breaking news
NTR district News
-
టూరిజం ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): జిల్లాలో ప్రతిపాదించిన టూరిజం ప్రాజెక్టులు డీపీఆర్లకే పరిమితం కాకూడదని, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా పర్యాటక ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న పర్యాటక ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. భవానీ ఐల్యాండ్ కోసం.. భవానీ ఐల్యాండ్ వద్ద రూ.75కోట్ల అంచనా వ్యయంతో పదెకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఏఎంసీ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డెస్టినేషన్ వెడ్డింగ్, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్, 500 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ హాల్ తదితర ఆధునిక సౌకర్యాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జూలై–2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అంబేడ్కర్ స్మృతివనంలో.. స్వరాజ్ మైదానంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో 75మంది సామర్థ్యంతో మినీ థియేటర్ను పాఠశాల, కళాశాల విద్యార్థులకు విద్యా, వైజ్ఞానిక, అవగాహన చిత్రాల ప్రదర్శనకు వినియోగించాలన్నారు. నదిహారతి ఆర్టీసీ బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ -
నిబద్ధతతో పని చేయాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): విధుల పట్ల ఉదాసీనత లేకుండా, నిబద్ధతతో ప్రజలకు సేవలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ. శ్రావణ్బాబు అన్నారు. ఆయన బుధవారం జిల్లాలోని ఇబ్రహీంపట్నం పీహెచ్సీ, ముత్యాలం చెరువు యూపీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది ముఖ హాజరును పరిశీలించారు. ఇబ్రహీంపట్నం పీహెచ్సీలో జరుగుతున్న ప్రసవాలను పరిశీలించి, గర్భిణులు, మాతాశిశు సంరక్షణ సేవలను అడిగి తెలుసుకున్నారు. మరింత నాణ్యతా ప్రమాణాలతో కూడిన సేవలు అందించాలన్నారు. అదే విధంగా ఇబ్రహీంపట్నం మండలంలోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్ను సందర్శించి, అక్కడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ఎప్పటికప్పుడు వారికి పరీక్షలు చేసి, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీపీఎంఓ డాక్టర్ నవీన్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మహేశ్వరరావు, వైద్యాధికారి డాక్టర్ ఫర్హీం, సీహెచ్ఓ నారాయణరావు పాల్గొన్నారు. తిరువూరు: ‘బెల్టు బేరం.. రాబడి అధనం’ శీర్షికన సాక్షి దిన పత్రికలో బుధవారం వచ్చిన వార్తకు తిరువూరు ఎకై ్సజ్ సర్కిల్ అధికారులు స్పందించారు. తిరువూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 330 బెల్టు దుకాణాలను సీజ్ చేసిన అధికారులు వాటి నిర్వాహకులను అరెస్టు చేసి 3,919 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు మండలంలో 62 మందిని, గంపలగూడెంలో 129 మందిని, ఏకొండూరు మండలంలో 51 మందిని, విస్సన్నపేట మండలంలో 52 మంది బెల్టు దుకాణాల నిర్వాహకులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ నిక్సన్ తెలిపారు. -
ప్రకృతి మాతా ప్రణామం
పూర్ణాహుతితో ముగిసిన శాకంబరీ ఉత్సవాలు గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తజనం వివిధ ఫలాలతో ఉత్సవమూర్తిఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో మూడు రోజులుగా జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఉత్సవాలలో మూడో రోజున అమ్మవారికి డ్రై ఫ్రూట్స్తో అలంకరించగా, అమ్మవారి ప్రధాన ఆలయాన్ని వివిధ రకాల పండ్లు, కాయలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరో వైపున ఆషాఢ పౌర్ణమి నేపథ్యంలో తెల్లవారుజామున దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగిన ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు, అమ్మవారి సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు. 45 టన్నుల కూరగాయలు, 2.5 లక్షల మంది భక్తులు శాకంబరీ ఉత్సవాలలో మూడు రోజులలో 45 టన్నుల కూరగాయలను ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం, ఇతర ఉపాలయాల అలంకరణకు వినియోగించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మూడు రోజుల ఉత్సవాలలో మొత్తం 2.50 లక్షల మంది భక్తులు అమ్మవారికి శాకంబరీగా దర్శించుకున్నారని పేర్కొన్నారు. ఉత్సవాలలో మొదటి రెండు రోజులు ఆకు కూరలు, కాయగూరలతోనూ, మూడో రోజున డ్రైఫ్రూట్స్తో అలంకరించారు. బంగారు గోపుర ప్రాకారం చుట్టూ బత్తాయిలు, కమలాలు, పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్స్, యాపిల్, ఆల్బక్రా, ద్రాక్షలతో అలంకరించారు. శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని మూడు రోజుల పాటు జరిగిన కదంబ ప్రసాద వితరణపై భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9.30గంటల వరకు నిర్విరామంగా కదంబ ప్రసాదాన్ని భక్తులకు అందించామని ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. రాజగోపురం ఎదుట మంచుతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వైభవంగా గిరి ప్రదక్షిణ.. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం తెల్లవారుజామున ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. కామథేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థాన ప్రచార రథానికి ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఇతర అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి గిరిప్రదక్షిణను ప్రారంభించారు. ఘాట్రోడ్డు నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావు నగర్, చిట్టినగర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. ఆషాఢ మాసం, గురు పౌర్ణమి వేళ ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తమ ఇంటి ముంగిటకు విచ్చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ భక్తులు పూజా సామగ్రి సమర్పించి పూజలు జరిపించుకున్నారు. పౌర్ణమి వేళ.. ఆర్జిత సేవా భాగ్యం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ పౌర్ణమి, శాకంబరీగా దుర్గమ్మ దర్శనం, ఆషాఢ సారె ఉత్సవాల నేపథ్యంలో బుధవారం ఆదిదంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవలకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో సుప్రభాత సేవ, మూలవిరాట్కు నిర్వహించే ఖడ్గమాలార్చనకు పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. అమ్మవారి ఖడ్గమాలార్చనలో 27 మంది ఉభయదాతలు రెండు షిఫ్టులలో పూజను జరిపించుకున్నారు. ఇక ఆలయ ప్రాంగణంలోని నూతన పూజా మండపంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చనలో 11 మంది, శ్రీచక్రనవార్చనలో 17 మంది, యాగశాలలో చండీహోమంలో 174 టికెట్లకు విక్రయించారు. దీంతో సుమారు మూడువందల మంది భక్తులు యాగశాలలో ప్రత్యక్షంగా పాల్గొని తమ నామగోత్రాలతో హోమం జరిపించుకున్నారు. ఇక సాయంత్రం అమ్మవారికి జరిగిన పంచహారతుల సేవలో పాల్గొనేందుకు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పోటీ పడ్డారు. శాకంబరీ ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొనగా, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్డీ, ప్రసాద్, ఇతర వేద పండితులు పాల్గొన్నారు. -
గాలిలో దీపంలా సాగు!
ప్రతి రైతుకూ బీమా గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రధాన మంత్రి ఫసల్బీమా యోజన పథకం నూరు శాతం నమోదు లక్ష్యంగా కార్యచరణ చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లాస్థాయి అధికారులతో కలసి కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద విత్తనం నాటిన ప్రతి రైతును తప్పనిసరిగా పంటల బీమా పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. పంట మార్పిడిపై ప్రతి మండల వ్యవసాయ అధికారి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, ఇప్పటి వరకు ఎంతమంది రైతులు ఎంత విస్తీర్ణంలో పంట మార్పిడి చేపట్టారో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎరువుల సమస్యలపై కాల్ సెంటర్.. ఎరువుల విషయంలో రైతులకు సమస్యలు ఎదురైతే కలెక్టరేట్ యూనిఫైడ్ కాల్ సెంటర్ (91549 70454)ను సంప్రదించే విధంగా అన్ని ఎరువుల దుకాణాల వద్ద హెల్ప్లైన్ నంబర్ను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. సాక్షి, విజయవాడ: ఎల్నినో ప్రభావం ఒకవైపు.. ప్రభుత్వ సహాయ నిరాకరణ మరోవైపు.. వెరసి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రైతులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న అన్నదాతలను కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వర్తింపజేసే పంటల బీమాకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రీమియం నగదు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి ఆదుకోవాల్సి ఉండగా.. రైతులే ప్రీమియం కట్టాలని ప్రభుత్వం చెబుతోంది. అసలే కష్టనష్టాలతో ఇబ్బంది పడుతున్న అన్నదాత ఇప్పుడు ప్రీమియం చెల్లించడానికి మొగ్గు చూపడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇక్కడ అధికశాతం వరి సాగు అవుతోంది. అయితే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని, వరి సాగు చేయొద్దని ప్రభుత్వం రైతులకు చెబుతోంది. ఏదీ నాటి భరోసా? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు అండగా పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేది. తద్వారా రైతులకు పంట నష్టం జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే ఆ సీజన్లోనే పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం బీమా ప్రీమియం రైతులే చెల్లించాలని చెబుతోంది. గత్యంతరం లేక కొందరు ప్రీమియం చెల్లిస్తుండగా, మరికొందరు మాత్రం కనీసం ఆసక్తి చూపడం లేదు. మరోవైపు బస్తా యూరియా కోసం తాము అగచాట్లు పడుతున్నామని, ఇంక పంట నష్టపోతే పరిహారం ఇస్తారన్న నమ్మకం లేదని రైతులు చెబుతున్న పరిస్థితి. అసలే ఎల్నినో ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అన్నదాతలకు అండగా నిలవాల్సిన తరుణంలో ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. రేపటితో ఆఖరు.. వాతావరణ ఆధారిత, పీఎం ఫసల్ బీమా పథకాల కింద ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. వరి పంటకు మాత్రం ఆగస్టు 15 వరకు గడువు ఉంది. క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు సాగు చేసిన పంటను పరిశీలించి బీమా ప్రీమియం కట్టించేలా అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది రైతు సేవా కేంద్రాల్లోనే నమోదు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2022 అధికారిక గణాంకాల ప్రకారం 3.76 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. ఇందులో సాగు నీరు కింద 2.42లక్షల హెక్టార్లు ఉంది. కొన్ని పంటలకు ప్రీమియం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించాలని రైతులు కోరుతున్నా.. చంద్రబాబు సర్కారు నుంచి కనీస స్పందన లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పీఎంఎఫ్బీవై కింద వరి(అత్యధిక విస్తీర్ణం)కి ఎకరాకు రూ.850(ఆగస్టు 15 వరకు గడువు ఉంది), ఎర్రమిరపకు రూ.1800, మొక్కజొన్నకు ఎకరాకు రూ.370, పత్తికి రూ.1900(ఈ నెల 24వ తేదీకి గడువు ముగిసింది), పెసలుకు రూ.360 చొప్పున బీమా కట్టాల్సి ఉంది. కానీ ఉమ్మడి జిల్లాలో బీమా నమోదు శాతం చాలా తక్కువగా ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ చేయించేందుకు నగదు చెల్లించేది. పంట నష్టపోయినప్పుడు రైతులకు ఇన్సూరెన్స్ నగదు అందేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం చెల్లించే ప్రీమియం ఎత్తి వేయడంతో రైతులకు ఇన్సూరెన్స్ చేయించడం ఆర్థిక భారంగా మారి ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల పంట నష్టపోయినప్పుడు రైతులు అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకొని ఉచితంగా ఇన్సూరెన్స్ చేయించాలి. – చెరుకూరి శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకుడు, కవులూరు -
విజయవాడ డివిజన్ ఉద్యోగికి జీఎం సేఫ్టీ అవార్డు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ అవాంఛనీయ ఘటనలను నివారించడంలో కృషి చేసిన విజయవాడ డివిజన్ ఉద్యోగి ఎం.రమేష్ బాబు దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథ్యర్ చేతుల మీదుగా ‘మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డు’ అందు కున్నారు. జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జోన్ వ్యాప్తంగా విధుల్లో అప్రమత్తత చూపించిన ఉద్యోగులకు అవార్డులను అందించారు. అందులో విజయవాడ డివిజన్కు చెందిన ఎం.రమేష్బాబు జూన్ 2న మధ్యాహ్నం 12.05 గంటల సమయలో గూడ్స్ రైలు చీరాల స్టేషన్ దాటుతుండగా అందులోని రెండు వ్యాగన్లలో ఐరన్ కాయిల్స్ను పట్టి ఉంచే ఇనుప పట్టీలు విరిగిపోయి ఉండటాన్ని గమనించాడు. వెంటనే స్పందించి.. లోకోపైలెట్, స్టేషన్ మాస్టర్, సంబంధిత కంట్రోల్ సిబ్బందిని అప్రమత్తం చేశాడు అనంతరం రైలును వేటపాలెంలో నిలిపి సత్వర చర్యలు చేపట్టారు. ఐటీఐలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం. కనకారావు ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 3వ తేదీలోగా ఐటీఐఅడ్మిషన్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 6వ తేదీన విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్కు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు విజయవాడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశామని తెలిపారు. వివరాలకు 0866–2475575, 94906 39639, 77804 29468లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. అనుమతులు లేని భవనాల కూల్చివేత పెనమలూరు: తాడిగడప మునిసిపాలిటీలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై బుధవారం అధికారులు చర్యలు తీసుకున్నారు. మునిసిపాలిటీ కమిషనర్ షేక్ నజీర్ తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు డాక్టర్స్ కాలనీ, తాడిగడప డొంక రోడ్డులో అనుమతులు లేకుండా భవనాల నిర్మాణం చేశారన్నారు. మునిసిపాలిటీ చట్టానికి విరుద్ధంగా భవనాలు నిర్మాణం చేసినందున నోటీసులు జారీ చేశామని అన్నారు. నిర్ణీత సమయంలో యజమానులు అక్రమ కట్టడాలు తొలగించకపోవటంతో టౌన్ ప్లానింగ్ అధికారులు భవనాలను కూల్చారని అన్నారు. తాడిగడప మునిసి పాలిటీలో నిర్మాణాలు చేపట్టే యజమానులు ముందస్తుగా ప్లాన్లు మంజూరు చేసుకోవాలని తెలిపారు. మంజూరైన ప్లాన్ల ప్రకారం భవనాల నిర్మాణం చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య కళాశాలకు విరాళంగా గోల్డ్ మెడల్ లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆ కళాశాల పూర్వ విద్యార్థి(1987 బ్యాచ్), రేడియాలజిస్ట్ డాక్టర్ వీఎన్ వరప్రసాద్ గోల్డ్మెడల్ విరాళాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుకు అందజేశారు. ఏటా బెస్ట్ అవుట్గోయింగ్ విద్యార్థికి ఈ గోల్డ్మెడల్ను అందించనున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ వైద్య విద్యార్థుల ప్రతిభను మరింత ప్రోత్సహించేలా గోల్డ్మెడల్ విరాళం అందజేయడం అభినందనీయం అన్నారు. డాక్టర్ వీఎన్ వరప్రసాద్ విరాళం మరెందరో పూర్వ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. -
సంగీతం, సాహిత్యం.. జ్ఞానాన్ని పెంచే సాధనాలు
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వన్టౌన్(విజయవాడపశ్చిమ): సంగీత, సాహిత్యాలు జ్ఞానాన్ని ప్రసాదించే గొప్ప సాధానాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. యువత పాశ్చాత్య పొకడల వైపు అడుగులు వేస్తూ భారతీయ సంస్కృతికి దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర భాషా–సాంస్కృతిక శాఖ, కాకరపర్తి భావనారాయణ కళాశాల, అన్నమాచార్య భావనా వాహిని సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కేబీఎన్ కళాశాలలో నిర్వహించిన ‘జగద్గురు అన్నమాచార్య’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువత అన్నమయ్య కీర్తనల అంతరార్థాన్ని గ్రహించి జీవితంలో ఆచరించాలని సూచించారు. మానవ విలువలకు ప్రతీకలు.. రాష్ట్ర సృజనాత్మకత–సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి మాట్లాడుతూ సంగీతం, సాహిత్య సమ్మేళనంతో అన్నమయ్య పదకవిత్వానికి చిరస్థాయితనం లభించిందన్నారు. పద్మశ్రీ డాక్టర్ శోభారాజు మాట్లాడుతూ అన్నమయ్య కీర్తనలు మానవ విలువలకు ప్రతీకలని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. కృష్ణవేణి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడమే కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. సెక్రటరీ డాక్టర్ టి. శ్రీనివాసు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలు తెలుగు సాహిత్యానికి అమూల్య వారసత్వమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన ‘పదకవితా వసంతం అన్నమయ్య’ గ్రంథాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం వందలాది మంది విద్యార్థులు సామూహికంగా అన్నమయ్య సంకీర్తనలు ఆలపించడం విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో హిందూ హైస్కూల్స్ కమిటీ జనరల్ సెక్రటరీ గోపిశెట్టి మల్లయ్య, పరిపాలనాధికారి డాక్టర్ వి. నారాయణరావు, కమిటీ అధ్యక్షుడు ఉసిరిక ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రయోగాలతో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రయోగాల ద్వారా ఆయా అంశాలపై నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించి, ప్రయోగాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు సైన్స్ ప్రయోగ కిట్లను అందజేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్కాస్ట్) సౌజన్యంతో పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష, లీప్, ఎస్సీఈఆర్టీ, జెనీ సైన్స్ సంయుక్త ఆధ్వర్యంలో 100 పాఠశాలలకు సైన్స్ జెనీ బాక్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నగరంలోని సీవీఆర్ మునిసిపల్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ కిట్లను ఉపయోగించడంపై సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను భౌతిక రసాయన జీవశాస్త్రాల అంశాలపై ఆసక్తితో ఆవిష్కరణల దిశగా నడిపించేందుకు ఆప్కాస్ట్ సహకారంతో సైన్స్ కిట్లను అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. జెని బాక్స్ కిట్ల ద్వారా 40 రకాల ప్రయోగాలు చేసేందుకు వీలవుతుందని ఆప్కాస్ట్ సభ్య కార్యదర్శి డాక్టర్ కె.శరత్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ 2026 పోస్టర్లను ఆవిష్కరించారు. 10 నుంచి 17 ఏళ్ల వయసు గల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఆర్జేడీ జి.నాగమణి, డీఈవో ఎల్.చంద్రకళ, సమగ్రశిక్ష ఏపీసీ ఆర్.రమేష్ బాబు, జెనీసైన్స్ వ్యవస్థాపకుడు ప్రమోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బస్సు ఢీకొని కార్మికుడు మృతి
కంకిపాడు: బస్సు ఢీకొని కార్మికుడు మృతి చెందిన సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్ఐ కేవై దాసు తెలిపిన కథనం మేరకు...కంకిపాడు పట్టణంలోని పద్మావతి నగర్లో నివాసం ఉంటున్న గుడివాడ విష్ణువర్థన్రావు (62) పట్టణంలోని పొగాకు కొట్టులో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు స్థానికంగా ఉన్న అపార్టుమెంట్ వద్ద నిలబడ్డాడు. రవీంద్ర భారతి పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు డ్రైవరు నిర్లక్ష్యంగా బస్సును వెనక్కి రివర్స్ చేయటంతో విష్ణువర్థన్రావును బస్సు ఢీకొని కిందపడ్డాడు. అతని తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వైద్యం నిమిత్తం పట్టణంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే విష్ణువర్థన్రావు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ దాసు తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని రమేష్ ఆసుపత్రి రోడ్డులో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల 10వ స్నాతకోత్సవం కళాశాల ఆవరణలోని కృష్ణవేణి సభాగర్ ఆడిటోరియంలో బుధవారం జరుగనుంది. పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ సంస్థ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ శేఖర్ సి.మాండే ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్ డాక్టర్ ఆమోఘ్కుమార్ గుప్తాతో పాటుగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల విజయవాడ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేస్తారు. 2026వ విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన 262 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. విద్యార్థులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. -
ఇంద్రకీలాద్రికి హరిత శోభ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ‘వరి కంకుల మధ్య మా దుర్గమ్మా.. నిను చూచిన కనులదే భాగ్యం కదమ్మా..’ అంటూ భక్తులు పులకించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు అంగరంగ వైభ వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ప్రధాన ఆలయంలో మూలవిరాట్కు వరి కంకులనే ఆభరణాలుగా తీర్చిదిద్దారు. ముగ్ధ మనోహరమైన అమ్మవారి రూపాన్ని చూసిన భక్తులు మైమరిచారు. తెల్లవారు జాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి శాకంబరీగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కరివేపాకు తోటగా మలిచిన తీరు అందరికీ ముగ్ధులను చేసింది. మరో వైపు ఆషాఢ మాసోత్సవం నేపథ్యంలో అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మహా నివేదన అనంతరం రద్దీ అంతకంతకు పెరుగుతూ ఉండటంతో అన్ని క్యూలైన్లలోనూ భక్తులను ఉచి తంగా అనుమతించారు. రూ.500 టికెట్ల విక్రయా లను నిలిపివేసిన దేవస్థాన అధికారులు బంగారు వాకిలి ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, సాయంత్రం ఆరు నుంచి రాత్రి 9.30 గంటల వరకు భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఆకట్టుకున్న ప్రధాన ఆలయ అలంకరణ శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మ వారి ప్రధాన ఆలయానికి చేసిన కూరగాయల అలంకరణ భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. కరివేపాకు, వంకాయలు, దొండ, బెండ, కాకర, టమాట, క్యారెట్, క్యాప్సికమ్లతో ఆలయ ప్రాంగణాన్ని హరిత వనంగా తీర్చిదిద్దారు. ఇక ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఆకుకూరలు, కాయ గూరలతో విశేషంగా అలంకరించారు. వేద విద్యార్థులకు దివ్య దర్శనం శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న వేద పాఠశాల విద్యార్థులకు ఇకపై అమ్మవారి దివ్య దర్శనం కలగనుంది. ఈ మేరకు మంగళవారం పోరంకి వేద పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా దర్శనం కల్పించారు. ఈ నూతన పాలసీకి ఆలయ ఈఓ శీనానాయక్ సోమ వారం ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి పండుగ దినాలు, పౌర్ణమి, అమావాస్య వంటి విశేష రోజుల్లో అమ్మవారి దర్శనం కల్పించడం చాలా ఆనందంగా ఉందని వేద విద్యార్థులు పేర్కొన్నారు. నేడు పూర్ణాహుతి సోమవారం ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు బుధవారం ముగియనున్నాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో సప్తశతీ పారాయణం, మహా విద్యా పారాయణం, హోమాలు, శాంతి పౌష్టిక హోమాలు, మంటప పూజలను నిర్వహిస్తారు. అనంతరం 9.30 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ఉదయం 5.55 గంటలకు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. అమ్మవారి ఆలయ ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే గిరిప్రదక్షిణ కుమ్మరి పాలెం, విద్యాధరపురం, సితార, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావు నగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. -
పోలవరం కాలువ ద్వారా సాగునీటిని పునరుద్ధ్దరించాలి
గన్నవరం: నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల కారణంగా ఖరీఫ్ పంటలు ఎండిపోయి, రైతుల జీవనోపాధి ప్రమాదంలో పడుతున్న నేపథ్యంలో పోలవరం కాలువ నుంచి విద్యుత్ మోటర్ల ద్వారా సాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబునాయుడును మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ కోరారు. ఈ మేరకు సీఎంకు నియోజకవర్గానికి చెందిన 500 మంది రైతుల సంతకాలతో కూడిన లేఖను ఆయన రాశారు. నియోజకవర్గంలోని సుమారు 30కు పైగా గ్రామాల ప్రజలు సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం పోలవరం కాలువపై ఆధారపడ్డారని చెప్పారు. పోలవరం కాలువ అందుబాటులోకి రాకముందు వర్షపాతం, భూగర్భజలాలపై ఆధారపడిన రైతాంగం తీవ్ర నీటి ఎద్దడిని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పోలవరం కుడి కాలువ నిర్మాణం కోసం ఇక్కడి రైతులు నీటి సౌకర్యం కల్పిస్తారనే నమ్మకంతో తమ సారవంతమైన భూములను ప్రభుత్వానికి అప్పగించారని గుర్తుచేశారు. 2015లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడి భౌగోళిక సమస్యను వివరించగా, మెట్ట భూములకు నీటిని లిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. దీంతో గత 12 ఏళ్లుగా పోలవరం కాలువ నుంచి మోటర్ల ద్వారా గోదావరి జలాలను తోడుకుని తమ పొలాలకు, చెరువులకు మళ్లించుకుంటున్నారని తెలిపారు. ఈ విధానం జలవనరులు, రెవెన్యూ, విద్యుత్ శాఖల పర్యవేక్షణ, సమ్మతితోనే కొనసాగుతోందన్నారు. ఈ వ్యవస్థపై నమ్మకంతోనే చాలా మంది రైతులు బ్యాంక్ రుణాలు, ప్రైవేట్ అప్పుచేసి మరీ ఈ ఏడాది ఖరీఫ్ సాగును ప్రారంభించారని, అయితే హఠాత్తుగా ఇప్పుడు విద్యుత్ కనెక్షన్లు తొలగించి మోటర్ల ద్వారా నీటి సరఫరా నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. కరెంట్ సరఫరాను నిలిపివేసే ముందు రైతులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, కనీసం వారి సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితిని, జీవనోపాధిని దెబ్బతీసే ఇలాంటి కఠిన నిర్ణయాన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండా అమలు చేయడం సరికాదన్నారు. రైతులు పొలం దుక్కులు, నారుమడులు, నాట్లు వేసేందుకు భారీగా ఖర్చుపెట్టారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి డెల్టా ఆయకట్టు నీటి అవసరాలకు భంగం కలగకుండా మెట్ట ప్రాంత రైతులకు సాగునీటి సరఫరాకు విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించాలని కోరారు. పోలవరం కాలువ ద్వారా ఎగువ భూములకు నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా శాశ్వత విధానాన్ని రూపొందించాలని ఆ లేఖలో సీఎంను కోరారు. -
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.20.40 లక్షల బీమా చెక్కు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రూ.20.40 లక్షల బీమా చెక్కును ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అందజేశారు. వివరాల ప్రకారం వీరులపాడు పోలీస్స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ మొగిలి ప్రభుకుమార్ ఈ ఏడాది ఏప్రిల్ 26న విధులు ముగించుకుని ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. దీంతో రాష్ట్రంలోని హోంగార్డులతో పాటు అన్ని కేడర్ పోలీసు సిబ్బందికి వర్తించే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం రూ.20.40 లక్షలు చెక్కురూపంలో ప్రభుకుమార్ కుమారుడు అఖిల్బాబుకు అందజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సోమయ్య, ది న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ రిటైర్డ్ డివిజనల్ మేనేజర్ ఎస్వీ సుబ్బారావు, స్థానిక డివిజనల్ కార్యాలయ అధికారి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. -
హోరెత్తిన నిరసన గళం
బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026దగా డీఎస్సీపై గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యారంగం, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై విద్యార్థులు, యువజనులు కదం తొక్కారు. నీట్ అవకతవకలపై ఢిల్లీలో జెన్ జీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఆందోళనల తరహాలో విజయవాడను నిరసనలతో హోరెత్తించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలని, మంత్రి నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్తో వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కోమల సాయి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బావాజీపేటలోని కూర్మయ్య వంతెన నుంచి ధర్నా చౌక్ వరకు ఈ ర్యాలీ సాగింది. డీఎస్సీ అభ్యర్థులు గంగదేవిపాడుకు చెందిన రోశిబాబు, నూజివీడుకు చెందిన రాణి పాల్గొని తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. విద్యార్థులు, యువత ప్లకార్డులతో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. డీఎస్సీలో కమీషన్ల పర్వం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యువత, విద్యార్థులే ఎక్కువగా నష్టపో యారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి హామీ అమలు చేయడంలేదని విమర్శించారు. యువగళం పాద్రయాత్రలో యువతకు అన్నగా ఉంటానన్న నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి కమీషన్లు దండుకున్నారని దుయ్యబట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తరహాలో లోకేష్ రాజీనామా చేయాలని రాష్ట్ర యువత, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. యువతకు న్యాయం చేయగలిగే ఏకై క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. వైఎస్సార్ సీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మ లోకేష్ చాలెంజ్లు విసరడం విడ్డూరంగా ఉందన్నారు. మెగా పేరుతో దగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ పేరుతో యువతను దగా చేసిన ప్రభుత్వాన్ని యువత, విద్యార్థులు రోడ్డెక్కి నిలదీస్తున్నారని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలకు నారా లోకేష్ బాధ్యతవహిస్తూ రాజీనామా చేసేవరకు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిందంటే తప్పు జరిగినట్టే కదా అని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ ఆధారాలతో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక లోకేష్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మెగా డీఎస్సీలో అవినీతి, అక్రమాలు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అవినీతి, అక్రమాలు జరిగాయని విమర్శించారు. నకిలీ పత్రాలతో, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి మెరిట్ అభ్యర్థులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై విద్యార్థి, యువత రగిలిపోతోందని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టంచేశారు. మీ ఉద్యోగికి జాబ్ ఎందుకివ్వలేదు? మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ.. ‘డీఎస్సీలో మీ ఉద్యోగికి ర్యాంకు వచ్చినా జాబ్ ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోతే తప్పు చేసినట్టే కదా? అతడి నుంచి పేపర్ ఎవరికి లీక్ అయ్యిందో తేల్చాలి కదా? జీవోలు ఎందుకు మార్చారు? వీటన్నింటికి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. లోకేష్ సవాల్ను స్వీకరిస్తున్నామని, ప్లేస్, టైం చెప్పాలని సూచించారు. తప్పు చేశారు కాబట్టే విచారణకు ఒప్పుకోవడం లేదన్నారు. కూటమి ధర్మం పాటిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగ్గయ్య పేట, తిరువూరు నియోజకవర్గాల ఇన్చార్జులు తన్నీరు నాగేశ్వరరావు, నలగట్ల స్వామిదాసు, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లా డుతూ.. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు లోకేష్దే బాధ్యతని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజ, బెల్లం దుర్గ, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, షేక్ ఆసిఫ్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. నారా లోకేష్ అధికారంలోకి రాకముందు యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టి యువతలో ఆశలు కల్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. పద్ధతిగా మెగా డీఎస్సీ నిర్వహించామని లోకేష్ చెబుతున్నారు కానీ చాలా పద్ధతిగా అవినీతికి పాల్పడ్డారు. ఆయనకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదు. – కొరివి చైతన్య, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కూటమి నాయకులు ఎన్నికల ముందు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేవలం 16 వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి దానికే మెగా డీఎస్సీ అని పేరుపెట్టారు. దానిని కూడా దగా డీఎస్సీ చేసి కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం సాగిస్తాం. – కోమల సాయి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు డీఎస్సీలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో టెట్ అర్హత, డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా క్రీడా సంఘాల సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు అమ్ముకున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలి. లేని పక్షంలో నీట్పై జెన్ జీ చేపట్టిన ఉద్యమం తరహాలో ఉద్యమిస్తాం. – రవిచంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
ఉపకారంలో కోతలు .. విద్యార్థుల వెతలు
బీసీ విద్యార్థులకు మొండిచేయి చదువులపై ఆర్థిక భారం బీసీ విద్యార్థులకు : రూ.27.68 కోట్లు ముస్లిం మైనార్టీలకు : రూ.5.32 కోట్లు క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు : రూ.0.76 కోట్లు ఈబీసీ విద్యార్థులకు : రూ.4.47 కోట్లు కాపు విద్యార్థులకు : రూ.1.34 కోట్లు ఎస్టీ విద్యార్థులకు : రూ.0.77 కోట్లు -
బీఎస్సీ నర్సింగ్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్లో వీసీ డాక్టర్ పులాల చంద్రశేఖర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెలలో నిర్వహించిన బీఎస్సీ నర్సింగ్ పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడిన ఘటనలను తీవ్రంగా పరిగణించిన హెల్త్ యూనివర్సిటీ నర్సింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్స్తో వీసీ డాక్టర్ పులాల చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని వారు వివరించారు. నర్సింగ్ విద్యను బలోపేతం చేయడంలో భాగంగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సూచించిన పాఠ్య ప్రణాళికను సమర్థంగా అమలు చేయడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన క్లినికల్ శిక్షణను తప్పనిసరిగా అందించాలని ప్రిన్సిపాల్స్ను ఆదేశించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, వృత్తి బాధ్యత పెంపొందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించా లన్నారు. మాల్ప్రాక్టీస్ జరగకూడదు పరీక్షల్లో ఎలాంటి మాల్ప్రాక్టీస్కు పాల్పడకుండా చూడాలని ప్రిన్సిపాల్స్ను వీసీ డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్ ఆదేశించారు. రానున్న రోజుల్లో పరీక్షల్లో ఏ విధమైన అక్రమాలు, మాల్ప్రాక్టీస్ జరిగినా సంబంధిత విద్యార్థులతో పాటు ఆయా కళాశాలల పైనా కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మాల్ప్రాక్టీస్కు పాల్పడిన విద్యార్థులను పరీక్షల నుంచి డీబార్ చేయడంతో పాటు, సంబంధిత నర్సింగ్ కళాశాలలపై జరిమానాలు విధించే చర్యలు కూడా చేపడతామని వారు స్పష్టం చేశారు. నాణ్యమైన నర్సింగ్ విద్య, పారదర్శక పరీక్షల నిర్వహణ, విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాల పెంపుదలే విశ్వవిద్యాలయ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. -
12 నుంచి హెల్త్ వర్సిటీ కల్చరల్ మీట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యతో పాటు సృజనాత్మకత, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తొలిసారిగా ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ మీట్ నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. కల్చరల్ మీట్ పోస్టర్ను యూనివర్సిటీలో మంగళవారం ఆవిష్కరించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కల్చరల్ మీట్ను ఆగస్టు 12 నుంచి 14 వరకూ మంగళగిరిలోని ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీ అనుబంధ వైద్య, దంత వైద్య కళాశాలల విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్, యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధ, ఎన్ఆర్ఐ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన మాతాశిశు మరణాలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాత ప్రభుత్వాస్పత్రిలోని సెమినార్ హాలులో జరిగిన ఈ సమీక్షలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.శ్రావణ్బాబు, జీజీహెచ్ పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పి.అనీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి.కొండూరు, ఎ.కొండూరు, చంద్రాల, ఉట్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు, సింగ్నగర్ యూపీహెచ్సీలో జరిగిన నవజాత శిశు మరణాలపై చర్చించారు. జీజీహెచ్ పిడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ బి.సునీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.సౌజన్య, డాక్టర్ మొబిన్ అహ్మద్, సీహెచ్ గంగాదేవి, ఎం.సబిత తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): తమకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం మరోసారి ఆందోళనకు దిగారు. రెండు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి క్యాజువాలిటీ బ్లాక్ ఎదుట బైఠాయించారు. జీతాలు ఇచ్చేంత వరకూ పని బంద్ చేసి ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేశారు. పలువురు కార్మకులు మాట్లాడుతూ.. ఇంటి అద్దెలు, పిల్లలకు ఫీజులకు అప్పులు చేసి, వడ్డీలు సైతం కట్టలేని స్థితిలో ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కాంట్రాక్టర్ వచ్చిన తొమ్మిది నెలల్లో ఏ ఒక్క నెలలోనూ కచ్చితంగా జీతాలు వేసిన దాఖలా లేదన్నారు. ఆరు నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించడం లేదన్నారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ పలు దఫాలుగా చర్చలు జరిపినా కాంట్రాక్టు సంస్థ స్పందించలేదన్నారు. సీఐటీయూ తూర్పు కృష్ణ కార్యదర్శి పి.కృష్ణ, నగర కమిటీ సభ్యుడు కోటబాబు, యూనియన్ నాయకులు తిరపతమ్మ, భాస్కరమ్మ, అఖిత, పద్మ పాల్గొన్నారు. -
బెల్టు బేరం.. రాబడి అధనం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సుస్తీచేసి ఏదైనా ప్రభుత్వాస్పత్రికి వెళ్తే మందుబిళ్లలు దొరుకుతాయో లేదో కానీ పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా వీధివీధిలో మద్యం పుష్కలంగా లభిస్తోంది. ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తున్నా మని బహిరంగంగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరైనా బెల్ట్షాపులు ఏర్పాటు చేస్తే తాను బెల్ట్ తీయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అయితే తెలుగు తమ్ముళ్లు ఆ హెచ్చరికలను లెక్కలోకి తీసుకోలేదు. ఏకంగా బెల్టుషాపులకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. హెచ్చు పాట పాడిన వారికే అవకాశం ఇచ్చి రూ.లక్షలు వెనకేసుకున్నారు. క్వార్టర్ బాటిల్పై రూ.20 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. వీధివీధినా బెల్ట్ షాపులు ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గ్రామానికో మద్యం దుకాణం, వీధి వీధినా బెల్టుషాపులు ఏర్పాటయ్యాయి. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా పట్టణాలు, గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం లభిస్తుండటంతో చాలా మంది మద్యానికి బానిసలవుతున్నారు. వచ్చే ఆదాయం మొత్తాన్ని మద్యా నికి తగలేస్తూ కుటుంబాలను విస్మరిస్తున్నారు. బెల్ట్షాపులు తొలగించండి అని మహిళలు రోడ్డెక్కి వేడుకుంటున్నా అధికారులకు, పాలకులకు చెవికెక్కడం లేదు. యువత మద్యం, డ్రగ్స్కు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్న ఈగల్, పోలీసు అధికారులు వీధికో బెల్టుషాపు ఉంటే అది ఎలా సాధ్యం అన్న విషయాన్ని పట్టించుకోవడంలేదు. బెల్టు షాపులపై చర్యలేవి? కృష్ణా జిల్లాలో 118 మద్యం దుకాణాలు, 43 బార్లు, ఎన్టీఆర్ జిల్లాలో 118 మద్యం దుకా ణాలు, 140 బార్లు ఉన్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే 100కి పైగా బార్లు ఉన్నాయి. బెల్టుషాపులు వేల సంఖ్యలో ఉన్నాయి. మైలవరం నియోజకవర్గంలో 17 మద్యం దుకాణాలు, 9 బార్లు, బెల్టు షాపులు 280కు పైగానే ఉన్నాయి. పెడన నియోజకవర్గంలో 13 మద్యం దుకాణాలతో పాటు ఒక బార్ ఉంది. టీడీపీ నేతల ఆధ్వర్యంలో 300లకు పైగానే బెల్టుషాపులు ఏర్పాటయ్యాయి. గన్నవరం నియోజకవర్గంలో 29 మద్యం దుకాణాలు ఉండగా, ప్రతి గ్రామంలో టీడీపీ గ్రామ పార్టీ కమిటీల ఆమోదం మేరకు ఆ పార్టీ కార్యకర్తలు 450 వరకు బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో 15 మద్యం షాపులు ఉండగా బెల్టు షాపులు ఏకంగా 600 వరకు ఏర్పాటయ్యాయి. ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పలుమార్లు బెల్టుషాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసినా పరిస్థితిలో మార్పు లేదు. నందిగామ నియోజకవర్గంలో ఏకంగా 250 బెల్ట్షాపులు ఉన్నాయి. గుడివాడ నియోజకవర్గంలో 20 వైన్షాపులు ఉన్నాయి. అనధికారికంగా నందివాడ మండలం జనార్దనపురం (జొన్నపాడు)లో మద్యందుకాణం నిర్వహిస్తున్నారు. 300 పైగా బెల్ట్షాపులు ఉన్నాయి. పామర్రు నియోజకవర్గంలో 17 మద్యం దుకా ణాలు, 250కి పైగా బెల్టుషాపులు ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గంలో 24 మద్యం దుకాణాలు, 130 వరకు బెల్టుషాపుల వరకు ఉన్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో 21 మద్యం దుకాణాలు, రెండు బార్లు, 224 మేర బెల్టుషాపులు నడుస్తున్నాయి. చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామంలో మూడు వేల మంది జనాభాకు 12 బెల్టు షాపులు ఉన్నాయి. గత నెల జూన్ 24న మంత్రి లోకేశ్ అవనిగడ్డలో పర్యటించగా పులిగడ్డ పల్లెపా లెంలో మహిళలు బెల్టుషాపులపై నిలదీశారు. అయినా ఆ గ్రామంలో బెల్టుషాపులు కొనసాగుతూనే ఉన్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 18 మద్యం దుకాణాలు 300కి పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. బెల్ట్ షాపు నిర్వాహకుల నుంచి ఎకై ్సజ్ శాఖ అధికారులకు నెలనెలా మామూళ్లు అందుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జంట హత్యలు ‘వీఆర్ బాయ్స్’ పనే!
