష్ణ తెలిపారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎంవీ బసవేశ్వర రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని మే ఒకటో తేదీన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ జరుగనుంది. ఒకటో తేదీ శుక్రవారం తెల్లవారుజామున 5.55గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా సిద్ధం చేసిన పూలవాహనంపై శ్రీగంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామివార్లు కొలువై ఉండగా ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమై కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కలరా హాస్పిటల్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణవీధి మీదుగా ఆలయానికి చేరుకుంటుంది. -
టికెట్ తనిఖీలతో 22 రోజుల్లో రూ.10 కోట్ల ఆదాయం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ టికెట్ తనిఖీల ద్వారా జోన్లోనే సరికొత్త రికార్డును నమోదు చేసు కుంది. ఈ నెలలో కేవలం 22 రోజుల్లోనే టికెట్ తనిఖీల ద్వారా రూ.10 కోట్ల ఆదాయం నమోదు చేసుకుంది. ఇది దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే ఒక చారిత్రాత్మక విజయంగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా కొనియాడారు. ఏప్రిల్ క్యాలెండర్ నెలలో ఏడు రోజులు మిగిలి ఉండగానే ఈ భారీ ఆదాయం జోన్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా నమోదైందన్నారు. గత అక్టోబర్ 2025లో డివిజన్ సాధించిన అత్యధిక ఆదాయం రూ.8.59 కోట్ల రికార్డును అధిగమించి ఈ అరుదైన ఘనత సాధించినట్లు డీఆర్ఎం తెలిపారు. టికెట్ లేని ప్రయాణికులను అరికట్టడంలో సిబ్బంది నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. సీనియర్ డీసీఎం బి.ప్రశాంత్కుమార్ మార్గదర్శకంలో ఏసీఎం ఐఎస్ఆర్ మూర్తి సారథ్యంలో టికెట్ తనిఖీ బృందాలు కీలక స్టేషన్లు, పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో పటిష్టమైన తనిఖీలు, ఆకస్మిక తనిఖీలతో టికెట్ లేని ప్రయాణికులు, బుక్ చేయని లగేజీలకు జరిమానాలు విధించడం ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో టికెట్ తనిఖీల ద్వారా డివిజన్ రూ.76.34 కోట్లు ఆదాయం నమోదు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా కమర్షియల్ అధికారులు, సిబ్బందిని డీఆర్ఎం ప్రశంసించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026తోట్లవల్లూరు: తోట్లవల్లూరు పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు.ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేత గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చంద్ర పునీతను ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తారని తెలిపారు. ఎన్నికల కమిషనర్ను కలిసిన వారిలో జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్, రాష్ట్ర కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, ఆర్టీసీ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నర్సయ్య, రాష్ట్ర ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కేశవ్ తదితరులు ఉన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వన్డే ఇంటర్నేషనల్ ఓపెన్ ఫిడే రాపిడ్ చెస్ టోర్నమెంట్–2026ను ఈ నెల 26న కానూరులోని స్పాట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తామని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీతో పాటు అండర్–7, 9, 11, 13, 15 బాల బాలికల విభాగంలో పోటీలు జరుగుతాయని చెప్పారు. టోర్నమెంట్లో పాల్గొనాలనుకునే వారు ఏపీ చెస్డాట్ఓఆర్జీ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాలకు 97007 75220, 92471 53387 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు నరసింహారావు. వత్సవాయి మండలం, పెంటాలవారిగూడెంలో నివసిస్తున్నారు. ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరానికి రూ.30వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది వర్షాలకు పత్తి దెబ్బతినటంతో ఆ నష్టాన్ని పూడ్చుకుందామని మొక్కజొన్న సాగు చేశారు. గాలివానకు పంట మొత్తం నేలవాలింది. వచ్చిన పంటను అమ్ముకుందామంటే కేంద్ర ప్రభుత్వం కింటాకు రూ.2400 మద్దతు ధర ప్రకటించినా మార్క్ఫెడ్ కొనుగోలు చేయడం లేదు. దళారులకు క్వింటాకు రూ.1600 నుంచి రూ.1700 కు అమ్ముకోవాల్సి వచ్చింది. కోత కూలీ గతంలో ఎకరానికి రూ. 3వేలు అయితే ఇప్పుడు ఏకంగా రూ.12 వేలకు పైగా అయింది. ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయాలని కోరుతున్నారు.ఇరవై ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ప్రభుత్వం మద్దతు ధరకు మొక్కజొన్నను కొనుగోలు చేయకపోవడంతో దళారులకు అమ్ముకొని నష్టపోయాం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఎకరానికి రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టాం. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో క్వింటాకురూ.600 నుంచి 700 చొప్పున.. సరాసరిన ఎకరాకు 20వేలకు పైగా నష్టపోయాం. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే లేడు. – ఉయ్యూరు మల్లారెడ్డి, రైతు, వేములపల్లి, కంచికచర్ల మండలం రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన మొక్కజొన్న దిగుబడులను అమ్మడానికి రైతులు అవస్థ పడుతున్నారు. గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆశ పడిన రైతులకు నిరాశే ఎదురవు తోంది. పంట చేతికొచ్చి నెల రోజులు దాటుతున్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత్యంతరం లేక దళారులను ఆశ్రయిస్తుండగా వారు అందిన కాడికి దోచుకుంటున్నారు. సాక్షి, ప్రతినిధి, విజయవాడ: మొక్కజొన్నకు మద్దతు ధర దక్కకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట చేతికొచ్చి దాదాపు నెలరోజులు దాటుతున్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో మొక్కజొన్న కల్లాలు, మార్కెట్ యార్డుల్లో మగ్గుతోంది. దళారులకు అమ్మలేక, ప్రభుత్వ కనీస మద్దతు ధర లభిస్తుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులు, తాము పడుతున్న కష్టాన్ని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదు. రూ.153 కోట్లకు పైగా నష్ట పోతున్న రైతులు ఎన్టీఆర్ జిల్లాలో 45,500, కృష్ణాలో 18,250 ఎకరాల్లో మొక్క జొన్న పంటను సాగు చేశారు. ఎకరాకు సరాసరిన 30–35 క్వింటాల దిగుబడులు వచ్చాయి. మొక్క జొన్న పంటకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2400. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం మార్కెట్లో మొక్కజొన్నను క్వింటాకు రూ.1600 నుంచి 1700 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. 20.40 లక్షల క్వింటాళ్ల జొన్న దిగుబడులు వచ్చాయి. రైతులు క్వింటాకు ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం రూ.750 నష్టపోతున్నారు. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు దాదాపు రూ.153 కోట్ల మేర కోల్పోతున్నారు. మినుము, పెసర పంటలదీ అదే పరిస్థితి పంట చేతి కొచ్చే సమయంలో ధరలు పతనమవుతున్నాయి. కృష్ణా జిల్లాలో మినుము 3.25 లక్షల ఎకరాలు, పెసర పంట 18వేల ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో మినుము పంట దిగుబడులు వస్తున్నాయి. నెలరోజుల క్రితం క్వింటాలు రూ.8,400కు మినుములను కొనుగోలు చేశారు. ప్రస్తుతం క్వింటాలు రూ.7700కు కొనుగోలు చేయడంతో రైతు క్వింటాకు రూ.700 నష్టపోతున్నారు. పెసల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. 7మాది తోట్లవల్లూరు మండలంలోని తోడేళ్ల లంక దిబ్బ గ్రామం. 5 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేస్తున్నాను. గతంలో కృష్ణా నది వరదలతో మినుము పూర్తిగా పాడైంది. తర్వాత మొక్క జొన్న సాగు చేస్తున్నాను. చాలా అప్పు చేశాను. ప్రస్తుతం ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు పండే అవకాశముంది. ఈ ఏడాది ఈదురు గాలులకు దిగుబడి తగ్గింది. ప్రభుత్వం మద్దతు ధరకు జొన్నను కొనుగోలు చేయడం లేదు. దళారులకు విక్రయించి నష్టపోతున్నాం. – గంగిశెట్టి సత్యనారాయణ, తోడెళ్ల లంక దిబ్బ, తోట్లవల్లూరు, కృష్ణా -
హాబీగా పుస్తక పఠనం
కోనేరుసెంటర్: విద్యార్థులు పుస్తక పఠనాన్ని హాబీగా అలవరచుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.రాంజీ పేర్కొన్నారు. విశ్వ విద్యాలయ సెంట్రల్ లైబ్రరీలో గురువారం నిర్వహించిన ప్రపంచ పుస్తక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రముఖులు ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడంతో ఉన్నతస్థాయికి చేరుకున్నారన్నారు. ఫోన్లు, కంప్యూటర్లతో కాలక్షేపం చేస్తున్నా పుస్తక పఠనాన్ని దిన చర్యలో భాగంగా మలచుకోవడం అవసరమన్నారు. రిజిస్ట్రార్ ఎన్. ఉష మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో భాషా పరిజ్ఞానం చాలా ముఖ్యమన్నారు. అది పుస్తక పఠనంతో పెంచుకోగలమన్నారు. తెలుగుతో పాటు ఆంగ్లం, హిందీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటే ఉత్తర భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం సెంట్రల్ లైబ్రరీ సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ డిప్యూటీ లైబ్రేరియన్ రమణ, కృష్ణా విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు సహాయ ఆచార్యులు వరుణకుమారి గ్రంథాలయాల ఆవశ్యకత, పుస్తక పఠనంపై ప్రసంగించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ప్రసంగించారు. తాళపత్ర గ్రంథాలు, భారత రాజ్యాంగంతో పాటు అరుదైన, విలువైన పుస్తకాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.కేయూ ఉపకులపతి ఆచార్య రాంజీ -
సాగు భూముల్లో మట్టి దందా!
కవులూరులో అనుమతుల్లేకుండా తవ్వకాలుజి.కొండూరు: బంగారంలాంటి సాగుభూములను కొందరు సర్వనాశనం చేస్తున్నారు. సంప్రదాయ సాగును వదిలేసి అధిక లీజుకు ఆశపడుతున్న భూ యజమానులు వారికి సాగు భూములను అప్పగించేస్తున్నారు. ఈ భూముల్లో భారీ గోతులు తవ్వి మొత్తటి నల్లమట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల పరిధి కవులూరులో కొన్ని రోజులుగా జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలకు జి.కొండూరు పోలీసులు బుధవారం రాత్రి అడ్డుకట్ట వేశారు. వివరాల్లోకి వెళ్తే.. కవులూరు శివారులోని వెలగలేరు హెడ్ రెగ్యులేటర్కు సమీపంలో 11 ఎకరాల సాగుభూములున్నాయి. వీటిలో కొందరు కొన్ని రోజులుగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ భూముల్లో చేపల చెరువులను ఏర్పాటు చేస్తున్నట్లు కొంత మట్టిని కట్టలుగా ఏర్పాటు చేసి తవ్వకాలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా పది అడుగుల మేర లోతుగా తవ్వకాలు చేసి రాత్రి వేళల్లో భారీగా మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఒక్కొక్క లారీ మట్టికి రూ.3 వేలు సదరు భూ యజమానులకు కొందరు ఇటుక బట్టీల నిర్వాహకులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. తవ్వకాల ఖర్చు, రవాణా చార్జీలను బట్టీల నిర్వహకులే చెల్లిస్తున్నారు. అధిక ఆదాయం వస్తుండటంతో మరి కొందరు వారి భూములను కూడా మట్టి తవ్వకాలకు లీజుకివ్వడానికి సిద్ధమవుతున్నారు. తవ్వకాలను అడ్డుకున్న పోలీసులు సాగు భూముల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు బుధవారం రాత్రి అక్కడికి చేరుకొని వాటిని అడ్డు కున్నారు. తవ్వకాలు జరిగే చోట 12 టిప్పర్ లారీలు, ఒక పొక్లయిన్ను స్వాధీనం చేసుకున్నారు. మట్టి తవ్వకాల కోసం అనుమతులు ఉంటే పూర్తి పత్రాలతో పోలీస్స్టేషన్కు రావాలని చెప్పారు. అప్పటి వరకు ఎటువంటి తవ్వకాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాగు కష్టమే మట్టి తవ్వకాలు పూర్తయిన తర్వాత పది అడుగుల మేర పల్లం కావడంతో ఇక ఆ భూమి సాగుకు పనికొచ్చే అవకాశం లేదు. మట్టి తవ్వకాలు చేసి విక్రయించిన అనంతరం చేపల చెరువులకు లీజుకిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా కవులూరులో 155.5 ఎకరాల విస్తీర్ణంలో 39 చెరువులను నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ శివారులో ఒక వైపు తారకరామ ఎత్తిపోతల పథకం, మరో వైపు బుడమేరు డైవర్షన్ కెనాల్ ఉండటంతో పుష్కలంగా నీరు అందుబాటులో ఉండి చేపల చెరువుల నిర్వహణకు అనువుగా మారింది. ఏడాదికి ఎకరానికి రూ.50 వేల వరకు లీజు ఇస్తున్న క్రమంలో రైతులు కూడా చెరువులకు ఇవ్వడానికి సిద్ధపడటంతో ఇక్కడ సాగు పడిపోతుంది. కొందరు రైతులు చేపల చెరువులకు లీజుకివ్వడంతో వాటి నుంచి వచ్చే ఊటతో పక్కన ఉన్న సాగు భూములపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో గత్యంతరం లేక ఇరుగుపొరుగు రైతులు కూడా లీజుకివ్వాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కవులూరు శివారులో సాగు భూముల్లో మట్టి తవ్వకాలు జరుపుతున్న అంశం బహిరంగమే అయినా రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు తవ్వకాలను అడ్డుకొని వాహనాలను స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా అధికారులు వెళ్లకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారుల అండదండలతోనే ఈ తతంగమంతా సాగుతోందని చర్చ జరుగుతోంది. -
విజయవాడ జీజీహెచ్లో అరుదైన శస్త్ర చికిత్సలు
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండు అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. అజిత్సింగ్నగర్కు చెందిన రాహుల్(16) గత కొద్ది నెలలుగా శ్వాస ఆడకపోవడంతో పాటు ముక్కు నుంచి రక్తం కారడం ప్రభుత్వ ఆసుపత్రి ఈఎన్టీ ఓపీడీలో సంప్రదించగా.. ఈ నెల 13న అడ్మిట్ చేసి అన్ని రక్త పరీక్షలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్ చేసి ముక్కు లోపలి జువైనెల్ నాసొఫాంజియల్ ఆంజియోఫైబ్రోమా పెరుగుతుందని నిర్ధారించారు. ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ కొణిదె రవి, మత్తు విభాగాధిపతి డాక్టర్ వినయ్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండల రావు సహకారంతో ముందుగా ఎంబోలైజేషన్ చేసి ఆ ట్యూమర్ని ఎండోస్కోప్ ద్వారా విజయవంతంగా తొలిగించారు. పేషెంట్ను ఈ నెల 22న డిశ్చార్జి చేశారు. ఇది మగ పిల్లలో కౌమారదశలో వస్తుందని హర్మోన్లు ప్రభావం వల్ల పెరుగుతుందని, అత్యంత ప్రమాదకరమని చేసి తెలిపారు, సర్జరీలో డాక్టర్ కె. రవి, డాక్టర్ అనిత, డాక్టర్ స్పందన, డాక్టర్ విజయ కృష్ణ, డాక్టర్ ఆదర్శ్, డాక్టర్ వినయ్, డాక్టర్ పావని, డాక్టర్ వైదేహి పాల్గొన్నారు. అలాగే నగరానికే చెందిన పి. రజని(33) గత కొద్ది నెలలుగా కుడివైపు ముక్కు నుంచి నీరు కారడం వల్ల ప్రభుత్వాసుపత్రి ఈఎన్టీ ఓపీడీకి వచ్చారు. ఆమెకి కపాలం అడుగు భాగం నుంచి నీరు వస్తోంది. వైద్యులు ఇది సీఎస్ఎఫ్రినోర్హియా అని నిర్ధారించారు. ఆమెకి సీటీ, ఎంఆర్ఐ చేయించి ఎండోస్కోపీ ద్వారా కపాలం అడుగు భాగం లీకుని అరికట్టడానికి ఈ నెల 16న వివిధ రకమైన అంటుకట్టులు (తొడ భాగం కండరాల పైనుండి తీసిన పొర, కొవ్వు, ఫైబ్రిన్ సీలెంట్) వాడి ఎంతో క్లిష్టమైన సర్జరీ విజయవంతంగా పూర్తిచేసి 22న డిశ్చార్జి చేశారు. -
వీఎంసీ కమిషనర్కు ప్రత్యేక అభినందన
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ 2025–2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా పన్ను వసూళ్లు చేసినందుకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. గురువారం సాయంత్రం జయప్రకాష్ నగర్లోని స్కూల్ అఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా)లో నిర్వహించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, రాష్ట్ర స్థాయి మునిసిపల్ కమిషనర్ల వర్క్షాప్లో ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. సురేష్ కుమార్ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రను సన్మానించారు. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, ఈ ఘనత వీఎంసీ సిబ్బంది సమష్టి కృషికి ప్రతిఫలమని తెలిపారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాగ నరసింహారావు, విజయవాడ నగరపాలక సంస్థ డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి.సృజన తదితరులు పాల్గొన్నారు. -
అరటి కాయల లోడు లారీ బోల్తా
గన్నవరం: జాతీయ రహదారి పక్కన లారీ బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు గాయపడిన సంఘటన గన్నవరం సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... అరటికాయల లోడుతో లారీ జార్ఖండ్ నుంచి జంషెడ్పూర్కు బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున లారీ స్థానిక శ్రీనివాస హేచరీస్ సమీపంలోని లారీ కాటా వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి లారీలో ఇరుక్కుపోయిన నలుగురి ని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురు స్పల్పంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కృష్ణా తీరంలో వ్యూ పాయింట్లు, ధ్యాన కేంద్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిని, కృష్ణాతీరాన్ని ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఇంజనీరింగ్, అభివృద్ధి పనులపై ఈవో శీనానాయక్ అధికారులు, ఎన్ఐఆర్ఎం, స్ఫాఅధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండపై అమ్మవారి దర్శనం మరింత సులభంగా, దివ్యంగా ఉండేలా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, దర్శనం అనంతరం కొండ దిగువకు చూస్తే పరవళ్లు తొక్కుతున్న పవిత్ర కృష్ణా నదీ సౌందర్యం భక్తుల మనస్సును పరవశింప చేసేలా మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందన్నారు. నదీ తీరంలో ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు కొండపై నుంచి వ్యూ పాయింట్లు, ధ్యాన కేంద్రాలను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, స్ఫా అందించే సహకారం, సమన్వయంతో ఇంద్రకీలాద్రిని మరింత సుందరంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చదిద్దాలని కోరారు. కార్యక్రమంలో దేవస్థాన ఈఈ కోటేశ్వరరావు, ఎల్.రమాదేవి, డీఈ రవీంద్రనాధ్ ఠాగూర్, ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి
విస్సన్నపేట: మండలంలోని లంబాడీ తండా గ్రామ పంచాయతీ బాణావతు తండాకు చెందిన వడిత్యా రాజేష్( 26)అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మండలంలోని చండ్రుపట్ల గ్రామంలో ఉన్న ఎన్ఎీస్పీ కాలువలో మృతదేహం ద్విచక్రవానంతో పాటు పడిఉండటాన్ని బుధవారం ఉదయం గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి... రాజేష్ విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో క్రికెట్ గ్రౌండ్లో పని చేస్తుంటాడు. రోజూ లాగే మంగళవారం పనికి వెళ్లాడు. అయితే రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. బుధవారం ఉదయం కాలువలో ద్విచక్రవాహనంతో పాటు శవమై పడి ఉన్నాడని, రాజేష్ను ఎవరో చంపి కాలువ వద్ద మృతదేహాన్ని పడేసి ఉంటారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్స్టేషన్ వద్దకు మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు చేరుకుని ఆందోళన చేశారు. ఇదే తరుణంలో అటుగా వెళుతున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ కారును అడ్డగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ లక్ష్మీశ ఎస్ఐ అర్జున్ రాజుతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
ప్రకృతి వ్యవసాయం పర్యావరణానికి శ్రేయస్కరం
గౌరంపాలెం(విస్సన్నపేట): ప్రకృతి వ్యవసాయం పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి మంచిదని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మండలంలోని తాతకుంట్ల పంచాయతీ గౌరంపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికారిత సంస్థ ఆధ్వర్యంలో లక్ష్మి అనే మహిళా రైతు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పంటలను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. సహజంగా పండించిన కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు తినటం వలన మీ ఆరోగ్యం, మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుందని, ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపాలన్నారు. తక్కువ ఖర్చుతో ఇంట్లో కూరగాయలు పండించుకోవటం వలన డబ్బులు ఆదా అవుతాయని, రసాయనాలు వాడని మంచి కూరగాయలు లభిస్తాయన్నారు. అనంతరం మండలంలోని చండ్రుపట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అవసరమైన గన్నీబ్యాగ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎ.కుమార్, తహసీల్దార్ కె.లక్ష్మీకళ్యాణి, ఎంపీడీఓ చేకు చిన్నరాట్నాలు, ఏఓ రాజ్యలక్ష్మి, పీడీఎస్ డీటీ శివనాగరాజు, ప్రకృతి వ్యవసాయం ఇన్చార్జి శ్రీనివాసరావు, ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. -
డిజిటల్ జనగణనపై విస్తృతంగా అవగాహన కల్పించాలి
ఎ.కొండూరు: మండల పరిధిలోని చైతన్య నగర్ తండా, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ జనగణనపై జిల్లా డీఆర్డీఏ, డ్వామా పీడీ, మండల తహసీల్దార్, ఎంపీడీఓలతో బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ జనగణనలో ఎ.కొండూరు మండలాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని వీవోఏలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు మండల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. డిజిటల్ జనగణనను ఫోన్లో ఎలా నమోదు చేయాలో కలెక్టర్ తన ఫోన్లో చేసి చూపించారు. ప్రజలు ఎవరికి వారు తమ సెల్ఫోన్లో డిజిటల్ జనగణన నమోదు చేసుకోవచ్చన్నారు. డిజిటల్ జనగణనపై అధికారులు ప్రతి రోజు సమీక్ష జరపాలని, ఈ కార్యక్రమం వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులపై ఆయన ఆరా తీశారు. పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ప్రతిరోజు కూలీలకు పనిదినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చైతన్యనగర్, బీసీ కాలనీకి త్వరితగతిన కృష్ణా నీరు సరఫరా జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఆ కాలనీకి అవసరమైన మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు. అనంతరం మండల పరిషత్ పాఠశాలలో కొబ్బరి మొక్కను నాటారు. కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారి నాంచారయ్య, డ్వామా పీడీ ఎ.రాము, ఆర్డబ్లూఎస్ ఎస్ఈ బాలశంకరరావు, ఆర్డీవో కుమార్ ఈఈ రామకృష్ణ, ఇరిగేషన్ డీఈ ఉమాశంకర్, తహసీల్దార్ ఉదయ్భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ లక్ష్మీశ -
నాలుగు రోజులుగా కట్టుబట్టలతోనే..