టాస్క్ఫోర్స్: కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం జంటహత్యల కేసులో నమ్మశక్యం కాని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక సామాజిక వర్గానికి తలనొప్పిగా మారడమే కాకుండా భవిష్యత్తులో వారి జీవనాధారమైన చేపలవేటలోనూ తీవ్ర పోటీదారులవుతారని భావించి శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పలను అదే సామాజిక వర్గానికి చెందిన వారు సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు నిర్ధారణైంది. సుపారీ గ్యాంగ్గా ‘వీఆర్ బాయ్స్’.. జూన్ 27 రాత్రి చినగొల్లపాలెం ఎస్టీ కాలనీకి చెందిన శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పలను దారుణంగా హత్య చేశారు. ఎవరు చేశారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా ఉండే శంకరపు శ్రీను, హత్యకు గురైన సుబ్బన్న, అయ్యపలతో చేపల వేట వద్ద హత్యకు ముందు ఘర్షణ జరిగింది. శ్రీను అదే గ్రామానికి చెందిన జల్లా నాగరాజుతో కలిసి గుడివాడకు చెందిన వీఆర్ బాయ్స్ అని పిలిచే నలుగురు స్నేహితుల ద్వారా సుబ్బన్న, అయ్యప్పలను హత్య చేశారు. వీరి మృతదేహాలను వారి బైక్కే కట్టి నీటిలో వదిలేశారు. లావాదేవీలపై నిఘా.. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు వీఆర్ బాయ్స్ సుపారీ లావాదేవీలతో ఫోన్ల ద్వారా జరిగిన సంభాషణలు ద్వారా హత్య చేసిన వారిని పోలీసులు గుర్తించినట్లుగా విశ్వసనీయ సమాచారం. చినగొల్లపాలెంకు చెందిన ఏ1 శంకరపు శ్రీను, ఏ2 జల్లా నాగరాజులున్నారు. వీరు కాకుండా సుపారి గ్యాంగ్ అయినటు వంటి వీఆర్బాయ్స్గా పిలువబడే ముగ్గురు యలవర్తిపాడుకు చెందిన డొక్కుమాల శ్రీకాంత్, పెదఎరుకపాడుకు చెందిన కటికల కల్యాణ్, గుడివాడ కార్మికనగర్కు చెందిన అబ్దుల్ఖాదర్ జిలానీలతో పాటు మరొక వ్యక్తి అబ్బూరి విజయరత్నం (దాస్)లను అరెస్ట్ చేశారు. గుడివాడ నుంచి వచ్చిన నిందితులు వీఆర్ బాయ్స్.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అనుచరులు కాగా వారిలో డొక్కుమాల శ్రీకాంత్పై ఇప్పటికే రౌడీ షీట్ ఉంది. మృతదేహాలను వెలికి తీసే సమయంలో వీఆర్ బాయ్స్ కూడా అక్కడే ఉన్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో సుపారీ జరిగిందంటే.. దీనిలో అధికార పార్టీలోని కీలక నాయకుల ప్రమేయం తప్పకుండా ఉంటుందనే అనుమానాలకు తావిస్తోంది. కేసు ఛేదన సమయంలో ఒకానొక సందర్భంలో కృత్తివెన్ను పోలీసులను గుడివాడ ఎమ్మెల్యే బెదరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు గుడివాడ నియోజకవర్గంలో వీఆర్ బాయ్స్ చేసిన ఆగడాలు, ఆకృత్యాలు అనేకం ఉన్నాయనే విషయాలపై అక్కడి అధికార పార్టీకి చెందినవారు, ముఖ్యనాయకులు చర్చించుకోవడం గమనార్హం. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 20267మంత్రి నారా లోకేష్ కంకిపాడు మండల పర్యటన ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తెచ్చిపెట్టింది. గంటల తరబడి ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది.గంపలగూడెం: నెమలిలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకుడు టి. గోపాలచార్యులు ఆధ్వర్యంలో వరుణజపం, వరుణయాగం నిర్వహించారు. చిలకలపూడి(మచలీపట్నం): భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను సోమవారం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. -
31న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ
రాజకీయ పార్టీల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో కీలక దశ అయిన ఇంటింటి సర్వే ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో రాజకీయ పార్టీలు అందించిన సహకారం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. ఇదే భాగస్వామ్య స్ఫూర్తిని క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం ప్రక్రియలోనూ కొనసాగించాలని ఆయన కోరారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో కలెక్టర్ లక్ష్మీశ.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 17,13,445 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా 15,89,731 ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు. 55,813 డెత్ కేసులతో సహా శాశ్వతంగా వలస వెళ్లడం వంటి కారణాల వల్ల 1,23,714 ఫారాల సేకరణ వీలుపడలేదన్నారు. ఈ ప్రక్రియపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ.. ఈ నెల 31న ముసాయిదా జాబితాను ప్రచురిస్తామని.. ఇది పోలింగ్ కేంద్రాలు, బీఎల్వోల వద్ద అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ ముసాయిదా జాబితాలో పేర్లను సరిచూసుకోవచ్చని.. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30వ తేదీ వరకు ఆధారాలతో ఈఆర్వో లేదా ఏఈఆర్వోలకు దరఖాస్తు ద్వారా సమర్పించాలన్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు నోటీసుల దశతో పాటు క్లెయిములు, అభ్యంతరాలను పరిష్కరిస్తామన్నారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దిన తర్వాతే అక్టోబర్ 3న తుది జాబితాను ప్రచురించనున్నట్లు వివరించారు. కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తులు.. కొత్తగా ఓటు నమోదుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. వివరాల్లో సవరణ కోసం లేదా ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి పేరును బదిలీ చేసుకునేందుకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో డెర్మటాలజీ పీజీల ప్రతిభ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల డెర్మటాలజీ విభాగం పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ నెల 24 నుంచి 26 వరకూ పుదుచ్చేరిలో జరిగిన చిన్నపిల్లల చర్మవ్యాధులపై జాతీయ స్థాయి సమావేశంలో ఆ కళాశాల పీజీలు డాక్టర్ నేహా, అపర్ణ, ప్రజీత్ సమర్పించిన పరిశోధనా పత్రాలు ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచాయి. విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచిన డెర్మటాలజీ హెచ్ఓడీ డాక్టర్ వాణితో పాటు, పీజీ విద్యార్థులను సోమవారం ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ అభినందనలు తెలిపారు. కంకిపాడు: విద్యార్థుల సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మండలంలోని పునాదిపాడు జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాల పనితీరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పదో తరగతి ఫలితాలపై సమీక్ష చేసి సూచనలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ఫార్మాటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, ఉపాధ్యాయుల శ్రమకు తగిన ఫలితాలు కనిపించటం లేదన్నారు. కారణాలు గుర్తించి సరిదిద్దే ప్రయత్నాలు చేపట్టాలన్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి చేసి నాణ్యత తనిఖీ చేశారు. విద్యాశాఖ ఆర్జేడీ జి.నాగమణి, డీఈఓ యూవీ సుబ్బారావు, హెచ్ఎం ఏ.వెంకటేశ్వరరావు, డీవైఈఓ పద్మారాణి తదితరులు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్)లోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో 41మంది చేరినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రలేఖ తెలిపారు. అలాగే ఏజే కాలేజ్ మచిలీపట్నంలో ఏడుగురు కలిపి మొత్తం మీద సోమవారానికి 48మంది అడ్మిషన్లు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలించామన్నారు. లెక్చరర్లు డాక్టర్ పి.వినయకుమార్, ప్రకాశం, రాజ్యలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్స్ శ్రీనివాస్, దివ్యశ్రీ, ఆఫీస్ సిబ్బంది శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): శైవ క్షేత్ర పీఠాధిపతులు శివస్వామి దివ్య ఆశీస్సులతో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్, శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోని కళాకారులను ప్రోత్సహించేందుకు కళా ఉత్సవ్ పేరిట రాష్ట్ర స్థాయి నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు తెలిపారు. ఈ పోటీలు ఆగస్టు 6, 7, 9 తేదీల్లో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతాయన్నారు. సోమ వారం విజయవాడ ప్రెస్క్లబ్లో పోటీలకు సంబంఽధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజులు పాటు జరిగే పోటీలకు సుమారుగా 250 మంది కళాకారులు హాజరై తమ ప్రతిభను చాటుకుంటారన్నారు. పోటీల చివరి రోజైన 9వ తేదీన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ స్టేట్ కల్చరల్ కోఆర్డినేటర్ నారాయణ, స్టేట్ కోఆర్డినేటర్ సందిరెడ్డి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) ద్వారా అందే అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను నిర్ధేశిత గడువులోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న వినతులను వెంటనే పరిశీలించి పరిష్కరించిన అనంతరం ఆన్లైన్లో డిస్పోజ్ చేయాలని స్పష్టం చేశారు. అధికారులు పీజీఆర్ఎస్ పోర్టల్ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పెండింగ్లో ఉన్న వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎరువులు అందుబాటులో ఉంచండి.. రైతులకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాల వారీగా నియమితులైన స్పెషల్ అధికారులు ఆయా మండలాలను సందర్శించి ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించాలంటే సంబంధిత అధికారులందరికీ పెట్టుబడుల ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారిని, స్టార్టప్ వ్యవస్థాపకులను ప్రోత్సహించాలని, వారిని జీఎం–డీఐసీ లేదా సంబంధిత ఇన్వెస్ట్మెంట్ డెస్క్ అధికారులతో అనుసంధానించాలని ఆదేశించారు. అర్జీల వివరాలు.. పీజీఆర్ఎస్ ద్వారా 187 అర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంఽధించి 51, మునిసిపాలిటీలకు సంబంధించి 32, ఇతర శాఖలకు సంబంధించి మిగిలిన అర్జీలు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహ, పీజీఆర్ఎస్ జిల్లా నోడల్ అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ఏం కష్టమొచ్చిందో!
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): చూడ ముచ్చటైన జంట.. అనురాగం.. ప్రేమ, ఆప్యాయతలతో సంతోషంగా సాగుతున్న సంసారం.. ఏడేళ్ల ఆ బంధానికి ఇద్దరు మగపిల్లల సంతానం.. అంతా బాగుందని అనుకున్న ఆ చిన్న కుటుంబంలో ఒక్కసారిగా పెను విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో.. ఏమో కానీ భార్యాభర్తలిద్దరూ విషం తాగి మృత్యువు ఒడికి చేరిపోయారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దేవీనగర్లో చోటుచేసుకున్న ఈ ఘటన సోమవారం కలకలం సృష్టించింది. ఏం జరిగిందంటే.. దేవీనగర్ ప్రాంతానికి చెందిన తాడిశెట్టి బాజీ సైదులు(30), జలసూత్రం మానస(27)కు పెద్దల సమక్షంలో 2019లో వివాహమైంది. వీరికి సంజయ్(5), సంతోష్ (ఏడాదిన్నర) కుమారులు ఉన్నారు. సైదులు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ విభాగంలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మానస ఇంటి వద్దే ఉంటూ టెట్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఆదివారం ఉదయం సైదులు తన పిల్లలిద్దరినీ ఇందిరా నాయక్నగర్లోని తన సోదరుడు నాగుల్మీరా వద్ద దింపి పనులకు వెళ్లగా మానస వారి ఇంటి సమీపంలోని చర్చికి ఉదయం పది గంటలకు వెళ్లి మధ్యాహ్నం రెండు గంటల తిరిగి ఇంటికి వచ్చింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో సైదులు తన మావయ్య వీరభద్రరావుకు ఫోను చేసి దంపతులిద్దరం విషం తాగేశామని.. ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పాడు. దీంతో అతను తన వియ్యంకుడు ఏడుకొండలు, సైదులు సోదరుడు నాగుల్మీరాకు ఫోను చేసి హూటాహూటిన వారి ఇంటికి వెళ్లి తలుపులు పగలకొట్టి అపస్మారక స్థితిలో పడి ఉన్న భార్యాభర్తలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న భార్యాభర్తలిద్దరూ పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందారు. దీంతో వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆన్లైన్లో ఆర్డరు పెట్టుకొని.. సైదులు, మానస ఎంతో అన్యోన్యంగా ఉంటారని, వారికి ఆర్థిక సమస్యలు కూడా ఏమీ లేవని వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలతో మాటామాటా పెరిగి క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆన్లైన్లో గడ్డిమందు, కూల్డ్రింక్ను ఆర్డర్ పెట్టుకొని డ్రింక్లో దానిని కలుపుకొని ఇద్దరూ తాగినట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని అజిత్సింగ్నగర్ సీఐ దాడి చంద్ర శేఖర్ తెలిపారు. -
శాకంబరీ..
ప్రణామమమ్మా అంటూ భక్తితో కొలిచిన భక్తజనం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారిని ఆకుకూరలు, కాయగూరలు, డ్రైఫ్రూట్స్తో అలంకరిస్తారు. తొలి రోజున అమ్మవారి ప్రధాన మూలవిరాట్తో పాటు మహా మండపం ఆరో అంతస్తు, ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాల్లోని పరివార దేవతలకు ఆకుకూరలు, కాయగూరలతో అలంకరించారు. ఆలయ పరిసరాలను అలంకరించేందుకు సుమారు 20 టన్నుల కూరగాయలను వినియోగించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. పూజా సామగ్రిగా కూరగాయల దండలు.. శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు పూజా సామగ్రికి బదులుగా ఆకుకూరలు, కాయగూరలతో తయారు చేసిన దండలను అమ్మవారికి సమర్పించడం కనిపించింది. సారె, పూజా సామగ్రితో పాటు ఆకుకూరలు, కాయగూరలను మూల విరాట్తో పాటు ఉత్సవ మూర్తికి సమర్పించారు. ఆకట్టుకున్న కూరగాయల ప్రతిమలు.. రాజగోపురం ఎదుట కూరగాయలతో చేసిన ఆకృతులు, ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజగోపురం ఎదుట చిన్న అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద కరివేపాకుతో భారీ చెట్లను తీర్చిదిద్దారు. ఇక ట్రస్ట్బోర్డు సభ్యుల చాంబర్ ఎదుట, చైర్మన్ చాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రతిమలు అలరించాయి. ఆయా ప్రతిమల వద్ద భక్తులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ కనిపించారు. పలు జిల్లాల నుంచి వితరణగా.. పలు జిల్లాల నుంచి ఆకుకూరలు, కాయగూరలను రైతులు, హోల్సేల్ వ్యాపారులు అమ్మవారికి సమర్పించారు. విజయవాడ నున్నలోని శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మార్కెట్, కేదారేశ్వరపేట హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్, గుంటూరు ఆకుకూరల మార్కెట్, నారా కోడూరులోని కూర గాయల వ్యాపారులు, యడ్లవల్లి రైతులు, సంగం జాగర్లమూడి రైతులు, వట్టిగుడిపాడు, కొత్తపేట, ఏలూరు, తణుకు, సిద్ధాంతం, మడికి, నూజివీడు, చిన్న ఓగిరాల, పెద్ద ఓగిరాలకు చెందిన రైతులు కూరగాయలను అందజేశారు. కొంత వరకే అలంకరణలు.. శాకంబరీ ఉత్సవాలతో రాజగోపురం, ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున కూరగాయల దండలను అలంకరించారు. అయితే భక్తులు ఎక్కువగా కొండపైకి నడుచుకుంటూ వచ్చే ఘాట్రోడ్డు మార్గంలోని లక్ష్మీగణపతి ప్రాంగణం, చిన్న గాలిగోపురం, నటరాజస్వామి వారి ఆలయం, నాగేంద్ర పుట్ట పరిసరాల్లో కూరగాయల దండలు కనిపించలేదు. మరో వైపున ఆయా పరిసరాల్లో ప్లాస్టిక్ డబ్బాలు, అరుగుపై సిద్ధం చేసిన కూరగాయల దండలను వదిలేయడంతో భక్తులు వాటిని తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఆషాఢ మాసం నేపథ్యంలో సారె సంబరం కొనసాగుతోంది. సోమవారం 27కు పైగా భక్త బృందాలు, సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నూతన పూజా మండపం వద్ద భక్తులకు కదంబ ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ఈవో శీనానాయక్, ఆలయ ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్ కదంబ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం నూతన పూజా మండపం వద్దకు చేరుకున్న భక్తులు కదంబ ప్రసాదాన్ని స్వీకరించారు. కుటుంబ సభ్యులతో పిల్లాపాపలతో కలిసి కదంబ ప్రసాదాన్ని స్వీకరించడం కనిపించింది. -
కృష్ణానదిలో దూకి యువకుడు ఆత్మహత్య
వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణానదిలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే యనమలకుదురుకు చెందిన కోనేరు నాగార్జున (35) కొద్ది రోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో బయటకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వచ్చాడు. అనంతరం ప్రకాశం బ్యారేజీకి చేరుకుని కృష్ణానదిలోకి దూకాడు. బ్యారేజీపై స్థానికులిచ్చిన సమాచారంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కృష్ణానదిలోకి వెళ్లి నాగార్జునను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు గుర్తించారు. మృతునికి వివాహం కాలేదని తెలిసింది. విషయం తెలుసుకున్న సీఐ గుణరాము అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ పీజీఆర్ఎస్లో 84 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 84 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. వారి వినతుల్లోని సమస్యలు తెలుసుకుని, ఆయా స్టేషన్ల ఎస్హెచ్ఓలతో పాటు, సత్వరమే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భూ, ఆస్తి తగాదాలకు సంబంధించి 39, భార్యభర్తలు, కుటుంబ కలహాలపై 5, వివిధ మోసాలపై 3, మహిళా సంబంధిత నేరాలపై 7, కొట్లాటలపై 2, దొంగతనాలపై 4, ఇతర వివిధ సమస్యలపై 24 ఫిర్యాదులు అందాయి. చోరీకి వచ్చిప్రమాదవశాత్తు మృతి రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్ కోచింగ్ డిపోలోని ఐఓహెచ్ షెడ్డులో రైల్వే సొత్తు చోరీ చేసేందుకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి షెడ్డుపై నుంచి జారిపడి మృతి చెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది షెడ్డులో గుర్తు తెలియని వ్యక్తి రక్తపు గాయాలతో బోర్లాపడి మృతిచెంది ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుని వయస్సు సుమారు 40–45 సంవత్సరాల మధ్య ఉంటుందని, వంటిపై నీలం, తెలుపు బనియన్, పచ్చరంగు షార్ట్ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతుడు కోచింగ్ డిపోలో చోరీ చేసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు షెడ్డు పైనుంచి జారిపడి మృతిచెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు. -
సీజేపీకి మద్దతుగా ఎంపీ చిన్ని కుమార్తె పోస్టులు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని)కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)ఇటీవల నిర్వహించిన ఉద్యమంలో పాల్గొనటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం తీవ్ర దుమారానికి దారి తీసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో ఎంపీ కుమార్తె స్నిగ్ధ పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘటైన విమర్శలు చేశారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తీవ్ర చర్చకు దారితీయడంతో ఆమె ఆ పోస్టులు తొలగించింది. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. కూటమి మద్దతుతోనే 2024 ఎన్నికల్లో చిన్ని ఎంపీగా విజయం సాధించారు. తండ్రి ఎంపీగా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుమార్తె పోస్టులు పెట్టడం, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు మద్దతుగా ప్లకార్డుల ప్రదర్శించటం టీడీపీ శ్రేణులందరినీ విస్మయానికి గురి చేసింది. ‘‘కేంద్ర మంత్రికి రాజీనామా లేఖ డ్రాఫ్ట్ చేయాలా...’ అంటూ సైటెర్తో ఫ్ల కార్డులు ప్రదర్శించటం బీజేపీ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
కూటమి పాలనలో నగరాభివృద్ధి శూన్యం
జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల కేటాయింపుల్లో భారీ అక్రమాలు.. టీడీపీ కార్యకర్తల్లా తయారైన టౌన్ప్లానింగ్ అధికారులు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టౌన్ప్లానింగ్ అధికారులు టీడీపీ కార్యకర్తల్లా తయారయ్యారని, ఎంపీ, ఎమ్మెల్యేలతో కుమ్మక్కయి లక్షలకు లక్షలు దోచుకుంటున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో పార్క్లను అభివృద్ధి చేస్తే ఇప్పుడు అవి మందుబాబుల అడ్డాగా మారిపోయాయన్నారు. వర్షం కురిస్తే తూర్పు నియోజకవర్గంలో నీరు నిలిచిపోతుందని, చనిపోయినవారిని కూడా నీళ్లల్లో పెట్టుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామని అన్నారు. ఉత్సవ విగ్రహాల్లా టౌన్ ప్లానింగ్ అధికారులు -
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజాభివృద్ధికి వినియోగించాలి
గన్నవరం: ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు నైతిక విలువలను పెంపొందించుకోవడం ద్వారా సమాజానికి సేవ చేసే ఉత్తమ పౌరులుగా ఎదగాలని కృష్ణా విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ రామ్జీ కూన పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులోని ఉషారామా ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నాల్గవ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్జీ చేతుల మీదుగా పట్టభద్రులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తాము నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజాభివృద్ధికి వినియోగించాలని కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, వైస్ చైర్మన్ లంక అరుణ్ పిలుపునిచ్చారు. తమ కళాశాల విద్యా ప్రమాణాలు, పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చుతుందని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీకేఎస్వీ ప్రసాద్ అధ్యక్షతన పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
సాగునీరు రాదని ముందే చెప్పాలి కదా..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గన్నవరం రూరల్: సాగునీరు రాదంటే రైతులు ఎలా బతుకుతారని, ఖరీఫ్ సాగు చేపట్టిన తర్వాత నీరివ్వనంటే ఎలాగని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రశ్నించారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని తెంపల్లె, వీరపనేనిగూడెం, కొత్తగూడెం గ్రామాల్లో ఆయన సోమవారం పోలవరం కెనాల్ సందర్శించి సాగు భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం కాలువ నీటిని నమ్ముకుని పదేళ్లుగా రైతులు వ్యవసాయం చేస్తున్నారని, ఈ సంవత్సరం మోటార్లు తొలగించటంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. కాలువ తవ్వకం సమయంలో కొందరు రైతులు కోర్టు కేసులు వేస్తే వారితో మాట్లాడి భూములు ఇప్పించామని గుర్తుచేశారు. రైతులు మొదట్లో ఒప్పుకోలేదని, ఒక ఎకరం పోయినా మిగిలినది బాగా పండుతుందని వారిని తాము ఒప్పించామని వివరించారు. ఈ ప్రాంతంలో డ్రాపులు పూర్తికాకపోవటంతో సాగునీటి కోసం రైతులు మోటార్లు ఏర్పాటు చేయగా అప్పట్లోనే ఇరిగేషన్, విద్యుత్ అధికారులు వ్యతిరేకించారన్నారు. అప్పటి సీఎం చంద్రబాబును కలసి సమస్య విన్నవించగా రైతులకు నీరు ఇచ్చారన్నారు. ఎవరైతే పోలవరం కాలువకు భూములిచ్చారో వారికి తప్పకుండా నీరు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. డెల్టా స్థిరీకరణ కోసం ఆలోచన చేసి పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వంశీ చెప్పారు. ప్రస్తుతం సాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడుగుతానన్నారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని, గతంలో మాదిరిగా రైతుల ప్రయోజనాల కోసం మోటార్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. వైఎస్సార్ సీపీ రైతు నాయకుడు కందిమళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంత సాగు, తాగు అవసరాల కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీపీ అనగాని రవి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ సభ్యురాలు ఎలిజబెత్ రాణి, నాయకులు పడమట సురేష్, కొలుసు శిరీష, గిరీష్రాజ్, బండి నాగసాంబిరెడ్డి, తూంపాటి రాంబాబు, షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు. -
సారొచ్చారు...ప్రజలకు కష్టాలు తెచ్చారు..!
కంకిపాడు: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తెచ్చిపెట్టింది. గంటల తరబడి వాహనాలు కదలక మండు టెండలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టీడీపీ, కూటమి శ్రేణులు అత్యుత్సాహంతో రోడ్లపై హడావుడి చేయటంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పోలీసు అధికారులు విఫలం చెందటంతో ప్రజలు ట్రాఫిక్ కష్టాలు చవిచూశారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో సోమవారం మంత్రి లోకేష్ పర్యటన ప్రజలకు శాపంగా పరిణమించింది. లోకేష్ పర్యటన సందర్భంగా ఈడుపుగల్లు ప్రధాన కూడలి నుంచి పునాదిపాడు వరకూ టీడీపీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. చిన్నబాబు మెప్పు కోసం టీడీపీ నేతలు పడరాని పాట్లు పడ్డారు. ఒక్కొక్కరికి రూ.500 నుంచి రూ.1000 చొప్పున కూలి ఇచ్చి గ్రామాల నుంచి మహిళలు, పురుషులను ఆటోల్లో తరలించి బల నిరూపణ చేసుకునేందుకు తాపత్రయ పడ్డారు. దీనికి తోడు తల్లికి వందనం వర్తింప చేసినందుకు అంగన్వాడీ కార్యకర్తలు విద్యా శాఖ మంత్రికి ధన్యవాదాలు చెప్పాలని రోడ్లపైకి తీసుకొచ్చారు. ఒక్కో డ్వాక్రా వీఓఏ 30 నుంచి 50 మందిని తరలించా లంటూ ముందుగానే ఆ గ్రామాల నేతలతో హుకుంలు జారీ చేశారు. చేసేది లేక బుక్ కీపర్లు డ్వాక్రా సంఘాల సభ్యులను లోకేష్ ర్యాలీకి తీసుకెళ్లారు. తరలివచ్చిన ప్రజలను చూసుకుని టీడీపీ, మిత్ర కూటమి పక్షాలు రెచ్చిపోయాయి. జాతీయ రహదారిలో బైక్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొడుతూ నడిరోడ్డుపై ఫీట్లు చేశారు. బేతాళ నృత్యాలు, బైక్ స్టంట్లు, రోడ్డుపై అడ్డగోలు పార్కింగ్లతో ఓ వైపు రోడ్డు మార్గం పూర్తిగా మూసుకుపోయింది. దీంతో మరో వైపు ఎదురెదురుగా వాహనాలను మళ్లించటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. గంటల తరబడి వాహనాలు కదలక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవటం వల్లే ఈ సమస్య ఏర్పడిందని, అధికార పక్ష శ్రేణుల హడావుడిని నియంత్రించటంలో వైఫల్యం కనిపించిందంటూ పలువురు విమర్శిస్తున్నారు. హైస్కూల్ ప్లస్ భవనం ప్రారంభం పునాదిపాడు జెడ్పీ పాఠశాల ప్రాంగణంలో దాత పోలవరపు మాధవరావు, ఇతర కుటుంబ సభ్యులు రూ.1.20 కోట్లతో నిర్మించిన హైస్కూల్ ప్లస్ భవనాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు. లేబొరేటరీని సందర్శించి, వసతులను పరిశీలించారు. దాత, కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. అభ్యసన సామర్థ్యాల్లో విద్యార్థులు వెనుకబడి ఉండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, కామినేని శ్రీనివాస్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, శాసనమండలి చీఫ్ విప్ అనూరాధ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అయానా ఫంక్షన్ హాలులో నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. యువరాజును ప్రసన్నం చేసుకునేందుకు సామంతరాజులు, సేనాపతులు ఎవరికి వారు పోటీలు పడ్డారు. కూలి డబ్బులు ఇచ్చి కొందరిని తరలించారు. తల్లికి వందనం ఇచ్చినందుకు మంత్రికి కృతజ్ఞతలు చెప్పాలంటూ అంగన్వాడీలను రప్పించారు. బుక్కీపర్లతో ఒత్తిడి చేయించి డ్వాక్రా మహిళలను తీసుకు వచ్చారు. మొత్తానికి టీడీపీ నేతలు పడరాని పాట్లు పడి పెద్ద ఎత్తున జనాలను పోగు చేశారు. అయితే అధికార పక్ష నేతల హడావుడిని నియంత్రించడంలో పోలీసులు వైఫల్యం చెందారు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విద్యావ్యవస్థలో మార్పులు తేవాలి
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026● ధూమ్ ధామ్ జాతర● వేడుకగా సాగిన ఊరేగింపు ● కొనసాగిన ఆషాఢ సారె సంబరాలు ● ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల తాకిడి ● అన్ని దర్శన టికెట్ల విక్రయాలు రద్దు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ తరఫున హైదరాబాద్లోని భాగ్యనగర్ శ్రీమహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం బంగారు, వెండి బోనాలను సమర్పించింది. ఈ ఏడాది నెలకొన్న వర్షాబావ పరిస్థితులు తొలగిపోయి, వర్షాలు పుష్కలంగా కురవాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనం సమర్పించినట్లు జోగిని అవికా పేర్కొన్నారు. 17 ఏళ్లగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఉమ్మడి దేవాలయాల కమిటీ పేర్కొంది. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలోని రావిచెట్టు వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద తెలంగాణ బంగారు బోనంకు కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 5 వందల మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ఇంద్రకీలాద్రికి వైపు సాగారు. జోగిని అవికా బంగారు బోనంను తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా వెండి తదితర బోనాలతో మిగిలిన వారు ముందుకు సాగారు. బంగారు బోనంను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బ్రాహ్మణ వీధి, రథం సెంటర్, ఇంద్రకీలాద్రి పరిసరాలను తరలివచ్చారు. దుర్గాఘాట్కు చేరుకున్న ఊరేగింపు కృష్ణమ్మకు గంగ తెప్ప, పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. దుర్గాఘాట్, ఘాట్రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణానికి సుమారు 700 మంది కళాకారులు, కమిటీ ప్రతినిధులు చేరుకోవడంతో ఘాట్రోడ్డుపై పండుగ వాతావరణం కనిపించింది. ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వద్ద బంగారు బోనంకు ఆలయ ఈవో,చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు స్వాగతం పలికారు. కమిటీ ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం బంగారు, వెండి బోనంతో పాటు పూజా సామగ్రి, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను ఆలయ ఈవో, ఆలయ అర్చకులకు అందజేశారు. అమ్మవారి దయతో ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బుల్లెట్ శ్రీధర్, మాజీ అధ్యక్షులు పేర్కొన్నారు. ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించాయి. అమ్మవారి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆలయ ప్రాంగణం రద్దీగా కనిపించింది. ఉదయం 8 గంటల కల్లా ఆలయ పరిసరాలతో పాటు మహామండపం, ఘాట్రోడ్డులో భక్తుల రద్దీ కనిపించడంతో దర్శనానికై విక్రయించే అన్ని టికెట్ల విక్రయాలను అధికారులు రద్దు చేశారు. బంగారు వాకిలి, రూ. 300, రూ. 100టికెట్ క్యూలైన్లలో భక్తులను ఉచితంగా దర్శనానికి అనుమతించగా, సర్వ దర్శనం రెండు లైన్ల ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు 70వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. బేతాళ నృత్యం చేస్తున్న కళాకారుడువిస్తరిస్తోంది.. విస్మరించొద్దు! బెజవాడ జెన్ జీ యూత్ ఆధ్వర్యాన ధర్నాచౌక్లో వినూత్న నిరసన దుర్గమ్మను ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, తెలంగాణ స్పీకర్ జి. ప్రసాద్కుమార్, ఏపీ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మాజీ ఎంపీ, సినీనటుడు మురళీమోహన్, తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో, చైర్మన్లు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. -
ఎన్టీఆర్ జిల్లాలో రెండు కోవిడ్ యాక్టివ్ కేసులు
● తొలుత నమోదైన బాలికకు నెగిటివ్ ● కోవిడ్ నిబంధనలు పాటించాలంటున్న వైద్యులు ● రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరి ● ప్రస్తుతం అరకొరగానే నిర్ధారణ పరీక్షలు లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో కోవిడ్ మళ్లీ విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో ఒకరికి నెగిటివ్ వచ్చింది. ఇంకా రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా మరింత మంది కోవిడ్ సోకి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కావడంతో జలుబు, తీవ్రమైన బాడీపెయిన్స్, జ్వరం వంటి లక్షణాలు.. రెండు, మూడు రోజులు ఉండి తగ్గిపోతున్నాయి. దీంతో ఫ్లూ జ్వరంగా భావించి చికిత్స పొందడంతో నాలుగైదు రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. మరికొందరిలో వారం పది రోజుల పాటు నీరసం వేధిస్తోంది. అలాంటి వారికి కోవిడ్ సోకి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా మళ్లీ కోవిడ్ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కేసుల వివరాలు.. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకూ ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వారిలో తిరువూరుకు చెందిన బాలికకు ఇప్పటికే నెగిటివ్ రాగా, మరో రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో ఒకరు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరొకరు హోం ఐసోలేషన్లోనే ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కోవిడ్ విజృంభిస్తుండగా, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో సైతం కోవిడ్ కేసులు నమోదు కావడం ప్రజల్లో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. జాగ్రత్తలు తప్పనిసరి.. కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. జనం రద్దీగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం, చేతులను తరచూ నీటితో కడుక్కోవడం, శానిటైజర్ రాసుకోవడం, భౌతిక దూరం పాటించడం, బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరిస్తే మంచిదని సూచిస్తున్నారు. అంతేకాకుండా క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రభుత్వ పరంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు అరకొరగానే చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రికి అనారోగ్యంతో వచ్చే వారికి కోవిడ్ లక్షణాలు ఉంటే అక్కడ శ్యాంపిల్ తీసి పరీక్ష చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ర్యాపిడ్ పరీక్షలు చేస్తుండగా, జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కోవిడ్ పరీక్షలు చేయడం లేదు. గతంలో పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో కూడా కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్లు చేసే వాళ్లు. ఇప్పుడు అక్కడ చేయడం లేదు. కేవలం లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించాలని మాత్రమే నిర్ణయిస్తున్నారు. దీంతో జిల్లాలో అరకొరగానే కరోనా పరీక్షలు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. -
అశ్రద్ధ చేయొద్దు..