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి మక్కా యాత్రకు వెళ్లిన హాజీలు అక్కడ కట్టుబట్టలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. వారు నాలుగు రోజుల కిందట మక్కా చేరినా వారి లగేజీ ఇంకా ఇక్కడే ఉండటంతో అక్కడ వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రభుత్వం హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో 288 మంది ముస్లిం సోదరులను మక్కా పంపించింది. ఇందుకోసం మైనార్టీశాఖ మంత్రి, వివిధ మైనార్టీ విభాగాల నాయకులు గన్నవరంలో నాలుగు రోజులు పాటు నానా హడావుడి చేశారు. హాజీలతో పాటు వెళ్లాల్సిన వారి లగేజీ మాత్రం ఇక్కడే ఉండిపోయింది. లగేజీ రాక ఇబ్బందులు పడుతున్న హాజీలు ఫోన్ చేసినా అధికారులు తలో సమాధానం ఇచ్చారు. దీంతో ఇక్కడి వారి కుటుంబసభ్యులు అధికారులను నిలదీస్తే లగేజీ గన్నవరంలోనే ఉండిపోయిందని తెలిసింది. హజ్ కమిటీ, అధికారుల సమన్వయలోపం వల్లే లగేజీ మక్కాకు చేరుకోలేదని హాజీల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోల్కతా నుంచి నేడు విమానంలో తరలింపు హాజీలను తీసుకెళ్లిన విమానయాన సంస్థకు గన్నవరం నుంచి గానీ, చైన్నె, బెంగళూరుల నుంచి గానీ కనెక్టింగ్ విమానం లేకపోవడం వల్లే లగేజీ వెళ్లలేదని తెలిసింది. కోల్కతా నుంచి తమ విమానంలో లగేజీ పంపుతామని ఆ సంస్థ ప్రతినిధులు అధికారులకు చెప్పడంతో లగేజీని గన్నవరం నుంచి మంగళవారం రాత్రి రోడ్డుమార్గాన కోల్కతాకు పంపించారు. బుధవారం రాత్రి కోల్కతా చేరుకునే ఈ లగేజీని గురువారం ఉదయం తొమ్మిది గంటలకు అక్కడి నుంచి విమానంలో మక్కా పంపించనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో సభ నిర్వహించి హడావుడి చేసిన కూటమి నేతలు హాజీల లగేజీ విషయాన్ని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వ తీరుపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. -
20 కిలోల గంజాయి పట్టివేత
గన్నవరం: లారీ లో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల గంజాయిని బుధవారం గన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. చైన్నె – కోల్కతా జాతీయ రహదారిపై అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ శ్రీధర్ నేతృత్వంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో విశాఖపట్నం నుంచి చైన్నె వెళ్తున్న లారీలో ప్యాకింగ్ చేసిన 20 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ అలుగు సంగయ్యను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసైన సంగయ్య గంజాయి తరలింపును ఆదాయ మార్గంగా ఎంచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలి
తోట్లవల్లూరు: మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పనలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని వల్లూరుపాలెంలో కృష్ణానది తీరాన ఉన్న సొసైటీ భూముల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంటను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. మద్దతు ధర, కొనుగోళ్లకు సంబంధించి పలువురు రైతులతో అనిల్కుమార్ మాట్లాడి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకున్నారు. గత ఏడాది క్వింటా మొక్కజొన్నకు రూ.2200కు పైగా ధర లభిస్తే నేడు రూ.1700 మాత్రమే దక్కుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు రూ.500 వరకు నష్టం వాటిల్లుతోందని, ఎకరాకు రూ.20 వేల వరకు నష్టం కలుగుతోందని రైతులు తమ గోడును చెప్పుకున్నారు. రైతులు పండించిన మొక్కజొన్న, మినుము పంటలకు గిట్టుబాటు ధరను కల్పించకుండా ప్రభుత్వం గాలికొదిలేసిందని అనిల్కుమార్ ఆరోపించారు. మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపటం సరికాదన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు గ్రామగ్రామాన ఊదరకొట్టిన నాయకులు నేడు ఏమయ్యారని ప్రశ్నించారు. మొక్కజొన్నకు న్యాయబద్ధమైన మద్దతు ధర అందించి ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మినుము పండించిన రైతులకు కూడా సరైన మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంటలు దెబ్బతిన్న రైతులకు కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు గోడు పట్టని ఎమ్మెల్యే కుమార్ రాజా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్రాజాకు రైతుల గోడు ఏ మాత్రం పట్టటం లేదని అనిల్కుమార్ ఆరోపించారు. పండించిన పంటలకు మద్దతు ధర లేక మొక్కజొన్న, మినుము రైతులు ఇబ్బందులు పడుతున్నా, ఆయా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రాజా చొరవ చూపకపోవటం బాధాకరమన్నారు. ఆయనకు స్వప్రయోజనాలే తప్ప రైతుల సమస్యలు పట్టటం లేదన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు జొన్నల రామ్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చింతలపూడి గవాస్కర్ రాజు, నాయకులు మోర్ల రామచంద్రరావు, మైనేని తారాచంద్, తిరుమలశెట్టి వాసు, బడుగు శంకర్, ఈడ్పుగంటి రూబెన్, శీలం రమేష్, ఎంవీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పోరాడుదాం..నారీశక్తిని చాటుదాం
● నిర్భయంగా ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు మోసాన్ని ఎండగడదాం ● వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి ● పెడనలో ఐదు జిల్లాల మహిళా నేతల ఆత్మీయ సమావేశం పెడన: సమస్యలపై ప్రజాపోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరించడానికి వైఎస్సార్ సీపీ ప్రతి మహిళా కూడా ఒక ఆదిపరాశక్తిగా మారాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణాజిల్లా పెడనలో ఐదు జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన వైఎస్సార్ సీపీ మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతి నిధులు తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం.. అనంతరం సభను ఉద్దేశించి వరుదు కల్యాణి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అందరి ఆలోచనలు, సూచనలు, సలహాలు తీసుకుని, రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేద్దామన్నారు. జగనన్న మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఎంత చక్కటి పరిపాలన అందించారో స్వయంగా చూశామన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా ఇచ్చిన ప్రతి పథకం కూడా మహిళల పేరు మీద ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్ర బాబు నాయుడు చేస్తున్న అరాచాకాలపై ఒక చిరుతపులిలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి.. మహిళలపై చంద్రబాబుకు చిన్నచూపని, అందుకు నిదర్శనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు విషయంలో చంద్రబాబునాయుడు రెండు నాలుకల ధోరణియేనని వరుదు కల్యాణి దుయ్యబట్టారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో టీడీపీ ఎంపీలు విందులు, వినోదాల్లో పాల్గొనడం గమనిస్తే మహిళా బిల్లును వ్యతిరేకించారనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతా లను అనుసంధానిస్తూ పోర్టు, విమానాశ్రయం, పరిశ్రమలున్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మావిగన్ను రాజధానిగా చేస్తే బాగుంటుందని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన బ్రహ్మాండంగా ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించారని వరుదు కల్యాణి అన్నారు. అమరావతి వెనుక అవినీతి నెలకొందనే విషయాన్ని ప్రశ్నిస్తున్నందుకు డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. వరుదు కల్యాణికి తొలుత పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము, హారిక దంపతులు స్వాగతం పలికి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. సమావేశంలో కృష్ణాజిల్లా మహిళా అధ్యక్షురాలు, మాజీ డెప్యూటీ మేయర్ శీలం భారతి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర మహిళా సెక్రటరీ పేరం త్రివేణిరెడ్డి, స్టేట్ మహిళా విభాగం సమాచార విభాగం అధ్యక్షురాలు సంపత్తి విజిత, మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ కందుకూరి జ్యోతి, జాయింట్ సెక్రటరీ మునుపురి హరీష్య, గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ, బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు అశ్వినిరెడ్డి, గన్నవరం జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి, చీరాల నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మద్దులూరి సీతామాలక్ష్మి, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు పమిడిమళ్ల గీతా వసంతి, పెడన నియోజకవర్గ నాయకురాలు మైలా రత్నకుమారి, రాజులపాటి వాణి తదితరులు పాల్గొన్నారు. -
అన్న క్యాంటీన్కు వితరణ ఇవ్వండి
నాగాయలంక: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పునఃనిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా త్వరితగతిన ప్రారంభించాలనే సంకల్పంతో బుధవారం ఆలయ ముఖ మండపంలో చండీహోమం నిర్వహించారు. షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని తొలుత ఆలయంలో స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు. తదుపరి విజయవాడ నుంచి వచ్చిన జూపూడి యశ్వంత్శర్మ నేతృత్వంలో పండితుల బృందం హోమం నిర్వహించారు. చెన్ను లక్ష్మణరావు, అద్దేప్తి శ్రీనివాసరావు, పూషడపు నిరంజనరావు జంటలతో పాటు మరో రెండు జంటలు పూజలో పీటలపై కూర్చున్నారు. ఆలయ పునఃనిర్మాణం కోసం రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ రూ.కోటిన్నర అంచనా వ్యయంతో సీజీఎఫ్ నిధులు రూ.కోటి మంజూరు చేయగా పబ్లిక్ కాంట్రిబ్యూషన్ కింద రూ.50లక్షలు సమకూర్చారు. అయినా పనులు ముందుకు సాగని నేపథ్యంతో చండీహోమం తలపెట్లినట్లు కమిటీ సభ్యులు చెప్పారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ నిజామాబాద్కు చెందిన భక్తులు రూ. 17లక్షల విలువైన కాసుల హారాన్ని బుధవారం కానుకగా సమర్పించారు. నిజామాబాద్లోని ద్వారకానగర్కు చెందిన తోడుపునూరి శ్రీనివాస్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు 107.500 గ్రాముల బంగారం, పచ్చలు, ఎరుపు రంగు రాళ్లతో తయారు చేయించిన కాసుల హారాన్ని ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం దాతలకు వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. విస్సన్నపేట: రపభుత్వ పాఠశాలల్లో గతేడాది కంటే ఈసారి 20శాతం విద్యార్థుల అడ్మిషన్లు సంఖ్య పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఈఓ ఎల్. చంద్రకళ అన్నారు. మండలంలో కొండపర్వ ఎంపీపీ(హెచ్డబ్ల్యూ) పాఠశాలను బుధవారం సందర్శించారు. ఆ పాఠశాలలో కొత్తగా 12 మంది విద్యార్థులకు డీఈఓ చేతుల మీదుగా అడ్మి షన్లు ఇచ్చారు. మండలంలోని నరసాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 28 మంది విద్యార్థులకు అడ్మిషన్లు, విస్సన్నపేట జిల్లాపరిషత్ హైస్కూల్లో 45 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. ఎంఈఓ–1 శంకరరావు ఆయా పాఠశాలల హెచ్ఎం, టీచర్లు పాల్గొన్నారు. -
నవరాగం పలికించే.. యువరాగం పులకించే
విజయవాడ కల్చరల్: శ్రీ సద్గురు త్యాగరాజస్వామి 259వ జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న సంకీర్తనా గానం మధురంగా సాగింది. బుధవారం నాటి కార్యక్రమంలో త్యాగరాజస్వామి రచించి స్వరపరచిన కీర్తనలు శోభిల్లు సప్తస్వర, హెచ్చరిక కాగా రారా, మేలుకోదయానిధి, శోభనే, లాళియూగవే, శోభనే, శోభిల్లు సప్తస్వర, నీదయదా తదితర కీర్తనలకు గాయకులు గాన ప్రతిష్ట చేశారు. యుక్తశ్రీ కచేరీతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఓరుగంటి షణ్ముఖ ప్రియ, మల్లాది ఆహ్లాద్, ఆముక్త్, నయన, కీర్తన, పొన్నపల్లి రమాభగవాన్, డాక్టర్ చింతలపాటి మంజుల, బుర్రా నీలకంఠశాస్త్రి, పోపూరి గాయత్రి గౌరీనాథ్, కొండా శశిధర్(వీణ), విష్ణుబొట్ల సోదరీమణులు కీర్తనా యజ్ఞంలో పాల్గొన్నారు. బీవీఎస్ ప్రసాద్, జగన్మోహిని, కె.అరవింద్ వాద్యసహకారం అందించారు. త్యాగరాజ స్వామి, సీతా సమేత శ్రీరామచంద్రునికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామభక్తి సామ్రాజ్యాన్ని చాటిన కీర్తనలు కార్యక్రమాలను ప్రారంభించిన సద్గురు సంగీత సభ కార్యదర్శి గౌరీనాథ్ మాట్లాడుతూ త్యాగరాజ స్వామి సంకీర్తనలు రామభక్తి సామ్రాజ్యాన్ని చాటాయన్నారు. ఆయన రచించిన ఘనరాగ పంచరత్న కీర్తనలు భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. సంస్థ నిర్వాహకులు బీవీఎస్ ప్రకాష్లు పాల్గొన్నారు. -
దేవదాయ శాఖ కమిషనర్ను తక్షణమే తొలగించాలి
వైఎస్సార్ సీపీ నేత పోతిన మహేష్ వన్టౌన్(విజయవాడపశ్చిమ): హిందూత్వంపై, హిందూ దేవుళ్లపై నమ్మకం లేని ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ను తక్షణం తొలగించాలని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సుమారు ఐదు వేల ఎకరాల హిందూ ఆలయ భూములకు ఎన్వోసీలు జారీ చేసి నాలుగు వేల కోట్ల తక్కువ ధరకు అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. ఆ దర్యాప్తు ఏమైంది? టీడీపీ ప్రభుత్వం 2024 నవంబర్లో రామచంద్రమోహన్పై త్రీమెన్ కమిటీ విచారణకు వేసిందని, నాటి నుంచి నేటి వరకు ఈ త్రీమెన్ కమిటీ ఎందుకు దర్యాప్తు కొనసాగించడం లేదో తెలియటం లేదని పోతిన మహేష్ అన్నారు. ప్రభుత్వం భర్తీ చేయాల్సిన ఆరు పోస్టులలో రెండు పోస్టులను ఏ అధికారం లేకపోయినా అడ్డదారిలో నియామకం చేశారన్నారు. జీవో–888కు ఇష్టానుసారం మార్పులు చేర్పులు చేస్తూ, హైకోర్టులో కంటెంట్ నడుస్తున్నా లెక్కచేయకుండా ఫస్ట్ గ్రేడ్ ఆఫీసర్లు 26 మందిని, సెకండ్ గ్రేడ్ ఆఫీసర్లు 20 మందిని మొత్తం 46 మందికి అక్రమంగా ప్రమోషన్లు కల్పించారన్నారు. దాని ద్వారా సుమారు రూ.15 కోట్లు కమిషనర్, మంత్రి ఆనం పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఇదేం న్యాయం.. అవినీతి ఆరోపణలున్న తిమ్మానాయుడు, సురేష్బాబు విశ్వనాథరాజు, చక్రధరరావు వీరందరూ ఓసీ వర్గానికి చెందిన వారని, అందుకే వీరిని సస్పెండ్ చేయకుండా ప్రమోషన్లు కల్పిస్తూ కొనసాగిస్తున్నారని.. కానీ బీసీ సామాజిక వర్గాని కి చెందిన హేమలత, నాగరాజు, సీతారామయ్యలను మాత్రం సస్పెండ్ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరు ప్రధాన దేవాలయాల వద్ద ఆయా భూములను మద్యం, మాంసం అమ్మే ప్రైవేట్ హోటల్స్కు కట్టబెట్టేందుకు, 33ఏళ్ల లీజు కు ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. -
నేడు వీధినబడి!
నేడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీపడ్డాయి. ‘మన బడి నాడు–నేడు’ బడుల్లో వైఎస్ జగన్ సకల వసతులూ సమకూర్చడంతోపాటు విద్యా ప్రమాణాల పెంపునకు విశేష కృషి చేశారు. అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తో పాటు కార్పొరేట్ స్కూళ్ల తరహాలో బోధన ఉండేలా చూశారు. ఫలితంగా నాడు ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కట్టేవారు. దీంతో కొన్ని పాఠశాలల వద్ద ‘సీట్లు లేవు’ అనే బోర్డులూ కనిపించేవి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి తిరగబడింది. ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనను బాబు సర్కారు గాలికొదిలేసింది. విద్యాపథకాలకూ మంగళం పాడింది. ఫలితంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ బడుల్లో చేర్పించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపాధ్యాయులు వీధిన పడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి తమ స్కూల్లో పిల్లలను చేర్చాలని ప్రాథేయపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
క్రీడా శిక్షణ సమర్థంగా నిర్వహించాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వచ్చే నెలలో నిర్వహించనున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అత్యంత సమర్థంగా నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ ఎ.రవినాయుడు, ఎండీ ఎస్.భరణి అధికారులను ఆదేశించారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఉన్న శాప్ ప్రధాన కార్యాలయంలో సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్స్ నిర్వహణ గురించి, క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడా అకాడ మీలు, శాప్ లీగ్స్, క్రీడా యాప్ గురించి బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. రవి నాయుడు మాట్లాడుతూ వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మర్ క్యాంపులను స్కూల్ గేమ్స్ విభాగం, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ శాఖల సమన్వయంతో నిర్వహించాలన్నారు. శాప్ ఎండీ భరణి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో సమ్మర్ క్యాంపుల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పర్యవేక్షణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న శాప్ లీగ్స్ను జిల్లా యంత్రాంగం, స్థానిక క్రీడా సంఘాలు, విద్యాసంస్థలతో సమన్వయం చేసుకుని పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. అకాడ మీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిపుణులైన కోచ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రీడా యాప్ను మరింత సమర్థంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. శాప్ కార్యాలయ ఏఓ వెంకట రమావత్ నాయక్, క్రీడా విభాగం అధికారులు పాల్గొన్నారు. శాప్ చైర్మన్ రవి నాయుడు, ఎండీ భరణి -
పొత్తుపొడిచిన విభేదాలు!
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాపులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.4920 టీఎంసీలు. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు. 7వన్టౌన్: వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో హెల్మెట్ వాడకంపై బైకర్లకు అవగాహన కల్పించారు. తోట్లవల్లూరు: వల్లూరుపాలెంలోని సొసైటీ భూముల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంటను బుధవారం పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ పరిశీలించారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు ఒకరిపై మరొకరు మండిపడుతున్నారు. ఇటీవల మచిలీపట్నంలో జనసేన నాయకుడి ఇంటి కూల్చివేత ఘటనతో టీడీపీ, జనసేన మధ్య అంతరం పెరిగింది. ప్రస్తుతం అక్కడ జరిగే కార్యక్రమాలకు జనసేన దూరంగా ఉంటోంది. ఇటీవల అవనిగడ్డలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ శిలాఫలకంపై టీడీపీ నాయకుడి పేరు లేదని రచ్చ జరిగింది. విజయవాడ పశ్చిమంలో బీజేపీ కార్యక్రమాలకు టీడీపీ నేతలు దూరంగా ఉంటున్నారు. జగ్గయ్యపేటలో టీడీపీ, జనసేన నాయకులు ఎడముఖం, పెడముఖంగా వ్యవహరిస్తున్నారు. తిరువూరులో బీజేపీ, జనసేన నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో తగు ప్రాధాన్యం ఇవ్వలేదు. పెనమలూరులో బీజేపీ నేతలను కలుపుకొని పోవడం లేదు. మట్టి, ఇసుక అక్రమ వ్యాపారాల్లో స్థానిక నేతల మధ్య వాటాల్లో తేడాలు రచ్చకెక్కుతున్నాయి. మొత్తం మీద కూటమి పార్టీ నాయకుల మధ్య అంతరం రోజురోజుకూ పెరుగుతోంది. మచిలీపట్నం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి. బందరు కొబ్బరితోటలో జనసేన కార్యకర్త ఇంటిని అర్ధాంతరంగా కూల్చి వేయడంతో టీడీపీ, జనసేన మధ్య వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. జనసేన కార్యకర్త నిర్మిస్తున్న ఇంటిని టీడీపీ నేతలకు ముడుపులు చెల్లించలేదనే అక్కసుతోనే కూల్చివేశారు. టీడీపీ నేతలను వేడుకున్నా కూల్చివేత ఆపలేదని జనసేన నాయకులు ఆగ్రహించారు. దీంతో టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొ నేది లేదని బాయ్కాట్ చేశారు. పెడన నియోజకవర్గంలో ఆది నుంచి జనసేనకు టీడీపీ నాయకులు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికారిక కార్యక్రమాలకు జనసేన నాయకులకు సరైన సమాచారం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో గూడూరు మండలంలో టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కారుకు జనసేన నేత అడ్డంగా నిలబడి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయినప్పటికీ వైఖరికి మారకపోవడంతో జనసేనకు చెందిన మరో నాయకుడు నిరాహార దీక్షకు దిగాడు. మట్టి తోలకాల్లోనూ విభేదాలు ఉన్నాయి. పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి పర్యటనలకు జనసేన నాయ కులు దూరంగా ఉండి, పార్లమెంటు ముఖ్యనేత కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గన్నవరంలో టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి, జనసేన పార్లమెంటు ముఖ్యనేతకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. బాపులపాడు మండలంలో ఇంటి పన్ను పెంపు విషయంలో జనసేన నేతలు ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. సంక్రాంతి సంబరాల పేరుతో జరిగిన జూద శిబిరాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడంపై టీడీపీ నాయకులపై జనసేన నేతలు విమర్శలు గుప్పించారు. బాపులపాడు పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవంలో సైతం పార్లమెంటు ముఖ్యనేత పేరు లేకపోవడంతో జనసేన శ్రేణులు రగిలిపోతున్నాయి. విజయవాడ సెంట్రల్లో తమకు టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి ప్రాధాన్యం ఇవ్వడంలేదని జనసేన, బీజేపీ నేతలు లోలోన రగిలిపోతున్నారు. పార్టీలో తొలి నుంచి ఉన్నవారిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తమ అగ్రనేతలకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. విజయవాడ పశ్చిమంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య పలు విషయాల్లో సఖ్యత కొరవడింది. పార్లమెంటు ముఖ్యనేత, టీడీపీ నేతలు చేసిన పనులను పలు సందర్భాల్లో బహిరంగంగానే బీజేపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి వ్యతిరేకించారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, టీడీపీ నేతల మధ్య విభేదాలున్నాయి. జనసేన, టీడీపీ నాయకులకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి విలువ ఇవ్వడం లేదని ఇటీవల వాదోపవాదాలు జరిగాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అధికార పార్టీ కార్యక్రమాల సమాచారాన్ని తమకు ఇవ్వడం లేదని జనసేన, బీజేపీ నాయకులను ఆరోపిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూటమి నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తారస్థాయికి చేరాయి. -
‘పని బంద్’ పేరిట కార్మికుల ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. మంగళవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) విజయ వాడ కమిటీ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికులు పని బంద్ పేరిట ధర్నా నిర్వహించారు. నగర అధ్యక్షుడు టి.ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో మునిగిపోయారన్నారు. రోడ్లు ఊడ్చే కార్మికులకు జీతాలు లేక పస్తులు ఉంటే.. ప్రభుత్వం మాత్రం పండుగ చేసుకుంటుందన్నారు. బడా కాంట్రాక్టర్లకు పని చేయకముందే మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తున్నారని, పనిచేసిన కార్మికులకు నెల తర్వాత కూడా జీతం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. జీతాల కోసం మునిసిపల్ కార్మికులు ఆందోళన చేస్తుండగా.. మున్సిపల్ మంత్రి నారాయణ సింగపూర్ పర్యటనలో ఉండడం గర్హనీయమన్నారు. మార్చి నెల జీతాలు ఇవ్వలేదు.. ఏపీ మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ అండ్ ఫెడరేషన్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఏప్రిల్ నెల 21వ తేదీన వచ్చినా మార్చి నెల జీతాలు ఇవ్వలేదన్నారు. ఇదిగో.. అదిగో అంటున్నారే తప్ప కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదన్నారు. విజయవాడ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ.. మునిసిపల్ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో నగర ప్రధాన కార్యదర్శి ఎస్. జ్యోతిబసు, నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ టి. తిరుపతమ్మ, నగర ఉపాధ్యక్షురాలు ఎం.బుజ్జమ్మ, ఇతర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మునిసిపల్ వర్కర్ల జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ -
అంతర్ రాష్ట్ర నేరస్తుల అరెస్టు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి బంగారం చోరీ చేసిన ఘటనల్లో ఇద్దరు నేరస్తులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 216 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీస్స్టేషన్లో ఏడీసీపీ ఎం.రాజారావు ఈ కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కొండపల్లికి చెందిన ఇట్టా గోపీనాథ్ (25), దుంప రాంబాబు (25) మరో ఇద్దరితో కలిసి జిల్లాలోని ఆరు పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రివేళల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఎ.కొండూరు, గంపలగూడెం, ఇబ్రహీంపట్నంలో రెండు చోట్ల, తెలంగాణ రాష్ట్రం చందుగొండ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఈ చోరీల్లో రూ.32 లక్షల విలువైన 216 గ్రాముల బంగారం చోరీ చేశారు. విజయవాడ వన్టౌన్ ప్రాంతంలో మంగళవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న గోపీనాథ్, రాంబాబును సీఐ కిషోర్బాబు అదుపులోకి తీసుకుని విచారించగా, వారు చేసిన నేరాలను అంగీకరించారు. వీరితో పాటు చోరీల్లో పాల్గొన్న ఇద్దరు పరారీలో ఉన్నారు. 216 గ్రాముల బంగారం స్వాధీనంఇట్టా గోపీనాథ్ పదో తరగతి వరకూ చదవి ఆ తర్వాత కొంతకాలం ఆటో నడిపి అనంతరం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ దుంప రాంబాబు, దుంప సంపత్, చీమశెట్టి గోపికృష్ణ స్నేహితులయ్యారు. వారంతా మద్యం, పేకాట, కోడిపందేలు వంటి వ్యసనాలకు బానిసల య్యారు. డబ్బులు సరిపోక చోరీలు మొదలు పెట్టారు. రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడేవారు. గతంలో పలు కేసుల్లో అరెస్టయి జైలుకి వెళ్లొచ్చారు. నిందితులను అరెస్టు చేసి చోరీ సొమ్ము రికవరీ చేసిన సీసీఎస్ పోలీసులను పోలీస్ కమిషన్ ఎస్.వి.రాజశేఖరబాబు అభినందించారు. -
ఆముదాలపల్లిలో ఎన్డీఆర్ఎఫ్ మాక్డ్రిల్
గన్నవరం: ఉంగుటూరు మండలం ఆముదాలపల్లి పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో సామాజిక అవగాహన కార్యక్రమం జరిగింది. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు పాటించాల్సిన స్వీయ సంరక్షణ పద్ధతులు, తోటివారిని కాపాడటంపై ఎన్డీఆర్ఎఫ్ బృందం మాక్డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించింది. ప్రథమ చికిత్స, సీపీఆర్ చేసే విధానం, అగ్ని ప్రమాదాలు, తుపానులు, పిడుగుపాటు నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కమాండర్ ఇన్స్పెక్టర్ ప్రదీప్కుమార్ నేతృత్వంలోని రెస్క్యూ బృంద సభ్యులు కె.వెంకటేశ్వర్లు, జి.వెంకట్ నిర్వహించిన మాక్డ్రిల్ ఆకట్టుకుంది. మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకటబాలవర్దనరావు, తహసీల్దారు జాలాది విమలకుమారి, అగ్నిమాపక అధికారి ఎన్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ఓఆర్ఆర్ను 70 మీటర్లకే పరిమితం చేయాలి కృష్ణలంక (విజయవాడ తూర్పు): అమరావతి అవుటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) పేరిట రైతు లకు సీఎం చంద్రబాబు నష్టం కలిగిస్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రాష్ట్ర కన్వీ నర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. ఓఆర్ఆర్ను 240 మీటర్ల వెడల్పున నిర్మించాలన్న ప్రతిపాదనను విరమించి, 70 మీటరకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో మంగళవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవుటర్ రింగ్ రోడ్డు ప్రభావిత గ్రామాల రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. చాలా మహా నగరాలకే రింగ్రోడ్లు లేవని, ఇప్పుడిప్పుడే ప్రారంభమైన అమరావతికి 189 కిలోమీటర్లు రింగ్రోడ్డు అవసరమా అని చంద్రబాబును ప్రశ్నించారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండా, గ్రామసభలు నిర్వహించకుండా భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జాతీయ అధ్యక్షుడు, హై కోర్టు న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. రైతుల అనుమతి లేకుండా భూసేకరణ చేసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదన్నారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తే రైతులు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర అధ్య క్షుడు కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన సభలో సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, సీనియర్ నాయకుడు వై.కేశవరావు, కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకష్ణ, రైతు సంఘం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కార్యదర్శులు, నిర్వాసిత రైతులు పాల్గొన్నారు. కోడూరు: అభినవ మేల్కోటగా పేరుగాంచిన మండలంలోని ఉల్లిపాలెంలో వేంచేసిన శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామిని పోలీసు అధికారులు మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. స్వామికి అవనిగడ్డ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అభిషేక్ పూజలు చేశారు. ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిజీ ఆయనను దుశ్శాలువాలతో సత్కరించారు. ఆయన వెంట సీఐ యువకుమార్, ఎస్ఐ చాణిక్య ఉన్నారు. తైక్వాండో జట్ల ఎంపిక వీరులపాడు: మండలంలోని పొన్నవరం శివారులో ఉన్న అంతర్జాతీయ ఏకత్వ పాఠశాలలో కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా జట్ల ఎంపికలు జరి గాయి. ఎంపికై న క్రీడాకారులు తిరుపతిలో జరిగే ఐదో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా తైక్వాండో అధ్యక్షుడు బస్సే నాగప్రసాద్ తెలిపారు. ఈ ఎంపికలకు ఏకత్వా పాఠశాల డైరెక్టర్ డాక్టర్ మనోజ్ అమరనేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో కోచ్ దండు రత్నకాంత్, ఏకత్వ పాఠశాల వ్యాయామ విద్యా విభాగధిపతి విజయ్ కుమార్ గోగులమూడి, పీఈటీ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
ఆటో పల్టీ.. మహిళా కూలీ దుర్మరణం
నందిగామరూరల్: వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో పల్టీ కొట్టిన ఘటనలో మహిళ మృతి చెందగా మరో ముగ్గురు గాయాలైన ఘటన నందిగామ మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన 20 మంది వ్యవ్యసాయ కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామశివారులో మిర్చి కోతకు వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం సమయంలో స్వగ్రామం వస్తుండగా రామిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని ఎన్ఎస్పీ కాల్వ మలుపు వద్ద టైరు పేలి ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన కూలీలను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన ఎస్.నాగమణి (42)కి తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వై.వి.ఎల్. నాయుడు తెలిపారు. -
ఆపద నుంచి ఆలైవ్ రిడ్లీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అంతరించిపోతున్న అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల జాతి సరికొత్తగా ఊపిరి పోసుకుంటోంది. అటవీశాఖ, అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఫలించి ఈ జాతి వృద్ధిబాట పట్టింది. ఈ జాతి తాబేళ్లు పెట్టిన గుడ్లను సేకరించి, హేచరీల్లో పిల్లలను చేయించి వాటిని తిరిగి సముద్రంలోకి వదులుతూ ఆ జాతిని అభివృద్ధి చేస్తున్నారు. అవనిగడ్డ డివిజన్లో ఐదు చోట్ల హేచరీలను ఏర్పాటు చేసి ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సంరక్షిస్తుండగా, ఈ సంవత్సరం మచిలీపట్నం డివిజన్లో మరో రెండుచోట్ల హేచరీలను ఏర్పాటు చేయడం సత్ఫలితాలనిస్తోంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, నెల్లూరు, కావలి, బాపట్ల ప్రాంతాల్లో సైతం ఈ జాతి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఈ అన్ని ప్రాంతాల్లో నాలుగు లక్షల గుడ్లు సేకరించి పిల్లలను సముద్రంలోకి వదిలేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. జన్మించిన చోటకే వచ్చి గుడ్లు పెట్టే తాబేలు లెపిడోచెలిస్ ఒలివాసియా అనే సాంకేతిక నామంతో పిలిచే అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అట్లాంటిక్, ఫసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తాయి. ఈ జాతి మన దేశంలో బంగాళా ఖాతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుంది. ఆడ తాబేలు జన్మించిన తరువాత ఎక్కడ నుంచి సముద్రంలోకి వెళ్తుందో అక్కడ నుంచి 9 వేల కిలో మీటర్లు ప్రయాణించి తిరిగి అదే ప్రాంతానికి వచ్చి గుడ్లు పెడుతుంది. ఆలివ్ రిడ్లీ తాబేలు ఏటా డిసెంబర్ నుంచి మే మధ్య కాలంలో సముద్రం ఒడ్డుకు వచ్చి రాత్రివేళలో 60 నుంచి 150 వరకూ గుడ్లు పెడుతుంది. నచ్చిన ప్రాంతంలో ఇసుకలో అడుగు నుంచి రెండడుగుల లోతులో గుంత తీసి అందులో గుడ్లు పెడుతుంది. అనంతరం గుడ్లను ఇసుకతో కప్పేసి, పది నిమిషాలు అక్కడే ఉండి తిరిగి సముద్రంలోకి వెళ్తుంది. ఉష్ణోగ్రతలను బట్ట్టి ఆడ, మగ తాబేలు ఇసుక బొరియల్లో గుడ్లు పెట్టి వెళ్లాక ఉష్ణోగ్రతలను బట్టే ఆడ, మగ నిర్ధారణ అవుతుంది. 25 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతలో గుడ్డు నుంచి బయటకు వస్తే మగ, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య అయితే ఆడ తాబేలు అవుతుంది. అటవీ శాఖ సిబ్బంది గుడ్లను సేకరించి హేచరీలకు తరలిస్తారు. ఇక్కడ కూడా వాటికి సరిపడా ఉష్ణోగ్రతలను కొనసాగించి గుడ్లు బయటకు వచ్చాక సముద్రంలోకి వదులుతారు. ఈ అరుదైన తాబేళ్లను సంరక్షించేందుకు 2010లో అటవీశాఖ తొలిసారిగా అవనిగడ్డ డివిజన్లో రెండు చోట్ల హేచరీలను ఏర్పాటు చేసింది. తొలి ఏడాది రెండు వేల గుడ్లతో ప్రారంభమైన సేకరణ ఏటా పెరుగుతోంది. గతంలో పాలకాయతిప్ప, సంగమేశ్వరం, గుల్లలమోద లైట్హౌస్, ఐలాండ్, జింకపాలెంలో ఈ తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు ఉండేవి. ఈ ఏడాది మచిలీ పట్నం డివిజన్లో మంగినపూడి, పల్లెతుమ్మలపాలెంలో హేచరీలు ఏర్పాటు చేశారు. గత ఏడాది 542 తాబేళ్ల నుంచి 60,838 గుడ్లను సేకరించి హేచరీల్లో భద్రపరచి 53,769 పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఈ ఏడాది 655 తాబేళ్ల నుంచి 76,475 గుడ్లను సేకరించి ఇప్పటి వరకూ 39,647 పిల్లలను సముద్రంలోకి పంపించారు. ఈ ఏడాది 70 వేల పిల్లలను వదలాలన్నది లక్ష్యం. మార్చి నెలాఖరున ప్రారంభమైన ఈ ప్రక్రియ మే నెలాఖరు వరకూ కొనసాగుతుంది. ఆలివ్ రిడ్లీ తాబేలు గుడ్లు పెట్టిన తరువాత అడవి నక్కలు, అడవి పందుల నుంచి ప్రమాదం ఉంటుంది. తాబేలు గుడ్లు పెట్టే వరకూ ఆ పరిసరాల్లో నక్కలు, పందులు పొంచివుంటాయి. తాబేలు గుడ్డు పెట్టి వెళ్లాక వాటిని తినేస్తాయి. ఈ గుడ్లను కాపాడి సేకరించేందుకు అటవీ శాఖ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. వారు రాత్రి వేళల్లో సంచరిస్తూ తాబేళ్ల అడుగు జాడల ఆధారంగా గుడ్లను సేకరించి హేచరీలకు చేరుస్తారు. సముద్ర నీటిలో ఉండే ఈ రకం తాబేలు ప్రతి మూడు నుంచి నాలుగు గంటలకు ఒకసారి బయటకు వచ్చి గాలి తీసుకుని లోపలకు వెళ్తాయి. చేపల వేటకు ఉపయోగించే గిల్, ట్రాల్, ఘోస్ట్ వలలు వీటి పాలిట యమ పాశాలవుతున్నాయి. మరికొన్ని బోట్లుకు ఉండే పదునైన వస్తువులు తగిలి మరణిస్తున్నాయి. చేపల వేట సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అరుదైన ఈ జాతిని కాపాడిన వారవుతారని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. సముద్రంలో ఉండే మలినాలు, వర్థాలు, పాచి, నాచును ఆహారంగా తీసుకుని మత్స్య సంపద వృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు దోహద పడే ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. -
సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని పీఆర్టీయూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నవాబ్ జానీ డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నవాబ్ జానీ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సోల రాఘవరాజు మాట్లాడుతూ.. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలను గ్రేడ్–1 హెచ్ఎంలుగా పరిగణించాలని, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, గురుకులాలను ప్రభుత్వంలో విలీనం చేయాలని, కేజీబీవీ వారికి ఎంటీఎస్ వర్తింప చేయాలని, సీఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తిచేశారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరి రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇన్ సర్వీస్ వ్యాయామ ఉపాధ్యాయులకు బీపీఈడీ, ఎంపీఈడీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. జిల్లా జేఏసీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలను జిల్లా కలెక్టర్ల పరిధిలో చేపట్టాలని ఏపీ జేఏసీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కోరారు. ఏపీ సెక్రటేరియట్ డెప్యూటీ సెక్రటరీ డాక్టర్. బి.అప్పారావు, ఎన్టీఆర్ జిల్లా సీఆర్టీల సంఘం అధ్యక్షుడు గోపాల్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. -
ఇన్చార్జ్ కలెక్టర్ నవీన్
ఘంటసాల: గాన గాంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గాత్రం అజరామరమని కృష్ణాజిల్లా పర్యాటక శాఖ అధికారి గుండె రామ్లక్ష్మణ్ పేర్కొన్నారు. ఘంటసాల గ్రామంలో మధుర గాయకుడు వెంకటేశ్వరరావు నిర్వహించిన పాటల కచేరీకి 60 ఏళ్లు నిండిన నేపథ్యంలో ఘంటసాల కళా సమితి ఆధ్వర్యంలో ఏడాది పాటు నిర్వహించే ఆరు దశాబ్దాల ఉత్సవాలను రామ్ లక్ష్మణ్ మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్థానిక బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కళాసమితి అధ్యక్షుడు కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన సభలో రామ్ లక్ష్మణ్ ప్రసంగించారు. తెలుగు పాటకు వన్నె తెచ్చిన ఘంటసాల కృష్ణాజిల్లా వాసి కావడం మన అదృష్టమన్నారు. ఆయనను చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహుదూర్ గండపెండేరంతో గౌరవించడం, గ్రామస్తులు అంబారీపై ఊరేగించడం విశేషమన్నారు. కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ఘంటసాల వంశస్తుల అర్చకత్వం చేసిన శ్రీ జలదీశ్వరాలయంలో ఈ ఉత్సవాలను ప్రారంభించడం సంతోషకరమన్నారు. తొలుత ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘంటసాల చరిత్రతో కూడిన శ్రీ జలదీశ్వర స్వామి చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తాళ్లూరి ఫణి హరిప్రసాద్, పీఏసీఏస్ చైర్మన్ బండి పరాత్పరరావు, వేమూరి గోపాలకృష్ణ, కొండపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు: పాత వస్తువుల సేకరణకు గ్రీన్షాప్లు ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ పేర్కొ న్నారు. గంగూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఆయన ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి గ్రీన్షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గంగూరు గ్రామంలో మోడల్గా గ్రీన్షాప్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్తులు వారి వద్ద ఉన్న పాత వస్తువులు, ప్లాస్టిక్, ఇనుము, పేపర్, అట్టపెట్టెలు, స్టీల్, అల్యూమినియం, గాజు బాటిల్స్ ఉంటే గ్రీన్షాపునకు తీసుకు వచ్చి విక్రయించాలన్నారు. దీనికిగాను వస్తువుల విలువకు సరిపడా నిత్యావసర సరుకులు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ డాక్టర్ జె.అరుణ, కంకిపాడు ఎంపీపీ రాజ్యలక్ష్మి, గ్రామ ప్రత్యేకాధికారి ఓంకార్, ఎంపీడీవో శ్రీనివాసరావగు, టీడీపీ నాయకుడు కోయా ఆనంద్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాలికలకు పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించా లని వర్క్షాప్లో వక్తలు పేర్కొన్నారు. మంగళవారం గవర్నర్పేటలోని ఇరిగేషన్ కాంపౌండ్లో రైతు శిక్షణ కేంద్రంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, వసతి గృహాల బాలికల భద్రతా మార్గదర్శకాలు, సురక్షిత మౌలిక వసతులపై జిల్లా స్థాయి వర్క్షాప్ జరి గింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, హాస్టల్ వార్డెన్లు, కస్తూరిబా గాంధీజీ బాలికల విద్యాలయాల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా బేగం మాట్లాడుతూ ప్రతి పాఠశాల నందు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098, కంప్లైంట్ బాక్స్ ఉండాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రణాళికలతో ఉపాధ్యాయులు పని చేస్తున్నారని వివరించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రమేష్ బాబు మాట్లాడుతూ.. అన్ని పాఠశాలల్లో సమగ్ర శిక్ష ద్వారా బాలికల భద్రత, మౌలిక సదుపాయాలను క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఉపాధ్యాయుల సహకా రంతో పర్యవేక్షిస్తున్నారన్నారు. విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసవి మాట్లా డుతూ.. అన్ని పాఠశాలల్లో బాలికలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం బ్రోచర్ను ఆవిష్కరించారు. క్రాఫ్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ తంబీ, వై.జాన్సన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం. రాజేశ్వరరావు, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ భారతి, నోడల్ ఆఫీసర్ సీహెచ్ సాయి గీత తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి వర్క్షాప్లో వక్తలు -
త్యాగరాజ స్వామికి స్వరనీరాజనం
విజయవాడ కల్చరల్: శ్రీసద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో సద్గురు త్యాగ రాజ స్వామి జయంతి ఉత్సవాలు శివరామకృష్ణ క్షేత్రంలో సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు కళాకారులు త్యాగరాజస్వామికి స్వరనీరాజనాలు అర్పించారు. అన్త్వతమణి గాత్ర కచ్చేరీ శ్రావ్యంగా సాగింది. ఓరుగంటి సాయి వశిష్ట, కె.దుర్గాగాయత్రి, కె.లక్ష్మీవెంకట సత్యవల్లి, వావిలాల వేంకట రఘునామ ప్రణద, బొమ్మరాజు రఘనాథరావు, ఎం.చంద్రశేఖర్, కస్తూరి గోపాలరావు, కందుర్తి లక్ష్మీనరసమ్మ, తుషార పూర్ణవల్లి తదితరులు త్యాగరాజ స్వామి కృతులను వీనుల విందుగా ఆలపంచారు. సంగీత కళాశాల విశ్రాంత అధ్యాపకుడు ఎన్.సీహెచ్.బుచ్చయ్యా చార్యులు త్యాగరాజ మార్గం అంశంగా ప్రసంగించారు. నందకుమార్, చావలి శ్రీనివాస్, కె.జగన్మోహిని, కందుల అనిల్కుమార్ వాద్య సహకారం అందించారు. వెడలెను కోదండపాణి, రామ నామము జన్మరక్షణ మంత్రము, ఇక కావలసినది ఏమి, రామ ననుబ్రోవరా తదితర కీర్తనలు అలరించాయి. వారం రోజులపాటు నిర్వహించే త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలను సంస్థ అధ్యక్షుడు బి.వి.ఎస్.ప్రకాష్ ప్రారంభించారు. ప్రధాన కార్యదర్శి పోపూరి గౌరీనాథ్, ఉపాధ్యక్షుడు బి.హరిప్రసాద్, సభ్యులు గాయత్రీ గౌరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కిడ్నీవ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో నీటి నాణ్యతపై నిర్వహించిన ఆడిట్ నివేదికలను బహిర్గతం చేయాలని, తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న మూత్ర పిండ వ్యాధుల సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ మంచినీటి సరఫరా సంస్థ (ఏపీడీడబ్ల్యూఎస్సీ) ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ టి.గాయత్రీదేవికి వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం సోమవారం వినతిపత్రం అందజేసింది. నీటి కాలుష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాణాపాయ స్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. భూగర్భ జలాల్లో ఖనిజ లవణాలు, భార లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నందున, వెంటనే శుద్ధి చేసిన ఉపరితల జలాలను పైపుల ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభావిత గ్రామాల్లోని అన్ని ఆర్వో ప్లాంట్లు రోజుకు 24 గంటలూ పని చేసేలా చూడాలని, సాంకేతిక కారణాలతో ప్లాంట్లు నిలిచిపోవడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సదుపాయాలతో పాటు, వ్యాధి మూలా లను అరికట్టేందుకు శాసీ్త్రయమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని కోరారు. స్వచ్ఛమైన తాగు నీరందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని, కలుషిత నీరు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును కాలరాయడమేనని అన్నారు. ఎ.కొండూరు, మార్కాపురం ప్రజల ప్రాణాలు కాపాడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తనుబుద్ధి శేఖర్రెడ్డి ఉన్నారు. కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో నీటి నాణ్యతపై ఆడిట్ నివేదికలు బహిర్గతం చేయాలి ఏపీడీడబ్ల్యూఎస్సీకి వినతి పత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ బృందం -