మా సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టే సమయంలో జలుబు, జ్వరం, బాడీపెయిన్స్ ఉన్న వారిని గుర్తించి సమీపంలోని యూపీహెచ్సీ, పీహెచ్సీలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అక్కడి వైద్యులు వారిని పరీక్షించి కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే జీజీహెచ్కి రిఫర్ చేస్తున్నారు. అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరాన్ని బట్టి ఆస్పత్రిలో చేర్చడం, లేదంటే హోం ఐసోలేషన్కు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఎ. శ్రావణ్బాబు, వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఎన్టీఆర్ జిల్లా -
685 మంది సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీ ఈఏపీ సెట్లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన విజయవాడలోని రమేష్ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్–145, స్కౌట్స్ అండ్ గైడ్స్–70 మంది, సీఏపీ–470 మంది మొత్తం 685 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను ఆదివారం పరిశీలించారు. అలాగే సోమవారం ఉదయం సీఏపీ–60,001 నుంచి లక్ష లోపు ర్యాంకు, ఎన్సీసీ–1 నుంచి 50వేల లోపు ర్యాంకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్–50,001 నుంచి 80 వేల లోపు ర్యాంకు, స్కౌట్స్ అండ్ గైడ్స్ 80,001 నుంచి చివరి ర్యాంకు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించే జానకీ సదనం(సత్రం)లో గది నిర్మాణానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. విజయవాడకు చెందిన నరసింహారావు రూ.12లక్షల చెక్కును ఆదివారం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం కుటుంబీకులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి దేవస్థాన అధికారులు, అర్చకులు తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థులు నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరువ కావాలంటే పట్టుదల, క్రమశిక్షణతో చదవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మిశ చెప్పారు. స్థానిక సున్నపుబట్టీల సెంటర్లోని ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) హాలులో ‘అమ్మ’ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్(అమ్మ) అధ్యక్షుడు గారపాటి సతీష్ మాట్లాడుతూ తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు ఏటా ఈ విధంగా ఉపకార వేతనాలను అందజేస్తున్నామని, ఈ ఏడాది 423 మంది విద్యార్థులకు రూ.23లక్షల విలువైన ఉపకార వేతనాలతో పాటుగా నోటు పుస్తకాలను అందజేస్తున్నామన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుంకర చంద్రశేఖర్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): సంతానలేమితో బాధపడుతున్న దంపతుల జీవితాల్లో వెలుగులు నింపడంలో క్లినికల్ ఎంబ్రియాలజిస్టుల పాత్ర అత్యంత కీలకమైందనీ వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల రీప్రొడక్టివ్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ మోహన్ ఎస్. కామత్ అన్నారు. నైపుణ్యం, అంకితభావం కలిగిన ఎంబ్రియాలజిస్టులే ఐవీఎఫ్ కేంద్రాలకు వెన్నెముక వంటివారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంబ్రియాలజిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఎంబ్రియాలజిస్టుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎంజీ రోడ్డులోని ఫార్చ్యూన్ మురళీపార్క్లో సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ మోహన్ ఎస్. కామత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సావనీర్ ఆవిష్కరించారు. యువ ఎంబ్రియాలజిస్టులకు క్విజ్, శాసీ్త్రయ పోస్టర్ ప్రదర్శన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఎంబ్రియాలజిస్టుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్బాబు, కార్యదర్శి డాక్టర్ వి. లెనిన్ బాబు, ఉపాధ్యక్షుడు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్ పాల్గొన్నారు. -
ఉద్యోగ సమస్యలపై సర్కారు నిర్లక్ష్య వైఖరి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అన్నారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం ఈ సంఘ రాష్ట్ర కార్యాలయం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చల్లో ఎటువంటి హామీ రాలేదన్నారు. ప్రభుత్వం తాత్సారం చేయకుండా మంత్రుల కమిటీ ముఖ్యమంత్రితో చర్చించి పీఆర్సీ కమిషనర్ను తక్షణం నియమించి ప్రస్తుతం 30శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. లేకుంటే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో దశల వారీ ఉద్యమానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చామని, వారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినా ఎటువంటి స్పందనలేదన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్వహించబోయే ప్రత్యేక టెట్లో ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు సిలబస్లో కొంత మినహాయింపు ఇవ్వాలని, వారు బోధించే సబ్జెక్టులోని ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా సిలబస్ రూపొందించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. సుందరయ్య కార్యకలాపాల రిపోర్ట్ ప్రవేశపెట్టి మాట్లాడారు. సమావేశంలో ఎం. కృష్ణయ్య, సహాధ్యక్షురాలు, పి. భవాని, జిల్లా కోశాధికారి కె. గంగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026నీరు ఇవ్వలేం.. 7ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి కాకినాడకు చెందిన ఉమాశ్రీదేవి దంపతులు, కుటుంబ సభ్యులు శనివారం రూ.1.05 లక్షల విరాళం సమర్పించారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు దంపతులు శనివారం దర్శించుకున్నారు. పుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు.ఘంటసాల: స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ డి.సుధారాణి ఉత్తమ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. బాపట్లలో జరు గుతున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవం సందర్భంగా విశ్వ విద్యాలయం పరిధిలో ఉత్తమ శాస్త్రవేత్తగా గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా శనివారం ఆమె పురస్కారం అందుకున్నారు. ఉపకులపతి డాక్టర్ పాలడగు సత్యనారాయణ, న్యూడిల్లీకి చెందిన ఐఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.ముండ్లపాడు వద్ద వడబడి ఎండిపోతున్న పత్తి మొక్కలు ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు కోసం ఏడు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. వరి సాగుకు నీరు లేక ఇబ్బందులు తప్పడంలేదు. ఎండుతున్న పొలాలను బతికించేందుకు ఎంత నీరు పెట్టినా నిలవటం లేదు. ఇంజిన్, ఆయిల్, ట్యూబులు ఖర్చులే ఎక్కువ అయిపోతున్నాయి. ఇలా అయితే సాగు చేయలేం. – గొరికపూడి శివకుమార్, కప్తానుపాలెం, మోపిదేవి మండలం మబ్బులు కమ్ముతున్న ఆకాశం కనికరించి నేలపై ఒక్క వర్షపు చుక్కను కూడా రాల్చడం లేదు. నీటి గలగలలతో కళకళలాడాల్సిన పంటకాలువలు చుక్కనీరు లేక ఒట్టిపోయాయి. పచ్చందాలతో కనువిందు చేయాల్సిన సాగు భూములు బీడుగా దర్శనమిస్తున్నాయి. అదునుకొచ్చిన వరి నారు మడులు నీటి తడిలేక ఎండుముఖం పట్టాయి. సాగునీటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఆరు తడిపంటలు మేలు అంటూ అధికారులు సూచనలతో సరిపెడుతున్నారు. చినుకమ్మా కరుణించి ఆదుకోమ్మా అంటూ అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. పెనుగంచిప్రోలు/చల్లపల్లి: ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాధారణంగా జూలై మొదటి వారానికి దాదాపుగా పూర్తి కావాల్సిన వరినాట్లు ఇప్పటికీ ప్రారంభం కూడా కాలేదు. నీటి కోసం పొలాలు రైతుల వైపు చూస్తుంటే.. రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. ప్రకృతి కరుణి స్తుందా? ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూపుతుందా? లేక రైతులు మరో సారి అప్పుల ఊబిలో కూరుకుపోతారా? అన్న ప్రశ్న ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని వెంటాడుతోంది. ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి సకాలంలో సాగునీరు వస్తుందని భావించిన రైతులు ఇప్పటికే వేల రూపాయలు ఖర్చు చేసి నారుమడులు సిద్ధం చేసుకున్నారు. తీరా వర్షాలు పడక, కాలువల్లో నీరు అడుగంటడంతో నారుమడిని కాపాడటం, పొలాన్ని తడిపి నాట్లు వేయటం సవాలుగా మారింది. ఆయిల్ ఇంజిన్లతో అదనపు భారం.. కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1,65,771 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయి. ముఖ్యంగా వరి 1.60,655 హెక్టార్లలో సాగవుతుంది. ఈ ఖరీఫ్లో వెద పద్ధతి, బోర్లు, ఇతర నీటి వసతులు ఉన్న ప్రాంతాల్లో 65 వేల హెక్టార్లలో మాత్రమే వరి సాగవుతోంది. వెద పద్ధతిలో సాగుచేసిన పొలాలు నీటి తడులు అందక ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల కాలువల్లో ఉన్న కొద్ది పాటి నీటిని రైతులు ఆయిల్ ఇంజిన్లతో తోడి పొలాలకు నీటి తడులు అందిస్తున్నారు. దీనివల్ల రైతులపై మరింత ఆర్థిక భారం పడుతోంది. ఎకరం పొలం తడపటానికి 15 నుంచి 20 గంటల వరకు ఇంజిన్ ఆడాల్సి వస్తోంది. ఇందుకు 20 లీటర్ల వరకూ అంటే రూ.2 వేల వరకు ఇంధనం ఖర్చు అవుతోంది. ఆయిల్ ఇంజిన్కు అద్దె రూ.1000, వాటర్ తరలించేందుకు ట్యూబులకు అద్దె, మరోపక్క కూలి ఖర్చులు. ఇలా పొలం తడపటానికే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. గత ఏడాది నష్టాల నుంచి తేరుకోకముందే.. గత ఏడాది తుపానులు, భారీ వర్షాలు మిగిల్చిన అప్పులు, కష్టాల నుంచి తాము ఇంకా బయటపడలేదని రైతులు చెబుతున్నారు. తీరా ఈ ఏడాది కూడా ఆదిలోనే హంసపాదు అన్న చందంగా సాగు ప్రారంభంలోనే నీటి కోసం నానా కష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నాట్లు కూడా వేయకుండానే ఎకరా పొలం తడపటానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చులు అయ్యాయని వాపోతున్నారు. ఎదుగుదల లేని పత్తి మొక్కలు ఎన్టీఆర్ జిల్లాలో ఏటా ఖరీఫ్లో 48,831 హెక్టార్లలో వరి, 3,727 హెక్టార్లలో మొక్కజొన్న, 75 వేల హెక్టార్లలో పత్తి సాగవుతుంది. వర్షాల జాడలేక బోర్లు, బావులు ఉన్న చోట మాత్రమే రైతులు వరి సాగు చేపట్టారు. మొక్కజొన్న వెయ్యి హెక్టార్ల లోపు మాత్రమే నేటి వరకు సాగయింది. ఈ పంటలను రక్షించుకునేందుకు నీరులేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 30 వేల ఎకరాల్లో మాత్రమే పత్తి సాగు చేశారు. మొక్కలు నాటి నెల గడిచినా నీటి తడిలేక పైరు ఎదగలేదు. కొన్ని మొక్కలు ఎండ, గాలులకు వడబడుతున్నాయి. మరో వారం ఇదే పరిస్థితి ఉంటే మొక్కలు మొత్తం ఎండి పోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇప్పటికే ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. కౌలు రైతులు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 29.160 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 400 క్యూసెక్కులు వదులుతున్నారు. పత్తి మొక్కలు నాటి 20 రోజులు గడిచాయి. నెల రోజులుగా వర్షాలు పడలేదు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు గాలులకు భూమిలో తేమ శాతం పోయి పత్తి మొక్కలు వడలి పోతున్నాయి. మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోతే రైతులకు గడ్డు పరిస్థితులు తప్పవు. – దురిశాల మురళి, రైతు, పెనుగంచిప్రోలునీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మూడు రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లా డుతూ.. ఆల్మట్టి డ్యామ్లో నీటి నిల్వ తక్కువగా ఉంది, అక్కడి నుంచి నారాయణపూర్, జూరాల రిజ ర్వాయర్లు నిండిన తర్వాత శ్రీశైలంకు నీరు చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పులిచింతలలో 30 టీఎంసీలు తప్ప మరే ఇతర రిజర్వాయర్లో తగినంత నీటి నిల్వలు లేవని స్పష్టంచేశారు. పుష్కలంగా వర్షాలు పడితే తప్ప సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడినట్లు వివరించారు. ఉన్న నీటిని తాగు అవసరాలకు వాడుకోవాలని ఆపై వర్షాలు వస్తే సాగుకు కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. రైతులు ఎక్కువగా ఆరుతడి పండల వైపు మొగ్గుచూపేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. దీంతో రైతులు మరింత దిగాలు పడ్డారు. -
స్వయం ఉపాధితో మహిళలకు ఆర్థిక భరోసా
గుంటుపల్లి(జి.కొండూరు): మహిళలు నైపుణ్యం పెంచుకొని స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడం వల్లన ఆర్థికంగా ఎదగొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. జి.కొండూరు మండలంలోని గుంటుపల్లి రైజ్ కేంద్రంలో హస్తకళా ఉత్పత్తులపై శనివారం నిర్వహించిన వర్క్ షాపును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రావ్స్ ఎండ్ లెస్ క్రాఫ్టస్ వ్యవస్థాపకురాలు శ్రావణి 60 మంది స్వయం సహాయక సంఘ మహిళలకు బొకేలు, అలంకరణ వస్తువులు, ఆకర్షణీయ బహుమతుల తయారీలో శిక్షణ ఇచ్చారు. డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): తెలంగాణ నుంచి దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనం, ఆషాఢ సారె నేపథ్యంలో అన్ని వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు దుర్గగుడి ఈఓ శీనానాయక్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ బోనం సమర్పణకు సుమారు మూడు వేల మంది కళాకారులు, ఉత్సవ కమిటీ సభ్యులు వస్తారని తెలిపారు. గత ఆదివారం ఒక్క రోజే సుమారు 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. ఈ ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నామని వివరించారు. మరో వైపున కొండపైకి ఎటువంటి ప్రయివేటు వాహనాలను అనుమతించేది లేదని, దేవస్థానం బస్సులను పూర్తి స్థాయిలో నడుపుతామని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు, చంటి బిడ్డల తల్లులు ఉదయం ఎనిమిది గంటల్లోపు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు రావా లని సూచించారు. రద్దీ దృష్ట్యా దేవస్థ్ధానం తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో కరోనా యాక్టివ్ కేసులు రెండు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం తెలిపారు. తొలుత కరోనా పాజిటివ్ వచ్చిన తిరువూరు చెందిన 13 ఏళ్ల బాలికకు ప్రస్తుతం నెగటివ్ వచ్చింది. విజయవాడ లోని ఓ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అతనికి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. మరో 85 ఏళ్ల వ్యక్తికి సైతం కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో రెండు కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. విజయవాడలో చాలా మంది జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతుండగా, ఒకటి రెండు రోజులు ఉండి తగ్గి పోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రజలు అవగాహనతో కరోనా నిబంధనలు ఎప్పటిలా పాటిస్తే మంచిదని, ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, మధుమేహులు రక్తపోటు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. -
22ఏ జాబితాను రద్దు చేసి ఆ భూములు పునరుద్ధరించాలి
సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు ఏబీ వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం 22ఏ బాధితులకు ఉపశమనం కల్పించేందుకు తెచ్చామని చెబుతున్న జీవో 444 ఓ చెత్త జీవో అని సెంటర్ ఫర్ లిబర్టీ కొట్టి పారేసింది. తక్షణమే 22–ఏ జాబితాను రద్దు చేసి భూములను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. శనివారం విజయవాడ ప్రెస్క్లబ్లో 22 ఏ బాధితులతో కలిసి సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, చక్రవర్తి మీడియా సమావేశంలో మాట్లాడారు. నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతులు మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా నల్లమోతు చక్రవర్తి మాట్లాడుతూ 22ఏ బాధితుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటుందోని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇనాం భూములకు విముక్తి కల్పిస్తామని అనేక సభల్లో ప్రకటించారని గుర్తు చేశారు. ఆయన చెప్పిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ఆవులపల్లె జీవో మోడల్ను రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జీవో 444 ప్రతులను చించివేశారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, అజయ్ మల్లారెడ్డి, రైతులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలోని వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి గ్లోబల్ ఐకాన్ ఫోరమ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న అందజేయనున్న స్టేట్ ఐకాన్ అవార్డ్స్ 2026 పోస్టర్ను శనివారం రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతిభను గుర్తించి గౌరవించడం ద్వారా సమాజానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తులను వెలుగులోకి తీసుకురావడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నిర్వాహక సంస్థ అధ్యక్షుడు జంగా చైతన్య, జనరల్ సెక్రటరీ జయాపటేరియా తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ అవకతవకలపై లోకేష్ రాజీనామా చేయాలి
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అవే ప్రమా ణాలను ఆంధ్రప్రదేశ్లో కూడా పాటించాలని కోరారు. రాష్ట్రంలోని వేల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడిందని, డీఎస్సీ నియామక ప్రక్రియలో అనేక అవకతవకలు, అక్ర మాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన, అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రభుత్వం వాటిని పట్టించు కోకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన లోపాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర యువత అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, డీఎస్సీ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని అవినాష్ డిమాండ్ చేశారు. -
గ్రామానికి గర్వకారణం.. చిరస్మరణీయం
కాలినడకన చదువుకున్న బాలుడు.. కోట్లాది అభిమానుల నటుడయ్యాడు ప్రతినాయకుడికి కొత్త నిర్వచనం ఎన్టీఆర్కు డూప్గా.. తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సినిమా దాటి.. సొంత ఊరిపై మమకారం కై కాల మరణానంతరం గ్రామస్తులు స్వచ్ఛందంగా ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి జయంతి, వర్ధంతి రోజున ఆ విగ్రహం వద్ద నివాళులర్పించడం కౌతవరం ప్రజలకు ఒక ఆనవాయితీగా మారింది. ‘మా ఊరిలో పుట్టి తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన మహానటుడు’ అని గ్రామస్తులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు. -
పాఠశాలల్లో సమస్యలపై ఏకరువు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలను పరిష్కరించాలని పలు పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా ప్రధానోపాధ్యాయులకు, వచ్చిన అతిథులకు మొరపెట్టుకున్నారు. మెగా పీటీఎంను జిల్లాలో ఉన్న అన్ని పాఠశాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల్లో సమస్యలను పరిష్కరించాలంటూ తల్లిదండ్రులు వినతులు సమర్పించారు. ప్రధానంగా నాడు–నేడులో నిలిచిపోయిన పనులను పూర్తి చేసి తరగతి గదులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. సమావేశాల్లో కూటమి నేతలకు ఎటువంటి పదవులు లేకపోయినా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై పెత్తనం చెలాయించారు. చాలా విద్యాసంస్థల్లో తల్లికి వందనం నిధులు పడలేదంటూ తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులను నిలదీశారు. పీటీఎంకు ప్రైవేట్ విద్యాసంస్థలు దూరంగా ఉన్నాయి. -
స్వచ్ఛందం.. ప్రశాంతం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ, ఢిల్లీలో జరుగుతున్న దీక్షలకు మద్దతుగా వివిధ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. నగరంలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇంజినీరింగ్, ఐటీఐ తదితర వృత్తివిద్యా కళాశాలలు శుక్రవారం పూర్తిగా మూతపడ్డాయి. పీబీ సిద్ధార్థ కళాశాల నుంచి విద్యార్ధి సంఘాలు ర్యాలీగా బయలుదేరి వివిధ ప్రాంతాల మీదుగా ముందుకు సాగుతూ బంద్ను విజయవంతం చేయించారు. మెగా పీటీఎం పేరుతో ప్రభుత్వ విద్యాసంస్థలు బంద్కు దూరంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్ను అన్ని విద్యాసంస్థల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చినా, కేంద్రానికి మద్దతుగా చంద్రబాబు మెగా పీటీఎంను అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆయా నాయకులు చెబుతున్నారు. -
నర్సింగ్ కాలేజీలో అవినీతిపై విచారణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరుగుతున్న అవినీతిపై ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ‘పైసలిస్తేనే..ప్రాక్టికల్ మార్కులు’ అనే శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో డీఎంఈ కార్యాలయంలోని నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులను పిలిచి మిమ్మల్ని ఎవరైనా డబ్బులు ఇవ్వాలని వత్తిడి చేస్తున్నారా అని అడిగారు. అలా నాలుగో ఏడాది విద్యార్థులు అందరినీ పిలిచి వారి వద్ద నుంచి లెటర్లు రాయించుకున్నారు. వారితో పాటు ఫ్యాకల్టీ సభ్యులను సైతం ఆమె విచారణ చేశారు. ఉదయం 11 గంటల సమయంలో నర్సింగ్ కళాశాలకు వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ సాయంత్రం 5 గంటల వరకూ ఉన్నారు. ఇక్కడ విచారణలో తేలిన అంశాలను రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. బలవంతంగా లెటర్.. మా ఇష్ట పూర్వకంగానే కళాశాలకు ఫండ్ ఇచ్చాం అంటూ విద్యార్థులపై వత్తిడి చేసి లెటర్లు ఇప్పించినట్లు తెలిసింది. అలా రాయకుంటే ప్రిన్సిపాల్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటంతో విద్యార్థినిలు తప్పనిసరి పరిస్థితులో లేఖలు రాసినట్లు పలువురు చెబుతున్నారు. ‘ఇష్టపూర్వకంగా ఇస్తే ఆర్థికంగా ఉన్న వాళ్లు ఇస్తారు.. పేద విద్యార్థులు కూడా డోనేషన్ ఇస్తారా అని’ ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందిపై గతంలోనే అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యార్థులను విచారణ చేసిన నర్సింగ్ డీడీ -
కౌన్సెలింగ్ ప్రారంభం
గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్)లో 2026–28 విద్యా సంవత్సరంలో డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్ కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభ మైంది. ఈ నెల 29వ తేదీ వరకు జరుగుతుందని డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వినయకుమార్ తెలిపారు. డైట్ అంగలూరుకు 99 మందిని, ఏజే కాలేజ్ మచిలీపట్నానికి 40 సీట్లను కన్వీనర్ కేటాయించారని చెప్పారు. డైట్ అంగలూరులో తొమ్మిది మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలనలో లెక్చరర్లు ప్రకాశం, రాజ్యలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్స్ శ్రీనివాస్, దివ్యశ్రీ, ఆఫీస్ సిబ్బంది శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి శ్రావణ్బాబు లబ్బీపేట(విజయవాడతూర్పు): పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు సోకకుండా చూడవచ్చని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రావణ్బాబు అన్నారు. ఆయన శుక్రవారం పలు ప్రాంతాల్లో జరిగిన ఫ్రైడే డ్రైడే తో పాటు మెగా పేరెంట్స్ టీచర్చ్ డేల్లో పాల్గొన్నారు. ముత్యాలంపాడులోని ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో శ్రావణ్బాబు ఆర్బీఎస్కే సేవలు, పిల్లల విద్య, ఆరోగ్యంపై చర్చించారు. సమతుల్య ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, నులిపురుగుల నివారణ, రక్తహీనత నివారన, టీకాలు వేయించుకోవడం, కౌమారదశ ఆరోగ్యం, అంటువ్యాధుల నివారణ ప్రాముఖ్యతపై ఆయన తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా మలేరియా అధికారి రాజునాయక్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ మహేశ్వరరావు, వైద్యులు ప్రవీణ్కుమార్, ప్రీతి తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యతో పాటు నైతిక విలువలు, వృత్తి నైపుణ్యాలను విద్యార్థులు పెంచుకోవాలని కృష్ణా విశ్వ విద్యాలయం వీసీ ప్రొఫెసర్ కూనా రామ్జీ అన్నారు. విజయవాడలోని కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ విద్య పూర్తి చేసుకున్న వారికి శుక్రవారం గ్రాడ్యుయేషన్ పట్టాలు అందజేశారు. ముఖ్యఅతిథి ప్రొఫెసర్ రాంజీ మాట్లాడుతూ ఫార్మసీ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మరో అతిథి సిద్ధార్థ అకాడమీ హయ్యర్ ఎడ్యుకేషన్ రిజిస్ట్రార్ రవిచంద్ మాట్లాడుతూ అధ్యయనం, పరిశోధన, వృత్తి నిబద్ధతతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల కన్వీనర్ అరుణ్కుమార్, ప్రిన్సిపాల్ ఎ.సునీత, జి.రమణ, కళాశాల పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఉమ్మడి కృష్ణా జిల్లా వివరాలు..
● పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన నుంచి తప్పుకునేందుకు బాబు సర్కార్ ఎత్తుగడ ● మున్సిపల్ ఆస్తులను తాకట్టు పెట్టుకుని అభివృద్ధి పనులు చేయాలని సూచన ● జీఓ నంబర్ 151 జారీ ● లోటు బడ్జెట్లతో మున్సిపాలిటీలు కార్పొరేషన్/ వార్డులు జనాభా మున్సిపాలిటీ (అంచనా) విజయవాడ 64 11,43,232 మచిలీపట్నం 60 2,52,000 గుడివాడ 36 1,25,000 జగ్గయ్యపేట 31 51000 పెడన 23 35,000 ఉయ్యూరు 20 42,000 నందిగామ 20 48000 తిరువూరు 28 50,000 కొండపల్లి 40 70,200 వైఎస్సార్ తాడిగడప 38 2,50,000 సాక్షి, విజయవాడ: మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు ఆస్తులు తాకట్టు పెట్టుకోవాలని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. దీనికి ‘పూల్డ్ మున్సిపల్ బాండ్ల’ను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే నగర, పట్టణాల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత. చంద్రబాబు ప్రభుత్వం వసతుల కల్పనతో పాటు ఎంపిక చేసిన ప్రాజెక్టుల పూర్తికి మున్సిపాలిటీలు తమ పరిధిలోని విలువైన ఆస్తులను తాకట్టు పెట్టుకోవాలని చెబుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలకు కల్పించాల్సిన రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, డ్రైన్ల, పారిశుద్ధ్యం, మురుగునీటి శుద్ధి నిర్వహణ, పార్కులు వంటి మౌలిక వసతుల కల్పన, నిర్వహణ బాధ్యతల నుంచి కూడా తప్పుకునేందుకు సిద్ధమైంది. పట్టణాల్లో ప్రజలకు కనీసం అందించాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ‘పూల్డ్ మున్సిపల్ బాండ్ల’ను తెరపైకి తెచ్చింది. మున్సిపల్ ఆస్తులను పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని చూస్తున్నారు. దీనికి ఇటీవల ప్రభుత్వం జీవో నంబర్ 151 జారీ చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 9 మున్సిపాలిటీలు ఉండగా ఇందులో విజయవాడ కార్పొరేషన్కు వేలసంఖ్యలో స్థిరాస్తులు(భూములు, భవనాలు, కమ్యూనిటీ హాల్స్, మార్కెట్లు, షాపులు) ఉన్నాయి. ఎలాంటి కీలక పనులు చేపట్టాలన్నా పూల్డ్ బాండ్ల ద్వారా ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ● పూల్డ్ బాండ్ల జారీకి నగర, పట్టణ, స్థానిక సంస్థలకు క్రెడిట్ రేటింగ్ తప్పనిసరి ● ఆదాయాన్ని ఆర్జించే మున్సిపల్ ఆస్తులను ఈ బాండ్ల జారీలో అనుసంధానం చేయడం ద్వారా క్రెడిట్ ప్రొఫైల్ను బలోపేతం చేయాలి పట్టణాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏ ప్రభుత్వమైనా ఏటా వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించాలి. చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా మున్సిపాలిటీలే అప్పులు తెచ్చుకుని.. తీర్చాలని చెబుతోంది. తద్వారా ఎంపిక చేసిన విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నంతో పాటు మరో 9 మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన పనులను ఇప్పటికే గుర్తించారు. బాండ్ల ద్వారా వచ్చిన నిధులతో మున్సిపాలిటీల్లో చేపట్టే ప్రాజెక్టులతో వచ్చే రాబడి కంటే, ఆ బాండ్లకు చెల్లించాల్సిన వడ్డీ భారమే ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్టు విఫలమై బాండ్ల చెల్లింపులకు నిధులు సరిపోకపోతే, ఆ భారమంతా మున్సిపాలిటీలపైనే పడుతుంది. -
26న దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు 26వ తేదీన తెలంగాణ బంగారు బోనం సమర్పించనున్నారు. భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 5 వందల మంది కళాకారులు, బేతాళ నృత్యకారులతో ఊరేగింపుగా ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. బోనాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం రాత్రికి హైదరాబాద్ నుంచి బోనాల కళాకారులు నగరానికి చేరుకుంటారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. బోనాల కమిటీ సభ్యులకు సీవీ రెడ్డి చారిటీస్లో వసతి కల్పించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు సీవీ రెడ్డి చారిటీస్ నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఆదివారం కావడం, మరో వైపున ఆషాఢ మాసోత్సవాల నేపథ్యంలో సారె సమర్పించే భక్త బృందాల కోలాహలం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 27 నుంచి శాకంబరీ ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలను నిర్వహించనున్నారు. శాకంబరీ ఉత్సవాల నిమిత్తం ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలలో కూరగాయలు, ఆకుకూరలను కట్టేందుకు ఐరన్గ్రిల్స్ను ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేస్తుంది. మరో వైపున శాకంబరీ ఉత్సవాల అలంకరణకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలా ల సేకరణకు ఆలయానికి చెందిన కొంత మంది అధికారులు, సిబ్బంది రైతులను, హోల్సేల్ వ్యాపారులను కలిసి విరాళాలను అందించాలని కోరారు. శని, ఆదివారం నాటికి కూరగాయలు, ఆకుకూరలు దేవస్థానానికి చేరే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. కాగా రానున్న పది రోజులు చాలా కీలకమని ఆలయ అధికారులు భావిస్తున్నారు. దీంతో సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా విధులు కేటాయింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
పైసలిస్తేనే.. ప్రాక్టికల్ మార్కులు!
లబ్బీపేట(విజయవాడతూరు): విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో వసూళ్ల దందా సాగుతోంది. అక్కడ ఏ పనిచేయాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే. అంతేకాదు ప్రాక్టికల్ మార్కులు వేయాలంటే అడిగినంత చెల్లించాల్సిందే. చివరికీ పేద విద్యార్థినులకు వచ్చే స్టైపెండ్లో సైతం కమీషన్లు అడుగుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాక రికార్డులపై సంతకాలు పెట్టేందుకు సైతం టీచింగ్ స్టాఫ్ డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత ఇవ్వకుంటే, మీరు కోర్సు పూర్తి చేసి ఎలా వెళతారనే బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఇంత జరుగుతున్నా, ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. 600 పైగా విద్యార్థినులు.. గత ప్రభుత్వం విజయవాడలో బీఎస్సీ నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏటా వంద మందికి అడ్మిషన్లు కల్పిస్తుంటారు. ప్రస్తుతం నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న వారు.. ఇంటర్న్షిప్ చేస్తున్న వారు అంతా కలిపి దాదాపు 604మంది ఉన్నారు. ఇక్కడ ప్రిన్సిపాల్, టీచింగ్ సిబ్బందితో పాటు, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కూడా పనిచేస్తుండగా, దీని పర్యవేక్షణ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు, ఆ కార్యాలయంలోని నర్సింగ్ విభాగం చూస్తుంటుంది. దీంతో ఇక్కడ ఏమి జరిగినా పట్టించుకునే వారే ఉండటం లేదు. వసూళ్ల దందా.. నర్సింగ్ కళాశాలలో విద్యార్థినుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఫైనలియర్ విద్యార్థినుల ప్రాక్టికల్స్ జరగ్గా, ఒక్కో విద్యార్థి రూ.4వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. విద్యార్థులు అంత ఇచ్చుకోలేమంటూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.1500, రూ.2 వేలు చొప్పున దాదాపు రూ.2 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఇదంతా ప్రిన్సిపాల్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రిన్సిపాలే చేస్తుంటే తామేమైనా తక్కువా అంటూ టీచింగ్ సిబ్బంది సైతం రికార్డులపై సంతకాలు పెట్టేందుకు డబ్బులు వసూళ్లు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ఇస్తే ఒక రేటు, మార్కుల జాబితా ఇస్తే మరో రేటు నిర్ణయించి మరీ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్టైపెండ్ వచ్చినా వదలరు.. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాల మూతపడగా అక్కడి విద్యార్థులను ఈ కళాశాలకు ఎటాచ్ చేశారు. వారికి ఏడాదిన్నకు సంబంధించి ఒకేసారి రూ.25వేల నుంచి రూ.30వేల వరకూ స్టైపెండ్ వచ్చింది. వాటి నుంచి సైతం తలా రూ.3వేలు ఇవ్వాలంటూ విద్యార్థినులకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో చేసేది లేక అడిగినంత ఇచ్చినట్లు చెబుతున్నారు. వాళ్లు అక్కడ చదువుతుండటంతో బయటకు చెప్పేందుకు భయపడుతున్నట్లు తెలిసింది. ఇలా ప్రతి పనికీ రేటు నిర్ణయించి వసూళ్ల దందా సాగిస్తున్న నర్సింగ్ కళాశాల ఆగడాలపై రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. -
కుందేరు ఆర్ఎస్కేలో కేరళ మంత్రి
కంకిపాడు: మండలంలోని కుందేరు రైతు సేవ కేంద్రాన్ని కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ గురువారం సందర్శించారు. రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్న విధానాన్ని పరిశీలించేందుకు ఆర్ఎస్కేను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ–క్రాప్ నమోదుతో పంట నిర్ధారణ, దిగుబడులు అంచనా, ధాన్యం సేకరణలో తేమశాతం పరిశీలనకు తీసుకుంటున్న చర్యలు పరిశీలించారు. రైతులకు గోనె సంచులు అందజేత, రవాణా సౌకర్యాల కల్పన, రైతులకు సొమ్ముచెల్లింపులపై ఆరా తీశారు. ధాన్యం సేకరణ తీరుపై స్థానిక అధికారులతో సమీక్షించారు. ఉయ్యూరు ఆర్డీఓ కరుణకుమారి, తహసీల్దార్ వీ.భావనారాయణ, ఏఓ ఉషారాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు. పైలెట్ ప్రాజెక్టుకు గన్నవరం మండలం ఎంపిక చిలకలపూడి(మచిలీపట్నం):‘మీ భూమి–బ్లాక్ చెయిన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థ’ పైలెట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి దశలో ఈ పైలెట్ ప్రాజెక్టు అమలుకు జిల్లాలోని గన్నవరం మండలాన్ని ఎంపిక చేశారు. మండలంలోని 18 గ్రామాలకు చెందిన 25,680 భూ ఖాతాలను ఈ వ్యవస్థలో నమోదు చేయనున్నారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపై సమీకరించడం ద్వారా భూ రికార్డుల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టనున్నారు. ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా భూ రికార్డులకు ఒకే ప్రామాణిక సమాచారం (సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్) అందుబాటులోకి వస్తుందని, రికార్డుల్లో అక్రమ మార్పులు, భూ మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు భూ సంబంధిత సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందించే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. పోతురాజు, గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం, గన్నవరం తహసీల్దార్ శివయ్య, సర్వే శాఖ సహాయ సంచాలకుడు లక్ష్మణరావు, వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి రామణి, మత్స్యశాఖ అధికారి అయ్యా నాగరాజా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ కాంక్లేవ్ను శుక్రవారం నుంచి 26 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహించనున్నట్లు బీఎన్ఐ విజయవాడ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్దేశాయ్ తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం 128 స్టాళ్లతో ఎక్స్పో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడంతో పాటు కొత్త కస్టమర్లు, వ్యాపార భాగస్వాములను కలుసుకునే అవకాశాన్ని ఈ ఎక్స్పో కల్పిస్తుందని చెప్పారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, బ్యాడ్మింటన్ దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో నిర్వాహకులు త్రినాథ్ నండూరి, బి.దేవకుమార్, లక్ష్మీ శాంతి కోగంటి, పి.యువకిషోర్, ఎన్.నాగార్జున తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కల్చరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని ఉండవల్లి గుహల సముదాయంలో 25, 26 తేదీలలో నిర్వహించే తెలుగు మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సృజనాత్మక, సాంస్కృతిక సమితి చైర్ పర్సన్ తెలిపారు. గురువారం విజయవాడలోని కార్యాలయంలో మాట్లాడుతూ ఉదయం 6 గంటలకు తొలిరోజు సభలు ప్రారంభమవుతాయన్నారు. రచయిత్రుల కోసం ఆమె మాట అక్షరబాట, కవుల కోసం చెట్టునీడన చిరుగాలి, చిన్నారుల కోసం అమ్మమ్మ ముచ్చట్లు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. -
పోలవరం కాలువ ద్వారా నీరందించండి
సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే వంశీ లేఖగన్నవరం: పోలవరం కుడి కాలువ ద్వారా గన్నవరం నియోజకవర్గంలోని డెల్టా ఆయుకట్టుతో పాటు మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని సీఎం నారా చంద్రబాబునాయుడుకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభ నేని వంశీమోహన్ లేఖ రాశారు. ఈ మేరకు గురువారం సీఎంకు పంపిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. గోదావరి జలాలను మళ్లించే క్రమంలో కృష్ణా డెల్టాతో పాటు పోలవరం కుడి కాలువ సమీపంలో ఉన్న మెట్ట ప్రాంత గ్రామాలకు సైతం నీటిని వాడుకునే అవకాశం కల్పించాలని 2015లో అప్పటి ఎమ్మెల్యేగా తాను విజ్ఞప్తి చేయగా అంగీకరించారని గుర్తు చేశారు. ఆ సమయంలో తన సొంత ఖర్చులతో మోటార్లు ఏర్పాటు చేయగా.. నీటి సరఫరా జరిగిందన్నారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ మోహన్రెడ్డి దానిని కొనసాగించారని చెప్పారు. ఇప్పుడు అడ్డగింత.. అయితే ఈ ఏడాది మాత్రం పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతానికి మళ్లించకుండా నీటి పారుదల అధికారులు పోలీసుల బందోబస్తుతో ఎక్కడికక్కడ మోటర్లను నిలిపివేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న మెట్ట ప్రాంత రైతులకు పట్టిసీమ నీరు ఆగిపోవడం మరింత ఆందోళనకరంగా మారిందన్నారు. క్షేత్రస్థాయిలో పంటలు ఎండిపోతున్న పరిస్థితులు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో పట్టిసీమ నీటిని వాడుకునే విధంగా సత్వర చర్యలు తీసుకుని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. -
తల్లికి వెన్నుపోటు!