కలెక్టరేట్లో ప్రత్యేక భద్రత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సందర్భంగా సోమవారం భద్రత ఏర్పాట్లు చేశారు. గత వారం నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు తనకు పరిహారం అందలేదంటూ కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్లో కారం చల్లి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పీజీఆర్ఎస్ నిర్వహించే పింగళి వెంకయ్య సమావేశ మందిరం ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. మహిళలను తనిఖీలు చేసేందుకు కేబిన్ ఏర్పాటు చేశారు. పీజీఆర్ఎస్లో అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. కలెక్టరేట్లోనూ అదనంగా పోలీసు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు. గతంలో ఒకరిద్దరూ పోలీసు కానిస్టేబుళ్లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను ఒక్కసారిగా పెంచేశారు. సామాన్యులను తనిఖీ చేయడమా! సీఎం, పీఎం వంటి నాయకుల సభలు, సమావేశాలు, ఇతర వీఐపీలు వచ్చిన సమయంలో తనిఖీలు చేసిన విధంగా కలెక్టరేట్లో పీజీఆర్ ఎస్కు వచ్చే వారిని తనిఖీ చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో వృద్ధురాలు కారం చల్లిందో.. ఆ పరిస్థితి తలెత్తకుండా చూస్తే సరిపోయేదని, అలా కాకుండా అర్జీలు సమర్పించేందుకు వచ్చే సామాన్యులను మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ప్రజా సమస్యలపై కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు పార్టీ నాయకులతో కలిసి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వేచ్ఛగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అర్జీ సమర్పించే అవకాశం ఉండాలని, ఏదో అనుకోని సంఘటన జరిగితే ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. మెటల్ డిటెక్టర్తో అర్జీదారులకు తనిఖీలు -
అన్న క్యాంటీన్లో సీఎం దంపతుల అల్పాహారం
పటమట(విజయవాడ తూర్పు): సీఎం చంద్రబాబు తన జన్మదినం సందర్భంగా పటమటలోని అన్న క్యాంటీన్లో సోమవారం సతీసమేతంగా అల్పాహారం తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలు బయట భోజనం చేయాలంటే రూ.100 చెల్లించాల్సిన స్థితిలో రూ.5కే ప్రభుత్వం మంచి ఆహారాన్ని అందిస్తోందన్నారు. ఈ క్యాంటీన్లకు ఇస్కాన్ ఫౌండేషన్ రుచికరమైన ఆహారాన్ని సరఫరా చేస్తోందని కొనియాడారు. తన పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల ఒకరోజు నిర్వహణకు రూ.76 లక్షల విరాళాన్ని తన భార్య భువనేశ్వరి అందించి స్ఫూర్తిగా నిలిచారన్నారు. మీడియాతో సీఎం మాట్లాడుతుండగా ఆయన వెంట ఉన్న ఎన్ఎస్జీ కమాండో నందలాల్ షా ఎండవేడికి తట్టుకోలేక అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. యూపీహెచ్సీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లాల్లోని యూపీహెచ్సీల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు సోమవారం మీ కోసంలో కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై. శ్రీనివాసరావు, పి. నాగరాజు, మచిలీపట్నం బ్రాంచి అధ్యక్షుడు బి. కోటేశ్వరరావు తదితరులు సమస్యలను వివరించారు. యూపీహెచ్సీల్లో పనిచేసిన కాలానికి (2016–2021) ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నియామక నోటిఫికేషన్లో సర్వీస్ వెయిటేజ్ మార్కులు కలపాలని కోరారు. జీవో నంబర్ 301 ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సర్వీస్ వెయిటేజ్ మార్కులు ఇవ్వమని ఉన్నప్పటికీ అధికారులు మార్క్స్ కలపకుండా ప్రభుత్వ ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతున్నారని డీఆర్వో దృష్టికి తీసుకెళ్లారు. ముగిసిన కొండపల్లి బొమ్మల పండుగ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని గత మూడు రోజులుగా జరుగుతున్న కొండపల్లి ఖిల్లా, కొండ పల్లి బొమ్మల పండుగ సోమవారం రాత్రి ముగిసింది. మూడురోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు బొమ్మల ప్రదర్శన, కళాకారుల ర్యాలీ ప్రదర్శనలతో పట్టణంలో ఉల్లాసాన్ని నింపాయి. ముంగిపు కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పూర్వం శ్రీ కృష్ణదేవరాయులు కాలంలో వీధుల్లో రత్నాలు రాసుల్లా పోసి అమ్మేవారని, నేడు కొండపల్లి బొమ్మలను రత్నాల్లా వీధుల్లో అమ్ముతున్నారని తెలిపారు. కొండపల్లి బొమ్మలు దేశానికి నిజ మైన వారసత్వ సంపద అన్నారు. కొండపల్లి బొమ్మల పోటీల్లో విజేతలుగా నిలిచిన శంకర్, గౌస్ బాషా, షేక్ ఖాజాకు వరుసగా రూ.30వేలు, రూ. 20వేలు, రూ. 10వేలను బహుమతులుగా అందజేశారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కలెక్టర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. అప్పు చేయడమే సంపద సృష్టా? గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనా అంటూ జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ. 3.50లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర లేదు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు పూర్తిగా అటకెక్కాయని, తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారని కూటమి పాలకులను ప్రశ్నించారు. సోమవారం విజయవాడలోని జై భీమ్ భారత్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లు కూడా నిండని కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో మూడున్నర కోట్లు అప్పులు చేసిందని, ఇందుకు గల కారణాలను స్పష్టం చేయాలన్నారు. ప్రతి మంగళవారం అప్పులు తెస్తూ మంగళవారం ప్రభుత్వంగా కూటమి మిగిలిపోయిందన్నారు. మావిగన్ ఓ మంచి ప్రతిపాదన ప్రతిపక్షనేత చేసిన మావిగన్ ప్రతిపాదనను ఈ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందో స్పష్టం చేయాలని శ్రావణ్ డిమాండ్ చేశారు. అమరావతిలో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రజలు రావడానికి వీల్లేదా అని ప్రశ్నించారు. వాళ్లేమైన అంటరాని వాళ్లా అని నిలదీశారు. -
డ్రోన్లు, రోబోల రూపకల్పన
గన్నవరం: ప్రభుత్వ ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఐదుగురు యువతీ యువకులు ఉన్నత ఉద్యోగ అవకాశాలను పక్కన పెట్టి స్వశక్తితో ఎదిగేందుకు గన్నవరం కేంద్రంగా లారా ఇన్నోవేషన్ సంస్థను ప్రారంభించారు. భారత రక్షణ రంగం, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా డ్రోన్లు, రోబోల డిజైన్ల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. స్థానిక రాయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని సోమవారం ఎండీ బి.చరణ్, సీఈఓ కె. మౌళీనాథ్ ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే పరిశోధనలు.. ఈ సందర్భంగా సంస్థ ఎండీ చరణ్ మాట్లాడుతూ తామంతా శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసినట్లు చెప్పారు. చదువుకునే రోజుల్లోనే ఇగ్నైటెడ్ మైండ్స్ ఆర్గనైజేషన్ను స్థాపించి సోషల్ సర్వీస్తో పాటు ప్రభుత్వ పాఠశాలలో స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా పరిచయమైన తామంతా కలిసి గత రెండేళ్లుగా డ్రోన్ల ప్రొపెలర్లు, రోబోల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు జరిపినట్లు చెప్పారు. ఈ అనుభవంతో డిజైన్ అండ్ డెవలప్మెంట్ హై ట్రస్ట్ డ్రోన్ ప్రొపెల్లర్స్, రోబోటిక్ రూపకల్పన ప్రాజెక్ట్ను ప్రారంభించినట్లు వివరించారు. భవిష్యత్లో భారత మిలటరీ, వ్యవసాయ రంగానికి అవసరమైన డ్రోన్ ప్రొపెల్లర్స్, రోబోటిక్ టెక్నాలజీని అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. సంస్థ ప్రతినిధులు జి. ప్రసూన, జి. సంధ్య, పి. విష్ణువర్థన్, స్థానిక పారిశ్రామికవేత్త అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026శ్రీసద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలు శివరామకృష్ణ క్షేత్రంలో సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. లబ్బీపేట: అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం విజయవాడ బందరు రోడ్డులో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్డ్రిల్ నిర్వహించారు. కోడూరు: ఉల్లిపాలెం గ్రామంలోని శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞం కనులపండువగా సాగుతోంది. 7 -
ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాస్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఓర్పుతో విని సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఏ ఒక్క అర్జీని నిర్లక్ష్యం చేయకుండా, నిర్దిష్ట గడువులో పరిష్కరించడం ద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అదే విధంగా అర్జీల పరిష్కారంలో ఆలస్యం, నిర్లక్ష్యం, లేదా అసంతృప్తికర స్పందనకు తావులేకుండా పనిచేయాలని హెచ్చరించారు. జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 113 అర్జీలు వచ్చాయి. వీటిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 26, పోలీసు శాఖకు 20, పంచాయతీరాజ్కు 15, రెవెన్యూకు 17 అర్జీలు ఉన్నాయి. వచ్చిన అర్జీల్లో కొన్ని.. -
నిత్యాన్నదానానికి విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి దాత గోసాలకు చెందిన ఎం. శ్రీనివాసరావు, పార్వ తీ దంపతులు సోమవారం రూ. 1,00,008 విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు ఈ విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఉచిత ప్రసాద వితరణకు విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణకు విజయవాడ మాచవరానికి చెందిన గోవి పాండురంగారావు, కోటేశ్వరి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. దుర్గమ్మ నిత్యాన్నదానానికి.. హైదరాబాద్ ఈసీఐఎల్కు చెందిన కొండూరి సమన్విత కుటుంబం దుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా అధికారులను కలిసి అమ్మవారి నిత్యాన్న దానానికి రూ. 1,01,116ల విరాళాన్ని అందజేసింది. వీరిని కూడా అధికారులు ప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. -
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి
ఉపాధి హామీ పథకంపై నీలినీడలు మధురానగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో పేద కార్మికులు రోడ్డున పడ్డారని.. ఉపాధి హామీ పథకంపై నీలినీడలు అలుముకున్నాయని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. స్థానిక విజయవాడ సత్యనారాయణపురం భగత్సింగ్ రోడ్డులోని యూనియన్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మార్చి, ‘జీరామ్ జీ’ పథకాన్ని తీసుకురావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. 2025–26 సంవత్సరానికి గానూ పనిదినాలు ఏకంగా 57.6 శాతానికి తగ్గించటం విచాకరమన్నారు. 2024–25లో 24.52 కోట్ల పనిదినాలు ఉంటే, ప్రస్తుత ఏడాదికి అవి 18.59 కోట్లకు పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో రాజకీయం.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి సుమారు 1,200 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని, నిజమైన కార్మికులకు పని కల్పించకుండా, కేవలం అధికార పార్టీ సానుభూతిపరులకే డబ్బులు చెల్లిస్తున్నారని గౌతంరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో 80వేల మంది వికలాంగ కార్మికులకు లబ్ధి చేకూరగా, ప్రస్తుత ప్రభుత్వంలో ఆ సంఖ్య 66వేలకు పడిపోయిందని అన్నారు. దర్శన టికెట్ల దందాపై సీఎంఓకి ఫిర్యాదు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో దర్శన టికెట్ల వ్యవహారం రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. గతంలో దర్శన టికెట్లను జిరాక్స్ కాపీలు తీసి అమ్మవారి దర్శనాలు చేయించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట దేవస్థాన ప్రోటోకాల్ దర్శనాలలో రూ. 500 టికెట్లను పదే పదే వినియోగిస్తున్న వ్యవహారం ఈవో దృష్టికి వచ్చింది. అయితే తాజాగా ఓ భక్తుడు తన స్నేహితులైన మరో ముగ్గురితో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. తనకు పరిచయం ఉన్న దేవస్థాన రిటైర్డ్ ఉద్యోగి సహకారంతో ప్రోటోకాల్ దర్శనం చేయించాలని కోరాడు. అయితే ఈ వ్యవహారంలో మధ్యవర్తులు సదరు భక్తుడి నుంచి రూ. వెయ్యి వసూలు చేశారు. ఆలయంలోని అవుట్సోర్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అటెండర్కు ఈ బాధ్యత అప్పగించారు. దర్శనం పూర్తయిన తర్వాత ఆ భక్తుడి నుంచి మరో వెయ్యి రూపాయలు ఫోన్పే చేయించుకున్నారు. దీంతో ఆగ్రహించిన సదరు భక్తుడు సీఎంఓలో పరిచయం ఉన్న వ్యక్తి సాయంతో ఈ వ్యవహారాలపై నేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఆలయ ఈవోను సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో కింది స్థాయిలో ఉన్న అటెండర్పై ఈవో వేటు వేసినట్లు సమాచారం. ఆలయంలో దర్శన టికెట్ల దందాలో కొంత మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ భాగస్వాములై ఉండటంతో ఇది కొనసాగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
లిఫ్ట్.. ప్రైవేటుకు గిఫ్ట్!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకోనుంది. రైతుల్లో అనైక్యతతో పాటు పలు ఇతర కారణాల వల్ల ఇప్పటికే సగానికి పైగా పథకాలు పనిచేయడం లేదు. కొన్ని పథకాలు ఏకంగా మూలన పడ్డాయి. ప్రైవేటుకు అప్పగిస్తే విచ్చలవిడిగా నీటి తీరువా వసూలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములు సాగు చేసే కౌలు రైతులపై అధిక భారం పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇదీ జిల్లాలో పరిస్థితి.. ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా మెట్ట ప్రాంతం. కృష్ణానదితో పాటు కట్టలేరు, మునేరు, వైరాయేరు, పాలేరు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. మెట్ట ప్రాంత రైతుల సాగు నీటి అవసరాలు తీర్చేందుకు, భూములను సాగులోకి తెచ్చేందుకు ఆయా యేర్లపై ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. జిల్లాలో చిన్నవి, పెద్దవి మొత్తం 118 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి కింద 1,13,511 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఎత్తిపోతల పథకాలను నిర్వహించేది. తర్వాత కాలంలో నిర్వహణ బాధ్యతలను రైతులకే అప్పగించి నీటిపారుదల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణ చేస్తోంది. రైతు నిర్వహణలోకి రావడంతో ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టింది. రైతుల మధ్య విభేదాలు, రాజకీయాల కారణంగా సక్రమంగా నిర్వహించడం లేదు. ఫలితంగా ఒక్కొక్కటి మూతపడుతూ వస్తున్నాయి. తరచూ మోటార్లు రిపేర్లు, పైపులు దెబ్బతినడం తదితర కారణాలతో సామర్థ్యాన్ని కోల్పోయాయి. పనిచేయని పథకాలు.. ఎన్టీఆర్ జిల్లాలోని 118 ఎత్తిపోతల పథకాల్లో 45 మాత్రమే పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. వీటి కింద మాత్రమే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. 46 పథకాలు పాక్షికంగా పనిచేస్తున్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల రైతుల మధ్య విభేదాలు, రాజకీయ పార్టీల ప్రమేయంతో ఉద్దేశపూర్వకంగా తాళం వేసి ఉంచారు. ఆయకట్టు పరిధిలోని ఒక్కోరైతు ఎకరాకు వెయ్యి రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బులు సక్రమంగా వసూలు కాకపోవడం, మరమ్మతులు వచ్చినపుడు సకాలంలో చేయించకపోవడంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పథకాలు నిర్వీర్యం అవుతున్నాయి. 20 పథకాలు పూర్తిగా పనిచేయడం లేదు. 7 పథకాలను పూర్తిగా మూసివేశారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఎత్తిపోతల పథకాలను ప్రైవేటుకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులు ఇష్టానుసారం నీటి తీరువా వసూలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులైతే దోపిడీకి ఆస్కారం ఉంటుంది. పంటలు సాగు చేసే వారిలో కౌలుదారులే ఉన్నారు. నీటి తీరువా పెంచితే కౌలు రైతులపై అధిక భారం పడే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికే కౌలు రైతులకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు. జిల్లాలోని పథకాలకు మరమ్మతులు చేపట్టి పనిచేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కట్టలేరుపై జయంతి గ్రామంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం గత రెండేళ్లుగా పనిచేయడం లేదు. అక్కడక్కడ పైపులైన్లు దెబ్బతిన్నాయి. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలి. పూర్తి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే నిర్వహిస్తే మేలు. – జి. కృష్ణారెడ్డి, రైతు, జయంతి ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటుకు అప్పగించడం సరికాదు. ఈ నిర్ణయం కౌలు రైతులకు ఎక్కువ నష్టం చేస్తుంది. ప్రైవేటు వ్యక్తులు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విచ్చలవిడిగా నీటి తీరువా వసూలు చేసే అవకాశం ఉంది. దోపిడీ పెరిగిపోతుంది. కౌలు రైతులకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రభుత్వం ఏం చేస్తుంది? పథకాల నిర్వహణలో ప్రభుత్వ బాధ్యత లేదా? ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. – పి. జమలయ్య, ప్రధాన కార్యదర్శి, కౌలు రైతు సంఘం -
న్యూడ్ కాల్స్ కేసులో ముగ్గురు అరెస్ట్
తెనాలిరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన న్యూడ్ కాల్స్ దందా కేసులో ఎట్టకేలకు నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులలో తల్లి, కొడుకులు కూడా ఉండటం విశేషం. స్థానిక త్రీ టౌన్ పోలీసుస్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక పాండురంగపేట జనావాసాల మధ్య ఓ ఇంట్లో మహిళలు న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న సమాచారంతో ఈనెల 16న త్రీ టౌన్ పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో బోడపాటి అనురాధ, మహమ్మద్ షహనాజ్లను అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కల వారిని విచారించారు. ఆన్లైన్ వేదికగా ఓ యాప్లో ’స్ట్రిప్ టాక్’ పేరిట ఉన్న పోర్టల్లో ‘స్వీటీ క్యూటీ’ పేరుతో లాగిన్ అయ్యి ఇరువురు మహిళలు ముఖానికి మాస్క్తో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ, అవతలి వ్యక్తుల నుంచి నగదు అందిన సమాచారంతో వారి కోరిక మేరకు న్యూడ్గా ఫోన్లో మాట్లాడుతున్నారు. యాప్ నిర్వాహకులు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొంత నగదును మహిళల ఖాతాకు జమ చేస్తున్నారు. రెండు నెలల కిందట అద్దెకు తీసుకొని ఉంటున్న ఇంటిలో ఈ తతంగం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో ఈ కేసులో కీలకంగా వ్యవహరించి, యాప్ డౌన్లోడ్ చేయడంలో సహకరించిన అనురాధ కుమారుడు హేమంత్ సాయి పరారయ్యాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా అనేక వదంతులు విస్తరించాయని, వందలాది మంది మహిళలు ఇలా అక్రమంగా సంపాదిస్తున్నారని వచ్చిన వదంతుల్లో వాస్తవం లేదని డీఎస్పీ చెప్పారు. అనురాధ కుటుంబం గతంలో ఉపాధి కోసం విజయవాడ ఈడ్పుగల్లుకు వెళ్లగా అక్కడ తన స్నేహితురాలు విజయలక్ష్మి, ఆమె కుమారుడు తులసి ద్వారా ఈ యాప్ వివరాలు తెలుసుకుందని, అనురాధ, ఆమె కుమారుడు హేమంత్ సాయి యాప్ వినియోగం అక్కడే నేర్చుకున్నారని, ఇంజినీరింగ్ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేసి హేమంత్సాయి ప్రేమవివాహం చేసుకున్నాడని తెలిపారు. తల్లి, భార్యతో కలసి విజయవాడలో ఉంటుండగా, ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం నచ్చక కోడలు విభేదించి తెనాలి వచ్చేయడంతో హేమంత్ సాయి వచ్చి భార్యతో కలిసి తెనాలిలో ఉంటున్నాడు. కొద్ది రోజులు వ్యవధిలోనే అనురాధ కూడా ఒంటరిగా ఉండలేక తిరిగి తెనాలి చేరిందని, వేరుగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న అనురాధకు షహనాజ్ పరిచయం కావడంతో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అనురాధ తిరిగి తెనాలి చేరటం, ఈ తంతు ఇష్టంలేని కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో విజయవాడ వ్యక్తుల ప్రమేయం, యాప్ వివరాలు, దానిలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదించి, తదుపరి సాంకేతిక సహకారంతో విచారణ కొనసాగిస్తామని డీఎస్పీ చెప్పారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారాలలో వాస్తవం లేదని, కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉండటంతో జాప్యం జరిగినట్లు చెప్పారు. ఎస్ఐ నక్కా ప్రకాశరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్మిక వైద్యం.. నామమాత్రం!
షెడ్డుల్లో ఎన్నాళ్లీ ‘తాత్కాలిక’ సేవలు?లబ్బీపేట(విజయవాడతూర్పు): గుణదలలో అధునాతన ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. రెండేళ్ల కిందట శిథిలమైన భవనాలను తొలగించారు. దీంతో తాత్కాలికంగా నిర్మించిన షెడ్డుల్లోనే ఓపీ సేవలు అందిస్తున్నారు. శిథిలమైన భవనాలు తొలగించిన స్థానంలో కొత్తగా అధునాతన సౌకర్యాలతో భవనాలు నిర్మించాల్సి ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 5.80 లక్షల మంది ఈఎస్ఐ చందా దారులకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏదైనా క్లిష్టతరమైన సమస్యతో వచ్చిన వారికి ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంది. 5.80 లక్షల మందికి పెద్దదిక్కు.. విజయవాడలో ఈఎస్ఐ ఆస్పత్రి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి నాలుగు ఉమ్మడి జిల్లాలోని సుమారు 5.8లక్షల మంది చందాదారుల వైద్య సేవలకు పెద్దదిక్కుగా ఉంది. ఆయా జిల్లాలోని చందాదారులు డిస్పెన్సరీల నుంచి మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు వస్తుంటారు. అత్యవసర వైద్యం అవసరమైన వాళ్లు నేరుగా వస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం రెండేళ్లుగా తాత్కాలిక భవనాల్లో అరకొర సౌకర్యాలతో నాణ్యమైన సేవలు అందని పరిస్థితి నెలకొంది. నిపుణులైన వైద్యులు ఉన్నా, తాత్కాలిక భవనాల్లో ఆపరేషన్ థియేటర్లలో సర్జికల్ పరికరాలు లేక పోవడంతో శస్త్ర చికిత్సలు నిర్వహించలేని దయనీయ స్థితి నెలకొంది. దీంతో ఈఎస్ఐ చందాదారులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. కలగానే సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి.. విజయవాడలో ఐదు దశాబ్దాల కిందట ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. గతంలో ఏదైనా సూపర్స్పెషాలిటీ సేవలు అవసరమైతే హైదరాబాద్ వెళ్లేవారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇక్కడే అత్యాధునిక సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేస్తామని దశాబ్దం కిందట నాటి కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిపోయింది. అధునాతన వ్యాధి నిర్ధారణ పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఏదైనా సీటీ, ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే ప్రైవేటుకు పంపుతున్నారు. దీంతో నడవలేని స్థితిలో ఉన్న రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు నాణ్యమైన వైద్యం కోసం ఈఎస్ఐ సౌకర్యం కావాలని పోరాటాలు చేసి సాధించుకున్న చందాదారులకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 5.80 లక్షల మంది చందాదారులకు వైద్య సేవలు తాత్కాలిక భవనాల్లో అందించడం సిగ్గుచేటు. ప్రభుత్వం వెంటనే అధునాతన భవనాలు నిర్మించి, వాటిలో సూపర్స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి తేవాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
దమ్జాయ్!
గల్లీ గల్లీలో అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం సాక్షి ప్రతినిధి, విజయవాడ: మాదకద్రవ్యాలను (గంజాయి, డ్రగ్స్) సమూలంగా నిర్మూలిస్తాం.. ఉక్కుపాదం మోపుతాం.. అంటూ పాలకులు ఎక్కడ చూసినా మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే అవన్నీ ప్రచారం కోసం మాట్లాడే ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి, ఇతర డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తుండటంతో యువత వాటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు విజయవాడకే పరిమితమైన ఈ విష‘మత్తు’ ఇప్పుడు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. అక్కడ సైతం గంజాయికి బానిసలైన యువత ఉంటున్నారు. ప్రభుత్వ వైఫల్యంతో గంజాయి కేజీల మొత్తంలో సరఫరా అవుతూనే ఉంది. అందుకు పోలీసులు పట్టుకున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గంజాయితో పాటు ఎండీఎంఏ డ్రగ్స్ సైతం విజయవాడలో పట్టుపడటం ప్రజలు నివ్వెర పడేలా చేసింది. జాతీయ రహదారులు ఉండే పోలీసు స్టేషన్ల పరిధిలోనే ఎక్కువగా గంజాయి పట్టుబడుతోంది. ఇందులో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. మత్తులో యువత చిత్తు.. గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడుతున్న వారిలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన యువత ఉంటున్నారు. అందుకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పదుల సంఖ్యలో యువతకు డ్రగ్స్ పాజిటివ్ రావడమే నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కొండపల్లి తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే అనుమానంతో యువతకు పరీక్షలు నిర్వహించారు. వారిలో 25 మందికి పాజిటివ్ వచ్చింది. జగ్గయ్యపేటలో నిర్వహించిన పరీక్షల్లో 31 మందికి పాజిటివ్ వచ్చింది. అంతేకాదు విజయవాడలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఒక్కో ప్రాంతంలో 5 నుంచి 15 మంది వరకూ పాజిటివ్ వచ్చింది. మైకంలో నేరాలు.. గంజాయి, మాదకద్రవ్యాలకు అలవాటు పడిన యువత ఆ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసిన నిందితుడిని పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా గంజాయికి అలవాటు పడిన వారు నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళ్లలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైక్లు చోరీ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో కూడా డ్రగ్స్కు బానిసలైన వారు ఉంటున్నారు. బెట్టింగ్స్కు పాల్పడే వారిలో సైతం డ్రగ్స్ బానిసలే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఏదైనా నేరంలో అరెస్టు చేసిన వారికి పోలీసులు తొలుత డ్రగ్ పరీక్షలు చేయిస్తున్నారు. ఘోర వైఫల్యం.. జిల్లా స్థాయిలో డ్రగ్స్పై దండయాత్ర పేరుతో అవగాహన కార్యక్రమాలు, పరీక్షలు చేస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం.. వాటి అక్రమ రవాణా, విక్రయాలను అదుపు చేయడం, వాటి మూలాలను కూకటి వేళ్లతో పెకలించడంలో పూర్తిగా విఫలం చెందిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతోనే గంజాయి గ్రామాలను సైతం సరఫరా అవుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా:కృష్ణా జిల్లా: గతేడాది డిసెంబర్ 26వ తేదీన పెద్ద అవుటుప ల్లి వద్ద 180 కేజీలు దొరికింది. -
విజయవాడ జీజీహెచ్లో ఆకస్మిక తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలోని పలు వార్డులను ఆదివారం సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు ఆకస్మికంగా సందర్శించారు. సెలవు దినం రోజున తనిఖీలకు రావడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వార్డుల్లో ఉండాల్సిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రోగులు, అటెండెంట్స్తో మాట్లాడారు. వైద్యసేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. సెలవు రోజున కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని, విధుల్లో అలసత్వం పనికిరాదని సూచించారు. వైద్యులు సైతం రౌండ్స్ వేయాలన్నారు. అదే సమయంలో రోగులకు పెడుతున్న డైట్ను పరిశీలించారు. ఆయన వెంట సివిల్సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ వై. పద్మావతి కూడా ఉన్నారు. విజయవాడ కల్చరల్: శాంతి, సహనం, సౌభ్రాతృత్వం ప్రపంచానికి శ్రీ రామరక్ష అని సంగీత విద్వాంసుడు డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ అన్నారు. కంచికామకోటిపీఠం, లబ్బీపేట శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన 24గంటల నాదోపాసన మహాయజ్ఞం ఆదివారం ముగిసింది. లోకనాథ శర్మ మాట్లాడుతూ 40ఏళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో సంగీత విద్వాంసుల సహకారంతో నాదోపాసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవాలయ ఇన్చార్జి ఆర్. రామ్మోహనరావు ఆధ్వర్యంలో లోకనాథ శర్మను సత్కరించారు. నాదయజ్ఞంలో బెంగళూరు నుంచి వచ్చిన మున్నంగి(పరమాత్ముని) వెంకట రమ్య తోపాటు చిన్నారులు వై. యమున, ఎం. శేషుబాబు, వెంకట రఘువర్మ, ప్రసాద్, మల్లాది ఆహ్లాద్, ఆముక్త, తమన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని జీవీఆర్ సంగీత కళాశాలలో 870 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ వారిని నిర్వాహకులు పట్టించుకోకపోవడం గమనార్హం. మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం బందలాయి చెరువు గ్రామానికి చెందిన తుంగల తారక రామ సుమారు కిలో వెండితో చేసిన నాగపడగను ఆదివారం సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు స్వామివారి వెండి పడగను అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ వెస్ట్ బైపాస్లో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా ఏలూరు వైపు వెళ్లే వెస్ట్ బైపాస్ రహదారిని తాత్కాలికంగా మూసివేసినట్లు ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు ఆదివారం తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లే వాహనాలు గొల్లపూడి వై జంక్షన్, అట్కిన్సన్ స్కూల్ సెంటర్, ఊర్మిళా నగర్, కబేళా, సీవీఆర్ ఫ్లైఓవర్, పాముల కాలువ మార్గం మీదుగా వెస్ట్ బైపాస్ ఎక్కాలని సూచించారు. నగరంలోకి ప్రవేశించే వాహనదారులు సైతం ట్రాఫిక్ డైవర్షన్లను గమనించి ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని కోరారు. వాహనదారులు పోలీసుల సూచనలు, డైవర్షన్ బోర్డులను గమనించాలన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. తిరువూరు: స్థానిక శ్రీరాజ్యలక్ష్మీ సమేత రంగనాయకస్వామి దేవాలయంలో వైశాఖ మాస సందర్భంగా ఆదివారం లక్ష్మీనరసింహస్వామికి చందనోత్సవం నిర్వహించారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.140 టీఎంసీలు. -
సెలవుపై వెళ్లిన కృష్ణా జిల్లా కలెక్టర్
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సెలవుపై వెళ్లారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు వ్యక్తిగత కారణాల నిమిత్తం సెలవు పెట్టారు. తిరిగి ఆయన ఈ నెల 27వ తేదీ సోమవారం విధులకు హాజరవుతారు. అప్పటి వరకు ఇన్చార్జ్ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అన్నదాన పథకానికి హైదరాబాద్ మణికొండ అల్కాపురానికి చెందిన కేపీ ఆశ కుటుంబం రూ. 1,01,116, గుంటూరు కొత్తపేటకు చెందిన ఎం. సాంబశివరావు కుటుంబం రూ. 1,01,116, కాకినాడకు చెందిన వి. సూర్యనారాయణమూర్తి కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది. దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి విజయవాడ లబ్బీపేటకు చెందిన ఆర్. వెంకటేష్, అరుంధతి దంపతులు రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
నగ‘ధగ’లు
విజయవాడలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. ఆదివారం అక్షయ తృతీయ నేపథ్యంలో అందరూ బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే ఆ సంవత్సరమంతా మంచి ఆదాయముంటుందని ప్రజల నమ్మకం. ఆ విశ్వాసానికి అనుగుణంగా విభిన్న మోడల్స్, వివిధ ఆఫర్లతో జ్యూవెలరీ దుకాణదారులు వినియోగదారులను ఆకర్షించారు. దీంతో పెద్ద ఎత్తున బిజినెస్ జరిగినట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివవచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. వేకువజామున నిర్వహించిన పలు ఆర్జిత సేవలతో పాటు ఉదయం 7గంటల తర్వాత ప్రారంభమయ్యే శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 9 గంటల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరగడంతో అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. వీఐపీలకు, ప్రముఖులతో పాటు రూ.300 టికెట్ కలిగిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఘాట్రోడ్డు, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ ప్రాంగణంలో చల్లటి తాగునీటితో పాటు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లను దేవస్థానం అందజేసింది. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్యభగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా పలువురు ఉభయదాతలు పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. వాహనాల పార్కింగ్పై దృష్టి.. వేసవి సెలవుల నేపథ్యంలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో దేవస్థాన అధికారులు కొండపైకి అనుమతించే వాహనాల విషయంలో సెక్యూరిటీ, పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కుమ్మరిపాలెం నుంచి హెడ్ వాటర్ వర్క్స్ వరకు రోడ్డుకు ఇరువైపులా భక్తుల కార్లు, ఇతర వాహనాలను నిలుపుకొనేందుకు అనుమతినిచ్చారు. మరో వైపున కొండపైకి వచ్చే ద్విచక్ర వాహనాలను ఓం టర్నింగ్ వరకు మాత్రమే అనుమతించారు. వీఐపీల వాహనాలను ఓం టర్నింగ్ వద్ద నిలుపుదల చేసి బ్యాటరీ వాహనాలపై సమాచార కేంద్రానికి చేర్చారు. దీంతో కొంత మేర ట్రాఫిక్ ఇక్కట్లు తప్పాయి. రద్దీ నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్ ఘాట్రోడ్డులోని చెప్పుల స్టాండ్, క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, చలివేంద్రాలను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి సదుపాయాల కల్పనపై సూచనలు తీసుకున్నారు. -
ఆకట్టుకున్న కళాకారుల ర్యాలీ
రెండో రోజు కొనసాగిన కొండపల్లి బొమ్మల పండుగ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల పండుగలో రెండోరోజు ఆదివారం వినూత్న రీతిలో కార్యక్రమాలు జరిగాయి. బొమ్మల ప్రదర్శన, బొమ్మల కొలువు, బొమ్మల దర్బార్ నిర్వహించా రు. బొమ్మల ఉత్పత్తి కళాకారులకు తెల్లపొనికి చెట్లు పెంపకం చేపట్టాల్సిన కార్యాచరణపై అటవీశాఖ ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. వివిధ కళాశాలలు, పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, కళాకారులు జానపద, కూచిపూడి నృత్యాలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మల ఆటలతో ఆకట్టుకున్నారు. ఏటా నిర్వహించాలి.. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ మాట్లాడుతూ కొండపల్లి బొమ్మల పండుగ ఏటా నిర్వహించేలా చూస్తామన్నారు. హస్తకళల వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందుకు మూడురోజుల పండుగ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం వివిధ కళా రంగాలకు చెందిన కళాకారులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కోయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, వివిధ వేషధారణలతో నృత్యాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలు స్థానికులను ఆకట్టుకున్నాయి. -
చేపల మేతగా కోళ్ల వ్యర్థాలను వాడితే కఠిన చర్యలు
జి.కొండూరు: చేపల మేతగా కోళ్ల వ్యర్థాలను వినియోగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా మత్స్యశాఖ అధి కారి సౌభాగ్య చక్రాణి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి తేజశ్వి హెచ్చరించారు. జిల్లాలో కోళ్ల వ్యర్థాలను చేపల మేతగా వాడు తున్న వైనాన్ని వివరిస్తూ ఈ నెల 11వ తేదీన ‘గుట్టుచప్పుడు కాకుండా చల్లేస్తున్నారు’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. కథనానికి స్పందించిన మత్స్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. జి.కొండూరు మండలం కవులూరు శివారులో నిర్వహిస్తున్న చేపల చెరువులను సౌభాగ్య చక్రాణి, తేజశ్వి శనివారం తనిఖీ చేశారు. చెరువుల నుంచి వస్తున్న దుర్వాసనకు అధికారులే బెంబేలెత్తిపోయారు. కోళ్ల వ్యర్థాలను రవాణా చేస్తున్న రెండు వాహనాలను సీజ్ చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తున్న 30 ఎకరాల్లోని మూడు చెరువులను గుర్తించి, వాటిని నిర్వహిస్తున్న ముగ్గురు, గుంటూరు జిల్లా నులకపేట నుంచి కోళ్ల వ్యర్థాలను సరఫరా చేస్తున్న వాహన డ్రైవర్ పాలపర్తి సాంబయ్య , జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మరో వాహనం డ్రైవర్ ఎస్కే సలీమ్, కోళ్ల వ్యర్థాలను సరఫరా చేసే శ్రీనుపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోళ్ల వ్యర్థాలను వాడితే సహించేదిలేదని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు. -
పీఆర్సీ కమిషన్ను తక్షణం నియమించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్ను నియమించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాను ప్రారంభించిన ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పాండు రంగ ప్రసాద్ మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ కమిషన్ నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్, అసెస్మెంట్ బుక్స్ వంటి అశాసీ్త్రయ మైన విధానా లను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించి బోధనకే పరిమితం చేయాలన్నారు. టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్స్ను మినహాయించాలని సూచించారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేములపల్లి రాధిక, సయ్యద్ ఖాసీం మాట్లా డుతూ.. ఉపాధ్యాయులపై ఆన్లైన్ పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. నాలుగు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో రెండో పోస్టు మంజూరు చేయాలని, ఉద్యోగ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో ఏపీటీఎఫ్ ఉపాధ్యక్షలు పూర్ణ చంద్రరావు, అబ్దుల్ నయీం, అవని, శెట్టిపోగు రాము, కార్యదర్శులు రామారావు, బి.వసరాం, ఒ.లాలామద్, రమణ, ఖాజా, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొండపల్లి బొమ్మల పండుగ ప్రారంభం
ఇబ్రహీంపట్నం: కొండపల్లి బొమ్మలు, కొండపల్లి ఖిల్లా మన వారసత్వ సంపదని, వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ, ఆధ్వర్యంలో కొండపల్లి బొమ్మల పండగ (సాంస్కృతిక వారసత్వ ఉత్సవం)ను కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. అనంతరం కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్తో పాటు కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలు, కీలు బొమ్మల స్టాళ్లను సందర్శించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల వారసత్వ సంపదను భావితరాలకు వెలకట్టలేని బహుమతిగా అందించాలనే ఉద్దేశంతో బొమ్మల పండగను ఏటా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో హస్తకళల అభివృద్ధికి, హస్తకళాకారుల సంక్షేమానికి కృషిచేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. కొండపల్లి బొమ్మల తయారీలో నైపుణ్యత, సృజనాత్మక తతో నూతన ఆవిష్కరణలు చేసే వారిలో పది మందికి వచ్చే ఏడాది ఇదే రోజున రూ.50 వేలు చొప్పున రూ.5లక్షలు బహూకరిస్తామని ప్రకటించారు. ఉదయం ఖిల్లాపైకి ట్రెక్కింగ్ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన రోప్లతో ర్యాప్లింగ్ వాక్ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అధికారుల వైఫల్యం వేడుకల నిర్వహణలో మునిసిపల్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలొచ్చాయి. కలెక్టర్ వేదిక ఎక్కినా ప్రజలు లేకపోవడంతో అస హనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, రీజనల్ డైరెక్టర్ వై.వి.ప్రసన్న, డీఈఓ ఎల్.చంద్రకళ, జిల్లా యువజన సంక్షేమ అధికారి కొల్లేటి రమేష్, మెప్మా పీడీ మురళీకృష్ణ, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు, మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పాల్గొన్నారు. -
ఉర్రూతలూగించిన హెరిటేజ్ హార్మని
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో శనివారం రాత్రి హెరిటేజ్ హార్మనీ పేరుతో నిర్వహించిన మ్యూజికల్ నైట్ ఉర్రూతలూగిం చింది. గాయకులు ఎస్పీ శ్రీచరణ్, సునీత కలిసి ‘ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము.. పాటతో సంగీత విభావరిని ప్రారంభించారు. వారితోపాటు సాహితి, అరుణ్ కౌండిన్య పలు పాటలను ఆలపించి అలరించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. చారిత్రక సంపదను కాపాడి భావి తరాలకు అందించాల్సి అవసరం ఉందన్నారు. జిల్లాలో చారిత్రక సంపద గురించి నేటి తరానికి వివరించాలన్నారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ సృజనాత్మకత కమిషన్ చైర్పర్సన్ తేజస్విని, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పాల్గొన్నారు. సభ అనంతరం వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి లివింగ్ హెరిటేజ్ అవార్డులు అందజేసి సత్కరించారు. 101 ఏళ్ల లక్ష్మయ్య, తెలుగు ఉపాధ్యాయుడు మెట్ట వెంకటేశ్వరరావు, డాక్టర్ సమరం, కార్పొరేషన్లో స్వీపర్గా విధులు నిర్వహిస్తున్న రమణ, ప్రమాద రహితంగా విధులు నిర్వహించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ జి.మోహన్రావు, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, ఆర్చరీ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సూర్య చరిష్మ, 68 సార్లు రక్తదానం చేసిన ఎ.వి. సుధాకర్, యోగా ట్రైనర్ శీరీష, 50 ఏళ్లుగా పౌరోహిత్యం నిర్వహిస్తున్న వీరుపాక్ష సమస్యం తదితరులను కలెక్టర్ సత్కరించారు. సభ అనంతరం జరిగిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. -
ఆత్మలకు భూ హక్కులు
జి.కొండూరు: రెవెన్యూ అధికారుల ఒంటెత్తు పోకడ రైతులకు తలనొప్పిగా మారింది. సమగ్ర భూ రీ సర్వే పేరుతో తప్పుల తడకగా రికార్డులను తయారు చేయడంతో దశాబ్దాల క్రితం మరణించిన వ్యక్తుల ఆత్మలకు సైతం భూ హక్కులు లభించాయి. ఎవరి భూమి ఎవరి పేరు మీదకు మారిందో కూడా అర్థంకాక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరో వైపు తాము తాయారు చేసిన రికార్డుల ప్రకారమే పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామంటూ అధికారులు సిద్ధమయ్యారు. జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో శనివారం నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభ రసాభాసగా మారింది. గ్రామంలో ఉన్న భూ రికార్డుల అన్నీ తారుమారు కావడం రెవెన్యూ అధికారుల వైఫల్యానికి అద్దంపడుతోంది. తప్పుల తడకగా రికార్డులు జి.కొండూరు మండల పరిధి ఆత్కూరు గ్రామంలో 1,524 ఎకరాల రెవెన్యూ భూమి ఉంది. అందులో ప్రభుత్వ భూమి పోనూ 1,254 ఎకరాల వరకు రైతుల పేరిట పట్టా భూమి ఉంది. అయితే ఈ గ్రామంలో గత సార్వత్రిక ఎన్నికల కోడ్ సమయంలో రీ సర్వే జరిగింది. ఈ సర్వేలో కొందరు రైతులు పాల్గొనలేదు. రీసర్వే పూర్తయిన వెంటనే ఎల్పీఎం నంబర్లు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎల్పీఎం నంబర్లను మూడేళ్ల వరకు ఇవ్వలేదు. రెవెన్యూ అధికారులు రూపొందించిన రికార్డుల ప్రకారం దశాబ్దాల క్రితం చనిపోయిన వ్యక్తులు, అసలు గ్రామానికే సంబంధం లేని వ్యక్తుల పేరిట భూములు ఉన్నాయి. భూమి ఉన్న రైతుకు లేనట్లు, భూమి లేని రైతుకు ఉన్నట్లు, ఒక రైతు భూమికి మరొక రైతును హక్కుదారుడిగా చూపుతూ పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. రీసర్వే జరిగిన అనంతరం ఈ రెండేళ్లలో మూడు వందలకుపైగా భూ ఖాతాల్లో భూమి క్రయవిక్రయాలు జరిగాయి. వందకుపైగా భూ ఖాతాల్లో భూ యజమానులు చనిపోగా వారి కుటుంబ సభ్యుల పేర్లతో రికార్డులను మార్చి ఇదే రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలను సైతం జారీ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ చనిపోయిన వ్యక్తుల పేర్లతో పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చేందుకు రికార్డులను తయారు చేశారు. క్రయవిక్రయాలు జరిగిన భూమికి కొనుగోలు చేసిన వారి పేర్లతో రిజిస్ట్రేషన్లు పూర్తయితే పట్టాదారు పాసుపుస్తకాలను సైతం జారీ చేసిన రెవెన్యూ అధికారులు, ఇప్పుడు భూమిని విక్రయించిన రైతుల పేర్లతోనే పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ అధికారులు తయారు చేసిన రికార్డుల ప్రకారం భూమి కొలతల్లో వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. మరో వైపు క్రయవిక్రయాలు జరిగిన భూ ఖాతాల్లోనూ సమస్య ఉత్పన్నమవుతోంది. గ్రామంలో ప్రస్తుత రికార్డుల ప్రకారం 600 వరకు భూ ఖాతాలు ఉన్నాయి. 580కిపైగా భూ ఖాతాలు తప్పుల తడకగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆత్కూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ గ్రామ సభలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి బహిష్కరించారు. గ్రామంలో రీ సర్వే మళ్లీ జరిపించి రికార్డులను సరి చేయాలని కోరారు. మా గ్రామంలో నాకు ఖాతా నంబరు 95లో 8.5 ఎకరాలు భూమి ఉంది. అయితే ప్రస్తుతం 7.22 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రస్తుత రికార్డుల్లో చూపుతున్నారు. అంతే మొత్తం భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోసారి రీసర్వే జరిపి వాస్తవంగా ఉన్న భూమిని నా పేరున రికార్డుల్లో ఎక్కించాలి. – కాటంనేని లక్ష్మీపతిరావు, రైతు, ఆత్కూరు, జి.కొండూరు మండలం నా భర్త కనగాల వెంకటేశ్వరరావు ఐదేళ్ల క్రితం మరణించారు. ఆయన పేరుమీద ఉన్న 6.32 ఎకరాల భూమిని నా పేరు మీదకు బదలాయించారు. అయితే ఇప్పుడు నా పేరుతో భూ ఖాతా నంబరు 15లో 2.79 ఎకరాలను తగ్గించి 3.53 ఎకరాలు మాత్రమే ఉందని పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మిగిలిన భూమిని ఎవరికి రాశారో చెప్పాలి. – కనగాల పద్మావతి, రైతు, ఆత్కూరు, జి.కొండూరు మండలం -
హజ్ యాత్రికుల సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు
గన్నవరం: హజ్ యాత్రికుల ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. స్థానిక ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్లో హాజ్ యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్లను శుక్రవారం అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హజ్ యాత్రికులకు కల్పిస్తున్న సదుపాయలను ఆయన పర్యవేక్షించడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది విజయవాడ అంబార్కేషన్ పాయింట్ నుంచి 335 మంది హజ్ యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. వీరిలో తొలి విడతలో శనివారం 160 మంది, ఆదివారం రెండో విడతలో 175 మంది వెళ్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో హజ్ యాత్రు వెళ్తున్న వారిలో 50 శాతం మహిళలు ఉన్నట్లు చెప్పారు. ముందుగా ఇక్కడికి చేరుకున్న సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులకు ప్రత్యేక వసతి, భోజనం, వైద్య సదుపాయాలను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి చిత్తూరి శ్రీధర్, హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ షేక్ హాసన్బాషా, కమిటీ సీఈఓ గౌస్ పీర్ తదితరులు పాల్గొన్నారు. హజ్ యాత్రికుల వసతి కల్పిస్తున్న ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్ను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. -
మేళాతో ప్రోత్సాహం
కళా వైభవం.. నేటి నుంచి కొండపల్లి బొమ్మల పండుగ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మల పరిశ్రమ సుమారు 500 ఏళ్లకు పైగా విరాజిల్లుతోంది. అలాంటి కళా వైభవాన్ని భావితరాలకు అందించాలని కొండపల్లి బొమ్మల పండుగ వేడుకలు నిర్వహించేందుకు జిల్లా పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. అంతర్జాతీయ వారసత్వ దినోత్సవాన్ని పుస్కరించుకొని శనివారం నుంచి 20వరకు వేడుకలకు ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న బొమ్మల మేళా కళాకారులకు చేయూతనిస్తోందనే ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బొమ్మల వేడుకలు విజయవంతం చేయాలని ఆదేశించారు. కొండపల్లికి పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చే బొమ్మల వేడుకలను బొమ్మల తయారీ కళాకారులతో పాటు ప్రతి ఇంట్లో నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. కొండపల్లి బొమ్మ.. తరతరాల జ్ఞాపకం.. కొండపల్లి ఖిల్లా కోటను రెడ్డిరాజుల వంశానికి చెందిన ప్రోలాయ వేమారెడ్డి 14వ శతాబ్దంలో నిర్మించే సమయంలో భవనాలపై చూడముచ్చటైన డిజైన్లు అద్దేందుకు రాజస్థాన్కు చెందిన రాజవంశీకులు ఇక్కడకు వలస వచ్చారు. రాజభవనాలపై డిజైన్(నగిషీలు)లు వేస్తూ రాజులు ఇచ్చే భరణాలతో జీవితాలు గడిపేవారు. కొందరు ఆ సమయంలోనే బొమ్మల తయారీ పరిశ్రమ కొండ కింద కొండపల్లిలో ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం బ్రిటీష్ వారి పాలనలో బొమ్మల తయారీ పరిశ్రమను విస్తరించుకుని వారి జీవనభృతిని ఏర్పాటు చేసుకున్నారు. కొండపల్లి పరిధిలోని చుట్టుపక్కల అడవుల్లో లభించే తేలికపాటి తెల్లపొనికి చెక్కతో ఆకర్షణీయమైన బొమ్మలు ఇక్కడ తయారు చేసేవారు. రాజస్థాన్ కళాకారుల నుంచి ఈ ప్రాంతానికి చెందిన వారు సైతం బొమ్మల తయారీలో నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం సుమారు 150 కుటుంబాల వారు బొమ్మల పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. అట్టహాసంగా ఏర్పాట్లు.. బహుమతుల ప్రదానం.. కొండపల్లి బొమ్మల తయారీలో కళాకారుల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఫిబ్రవరి 3నుంచి మార్చి 8 వరకు నిర్వహించిన బొమ్మల పోటీల్లో కళాకారులు తమ నైపుణ్యంతో తయారు చేసిన బొమ్మలను ఎక్స్పీరియన్స్ సెంటర్కు చేర్చారు. వేడుకలు ముగింపు రోజున న్యాయ నిర్ణేతల ప్రకటించిన విజేతలకు రూ.లక్ష విలువైన బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించనున్నారు. సుమారు 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల కోసం వేడుక ఈ ఏడాది జరగడం కళాకారుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ వేడుకలతో రెట్టింపు ఉత్సాహంతో కళాకారులు పరిశ్రమను ముందుకు తీసుకెళ్తారు. సుమారు 20ఏళ్లుగా నా కుటుంబం అత్యంత నైపుణ్యంతో బొమ్మల తయారీ పరిశ్రమ నడుపుతున్నాం. అనేక అవార్డులు కూడా వరించాయి. – కూరెళ్ల వెంకటాచారి, బొమ్మల కళాకారుడు, కొండపల్లి -
నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయండి
కంకిపాడు: పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. కంకిపాడు పోలీసుస్టేషన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీసుస్టేషన్ భవన నిర్మాణ పనులను గురువారం రాత్రి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. నిర్మాణ పరమైన అంశాలపై పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అన్ని విభాగాలకు అధునాతన వసతులు సమకూరాలని సూచించారు. పోలీసుస్టేషన్ నిర్మాణ పనుల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్లను ప్రత్యేకంగా అభినందించారు. హనుమాన్జంక్షన్ రూరల్: పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా పారిశ్రామికవాడలో శాంతిభద్రతల పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యం అని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ మోడల్ ఇండ్రస్టీయల్ ఎస్టేట్ను శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామికవాడలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు, చోరీల నియంత్రణ, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, మహిళా ఉద్యోగులపై వేధింపులు వంటి పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ మహిళా ఉద్యోగులు, కార్మికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఐ ఎల్.రమణ, వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ పాల్గొన్నారు. నందిగామ రూరల్: జిల్లాలో 35,945 మంది రైతులతో 42,088 ఎకరాలలో సాగు చేపట్టేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని కంచల గ్రామంలోని తత్వవనంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ముందుగా మామిడి తోటలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేపట్టడం వల్ల తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. తర్వాత పీఎండీఎస్ (ప్రీ–మాన్ సూన్ డ్రై సోయింగ్) విత్తనాలు, విత్తన గుళికల తయారీని తెలుసుకుని ఐదు ఎకరాలలో విత్తనాలు నాటడాన్ని ప్రారంభించారు. ఆర్డీవో పోశిబాబు, తహసీల్దార్ సురేష్ బాబు, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అంజిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దేవదాయ శాఖ ఎక్స్అఫీషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరిజవహర్లాల్ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన హరిజవహర్లాల్ను అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. అనంతరం మహామండపం రెండో అంతస్తులో జరుగుతున్న అన్న ప్రసాద వితరణను పరిశీలించారు. అన్న భక్తులతో కలిసి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న ప్రసాద వితరణపై పలు సూచనలు చేశారు. తన కుమార్తె పుట్టిన రోజును పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణకు ఆయన విరాళాన్ని అందజేశారు. -
ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్తో అగ్ని ప్రమాదాల నివారణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అమరావతి రాజధాని ప్రాంతంలో హైరేంజ్ బిల్డింగ్స్ రానున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు ఇంటిగ్రేటెడ్ అర్బన్ ప్లానింగ్ రూపొందించనున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీపీ వెంకటరమణ చెప్పారు. ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అమరావతి చాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం రాత్రి విజయవాడ నగరంలోని హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకువచ్చేందుకు ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటుగా తమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో విశాఖపట్నంలో రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో త్వరలో 23 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అసోసియేషన్ అమరావతి అధ్యక్షుడిగా ఎన్నికై న వి.కాంతారావు, కార్యదర్శి వైవీ దుర్గారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం.మోహనరావు, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ బి.ఉమామహేశ్వరరావు, ప్రాంతీయ డైరెక్టర్ శివరామకృష్ణన్, అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు రాఖీ దీపక్తో పాటుగా సభ్యులు పాల్గొని నూతన కమిటీని అభినందించారు. -
‘కృష్ణా’ రాజకీయాల్లో నెహ్రూ ఒక బ్రాండ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూ అంటే ఒక బ్రాండ్ అని ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ అన్నారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ) 9వ వర్ధంతిని పురస్కరించుకొని గుణదలలోని ఆయన ఘాట్ వద్ద శుక్రవారం ఆయన తనయుడు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెహ్రూ పార్టీలకు అతీతంగా అందరికీ సహాయం చేసేవారని, నెహ్రూ వారసుడిగా అవినాష్ రాజకీయాల్లో తన ఒరవడిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ నెహ్రూ ఆశయ సాధనకు అవినాష్ కృషి చేస్తున్నారని, వైఎస్సార్ సీపీ జెండా పట్టుకొని ప్రజల పక్షాన నిలిచారన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తనను నమ్మిన వాళ్లకు ఏ ఇబ్బంది రాకుండా నెహ్రూ చూసుకున్నారన్నారు. నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ తన తండ్రితో సాన్నిహిత్యంగా ఉన్న వారందరూ వచ్చి నివాళులర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ రూహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు కై లే అనిల్కుమార్, మొండితోక జగన్మోహనరావు, సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాయకుడు నెహ్రూ: పేర్ని నాని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని నెహ్రూ ఉమ్మడి కృష్ణాలో ప్రజానాయకుడిగా నిలిచారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్నినాని అన్నారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ)9వ వర్ధంతిని పురస్కరించుకుని ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అన్ని విధాల అండగా నిలిచారని, విజయవాడ రాజకీయ పుస్తకంలో తనకంటూ ఒకపేజీని నెహ్రూ సృష్టించుకున్నారని కొనియాడారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అలాగే మొగల్రాజపురం నిమ్మతోట సెంటర్లో లంకా అబ్బినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి -
కాలువలు.. కడగండ్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సర్కార్ తీరుతో కృష్ణా డెల్టా రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో రైతులకు కడగండ్లు తప్పడం లేదు. మే నెలలోనే సాగు నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినా దానికనుగుణంగా కాలువల నిర్వహణపై ప్రభుత్వం శ్రద్ధ చూపటం లేదు. కాలువలు గుర్రపు డెక్క, తూటి కాడతో నిండిపోయాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. ఇప్పటికీ పనులకు అనుమతులు మంజూరు చేయలేదు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా సరాసరిన నియోజకవర్గానికి రూ.3కోట్ల నుంచి రూ.4కోట్లతో అంటే దాదాపు రూ.38కోట్లతో ప్రతిపాదనలను నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. పనులు త్వరితగతిన చేయకుంటే తర్వాత కాలువకు నీరు విడుదల చేస్తే పనులు చేసే అవకాశం ఉండదు. ఆ తర్వాత పనులు మంజూరైనా పనులు చేయకుండా మమ అనిపించి నిధులు మింగేసే అవకాశం ఉంది. వర్షాలు వస్తే డ్రెయిన్లు పొంగి పొలాల నుంచి నీరు బయటకు పోక రైతులు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే కాలువలకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసినా చివరి ఆయకట్టుకు నీరు అందని దుస్థితి నెలకొంటుంది. కృష్ణా డెల్టా పరిధిలో 13.08లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సింది. అధ్వానంగా కాలువలు ప్రధానంగా చంద్రయ్య డ్రెయిన్లో పనులకు రూ.22కోట్లు, కొమరవోలు డ్రెయిన్ మరమ్మతులకు రూ.11కోట్లు నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు పనులు చేయకపోతే వర్షాకాలంలో చేయలంటే ఇబ్బందులు తప్పవు. ప్రధానంగా గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, పెడన నియోజక వర్గాల పరిధిలో పూడిక తీయక పోవడంతో అధ్వానంగా మారి పంట పొలాలు మునుగుతున్నాయి. దీనికి తోడు గుర్రపుడెక్క, తూటుతో మేట వేసుకుపోయాయి. బుడమేరు, చంద్రయ్య, నెహ్రాల్లీ, మోటూరు ఎల్ఎస్ మేజర డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలో లజ్జబండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకొడు, వన్నేరు, ముస్తాఫాకొడు, యూటీ, పెద్దలంక, గుండేరు, రత్నకొడు డ్రెయిన్లలో మురుగు నీరు సక్రమంగా దిగువకు ప్రవహించని పరిస్థితి నెలకొంది. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్ఎన్ పురం వరకు ఉన్న బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఈ ఏడాదైనా పనులు సక్రమంగా చేపట్టకపోతే, రైతులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి.. కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా.. కాలువ కృష్ణా ఎన్టీఆర్ బందరు 1.51లక్షల – ఎకరాలు కేఈబీ 1.38 – ఏలూరు 0.56 1,332 వేల ఎకరాలు రైవస్ 2.17 425 మొత్తం 5.62 లక్షల 1,757 వేల ఎకరాలు ఎకరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సంఘాలకు రూ.10లక్షల వరకు నామినేషన్పై పనులు కట్టబెట్టే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ కాలువల్లో తూటికాడ, పిచ్చిమొక్కల తొలగింపు, షట్టర్ల మరమ్మతులు, కాంక్రీట్ పనులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాది కృష్ణా తూర్పు, కృష్ణా సెంట్రల్, డ్రెయినేజీ విభాగం, స్పెషల్ డివిజన్లో 650 పనులకు సంబంధించి రూ.26.03 కోట్లు మంజూరు చేశారు. కాలువలకు నీటి విడుదల తర్వాతే పనులు మంజూరు చేయడంతో, నీటి సంఘాల అధ్యక్షులు, నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మకై నామ మాత్రంగా పనులు చేపట్టి, మమ అనిపించారు. -
పేర్నినానిని కలిసిన రజక సంఘం నేతలు
పెనమలూరు: కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పేర్నినానిని ఆ పార్టీ రజక సంఘం నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు మచిలీపట్నంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ రజక, బీసీ సంఘాల నేతలు పేర్ని నానిని కలిసి గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చలు జరిపారు. రజక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ శెట్టిపల్లి పూర్ణరజక, కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ రజక విభాగం అధ్యక్షుడు లింగాల శోభన్బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఓలేటి అరవింద్, నాయకులు సత్తెనపల్లి శ్రీను, తాడేపల్లి సుబ్బారావు, పత్తికాయల శివ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ఇచ్చిన హామీకే అతీగతి లేదు
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు జరగడం లేదు. ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు అంటూ హామీలు ఇచ్చారు. కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. నేరుగా పేదలను కలిసి చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు. పింఛన్లకు ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించి పేదలను ఆదుకోవాలి. – కామరాజ్ హరీష్, ప్రధాన కార్యదర్శి, బీసీఎస్ఎఫ్గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పేరిట సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ కూటమి నాయకులు ఊదరగొట్టారు. సామాజిక పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని, అర్హులు అందరికీ లబ్ధి చేకూరుస్తామని గొప్పల డప్పు కొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. కనీసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించలేదు. పెన్షన్ వస్తూ భర్త చనిపోయిన వారికి స్పౌజ్ కేసు కింద ప్రభుత్వం పింఛనుకు అవకాశం కల్పించి చేతులు దులుపుకొంది. కొత్త పింఛన్ కోసం పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేద్దామని వెళ్లిన వారికి రిసెప్షన్లో చేదు అనుభవం ఎదురవుతోంది. పింఛన్ మాటెత్తగానే అసలు అర్జీలు తీసుకోకుండా వెనక్కు పంపుతున్నారు. పక్షవాతంతోనో, ప్రమాదాల్లో, ఇతర కారణాలతో కాళ్లు పోయి మంచానికే పరిమితమైన వారు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. మందులు, ఆహారం కూడా సమకూర్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారు పింఛన్లు మంజూరు కాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదుకునేవారి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ మంజూరు చేసి తమను ఆదుకోవాలని ఎంతో ఆర్తిగా చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రావడం లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2,36, 237 పెన్షన్లు ఇస్తే, కూటమి ప్రభుత్వంలో 2,26, 775 పింఛన్లు ఇస్తున్నారు. చంద్రబాబు సర్కార్ పింఛన్లలో కోత వేసింది. అమలుకు నోచని 50 ఏళ్లకే పింఛన్ హామీ అధికారంలోకి వస్తే 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు మంజూరు చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీ రెండేళ్లయినా అమలుకు నోచుకోలేదు. ఈ రెండేళ్లలో యాభై ఏళ్లు దాటిన వారు సామాజిక భద్రత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రకటించిన జిల్లా బడ్జెట్లో పెన్షన్లకు ప్రత్యేక కేటాయింపులు జరగలేదు. దీన్ని బట్టి ఈ ఏడాది కూడా కొత్త పింఛన్ల మంజూరు లేనట్లేనని కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హాకర్లు, పేదల బాగోగులు తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు దీపావళి పండుగ రోజు బీసెంట్ రోడ్డులో పర్యటించారు. దుర్గారావు అనే వ్యక్తికి పింఛన్, ఇళ్లు, జీవనోపాధి కల్పిస్తానని స్వయంగా హామీ ఇచ్చారు. ఇది జరిగి నెలలు గడస్తున్నా దుర్గారావుకు పింఛన్ మంజూరు కాలేదు. తనకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, పింఛన్ మంజూరు చేయా లంటూ అధికారుల చుట్టూ ఆనాటి ఫొటోలను చూపినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాళ్లు లేక ఇబ్బందులు పడుతున్న తనకు చంద్రబాబు రూపంలో కొండంత అండ దొరికిందని సంబర పడ్డానని, అయితే ఆయన ఇచ్చిన హామీనే అమలు చేయడంలేదని, ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని దుర్గారావు వాపోయారు. దుర్గారావు పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. -
యనమలకుదురు ఆలయ అర్చకులకు బెయిల్
పెనమలూరు: యనమలకుదురు శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయంలో అర్చకులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆలయంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను ఈవో ఎన్.భవాని, అర్చకులు సాగర్, పూర్ణ, ఉద్యోగి రోశయ్య స్వాహా చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి అర్చకులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.50 వేలు రికవరీ కూడా చేశారు. ఈవో ఎన్.భవాని ముందస్తు బెయిల్ తీసుకోగా మిగతా ముగ్గురు అరెస్టు కావటంతో అవనిగడ్డ జైలుకు వెళ్లారు. ఇద్దరు అర్చకులు, ఒక ఉద్యోగికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవో, అర్చకులు సస్పెన్షన్లో ఉన్నారు. విచారణ పూర్తి ఆలయంలో జరిగిన అవినీతిపై గత కొద్ది రోజులుగా ఐదుగురితో కూడిన కమిటీ చేసిన విచారణ పూర్తైంది. ఆలయంలో రికార్డులు తనిఖీ చేశారు. విచారణ నివేదికను ఎండోమెంట్ కమిషనర్కు సమర్పిస్తారు. అయితే ఆలయంలో ఆభరణాలపై భక్తుల సమక్షంలో బహిరంగ విచారణ చేయాల్సి ఉంది. స్వామివారి ఆభరణాలు ఉన్నాయా... స్వాహా చేశారా అనే విషయం తేలాలి. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ఫిర్యాదు గన్నవరం: సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గురువారం స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఒక ప్రైవేట్ సమావేశానికి సంబంధించిన దృశ్యాలను అనధికారికంగా రికార్డు చేయడంతో పాటు ఆడియో, వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తనను అసభ్యకరంగా చిత్రీకరించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం గన్నవరం: సూరంపల్లి శివారు రామచంద్రపురం వద్ద జాతీయ రహదారి బైపాస్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల సమాచారం ప్రకారం... పెనమలూరు మండలం కానూరుకు చెందిన ఇల్లూరి జగదీష్(27) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన జగదీష్ బుధవారం బైక్పై హనుమాన్ జంక్షన్లోని స్నేహితుడి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం తిరిగి కానూరు వస్తుండగా బైపాస్ రోడ్డులో రామచంద్రపురం వద్ద టోల్గేట్ దాటిన తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టి కృషి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లబ్బీపేట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదాల నిరోధానికి ప్రభుత్వ శాఖలు, పౌరులు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా రవాణా, పోలీసు శాఖలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చోట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో గురువారం ‘పీఎం–రాహత్’ పథకం అమలు–ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు జరిగే రోడ్డు ప్రమాదాలతో గాయపడే వారికి తక్షణం ఉన్నత వైద్యాన్ని అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని వెల్లడించారు. పీఎం రాహత్ పథకం క్షతగాత్రులకు ఉపశమనాన్ని ఇస్తుందన్నారు. ప్రమాదం జరిగిన గంటలోగా ఉచితంగా రూ.1.5 లక్షల వైద్యాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని అందరికీ వర్తింపజేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 656 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పీఎం రాహత్ కింద సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పరిధిలో కనీసం 1,500 ఆస్పత్రుల్లో పీఎం–రాహత్ కింద వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నిరోధంపై అన్ని జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు (రోడ్డు సేఫ్టీ) నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీఎంఈ డాక్టర్ రఘునందన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, రవాణాశాఖ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బోస్, ఆషా అధ్యక్షులు డాక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో డిసీజ్ మానిటరింగ్ కేంద్రం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల సాధన కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ ర్యాంకింగ్ రావడం వల్ల వైద్య కళాశాలలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో రూ.6 కోట్లతో ఏర్పాటు కాబోతున్న డీఎండీసీ (డిసీజ్ మానిటరింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ సెంటర్) కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ లాన్సెట్ వంటి అంతర్జాతీయ స్థాయి జర్నల్స్లో రాష్ట్ర వైద్యుల పరిశోధన పత్రాలు ప్రచురితం జరిగేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ సాయిసుధీర్, లక్ష్మీ సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. -
పెన్షనర్ల సామాజిక భద్రతకు ప్రభుత్వాల తూట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పెన్షనర్ల సామాజిక భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.వరప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం గుట్టుగా తెచ్చిన వ్యాలిడేషన్ చట్టంతో దేశంలోని కోటి మంది పెన్షనర్లకు ముప్పు పొంచి ఉందని, ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం మహాత్మాగాంఽధీరోడ్డులోని పీ అండ్ టీ క్వార్టర్స్ ప్రాంగణంలో పెన్షనర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వ్యాలిడేషన్ ఆఫ్ సీసీఎస్ పెన్షన్ నిబంధన చట్ట సవరణను రద్దు చేయాలని, ఎనిమిదో వేతన సవరణ కమిషన్ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి. అశోక్బాబు, సర్కిల్ కన్వీనర్ ఎన్.రామారావు, జిల్లా కార్యదర్శి రమేష్బాబు, సుంకు సుబ్బారావు, భానుబాబు, కోటేశ్వరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్సీ బోస్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 527.20 అడుగులకు చేరింది. ఇది 152.7328 టీఎంసీలకు సమానం.చిలకలపూడి : జన గణన– 2027కు సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఆయన చాంబర్లో స్వీయ గణన చేసుకున్నారు. ఈ ఫొటోలోని వ్యక్తిపేరు మల్లయ్య. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు గ్రామం. వయసు 32 సంవత్సరాలు. అతనికి ఇద్దరు కుమార్తెలు. పక్షవాతం వచ్చి రెండు కాళ్లూ పడిపోయాయి. పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ భారం అంతా అతని భార్యపై పడింది. పిల్లల చదువులు, భర్తకు మందులు, కుటుంబ పోషణ కష్టం మారింది. విధిలేని పరిస్థితుల్లో విజయవాడ వచ్చి భర్త ఆరోగ్యం చూసుకుంటూ వాచ్ఉమన్గా పనిచేస్తోంది. తన భర్తకు పెన్షన్ మంజూరు చేయాలని రెండేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ‘ఈ ఫొటోలో వ్యక్తిపేరు చింతలపూడి దుర్గారావు. ఇతనికి సొంతిల్లు లేదు. విజయవాడ సత్యనారాయణపురంలో అద్దె ఇంట్లో నివసివస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతని ఎడమ కాలిని మోకాలి వరకు తొలగించారు. రెండో కాలుకు పైలేరియా సోకడంతో నడిచేందుకు కూడా కష్టంగా ఉంది. పొట్టకూటి కోసం బీసెంట్ రోడ్డులో ఓ పక్కన పట్టా వేసుకుని కూర్చుని జూట్ సంచులు, పట్టీలు, చైన్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సదరం క్యాంప్లో వైద్యులు అతడిని పరీక్షించి 70 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించి సర్టిఫికెట్ జారీ చేశారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుందామంటే రెండేళ్లుగా ఆన్లైన్లో సైట్ ఓపెన్ కాలేదు. గతేడాది దీపావళి సమయంలో బీసెంట్ రోడ్డులో పర్యటించిన సీఎం చంద్రబాబును దుర్గారావు కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. తనకు పెన్షన్, ఇల్లు మంజూరు చేయాలని, జీవనోపాధి కల్పించాలని కోరాడు. చంద్రబాబు స్పందించి అతనికి పెన్షన్, సొంతిల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఆరునెలలుగా నెరవేరలేదు. నాలుగైదు సార్లు పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేసుకున్నా స్పందన లేదు. 7 -
ఘనంగా రైల్వే వారోత్సవాలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో గురువారం రైల్వే వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో జరిగిన వేడుకల్లో డీఆర్ఎం మోహిత్ సోనాకియా 2025–26లో డివిజన్ సాధించిన పురోగతిని వివరించారు. రికార్డు స్థాయిలో రూ. 5,939 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని, 40.64 మిలియన్ టన్నుల అత్యధిక సరుకు రవాణాను సాధించడం డివిజన్కు గర్వకారణమని కొనియాడారు. రైళ్ల సమయపాలన 87 శాతానికి మెరుగుపడిందని పేర్కొన్నారు. డివిజన్లో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించడం, మూడవ లైన్ సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న వేగపరిమితులను తొలగించడం, పెద్ద ఎత్తున ట్రాక్ పునరుద్ధణ వంటి కీలక విజయాలను సాధించామన్నారు. రద్దీ నివారణకు డివిజన్ మీదుగా ఐదు వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు. ఈ సందర్భంగా విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన 58 ఉద్యోగులకు రైల్ సేవా పురస్కారాలు, 12 మంది ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీపీఓ ప్రేమ్కుమార్ లకావత్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
ఈగల్ ఐజీపీ రవికృష్ణపెనమలూరు: రాష్ట్రంలో యువతీ యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో బుధవారం విబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ, ఈగల్ ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1000 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ ఇక్కడకు వచ్చిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐజీపీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. ఈగల్ మిషన్ ద్వారా విద్యార్థులందరినీ కలిసి ఎన్డీపీ చట్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మాదకద్రవ్యాల వల్ల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మాదకద్రవ్యాలను పట్టుకోవటానికి రైళ్లు, బస్సులు, కార్లపై నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నామన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్తో విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో పొగాకు, సిగరెట్లు విక్రయాలు నిషేధించామని తెలిపారు. 22 నాటికి ముగిస్తాం.. విబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఫౌండర్ విజయ్కలాం మాట్లాడుతూ ఏప్రిల్ 6వ తేదీ నుంచి తిరుపతి వేంకటేశ్వర యూనివర్సీటీ నుంచి విశాఖపట్నంలో ఈ నెల 22వ తేదీ నాటికి ముగిస్తామన్నారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ కె.నాగేష్బాబు, అదనపు ఎస్పీ ప్రభాకర్, డీఎస్పీ ధర్మేంద్ర, సిద్ధార్థ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెంకటేశ్వరరావు, ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, ఎన్ఎస్ఎస్ కోర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో ఉత్తమ ఫలితాలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు ఇంటర్మీడియెట్ – 2026 ఫలితాలలో చక్కని ఫలితాలను సాధించినట్లు అధికారులు ప్రకటించారు. జూనియర్ ఇంటర్మీడియెట్ ఫలితాలలో మొత్తం 804 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 700 మంది ఉత్తీర్ణతను సాధించి, 87 శాతం నమోదు చేశారన్నారు. ముప్పాళ్ల గురుకులం (100), కుంటముక్కల (98), రంగా పురం (97), నర్సాపురం (96), జగ్గయ్యపేట (95), బల్లిపర్ర (91) శాతం చొప్పున విజయాలను అందుకున్నాయన్నారు. సీనియర్ ఇంటర్మీడియెట్ ఫలితాలకు సంబంధించి మొత్తం హాజరైన విద్యార్థులు 944కాగా ఉత్తీర్ణులైన వారు 888 మొత్తం ఉత్తీర్ణత 94శాతంగా నమోదైంది. కుంటముక్కల పాఠశాల బాలికల ప్రతిభ జి.కొండూరు: ఇంటర్ ఫలితాల్లో కుంటముక్కల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో స్టేట్ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీలో 149 మంది విద్యార్థినులకు గానూ 146 మంది ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీలో 61మంది విద్యార్థినులకు గానూ 60 మంది ఉత్తీర్ణత సాధించారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీలో పి.కల్యాణిలక్ష్మి 988/1000 ప్రథమ స్థానం, ఎం.నవ్యశ్రీ 984/1000 ద్వితీయస్థానం, సీహెచ్ లక్ష్మీకీర్తన 982/1000 తృతీయ స్థానంలో నిలిచారు. సీనియర్ బైపీసీలో పి.భవానీ 985/1000, ఎం.జెస్సీకా 982/1000, డి.జాస్మిన్ శాంతిప్రియ 981/1000, సీఎస్ తనూజీ 981/1000 మార్కులతో మొదటి మూడు స్థానాలలో నిలిచారు. జూనియర్ ఎంపీసీలో బి.పూజిత 465, పి.నిఖిత 462, కె.సంజన 462, ఎ.దీపిక 460 మొదటి మూడు స్థానాలలో నిలిచారు. జూనియర్ బైపీసీలో ఎస్.శ్రీలక్ష్మి 451/455, ఇ.లాస్య 450, టి.ప్రియ 450, పి.అనితాబాయ్ 450, బి.సంధ్యన 448మార్కులతో సత్తా చాటారు. -
పేదల ఇళ్లపైకి మరోసారి బుల్డోజర్
పెనమలూరు/కంకిపాడు: కూటమి పాలకులు పేదల ఇళ్లపై కన్నెర్ర చేశారు. గోసాల–వణుకూరు రోడ్డులో ఉన్న పేదల ఇళ్లు బుధవారం నేలమట్టం చేశారు. పెద్ద ఎత్తున బుల్డోజర్లు తీసుకు వచ్చి విచక్షణారహితంగా ఇళ్లను కూల్చేశారు. ఎటువంటి గొడవలు జరగకుండా ఉండటానికి పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దించి బందోబస్తు పెట్టారు. ఏళ్లుగా ఉంటున్న ఇళ్లు కళ్ల ఎదుటే నేలమట్టం చేయటంతో బాధితులు బోరున విలపించారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని గోసాల–వణుకూరు ఆర్ అండ్బీ రోడ్డు పక్కనే గత 40ఏళ్లుగా చాలా మంది పేదలు ఇళ్లు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అయితే టీడీపీ నేతల కళ్లు పేదల ఇళ్లపై పడ్డాయి. దీంతో నాలుగు రోజుల క్రితం బుల్డోజర్లతో వచ్చి ఇళ్లను నేలమట్టం చేయాలని యత్నించారు. దీంతో వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవభక్తుని చక్రవర్తి అడ్డుకున్నారు. పేదలను రోడ్డు పాలు చేస్తే సహించేది లేదని నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేయడంతో ఇళ్ల కూల్చి వేత ఆగింది. తెల్లవారుజామునే కూల్చివేత.. అయితే రెవెన్యూ, పోలీసు ఒక్కసారిగా బుధవారం ఉదయాన్నే హఠాత్తుగా రంగంలోకి దిగారు. గోసాల రోడ్డులో ఉన్న దాదాపు 25 పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు. ఎటువంటి గొడవలు జరగకుండా దాదాపు 100 పోలీసులు పహారా కాశారు. ఒక్కసారిగా బుల్డోజర్లు వచ్చి ఇళ్ల పై పడి కూల్చివేయటంతో నిద్రమత్తులో ఉన్న పేదలు ఉలిక్కిపడ్డారు. తమకు న్యాయం చేయాలని పేదలు వేడుకున్నా అధికారులు మనసు కరగలేదు. కాకీలను అడ్డు పెట్టుకుని మొత్తం ఇళ్లన్నీ నేలమట్టం చేయటంతో పేదలు ఆర్తనాదాలు పెట్టారు. పేదలకు తమ ఇళ్ల వద్ద కూడా ఉండనీయలేదు. గోసాల రహదారి పోలీసులు మూసివేశారు. రియల్టర్ల కోసమేనా? రోడ్డు ఆక్రమణలు తాము తొలగించామని, ఇక్కడి పేదలకు వేల్పూరులో ఇళ్ల స్థలాలు ఇచ్చామని రెవెన్యూ అధికారులు తెలిపారు. అయితే గోసాలకు వేల్పూరు చాలా దూరమని తాము అక్కడికి వెళ్లి ఏమి చేయాలని బాధితులు కంటతడి పెట్టారు. ఇక్కడ పనులు చేసుకునే తాము వేల్పూరుకు వెళ్లలేమని చెప్పినా వినలేదన్నారు. కేవలం రియల్టర్ల వ్యాపారం కోసమే పేదల ఇళ్లు నేలమట్టం చేశారని ఆరోపిస్తున్నారు. గోసాలలో 25 ఇళ్లు నేలమట్టం -