ఆంక్షల ‘వందనం’.. అర్హుల రోదనం కూటమి పాలనలో అందరికీ వెన్నుపోటే. యువత, విద్యార్థులు, రైతులు ఇలా అందరికీ ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కదానిని నెరవేర్చలేదు. తాజాగా జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడిని నేడు తల్లికి వందనం పేరు పెట్టి దిగజారుస్తున్నారు. ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు అని చెప్పి తల్లులనే తగ్గించి వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి తల్లికివందనం పథకాన్ని ఎగ్గొడుతున్నారు. – ఎ. రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘ నేత వన్టౌన్(విజయవాడపశ్చిమ): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని తల్లులకు మరోసారి వెన్నుపోటు పొడిచింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కేవలం పేరు మార్చడం మాత్రమే కాకుండా ఉమ్మడి జిల్లాలో వేలాది మంది తల్లులకు పలు కారణాల పేరుతో అనర్హులుగా ప్రకటించి ఎగ్గొడుతోంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి పిల్లవాడికి అమలు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ హడావుడి చేసింది. తీరా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు కేవలం ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే వేలాది మంది తల్లులకు ఎగనామం పెట్టిందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఆంక్షల పేరుతో ఎగవేత.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పలు కారణాలు చూపుతూ వేలాది మందికి ఈ పథకాన్ని ఎగవేసేందుకు పాలకులు కుట్ర చేశారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. గ్రామాల్లో పది వేలు, పట్టణాల్లో 12వేలకు మించి ఆదాయం ఉంటే వారికి ఈ పథకం వర్తించదని నిబంధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు పైగా ఉంటే వారికి సైతం ఈ పథకం వర్తించదు. అలాగే గత ఏడాది పది, ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారికి ఈ పథకంలో చూపటం లేదని ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సైతం ఈ పథకంలో పేర్లు కనిపించటం లేదని పలువురు వివరిస్తున్నారు. అదే విధంగా ఐటీ రిటర్న్స్ పేరుతో చాలా మందిని దీనిలో అనర్హులుగా ప్రకటిస్తూ జాబితాలను ప్రదర్శిస్తున్నారు. అయితే తాము ఐటీ చెల్లించటం లేదని వారంతా ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2023లో 3,00,120 మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున నగదును వేసింది. ఆ క్రమంలో కృష్ణాజిల్లాలో 1,29,533 మంది తల్లులకు, ఎన్టీఆర్ జిల్లాలో 1,70,587 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన నివేదికల ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2,82,922 మంది తల్లుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ అయ్యేటట్లుగా నిధులను విడుదల చేశారు. ఆ క్రమంలో కృష్ణాజిల్లాలో 1,23,110 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 1,59,812 మంది తల్లుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,198 మంది తల్లులకు ఈ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ క్రమంలో కృష్ణాజిల్లాలో 6,423 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 10,775 మందికి మొండి చెయ్యి చూపుతోంది. అప్పుడు విమర్శించి.. అదే పని.. గత ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.13 వేల నగదును జమ చేసినప్పుడు కూటమి నేతలు చాలా దారుణంగా మాట్లాడారు. ఎన్నికల వేళ నీకు15 వేలు, నీకు 15 వేలు.. అంటూ హడావుడి చేశారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగిసిన తరువాత అదే రూ.13వేలనే వేసి మిగిలిన రెండు వేలను పాఠశాలల అభివృద్ధి పేరుతో పక్కదోవ పట్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గత ఏడాది ఆ రెండు వేలు చొప్పున ఏ విద్యాసంస్థకు కేటాయించలేదని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివరిస్తున్నారు. వార్డు సచివాలయాల వద్ద అర్హుల జాబితాలను అధికారులు ప్రకటించారు. అయితే గతంలో అమ్మ ఒడి పథకం తీసుకున్న వారి పేర్లు ప్రస్తుత జాబితాల్లో అనర్హులుగా కనపడుతుండటంతో వారంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ తాము తీసుకున్న ఈ పథకం ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదంటూ మండిపడుతున్నారు. సచివాలయాల సిబ్బంది మీ పేరు మీద కారు ఉందని, ఐటీ రిటర్న్స్ ఉన్నాయని, స్థలం నమోదైందని పలు అంశాలను వివరిస్తున్నారు. అయితే తమకు మీరు చెబుతున్నవి ఏమి లేవంటూ వారు వాపోతున్నారు. -
అన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు బుధవారం విరాళాలు అందజేశారు. విజయవాడ గాంధీనగర్కు చెందిన దిట్టకవి వెంకట సుబ్బరాయ్ శర్మ తన తల్లి అలివేలు పేరిట అమ్మవారి అన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అలాగే విజయవాడకు చెందిన పర్వతం గోపీచంద్ తన భార్య భరణి పేరిట అన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాసరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. దసరా ఉత్సవాలపై తొలి సమీక్ష సమావేశం ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వైభవంగా నిర్వహించే దసరా ఉత్సవాల తొలి సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. మహామండపం నాలుగో అంతస్తులోని ఈఓ ఛాంబర్లో ఈఓ శీనానాయక్ అధ్యక్షతన ఆలయ ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ఇంజినీరింగ్ అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. దసరా ఉత్సవాలకు సంబంధించి అమ్మవారి విశేష అలంకారాలను త్వరగా సిద్ధం చేయాలని వైదిక కమిటీని, అదే విధంగా క్యూలైన్లు, ఇతర ఇంజినీరింగ్ పనులకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలని ఆలయ ఈఓ శీనానాయక్ ఆలయ అధికారులను ఆదేశించారు. రానున్న దసరా ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, అందుకు తగిన రీతిలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, మౌలిక వసతులపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు తమకు కేటాయించిన పనులపై సమగ్రంగా అంచనాలను రూపొందించడంతో పాటు అంచనా వ్యయం వెంటనే సిద్ధం చేయాలన్నారు. దసరా ఉత్సవాల ప్రతిపాదనలను రానున్న ట్రస్ట్ బోర్డు సమావేశం నాటికి సిద్ధం చేయడంతో పాటు పాలకవర్గ ఆమోదం కోసం పంపాలన్నారు. ప్రభుత్వం నుంచి, దేవదాయ శాఖ నుంచి అనుమతి పొందాల్సిన అంశాల జాబితాను సిద్ధం చేయడంతో పాటు ప్రత్యేక నివేదికను తయారు చేయాలన్నారు. అన్ని విభాగాల సహకారంతో దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఏఈఓ ఎన్. రమేష్బాబు, చంద్రశేఖర్, తిరుమలేశ్వరరావు, ఈఈ ఎల్.రమాదేవి, ఏఈఈలు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏసీఏ అండర్–19 మహిళల చాంపియన్ కృష్ణా మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో అండర్–19 మహిళల వన్–డే ఇంటర్–జోనల్ టోర్నమెంట్ విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగింది. ఈ నెల 15 నుంచి ఈ టోర్నమెంట్లో భాగంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ బుధవారం నిర్వహించారు. అనంతపురం జిల్లా జట్టు, కృష్ణాజిల్లా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. అనంతపురం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ను ఎంచుకుని 50 ఓవర్లల్లో 166/5 స్కోర్ చేసింది. తర్వాత కృష్ణా జిల్లా జట్టు బ్యాటింగ్ చేసి 42.1 ఓవర్లలో 169/4 స్కోర్ చేసింది. 6 వికెట్ల తేడాతో 0.808 రన్ రేట్తో ఏసీఏ ఇంటర్ జోనల్ మ్యాచ్ చాంపియన్గా కృష్ణా జిల్లా జట్టు నిలిచింది. రాజీవ్ నగర్లో వ్యక్తి బలవన్మరణంపాయకాపురం(విజయవాడరూరల్): రాజీవ్నగర్కు చెందిన పొలిమర మోహన్వంశీ (23) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో వెంకటరమణ అనే యువతిని మోహన్వంశీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. పనికి వెళ్లకుండా జులాయిగా తిరగడానికి అలవాటు పడిన మోహన్వంశీ భార్యపై అనుమానంతో ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి దంపతులు మధ్య వివాదం జరిగిన అనంతరం నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో భార్య లేచిచూడగా మోహన్వంశీ కనిపించలేదు. అతని కోసం చూడగా పక్కగదిలో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సహాయంతో కిందకు దించగా అప్పటికే మృతిచెందాడు. విషయాన్ని పెజ్జోనిపేటలో ఉంటున్న అతని తల్లికి సమాచారం అందించింది. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
తిరుపతమ్మకు సారె సమర్పణ
పెనుగంచిప్రోలు: ఆషాఢ మాసం సందర్భంగా గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ వారికి బుధవారం అమ్మవారి సేవకురాలు పాపమాంబ వంశీకులైన ఆలయ అర్చకులు సారె సమర్పించి బోనాలు చెల్లించారు. గ్రామంలోని అమ్మవారి రంగుల మండపం నుంచి ఆలయం వరకు మేళతాళాలతో వారు చేరుకున్నారు. అమ్మవారికి సారె సమర్పణ అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. పారా స్పోర్ట్స్ మీట్లో దివ్యాంగ విద్యార్థి ప్రతిభ కంకిపాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రశిక్ష, పీఎం శ్రీ, రాష్ట్ర సహిత విద్యా విభాగం సంయుక్తంగా ఆగిరిపల్లి మండలం తోటపల్లి హీల్ ప్యారడైజ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్లో కంకిపాడుకు చెందిన ప్రత్యేక విద్యార్థి ప్రతిభ చాటారు. ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించిన పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన కంకిపాడుకు చెందిన దివ్యాంగ విద్యార్థి వినుకొండ భరత్బాబు షాట్పుట్ జూనియర్స్ విభాగంలో ద్వితీయ స్థానం, 400 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం, లాంగ్జంప్లో ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. ప్రతిభ చూపిన విద్యార్థిని శాప్ ఎండీ ఎస్.భరణి, సమగ్ర శిక్ష ఏఎస్పీడీ కె.రవీంద్రనాఽథ్రెడ్డి, ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ వి.రామస్వామి, ఐఈ రీసోర్సు టీచర్లు అభినందించారు. కారు ఢీకొని వృద్ధురాలు దుర్మరణం కంకిపాడు: కారు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. కంకిపాడు ఎస్ఐ కేవై దాసు తెలిపిన వివరాల ప్రకారం.. పమిడిముక్కల మండలం అమీనాపురం గ్రామానికి చెందిన కోలాహలం సూర్యకుమారి (68) ప్రొద్దుటూరు శివారు కొణతనపాడు గ్రామంలోని తమ్ముడిని చూసేందుకు అమీనాపురం నుంచి కొణతనపాడు గ్రామానికి వచ్చింది. కొణతనపాడు అడ్డరోడ్డు వద్ద రోడ్డు దాటే ప్రయత్నంలో మచిలీపట్నం నుంచి విజయవాడకు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్రంగా గాయపడిన సూర్యకుమారిని వైద్యం నిమిత్తం విజయవాడకు తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలి కుమార్తె పోరంకి దేవి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బందరు కాలువలో గుర్తు తెలియని మృతదేహం పెనమలూరు: బందరు కాలువలో పెనమలూరు వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఎస్ఐ తాతాచారి తెలిపిన వివరాల ప్రకారం.. బందరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం రాత్రి కొట్టుకు వచ్చింది. మృతుని వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. వంటిపై నల్లరంగు ప్యాంట్, పసుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉబ్బిపోయింది. పోలీసులు బుధవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు సెల్: 96183 36684 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసంచేసిన దంపతుల అరెస్టు
● విజయవాడలోనే 700 మంది నుంచి రూ. 11.5 కోట్లు వసూలు ● బాధితులు మరింత పెరిగే అవకాశం సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వందల మంది నిరుద్యోగులను మోసం చేసి వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ జోన్ డీసీపీ జి.రామకృష్ణ వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెద్దపులిపాకకు చెందిన ముసునూరి శ్రీనివాస్, సౌజన్య దంపతులు. సౌజన్య 2023లో నగరంలోని పంటకాలువ రోడ్డులోని ఒక కన్సల్టెన్సీలో పనిచేసింది. ఆ సమయంలో స్టూడెంట్ వీసాకు సంబంధించిన ప్రాసెస్ బాగా తెలుసుకుంది. నెదర్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, ఫిన్లాండ్ దేశాలకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆమెకు తెలుసు. వర్కు వీసా అనుభవంతో నిరుద్యోగులను మోసం చేసి డబ్బులు దోచుకోవాలనే ఉద్దేశంతో భర్తలో కలిసి ఒక పథకం ప్రకారం ‘ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ’ పేరుతో విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నంలో కార్యాలయాలు ఏర్పాటు చేసి సోషల్ మీడియా, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. ఈ ప్రకటనలకు అకర్షితులైన వందల సంఖ్యలో నిరుద్యోగులు వారి కార్యాలయాలకు క్యూ కట్టారు. పథకం ప్రకారం నిరుద్యోగులను మోసం.. ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను వారి విద్యార్హతల ఆధారంగా స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ సిల్డ్ కేటగిరీలుగా విభజించి పలు దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ. 8 లక్షల నుంచి రూ. 13 లక్షల వరకు వసూలు చేశారు. ముందుగా 50 శాతం డబ్బులు ఎన్రోల్మెంట్, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో వసూలు చేసేవారు. అనంతరం వారి సిబ్బందితో అభ్యర్థులకు పలు కంపెనీల ప్రతినిధులుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఫెయిల్ అయినట్లు నకిలీ ఫీడ్బ్యాక్ను చాట్ జీపీటీ ద్వారా తయారు చేయించి దానిని ఫ్లయింగ్ బోర్డర్స్ సంస్థ పేరుతో ఉన్న మెయిల్ నుంచి అభ్యర్థులకు పంపించేవారు. కొంత మంది బాధితులు పదే పదే నకిలీ ఇంటర్వ్యూలకు హాజరవుతూ, పదే పదే విఫలమవుతూ ఉండటంతో వారికి అనుమానం రావటంతో బాధితులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో దంపతుల మోసం వెలుగులోకి వచ్చింది. వీరిపై విజయవాడలోని సూర్యారావుపేట, మాచవరం, అజిత్సింగ్ నగర్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు, అన్యమయ్య జిల్లాలోని పీలేరు, తెలంగాణ జగిత్యాల జిల్లాలోని మహిళా పీఎస్, కామారెడ్డి జిల్లా బిక్నూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. హైదరాబాద్లో నిందితుల అరెస్టు.. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి హైదరాబాద్లో ఉన్న నిందితులను అరెస్టు చేశారు. విచారణలో ఒక్క విజయవాడలోనే 700 మంది నిరుద్యోగుల నుంచి రూ. 11.5 కోట్లు వసూళ్లు చేయగా హైదరాబాద్, విశాఖలో వందల మంది బాధితులు ఉన్నారని వారి నుంచి ఎంత మొత్తం వసూలు చేశారో దర్యాప్తులో తేలుతుందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సమావేశంలో నార్త్ డివిజన్ ఏసీపీ పి.సత్యానందం, ఎస్ఎన్పురం ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
కూచిపూడిలో యునెస్కో ప్రపంచ వారసత్వ వర్క్షాపు
పామర్రు: స్థానిక శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో అక్టోబర్ ఆరు, ఏడు తేదీల్లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాతీయ వర్క్ షాపు నిర్వహించనున్నట్లు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య డి.మునిరత్నం నాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. విశ్వ వ్యాప్తమైన కూచిపూడి నృత్యానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ మరింత గుర్తింపు ఇచ్చేలా కేంద్రీయ విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్షాప్లో రెండు రోజుల పాటు 100 మంది ఔత్సాహిక నాట్య విద్యార్థులకు శిక్షణ తరగతులు (వర్క్షాపు) నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు విజయ వంతం కోసం కృష్ణాజిల్లా సహాయ కలెక్టర్ సమత్రా అగర్వాల్ అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. పగలు ఔత్సాహికు లకు వర్క్షాప్, రాత్రి వేళ నిష్ణాతులైన కళాకారులతో నాట్య ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ టూరిజం కన్స ల్టెంట్ అజ్వంత్ నాయుడు, ప్రముఖ నాట్యాచారిణి సుమిత్రా పార్థసారథి, కల్చరల్ కన్సల్టెంట్ సీహెచ్.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవిబాలకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, టీచింగ్ అసిస్టెంట్ ఎస్.వెంకటేశ్వరరావు, పసుమర్తి హరినాథశాస్త్రి, గ్రంథాలయ పాలకులు వై.వి.ఫణికుమార్, తహసీల్దార్ కె.మస్తాన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఈఎస్ఐ వైద్యం.. ప్రైవేటుకు నైవేద్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలంటూ కార్మికులు పోరాటాలు చేస్తారు.. ప్రతినెలా కొంత మొత్తం ఈఎస్ఐ చందా చెల్లిస్తుంటారు.. కానీ అందే వైద్యం అంతంత మాత్రమే. రెండేళ్లుగా తాత్కాలిక షెడ్డుల్లో ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. అక్కడ కనీస సౌకర్యాలు లేక పోవడంతో ఎలాంటి చిన్న సర్జరీ చేయాలన్నా ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. అక్కడ రోగులకు ఎంతో కొంత డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు జిల్లాలకు పెద్దదిక్కుగా.. విజయవాడ గుణదలలోని ఈఎస్ఐ ఆస్పత్రి నాలుగు జిల్లాలోని సుమారు 5.8 లక్షల మంది చందాదారుల వైద్య సేవలకు పెద్దదిక్కుగా ఉంది. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని చందాదారులు డిస్పెన్సరీల నుంచి మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు వస్తుంటారు. కానీ ఇక్కడ తాత్కాలిక భవనాల్లో అరకొర సౌకర్యాలతో సేవలు అందని పరిస్థితి నెలకొంది. నిపుణులైన వైద్యులు ఉన్నా, తాత్కాలిక భవనాల్లో ఆపరేషన్ థియేటర్లతో సర్జికల్ పరికరాలు లేక పోవడంతో శస్త్ర చికిత్సలు నిర్వహించడం లేదు. దీంతో చిన్నపాటి శస్త్ర చికిత్స చేయాలన్నా ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. ప్రైవేటులో అదనపు వసూళ్లు ఈఎస్ఐ ఆస్పత్రి నుంచి రిఫర్ చేయించుకొని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని పలువురు చందాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సూపర్స్పెషాలిటీ సేవలకు మాత్రమే ప్రైవేటుకు పంపించేవారు, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, గైనకాలజీ వంటి విభాగాల్లో ఈఎస్ఐ ఆస్పత్రిలోనే సర్జరీలు చేసేవారు. ఇప్పుడు సౌకర్యాలు లేమితో అన్ని శస్త్ర చికిత్సల కోసం ప్రైవేటుకు పంపిస్తున్నారు. అక్కడికెళితే కొన్ని చికిత్సలకు ఈఎస్ఐ కవరేజ్ రాదంటూ రోగుల నుంచి అదనంగా వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయమై ఈఎస్ఐ అధికారులకు కార్మిక సంఘాలు ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండటం లేదు. భవనం ఇంకెప్పుడు? ఐదు దశాబ్దాల నాడు నిర్మించిన ఈఎస్ఐ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని గతంలో భావించారు. దీంతో తాత్కాలిక భవనాలను నిర్మించి, వైద్య సేవలను అక్కడకు మార్చారు. తాత్కాలిక భవనాల్లోకి మారి ఏడాదిన్నర గడుస్తున్నా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. ఒకప్పుడు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లేవారు. రాష్ట్ర విభజన తర్వాత రిఫర్ చేసే అవకాశం లేదు. దీంతో విజయవాడలో సూపర్స్పెషాలిటీ సేవలు అందించేలా అత్యాధునిక సౌకర్యాలతో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని భావించినా, అది కార్యరూపం దాల్చడం లేదు. దీంతో చందాదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. కార్మికులు ఈఎస్ఐ ద్వారా నాణ్యమైన వైద్యసేవలు ఉచి తంగా పొందొచ్చని భావిస్తారు. కానీ విజయవాడలో ఈఎస్ఐ ఆస్పత్రి తాత్కాలిక భవనాల్లో నిర్వహించడంతో, శస్త్ర చికిత్స అంటే ప్రైవే టుకు రిఫర్ చేస్తున్నారు. అక్కడ ఎంతో కొంత డబ్బులు చెల్లించుకోవాల్సిన వస్తోందని పలువురు చందా దారులు చెబుతున్నారు. విజయవాడలో ఈఎస్ఐ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి కలగానే మిగిలింది. ఇప్పటికై నా పాలకులు ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణంపై దృష్టి పెట్టాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ వైద్య విభాగం -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.46 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. మహామండపం ఆరో అంతస్తులో కానుకలను బుధవారం లెక్కించారు. 16 రోజులకు రూ.3,46,08,014 నగదు లభించినట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. 280 గ్రాముల బంగారం, 4.300 కిలోల వెండి, 905 యూఎస్ఏ డాలర్లు, 35 ఆస్ట్రేలియా డాలర్లు, 140 యూఏఈ దిర్హమ్స్, 870 కెనడా డాలర్లు, 100 సౌత్ ఆఫ్రికా ఫౌండ్లు, 800 కెన్యా షిల్లాంగ్స్, రెండు వేల ఇండోనే షియా రుపియాలు, లక్ష వియాత్నం డాంగ్లతో పాటు ఇతర దేశాలకు చెందిన కరెన్సీ లభించిందని తెలిపారు. కానుకల లెక్కింపును ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఏసీ రంగారావు, డీఈఓ కిషోర్కుమార్, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. జిమ్ ట్రైనర్ అరెస్టు సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): విజయవాడలో దళిత యువతిపై లైంగికదాడికి పాల్పడిన జిమ్ ట్రైనర్ అబ్దుల్ఖాదర్ను సత్యనారాయణపురం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాక్ ఫిట్నెస్ వరల్డ్ జిమ్ సెంటర్లో నిందితుడు అబ్దుల్ఖాదర్ ట్రైనర్గా పని చేస్తున్నాడు. జిమ్కు వచ్చే యువతిని మాయమాటలతో నమ్మించి మత్తు మందు ఇచ్చి ఆమైపె పలుమార్లు లైంగిక దాడికి పాడ్డాడు. అంతే కాదు ఆమె నగ్న ఫొటోలు, వీడియోలు తీసి వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు దోచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అబ్దుల్ ఖాదర్ బుధవారం దేవీనగర్లోని తన ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందటంతో అరెస్టు చేశారు. గంపలగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే అదనపు భవనాల నిర్మాణ, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గంపలగూడెం మండలం వినగడప జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం ఆయన తనిఖీచేశారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఫలితాల సాధనకు కృషిచేసిన ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. పాఠశాలకు ఆటస్థలం లేకపోవడం, రోడ్డుకు ఇరువైపులా తరగతి గదులు ఉడటంతో ఇబ్బందికరంగా ఉందని హెచ్ఎం రవికిరణ్ కలెక్టరు దృష్టికి తెచ్చారు. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మధుసూదనరావు, తహసీల్దారు రాజకుమారి పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ రైతులకు నష్టం చేకూర్చే ఏ విధమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపైనా మోదీ నేతృత్వంలోని కేంద్రం సంతకం చేయకూడదని రైతు సంఘాల సమన్వయ సమితి డిమాండ్ చేసింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో బుధవారం ధర్నా జరి గింది. రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై. కేశవరావు మాట్లాడుతూ.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశ రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో మామిడి, పొగాకు, ఆక్వా, పౌల్ట్రీ రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందరావు, రైతు, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026పట్టణాలు, గ్రామాలను వేధిస్తున్న తాగునీటి కొరత 7బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు బుధవారం విరాళాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారికి బుధవారం అమ్మవారి సేవకురాలు పాపమాంబ వంశీకులైన ఆలయ అర్చకులు సారె సమర్పించి బోనాలు చెల్లించారు.డీఆర్ఎం మోహిత్ సోనాకియా రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది రోజువారీ విధుల్లో హిందీ తప్పనిసరి అని డీఆర్ఎం మోహిత్ సోనాకియా పేర్కొన్నారు. రైల్వే ఆడిటోరియంలో పట్టణ అధికార భాష అమలు కమిటీ (టీఓఎల్ఐసీ) సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా టీఓఎల్ఐసీ చైర్మన్, డీఆర్ఎం మోహిత్ సోనా కియా హిందీ ప్రాముఖ్యత, అమలు కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుత కాలంలో హిందీ నేర్చుకోవడం గతం కంటే చాల సులభమని సూచించారు. ఇటు వంటి కార్యక్రమాలు, పోటీలు అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీ వినియోగాన్ని పెంచేందుకు దోహదపడతాయని వివరించారు. రాజభాష అమలులో ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు డివిజన్ నిరంతరం కృషిచేస్తూనే ఉంటుందని తెలిపారు. ఏడీఆర్ఎం పి.ఇ.ఎడ్విన్ మాట్లాడుతూ.. టీఓఎల్ఐసీ సమావేశంలో అన్ని విభాగాలు చురుగ్గా పాల్గొనడం అభినందనీయ మన్నారు. అధికార భాష అమలు, ప్రచారం కోసం రైల్వే చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. అనంతరం సీనియర్ రాజభాష అధికారి హేమంత్ వాడేకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డివిజన్లో రాజభాష అమలు పురోగతిని వివరించారు. అనంతరం గత మార్చి పది నుంచి 12వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించిన హిందీ ఉపన్యాసం, వ్యాస రచన, కవితా పఠనం, డ్రాఫ్టింగ్, వార్త పఠనం, క్విజ్, అంత్యా క్షరి పోటీల్లో 45 కేంద్ర ప్రభుత్వ క్యాలయాలకు చెందిన 276 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొనగా 63 మంది విజేతలకు డీఆర్ఎం చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.సాక్షి, విజయవాడ: తాగునీటి సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమస్య తీవ్రరూపం దాలుస్తున్నా పాలకులు, అధికారుల్లో చలనం రావడంలేదు. పంచాయతీలు, మునిసిపాలిటీ, నగరపాలక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థలు అధికారుల ఏలుబడిలోకి వెళ్లాయి. ప్రత్యేక అధికారుల పాలనలో తాగునీటి సమస్య జటిలంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ముఖ్య నగరమైన విజయవాడలో తాగునీటి సరఫరా కోసం ఏటా రూ.58 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారు. అయినా స్వచ్ఛమైన నీరు అందడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తాగునీరు కలుషితమైన కుళాయి నీటిని తాగి గిరిపు రంలో పలువురు స్థానికులు డయేరియా బారినపడ్డారు. గతేడాది సెప్టెంబర్లో న్యూరాజరాజేశ్వరి పేటలో నీరు 100 మందికి పైగా అతిసారం బారిన పడగా ఇద్దరు మృతి చెందారు. అయినా కార్పొరేషన్ నిర్లక్ష్యం వీడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా అంతటా అదే సమస్య ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరపాలక సంస్థ, నాలుగు మునిసిపాలిటీలు, 321 పంచాయతీలు ఉన్నాయి. సుమారు 22.18 లక్షల మంది నివసిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్ర మైంది. జగయ్యపేట 29వ వార్డు ట్రెజరీ కార్యా లయం రోడ్డు పక్కన 15 రోజులుగా నీరు రావడం లేదు. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆర్టీసీ కాలనీకి వెళ్లే మెయిన్ పైపులైన్ ఎనిమిది చోట్ల లీకవుతోంది. రెండేళ్లుగా మరమ్మతులు చేయాలని కోరుతున్నా అధికారులకు పట్టడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నందిగామలో రెండు, మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. తిరువూరులో వారానికి ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. మైలవరం నియోజవర్గంలోని మైలవరం, జి.కొండూరు మండలాలు, తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట, ఎ.కొండూరు మండలాలు, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలంలో తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు. కృష్ణా జిల్లాలో మరింత దుర్భరం కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కార్పొరేషన్తో పాటు గుడివాడ, పెడన, ఉయ్యూరు, తాడిగడప మునిసిపాలిటీలు, 502 గ్రామాల్లో 17.35 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతోపాటు గుడివాడ, పెడనలో రోజు మార్చి రోజు తాగునీటి సరఫరా జరుగుతోంది. కృత్తివెన్ను మండలంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. గ్రామాల్లో గృహ అవసరాలకు వినియోగించే నీరు నెలలో రెండు లేదా మూడుసార్లకు మించి సరఫరా కావడం లేదు. ఇటీవల కృత్తివెన్ను పంచాయతీ పల్లెపాలెంలో కుళాయిల ద్వారా రంగు మారి కలుషిత నీరు సరఫరా కావడంతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, డీఈ గ్రామంలో పర్యటించారు. ఇంతేరు నుంచి చిన్న గొల్లపాళెం వరకు సముద్ర తీరం ప్రాంతం కావడంతో తాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బంటుమిల్లి మండలంలో కూడా ఇదే పరి స్థితి. ముఖ్యంగా చోరంపూడి, మల్లంపూడి గ్రామాల్లో తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు చుట్టపు చూపులా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు తప్పా క్షేత్రస్థాయిలో తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎవరైనా నోరెత్తి సమస్య చెబితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండడంతో తాగునీటి సమస్య చెప్పడానికి కూడా జనం భయపడుతున్నారు. కృత్తివెన్ను మండలంలో తాగునీరు కలుషితం అవుతోంది. కలుషిత నీటివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృత్తివెన్ను పల్లిపాలెం గ్రామస్తులు నీరు దుర్వాసన వస్తోందని, పచ్చగా ఉంటోందని చెబితే వెళ్లాను. ఆ నీటిని తాగినా, స్నానాలు చేసినా రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామంలో పర్యటించాక కొంతమేర సమస్య తగ్గింది. – మైల రత్నకుమారి, జెడ్పీటీసీ సభ్యురాలు, కృత్తివెన్ను మాకు కృష్ణా వాటర్ వారంలో రెండు రోజులు మాత్రమే వస్తోంది. అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బంది పడుతున్నాం. తాగడానికి నీరు లేక మినరల్ వాటర్ తెచ్చుకోవాల్సి వస్తోంది. ఎండాకాలం పోయినా తాగు నీటి కష్టాలు తప్పడం లేదు. పైపులైన్లు బాగు చేసినప్పటికీ నీటి సమస్య తీరడం లేదంటే సమస్య ఎక్కడ ఉందో అధికారులే చెప్పాలి. – రమావతు శ్రీను, మునగపాడు గ్రామం జి.కొండూరు మండలం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారుల రికార్డుల ప్రకారం 7,846 చేతి పంపులున్నాయి. తాగు నీటి సమస్య పరిష్కారమంటూ ఏకంగా 7,746 పంపులకు మరమ్మతులు చేయించామని అధికా రులు రికార్డుల్లో చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో నాలుగు వేల పంపులు కూడా పని చేయడం లేదు. చేతిపంపుల మరమ్మతుల పేరిట నందిగామ, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో పంచాయతీ కార్యదర్శులు నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 29.3200 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 400 క్యూసెక్కులు వదులుతున్నారు. -
పోషకాహార లోపం.. గర్భిణులకు శాపం
● గర్భం దాల్చిన తర్వాత మహిళలకు అందని సరైన పోషకాహారం ● రక్తహీనత బారిన పడి హైరిస్క్ ప్రెగ్నెన్సీగా మారుతున్న వైనం ● జీజీహెచ్కి వచ్చే గర్భిణుల్లో అత్యధికులు రక్తహీనత ఉన్న వారే ● గర్భిణులకు సంపూర్ణ పోషణ కిట్ అందించిన గత ప్రభుత్వం లబ్బీపేట(విజయవాడతూర్పు): గర్భిణులకు పోషకాహార లోపం శాపంగా మారుతోంది. పోషకాహారం తీసుకోని వారికి ప్రసవం సమయంలో హైరిస్క్గా మారి తల్లీబిడ్డల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది. గర్భం దాల్చిన పేద మహిళలకు పోషకాహారం అందించాల్సిన ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతోంది. దీంతో ప్రభుత్వాస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే మహిళల్లో సగం మందిలో రక్తహీనత సమస్య ఉంటోంది. హిమోగ్లోబిన్ 9 గ్రాములకంటే తక్కువగా ఉన్న వారే ఎక్కువగా ఉంటున్నారు. హెచ్బీ 3,4 గ్రాముల శాతం ఉన్న వారు కూడా రిఫరల్ కేసులుగా వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. వారికి ప్రసవం చేయడం అత్యంత క్లిష్టతరంగా మారిందని వివరిస్తున్నారు. గత ప్రభుత్వంలో అందించిన సంపూర్ణ పోషకాహారం కిట్లు ఇప్పుడు అందడం లేదని గర్భిణులు ఆరోపిస్తున్నారు. రక్తహీనత ఇలా.. విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)కి ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి గర్భిణులు కాన్పుల కోసం వస్తుంటారు. ఇక్కడ ప్రతి నెలా వెయ్యికి పైగా ప్రసవాలు చేస్తుంటారు. ఇక్కడకు వచ్చే వారిలో రక్తహీనత లోపం ఉన్న వారే ఎక్కువగా ఉంటున్నారు. హిమోగ్లోబిన్ పది గ్రాముల శాతం కంటే తక్కువ ఉంటే రక్తహీనతగా, ఏడు గ్రాములు అంతకంటే తక్కువ ఉంటే తీవ్రమైన రక్తహీనతగా పరిగణిస్తారు. జీజీహెచ్కు వచ్చే వారిలో ప్రతి వంద మందిలో పది గ్రాముల శాతం కంటే ఎక్కువ ఉన్న వారు 15 మంది, 8,9 గ్రాముల శాతం ఉన్న వారు 25 మంది, 7, 8 గ్రాముల శాతం ఉన్న వారు 45 మంది, ఆరు గ్రాముల కంటే తక్కువగా ఉన్న వారు 15 మంది ఉంటున్నారు. వీరిలో హిమోగ్లోబిన్ 9 గ్రాముల కంటే తక్కువ ఉన్న వారికి ప్రసవం రిస్క్ ఉంటుంది. ఆరు గ్రాముల శాతం కంటే తక్కువ ఉన్న వారికి హైరిస్క్ ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రిఫరల్ వచ్చిన వారిలో నాలుగు గ్రాములు ఉన్న వారిని కూడా చూస్తున్నామని వైద్యులు అంటున్నారు. అలాంటి వారికి రెండు, మూడు యూనిట్ల రక్తం ఎక్కిస్తున్నారు. తల్లీబిడ్డలకు సమస్యలు రక్తహీనత కారణంగా గర్భిణుల్లో అలసట, బలహీనత, దడ, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు తలెత్తుతాయని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా నెలలు నిండకుండా ప్రసవం జరగడంతో ప్రీటామ్ బేబీలు పుట్టడం, నెలలు నిండినా శిశువు తక్కువ బరువు ఉండటం, ప్రసవ సమయంలో రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో మాతా శిశు మరణాలకు దారితీసే ప్రమాదం ఉంటోంది. సమన్వయ లోపం వైద్య ఆరోగ్యశాఖ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా గర్భిణులకు పోషకాహారం సక్రమంగా అందడం లేదు. ఇటీవల జిల్లాలో గర్భిణులకు పోషకాహాం అందించే విషయంలో వైద్యశాఖ మ్యాపింగ్ చేయక పోవడంతో అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఒక్కోసారి గర్భిణులకు శాపంగా మారుతోంది. గర్భిణికి పోషకాహారంతో పాటు, వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. ఇలా ఉమ్మడి కృష్ణాజిల్లాలో అనేక ప్రాంతాల్లో నెలకొంది. శాఖల మధ్య సమన్వయ లోపం మహిళలకు శాపంలా మారుతోంది. పోషకాహారం అందించే విషయమై ఐసీడీఎస్ జిల్లా అధికారిణి వివరణ కోరేందుకు సంప్రదించగా స్పందించలేదు. పోషకాహార లోపం నివారణ నినాదం ప్రభుత్వ ప్రకటనలకే పరిమితం అవుతోంది. పేద గర్భిణులకు పోషకాహారం అందించడం అందని ద్రాక్షాగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వంలో గర్భం దాల్చిన మహిళలకు సంపూర్ణ పోషకాహార కిట్లను అందించే వారు. అందులో భాగంగా పాలు, కందిపప్పు, చిక్కీ, నూనె, బియ్యం, కోడిగుడ్లు వంటివి అందేవి. ఇప్పుడు రేషన్ బియ్యం, పుచ్చిపోయిన కందిపప్పు, రాళ్లు ఉన్న రాగిపిండి వంటివి ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో గర్భిణుల్లో రక్తహీనత సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. -
న్యాయం కోరి వస్తే.. వారిపైనే కేసులా?
కృష్ణాజిల్లా ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ ఘాటు లేఖ లబ్బీపేట(విజయవాడతూర్పు): పోలీసుల వ్యవహారశైలిని ఎండగడుతూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ కృష్ణాజిల్లా ఎస్పీకి ఘాటు లేఖ రాశారు. జిల్లాలో అమలవుతున్న పోలీసు రాజ్యాంగం కూటమి ప్రభుత్వ పాలనను స్పష్టం చేస్తోందని అందులో పేర్కొన్నారు. మహానీయుడు నందమూరి తారక రామారావు పుట్టిన గడ్డపై ఎందరో ఎస్పీలు గొప్పగా విధులు నిర్వహించారని, కానీ ప్రస్తుత ఎస్పీ పనితీరుతో నిజాయితీ గల పోలీసులు, అధికారులు సైతం మనస్సాక్షిగా పనిచేయలేక పోతున్నామని అంతర్మఽథనం చెందుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా వంటిపై ఖాకీ యూనిఫాం వేసుకుని న్యాయం చేస్తున్నామా అనే దిగులుతో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ఫిర్యాదులు చేసేందుకు వెళితే... నాపై ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెట్టి రాజకీయ గందరగోళం, ప్రజల్లో అశాంతి, వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని అనిల్కుమార్ లేఖలో పేర్కొన్నారు. పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వెళితే న్యాయం చేయక పోగా, పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన వారిపైనే కేసులు పెట్టడం పోలీసు రాజ్యాంగమా అని ఆ లేఖలో ప్రశ్నించారు. కేసులు నాకేమీ కొత్తకాదని, ప్రజల కోసం ఎన్ని కేసులనైనా భరిస్తానని, న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం కానీ, ఇక్కడ ఎస్పీగా మీరు తెరవెనుక ఉండి నడిపించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, సర్వోన్నత న్యాయస్థానాల ఆదేశాలు పోలీసు వ్యవస్థలో ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. కృష్ణా జిలాల్లో ఎస్పీ జమానాలో రాజ్యాంగం అమలు శూన్యమని పేర్కొన్నారు. మేము రాజకీయాల్లోనే ఉన్నామని, చట్టాన్ని చదువుకున్నామని, చట్టాన్ని ఉల్లఘించడం, దౌర్జన్యాలకు దిగడం, తప్పుడు కేసులు పెట్టించడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, వర్గాలను రెచ్చగొట్టడం మేము ఏ రోజూ చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా ఒక్కటే కోరుతున్నామని, పామర్రు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది, అసలు వాస్తవం ఏంటీ, పోలీస్స్టేషన్లలో ఏమి చేస్తున్నారు, చట్టానికి, రాజ్యాంగానికి లోబడి పోలీసు విధులు నిర్వర్తిస్తున్నారా, ఎమ్మెల్యే చెప్పినట్లు ఆడుతున్నారా అనే విషయాలను మనస్సాక్షిగా పరిశీలించాలని కై లే అనిల్కుమార్ ఆ లేఖలో కోరారు. -
మత్స్య సంపద వృద్ధికి చర్యలు
ఎరుకోపాడు(తిరువూరురూరల్): చేపల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. తిరువూరు మండలం ఎరుకోపాడులో ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, మత్స్యకార సహకార సంఘం చేపట్టిన క్యాప్టివ్ ఫీడ్ నర్సరీ చెరువులో చేపల పెంపకాన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. 30 లక్షల చిరు చేపపిల్లలను నీటిలోకి వదలిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1.13 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించామన్నారు. 10 శాతం మనుగడ రేట్ ఆధారంగా లక్ష్యాన్ని చేరుకునేందుకు సుమారు 11 కోట్ల చేప స్పాన్ను నిల్వ చేయాల్సి ఉందని వివరించారు. ఈ కార్యక్రమంతో జిల్లా స్థూల దేశీయోత్పత్తి, స్థూల విలువ జోడింపు వృద్ధి చెందడంతో పాటు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. జిల్లా మత్స్య అధికారి సౌభాగ్య చక్రాణి, ఎఫ్డీఓ బి. తేజస్వి, తిరువూరు తహసీల్దార్ చంద్రమౌళి, ఎంపీడీఓ రవిబాబు, మత్స్యకారుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
జీడీపీ వృద్ధిరేటులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో అత్యధిక జీడీపీ వృద్ధి నమోదు చేసే జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థూల దేశీయోత్పత్తి, మండల అభివృద్ధి ప్రణాళిక అంశాలపై జిల్లా స్థాయి అధికారులకు సామర్థ్య పెంపుపై వర్క్షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.93,112 కోట్లుగా ఉన్న జిల్లా జీడీపీని 2028–29 నాటికి రూ.1.64 లక్షల కోట్లకు పెంచే లక్ష్యంతో అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఏడాది 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేసేలా శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలన్నారు. రంగాల వారీ వృద్ధిరేటును వివరించారు. స్థానిక వనరుల వినియోగం, వివిధ శాఖల సమన్వయం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, డేటా ఆధారిత ప్రణాళికలు, ప్రాక్టికల్ అమలు విధానాలపై పహ్లే ఇండియా ఫౌండేషన్ రూపొందించిన నమూనాలను మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాసన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ జాయింట్ డైరెక్టర్ అనుపమ, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి డీవీ శివరామ ప్రసాద్, మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాసన్, పహ్లే ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఇంద్రగిరిపై భక్తుల సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి కొనసాగుతోంది. దుర్గమ్మకు ఆషాఢ మాస సారె సమర్పించేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు బృందాలు బుధవారం తరలివచ్చి సారె సమర్పించారు. ఎక్కువగా ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలకు చెందిన భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. కనకదుర్గనగర్, మహామండపం మీదుగా కొండపైకి చేరుకుంటున్న భక్తులు రూ. 100 క్యూలైన్లో ఆలయంలోకి చేరుకుని అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో హుండీ లెక్కింపు జరుగుతుండటంతో నూతన పూజా మండపంలో లక్ష కుంకుమార్చన వేదిక వద్ద ఉత్సవమూర్తికి సారెను సమర్పించారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం భక్త బృందాలు తమతో పాటు విచ్చేసిన భక్తులు, కుటుంబ సభ్యులకు పసుపు, కుంకుమతో పాటు సారె సామగ్రికి ఇచ్చిపుచ్చుకున్నారు. బుధవారం సాయంత్రానికి 23 బృందాలుగా సుమారు పది వేల మంది భక్తులు సారె సమర్పించారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలతో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. -
సీదిరిపై కక్షసాధింపు ప్రజాస్వామ్యానికి విరుద్దం
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్ట్ను వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను రాజకీయంగా వేధించేందుకు కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. చట్టం తన పని తాను చేసుకోవాల్సిన సందర్భంలో రాజకీయ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం ద్వారా ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుంచి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష గొంతును అణచి వేయాలనే ప్రయత్నాలు ఎంత చేసినా వైఎస్సార్ సీపీ ప్రజల తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుందని, ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని దేవినేని అవినాష్ అన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై తీసుకున్న చర్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకుని, రాజకీయ వేధింపులకు స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు. -
దుర్గమ్మకు ఉత్తరాంధ్ర సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఉత్తరాంధ్ర సంప్రదాయంలో మూడు వందల మంది భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. విజయనగరానికి చెందిన మూడు వందల మందికి పైగా భక్తులు తమ సొంత ఖర్చులతో 5 బస్సులను ఏర్పాటు చేసుకుని మంగళవారం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఉత్తరాంధ్రలో పుట్టింటి నుంచి అత్త ఇంటికి వెళ్లే ఆడపిల్లకు ఇచ్చే విధంగా వెదురు బుట్టలలో అరిసెలు, చక్రాలు, నాడూలు, పంచదార చిలకలు, చెక్క భరిణెలలో పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, గాజులు, పూలతో పాటు పట్టుచీరలను భక్తులు అమ్మవారికి సమర్పించారు. వీరికి ఆలయ ఈవో శీనానాయక్ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయడంతో పాటు మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద ప్రత్యేక పూజలతో పాటు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మహా మండపం రెండో అంతస్తులో వారికి ప్రత్యేక భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఏటా తమ కుటుంబాల తరఫున అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు పేర్కొన్నారు. కొనసాగుతున్న సారె సమర్పణలు.. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు, భక్త బృందాలు ఆషాఢ సారెను సమర్పించాయి. మంగళవారం అయినా సారె సమర్పించే భక్తులతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపించింది. 7వ రోజైన మంగళవారం సాయంత్రానికి 35కు పైగా బృందాలు సారె సమర్పించాయి. సదరు బృందాలతో పాటు మొత్తంగా పది వేలకు మందికి పైగా భక్తులు అమ్మవారికి సారె సమర్పించిన వారిలో ఉన్నారు. -
మహిళల భద్రతను గాలికొదిలేశారు
భవానీపురం(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళల రక్షణను గాలికి వదిలేసిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి కొంత మంది హిజ్రాలతో కలిసి ఒక మహిళపై దాడి చేసి వివస్త్రను చేసినందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దగల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. పవన్ ఎక్కడ ఉన్నారు? వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మేయర్ రాయన భ్యాలక్ష్మి మాట్లాడుతూ లంచం ఇవ్వకపోతే మహిళలను వివస్త్ర చేసి, హత్యాయత్నం చేసే కొత్త సంస్కృతికి టీడీపీ శ్రీకారం చుట్టిందన్నారు. నడి రోడ్డులో ఆ మహిళకు జరిగిన అవమానాన్ని చంద్రబాబు, హోం మంత్రి అనిత పూడ్చగలరా అని నిలదీశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పే వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదంటే పోలీస్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. గుంటూరు ఘటనకు సంబంధించి మహిళను పరామర్శించాల్సిన మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ వీడియోలు ఎలా బయటకు వచ్చాయని ఆరా తీయడం ఆడతనానికే మాయని మచ్చ అన్నారు. ఎమ్మెల్సీ కల్యాణి మాట్లాడుతూ మైలవరంలో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ మహిళపై దాడి చేశారని, నెల్లూరులో గిరిజన మహిళపై దాడి చేశారని, చంద్రబాబు సొంత జిల్లాలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి హింసించారని ఇలా రాష్ట్రంలో మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా హోం మంత్రి ఎక్కడ దాక్కున్నారని మండిపడ్డారు. సినీ నటి జత్వాని విషయంలో కూటమి ప్రభుత్వం ఎస్కార్ట్ ఇచ్చి మరీ రాచమర్యాదలు చేసిందని, ఇది సరి కాదని ఆనాడే చెప్పామని, తాము చెప్పిందే ఈ రోజు నిజమైందని తెలిపారు. గుంటూరు ఘటనపై స్పందించని హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
డీఎంహెచ్ఓకు వినతి
మచిలీపట్నం అర్బన్: కృష్ణా జిల్లా నూతన వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి. లోకనాథ్ దయాకర్ను ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొకినాల సౌమ్యరేఖ పలువురు స్టాఫ్ నర్సులతో కలిసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, 100 శాతం గ్రాస్ వేతనం అమలు, ఈఎస్ఐ వంటి సంక్షేమ సౌకర్యాల కల్పన, కనీస వేతనాల పెంపు, బదిలీల్లో పారదర్శకత, రిక్వెస్ట్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని కోరారు. అలాగే పీహెచ్సీలు, సీహెచ్సీల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సిబ్బంది కొరత, పని ఒత్తిడి తదితర సమస్యలను డీఎంహెచ్వో దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలపై చర్యలు తీసుకుంటానని, మిగిలిన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని డీఎంహెచ్వో హామీ ఇచ్చారు. ‘తల్లికి వందనం’ లబ్ధిదారుల జాబితా ప్రదర్శన గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘తల్లికి వందనం‘ పథకానికి సంబంధించి అర్హుల, అనర్హుల జాబితా, పరిశీలనలో ఉన్న లబ్ధిదారుల జాబితాలు జూలై 22 నుంచి జిల్లాలోని ప్రతి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం ప్రదర్శించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ పేరు జాబితాలో లేకపోవడం, వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లు ఉండటం, అనర్హుల జాబితాలో పేరు ఉండటం లేదా ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉన్నట్లయితే, సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించి ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చన్నారు. ఫిర్యా దులను జూలై 22 మధ్యాహ్నం నుంచి స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు తమ అభ్యంతరాలు, సమస్యలను నిర్ణీత గడువులోగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదును ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాల ప్రకారం పూర్తిస్థాయిలో పరిశీలించి, అవసరమైన సవరణలు చేసి అర్హులైన వారికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం అర్హులైన తల్లులు 1,59,812 మంది, పిల్లలు 2,44,614 మంది ఉన్నట్లు వివరించారు. డయేరియా, కోవిడ్పై అప్రమత్తంగా ఉండాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): వర్షాకాలం ప్రారంభం కావడంతో డయేరియాపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఏ శ్రావణ్బాబు అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసి, జాగ్రత్తలు పాటించేలా చూడాలని ఆయన సూచించారు. ఆయన మంగళవారం నగరంలో గతంలో డయేరియా సోకిన ప్రాంతాల్లోని న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, గిరిపురం యూపీహెచ్సీలను సందర్శించారు. అక్కడ సిబ్బంది హాజరును పరిశీలించి, పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా అనుమానిత కేసులు, ముఖ్యమైన పరిణామాలు ఉంటే వెంటనే తమ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలన్నారు. రోజువారీ రోగులకు అందించే సేవలను యూపీహెచ్సీల్లో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమష్టి గా కృషి చేస్తామని, మంత్రుల బృందం సమక్షంలో జరిగే స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల గళాన్ని బలంగా వినిపిస్తామని ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ తెలిపారు. అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ఆయన్ని మంగళవారం విజయవాడ లోని ఎన్జీవో హోమ్లో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు డి. సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి పి. రమేష్ పాల్గొన్నారు. -
గ్రామాలపై సైబర్ వల!
ప్రభుత్వ పథకాల పేరుతో మాయాజాలంజి.కొండూరు: ఎలక్ట్రానిక్ డివైజ్లు ఉచితం, ఫోన్ డేటా రీచార్జ్ ఉచితం, ఇన్సూరెన్స్లు ఉచితం అనగానే ఎగబడి వెబ్ లింక్లను నొక్కేస్తున్నారు. అంతే సైబర్ నేరగాళ్లు ఫోన్లలోకి చొరబడి డేటా చోరీ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలలో ఉన్న నగదును మాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ తరహా దందా గ్రామీణ ప్రాంతాల్లోకి చొరబడింది. గ్రామీణ యువతను టార్గెట్ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడడం కలవరానికి గురి చేస్తోంది. అందుబాటులోని ఆధునిక టెక్నాలజీని సరైన పద్ధతిలో వినియోగించకపోతే మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందనడానికి సైబర్ మోసాలే నిదర్శనమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకేరోజు రెండు కేసులు.. మైలవరం పోలీసు డివిజన్ పరిధిలోని జి.కొండూరు, రెడ్డిగూడెం మండలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని స్వల్ప మొత్తంలో నగదును కోల్పోయి మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. గతంలో జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన ముగ్గురు సంక్షేమ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో చిక్కుకొని నష్టపోయారు. సైబర్ నేరాలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నాం. ఉచితం అని ప్రకటనలు రాగానే ఆశపడి మోసపోతున్నారు. వాట్సాప్, పేస్బుక్, ఇన్స్టా, సాధారణ మెసేజ్ల ద్వారా వచ్చే వెబ్ లింక్లను అస్సలు టచ్ చేయవద్దు. ప్రభుత్వ పథకాల పేరుతో రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రోసెసింగ్ ఫీజు చెల్లించాలి అంటే స్పందించవద్దు. ప్రభుత్వ పథకాల వివరాలను అధికారిక వెబ్సైట్లు, సంబంధిత కార్యాలయాల ద్వారానే తెలుసుకోవాలి. తెలియని వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు, యూపీఐలకు డబ్బులు పంపవద్దు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయడం లేదా సమీపంలోని పోలీసు స్టేషన్ను సంప్రదించాలి. – సతీష్కుమార్, ఎస్ఐ, జి.కొండూరు సైబర్ నేరగాళ్లు తల్లికి వందనం పథకం అమలును ఆసరాగా చేసుకొని గతేడాది భారీగా మోసాలకు పాల్పడ్డారు. గతేడాది ప్రభుత్వం తల్లికి వందనం నగదు జమ చేసిన జూన్ 12వ తేదీని సైబర్ నేరగాళ్లు నేరం చేసేందుకు అనువుగా ఎంచుకున్నారు. అనుకున్న ప్రకారం ముందుగా జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన గతంలో గ్రామ వలంటీర్లుగా పని చేసిన వారికి ఫోన్ చేసి మిమ్మల్ని మరలా గ్రామ వలంటీర్లుగా తీసుకుంటున్నామని, ఎక్కువ జీతం కూడా వస్తుంది అని నమ్మ బలికారు. వారి దగ్గర గతంలో అమ్మ ఒడి పొందిన లబ్ధిదారుల పేర్లు, ఫోన్ నంబర్లు ఇవ్వాలంటూ అడిగారు. దీనితో సదరు మాజీ గ్రామ వలంటీర్లు వారి దగ్గర ఉన్న పేర్లు, ఫోన్ నంబర్లను ఇచ్చారు. వారిలో తల్లికి వందనం పెండింగ్లో ఉన్న వారిని మోసానికి అనువుగా ఎంచుకున్నారు. వారితో ఫోన్లో మాట్లాడి.. పెండింగ్లో నగదు మీ ఖాతాలలో జమ కావాలంటే కొంత అమౌంట్ మీరు ఫలానా ఖాతాలో జమ చేయాలని చెప్పి ముగ్గురు నుంచి రూ.44వేలు కాజేసి ఉడాయించారు. ముగ్గురు బాధితులు మోసపోయామని తెలుసుకొని పోలీసులను సంప్రదించారు. ఇప్పుడు తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో తల్లులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి
సబ్జపాడు(మైలవరం): గ్రామంలో జరిగిన ఒక శుభకార్యం వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదంలో టీడీపీ నాయకులు మూకుమ్మడిగా వెళ్లి వైఎస్సార్ సీపీ కార్యకర్తల కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. వివరా ల్లోకి వెళ్తే... మైలవరం మండలం చండ్రగూడెం శివారు సబ్జపాడు గ్రామంలో సోమవారం ఉదయం ఒక శుభకార్యం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్ సీపీ కార్యకర్త నిమ్మకూరు రాజేష్కు, టీడీపీ నాయకుడు బండారు నాగరాజుకు మధ్య వివాదం జరిగింది. ఇద్దరి మధ్య తోపులాట జరగ్గా గ్రామస్తులు సర్దిచెప్పి పంపారు. ఆ తర్వాత మధ్యాహ్నం బండారు నాగరాజు మరో టీడీపీ నాయకుడు తాళ్లూరు రమేష్, తాళ్లూరు మధు, తాళ్లూరు నరేంద్ర, బండారు జయరాజు, బండారు కోటేసులతో కలిసి వైఎస్సార్ సీపీ కార్యకర్త నిమ్మకూరు రాజేష్ కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో రాజేష్తో పాటు నిమ్మకూరు రోస్కిరణ్, నిమ్మకూరు వినోద్కుమార్, నిమ్మకూరు మౌనికకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని మైలవరం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుల స్టేట్మెంట్ను రికార్డు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితులు వినోద్కుమార్, మౌనిక మాట్లాడుతూ దాడి చేసిన వ్యక్తులు మైలవరం పోలీసుస్టేషన్ వద్ద కూడా తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే రాళ్లు, కర్రలతో తమపై దాడికి తెగబడ్డారన్నారు. ప్రభుత్వం తమదేనన్న అహంకారంతోనే మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా తాకుతూ దాడి చేశారని వాపోయారు. ఇదిలా ఉండగా దాడి చేసిన టీడీపీ నాయకులు కూడా బాధితులపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. -
రావణ్ పోలీస్ కస్టడీ పిటీషన్పై కౌంటర్ దాఖలు
గన్నవరం: యూ ట్యూబర్ ప్రశ్న రావణ్ కస్టడీ కోరుతూ గన్నవరం కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటీషన్పై అతని తరఫున న్యాయవాదులు సోమవారం కౌంటర్ దాఖలు చేశారు. ఉపా తదితర సెక్షన్ల కింద నమోదైన కేసులో ప్రశ్న రావణ్ ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. అతనిని 15 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఇటీవల గన్నవరం పోలీసులు స్థానిక 12వ అదనపు ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రావణ్ తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాది తిరివీధి వెంకయ్య కౌంటర్ దాఖలు చేశారు. దీంతో కస్టడీ పిటీషన్పై విచారణను కోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. కుటుంబ మనస్పర్థలతో వ్యక్తి ఆత్మహత్య సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్): రైల్వేస్టేషన్ సమీపంలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై ఎస్ఎన్పురం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం దెబ్రత చౌదరి(39) భార్య, కుమార్తెతో కలసి పశ్చిమబెంగాల్ రాష్ట్రం పార్గాణాస్ జిల్లాలోని సెరబేరియా గ్రామంలో నివాసముంటున్నాడు. కుటుంబంలో మనస్పర్థల కారణంగా అతను ఇల్లు విడిచి విజయవాడ చేరుకుని తాపీ పనులు చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవల రైల్వేస్టేషన్ ఎదుట నిర్మాణంలో ఉన్న భవనంలో తాపీ పనులు చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తాను పనిచేసే ప్రాంతంలోనే ఇనుప స్తంభానికి తాడుతో ఉరి వేసుకుని మృతిచెందాడు. చుట్టుపక్కల వారు చూసి కిందికి దింపగా అప్పటికే మృతిచెందాడు. సైట్ ఇంజినీర్ వేముల కాళీప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ మనస్పర్థల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎయిర్పోర్ట్లో పవన్కళ్యాణ్కు స్వాగతం గన్నవరం: శస్త్రచికిత్స అనంతరం డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సోమవారం రాష్ట్రానికి విచ్చేశారు. తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పలువురు అధికారులు, జనసేన పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. -
బైక్ మెకానిక్ చోర ప్రావీణ్యం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): వారంతా 20 ఏళ్ల లోపు యువకులే... తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే... వారికి మాత్రం ఖరీదైన, హైస్పీడ్ మోటార్ బైక్లను నడపాలని ఆశ... కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం చేసేలోగా తమ కలలు తీర్చుకోవాలంటే చాలా సమయం పడుతుందనుకున్నారేమో... స్నేహితులందరూ చదువును మధ్యలోనే ఆపేసి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో బైక్ మెకానిక్గా పని చేసిన స్నేహితుడి సాయంతో ఖరీదైన బైక్లను చోరీలకు పాల్పడి వాటితో జల్సాలు చేయడం, బైక్లపై స్టంట్లు చేసి రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయసాగారు. అయితే సోమవారం పోలీసుల తనిఖీలలో వారి గుట్టు బయట పడింది. నిందితుల నుంచి రూ.7 లక్షల విలువైన నాలుగు బైక్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. కొత్తపేట సీఐ కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన బాణావత్తు హనుమంతు(20) 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత స్కూల్కు వెళ్లకుండా బైక్ మెకానిక్ షెడ్లో పని చేశాడు. కొంత కాలం పనిచేసిన తర్వాత సొంతంగా షెడ్డు పెట్టుకుని జీవించాలనుకున్నాడు. బైక్ మెకానిక్ షాపులో డబ్బులు అంతంత మాత్రంగా వస్తుండటంతో మామిడి తోటల్లో పని చేసేవాడు. అయితే అక్కడ వచ్చిన డబ్బులు కూడా జల్సాలకు సరిపోకపోవడంతో ఎలా అయినా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలని భావించాడు. బైక్ రిపేరు పరిజ్ఞానాన్ని వినియోగించి... విజయవాడ కొత్తపేట, భవానీపురం ప్రాంతాలకు వచ్చి రెక్కీ నిర్వహించాడు. ఇంటి ముందు నిలిపి ఉన్న ఖరీదైన ద్విచక్ర వాహనాలను గుర్తించేవాడు. బైక్ హ్యాండిల్ లాక్ విరగొట్టి తనకు ఉన్న మెకానిక్ పరిజ్ఞానంతో వైర్లను కలిసి బైక్ ఇంజన్ స్టార్ట్ చేసేవాడు. అలా చోరీ చేసిన బైక్లను తన స్నేహితులైన మైలవరానికి చెందిన వేముల మణికంఠ(20), పత్తిపాటి చిట్టిబాబు(19), ఇస్లావత్ దినేష్(19)లకు ఇచ్చేవాడు. చోరీ చేసిన బైక్లతో స్టంట్ చేయడం, హైస్పీడ్గా వెళుతూ వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని నిర్ణయించుకుని నాలుగు బైక్లను చోరీలకు పాల్పడ్డాడు. చోరీ చేసిన బైక్లను స్నేహితులు నలుగురు వినియోగించసాగారు. పోలీసుల తనిఖీలలో పట్టుబడి... కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాముల కాల్వ వద్ద క్రైం ఎస్ఐ హరిప్రసాద్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హనుమంత్ స్నేహితులు బైక్లపై పాముల కాల్వ వైపు వస్తుండటం, అదే సమయంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండటంతో నలుగురు బైక్లను వెనక్కి తిప్పారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి వారిని వెంబడించి వాహనాల రికార్డులపై ఆరా తీశారు. అయితే వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో స్టేషన్కు తరలించి విచారించడంతో చోరీల బాగోతం బయటపడింది. నిందితులపై కేసు నమోదు చేసి వారి నుంచి రూ.7లక్షల విలువైన నాలుగు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
10 మంది రైతుల భూములకు 22ఏ నుంచి విముక్తి
కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిషేధిత భూముల (22–ఏ) జాబితాలో పొరపాటున నమోదైన భూములకు సంబంధించి పట్టాదారులకు సత్వర న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ప్రతి దరఖాస్తును పారదర్శకంగా, చట్టబద్ధంగా, వేగవంతంగా పరిశీలిస్తూ 22(ఏ) కేసుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. 22ఏ నుంచి తొలగించి భూ యాజమాన్య హక్కుల పునరుద్ధరణకు సంబంధించి సోమవారం కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ 10 మంది భూ యజమానులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 22(ఏ) కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు పరిష్కారమైన కేసులకు సంబంధించి అర్జీదారులకు పత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. గత మూడు నెలల కాలంలోనే 62 ఎకరాలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు తెలిపారు. చెస్లో జిల్లా క్రీడాకారులకు బంగారు పతకాలు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ పి.రేణుక ఉమెన్ క్యాటగిరీలో 4.5 పాయింట్లు సాధించి బెస్ట్ ఉమెన్ ప్లేయర్ అవార్డుతో పాటు ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిందని ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ పాషా చెప్పారు. స్థానిక చుట్టుగుంటలోని ఎస్ఆర్ఆర్ చెస్ అకాడమీ ఆవరణలో పతకాలు పొందిన క్రీడాకారులను సోమవారం ఆయన అభినందించారు. ఈ నెల 18, 19 తేదీల్లో నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో బాలికల అండర్ –7 కేటగిరిలో గోలి అతిథి శ్రేయ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుందన్నారు. చెస్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులతో పాటుగా చెస్ క్రీడాకారులు పాల్గొని పతకాలు పొందిన రేణుక, గోలి అతిథి శ్రేయలను అభినందించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026ఖరీఫ్ సీజన్ మొదలైనా రైతులకు రాయితీపై అందని వ్యవసాయ యంత్రాలు 7పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 29.440 టీఎంసీలు.దిగువకు సాగునీటి అవసరాల నిమిత్తం 400 క్యూసెక్కులు వదలుతున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మను ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించారు. పెనుగంచిప్రోలు: ఆషాఢం సందర్భంగా పెనుగంచిప్రోలులో వేంచేసిన శ్రీతిరుపతమ్మవారికి సోమ వారం అమ్మవారి పుట్టిన ఊరు అనిగండ్లపాడు మహిళలు సారె సమర్పించారు. -
అర్జీదారులకు భరోసాగా నిలవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో పెండింగ్, పరిష్కరించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఒకసారి పరిష్కారం చూపిన తర్వాత ఫిర్యాదు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి రాకూడదన్నారు. ఆ దిశగా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టంచేశారు. ఫిర్యాదుదారుడు పూర్తిగా సంతృప్తి చెందేలా ఆ పరిష్కారం ఉండాలన్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించలేని పరిస్థితుల్లో అందుకు గల కారణాలను స్పష్టంగా వివరించి అర్జీదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి అర్జీని పూర్తిగా పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి నాణ్యమైన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 251 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. పీజీఆర్ఎస్ సేవలపై క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు తమ ప్రజాభిప్రాయం తెలపా లని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహ, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. శివయ్య చెరువును కాపాడాలని వినతి జి.కొండూరు మండలం, కడిమి పోతవరం గ్రామంలోని శివయ్య చెరువును కబ్జా కోరల నుంచి కాపాడాలని ఆ గ్రామ రైతులు బి.కృష్ణారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు పీజీఆర్ఎస్లో జేసీకి అర్జీ అందజేశారు. మైనింగ్ చేస్తున్న కొందరు చెరువును ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువు ఆక్రమణల కారణంగా తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని, కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
కోలాహలంగా సారె సంబరం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం పలు భక్త బృందాలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రికి చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన భక్త బృందాల రాక సాయంత్రం వరకు కొనసాగింది. సారె సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చిన భక్తులకు రూ.100, రూ.300 క్యూలైన్ల ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ను దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తున్నారు. సారె సమర్పించిన భక్త బృందాలు, భక్తులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా, భక్త బృందంలోని సభ్యులకు పసుపు, కుంకుమ, ప్రసాదాలను ఇచ్చి పుచ్చుకున్నారు. సారె సమర్పించిన భక్తులతో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ అధికారులు మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చారు. -
దళిత మహిళ కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ
జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి హాజరైన కోట సామ్రాజ్యం మచిలీపట్నంఅర్బన్: గన్నవరానికి చెందిన దళిత మహిళ కోట సామ్రాజ్యం కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి అందిన ఫిర్యాదుపై సోమవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లవరపు నవీన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణకు కోట సామ్రాజ్యం, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. విచారణ అనంతరం కోట సామ్రాజ్యం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన కుల ధ్రువీకరణ పత్రాన్ని వివాదాస్పదం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. తన నివాసంపై టీడీపీ నాయకులు దాడి చేసి ఆస్తి ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. తనకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, తాను దళిత మహిళను కాదంటూ జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయించడం విచారకరమన్నారు. ఆ ఫిర్యాదు కారణంగానే జాయింట్ కలెక్టర్ ఎదుట విచారణకు హాజరైనట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జాన్ విక్టర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో దళితులపై వేధింపులు పెరిగాయని ఆరోపించారు. కోట సామ్రాజ్యం ఇంటిపై దాడి చేసి ఆస్తి ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు, దళిత జేఏసీ నాయకులు భూపతి అంబేద్కర్, జక్కుల ఆనంద్, గడిదేశీ రాజు, కొక్కిలిగడ్డ శరత్, బేతపూడి రవి, బాల యేసు తదితరులు పాల్గొన్నారు. -
సాకారమైన క్రిటికల్ కేర్ బ్లాకు
ఫలించిన ముందు చూపు.. లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో చేపట్టిన నిర్మాణాలు ఇప్పుడు ఎంతో ప్రయోజనకరంగా మారుతు న్నాయి. ముఖ్యంగా వైద్య రంగంలో అనేక సంస్కర ణలు చేపట్టారు. అందులో భాగంగా పరిమితిలేని విధంగా నిధులు మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయి. నాడు నిధులు కేటాయించి చేపట్టిన నిర్మాణాలు ఒక్కొక్కటీగా అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో విజయవాడ పాత ఆస్పత్రి ప్రాంగణంలో చేపట్టిన క్రిటికల్ కేర్ విభాగం ఒకటి. దీనిని సుమారు రూ.25 కోట్లతో కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడంతో అక్కడ ఉన్న ప్రసూతి విభాగంలోని గర్భి ణులకు ఎంతో మేలు చేకూరనుంది. నాడు కేంద్ర మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అత్యాధునిక వసతులతో మూడు క్రిటికల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి విజయవాడ పాత ఆస్పత్రి ప్రాంగణంలో ఒక క్రిటికల్ కేర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అప్పటి కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ 2023 చివర్లో ఈ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వేగంగా పనులు చేయడంతో ఎన్నికల నాటికే దాదాపు 50 శాతం నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులు రెండేళ్లుగా సాగి ప్రస్తుతం అందుబాటులోకి రానుంది. అదనపు యూనిట్లు మంజూరు పాత ఆస్పత్రిలోని గైనాకలజీ విభాగంలో గతంలో మూడు యూనిట్లు మాత్రమే ఉండేవి. వాటిలో 90 పడకలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెద్ద సంఖ్యలో గర్భిణిలు రావడంతో వైద్యులు, సిబ్బందిపై పని వత్తిడి బాగా ఉండేది. అంతేకాదు ఒక్కో బెడ్పై ఇద్దరు, ముగ్గురు గర్భిణులు ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో 2014–19లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రెండు పర్యాయాలు ప్రసూతి విభాగాన్ని సందర్శించారు. అక్కడ గర్భిణుల ఇబ్బందులు చూసి సమస్య పరిష్కరిస్తామన్నారు. అయితే ఏమి చేయ లేదు. రాష్ట్రంలో 2019వ సంవత్సరంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంతో వెంటనే మూడు యూనిట్లు మంజూరు చేశారు. దీంతో మరో 90 పడకలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు కొత్తగా ఏర్పాటైన యూనిట్లుకు వైద్యులు, సిబ్బందిని కూడా మంజూరు చేశారు. దీంతో కొంత వరకూ సమస్య తీరింది. గతంలో నిలిచిన ప్రసూతి బ్లాక్ నిర్మాణం 2014–19 మధ్యలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో రూ.18 కోట్లతో ప్రసూతి బ్లాక్ నిర్మాణం చేపట్టాలని భావించింది. అందుకోసం భూమిపూజ చేసి పెద్ద రాళ్లపై పేర్లు వేసుకుంది. నిధులు కేటాయించక పోవడంతో పునాదుల మీదే నిర్మాణాలు నిలిచిపోయాయి. ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారిని ఆ పునాదులు చానాళ్లు వెక్కిరిస్తూ కనిపించాయి. క్రిటికల్ కేర్ భవనం నిర్మాణంతో మరిన్ని పడకలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రభుత్వం మరిన్ని యూనిట్లు మంజూరు చేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే పడకలు పెరిగినా వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకుండా చేసేదేమీ లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం క్రిటికల్ కేర్ భవనంలో సౌకర్యాలు కల్పించి వెంటనే అందుబాటులోకి తేవాలని, వసరమైన వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే పాత ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఎన్నికల నాటికే సగం నిర్మాణం పూర్తయింది. నిధులు ఉన్నా పూర్తి చేసేందుకు రెండేళ్లు పట్టింది. ఇప్పటికై నా ఈ విభాగాన్ని అందుబాటులోకి తీసుకు రావాలి. గర్భిణుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. కూటమి పాలనలో ప్రభుత్వ వైద్యం పూర్తిగా నిర్వీర్యమైంది. రోగుల కష్టాలు పట్టడం లేదు. ప్రభుత్వాస్పత్రిపై దృష్టి పెట్టాలి. – మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే -
ఆషాఢ వైభవం.. ‘ఇంద్ర’ వైభోగం
జగన్మాతకు ప్రణమిల్లిన భక్తజనం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు సారెను సమర్పించాయి. జగన్మాత దుర్గమ్మను భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించి పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, చీర, మిఠాయిలను సమర్పించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, తిరిగి సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 9.30 గంటల వరకు సారె సమర్పణలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉదయాస్తమాన సేవగా సారె సమర్పణ కార్యక్రమం జరుగుతుందా అనే భావన భక్తుల్లో కలిగింది. ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. అన్ని టికెట్ల విక్రయాలు రద్దు.. గతంలో శుక్రవారం, ఆదివారాల్లో కేవలం అంతరాలయ దర్శనాలను మాత్రమే రద్దు చేసేవారు. అయితే ఆదివారం భారీగా భక్తులు తరలిరావడంతో అన్ని టికెట్ల విక్రయాలను రద్దు చేసి ఉచితంగా ఆయా క్యూలైన్ మార్గాల్లో భక్తులను దర్శనానికి అనుమతించారు. ముందుగా ఆన్లైన్లో రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రత్యేక సమాయాన్ని కేటాయించి వారికి అంతరాలయ దర్శనం కల్పించారు. రిజిస్ట్రేషన్ కాకుండానే.. అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించే భక్తులు, భక్త బృందాలు ఆలయ ప్రాంగణంతో పాటు కనకదుర్గనగర్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. అయితే ఆదివారం రద్దీ అధికంగా ఉండటంతో భక్తులు ఎక్కడా వేచి ఉండే పరిస్థితులు కనిపించలేదు. దీంతో సారె సమర్పించే వారు రిజిస్ట్రేషన్ కాకుండానే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకోవడం, సారె సమర్పించడం జరిగింది. ఆదివారం అనధికార లెక్కల ప్రకారం వందకు పైగా భక్త బృందాలు సారెను సమర్పించినట్లు తెలుస్తోంది. చైర్మన్, ఈవోల పర్యవేక్షణ రద్దీ అధికంగా ఉండటంతో ఎవరికీ వీఐపీ దర్శనాలు కల్పించవద్దని ఆలయ ఈవో శీనానాయక్ ప్రోటోకాల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఘాట్రోడ్డులోని సమాచార కేంద్రానికి చేరుకున్న ఈవో సిబ్బందికి పలు సూచనలిచ్చారు. మరో వైపున చైర్మన్ బొర్రా రాధా కృష్ణ మహా మండపం ఆరో అంతస్తులో సారె సమర్పించిన భక్తులను కలిసి మాట్లాడారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఏఈవోలు, సూపరిండెంటెంట్లు స్కానింగ్ పాయింట్లో రద్దీని పర్యవేక్షించారు. నగరానికి చెందిన భక్త బృందాలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. అంతే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా ఏర్పడి అమ్మవారికి సారెను సమర్పించేందుకు ఇంద్ర కీలాద్రికి తరలివచ్చారు. భక్తుల వాహనాలతో కొండ దిగువన పలు మార్లు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే మార్గంలో బస్సులు, కార్లను పున్నమీ ఘాట్, భవానీపురం పరిసరాల్లోనే నిలిపివేశారు. దేవస్థాన బస్సులతో పాటు ద్విచక్ర వాహనాలను మాత్రమే కొండపైకి తరలించారు. వీవీఐపీ ప్రోటోకాల్ ఉన్న వాహనాలను సైతం ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ వరకు మాత్రమే అనుమతించారు. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక విధులను నిర్వర్తించారు. -
కలుస్తున్న మలినం..