ద్వితీయంలో తృతీయం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీ క్షల ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానంలో నిలిచారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 84 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచారు. గత ఏడాది 81 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ ఏడాది 87 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో తృతీయ స్థానం దక్కించుకున్నారు. గత ఏడాది 89 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రథమ సంవత్స రంలో ఉత్తీర్ణత పెరగ్గా, ద్వితీయ సంవత్సరం తగ్గింది. మొత్తంగా 2024 సంవత్స రంలో ద్వితీయ స్థానంలో ఉన్న జిల్లా గడిచిన రెండేళ్లగా దిగజారుతోందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బాలికలదే పైచేయి మొదటి సంవత్సరానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన విద్యార్థులు 34,510 మంది పరీక్షకు హాజరవగా 29,103 మంది ఉత్తీర్ణులయ్యారు. 84 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండో సంవత్సరంలో 36,151 మంది పరీక్షకు హాజరవగా 31,453 మంది ఉత్తీర్ణులయ్యారు. 87 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్ జనరల్ పరీక్షలకు సంబంధించి మొదటి సంవత్సరం 16,658 మంది పరీక్షలు రాయగా 14,155 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 85 శాతంగా నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 16,835 మంది పరీక్షలకు హాజరవగా 14,670 మంది ఉత్తీర్ణతను సాధించారు. 87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురి విషయంలో మొదటి ఏడాది 80, ద్వితీయ సంవత్సరం 84 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేట్ కళాశాలల ఉత్తీర్ణత ఇలా.. జిల్లాలో అన్ఎయిడెడ్ / ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి మొదటి ఏడాది 32,696 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 27,593 మంది ఉత్తీర్ణత సాధించారు. 84 శాతం ఉత్తీర్ణత నమో దైంది. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 34,751 మందికి 29,939 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 86 శాతంగా నమోదైంది. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా మరోసారి రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 2025–26 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం విద్యార్థులు 90, ద్వితీయ సంవత్స రంలో 92 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానం దక్కించుకున్నారు. 2024–25లో ప్రథమ సంవత్సరంలో 85, రెండో సంవత్సరంలో 93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది రెండో సంవత్సరంలో ఉత్తీర్ణత ఒక శాతం తగ్గగా, ప్రథమ సంవత్సరంలో ఐదు శాతం పెరిగింది.ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో రెండో సంవత్సరం విద్యార్థులు 70 శాతం ఫలితాలను సాధించారు. జిల్లాలో సుమారుగా పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొదటి ఏడాది పరీక్షకు 1,670 మంది విద్యా ర్థులు హాజరవగా 860 మంది ఉత్తీర్ణత సాధించారు. 51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండో సంవత్సరానికి సంబంధించి 1,153 మంది విద్యార్థులకు 806 మంది ఉత్తీర్ణుయ్యారు. 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీఎస్డబ్ల్యూఆర్ మొదటి ఏడాది 86 శాతం, రెండో ఏడాది 92 శాతం, ఏపీటీడబ్ల్యూఆర్ మొదటి ఏడాది 97 శాతం, రెండో ఏడాది 95 శాతం, హైస్కూల్ ప్లస్ మొదటి ఏడాది 37 శాతం, రెండో ఏడాది 57 శాతం, మోడల్ స్కూల్ మొదటి ఏడాది 85 శాతం, రెండో ఏడాది 93 శాతం, కేజీబీవీ మొదటి ఏడాది 81 శాతం, రెండో ఏడాది 90 శాతం ఫలితాలను సాధించారు. -
ఫెయిల్యూర్ గాయం కాదు.. ఒక పాఠం
లబ్బీపేట(విజయవాడతూర్పు): మార్కులే జీవితం కాదు. చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే. తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించలేని ఎందరో భవిష్యత్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఉత్తీర్ణత సాధించలేదని, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెందకుండా పట్టుదలతో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయన్న మనస్తాపంతో కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫెయిలయ్యానన్న మనస్తాపంతో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లులో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలిక చికిత్స పొందుతోంది. ఇంటర్మీడియెట్, పదో తరగతి ఫలితాలు వెల్లడైన ప్రతిసారి కొందరు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు వచ్చా యన్న మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తూనే ఉన్నాం. అందుకు వారు చదువులో ఎదుర్కొంటున్న ఒత్తిడి, తల్లిదండ్రులు ప్రభావం కూడా ఉంటోందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నాం, అన్ని మార్కులు రావాలి, ఇన్ని మార్కులు రావాలి అంటూ తల్లిదండ్రులు తమ ఆశలను పిల్లలపై రుద్దుతున్నారు. దీంతో కొందరు పిల్లలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చలేకపోయామన్న బాధతో ఆత్మహత్మలకు పాల్పడుతున్నారు. ఈ విధానం మారాలని, మార్కులు ప్రామాణికం కాదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. చదువు ఒక్కటే జీవితం కాదు చదువు ఒక్కటే జీవితం కాదు. జీవితంలో ఒక భాగం మాత్రమే. చదువులో రాణించలేక పోయినా, ఇతర వృత్తుల్లో రాణించి ఉన్నత స్థానానికి ఎదిగిన వారు అనేక మంది ఉన్నారు. ఒకసారి ఫెయిలైన వారు, తర్వాత పట్టుదలతో పరీక్షలు రాసి ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఎందరో ఉన్నారనే వాస్తవాన్ని విద్యార్థులు గ్రహించాలి. ఆత్మహత్యలకు పాల్పడి తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగల్చడం సరికాదు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పిరికితనంతో చేసే చర్యగా నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రుల పాత్రే కీలకం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో తల్లిదండ్రుల పాత్రే కీలకమని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కొందరు తల్లిదండ్రులు రూ.లక్షల ఫీజులు చెల్లించి కార్పొరేట్ కాలేజీల్లో చేరుస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు కడుతున్నాం, మంచి మార్కులు రావాలంటూ పదే పదే పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కొందరు పిల్లలు మానసికంగా కుంగిపోయి, ఫెయిలైనా, మార్కులు తక్కువ వచ్చినా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రుల్లో మార్పు రావాలని, తమ పిల్లలు ఫెయిలైనా మరో అవకాశం ఉంన్న ఓదార్పుతో మాట్లాడాలని సూచిస్తున్నారు. ఇతర పిల్లలతో పోల్చడం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. తమ పిల్లలను డాక్టరో, ఇంజి నీరో చేయాలని తల్లిదండ్రులు భావించడంతో తప్పులేదు. అయితే పిల్లల అభిప్రాయాలను తెలుసుకుని, వారు చదువులో రాణించగలరో లేదో అంచనా వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలే దనో, తక్కువ మార్కులు వచ్చాయనో ఆత్మహత్యకు పాల్పడి సాధించేది ఏమీ లేదు. తల్లిదండ్రులకు విషాదాన్ని మిగల్చడమే. ఏదైనా జీవించి సాధించాలి. ఒకసారి ఫెయిలైనా మళ్లీ పట్టు దలతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. జీవితంలో ఎదిగేందుకు మార్కులు ఒక్కటే ప్రామాణికం కాదు. చదువులో రాణించలేని వారు రాజకీయాల్లో, వ్యాపారాల్లో, వివిధ వృత్తుల్లో రాణిస్తున్న వారు ఎందరినో చూస్తున్నాం. మనకు నచ్చిన రంగంలో రాణించే అవకాశం ఉంది. ఆత్మహత్యలతో జీవితాలను అర్ధంతరంగా ముగించొద్దు. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్, విజయవాడ -
నేటి నుంచి స్వీయ గణన నగారా
వివరాలు వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ ప్రగతి పథానికి దిక్సూచి అయిన జన గణన – 2027లో తొలి దశలో భాగంగా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) జరుగుతుందని.. ఇందులో ప్రజలు కీలకభాగస్వాములై ప్రక్రియను విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మీశ కోరారు. బుధవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో జనగణనపై జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో స్వీయ గణన వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కచ్చితమైన డేటాతో పాటు కీలకమైన జనగణనలో విస్తృత ప్రజాభాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. ఇలా చేయాలి.. ఎస్ఈ.సెన్సస్.డాట్.జీఓవీ.ఇన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను పొందుపరుచుకోవచ్చని కలెక్టర్ సూచించారు. దీనివల్ల సమయం ఆదాతో పాటు దోష రహితంగా కచ్చితమైన డేటా లభిస్తుందని వివరించారు. ఈ విధానం వల్ల ఎన్యూమరేటర్ భౌతిక పరిశీలనకు వచ్చినప్పుడు స్వీయ గణన ద్వారా అందించిన డేటాను త్వరితగతిన ధ్రువీకరించేందుకు వీలవుతుందన్నారు. బిల్డింగ్ నంబరు, కుటుంబంలో మొత్తం సభ్యులు, ఇంటి యాజమాన్య స్థితి, తాగునీటికి ప్రధాన వనరు, ఇంటర్నెట్ సౌకర్యం, టీవీ సౌకర్యం ఇలా మొత్తం 34 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు స్వీయ గణన ద్వారా స్వచ్ఛందంగా అందించవచ్చన్నారు. 15 రోజుల పాటు.. 15 రోజుల అవుట్రీచ్ క్యాంపెయిన్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో వర్గం లక్ష్యంగా స్వీయ గణనపై ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ఏప్రిల్ 16న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను స్వీయ గణనలో భాగస్వామ్యం చేస్తామన్నారు. అదేవిధంగా 17వ తేదీన సచివాలయ సిబ్బంది, హెచ్వోడీ కార్యాలయాల సిబ్బంది, జిల్లా కార్యాలయాల సిబ్బంది, మండల కార్యాలయాల సిబ్బంది తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇలా ఏప్రిల్ 30 వరకు వివిధ వర్గాల ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. సమావేశంలో మెజిస్టీరియల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం. వెంకట రామయ్య పాల్గొన్నారు. -
అగ్గి రాజేసిన ప్రొటోకాల్ రగడ
అవనిగడ్డ: అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం రసా భాసగా మారింది. ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడంతో ఆయన వర్గీయులు బైఠాయించి ఆందో ళన చేశారు. శిలాఫలకాన్ని లాగేసి కాలువలోకి పారేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ నాయకుల మధ్య మరింత అగాధాన్ని సృష్టించింది. అన్న క్యాంటీన్ భవనం గోడకు ఆనుకుని టీడీపీ నేత విక్కుర్తి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఈ ఫ్లెక్సీని తొలగించాలని పంచాయతీ, రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించినట్టు సమాచారం. ఫ్లెక్సీలో చంద్రబాబు, ఎన్టీఆర్ బొమ్మలు ఉండటంతో ఫ్లెక్సీ తీస్తే సహించేది లేదని కొందరు టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవం కొంత ఆలస్యమైంది. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం శిలాఫలకంపై ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడం గమనించిన టీడీపీ నేతలు రావి నాగేశ్వరరావు, మెండు లక్ష్మణరావు (చంటి) శిలాఫలకం ముందు బైఠాయించి ఆందో ళన చేశారు. అనంతరం కొంతమంది ఈ శిలాఫ లకాన్ని లాగేసి పంటకాలువలో పారేసేందుకు యత్నించారు. వారిని గమనించిన టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు ఈ శిలాఫలకాన్ని లాక్కుని భవనం దగ్గరకు తీసుకెళ్లారు. ఏఎంసీ చైర్మన్ పేరు లేకుండా శిలాఫలకం వేయడానికి వీలులేదని కొల్లూరు వర్గీయులు నినాదాలు చేశారు. కలెక్టర్, తహసీల్దార్కు వచ్చిన ప్రొటోకాల్ జాబితాలో ఏఎంసీ పేరుందని, కావాలనే ఆయన పేరుని తొలగించారని కొల్లూరి వర్గీయులు ఆరోపించారు. దీంతో కనపర్తి కలుగ జేసుకుని శిలాఫలకాన్ని తీసేసి ఏఎంసీ చైర్మన్ పేరు వేయించి మరో శిలాఫలకం ఏర్పాటు చేయాలని చెప్పడంతో ఆందో ళనకారులు వెనక్కి తగ్గారు. అనంతరం కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ప్రొటోకాల్ విషయంలో పొరపాటు జరిగిందని, అందుకు క్షమించాలని సభావేదికపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రకటించడంతో కొల్లూరి వర్గీయులు శాంతించారు. ఈ ఘటన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, టీడీపీ నేతల మధ్య అగ్గి రాజేసినట్టయిందని కొంతమంది బాహాటంగానే చెప్పారు. -
ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్బుక్ రాజ్యాంగం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రజలను, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేతిలో ఆయుధంగా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ను ఆయన కార్యాలయంలో అంబటి రాంబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా తనను తప్పుడు కేసులో ఇరికించి 18 రోజులపాటు జైల్లో నిర్బంధించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో జడ శ్రావణ్కుమార్ తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న తనను కలిసి పరామర్శించారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన జడ శ్రావణ్కుమార్కు ధన్యవాదాలు తెలిపేందుకు ఆయన కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. శ్రావణ్కుమార్ తమ పార్టీ కాకపోయినప్పటికీ ఈ ప్రభుత్వం తన అరెస్టు విష యంలో అక్రమంగా వ్యవహరించిందని ప్రపంచానికి చాటారన్నారు. జడ శ్రావణ్ కుమార్ సమా జంలో జరిగే అన్యాయాలపై కంఠం వినిపిస్తున్నా రని, ఆయన మాటలు సమాజంపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని వైఎస్సార్ సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారన్నారు. నోటీసులు ఇస్తే సరిపోయే కేసుల్లో సమాజంలో పేరుగడించిన వ్యక్తులను రౌడీల్లా, సంఘ విద్రోహ శక్తుల్లా ఎత్తుకు పోవడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి వేధించే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని స్పష్టంచేశారు. పోలీసులు, ప్రభుత్వాలు ఉంది కక్ష తీర్చుకోవడానికి కాదని, ప్రజల సంక్షేమాన్ని చూసేందుకు పని చేయాలని హితవుపలికారు. ప్రభుత్వాలు కక్ష తీర్చుకునేందుకు పోలీసులు వాడుకునే నీచస్థాయికి దిగజారిపోయాయన్నారు. గుంటూరులో నిరసన నిరాహార దీక్ష ఈ నెల 18వ తేదీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు అంబటి రాంబాబు ప్రకటించారు. రెండు ప్రధాన డిమాండ్లతో 12 గంటల నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను అరెస్టయినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకు పోలీసులు ప్రవర్తించిన తీరు చట్టవ్యతిరేకమైందని స్పష్టంచేశారు. తనను హింసించాలని ప్రయత్నించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరపాలని, తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలనే డిమాండ్లతో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులకు కనువిప్పు కలగా లని తాను చేస్తున్న దీక్షకు ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పక్షాలు మద్దతు తెలపాలని అంబటి రాంబాబు కోరారు. జడ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ పూడి శ్రీహరి అరెస్ట్ను ఖండించారు. ఇది మీడియాపై దాడిగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. -
దుర్గమ్మకు రూ.2.69 కోట్ల హుండీ ఆదాయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తులు రూ.2.69 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. ఆలయ ఈఓ శీనానాయక్ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో 16 రోజులకు రూ.2,69,48,521 ఆదాయం సమకూరింది. నగదుతో పాటు 420 గ్రాముల బంగారం, 2.755 కిలోల వెండి లభ్యమైంది. 249 యూఎస్ఏ డాలర్లు డాలర్లు, 45 యూరప్ యూరోలు, 130 యూఏఈ దిర్హమ్స్, 180 థాయిలాండ్ బాత్స్, 200 ఓమన్ బైసాలు లభించాయి. రద్దయిన రూ.2 వేల నోట్లు 12 వచ్చాయి. కానుకల లెక్కింపును వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టాలని ఫిర్యాదు చిలకలపూడి(మచిలీపట్నం): సోషల్ మీడియా, టీవీ మాధ్యమాల్లో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కోరారు. వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)తో కలిసి ఆయన అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడుకు బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వంశీమోహన్ మాట్లాడుతూ.. సామాజిక మాధ్య మాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో తనకు ఉన్న ఇమేజ్ దెబ్బతీయడానికి కొంత మంది కుయుక్తులు పన్నుతున్నారని, వారి పోస్టుల వెనుక ఉన్న వారి కోసం విచారణ జరిపి బాధ్యులపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓపెన్ చెస్ ఇంటర్నేషనల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థులు చెస్ ఆడటం వల్ల వారిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయని దీని వల్ల విద్యలో కూడా రాణిస్తారని ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ చెప్పారు. స్థానిక కానూరులోని స్కాట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు అమరావతిలోని విట్ యూనివర్సిటీలో త్వరలో జరగునున్న ఓపెన్ చెస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం జరిగాయి. బాల బాలికలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 24 మంది క్రీడాకారులను ఓపెన్ చెస్ ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపిక చేశామని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణికుమార్ చెప్పారు. స్కూల్ సీఈవో కె.జాహ్నవితో పాటుగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో నియామకాలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని పార్టీలో వివిధ హోదాల్లో నియమించారు. రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా చలమాల నాగ సత్య నారాయణరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వానపల్లి సీతాదేవి నియమితులయ్యారు. జిల్లా అనుబంధ విభాగ కమిటీల్లో.. ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్య దర్శిగా వంగూరి కుమారి, ఇంటలెక్చువల్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఇమ్మడి మురళీ కృష్ణ, మైనార్టీ సెల్ కార్యదర్శిగా షేక్ గౌస్ జానీ, సోషల్ మీడియా వింగ్ కార్యదర్శులుగా నల్లమోతు సురేష్బాబు, షేక్ మాబూ సుభాని నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
నేటి నుంచి ‘నేస్తం బడికిరా’
వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షురాలు పి. భవానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదో తరగతి స్పాట్ జరుగుతున్న కేబీఎన్ కళాశాల వద్ద మంగళవారం సాయంత్రం మహిళా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయుల నుంచి సంతకాల సేకరణ చేశారు. రాష్ట్ర హోం మంత్రి అనిత, రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విద్యాశాఖ మంత్రి ఎన్. లోకేశ్ దృష్టికి తీసుకువెళడం కోసం ఆ సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంతకాల సేకరణ చేస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్య వర్గ సభ్యురాలు పి. లీల జిల్లా స్థాయిలో ఉమెన్ గ్రీవెన్స్ సెల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లను వివరించారు. మహిళా నేతలు ఎం. లలితశ్రీ, డి. విజయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు. మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ఏసీబీ ఎస్పీ ఏ. సురేష్బాబు దంపతులు, కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు కుటుంబ సమేతంగా మంగళవారం సాయంత్రం విడివిడిగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వీరు నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అనంతనం ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్కుమార్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆయన వెంట చల్లపల్లి సీఐ కె. ఈశ్వరావు, ఎస్ఐ పి. గౌతమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు కోడూరు: భూమిలో పండే దుంపలు మూడు నుంచి నాలుగు కిలోల బరువు ఉంటా యి. సేంద్రియ పద్ధతుల్లో పండించిన దుంపలు ఆరు కిలోల వరకు కూడా ఉంటా యి. కానీ కృష్ణాజిల్లా కోడూరు మండలం ఇస్మాయిల్బేగ్పేట గ్రామానికి చెందిన కాలారి శ్రీమన్నారాయణ ఇంటి పెరట్లోని పెండలం దుంప ఏకంగా 12 కిలోల బరువు ఉండి అందరినీ అబ్బురపరుస్తోంది. ఏవిధమైన రసాయన ఎరువులు వినియోగించకుండానే దుంప పెరిగిందని శ్రీ మన్నారాయణ తెలిపారు. -
కొండంత
విజయవాడ సిటీపులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు. ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అంబేడ్కర్ ఆశయ సాధన జగన్తోనే సాధ్యం దుర్గమ్మ ఆలయ ప్రాంగణం(ఫైల్) వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తుల భద్రత గాలిలో దీపంలా మారింది. అధికారుల తీవ్ర నిర్లక్ష్యంతో ఇంద్రకీలాద్రి ప్రతిష్ట మసకబారుతోంది. పట్టించుకోవాల్సిన చంద్రబాబు సర్కారు పూర్తిగా కాడి వదిలేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. అవి వృథా అవుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు. వీటికి సాక్షాలుగా ఇటీవల ఆలయ పరిసరాల్లో చోటు చేసుకున్న సంఘటనలను భక్తులు ఎత్తి చూపుతున్నారు. పోలీసు శాఖ, ఆలయ అధికారులు, పాలకవర్గం ఎవ్వరూ ఆలయ భద్రతపై దృష్టి పెట్టకుండా వారివారి ప్రయోజనాలే పరమావధిగా విధులు నిర్వర్తిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. వరుస చోరీలు.. దుర్గమ్మ ఆలయంలో ఇటీవల కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. గత నెల ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకూ జరిగిన కుంభాభిషేక మహోత్సవానికి పోలీసు శాఖ ఉన్న సిబ్బందికి అదనంగా 15 వందల మందిని నియమించింది. అన్ని వందల మంది సిబ్బంది ఉన్నప్పటికీ సరిగ్గా అమ్మవారి అంతరాలయ ఎదురుగా ఉన్న రావిచెట్టు వద్ద ఒక మహిళకు సంబంధించిన 125 గ్రాముల బంగారాన్ని ఒక మహిళ కాజేసి దర్జాగా మెట్లు దిగి వెళ్లిపోయింది. తాను బస చేసిన లాడ్జికి వెళ్లి అక్కడి నుంచి తన ఊరికి వెనుతిరిగింది. బంగారం విలువ సుమారుగా రూ.16 లక్షలుగా ఉంది. దీనిలో విశేషమేమిటంటే చోరీ జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరా పని చేయకపోవటం. వాహనాల్లోనూ చోరీలు.. ఘాట్రోడ్డులో తరచూ వాహనాల్లో చోరీలు జరుగుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. కొద్ది మాసాల క్రితం ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ పాయింట్ సమీపంలో ఒక కుటుంబం తమ కారును పార్క్ చేసి అమ్మ వారి దర్శనానికి వెళ్లింది. దర్శనం ముగించుకొని వచ్చే సరికి వారి వాహనంలో ఉండాల్సిన బ్యాగ్ మాయమైంది. అందులో బంగారం చోరీకి గురైనట్లు పోలీసు లకు ఫిర్యాదు అందింది. అక్కడ సమీపంలో ఉన్న సీసీ కెమెరా సైతం పని చేయకపోవడం గమనార్హం. సీసీ కెమెరాలపై ఎందుకీ నిర్లక్ష్యం.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాల భద్రత పూర్తిగా దిగజారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దుర్గమ్మ ఆలయంలో కోట్లాది రూపాయాలు వ్యయం జరుగుతున్నప్పటికీ కనీసం ఆలయంలో సీసీ కెమెరాలు పనితీరును గాడిలో పెట్టే పరిస్థితులు లేకపోవటంపై సర్వత్రా విస్మయానికి గురవుతున్నారు. ప్రధానంగా పోలీసు శాఖ సైతం వివిధ ఉత్సవాల్లో వేలాది మందిని నియమించి వారికి అవసరమైన టీఏ, డీఏల పేరుతో ఏటా కోట్లాది రూపాయాలు తీసుకొని వెళ్తున్నారే తప్పా ఆలయంలో భక్తుల భద్రత విషయంలో శ్రద్ద చూపటం లేదంటూ ఆలయంలోని పాలకవర్గ సభ్యులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత! 7ఉగ్రవాద సానుభూతిపరులు, వారికి మద్దతు ఇస్తున్న వ్యక్తులను ఇటీవల పోలీసు శాఖ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అటువంటి పరిస్థితులు ఉన్న నగరంలో నిత్యం లక్షలాదిగా రాకపోకలు సాగించే అమ్మవారి ఆలయ భద్రత విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక మహిళ విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చి చక్కగా అమ్మవారి ఆలయానికి వెళ్లి దొంగతనం చేసి మళ్లీ ఆమె స్వస్థలానికి వెళ్లి పోయింది. చోరీ జరిగిన తరువాత ఆమెను పట్టుకున్నప్పటికీ అటువంటి సంఘటనలు జరగకుండా అరికట్టడంలో పోలీసు శాఖ చర్యలు లేకపోవటం, భద్రతపై చోటు చేసుకున్న నిర్లక్ష్యంపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు మృతదేహం ఉన్న తెలియకపోవటం వంటి సంఘటనలు ఇతర ప్రమాదకర ఘటనలకు పురిగొల్పే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం అమ్మవారి ఆలయ భద్రతపై దృష్టి పెట్టాలంటూ హితవు పలుకుతున్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పీస్ ఫోరం మంగళవారం విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించింది. కోడూరు: స్థానిక ఉల్లిపాలెంలోని గోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి క్షేత్రంలో ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు మహాయజ్ఞాన్ని నిర్వహించనున్నారు. దేవస్థానం దిగువన ఉన్న కనకదుర్గానగర్ సమీపంలో ఇటీవల ఒక మృతదేహం బయట పడింది. అక్కడ ఉన్న మరుగుదొడ్డిలో సిబ్బంది మృతదేహాన్ని చూసి ఉన్నతాధికారులకు వారి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ మృతదేహాన్ని చూసిన తరువాత విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే ఆ మృతదేహం మూడు, నాలుగు రోజుల క్రితం మృతి చెందిన వ్యక్తిది కావటం. ఇక్కడ పోలీసులు, పారిశుద్ధ్య అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు రాకపోకలు సాగించే దుర్గగుడి పరిసరాల్లో నాలుగు రోజుల పాటు ఒక మృతదేహం మరుగుదొడ్డిలో ఉన్నా తెలియకపోవటం అధికారుల పాలనతీరుకు నిదర్శనమని భక్తులు మండిపడుతున్నారు. -
నిద్రిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి
కంచికచర్ల: స్థానిక వసంతకాలనీలో ఓ మహిళ తన ఇంటి వరండాలో నిద్రి స్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మంచంపై ఉన్న దిండుకింద చేయపెట్టగా గమనించిన ఆమె దొంగ.. దొంగా అని కేకలు వేసింది. దీంతో ఆ వ్యక్తి ఆమైపె కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కంచికచర్ల వసంతకాలనీలో బాలుర వసతి గృహం వెనుక ఓ ఇంట్లో నల్లకట్ల రమాదేవి(47) సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి వరండాలో నిద్రించింది. గుర్తు తెలియని ఆ ఇంటి వద్దకు వచ్చి తాళం చెవుల కోసం వెతికాడు. అవి కనిపించకపోవటంతో రమాదేవి నిద్రిస్తున్న మంచం వద్దకు వచ్చి దిండు కింద చేయి పెట్టాడు. ఈ అలికిడికి రమాదేవికి మెలుకువ వచ్చి, గుర్తుతెలియని వ్యక్తిని గమనించి దొంగ.. దొంగ అంటూ కేకలు వేసింది. వెంటనే ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో ఆమె ముఖం, శరీ రంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. కేకలు విని రమాదేవి ఇంటికి వచ్చిన స్థానికులు గాయపడిన ఆమెను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమా దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.విశ్వనాథ్ తెలిపారు. -
సుబ్బారాయుడి ఆదాయం రూ. 9.32లక్షలు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ. 9,32,348 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. స్వామివారికి సేవా టికెట్ల ద్వారా రూ. 5,26,266, లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 1,22,130, స్వామివారికి డొనేషన్ ద్వారా రూ. 2,37,792, శ్రీవారి దర్శనం ద్వారా రూ. 37,600 మొత్తం కలిపి రూ. 9,32,348 ఆదాయం వచ్చినట్లు వివరించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు మంగళవారం పలువురు భక్తులు నిత్యాన్నదాన పథకానికి విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ సనత్నగర్కు చెందిన జి. తనూజ కుటుంబం రూ.1.01,116, విజయవాడ భవానీపురం ఆశ్రమం రోడ్డుకు చెందిన జె.సీతారామాంజనేయులు, వాసవి సౌజన్య దంపతులు రూ.1,01,116, విజయవాడ ప్రసాదం పాడుకు చెందిన జి. వెంకట రామారావు, భవ్యశ్రీ రూ.1,01,116, గుంటూరు రెడ్డిపాలెం కాలనీకి చెందిన శ్రీవెంకట రాగ సుమంత్, జ్ఞాన చంద్రిక రూ.1.50లక్షల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
కొడుకు, తల్లి కళ్లెదుటే మృత్యు ఒడికి..
తిరువూరు: నిత్యం కృష్ణా నదిలో ఈతకు వెళ్లి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే క్రమంలో విజయవాడలో నివసిస్తున్న తిరువూరుకు చెందిన దంతవైద్యుడు సానికొమ్ము సురేష్ (46) మంగళవారం తన కుమారుడు, తల్లి కళ్లెదుటే నీట మునిగి దుర్మరణం చెందారు. ఇబ్రహీంపట్నం నిమ్రా కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న సురేష్ విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో నివసిస్తున్నారు. మంగళవారం తాడేపల్లి వద్ద కృష్ణానదిలో తన 12 కుమారుడితో కలసి ఈత కొట్టారు. అనంతరం బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేస్తూ రెండుసార్లు నీటి నుంచి బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్లిన సురేష్ తదుపరి ఊపిరాడక చనిపోయారు. తిరువూరు నుంచి విజయవాడ ఆస్పత్రిలో వైద్యపరీక్షల నిమిత్తం వచ్చిన తల్లి సానికొమ్ము కుమారి కూడా ఆ సమయంలో సురేష్ సమీపంలోనే నది ఒడ్డున ఉన్నారు. ఈత కొట్టిన అనంతరం తల్లిని తిరువూరు బస్సు ఎక్కిస్తానని ఇంటి నుంచి తనతో కూడా తీసుకొచ్చిన సురేష్ ఎంతసేపటికీ నీటిలో నుంచి బయటకు రాకపోవడంతో కుమారి ఆందోళనతో తల్లడిల్లింది. చుట్టుపక్కల వారికి చెప్పడంతో గజ ఈతగాళ్లు గాలింపు జరిపారు. ఫలితం లేకపోవడంతో ఎన్ఆర్డీఎఫ్ సిబ్బంది గాలించి సురేష్ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసునమోదు చేసుకుని ఆయన మృత దేహాన్ని మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సురేష్ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తిరువూరు శివారు పీటీకొత్తూరు తరలించారు. ఆయన సోదరుడు ఆస్ట్రేలియాలో నివసిస్తుండగా, తండ్రి సీపీఎంలో, రైతుసంఘంలో జిల్లాస్థాయి పదవులు నిర్వహించారు. తల్లి కుమారి ఏపీ మహిళా సంఘ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. ఆయన మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించిన నివాళులర్పించారు. కృష్ణానదిలో మునిగి దంత వైద్యుడు మృతి -
విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నడపాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టనున్న విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నడపాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. మంగళవారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో ‘ప్రైవేటు విద్యుత్ బస్సులు–ఆర్టీసీ–ప్రజలపై ప్రభావం’ అనే అంశంపై ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జిలాని బాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయత్యుత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నేతలు నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య మాట్లాడుతూ.. జీసీసీ పద్ధతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న విద్యుత్ ప్రైవేటు బస్సుల వల్ల ఆర్టీసీ డిపోలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిపోలను, విలువైన స్థలాలను, బస్ స్టేషన్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పనంగా అప్పజెప్పి ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. విద్యుత్ బస్సులను ప్రైవేటుకిస్తే ప్రజలపై భారం పెరుగుతుందని హెచ్చరించారు. ప్రజల అవసరాలకు అనుగు ణంగా ఆర్టీసీ బస్సులు పెంచాలని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి వి.ఎస్.రావు, నేషనల్ మజ్దూర్ యూనిటీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాజేష్ కుమార్, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ.. ఆర్టీసీలోని ఉద్యోగ సంఘాలు అన్నీ ఐక్యంగా పోరాడితేనే ఈ ప్రైవేటు విద్యుత్ బస్సుల ప్రమాదం నుంచి ఆర్టీసీని రక్షించుకోగలమని పేర్కొన్నారు. అనంతరం సదస్సులో ‘విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీనే నడపాలి’ అని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. విద్యుత్ బస్సులపై రూపొందించిన బుక్లెట్ను సదస్సు ఆవిష్కరించింది. సదస్సులో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య, ఇఫ్టూ రాష్ట్ర నాయకులు మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
మట్టి పెళ్లలు పడి మహిళ దుర్మరణం
గంపలగూడెం: మట్టి పెళ్లలు విరగి పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మండలంలోని అమ్మిరెడ్డిగూడెంలో మంగళవారం జరి గింది. గ్రామస్తుల కథనం మేరకు.. అమ్మి రెడ్డిగూడెం గ్రామానికి చెందిన గుంజు రాంబాబు ట్రాక్టర్తో ఇసుక, మట్టి తోలుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య ధనలక్ష్మి (30), కుమార్తె రాజి, కుమారుడు ప్రవీణ్, తల్లి నాగలక్ష్మి ఉన్నారు. రాజి ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తగా, ప్రవీణ్ ఐదో తరగతి చదువుతున్నాడు. గంగదేవరపాడు పరిధిలోని కట్టలేరులో ఇసుక తోడేందుకు రాంబాబు తన భార్య ధనలక్ష్మి (30), తల్లి నాగలక్ష్మితో కలిసి వెళ్లాడు. కట్టలేరులో పూర్తి స్థాయిలో ఇసుక తోడేశారు. ఎక్కడ మంచి ఇసుక దొకనందున తెలంగాణ పరిధిలో ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లి ఇసుక తవ్వకాలు చేపట్టారు. పైన మట్టి, కింద ఇసుక ఉండ టంతో సొరంగం చేసి ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఐదు అడుగుల లోతున 20 అడుగుల మేర సొరంగం చేసి ఇసుక తోడుతున్న నేపథ్యంలో పైనున్న మట్టి పెళ్లలు విరిగి ధనలక్ష్మి, నాగలక్ష్మిపై పడ్డాయి. దీంతో వారిద్దరు మట్టికింద చిక్కుకుపోయారు. హుటాహుటిన మూడు ట్రక్కుల మట్టి తొలగించి వారిద్దరిని బయటకు తీసి 108 అంబులెన్స్లో తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ధనలక్ష్మి (30) మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన నాగ లక్ష్మిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లి ఆస్పత్రి పాలై, భార్య తిరిగిరాని లోకాలకు చేరడంతో రాంబాబు తన ఇద్దరు బిడ్డలను అక్కున చేర్చుకుని రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరో మహిళకు తీవ్ర ఆస్వస్థత -
అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన అవసరం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరులోని రేవతి సెంటర్ వద్ద అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించి అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను మంగళవారం ఆయన విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తారన్నారు. అగ్నిప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాన్నారు. ఆపద సమయాల్లో ప్రాణాలను రక్షించటంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకమైనదన్నారు. అనంతరం అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే పలు పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, ఫైర్ ఆఫీసర్ ఆనం రమణారెడ్డి, ఫైర్మెన్లు వెంకటేశ్వరరావు, జకరయ్య, సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
పురుగుమందు తాగిన ఘటనలో మరొకరు మృతి
రెడ్డిగూడెం: పురుగు మందు తాగిన ఘటనలో ఆరు రోజుల క్రితం తల్లి మృతి చెందగా, కుమారుడు మంగళవారం చనిపోయారు. రెడ్డిగూడెం మండలంలోని కుదప గ్రామంలో నివసించే బొర్రా సావిత్రి(74), తిరుపతయ్య (47) తల్లీకుమారులు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల ఎనిమిదో తేదీన ఇంటిలో ఎవరూ లేని సమయంలో సావిత్రి, తిరుపతయ్య పురుగు మందు తాగారు. కొద్ది సేపటికి వారిద్దరిని గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోకి తరలించారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సావిత్రి ఈ నెల తొమ్మిదో తేదీన మృతి చెందింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతయ్య మంగళవారం ఉదయం పది గంటలకు మృతిచెందాడు. తాగుడుకు బానిసై... నూజివీడు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన బొర్రా తిరుపతయ్య కుటుంబం రెండు సంవత్సరాల క్రితం రెడ్డిగూడెం మండలం కుదప గ్రామంలో ఓ ఇంటిని కొనుగోలు చేసి నివసిస్తోంది. తిరుపతయ్య లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. తిరుపతయ్య భార్య, కుమారుడు, కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో తల్లి సావిత్రితో కలిసి పురుగు మందు తాగాడు. తిరుపతయ్య కొడుకు ప్రభాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరు రోజుల వ్యవధిలో తల్లీ కుమారులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుడివాడరూరల్: వృద్ధురాలి ఆత్మహత్యపై కేసు నమోదు చేసినట్లు గుడివాడ తాలూకా పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బొమ్ములూరు గ్రామానికి చెందిన జాస్తి నిర్మలాదేవి (81) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపతోంది. విజయవాడలో పలుమార్లు చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం కుదటపడలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఈ నెల తొమ్మిదో తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. అస్వస్థతకు గురైన నిర్వలాదేవిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవల అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నిర్మలాదేవి సోమవారం మృతి చెందింది. మృతురాలి పెద్ద కుమారుడు సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గూడూరు: బతుకుతెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఒడిశా కూలీ గూడూరు మండలం తరకటూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మంగళవారం పొద్దుపోయాక జరిగిన ఈ ప్రమాదంపై గూడూరు పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు. ఒడిశాకు చెందిన వ్యక్తి తరకటూరుపాలెం సమీపంలోని ఓ రైసు మిల్లులో కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం పని ముగించు కుని విజయవాడ–మచిలీపట్నం రోడ్డు దాడుతుండగా విజయవాడ వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్ వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సీహెచ్.దివ్యప్రకాష్ ఘటనా స్థలంలో ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉన్న వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, పోస్టు మార్టం నిమిత్తం బందరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతుడు స్థానికుడు కాకపోవడంతో అతని పూర్తి వివరాల కోసం పోసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం (ఒలింపిక్ డే) సందర్భంగా జూన్ 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడ్తామని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసో సియేషన్ (ఏపీఓఏ) అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తమ్ తెలిపారు. త్వరలో ఒలింపిక్ జిల్లా సంఘాలకు ఎన్నికలు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏపీఓఏ జన రల్ బాడీ సమావేశం నగరంలోని ఓ హోటల్లో మంగళవారం జరిగింది. సమావేశం అనంతరం జరిగిన పురుషోత్తమ్ విలేకరులతో మాట్లాడారు. 2036వ సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలన్న భారతదేశ ప్రతిపాదితకు గుర్తుగా జూన్ 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2,036 మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) మార్గదర్శకాలకు అనుగుణంగా చిత్తూరు జిల్లాకు చెందిన విశ్రాంత బ్యాంక్ మేనేజర్, మాజీ జాతీయ హాకీ క్రీడాకారుడు డి.ఎస్.వెంకటరామనాయుడును ఏపీఓఏ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీఈఓ) ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఒలింపిక్ సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఐఓఏ నుంచి ఆర్థిక సహాయంతో జిల్లా, రాష్ట్ర, దక్షిణ మండల (సౌత్ జోన్) స్థాయిలలో ఒలింపిక్ తరహా పోటీలను నిర్వహించడానికి ఏపీఓఏ ప్రణాళిక రూపొందిస్తోందని వివరించారు. మేఘాలయలో జరిగే 39వ జాతీయ క్రీడల్లో ఏపీఓఏ తరఫున రాష్ట్ర జట్లను కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీఓఏ ఉపాధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, నడెళ్ల బ్రహ్మాజీరావు, కోశాధికారి శ్రీనివాస్, సీఈఓ వెంకటరామ నాయుడు, సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మే 5, 6, 7 తేదీల్లో విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో జరిగే ఐదో ఏపీ కప్ తైక్వాండో స్టేట్ చాంపియన్షిప్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. -
రైతుల సమస్యలపై వాదనలు శుభ పరిణామం
గుడివాడ టౌన్: దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో వ్యవసాయ ఉత్పత్తులు, కనీస మద్దతు ధర నిర్ణయం విధానంపై వాదనలు జరపడం శుభ పరిణామమని రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవ ఖర్చులు, కుటుంబ పనిపై ప్రస్తుత కనీస మద్దతు ధర నిర్ణయం రైతులను ఏమాత్రం ఆదుకోవడం లేదని తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ కూడా కనీస మద్దతు ధర ఉండాలని సిఫారసు చేసిందని గుర్తుచేశారు. వాస్తవ ఖర్చులు, కుటుంబ ఖర్చులు, భూమి లీజు, పెట్టుబడి వడ్డీలకు అనుగుణంగా మద్దతు ధర నిర్ణయం సరిగ్గా లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎప్పటి నుంచో లేవనెత్తుతున్నామని, కనీస మద్దతు ధర నిర్ణయిస్తే సరిపోదని, ఆ ధర రైతుకు చేరేలా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు ప్రతినిధిగా ఈ విషయంపై సుప్రీంకోర్టులో వాదన జరగడం తాను స్వాగతిస్తున్నాని పేర్కొన్నారు. -
బీఆర్ అంబేడ్కర్ అందరివాడు
చిలకలపూడి(మచిలీపట్నం): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఏ ఒక్క సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని, అందరి వాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశపు హాలులో జరిగిన సభ కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించిన అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నంలో అంబేడ్కర్ భవన్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ప్రతి మేధావిని ప్రభావితం చేసే వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలకొల్పడానికి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. అంబేడ్కర్ మన జీవితాల్లో అస్పృస్యత లేకుండా అందరూ సమానంగా గౌరవించబడేలా రాజ్యాంగాన్ని నిర్మించగలిగారన్నారు. -
సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
మచిలీపట్నంఅర్బన్: సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్–జేఏసీ జిల్లా అధ్యక్షుడు కె.జాన్మోడీ డిమాండ్ చేశారు. బందరు మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హెచ్ఆర్ పాలసీ అమలు చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు 22 రోజుల పాటు నిర్వహించిన సమ్మె సమయంలో కూటమి పార్టీలు మద్దతు ప్రకటించి, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. డిమాండ్ల సాధన కోసం మే 15వ తేదీ విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నివాసానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, హమామాలిని, సూరమ్మ, సాయి లక్ష్మి, ఎలిజబెత్ రాణి, అంజలి, దివ్య, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను నిర్దేశిత గడువులో పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్లో వచ్చే ప్రతి అర్జీని నిర్దేశ గడువులో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం 153 అర్జీలు జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 153 అర్జీలు అందాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వీటిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 62, పోలీసు 16, పంచాయతీరాజ్కు 13, రెవెన్యూకు 9, విభిన్న ప్రతిభావంతుల శాఖకు 6, పౌరసరఫరాల శాఖకు 5, డీఆర్డీఏకు 4 అర్జీలు వచ్చాయన్నారు. పశుసంవర్ధక, గృహ నిర్మాణం, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు మూడు చొప్పున అర్జీలు వచ్చాయన్నారు. విద్యుత్, విద్య, మార్కెటింగ్, మైన్స్, సాంకేతిక విద్య, కలెక్టరేట్ కోఆర్డినేషన్, డీసీహెచ్ఎస్ విభాగాలకు రెండు చొప్పున అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజా రవాణా, దేవదాయ, మత్స్య, భూగర్భ జలాలు, ఐసీడీఎస్, కార్మిక, మెప్మా, కాలుష్యం, రీజనల్ ఇంటర్మీడియెట్ ఆఫీసర్ (ఆర్ఐవో), రహ దారులు–భవనాలు, సాంఘిక సంక్షేమం, జలవనరులు శాఖలకు ఒక్కో అర్జీ వచ్చినట్లు తెలిపారు. ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం శివారు కోమటికుంట గ్రామంలో 175 ఎకరాల అటవీ భూమిని దశాబ్దాలుగా 250 కుటుంబాలు సాగుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఉన్నతస్థాయి కమిటీ వేసి వీటికి పట్టాలు ఇవ్వాలి. ఆర్డబ్ల్యూఎస్ మైలవరం పైలట్ ప్రాజెక్టు మెయింట్నెన్స్ వర్క్స్ కాంట్రాక్ట్ తీరుపై పీజీఆర్ఎస్లో జేసీకి అర్జీ సమర్పించాం. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులతో పాటు, సూపర్వైజర్ను తొలగించారు. వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. దీనిపై జాయింట్ కలెక్టర్తో మాట్లాడాం. -
చోరీ కేసులో సొత్తు రికవరీ
గుడివాడరూరల్: మాజీ మంత్రి కఠారి ఈశ్వర్కుమార్ ఇంట్లో జరిగిన చోరీ కేసును టూటౌన్ పోలీసులు ఛేదించారని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు తెలిపారు. స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. గత నెల 14వ తేదీన మాజీ మంత్రి ఈశ్వర్కుమార్ సతీమణి మధురిమ హైదరాబాద్ వెళ్లి 18వ తేదీ తెల్లవారుజామున స్థానిక భయ్యావారివీధిలోని ఇంటికి తిరిగిచేరుకున్నారు. ఇంట్లో చోరీ జరిగిందని ఆమె గుర్తించారు. దొంగలు ఇంటి తాళం పగులకొట్టి బీరువాలోని వెండి వస్తువులను దొంగిలించినట్లు గుర్తించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ జె.ఆర్.కె.హనీష్ తన సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన ఇంట్లో ఎటువంటి ఆధారాలు లభించకపోయినా సాంకేతిక పరిజ్ఞా నంతో సమాచారం సేకరించి, పాత నేరస్తుల కదలికపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో సోమవారం పట్టణంలో ముగ్గురు వ్యక్తులను సీఐ అదుపులోకి తీసుకుని విచారించగా వారే చోరీ చేసులో నిందితులని తేలింది. వారి వద్ద రూ.15 లక్షలు విలువైన ఐదు కిలోల వెండి వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర దొంగ అయిన ఎన్టీఆర్ జిల్లా నందిగా టౌన్ రైతుపేట గ్రామానికి చెందిన దొడ్లోజి బాబు ఆలియాస్ రవిబాబు(56), అతనికి సహకరించిన రైతుపేట గ్రామానికి చెందిన తిరుమలశెట్టి అంజలి(38), గుడివాడ పట్టణం బేతవోలు సమీపంలోని నిమ్మతోటకు చెందిన తిరుమలశెట్టి వాణి(33)ని పోలీసులు అదుపులోకి అరెస్ట్ చేశారు. రవిబాబు లారీ క్లీనర్గా పని చేస్తూ వ్యసనాలకు బానిసై జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. నిందితుడిపై హైదరాబాద్, ఎస్ఆర్నగర్, నెల్లూరు, చిలకలూరిపేట, తణుకు, ఎన్టీఆర్ జిల్లా తదితర ప్రాంతాల్లో 11 చోరీ కేసులు ఉన్నాయి. ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న సీఐ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీ పాలా శ్రీనివాస్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాజీ మంత్రి కఠారి ఈశ్వర్కుమార్ ఇంట్లో చోరీని ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు వివరాలు తెలిపిన ఎస్పీ విద్యాసాగర్నాయుడు -
టెన్త్ మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన కృష్ణా కలెక్టర్
మచిలీపట్నంఅర్బన్: లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మూల్యాంకన ప్రక్రియను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. మూల్యాంకన కార్యక్రమంలో మొత్తం 775 మంది సిబ్బంది పాల్గొనగా, అందులో 80 మంది చీఫ్ ఎగ్జామి నర్లు, 461 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 234 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు తదితర అధికారులు పాల్గొన్నారు. హైవేపై ట్రాలీ లారీ బీభత్సం కృష్ణలంక(విజయవాడతూర్పు): స్థానిక జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద ట్రాలీ లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడుపుతుండగా లారీ అదుపు తప్పి ముందు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు, కారును ఢీకొంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారధి వైపు నుంచి ఒక ట్రావెల్స్ బస్సు, కారు బెంజిసర్కిల్ వైపు వెళ్తున్నాయి. జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద ఉన్న సాయిబాబా గుడి సమీపానికి చేరుకోగానే గుంటూరు జిల్లా తాడేపల్లి వైపు నుంచి ఆటోనగర్ వెళ్తున్న ట్రాలీ లారీ మితిమీరిన వేగంతో వచ్చి ట్రావెల్స్ బస్సు, కారును వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో బస్సు, కారు వెనుకవైపు భాగాలు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని పరీక్షించి మద్యం తాగినట్లు గుర్తించారు. లారీ డ్రైవర్పై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు కృష్ణలంక పోలీసులు తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గం ఎన్నిక భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం రథసారథులుగా సాయికిరణ్, మోహన్ ఎన్నికయ్యారు. విజయవాడలో నిర్వహించిన సంఘ ఎన్నికల్లో సింహం గుర్తుపై పోటీ చేసిన కిరణ్ – మోహన్ ప్యానల్ 915 ఓట్లతో ఘన విజయం సాధించింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా పి.సాయి కిరణ్, కందు కూరి మోహన్ను ప్యానల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశ్రాంత గ్రేడ్–2 ఆఫీసర్ వినుకొండ భవానీ దుర్గాప్రసాద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో సంఘ ఆహ్వాన కమిటీ చైర్మన్ చల్లాల శివాజి, అధ్యక్షుడు మునగంటి కామేశ్వరరావు, రామ కృష్ణ, శ్రీను, విజయవాడ నగర అధ్యక్షుడు గొర్తి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