విజయవాడలో తాండవిస్తున్న అపారిశుద్ధ్యంలబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే తాండవిస్తోంది. ముఖ్యంగా మురుగు కంపు కొట్టే డ్రెయిన్లు పక్కనే ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలు అంటు వ్యాధులకు కార్కానాలుగా మారుతున్నా.. వీఎంసీ అధికారులకు పట్టడం లేదు. ప్రజల ఆరోగ్యంపై విషయంలో సర్కారు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా డయేరియా వంటి అంటు వ్యాధుల బారిన పడాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు 2024లో మొగల్రాజపురం.. 2025 న్యూ రాజరాజేశ్వరిపేట.. నేడు గిరిపురం ఇలా ఏటా ఏదో ప్రాంతంలో డయేరియా సోకడాన్నే నిదర్శనంగా చెబుతున్నారు. ఏదైనా ప్రాంతంలో డయేరియా సోకినప్పుడు రెండు.. మూడు రోజులు వచ్చి హడావుడి చేసి వెళ్లిపోవడమే కానీ, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీటిలో కలిసిన మలినమే కాటేసిందా? గిరిపురంలో పది రోజులుగా 20 మందికి పైగా ప్రజలు డయేరియా బారిన పడ్డారు. రంగు మారిన నీరు తాగడం వల్లే డయేరియా సోకినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకూ అధికారులు నోరు మెదపడం లేదు. నీటి శ్యాంపిల్స్ సేకరించాం.. రిపోర్టులు రాలేదని మాత్రమే చెబుతున్నారు. మంచినీటి సరఫరా లైన్లో డ్రెయినేజీ వాటర్ కలిసినట్లు పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆదివారం గిరిపురంలో వాటర్ పైప్లైన్ డమ్మీ చేసి పలు ప్రాంతాల్లో మరమ్మతులు చేశారు. అంతేకాక కుళాయిల నుంచి వచ్చే వాటర్ తాగవద్దని, ఆర్వో వాటర్ను ఇంటింటికీ సరఫరా చేయడం కూడా వారి అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అధికారులు మాత్రం కారణం బయటకు చెప్పడం లేదు. గత ఏడాది న్యూ రాజరాజేశ్వరిపేటలో నిర్వహించిన నీటి పరీక్షల ఫలితాలు కానీ, ఈ ఏడాది గిరిపురంలో నిర్వహించిన నీటి పరీక్ష ఫలితాలు ఇప్పటి వరకూ వెల్లడించలేదు. వీఎంసీ ఏమి చేస్తున్నట్లు? నగర పాలక సంస్థలో ప్రజారోగ్య విభాగం ఉంది. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడటం ఈ విభాగం పని. డ్రెయిన్ల నిర్వహణ, ఆహార పదార్థాల అమ్మకాల వద్ద పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడటం, పారిశుద్ధ్య సమస్య లేకుండా వారే చూడాలి. కానీ నగరంలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం ఉంటే, ఆ విభాగం అధికారులు ఏమి చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆహార పదార్థాల విక్రయాలు జరిపే చోట పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా అనే విషయాలను అసలు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు అంటు వ్యాధుల బారిన పడుతున్నారు. నగరంలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తోంది. చెత్తా చెదారం, మురుగు కూపాల వద్దే ఆహార పదార్థాల విక్రయాలు జరుపుతున్నా అధికారులకు పట్టడం లేదు. కేవలం ఫుడ్కోర్టులతో పాలకులు జేబులు నింపుకుంటున్నారే కానీ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ఆ ప్రాంతంలోని డ్రెయిన్లు, పరిసరాలు చూస్తే అంతా అర్థమవుతుంది. నగరం అంతా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికై నా పాలకులు కళ్లు తెరవాలి. నగరంలో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే -
అనైతికం.. అందుకే అడ్డుకుంటున్నాం
గన్నవరం రూరల్: పోలవరం కాలువపై రైతులకు నీరందించే మోటార్లు తొలగించమనటం అనైతికమని రైతులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఆదివారం గన్నవరం మండలం సూరంపల్లి, కొండపావులూరు గ్రామాల్లో పోలవరం కాలువకు ఏర్పాటు చేసి ఉన్న మోటార్లు తొలగించాలని పోలవరం, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా పర్యటించి ఫ్యూజులు తొలగించారు. దీంతో రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ రాజకీయ నాయకులు, విజ్ఞత ఉన్న వాళ్లు చేసే నిర్ణయం ఇది కాదని మండిపడ్డారు. కృష్ణాడెల్టా స్థిరీకరణ పేరుతో ఇక్కడి రైతులను ఎండగడతారా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఆనాడు పోలవరం కాలువకు తాము భూములు ఇవ్వకపోతే పోలవరం ఉండేదా అని ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మోటార్లు ఆపేది లేదని రైతు నాయకుడు జూపల్లి సురేష్ తేల్చి చెప్పారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఆకుమడులకు నీరు ఇస్తున్నామని, ఇప్పటి వరకూ ఊడ్పులు లేవన్నారు. ‘మేం రైతులం కాదా? తాము పండించి పది మందికి పెడుతున్నాం? ఇక్కడి రైతులు అన్నం తినవద్దా?’ అంటూ ప్రశ్నించి, ప్రతిఘటించడంతో అధికారులు వెను తిరిగారు. ఫ్యూజులు తొలగించటం దారుణమని మండిపడ్డారు. తీవ్ర వాగ్వాదం.. హనుమాన్జంక్షన్ రూరల్: సాగునీటి తరలింపు విషయంలో ఇరిగేషన్ అధికారులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పొలవరం కుడి ప్రధాన కాలువపై బాపులపాడు మండలం బండారుగూడెం వద్ద విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి సాగునీటిని తరలిస్తున్న రైతులను ఇరిగేషన్ అధికారులు అడ్డుకోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. నారుమళ్లు సాగుచేసేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, అదునుకు నీళ్లు అందకపోతే నారు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు వివరించారు. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పటంతో తాత్కాలికంగా వివాదం సర్దుమణిగింది.పోలవరం కాలువపై మోటార్లు తొలగింపును ప్రతిఘటించిన రైతులు -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 20267గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన నల్లూరు జయలక్ష్మి కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది.మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మ ణ్యేశ్వరస్వామిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. -
షరతుల్లేకుండా మహిళా బిల్లు ఆమోదించాలి
మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎటువంటి షరతులు లేని మహిళా బిల్లును ఆమోదించాలని మహిళా సంఘాల ఐక్యవేదిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లెనిన్ సెంటర్లో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర నాయకురాలు రమాదేవి, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు పద్మ మాట్లాడుతూ.. 2023లో భారత రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మహిళా రిజర్వేషన్కు కేంద్రం చట్టబద్ధత కల్పించిందన్నారు. జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు వాయిదా వేయడం ద్వారా మహిళలకు తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన, డీలిమిటేషన్ షరతులు లేకపోయి ఉంటే ప్రస్తుతం లోక్ సభలో మహిళల ప్రాతినిధ్యం 33శాతం ఉండేదన్నారు. దశాబ్దాలుగా మహిళా ఉద్యమాలు సాగించిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఈ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తాత్సారం చేయడం మహిళల రాజకీయ సాధికారతను అడ్డుకోవడమేనన్నారు.. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్ వంటి వివాదాస్పద అంశాలతో ముడిపెట్టకుండా వర్షాకాల సమావేశాలలో షరతులు లేని మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుర్గ కోటేశ్వరావు, బంకా ఝాన్సీ, నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి, ఐద్వా జిల్లా నాయకురాలు శ్రీదేవి, మహిళా సంఘాల నాయకురాళ్లు దుర్గాసి రమణమ్మ , దుగ్గిరాల సీతారావమ్మ, అనిత, అండమని నాగమణి, ఆర్. అనసూయ, రాజ్యలక్ష్మి, గుణసుందరి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
గిరిపురంలో కొనసాగుతున్న ప్రత్యేక వైద్య శిబిరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): గిరిపురంలో డయేరియా సోకిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరం సోమవారం కూడా కొనసాగనుంది. ప్రస్తుతం ఆదివారం కొత్తగా కేసులు ఏమీ నమోదు కానప్పటికీ సోమవారం కూడా వైద్య బృందాలు ఇంటింటి సర్వే చేయనున్నాయి. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలు ఇచ్చే వరకూ వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఏ శ్రావణ్బాబు తెలిపారు. కాగా ఈ వైద్య శిబిరంలో ఆదివారం 18మంది చికిత్స చేశారు. వారంతా జనరల్ ఓపీకి వచ్చిన వారేనని వైద్యులు తెలిపారు. వారిలో డయేరియా బాధితులు లేరని చెప్పారు. గిరిపురంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ఏ సమయంలోనైనా అనారోగ్యానికి గురైన వారు రావచ్చని తెలిపారు. ప్రజలకు ఆరోగ్య అవగాహన.. గిరిపురంలో ఇంటింటి సర్వే చేపడుతున్న సిబ్బంది, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన నీరు తాగడం, వేడి వేడి ఆహారం తీసుకోవడం వంటి అంశాలను స్థానికులకు వివరిస్తున్నారు. ఆర్వో వాటర్ను కూడా కాచి చల్లార్చిన తర్వాత తాగితే మంచిదని సూచిస్తున్నారు. అంతేకాకుండా పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆస్పత్రికి తరలించేందుకు 108 వెహికల్ను అక్కడ అందుబాటులో ఉంచారు. పైప్లైన్లకు మరమ్మతులు.. మంచినీరు సరఫరా అయ్యే పైపుల్లో డ్రెయినేజీ వాటర్ కలుస్తోందనే అనుమానాలు రావడంతో ఆదివారం మంచినీటి పైప్లైన్లను డమ్మీ చేసి, పలు ప్రాంతాల్లో వీఎంసీ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. అదే విధంగా ఇళ్లలో నుంచి మురుగు నీరు సైడు డ్రెయిన్లలోకి రాకుండా చూడాలని ప్రజలకు సూచించారు. పూడిన డ్రైయిన్లను శుభ్రం చేశారు. -
ఏపీజీఈఏ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా వైద్యశాఖ ఉద్యోగి కూనపరెడ్డి శ్రీనివాసరావు నియమితులయ్యారు. విజయవాడలో ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో శ్రీనివాసరావును కార్యదర్శిగా నియమిస్తూ సంఘ అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ నియామక ఉత్తర్వులు అందజేశారు. శ్రీనివాసరావుకు సంఘ సభ్యులు అభినందనలు తెలిపారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు నేడు (20వ తేదీ) సోమవారం రాత్రి 11.59 గంటలకు గడువు ముగుస్తుందని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్)సీఎండీ పి.పుల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగి ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించి, అవసరమైన పత్రాలను జతచేసి నిర్ణీత గడువులోపు దరఖాస్తు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు చెప్పే మాటలను అభ్యర్థులు నమ్మవద్దని సూచించారు. చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదికపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలను సందర్శించే పౌరుల నుంచి అభిప్రాయాన్ని సేకరించేందుకు క్యూఆర్ కోడ్ను ప్రదర్శించాలని నిర్ణయించామని ఆదివారం ఓ ప్రకటన తెలిపారు. జిల్లా, మండల స్థాయి పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలలో, వివిధ మాధ్యమాల్లో ప్రజల అభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్ను స్పష్టంగా, కంటికి కనిపించే పరిమాణంలో ముద్రించి, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలన్నారు. పౌరులు పి.జి.ఆర్.ఎస్ సేవలను పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్ల ద్వారా క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని సమర్పించవచ్చన్నారు వన్టౌన్(విజయవాడపశ్చిమ): పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పది, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను షైనింగ్స్టార్స్ పేరుతో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ తెలిపారు. నగరంలోని మారీస్ స్టెల్లా కళాశాల ఆడిటోరియం ప్రాంగణంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 135మంది, ఇంటర్లో ప్రతిభ చూపిన 40మందికి పురస్కారాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా ఇతర ప్రముఖులు అతిథులుగా హాజరవుతారని వివరించారు. ఎంపికై న విద్యార్థులు సంబంధిత తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులతో కలిసి కార్యక్రమ ప్రాంగణానికి సకాలంలో చేరుకోవాలని సూచించారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకరించారు. భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు వేలాది సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించి, మొక్కులు తీర్చుకున్నారు. -
జలక్రీడల్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారుల ప్రతిభ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విశాఖ పట్నంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన 11వ ఏపీ సబ్–జూనియర్, జూనియర్ అంతర్–జిల్లా జల క్రీడల చాంపియన్షిప్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ చూపి 231 పాయింట్లతో ఓవరాల్ రన్నరప్గా నిలిచారు. అండర్–16 బాలికల విభాగంలో వడ్లమూడి లిపి ఐదు బంగారు పతకాలు, అండర్–14 బాలుర విభాగంలో ఎం.రామ్మణి కంఠ–5 బంగారు పతకాలు పొంది వ్యక్తిగత చాంపియన్ షిష్ను సొంతం చేసుకున్నారని ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రమేష్ తెలిపారు. గ్రూప్–1(ఏ)బాలుర విభాగంలో కె.శక్తిదార్–1 బ్రాంజ్, గ్రూప్–1(బి)–బాయ్స్ విభాగంలో బి.పృఽథ్వీరాజ్–3 బంగారు, 1 సిల్వర్,1 బ్రాంజ్ పతకాలు, గ్రూప్–1(బి) బాలికల విభాగంలో వడ్లమూడి లిపి–5 బంగారు, పి.రమ్యశ్రీ–2 బంగారు, 3 సిల్వర్పతకాలు, గ్రూప్–2 బాయ్స్ విభాగంలో ఎం.రామ్మణికంఠ–5 గోల్డ్, ఎం.హర్షిత్–1 గోల్డ్, 2 సిల్వర్, 2 బ్రాంజ్, గ్రూప్–2 బాలికల విభాగంలో యానా జైన్–2బంగారు, 3 సిల్వర్, కె.సింధుజ–1సిల్వర్, 2 బ్రాంజ్, గ్రూప్–3 బాలుర విభాగంలో జి.జతిన్–1సిల్వర్,2–బ్రాంజ్, గ్రూప్–3 బాలికల విభాగంలో ఎం.జీసాశ్రీ–2 సిల్వర్, 2 బ్రాంజ్ పతకాలు పొందారని రమేష్ తెలియజేశారు. 18 బంగారు పతకాలు, 13 సిల్వర్, 9–బ్రాంజ్ పతకాలు పొంది మొత్తం 231 పాయింట్లతో ఓవరాల్ రన్నరప్గా నిలిచారన్నారు. పతకాలు పొందిన క్రీడాకారులను ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొంగర రవికాంత్, ఏపీ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఓబుల్రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులు కొడాలి రమేష్, డీఎన్డీ కుమార్ అభినందించారు. -
నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించాలి
● కాల్మనీ బాధితుడు మోతె గోపరాజు ఆవేదన ● పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): కాల్మనీ వడ్డీ వ్యాపారులతో తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని బాధితుడు మోతె గోపరాజు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ వ్యాపారులు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తాను ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో సీనియర్ సేల్స్ మేనేజర్గా పని చేశానని తెలిపారు. వ్యాపార అవసరాల కోసం 2024 జూలై నుంచి 2025 సెప్టెంబర్ మధ్య కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన సుంకర ఫాల్గుణ సాయి నరేన్ (సుంకర సాయి) వద్ద రూ.96 లక్షలు అప్పుగా తీసుకున్నానని తెలిపారు. ఆ అప్పునకు సంబంధించి అసలు, వడ్డీ కలిపి విడతల వారీగా రూ.1.90 కోట్లు చెల్లించినా, ఇంకా వడ్డీ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న సుంకర సాయి తన అనుచరులతో కలిసి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి తన భార్యకు చెందిన ఖాళీ చెక్బుక్తో పాటు నాలుగు ఖాళీ ప్రాంశరీ నోట్లపై సంతకాలు చేయించుకుని తీసుకెళ్లారని ఆరోపించారు. ఆ తర్వాత తనపై పెనమలూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని, స్టేషన్కు వెళ్లినప్పుడు పోలీసులు తన వివరణను పట్టించుకోకుండా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారని తెలిపారు. పలుమార్లు ఇంటికి వచ్చి బెదిరించడంతో పాటు, ఇంటిని ఖాళీ చేయించాలని యజమానిని కూడా బెదిరించారని వాపోయారు. జూన్ 5న పోలీస్స్టేషన్కు పిలిచి, డబ్బులు చెల్లిస్తానని తనతో వీడియో రికార్డు చేయించారని, లేకుంటే తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ పటమట, విస్సన్నపేట పోలీసులు కూడా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. తాను డబ్బులు తిరిగి చెల్లించినట్లు ఆధారాలు చూపినా పోలీసులు పట్టించుకోకుండా వారికే వత్తాసు పలుకుతున్నారని, తనకు సుంకర సాయి, నిమ్మగడ్డ తిరుపతిరావు, వెల్ది వెంకట సుభాష్ గణేష్ చౌదరితో ప్రాణహాని ఉందని గోపరాజు తెలిపారు. ఈ విషయమై సీఎం, డీజీపీ కార్యాలయాలకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని గోపరాజు వేడుకున్నారు. -
టిఫిన్ సెంటర్ ధ్వంసం చేసిన వారిపై కేసు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టిఫిన్ సెంటర్ ధ్వంసం చేసిన ఘటనపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం భవానీపురానికి చెందిన పలగాని శివరామ్ ప్రసాద్ విద్యాధరపురం చెరువు సెంటర్లో నాగండ్ల సీతామహాలక్ష్మికి చెందిన ఖాళీ స్థలం అద్దెకు తీసుకుని టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గతేడాది డిసెంబర్లో స్థల యజమాని కొడుకులు పవన్, తేజ వచ్చి ఖాళీ చేయాలని అడిగారు. దానికి శివరామ్ ప్రసాద్ అంగీకరించలేదు. తాను రూ. 5లక్షలు ఖర్చు చేసి స్థలం మెరక చేశానని చెప్పాడు. యజమాని కుమారులు పదే పదే ఖాళీ చేయాలని గొడవ చేస్తుండడంతో అతను కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో శివరామ్ ప్రసాద్ హోటల్ మూసివేసి ఇంటికి వెళ్లాడు, మర్నాడు ఉదయం 6 గంటలకు హోటల్ వద్దకు వెళ్లగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి, అందులోని టేబుల్స్, కుర్చీలు, సీసీ కెమెరాలు, క్యాష్ కౌంటర్లోని రూ. 42 వేల నగదు తీసుకెళ్లిపోయారు. షాపులో సామాన్లు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భవానీపురం పోలీసు స్టేషన్లో బాధితుడు శివరామ్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. స్థల యజమాని కొడుకులు హోటల్ ధ్వంసం చేసి ఉంటారని పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు గుంటూరు ఎడ్యుకేషన్: దసరా సెలవుల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) లో పలు కీలక మార్పులు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాంబశివపేటలోని ఏసీ కళాశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ తెలుగు అవగాహన తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీఎస్సీకి అనుసంధానంగా నిర్వహించే టెట్కు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్లో మార్పులు లేనట్లయితే అది స్పెషల్ టెట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్పెషల్ టెట్లో కామన్గా అందరికీ పాస్ మార్కు తగ్గింపుగా ఉండాలని, ఆఫ్లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2ఏ పరీక్షలో ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు వరకే సిలబస్ ఉండాలని, తనవి కాని సబ్జెక్టును తొలగించాలన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు అవగాహన తరగతులు విజయవంతమయ్యాయని, మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. టెట్ అవగాహన తరగతులను నిర్వహించేందుకు సహకారం అందించిన ఏసీ కళాశాల యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. తరగతుల ముగింపు కార్యక్రమంలో తెలుగు రీసోర్స్ పర్సన్ ఆర్.వెంకటరావును సత్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టీఎస్ఎల్ఎన్ మల్లేశ్వరరావు, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, యూత్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
దసరా నాటికి ఎయిర్పోర్టు నూతన టెర్మినల్ నిర్మాణం
గన్నవరం: దసరా నాటికి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయంలో నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్, సాంకేతిక భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. పాత కాంట్రాక్టు సంస్థకు ఉన్న సమస్యల వల్ల ఇంటి గ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. కొత్త సంస్థకు పనులు అప్పగించిన తర్వాత నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి వారణాసి మీదుగా కోల్కతాకు నూతన సర్వీస్లను ఆగస్టు 13 నుంచి ప్రారంభిస్తామన్నారు. వారణాసి విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ విధానాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దీనివల్ల ప్రాంతీయ విమానాశ్రయాల్లోనే ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకుని, హబ్ ఎయిర్పోర్ట్ల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేయొ చ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీ, ఆ తర్వాత హైదరాబాద్లో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. విజయవాడ, విశాఖ, మరో ఐదు ఎయిర్పోర్ట్లకు ఈ సేవలను విస్తరిస్తా మని వివరించారు. ఎంపీలు బాలశౌరి, కేశినేని చిన్ని, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ విపిన్కుమార్ పాల్గొన్నారు. టెర్మినల్ నిర్మాణ పనులను కొత్త కాంట్రాక్టు సంస్థకు కేటాయించడంపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గైర్హాజరయ్యారు. -
నీరువెల్లా విషం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ గిరి పురంలో డయేరియా అదుపులోకి రాలేదు. శని వారం మరొక మహిళ వ్యాధిబారిన పడ్డారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిన చోటే కొత్తగా కేసు నమోదైంది. ఆమెకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డయేరియా సోకిన వారిలో ఒక్కొక్కరుగా కోలుకుని ఇంటికి చేరుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఇంటింటి సర్వే నిర్వహించి ఎవరైనా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారా అని ఆరా తీస్తోంది. కుళాయిల నుంచి ఇంకా రంగుమారిన నీరే వస్తోంది. దీంతో ఆ వాటిని తాగవద్దని అధికారులు తేల్చిచెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా నగరపాలక సంస్థ అధికారులు ఇంటింటికీ ఆర్వో వాటర్ పంపిణీ చేస్తున్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.శ్రావణ్బాబు దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. వారం రోజులుగా డయేరియా గిరిపురం ప్రాంతంలో వారం రోజులుగా ఒక్కొక్కరుగా డయేరియా బారిన పడుతున్నారు. వాంతులు, విరేచనాలతో డీ హైడ్రేషన్కు గురవడంతో కిడ్నీ సమస్యలు సైతం తలెత్తాయి. శుక్రవారం నాటికి 20 మంది వరకూ డయేరియా బారిన పడగా, శనివారం ఒక మహిళకు ఈ వ్యాధి సోకిందని వైద్య సిబ్బంది గుర్తించారు. గిరిపురం ప్రాంతంలో ప్రతి ఇంటికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. వైద్య శిబిరంలో పది మందికి చికిత్స గిరిపురంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో స్వల్ప అస్వస్థతతో వచ్చిన పది మందికి వైద్యం అందించారు. ఒక మహిళ డయేరియాతో బాధప డుతూ శిబిరానికి రాగా ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివిధ శాఖల సమన్వయంతో పరిస్థితిని అదుపు చేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు డ్రెయిన్లు శుభ్రం చేస్తూ, యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. డయేరియా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో అధికారులు శుక్రవారం గిరిపురం ప్రాంతానికి వచ్చి కుళాయిల ద్వారా సరఫరా అవు తున్న నీటి శాంపిళ్లు సేకరించారు. వాటి రిపో ర్టులు ఇప్పటి వరకూ వెల్లడించలేదు. ఆ ప్రాంతంలో ఎక్కువ మంది కుళాయిల నుంచి వచ్చే నీటినే తాగుతుంటారు. తాగునీటి పైపులైన్లు ఎక్కువగా డ్రెయిన్ల నుంచి ఉండటంతో, తాగునీరు కలుషితమై విషపూరితంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కుళాయి నీటిని తాగొద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా వీఎంసీ ఆర్వో వాటర్ను ఇంటింటికీ సరఫరా చేస్తోంది. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, వేడివేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలని ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు డెట్టాల్, సబ్బులు ఇంటింటికీ అందజేస్తున్నారు. గిరిపురంలో డయేరియాను కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్థ సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాయి. శనివారం ఒక డయేరియా కేసు వచ్చింది. వాటర్ శాంపిల్స్ ఫలితాలు ఇంకా రాలేదు. ప్రత్యేక వైద్య శిబిరం ఆదివారం కూడా కొనసాగుతుంది. ఆ తరువాత పరిస్థితిని బట్టి కొనసాగించాలా లేదా అనేది నిర్ణయిస్తాం. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి డయేరియా బాధితులెవరైనా ఉన్నారా అని ఆరా తీసుకున్నారు. వైద్యశాఖ పరంగా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నాం. – డాక్టర్ ఎ.శ్రావణ్బాబు, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ జిల్లా గిరిపురంలో అదుపులోకి రాని డయేరియా శనివారం మరొకరికి అతిసార చికిత్సకోసం ప్రభుత్వాస్పత్రికి తరలింపు కుళాయిల నుంచి రంగు నీరే వస్తున్న పరిస్థితి ఆ నీటిని తాగొద్దని తేల్చిచెబుతున్న అధికారులు -
రాజ్యమేలుతున్న అపరిశుభ్రత
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో అపరిశుభ్రత రాజ్యమేలుతోందని, పది రోజులుగా గిరిపురం ప్రాంతంలో డయేరియా వ్యాధి విజృంభిస్తుంటే అధికారులు, పాలకులు ఏమి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఇన్చార్జి మల్లాది విష్ణు ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం, నగర పాలక సంస్థ పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. గిరిపురంలో డయేరియా బాధితులను ఆయన శనివారం పరామర్శించారు. వైద్య శిబిరం వద్దకు వెళ్లి, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్బాబు ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. డయేరియా కట్టడికి చర్యలు తీసుకోవడంతో పాటు, వ్యాధి బారినపడినవారికి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. కలుషిత నీరు, అధ్వాన పారిశుద్ధ్యమే కారణం గిరిపురం పరిసర ప్రాంతాల్లో డ్రెయిన్లు పూడిపోయి, పారిశుద్ధ్యం పూర్తిగా క్షీణించిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. పైపుల ద్వారా కలుషిత నీరు సరఫరా కావడం వల్లే డయేరియా ప్రబలిందన్నారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంలో మునిసిపల్ కార్పొరేషన్ విఫలమైందని ధ్వజమెత్తారు. నగరం నడిబొడ్డున డయేరియా విజృంభించినా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం గిరిపురంలో 20 మందికి పైగా డయేరియా బారిన పడి ఆస్పత్రుల పాలయ్యారని, డీహైడ్రేషన్ కారణంగా కొందరిలో కిడ్నీ సమస్యలు తలెత్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే రోగులకు కనీసం స్ట్రెచ్చర్లు లేవని, మందుల కొరత వేధిస్తోందని, పైగా కొందరు సిబ్బంది లంచాలు అడుగుతున్నారని విమర్శించారు. నగరంలో పారిశుద్ధాన్ని మెరుగుపరిచి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కుక్కల అనిత, వైఎస్సార్ సీపీ నాయకులు కుక్కల రమేష్, చంటి, సమూయేలు, మనోహర్, నిరీక్షణ్, మరియరాణి, కుమారి, ఝాన్సీ, భాను, చందు, రత్న తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం వీడని అధికారులు, ప్రభుత్వం గిరిపురంలో 20 మందికి పైగా డయేరియా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం డయేరియా బాధితులకు పరామర్శ -
యోగాంధ్రలో పాల్గొన్న యువతకు ప్రశంసా పత్రాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమంలో పాల్గొన్న యువతకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో శనివారం జరిగింది. కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ యువతకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి 15,300 మంది విద్యార్థులు, యువత, యోగా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యోగాంధ్ర కార్య క్రమంలో పాల్గొని ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఆర్డీఓ వెన్నెల శ్రీను, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి కొల్లేటి రమేష్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వై.రత్నప్రియదర్శిని, జిల్లా క్రీడల అభివృద్ధి అధి కారి కోటేశ్వర రావు పాల్గొన్నారు. విశాఖ స్పోర్ట్స్: అంతర్ జిల్లాల సబ్జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్ శనివారం విశాఖలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రారంభమైంది. జిల్లా స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న పోటీల్లో సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికలకు ఫ్రీస్టైల్, బ్యాక్స్ట్రోక్, బ్రెస్ట్స్ట్రోక్, బటర్ఫ్లైతో పాటు మెడ్లే విభాగాల్లో పోటీలు నిర్వహించారు. వివిధ వయో విభాగాల్లో 50 మీటర్ల నుంచి 1500 మీటర్ల వరకు జరిగిన పోటీల్లో విజేతలను రాష్ట్ర జట్టుకు, రన్నరప్గా నిలిచిన వారిని స్టాండ్బై క్రీడాకారులుగా ఎంపిక చేశారు. కృష్ణా జిల్లా నుంచి కేటగిరీ–3 100 మీటర్ల బాలుర విభాగం బటర్ఫ్లై, బ్యాక్ స్ట్రోక్ రెండు అంశా ల్లోనూ చరిత్ ఆదిత్య విజేతగా నిలిచాడు. ఎన్టీఆర్ జిల్లా నుంచి కేటగిరీ–2 బటర్ఫ్లై బాలురు విభాగంలో రామ మణికంఠ, బాలికల్లో యానా జైన్, అదేవిధంగా కేటగిరీ–1బి బాలికల 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ అంశంలో లిపి, ఫ్రీస్టైల్ అంశంలో లాస్యశ్రీ విజేతలుగా నిలిచారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని అంబేడ్కర్ కన్వెన్షన్ హాల్ను ఏడీజీ మధుసూదన్రెడ్డి, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు శనివారం పరిశీలించారు. మానవ వనరులు, సాంకేతికత ఆధారిత, నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా భవిష్యత్ నేరాల కట్టడి కోసం ఏపీ పోలీసులను పునర్వవస్థీకరించే లక్ష్యంతో ఈ నెల 22, 23 తేదీల్లో ‘ఫ్యూచర్ – రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్ అంబేడ్కర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తామని ఏడీజీ మధుసూదన్రెడ్డి తెలిపారు. వర్క్షాప్ నిర్వహణ సన్నాహాల నేపథ్యంలో పోలీస్ కమిషనర్తో కలిసి కన్వెన్షన్ హాల్తో పాటు పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ పకీరప్ప, డీసీపీలు కృష్ణకాంత్పటేల్, షిరీన్ బేగం, డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి, కె.జి.వి.సరిత, బి.లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని యువత వారిలోని నైపుణ్యాలను పెంచుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) విజయవాడ బ్రాంచ్ ఆధ్వర్యాన సీఏ విద్యార్థులకు శనివారం అన్వికా పేరుతో మెగా కాన్ఫరెన్స్ జరిగింది. మంత్రి సత్యకుమార్యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందన్నారు. దేశ సంపదను పెంచే బాధ్యత సీఏలపైనే ఉందన్నారు. నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలని సూచించారు. హెల్త్, వెల్త్ ఉంటే హ్యాపీగా ఉంటా రని చెప్పారు. సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఎస్ఐఆర్సీ) చైర్మన్ ముప్పాల సుబ్బారావు, వైస్ చైర్మన్ మండవ సునీల్ కుమార్, రీజనల్ కౌన్సిల్ సభ్యుడు యర్రా తిరుపతయ్య, ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ చైర్మన్ ఉప్పులూరి జయంత్, కార్యదర్శి వి.వీరపవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం సీఏ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
సారె బృందాలతో ఇంద్రకీలాద్రి కళకళ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్త బృందాలు తరలివస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 30కి పైగా బృందాలకు చెందిన పది వేల మందికి పైగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయగా, తిరిగి 12.20 గంటలకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. -
మళ్లీ కోవిడ్ కోరలు
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026● తిరువూరుకు చెందిన 13 ఏళ్ల బాలికకు సోకిన వైనం ● 15 పడకలతో ప్రత్యేక వార్డు, మూడు విభాగాల్లో పరీక్షలు ● ఆందోళన చెందుతున్న ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.480 టీఎంసీలు. సాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): ఐదేళ్ల కిందట ప్రజలను గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే నలుగురు కరోనా బారిన పడి మృతి చెందారని అధికారిక నివేదికలు చెబుతున్నాయి. తాజాగా విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. అంతే కాదు ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని ఆగిరిపల్లికి చెందిన వృద్ధురాలికి మంగళగిరి ఎయిమ్స్లో రెండు రోజుల కిందట కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. చాపకింద నీరులా కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ గతంలో లాంటి పరిస్థితులను తలచుకుంటేనే భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం మాత్రం కోవిడ్ను సీరియస్గా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక రెండు వారాల కిందట కిడ్నీ సమ స్యతో ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఆమెకు రెండు రోజులుగా జ్వరం రావడంలో అనుమానం వచ్చిన వైద్యులు కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్గా ఫలితం వచ్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులతో పాటు, పక్కన బెడ్స్పై ఉన్న రోగులకు సైతం వైద్యులు ఆర్టీపీ సీఆర్ పరీక్షలు చేయించారు. అయితే వారందరికీ నెగటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో ఆ బాలికకు కోవిడ్ ఎలా సోకిందనేది నిర్ధారణ కాలేదు. ఒకవేళ ఎవరికై నా సిబ్బందికి కోవిడ్ సోకి వారి ద్వారా వచ్చిందా? బంధువుల ద్వారా వచ్చిందా అనేది నిర్ధారణకాలేదు. అంతే కోవిడ్ సోకినట్లు గుర్తించని వారి ద్వారా ఆమెకు సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి అవగాహనా కార్యక్రమాలు ఇప్పటి వరకూ నిర్వహించ లేదు. కేవలం జలుబు, జ్వరం, బాడీపెయిన్స్ వంటి వాటితో ప్రభుత్వాస్పత్రి జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్, పల్మోనాలజీ విభాగాలకు వచ్చే వారికి మాత్రం కోవిడ్ లక్షణాలు ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తున్నారు. రాపిడ్ కిట్లను కూడా సిద్ధం చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో 15 పడకలుతో కోవిడ్ ఐసోలేషన్ వార్డుతో పాటు, ఆరు పడకలతో ఐసీయూను ఏర్పాటు చేసి, పల్మోనాలజీ హెచ్ఓడీని నోడల్ అధికారిగా నియమించారు. ఇప్పటి వరకూ దాదాపు 50 మందికి పైగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా, బాలికకు మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు వైద్యాఽధికారులు చెబుతున్నారు. జీజీహెచ్లో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక వార్డు కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. జనం రద్దీగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ వినియోగించడం, భౌతిక దూరం పాటించడం, బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం మంచిదని సూచిస్తున్నారు. కోవిడ్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. వారు మరింత అప్ర మత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.గుడివాడరూరల్: మండలంలోని బిళ్లపాడు పంచాయతీకి ఐఎస్ఓ 9001:2015 గుర్తింపు లభించింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంచాయతీ సెక్రటరీ హరికృష్ణ ఈ అవార్డు అందుకున్నారు. -
అప్రమత్తంగా ఉంటే మంచిది
దేశంలో రెండు నెలలుగా కోవిడ్ కేసులు అక్కడక్కడా నమోదవుతున్నాయి. అయితే రెండు మూడు వారాల నుంచి కోవిడ్ డిఫరెంట్గా సీరియస్నెస్ కనిపిస్తోంది. ఈ సారి జ్వరం ఎక్కువగా రావడం, ఆయాసం వంటి లక్షణాలు ఉంటు న్నాయి. కోవిడ్ మొదటి, రెండో వేవ్ అంత తీవ్రత ఉండకపోవచ్చు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గతంలో కోవిడ్ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మళ్లీ పాటిస్తే మంచిది. క్యాన్సర్, మధుమేహం బాధితులు, రక్తపోటు ఉన్న వారు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ ఎం.రవీంద్రనాథ్, శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు -
జగనన్న 2.0 సూపర్ యాప్తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జగనన్న 2.0 సూపర్ యాప్తో ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం పలువురు నేతలతో కలిసి జగనన్న 2.0 సూపర్ యాప్ను అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామం, మండలం, వార్డులో పార్టీ నాయకుడికీ, కార్యకర్తకు మధ్య ఒక బలమైన అనుసంధాన వారధిగా ఈ యాప్ ఉంటుందని అన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ యాప్ లాంచ్ చేస్తామని, ప్రతి పార్టీ కార్యకర్త ఈ యాప్తో అను సంధానమై, ప్రభుత్వ తప్పుడు పనులను అందులో అప్లోడ్ చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ యాప్ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్ ట్రేడ్యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, మాజీ డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి నాగేంద్ర పుణ్యశీల, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర పాల్గొన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి “jagan 2.0 Super App’ ను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఫోన్లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎల్నినో నేపథ్యంలో బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతులతో పాటు, తీసుకోని రైతులు కూడా తప్పనిసరిగా బీమా పథకాల్లో చేరాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి హాల్లో శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన వ్యవసాయ, ఉద్యాన, సహకార, బ్యాంకింగ్, బీమా సంస్థల అధికారులతో సమావేశం జరిగింది. ఎల్నినో ప్రభావం వంటి పరిస్థితుల నేపథ్యంలో పంట నష్టాల ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నందున రైతులకు ఫసల్ బీమాపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల్లో చేరేలా ప్రోత్సహించాలన్నారు. ఇందుకు సమన్వయ శాఖల అధికారులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించారు. నోటిఫై చేసిన పంటలివే.. ఖరీఫ్–2026 సీజన్కు జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద వరి, ఎర్రమిరప, మొక్కజొన్న, పెసర పంటలను నోటిఫై చేశారన్నారు. పున ర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద పత్తిని నోటిఫై చేసినట్లు వివరించారు. వీటితో అతి తక్కువ ప్రీమియంతోనే కష్టకాలంలో అధిక ఆర్థిక భరోసా లభించనుందని చెప్పారు. వరికి ఎకరాకు బీమా మొత్తం రూ.42,500 కాగా, రైతు వాటా ప్రీమియం రూ.850 చెల్లిస్తే సరిపోతుందన్నారు. వరికి సంబంధించి పథకంలో నమోదుకు ఆగస్టు 15వ తేదీ ఆఖరు తేదీ కాగా ఎర్ర మిరప, మొక్కజొన్న, పెసరకు జూలై 31 చివరితేదీ అని తెలిపారు. పత్తికి ఈ నెల 24వ తేదీలోగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. పంట రుణం తీసుకున్న రైతులకు రుణంతో పాటు అదనంగా బీమా ప్రీమియం కూడా మంజూరవుతుందని, పంట రుణాలు తీసుకోని రైతులు నమోదుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కామన్ సర్వీస్ సెంటర్లు, జాతీయ పంటల బీమా పోర్టల్, స్వర్ణ గ్రామం, తపాలా కార్యాలయాలను ఉపయోగించుకోవచ్చన్నారు. పంట రుణాలు తీసుకోని రైతులు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. పథకాలకు సంబంధించిన సమాచారం, సందేహాల నివృత్తి కోసం స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, జిల్లా ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అధికారి డీవీ శివరామ ప్రసాద్, గరికపాడు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఐ.వెంకటరెడ్డి, ప్రగతిశీల రైతు యు.మాధవరావు, యూబీఐ సీనియర్ మేనేజర్ అబ్దుల్ సలామ్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
ఆషాఢంలో భక్త ఝరి...పులకించిన ఇంద్రగిరి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు, ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసోత్సవాలలో మూడో రోజు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం 8 గంటల నుంచి అమ్మవారికి సారె సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్త బృందాలు ఆలయానికి తరలివచ్చాయి. దీంతో అమ్మవారి దర్శనానికి అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనం నిలిపివేసిన అధికారులు, సాధారణ భక్తులతో పాటు సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు బంగారువాకిలి, రూ.100 టికెట్ క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. శుక్రవారం మొత్తం 30కి పైగా భక్త బృందాలు అమ్మవారికి సారె సమర్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. పాల పొంగలి, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, చీర, రవిక, పండ్లతో మహిళలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. సారె సమర్పించే భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు త్వరితగతిన సారె సమర్పించేలా చర్యలు తీసుకుంది. సారె సమర్పించిన అనంతరం మహామండపం రెండో అంతస్తులో భక్తులకు అమ్మవారి అన్నప్రసాదాన్ని అందజేశారు. కృష్ణలంక బాలాజీనగర్కు చెందిన భవానీ భక్త బృందం వారు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. మహా నివేదన తర్వాత పెరిగిన రద్దీ శుక్రవారం, ఆషాఢం సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మరో వైపున ఉదయం 11–40 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. మహా నివేదన అనంతరం తిరిగి 12–20 గంటలకు అన్ని దర్శనాలు ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవ, దర్బారుసేవల్లో ఉభయదాతలు పాల్గొన్నారు. -
సీనియారిటీ జాబితాలో తప్పులు సరిదిద్దాలి
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల స్థానిక క్యాడర్ నిర్ణయ ప్రక్రియలో సీనియారిటీకి ఎలాంటి భంగం కలగకుండా జాబితాలో తప్పులు సరిదిద్దాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావుకు యూటీఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక క్యాడర్ నిర్ణయానికి రూపొందించిన సీనియారిటీ జాబితాలో ఉన్న తప్పులను ఆధారాలతో పరిశీలించి సరిదిద్దాలని కోరారు. ఉపాధ్యాయుల సీనియారిటీకి ఎలాంటి నష్టం కలగకుండా పారదర్శకంగా స్థానిక క్యాడర్ నిర్ణయ ప్రక్రియను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి.షౌకత్ హుస్సేన్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కనకారావు, జిల్లా గౌరవాధ్యక్షుడు జె.లెనిన్ బాబు, జిల్లా కార్యదర్శి కె.రంగనాథ్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు జె.ప్రసాదరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రవి వరప్రసాద్, అబ్దుల్ వహీద్, పి.పాపయ్య, శివకుమార్, కె.అర్జున్, వి.వి.ఎస్. సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉప్పాల నాంచారయ్య, వై.సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు సీఎం గుడివాడ పర్యటన
గుడివాడరూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం స్వచ్చభారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుడివాడకు రానున్నారు. బైపాస్రోడ్డులోని కేకేఆర్ గౌతమ్ స్కూలు వద్ద జరగనున్న స్వచ్ఛభారత్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, సీఎంవో అధికారులతో కలసి గుడివాడ బైపాస్రోడ్డు, ఇంజినీరింగ్ కళాశాల, ఏఎన్ఆర్ కళాశాలలను పరిశీలించారు. సీఎం పర్యటనలో భాగంగా ఏఎన్ఆర్ కళాశాలలో హెలీప్యాడ్, ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభ, బైపాస్రోడ్డులోని యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ ముఖ్య నేతల సమావేశ వేదికలను అధికారులు ఖరారు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్కుమార్, ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ మనోహర్, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పలు శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దుర్గమ్మ అన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విశాఖపట్నం ఇందిరాగాంధీ నగర్కు చెందిన సజ్జా రాధాకృష్ణ తన భార్య శోభారాణి, కుమార్తె మాలిని పేరిట అన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని డెప్యూటీ ఈవో కిషోర్కుమార్కు అందజేశారు. ఆగిరిపల్లికి చెందిన శివపార్వతి తన భర్త పత్తిపాటి సాంబశివప్రసాద్ పేరిట అన్నదానానికి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో విజయవాడ జీజీహెచ్లో కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా క్యాజువాలిటీకి అనుబంధంగా ఉన్న హెచ్డీయూలో 15 పడకలతో వార్డును సిద్ధం చేశారు. క్రిటికల్ కేసులకు చికిత్స అందించేందుకు మరో ఆరు పడకల ఐసీయూను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ 47 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, అందరికీ నెగటివ్ వచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. కోవిడ్ నోడల్ అధికారిగా పల్మొనాలజీ విభాగాధిపతి డాక్టర్ సుదీనా వ్యవహరించనున్నారు. హెచ్డీయూ వార్డును ఎమర్జెన్సీ మెడిసిన్కు చెందిన డాక్టర్ నూరుల్లా, ఇతర వైద్యులు పర్యవేక్షిస్తారు. డయేరియాకు వార్డు సిద్ధం నగరంలోని గిరిపురంలో డయేరియా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జీజీహెచ్లో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. డయేరియా కేసులు వస్తే ఆ వార్డులో ఉంచి చికిత్స అందించేందుకు సన్నద్ధం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి అవసరమైన ముందు జాగ్రత్తలు పాటించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ముందు జాగ్రత్తగా విజయవాడ జీజీహెచ్లో 15 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రానికి చెందిన లఘు ఉద్యోగ భారతి ప్రతినిధి బృందం గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. ఈ సందర్భంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రభావితం చేసే ముఖ్యమైన పలు సమస్యలపై ఆమెకు వినతిపత్రం అందించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు తులసి యోగేష్ తెలిపారు. ఎంఎస్ఎంఈ తయారీదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ వినతిపత్రంలో ప్రస్తావించారు. ఎంఎస్ఎంఈ వినియోగదారుల కోసం తగిన ఫాస్ట్ట్రాక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సంస్థ ప్రతినిధులు వెలగపూడి సాంబశివరావు, చాముండేశ్వరి, తరుణ్ కాకాని తదితరులు ఉన్నారు. -
ఊడలు వేసిన నిర్లక్ష్యం
విజయవాడ నగరపాలక సంస్థలో నిర్లక్ష్యం వేళ్లూనుకుపోయి వటవృక్షంలా తయారైంది. ప్రధానంగా ప్రజారోగ్యం గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. గత ఏడాది న్యూ ఆర్ఆర్ పేట ఘటనలు మరువక ముందే మళ్లీ ఈ ఏడాది గిరిపురంలో వీఎంసీ నిర్లక్ష్యానికి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. పది రోజులుగా రంగుమారిన తాగునీరు వస్తుందని ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోకపోవడంతో దాదాపు 20 మంది వరకు మంచాన పడ్డారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. మంచినీటి కుళాయిల నుంచి రంగు మారిన నీరు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదులు చేసినా అధికారులు పెడచెవిన పెట్టారు. పేదలు నివసించే కాలనీయే కదా అని చిన్నచూపేమో... పట్టించుకోలేదు. దీంతో వారం రోజులుగా ఒక్కొక్కరుగా ఆ ప్రాంత ప్రజలు డయేరియా బారిన పడుతూ ఆస్పత్రుల దారి పట్టారు. వారిలో ఒకరిద్దరు ప్రాణాపాయ స్థితి వరకూ వెళ్లి కోలుకున్నారు. గత ఏడాది న్యూ ఆర్ఆర్పేటలో... గత ఏడాది నగరంలోని న్యూ ఆర్ఆర్పేటలో ఏకంగా 300 మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. ఆ ఘటన తర్వాత కూడా అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదు. రంగునీరు వస్తున్నాయని ప్రజలు మొత్తుకుంటున్నా పాలకులు పెడచెవిన పెట్టారు. దీంతో గత ఏడాది రీతిలోనే ఇప్పుడు గిరిపురం ప్రాంత వాసులు డయేరియా బారిన పడ్డారు. ఆ ప్రాంతంలో దాదాపు 20 మంది వరకూ బాధితులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆర్వో వాటర్ సరఫరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. రంగు నీళ్లు వస్తున్నాయి సరిదిద్దండీ అంటే పట్టించుకోని అధికారులు, ఇప్పుడు డయేరియా సోకిన తర్వాత ఇంటింటికీ ఆర్వో వాటర్ను సరఫరా చేస్తున్నారు. గిరిపురంలో డయేరియా సోకిన మూడు వీధులతో పాటు, పరిసర ప్రాంతాల్లో సైతం ఆర్వో వాటర్ క్యాన్లు ఆటోల్లో తీసుకు వచ్చి సరఫరా చేస్తున్నారు. దీంతో స్థానికులు బిందెలతో తీసుకు వెళ్తున్నారు. ఎక్కడ చూసినా అపరిశుభ్రతే... గిరిపురంలోని డ్రైనేజీలు ఎక్కడ చూసినా అపరి శుభ్రంగా, కంపుకొడుతూ దర్శనం ఇస్తున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గిరిపురం ఒకటి. ఆ ప్రాంతంలో వీఎంసీ పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో ఎక్కడ చూసినా డ్రైన్లు వ్యర్థాలతో నిండిపోయాయి. పరిసరాల అపరిశుభ్రత కూడా డయేరియాకు దారితీసి ఉండవచ్చునని భావిస్తు న్నారు. శానిటేషన్ సిబ్బంది కేవలం రోడ్లు శుభ్రం చేస్తున్నారే కానీ, డ్రైన్లను పట్టించుకోవడం లేదని, దీంతో అవి మురుగు కూపాలుగా మారుతున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ మోటార్లు పనిచేయక పోవడంతో తరచూ మ్యాన్హోల్స్ నుంచి మురుగు పొంగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి కై నా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో రంగు మారిన నీళ్లు వస్తున్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడం వలనే ప్రజలు డయేరియా బారిన పడ్డారు. వారం రోజుల నుంచి ఈ ప్రాంతంలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు వచ్చి అధికారులు హడావుడి చేస్తున్నారు. ముందుగానే స్పందించి ఉంటే డయేరియా సోకేది కాదు. డ్రైన్లు మురుగు కూపాలుగా మారాయి. వాటిని వీఎంసీ పట్టించుకోవడం లేదు. పేదల కాలనీల పట్ల పాలకులకు నిర్లక్ష్యం తగదు. – కుక్కల అనిత, మాజీ కార్పొరేటర్ -
గుట్టుచప్పుడు కాకుండా..
చడీచప్పుడూ లేకుండా గృహాలకు స్మార్ట్ మీటర్ల బిగింపుపెనమలూరు: టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లపై గగ్గోలు పెట్టి.. నేడు అధికారంలోకి వచ్చిన తరువాత స్మార్ట్ మీటర్లను గృహ వినియోగదారులకు అంటగడుతోంది. ఇంటింటికీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో విద్యుత్ రీడింగ్, బిల్లింగ్ పూర్తిగా ప్రైవేటు పరం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో విద్యుత్ వినియోగదారులకు భవిష్యత్తులో షాక్ల మీద షాక్లు తగులు తాయని ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ ఎలక్ట్రానిక్ మీటర్లు(ఐఆర్) స్థానంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత కాలం విద్యుత్ వినియోగదారులు వారు వినియోగించిన విద్యుత్ను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మీటర్ రీడింగ్ తీసి వినియోగదారులకు బిల్లులు ఇచ్చేవారు. వినియోగదారులు ఆన్లైన్ లేదా విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన కౌంటర్లలో బిల్లులు అందిన 15 రోజుల్లో సొమ్ము చెల్లించేవారు. ప్రజల్లో ఆందోళన.. గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల విద్యుత్ వినియోగం కన్నా రీడింగ్ ఎక్కువగా వస్తుందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ మీటర్లు అమర్చడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎసరు పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు వినియోగించిన విద్యుత్ బిల్లు వినియోగదారుడికి వాట్సాప్ ద్వారా లేదా మెసేజ్ రూపంలో వస్తుంది. భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లను ప్రీపెయిడ్ మీటర్లుగా అమలు చేసే అవకాశం ఉండటంతో ఒక నెల ముందుగానే వినియోగదారులు సొమ్ము అకౌంట్లో బ్యాలెన్స్ ఉంచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఎక్కువ లోడ్ విద్యుత్ వాడితే వెంటనే అదనపు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. స్మార్ట్ మీటర్లు వద్దు.. గృహాలకు స్మార్ట్ మీటర్లు వద్దని ప్రజలు కోరుతున్నారు. ఈ మీటర్ల వల్ల తమకు ఒరిగేది ఏమీ లేదని చెబుతున్నారు. ప్రైవేటు సంస్థలను బాగు చేయటానికి, ప్రజలను దోచుకోవటం సరైన చర్య కాదని ఖండిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల కారణంగా తమపై భారం పడుతుందని, ఇప్పటికే విద్యుత్ బిల్లులలో రకరకాల చార్జ్లు చూపుతూ ముక్కుపిండి ప్రభుత్వం సొమ్ము వసూలు చేస్తోందని తెలుపుతున్నారు. ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానూరు సెక్షన్ పరిధిలో వినియోగదారులకు గుట్టుచప్పుడవ్వకుండా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కానూరు సెక్షన్లో దాదాపు 80వేల గృహాలు ఉన్నాయి. గతంలో వాణిజ్య సంస్థలకు స్మార్ట్ మీటర్లు పెట్టారు. గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి యత్నించగా జనాల నుంచి వ్యతిరేకత రావటంతో ఇంతకాలం ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల జోలికి వెళ్లలేదు. అయితే ఇప్పుడు చడీచప్పుడు లేకుండా సైలెంట్గా గృహాలకు విద్యుత్ ఎలక్ట్రానిక్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇళ్లల్లో ఎవ్వరు లేని సమయం చూసి స్మార్ట్ మీటర్లు ప్రైవేటు వ్యక్తులు వచ్చి అమర్చి చల్లగా జారుకుంటున్నారు. గృహ యజమానులు వచ్చి చూసేసరికి స్మార్ట్ మీటర్లు కనబడుతున్నాయి. అదే ఇంట్లో ఎవరైన ఉంటే అభ్యంతరం తెలిపితే స్మార్ట్ మీటర్లు పెట్టడం లేదు. కానీ స్మార్ట్ మీటర్లు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తామని విద్యుత్శాఖ అధికారులు చెబుతున్నారు. -
దుర్గమ్మ సేవలో హీరో అల్లరి నరేష్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను హీరో అల్లరి నరేష్ గురువారం దర్శించుకున్నారు. దుర్గాఘాట్, వీఐపీ ఘాట్తో పాటు కేఆర్ మార్కెట్, ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ మార్గంలో గత నాలుగు రోజులుగా ఆయన సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఇంద్రకీలాద్రికి చేరుకున్న అల్లరి నరేష్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను నరేష్కు అందించారు. 1980లో విజయవాడలో దుర్గమ్మ రిక్షాలో ప్రయాణించి సినిమాకు వెళ్లిన కథ ఇతివృత్తంగా సినిమా నిర్మాణం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా పెద ఓగిరాలకు చెందిన గుంటక దుర్గాప్రసాద్రెడ్డి, ఇంద్రజ దంపతులు అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ. 1,11,111, గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి చెందిన పి.మధుబాబు, కుసుమకుమారి దంపతులు అన్న ప్రసాద వితరణకు రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. ఆలయ పర్యవేక్షకులు డీవీవీ సత్యనారాయణ, ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. విజయవాడ కల్చరల్: విజయవాడకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, శతాధిక గ్రంథకర్త, ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ జీవీ పూర్ణచందును 2026 ఏడాదికిగానూ లోకగురు పురస్కారానికి ఎంపిక చేసినట్లు వికాస విద్యార్థి వాహిని వ్యవస్థాపక అధ్యక్షుడు వేములపల్లి కేశవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బందరురోడ్డులోని సర్వోత్తమ గ్రంథాలయంలో 29వ తేదీ సాయంత్రం పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి వికాస వాహిని, గురుపూర్ణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషసాయితోపాటు పలువురు సాహితీవేత్తలు, రచయితలు భాషా సేవకులు పాల్గొంటున్నారన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించేలా వినూత్న కృషితో అధ్యయన పుస్తకాలను రూపొందిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ.. విద్యాశాఖ అధికారులతో కలిసి గురువారం కలెక్టరేట్లో హిందీ స్టడీ మెటీరియల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ముఖ్యమైన అంశాలను సమగ్రంగా పొందుపరిచిన ఈ స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డీఈవో ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త రమేష్ బాబు, జిల్లా ఉమ్మడి పరీక్షల మండలి కార్యదర్శి ఉమర్ అలీ, హిందీ రిసోర్స్ పర్సన్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
3 విభాగాల్లో ప్రపంచ ఫొటోగ్రఫీ డే పోటీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశేష ప్రతిభకనబరిచిన ఫొటోగ్రాఫర్లకు ఆగస్ట్ 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాస్థాయిలో పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఫొటోగ్రఫీ పోటీల పోస్టర్లను సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, ఫొటో జర్నలిస్టులతో కలిసి గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని ఫొటో జర్నలిస్టులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, స్టూడియో ఫొటోగ్రాఫర్లు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. మూడు విభాగాల్లో జరిగే ఈ పోటీలకు ఆగస్టు ఐదో తేదీలోగా ఎంట్రీలు పంపాలని సూచించారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.10 వేలు, రూ.7 వేలు, రూ.4 వేలు, ఆరుగురికి ప్రోత్సాహక నగదు బహుమతులుగా రూ.2 వేల చొప్పున అందిస్తామని వివరించారు. ఒకరు ఒక విభాగం నుంచి మూడు ఫొటోలు చొప్పున తొమ్మిది ఫొటోలు పంపొచ్చని సూచించారు. 2025, జూన్ 12 నుంచి 2026, జులై 31 మధ్య తీసిన ఫొటోలను డీపీఆర్వో కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్, విజయవాడ– 520002 చిరునామాకు నేరుగా లేదా పోస్టల్ ద్వారా పంపాలని, ఇతర వివరాలకు డివిజనల్ పీఆర్వో కె.రవి (90101 56550)ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమాచార, పౌర సంబంధాల శాఖ డీఐపీఆర్వో కె.వి. రమణరావు, డీపీఆర్వో టి.నాగేశ్వరరావు, డివిజనల్ పీఆర్వో కె.రవి, వి.వి. ప్రసాద్, పలువురు ఫొటో జర్నలిస్టులు పాల్గొన్నారు. -
నేడు రాయనపాడు రైల్వేస్టేషన్ జాతికి అంకితం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోని రాయనపాడు రైల్వేస్టేషన్ను శుక్రవారం జాతికి అంకితం చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబీఎస్ఎస్) కింద రూ.12.13 కోట్లతో చేపట్టిన పునరుద్ధరణ పనులు పూర్తవడంతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. నిత్యం 250 రైళ్లు, 1.40 లక్షల మంది ప్రయాణికులతో విజయవాడ రైల్వేస్టేషన్లో అధిక రద్దీ నెలకొనడంతో రాయపాడు స్టేషన్ను శాటిలైట్ స్టేషన్గా ఆధునికీకరించారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆధునిక బహుళ అంతస్తులతో స్టేషన్ భవన నిర్మాణాలు జరిగాయి. గ్రీనరి, ఏసీ, నాన్ ఏసీ వెయిటింగ్ హాళ్లు, ప్లాట్ఫారాల పొడిగింపు, ఎస్కెలేటర్లు, లిఫ్ట్లు, ఫుట్ బ్రిడ్జి, రిజర్వేషన్ కౌంటర్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు, మాడ్యూలర్ టాయిలెట్లు వంటి వసతులు కల్పించారు. -
మనసారా.. కొలి‘సారె’
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో రెండో రోజైన గురువారం పెద్ద ఎత్తున భక్తులు, ప్రముఖులు అమ్మవారికి సారెను సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దంపతులు అమ్మవారికి సారె సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. సారె ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ దంపతులకు ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధా కృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. మరో వైపు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సైతం గురువారం అమ్మవారికి సారెను సమర్పించారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పట్టుచీర, పూలు, పసుపు, కుంకుమ, పూజా సామగ్రికి సమర్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో, చైర్మన్లు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. తరలివచ్చిన భక్త బృందాలు.. సారెను సమర్పించేందుకు ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్త బృందాలు, భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. 26కు పైగా భక్త బృందాలలో మొత్తం 9 వేల మందికి పైగా భక్తులు అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారికి సారెను సమర్పించిన భక్త బృందాలకు భవానీ అనుగ్రహ దర్శన్ క్యూలైన్(100 టికెట్)ద్వారా అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పించారు. అనంతరం మహా మండపం రెండో, మొదటి అంతస్తులలో దేవస్థానం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసింది. వీకెండ్లో అంతరాలయ, వీఐపీ దర్శనాలు రద్దు.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు అంతరాలయ, వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. వీకెండ్ రద్దీకి తోడు ఆషాఢ మాసోత్సవాల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. మరో వైపున ఆలయ ప్రాంగణంలో టికెట్ల కౌంటర్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు కొండ దిగువన కనకదుర్గనగర్, ఓం టర్నింగ్ పాయింట్, ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం, మహామండపం దిగువన కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి
చిలకలపూడి(మచిలీ పట్నం): గ్రామాల్లో స్వచ్ఛరథం కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ జె.అరుణ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం ఉమ్మడి కృష్ణాజిల్లా ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మూడు సంవత్సరాలుగా మండల పరిషత్ ఆదాయ వనరుల భాగస్వామ్యంతో చేపట్టిన పనుల వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని ఆరుణ కోరారు. ఆదాయ వనరులకు మించి పనులు మంజూరు చేసే వాటి వివరాలను కూడా తెలపాలని, లేకుంటే వాటిని వెంటనే రద్దు చేయాలని సూచించారు. గ్రామాల్లో సిమెంటు రోడ్లు, డ్రెయిన్లతో పాటు తాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి నిధులు వెచ్చించి సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ రథం కార్యక్రమంలో నిత్యం మండల పరిధిలోని గ్రామాలను తనిఖీ చేసి పారిశుద్ధ్యం మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ సంబంధించి ఆస్తుల వివరాలను నివేదిక రూపంలో అందజేయాలన్నారు. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటి ద్వారా ఆదాయ వనరులు పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనందకుమార్ పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ అరుణ -
సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్ నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా చేసుకుని పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. ఏపీకే ఫైల్స్ ద్వారా జరిగే నేరాలను ఛేదించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై పోలీసు అధికారులు సైతం అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. పోలీస్ కమిషనరేట్లో సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులను పాటు, అన్ని పోలీస్స్టేషన్ల అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు బాధితుడితో మాట్లాడేటప్పుడు సేకరించాల్సిన సమాచారం, సాక్ష్యాలను సేకరించే విధానం తదితరాలను వివరించారు. మాట్లాడుతున్న సీపీ రాజశేఖరబాబు -
బుక్ ఫెస్టివల్ బాబ్జీ అస్తమయం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రముఖ పబ్లిషర్, విజయవాడ పుస్తకమహోత్సవ సంఘం పూర్వ అధ్యక్షుడు బెల్లపు బాబ్జీ (78) గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. కొద్ది కాలంగా ఆయన కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన పార్థివ దేహాన్ని రామవరప్పాడు సమీ పంలో వైస్ఎల్వీ అమరావతీ గ్రాండ్–1లోని స్వగృహంలో ఉంచారు. వైద్య విద్యార్థుల ఉపయోగార్థం ఆయుష్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి బాబ్జి పార్థివ దేహాన్ని శుక్రవారం అప్పగించనున్నారు. బాబ్జీకి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీకి 2015–16, 2016–17 కాలంలో రెండు సార్లు అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2018 నుంచి 2024 వరకూ గౌరవాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పుస్తక మహోత్సవం స్వరాజ్యమైదానం నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ మైదానానికి, అక్కడి నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియానికి మారిన సందర్భాల్లో ప్రదర్శనను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రచురణ కర్తగా.. బెల్లపు బాబ్జీ 1948 ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా, దోసపాడు గ్రామ సమీపంలోని రావులపాడులో రైతు బెల్లపు వేణు గోపాలరావు, వెంకటేశ్వరమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పెద్ద తండ్రి వెంకట్రామయ్య విశాలాంధ్ర సంస్థలో పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆ క్రమంలో ఆయన చొరవతో విజయవాడకు వచ్చిన బాబ్జీ కొద్ది రోజులు ఆయనతో కలిసి అడుగులు వేశారు. అనంతరం 1968లో స్టూడెంట్ బుక్ సెంటర్ అనే ప్రచురణ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి పాఠ్యపుస్తకాలు, పలు ప్రముఖ ప్రచురణ సంస్థల పుస్తకాలను విక్రయిస్తూనే తమ సంస్థ పేరు మీద ప్రముఖ రచయితల రచనలను ప్రచురించారు. వాసిరెడ్డి సీతాదేవి వంటి ప్రముఖుల రచనలతో పాటుగా బాపు, బాలి వంటి ప్రముఖుల చిత్రాలతో కూడిన పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. బుక్ ఫెస్టివల్ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా.. నేషనల్ బుక్ ట్రస్ట్ సహకారంతో 1989లో విజయవాడలో తొలి సారిగా పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేయగా బాబ్జీ దానిలో కీలక పాత్ర పోషించారు. నగరంలోని పుస్తక ప్రచురణకర్తలు 1990లో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవస్థాపక సభ్యుడిగా ఆయన కీలక భూమిక పోషించారు. అప్పటి నుంచి 35 సంవత్సరాల పాటు విజయవాడ పుస్తక మహోత్సవం విజయవంతమయ్యేలా కృషి చేశారు. ప్రచురణకర్తల మధ్య సమ న్వయం, అతిథులతో కార్యక్రమాల రూపకల్పనలో ఆయనదే కీలక పాత్ర. బాబ్జీ పార్థివ దేహం వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. బాబ్జీ మరణం సొసైటీకి తీరని లోటుని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు టి.మనోహర్నాయుడు పేర్కొన్నారు. పలు సంస్థల నిర్వాహకులు, బాధ్యులు, సాహితీవేత్తలు, జర్నలిస్టు సంఘాల బాధ్యులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. -
యువ రచయితల ఉత్సవానికి సోనీకి ఆహ్వానం
కంచికచర్ల: కేంద్ర సాహిత్య అకాడమీ దక్షిణ భారత యువ రచయితల ఉత్సవంలో పాల్గొనాలని తనకు ఆహ్వానం వచ్చిందని కంచికచర్ల గ్రామానికి చెందిన కవి, రచయిత తంగిరాల సోనీ గురువారం తెలిపారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆరు రాష్ట్రాల నుంచి కన్నడ, కొడవ, మళయాళం, తుళు, మలైయాళి, తెలుగు భాషల నుంచి యువ కవులను ఎంపిక చేశారని సోనీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తరఫున కేంద్ర సాహిత్య అకాడమీ బెంగళూరు నుంచి తనకు ఆహ్వానం అందిందని పేర్కొన్నారు. సోనికి పలువురు కవులు, కళాకారులు, రచయితలు అభినందనలు తెలిపారు. గన్నవరం: క్రికెట్ మ్యాచ్లో తలెత్తిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కేసరపల్లి శివారు వి.ఎన్.పురం కాలనీకి చెందిన ఈడే వెంకటరామ చంద్(17) ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ఈ నెల 14వ తేదీన స్థానిక జెడ్పీ బాలుర హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వచ్చాడు. మ్యాచ్ విషయమై వెంకటరామచంద్, గన్నవరానికి చెందిన గోపీచంద్ మధ్య వివాదం తలెత్తింది. వీరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి గురైన గోపీ చంద్తో పాటు ఆతని స్నేహితులు రాకేష్, ఆనంద్, మణికంఠ బ్యాట్తో వెంకటరామ చంద్ను తీవ్రంగా కొట్టారు. తలకు బలమైన గాయాలైన వెంకటరామచంద్ విజయవాడ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు. అతడి మృతదేహానికి గురువారం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీఎన్.పురం కాలనీలో వెంకటరామచంద్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడు తండ్రి ఈడే దుర్గాపవన్కుమార్, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో వెంకట రామచంద్ పాడెను వంశీమోహన్ మోశారు. -
అనాథలకు దక్కని వాత్సల్యం
సాక్షి, విజయవాడ: సమాజంలో వివిధ కారణాలతో అనాథలుగా మారుతున్న చిన్నారులు, దిక్కులేని అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రవేశపెట్టిన పథకం ‘మిషన్ వాత్సల్య’. ఈ పథకం లబ్ధి కోసం ఎన్టీఆర్ జిల్లాలో ఎంతో మంది అనాథలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో అమ లయ్యే ఈ పథకాన్ని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ), ఐసీడీఎస్ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. క్షేత్రస్థాయిలో పథకం గురించి ఐసీడీఎస్ సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడంతో ఈ పథకం కొందరికే అందుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అభాగ్యుల కోసమే పథకం తల్లిదండ్రులను కోల్పోయిన 18 ఏళ్ల లోపు అనాథ పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం వర్తిస్తుంది. 2022లో కేంద్ర ప్రభుత్వంలోని ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పాబ్) అనుమతుల మేరకు ఈ పథకాన్ని మూడేళ్ల పాటు పకడ్బందీగా అమలు చేశారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఈ ఏడాది సరికొత్త మార్గదర్శకాలు ఇంకా రాలేదు. మరోవైపు మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఏటా వందల సంఖ్యలో చిన్నారులు లబ్ధి పొందుతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు లేని చిన్నారులు, పలు కారణాలతో కుటుంబానికి దూరమైన పిల్లలు చాలామంది ఉన్నప్పటికీ, వారికి ఈ పథకం గురించి తెలియక లబ్ధి కోల్పోతున్నారు. వాటికే మొదటి ప్రాధాన్యత మిషన్ వాత్సల్య పథకానికి ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పాబ్)కు 450 మొదటి ప్రాధాన్యత దరఖాస్తులు సమర్పించారు. ఇప్పుడు వచ్చే గైడ్లైన్స్ ఆధారంగా వీటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, తరువాత కొత్తవి స్వీకరిస్తామని ఆయా శాఖల సిబ్బంది చెబుతున్నారు. కొత్తగా తీసుకునే వాటిని రెండో ప్రాధాన్యత కింద స్వీకరి స్తారు. ఇందులో కేంద్రప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కలిపి లబ్ధిదారుల ఖాతాల్లో నెలకు రూ.4 వేల చొప్పున జమ చేస్తారు. 2022లో ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా 14 వేలకుపైగా దరఖాస్తులు రాగా, జిల్లాల పునర్విజన తరువాత ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి సుమారు ఏడు వేల మేర దరఖాస్తులు వచ్చాయి. వాటిని స్క్రూటినీ చేసి పక్కాగా అర్హత ఉన్న 551 మందికి మూడేళ్లపాటు లబ్ధి చేకూర్చారు. అయితే అంతకుముందు ఐసీపీఎస్ (ఇంటి గ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్) ద్వారా లబ్ధిదారుడికి కేవలం రూ.1500 మాత్రమే ఇచ్చేవారు. అయితే ఆ పథకాన్ని 2022లో నాటి కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వాలు ఐసీపీఎస్ను మిషన్ వాత్సల్యగా మార్చడంతో పాటు నగదు కూడా రూ.4 వేలకు పెంచి ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే మొత్తం ఇవ్వనున్నారు. సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తులు ఇచ్చేందుకు పెద్దఎత్తున అర్హులు వేచి చూస్తున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు ఈ మిషన్ వాత్సల్య పథకానికి సిఫార్సులు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకానికి అర్హత ఉన్న వారిని ఎంపిక చేసేవారు. గతంలో ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఆర్ఫన్స్ (అనాథలు), సెమీ ఆర్ఫన్స్ (తల్లి లేదా తండ్రి మాత్రమే జీవించి ఉంటే), హెచ్ఐవీ బాధితుల పిల్లలు ఈ పథకానికి అర్హులు. ఇప్పుడు సోషల్ మీడియాలో పథకం గురించి విస్తృతంగా ప్రచారం అవుతోంది. అందులో విడాకులు తీసుకున్న జంటల పిల్లలు, యాసిడ్ బాధితులు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి పిల్లలకు కూడా మిషన్ వాత్సల్య పథకం వర్తిస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో ఆయా వర్గాల నుంచి భారీగా దరఖాస్తులు ఇచ్చేందుకు వేచి ఉన్నారు. 2026 మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు ఉన్న ఆర్ఫన్ (అనాథ), సెమీ ఆర్ఫన్ (తల్లి లేక తండ్రిని కోల్పోయిన బిడ్డలు), హెచ్ఐవీ బాధిత పిల్లలు అర్హులు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే లబ్ధిదారుల ఖాతాల్లో ఒక ఏడాదికి సంబంధించి ఒకేసారి నగదు జమ అవుతుంది. ఎన్ని నెలలు సహాయం అందుతుందనేది కేంద్రం విడుదల చేసే నిబంధనలు, నిధులపై ఆధారపడి ఉంటుంది. -
తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం
స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి సక్రమంగా సరఫరా చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ కన్వెన్షన్ హాలులో గురువారం 1వ స్థాయీ సంఘం (ప్లానింగ్, ఆర్థికం), 7వ స్థాయీ సంఘం (పనులు) సమావేశాలు చైర్పర్సన్ అధ్యక్షతన జరిగాయి. ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పనులకు సంబంధించిన పరిపాలనా అనుమతుల మంజూరు, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అనుమతులు పొందిన పనులను వెంటనే ప్రారంభించి, ప్రస్తుత పదవీకాలం ముగిసేలోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జెడ్పీటీసీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరం ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ నెల 24 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే సాధారణ సర్వసభ్య సమావేశాన్ని అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి.. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కొత్త సమావేశ మందిరం, చాంబర్ ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయని హారిక చెప్పారు. జిల్లా పరిషత్కు చెందిన భూముల్లో కొబ్బరి, కోకో, జీడిమామిడి, క్యాజూరినా వంటి వాణిజ్య పంటల సాగు ద్వారా ఆదాయం పెరగడంతో పాటు భూముల ఆక్రమణలను కూడా నివారించవచ్చన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తకుండా సంతృప్తి స్థాయిలో (సాచ్యురేషన్ మోడ్) తాగునీటి సరఫరా కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో నాణ్యమైన తాగునీరు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జెడ్పీ సీఈవో జె. అరుణ మాట్లాడుతూ స్థాయి సంఘ సమావేశం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను రూపొందించుకునే విధంగా ఉండాలన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంపొందించి ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థాయీ సంఘాల ఆమోదంతో తీసుకున్న అంశాలను రాబోయే సర్వసభ్య సమావేశంలో ఆమోదానికి ఉంచనున్నట్లు తెలిపారు. సమావేశంలో డెప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ముద్రగడకు ఘన నివాళులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని పార్టీ కార్యాలయంలో బుధ వారం ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి దేవినేని అవినాష్, ఇతర పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాపు ఉద్యమ నేతగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం, కాపు వర్గాల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం నిరంతరం ఉద్యమించిన నాయకుడిగా ఎల్లప్పుడూ గుర్తుండిపోతారన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భగవంతుడు వారికి ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పార్లమెంట్ కార్యదర్శిలు తంగిరాల రామిరెడ్డి, ఆళ్ల చెల్లారావు, మాజీ కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవళ్లిక, పుప్పాల కుమారి, కలపాల అంబేడ్కర్, అనుబంధ విభాగాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 20267పులిచింతల సమాచారం అచ్చంపేట: ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 30.6140 టీఎంసీలు. ఎగువ ప్రాంతాలనుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు అంతే నీరు వదులుతున్నారు. మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా మలేరియా అధికారిగా అల్లాడి జ్ఞానశ్రీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా ఆలయ సిబ్బంది బుధవారం సారె, బోనాలు చెల్లించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
దుర్గమ్మ నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువత వృత్తి విద్యాకోర్సులపై దృష్టి పెట్టడం ద్వారా వారు జీవనోపాధి పొందడమే కాకుండా మరి కొంత మందికి ఉపాధి చూపించవచ్చని ఎన్టీఆర్ జిల్లా సహాయక నిపుణ్యాభి వృద్ధి అధికారి బి.కిరణ్కుమార్ పేర్కొన్నారు. స్థానిక రావిచెట్టు సెంటర్లో ఉన్న జనశిక్షణ సంస్థాన్ కార్యాలయం ఆవరణలో ప్రపంచ యవజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా బుధవారం సదస్సు జరిగింది. జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సులను నేర్చుకున్న వారు ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని సొంతంగా యూనిట్లను స్థాపించవచ్చని వివరించారు. -
మహిళా రిజర్వేషన్ల అమలుకు చొరవ చూపాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని, అందుకు పార్టీ లకు అతీతంగా అన్ని పార్టీలు చొరవ చూపాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల ఐక్యవేదిక కోరింది. ఈ మేరకు వారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవి నేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, మల్లాది విష్ణును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ.. 2023లో భారత రాజ్యాంగ (106వ రాజ్యాంగ సవరణ) చట్టం ద్వారా మహిళా రిజర్వే షన్లకు చట్టబద్ధత కల్పించినా జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు వాయిదా వేయడంతో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈ షరతులు లేకపోయి ఉంటే ప్రస్తుత లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం 33 శాతం ఉండేదని, అయితే అది 14 శాతానికి కూడా చేరలేదని వివరించారు. సుమారు 185 దేశాల జాతీయ పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం విషయంలో భారత దేశం 151వ స్థానంలో ఉండటం దేశానికి అవమానకరమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా మహిళా ఉద్యమాలు సాగించిన పోరాటాల ఫలితంగా వచ్చిన ఈ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న తాత్సారం, మహిళల రాజకీయ సాధికారతను అడ్డుకోవడం కారణమని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్ వంటి వివాదాస్పద అంశాలతో ముడిపెట్టకుండా రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి వెంటనే అమలయ్యేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్య దర్శి వి.సావిత్రి, అధ్యక్షురాలు శ్రీదేవి, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి.పద్మ, సీఎంఎస్ నాయకులు ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాల ఐక్య వేదిక వినతి -
హిట్లర్లా నియంతృత్వ పోకడలు తగదు
సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి గన్నవరం: రాష్ట్ర ప్రభుత్వ వైఫలాల్యలను ప్రశ్నించిన ప్రశ్న రావణ్పై రాజద్రోహం వంటి కేసులు నమోదు చేయడం దుర్మార్గమని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. గన్నవరం కోర్టులో రావణ్ కస్టడీ పిటీషన్పై వాదనలు వినిపించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రావణ్ను కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ను పోలీసులు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. విచారణ దశలో ఉన్న కస్టడీ పిటీషన్లో బలం లేదని ఉపసంహరించుకోవడం తన న్యాయవాద వృత్తిలో తొలిసారి చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలోని ఓ వ్యక్తిని సంతృప్తి పరిచేందుకు రావణ్పై రాజద్రోహం వంటి క్రూరమైన చట్టాలను ప్రయోగించడం సరికాదన్నారు. ఇది న్యాయ సమ్మతం కాదనే ఉద్దేశంతో రావణ్కు మద్దతుగా వాదించేందుకు ముందుకువచ్చినట్లు చెప్పారు. నిజంగా దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా రావణ్ వ్యాఖ్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వమే ఎన్ఐఏ వంటి కేసు నమోదు చేయాలని సూచించారు. కానీ రాష్ట్రంలో కూటమి పార్టీల భద్రత కోసమే ఈ అక్రమ కేసులు పెట్టినట్లుగా ఉందన్నారు. హిట్లర్ మాదిరిగానే కూటమి ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందన్నారు. ఇదే పంథా కొనసాగితే రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రక్షణ ఉండదన్నారు. ప్రభుత్వాన్ని గొంతెత్తి ప్రశ్నించిన, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరిన రావణ్కు పట్టిన గతే పడుతుందని కూటమి పాలకులు సాంకేతాలు ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటికై న ప్రజాస్వామ్యవాదులందరూ గొంతెత్తాలని కోరారు. హిడ్మా మృతిపై చేసిన వ్యాఖ్యలకు రావణ్ను ఉరితీసేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులపై పెట్టే ఉపా కేసులను యూట్యూబర్ రావణ్పై నమోదు చేయడమంటే ఇంత కంటే దుర్మార్గం రాష్ట్రంలో మరోకటి ఉండదని మరో సీనియర్ న్యాయవాది సుదర్శన్రెడ్డి తెలిపారు. గతంలో కూడా భావప్రకటన స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు పెట్టిందన్నారు. న్యాయవాదులు తిరివీధి వెంకయ్య, టి. కట్రావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): ఓ తాపీ మేస్త్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణలంక గౌతమీనగర్ రెండో లైన్లో గొర్రెల బంగార్రాజు (48) కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు. అతని భార్య ఇళ్లల్లో పనిచేస్తోంది. కుమార్తెలిద్దరు చదువుకుంటున్నారు. అతను ఆర్థిక సమస్యలతో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. 11 గంటల వర కు కుటుంబ సభ్యులు సరదాగా మాట్లాడుకుని నిద్రకు ఉపక్రమించారు. అతను మాత్రం పక్క బెడ్రూంలో పడుకుంటానని చెప్పి లోపలకు వెళ్లి తలుపులు వేసుకున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు నిద్ర లేచినా అతను మాత్రం లేవలేదు. తలుపు తట్టినా ఉలుకూపలుకూ లేదు. గోడకు ఉన్న రంధ్రంలో గుండా లోపలికి చూడగా ఫ్యాన్ హుక్కు చున్నీతో ఉరేసుకుని వ్రేలాడుతూ కనిపించాడు. స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
వైఎస్ జగన్ కృషి ఫలితం.. వైద్య విద్యకు వరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య రంగానికి 2019–24 మధ్య ఒక స్వర్ణయుగం అని వైద్యరంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్టం చేసేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా ఉదారంగా నిధులు మంజూరు చేసి, రానున్న రోజుల్లో అదనంగా సీట్లు మంజూరుకు అవసరమైన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో 250 సీట్లకు అనుగుణంగా రూ.90 కోట్లతో అదనపు గదుల నిర్మాణాలు చేపట్టారు. ఆయన చేసిన కృషికి ఫలితంగా ఇప్పటికే ఉన్న 175 సీట్లకు అదనంగా మరో 75 సీట్లు ఎన్ఎంసీ(నేషనల్ మెడికల్ కమిషన్) మంజూరు చేసింది. రూ.90 కోట్లతో నిర్మాణాలు.. రాష్ట్రంలోని బోధనాస్పత్రులను నాడు–నేడు పనుల ద్వారా అభివృద్ధికి నాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో రూ.170 కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టాలని అంచనా వేశారు. అందులో భాగంగా తొలివిడగా రూ.90 కోట్లతో 250 సీట్లకు అనుగుణంగా సిద్ధార్థ వైద్య కళాశాలలో తరగతి గదులు, లేబొరేటరీలు, లైబ్రెరీ వంటి సౌకర్యాల కోసం నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో వేగంగా జరిగిన పనులు, ప్రస్తుతం నత్త నడకన సాగుతున్నాయి. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తికాగా, ఇంకా ఎలక్ట్రికిల్, డ్రెయినేజీ, వాటర్ పైప్లైన్ వంటి పనులు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రిలో సైతం అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. సౌకర్యాల కల్పనతోనే సాధ్యం.. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఇప్పటికే 175 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిని అదనంగా మరో 75 సీట్లు మంజూరు చేయాలని ఈ ఏడాది కళాశాల తరఫున నేషనల్ మెడికల్ కమిషన్కు దరఖాస్తు చేశారు. దీంతో ఎన్ఎంసీ బృందం వచ్చి తనిఖీలు చేసింది. ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న భవనాలతో పాటు, ప్రభుత్వాస్పత్రిలోని సౌకర్యాలను చూసి, సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎంఆర్ఐ, సీటీ స్కాన్లతో పాటు, ఎంబీబీఎస్ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయంటూ మరో 75 సీట్లు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. సిద్ధార్థ వైద్య కళాశాలలో 2014–19 కాలంలో ఒక్క అదనపు సీటు కూడా మంజూరు కాలేదు. కానీ 2019–24 సమయంలో సౌకర్యాల కల్పనతో పలు విభాగాల్లో దాదాపు 80 పీజీ సీట్లు మంజూరు అయ్యాయి. అంతేకాదు సూపర్ స్పెషాలిటీ విభాగాలైన న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో సైతం ఒక్కో విభాగంలో ఐదు సీట్లు మంజూరు అయ్యాయి. వాటితో పాటు ఈఎన్టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి విభాగాల్లో కూడా సీట్లు మంజూరయ్యాయి. దీంతో ప్రభుత్వాస్పత్రిలో పీజీలు ఏడాదికి వంద మంది చొప్పున పెరగనున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లు అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్యం అందుతుంది. వైద్య రంగానికి వైఎస్ జగన్ జీవం పోశారు. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు వెంటిలేటర్పై ఉన్నాయి. అలాంటి ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా, వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు పెద్ద ఎత్తున చేపట్టారు. 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఉన్న కళాశాలలను అభివృద్ధి చేసి మరిన్ని సీట్లు వచ్చేలా కృషి చేశారు. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ, వైద్య విభాగం -
సారె సంబరాలకు సర్వం సిద్ధం
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆదిదంపతులు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై బుధవారం నుంచి ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 7గంటలకు ప్రధాన ఆలయంలోని అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తిని ఊరేగింపుగా మహామండపం ఆరో అంతస్తుకు తీసుకువస్తారు. ఆరో అంతస్తులో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఉదయం 7.30 గంటలకు ఆలయ అర్చకులు ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి తొలి సారెను సమర్పిస్తారు. రూట్ ప్లాన్ ఇదే.. సారె సమర్పణలకు వచ్చే భక్తులు ఘాట్రోడ్డు, మహామండపం ద్వారా కొండపైకి చేరుకుంటే తొలుత ప్రధాన ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి ఆరో అంతస్తుకు చేరుకుని ఉత్సవ మూర్తి వద్ద సారెను సమర్పించి పూజలు జరిపించుకునేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. అమ్మవారికి సారె సమర్పించిన పిమ్మట భక్తులు తమతో తెచ్చిన పండ్లు, మిఠాయిలు, ఇతర పూజా సామగ్రిని తొటి భక్తులకు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక ఈ కార్యక్రమం అంతా అయిన అనంతరం భక్తులకు మహామండపం రెండు, మొదటి అంతస్తుల్లో జరిగే ఉచిత అన్న ప్రసాద వితరణకు పంపుతారు. అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులు నేరుగా కనకదుర్గనగర్కు చేరుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ఆరో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు ఇక ఆరో అంతస్తులో భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులందరూ ఒక వరస క్రమంలో కూర్చునేలా రోప్లను ఏర్పాటు చేసింది. అమ్మవారికి సమర్పించే పూజా సామగ్రి కోసం వేదిక ఎదుట ప్రత్యేకంగా బల్లలు ఏర్పాటు చేసింది. సారెలో భాగంగా అమ్మవారికి సమర్పించే ప్రతి చీరకు తప్పని సరిగా రశీదు ఇచ్చేలా దేవస్థానం కౌంటర్ను, సిబ్బందిని నియమించనుంది. మొబైల్ఫోన్లు, కెమెరాలతో నో ఎంట్రీ ఈ దఫా మొబైల్ఫోన్లు, కెమెరాలతో ఆలయంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులను అనుమతించమని దేవస్థాన అధికారులు పేర్కొంటున్నారు. కనకదుర్గనగర్లోనే భక్తుల లగేజీ, చెప్పులు, సెల్ఫోన్లను భద్రపరిచేందుకు వేరు వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. ఆలయ ప్రాంగణం, ఆరో అంతస్తులో సెల్ఫోన్ కలిగిన భక్తుల నుంచి వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తామని ఆలయ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
22న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసనలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశంలోకి ఆ దేశ ఉత్పత్తులు అధికంగా వస్తాయి. మన రైతులు పండించిన పంటలకు ధరలు భారీగా తగ్గిపోతాయి. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది. రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగిపోతాయి.’ అని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. విజయవాడలో మంగళవారం రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం జరిగింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేయవద్దని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతులతో సంతకాలు చేయించి రిజిస్టర్ పోస్టు ద్వారా ఈ నెల 21లోపు రాష్ట్రపతికి పంపాలని నిర్ణయించారు. ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై.కేశవరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రైతు సంఘాల నాయకులు మల్నీడి యల్లమందరావు, మరీదు ప్రసాద్బాబు తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘాల సమన్వయ సమితి -
దిక్కులు చూస్తూ!
సాక్షి, విజయవాడ : ఉమ్మడి కృష్ణా జిల్లాపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదవుతోంది. కృష్ణా నదికి ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో వరదలు రాకపోవడంతో డెల్టాకు ఈసారి సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణంలో ఏర్పడిన అసమతుల్యత కారణంగా జూన్లో 108.6 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 142.7 మి.మీ. పడింది. జూలై నెల చివరి నాటికి 234.5 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉంది. ఈ నెల 13వ తేదీ నాటికి 87.4 శాతం వర్షం పడాల్సి ఉండగా.. 5.6 మి.మీ మాత్రమే కురిసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నా చంద్రబాబు ప్రభుత్వం సాయం అందించకుండా ఎల్నినోపైనే నింద వేసి తప్పించుకునే యత్నం చేస్తోంది. ముందస్తు నీటి నిల్వలు చేపట్టకపోవడంతో మరింత ఇక్కట్లు తలెత్తుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు.. పంటలపై ఎఫెక్ట్ కృష్ణా జిల్లా పరిధిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా రైతులు నారుమడులు పోసేందుకు మొగ్గు చూపడం లేదు. అయితే పట్టిసీమ నీరు కృష్ణానదికి వస్తుండడంతో ఆ నీరు అందే అవకాశం ఉన్న రైతులు మాత్రం కాసింత ఆశగా ఉన్నారు. పట్టిసీమ నుంచి 7,080 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తుండగా, ఎగువ ప్రాంత రైతుల వినియోగం పోగా మిగిలిన 5,500 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోందని, గుంటూరు కాలువతో పాటు, జిల్లాలోని బందరు, కేఈబీ, రైవస్ తదితర ప్రధాన కాలువలకు ఆ నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కృష్ణా డెల్టాలోని అన్ని ప్రధాన కాలువలకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలంటే 18,600 క్యూసెక్కుల నీరు అవసరం కాగా ప్రస్తుతం విడుదల చేస్తున్న 5,500 క్యూసెక్కుల నీరు ఎంతమేర పంటలను కాపాడుతుందనేది వేచి చూడాలి. జూన్ నుంచి జూలై 12వ తేదీ వరకు జిల్లాలో 145.22 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 99.93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగితే పంటల సాగు సమయం మించిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు కావాల్సింది ప్రస్తుతం–2026 (హెక్టార్లలో) ఖరీఫ్ నాటికి వరి 48,831 1,127 జొన్న 2 0 మొక్కజొన్న 3,729 1,707 కంది 453 76 పెసర 3,796 2,340 మినుము 2833 1666 శనగ 1 0 వేరుశనగ 39 00 నువ్వులు 26 00 ఆముదం 4 0 కాటన్ 34,057 18,378 చెరుకు 428 43 మొత్తం 94,197 25,336 పంట సాగు కావాల్సింది ప్రస్తుతం (హెక్టార్లలో) సాగైనది వరి 1,60,655 17,085 మొక్కజొన్న 56 22 కంది 11 00 పెసర 2 00 మినుము 1,412 00 ఉలవ 3 00 వేరుశనగ 661 00 కాటన్ 330 72 చెరుకు 2,641 852 మొత్తం 1,65,771 18,031 -
ప్రశ్న రావణ్ కస్టడీ పిటీషన్ ఉపసంహరణ
గన్నవరం: యూట్యూబర్ ప్రశ్న రావణ్ను కస్టడీ కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ను పోలీసులు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు గన్నవరం కోర్టులో మంగళవారం కస్టడీ పిటీషన్పై జరిగిన విచారణ సమయంలో పిటీషన్ ఉపసంహరించుకున్నట్లు ఏపీపీ కోర్టుకు తెలిపారు. గన్నవరం పోలీసులు రాజద్రోహం తదితర సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులో ఈనెల 4న అరెస్టయిన రావణ్ నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం రావణ్ను పది రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ స్థానిక ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈనెల 10న పిటీషన్ విచారణకు ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు హాజరుకాకపోవడంతో 14కి విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈక్రమంలో మంగళవారం జరిగిన విచారణకు రావణ్ తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్రెడ్డి, సుదర్శనరెడ్డి హాజరయ్యారు. అయితే కస్టడీ ిపిటీషన్ను ఉపసంహరించుకుంటున్నట్లుగా పోలీసుల తరఫున ఏపీపీ మాధవి కోర్టుకు తెలిపారు. ఈ పిటీషన్లో లోపాలను సవరించి తిరిగి కొత్తగా మరో కస్టడీ పిటీషన్ ను పోలీసులు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
అమ్మ సన్నిధిలో చండీహోమం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 16 నుంచి ఫైనల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.విజయసారథి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష రాసి ర్యాంకులు పొందిన వారు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకుని ఫీజు చెల్లించాలన్నారు. ఈ నెల 19 వరకు ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన వారు ఈ నెల 20లోగా వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లకు మార్పులు, చేర్పులకు ఈ నెల 21వ తేదీ అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 24వ తేదిన సీట్ ఎలాట్మెంట్ ప్రకటిస్తామని, 25 నుంచి 29లోగా అభ్యర్థులకు కేటాయించిన కళాశాలకు స్వయంగా వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందిగా వివరించారు. విజయవాడలీగల్: డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని గన్నవరం పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న ప్రశ్న రావణ్కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు, న్యాయవాది ఒగ్గు గవాస్కర్ విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రాసిక్యూషన్కు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి సునీల్కుమార్ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు. విజయవాడ లీగల్: మద్యం రవాణా కేసులో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, కేసిరెడ్డి రాజ్శేఖర్రెడ్డి, కారుమూరి సునీల్ ప్రస్తుతం హైదరాబాద్ చంచల్గూడా జైలులో రిమాండ్లో ఉన్నారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి కోరుతూ సిట్ అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో పిటీ వారెంటు దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి వారిని ఈనెల 20 ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య న్యాయస్థానంలో హాజరుపరచాలని చంచల్గూడా జైలు సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీచేశారు. కంకిపాడు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్ఐ కేవై దాసు తెలిపిన వివరాల ప్రకారం.. కంకిపాడు పట్టణంలోని విజయలక్ష్మీ థియేటర్ వెనుక రోడ్డులో పిప్పళ్ల దుర్గామాణిక్య వరలక్ష్మీ భవాని (48), శ్రీరామచంద్రమూర్తి కుటుంబం నివాసం ఉంటుంది. ఈనెల 13న రాత్రి దుర్గా మాణిక్య వరలక్ష్మి భవానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. అయితే తన సోదరి మృతికి కారణాలు తెలుసుకోవాలంటూ మృతురాలి సోదరుడు మద్దూరి వీర వెంకట సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మంగళవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. -
ఎయిర్పోర్ట్ పనులపై సీబీఐ విచారణ జరిపించండి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న పనులపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ‘విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టు కేటాయింపుపై వచ్చిన అవినీతి ఆరోపణలతోపాటు ఈ వ్యవహారంలో నా పాత్ర ఉందంటూ వస్తున్న విమర్శలపై సీబీఐ విచారణ జరిపించాలి. టెర్మినల్ పనులు అసంపూర్తిగా ఉండటంతో మీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పాత కాంట్రాక్టర్ను తొలగించి కేఎంవీ అనే సంస్థకు ఎయిర్పోర్ట్అథారిటీ పనులు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్ కేటాయింపుపై ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇటీవల బహిరంగ సమావేశంలో, మీడియా సమక్షంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు చేశారు. టెర్మినల్ టెండర్ కేఎంవీ సంస్థకు రావడం వెనుక పెద్ద కుట్ర జరిగినట్టు పేర్కొన్నారు. పాత కాంట్రాక్టర్ రూ.300 కోట్లతో టెర్మినల్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తిచేయగా, మిగిలిన 20 శాతం పనులకు రూ.206 కోట్లు కేటాయించడం వెనుక భారీ అవినీతి జరిగిందని వెంకట్రావు ఆరోపించారు. కేఎంవీ సంస్థ నిర్వాహకులు నాకు సన్నిహితులని, ఎన్నికల్లో నాకు ఆర్థికంగా సాయం చేసినట్టుగా కూడా ఆరోపించారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా మీరు వెంటనే స్పందించి దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. విచారణలో అవినీతి జరిగిందని తేలితే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ అవినీతి వెనుక నా ప్రమేయం ఉందని నిర్ధారణ జరిగితే నాపై కూడా నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చు’ అని వల్లభనేని వంశీ ఆ లేఖలో స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ -
22(ఏ) నుంచి భూములకు విముక్తి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిషేధిత భూముల (22–ఏ) జాబితాలో పొరపాటున నమోదైన భూములకు సంబంధించి పట్టాదారులకు విముక్తి కల్పించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును పారదర్శకంగా, చట్టబద్ధంగా, వేగవంతంగా పరిశీలిస్తూ 22(ఏ) కేసుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణలు నిర్వహించి, చట్టబద్ధంగా అర్హత ఉన్న భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ యాజమాన్య హక్కులను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 22(ఏ) కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే 72 కేసులను పరిష్కరించి 282 ఎకరాల భూమికి 22(ఏ) జాబితా నుంచి విముక్తి కల్పించామన్నారు. 2024లో నాలుగు కేసులకు సంబంధించి 8.95 ఎకరాలు, 2025లో 19 కేసులకు సంబంధించి 105.55 ఎకరాలు, 2026లో ఇప్పటివరకు 49 కేసులకు సంబంధించి 167.91 ఎకరాలకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపారు. వీటిలో అయిదు నుంచి 15ఏళ్ల పాటు సైతం అపరిష్కృతంగా ఉన్నవి కూడా ఉన్నాయన్నారు. దుర్గమ్మకు బంగారు హారం సమర్పణ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తుడు మంగళవారం రూ. 3 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిచంద్రపురానికి చెందిన సీహెచ్ వంశీకృష్ణ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరంవేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. ఆలయ అధికారి డీవివి సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. డాక్టర్ జవ్వాజి లోకేష్కు గోల్డ్మెడల్ ప్రదానం లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో జనరల్ సర్జరీ విభాగంలో ఉత్తమ అవుట్గోయింగ్ పోస్టు గాడ్యుయేల్ విద్యార్థిగా ఎంపికై న డాక్టర్ జవ్వాజీ లోకేష్కు సోమవారం డాక్టర్ కనకమేడల శ్రీనివాస్ స్మారక గోల్డ్మెడల్ను అందజేశారు. వైద్య కళాశాల సెమినార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎ విష్ణువర్థన్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ పులాల చంద్రశేఖర్ చేతుల మీదగా ఈ మెడల్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు మాట్లాడుతూ జనరల్ సర్జరీలో ఉత్తమ అవుట్గోయింగ్ విద్యార్థికి డాక్టర్ కనకమేడల శ్రీనివాస్ స్మారకార్థం ఆయన పుట్టిన రోజు అయిన జూలై 14న ఏటా ఈ గోల్డ్మెడల్ అందిస్తున్నట్లు తెలిపారు. జీజీహెడ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, జనరల్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ పద్మశ్రీ, కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ప్రతినిధులు, మెడల్ గ్రహీత తల్లిదండ్రులు పాల్గొన్నారు. వైద్య శాఖలో సమస్యలు పరిష్కరించాలని వినతి మధురానగర్(విజయవాడ సెంట్రల్): రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఏర్పడే ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని, నిలిచిన సీహెచ్వో, ఇతర కేడర్ ఉద్యోగోన్నతులు పూర్తిచేయాలని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గొంతి ఆస్కార్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆ శాఖ కార్యదర్శి వీరపాండియన్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అందులో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల ఇబ్బందులు, సమస్యలను వివరించారు. కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సాగర్, నాయకులు సత్యనారాయణ, సత్యనారాయణ బాబు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకనైనా లోపాలు సర్దిద్దండి!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) గడువు ఎట్టకేలకు పొడిగించారు. ఈనెల 24వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పూర్తి చేయడం, వాటిని తిరిగి తీసుకోవడం, ఆ పై డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ కొనసాగనుంది. నెల రోజుల ప్రక్రియలో బీఎల్వోల మెడపై కత్తి పెట్టి అధికారులు హడావుడి చేశారు. ఫలితంగా ఫారాల పంపిణీ పూర్తి కాకుండానే నూరు శాతం పూర్తి చేసినట్లు గణాంకాలు చూపారు. క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉండడంతో రాజకీయ పక్షాలు, ప్రజాస్వామిక వాదులు, పలు రకాల సంస్థలు సర్ ప్రక్రియ గడువు పెంచాలని డిమాండ్ చేశాయి. లోపాలు సరిచేస్తారా? నెల రోజుల పాటు జరిగిన ప్రత్యేక సమగ్ర సవరణ కొంత లోపభూయిష్టంగా సాగింది. బీఎల్వోలు ఒక పర్యాయం కూడా ఇంటింటికీ వెళ్లని పరిస్థితి ఉంది. ఏదో ఒక ప్రదేశంలో కూర్చొని బీఎల్ఏలకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి పంపిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఫారాలే పంపిణీ చేయకపోవడం, వాటిని పూర్తి చేయడంలో సహకరించకపోవడం, కొందరికి రెండు ఫారాలు ఇవ్వకపోవడం, ఇవ్వకుండానే ఇచ్చినట్లు అధికారిక గణాంకాలు చూపారు. కొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి అసలు ఫారాలే ఇవ్వకుండా డిజిటలైజేషన్ చేసేశామని ఓటర్లకు చెప్పారు. తొలుత సర్ను తేలికగా తీసుకున్న అధికార గణం.. గడువు దగ్గరపడుతుండటం, ఒత్తిడి పెరగడంతో రకరకాల ప్రయత్నాలు చేసి డిజిటలైజేషన్ శాతం పెంచుతూ వచ్చారు. గందరగోళం.. విజయవాడ లాంటి నగరంలో ఓటర్లు తరచూ ఇళ్లు మారడం, అద్దె ఇళ్లలో నివసించే నగరంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఫోన్ నంబర్లు లేకపోవడం, వృత్తిరీత్యా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చి గతంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి వివరాలు ఇతమిద్ధంగా తెలియకపోవడంతో వాటిని పాక్షికంగా బదిలీ, పూర్తిగా వలస వెళ్లిన జాబితాలో చేర్చాలో తెలియని గందర గోళ పరిస్థితి నెలకొంది. గతంలో ఏ బూత్లో ఏ డోర్ నంబరులో నివసించారో ఆ ఇంటి ఓనర్లు అద్దెకున్న వారి సమాచారం ఇవ్వకపోవడం జరిగింది. 2024 ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతానికి మించి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినందున నూరు శాతం అయినట్లు చూపారని అధికారుల్లోనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ గడువు పొడిగించినందున ఎక్కడెక్కడ ఏయే నియోజకవర్గాల్లో ఏయే బూత్లలో వాస్తవంగా ఫారాలు పంపిణీ చేయలేదో.. డిజిటలైజేషన్ చేయలేదో గుర్తించి ఈ గడువు ముగిసేలోపు సరిచేయాలని రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. అలాగే 2002 ఓటర్ల జాబితాలో వివరాలు లభ్యం కాని వారిపై ప్రత్యేక దృష్టి వారికి కావాల్సిన సర్టిఫికెట్లు అందజేయడం, ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నారు. అటువంటి వారిని గుర్తించి ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అవగాహన పెంచుకోవాలి.. ఎన్నికల సంఘం గడువు పెంచి మరో అవకాశం ఇచ్చింది. ఓటర్లు సర్పై మరింత అవగాహన పెంచుకుని ఈ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును కాపాడుకోవాలి. సర్ ఆవశ్యకతను తెలుసుకుని బీఎల్ ఓలకు సహకరించడం, వారి నుంచి ఫారాలు తీసుకొని, వాటిని నింపి ఇస్తే ఓటు భద్రంగా ఉంటుంది. 24 వరకు గడువు పెంచిన ఎన్నికల సంఘం -
మచిలీపట్నం చేరుకున్న జయశ్రీ భౌతికకాయం
ముగిసిన అంత్యక్రియలు మచిలీపట్నంటౌన్: ఇటీవల వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన జయశ్రీ (జయలక్ష్మి) (50) మృతదేహం మంగళవారం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని సర్కిల్పేటలో ఉన్న ఆమె స్వగృహానికి చేరింది. ఆమె మృతదేహం సోమవారం రాత్రి ముంబై విమానాశ్రయంలోని ఎయిర్కార్గో విభాగానికి చేరింది. క్లియరెన్స్ ప్రక్రియ పూర్తయిన తరువాత మృతదేహాన్ని ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు మంగళవారం ఉదయం 7.20 గంటలకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఆమె భౌతికకాయాన్ని ప్రత్యేక అంబులెన్స్లో మచిలీపట్నం తీసుకువచ్చారు. స్వగృహానికి చేరుకున్న జయశ్రీ మృతదేహాన్ని చూసిన ఆమె కుమారుడు ఆకాష్, కుమార్తె ప్రియాంక, బంధువులు విలపించారు. జయశ్రీ భౌతికకాయానికి మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) తదితరులు నివాళులర్పించారు. జయశ్రీ కుటుంబానికి తాము తోడుగా ఉంటామని పేర్ని కిట్టు పేర్కొన్నారు. వియత్నాంలో చికిత్స పొందుతున్న గెల్లి కిషోర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అనంతరం జయశ్రీ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
ప్రశ్న చానల్ ఫ్లాట్ యజమాని, సీఈఓలను విచారించిన పోలీసులు
గన్నవరం: యూ ట్యూబర్ ప్రశ్న రావణ్పై గన్నవరం పోలీస్స్టేషన్లో రాజద్రోహం, తదితర సెక్షన్ల కింద నమోదైన కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు ప్రశ్న చానల్ సీఈఓ గమన, ఆ చానల్కు ఫ్లాట్ను అద్దెకు ఇచ్చిన ఇంద్రసేననాయుడుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. స్థానిక సబ్ డివిజన్ కార్యాలయంలో ఈ కేసు విచారణాధికారి డీఎస్పీ కె.ధర్మేంద్ర నేతృత్వంలో వారిద్దరిని ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. మళ్లీ 17న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇటీవల మాదాపూర్లోని స్డూడియోలో స్వాధీనం చేసుకున్న సాంకేతిక పరికరాలను గమన, ఇంద్రసేననాయుడు సమక్షంలోనే సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించినట్లు తెలుస్తోంది. విచారణలో గన్నవరం సీఐ బీవీ శివప్రసాద్ పాల్గొన్నారు. -
ఆషాఢ ఉత్సవాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
ఆలయ అధికారులు, పోలీసు శాఖతో సమీక్ష ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ మాసోత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈవో శీనా నాయక్, ఇంజినీరింగ్ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత మహామండపం లిఫ్టు నుంచి ప్రారంభమైన అధికారుల పరిశీలన, కనక దుర్గనగర్, చైనా వాల్ పరిసర ప్రాంతాల్లో దేవస్థానం చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆషాఢ మాసం నెల రోజులు కనకదుర్గనగర్లో చెప్పుల స్టాండ్, క్లోక్రూమ్తో పాటు మొబైల్ ఫోన్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. అమ్మవారికి సారె సమర్పించే భక్తులు తొలుత కనకదుర్గనగర్లోని దేవస్థాన కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అక్కడి నుంచి మహామండపం ర్యాంప్ మీదగా ఏడు అంతస్తుకు, ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి చేరుకోవాలని పేర్కొన్నారు. అమ్మవారికి సారె సమర్పించే భక్తులను భవానీ అనుగ్రహ దర్శన్ రూ.100 టికెట్ క్యూలైన్లో అనుమతిస్తామని తెలిపారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ ఉత్సవాలలో భద్రతాచర్యలపై పోలీసు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ట్రాఫిక్ ఏడీసీపీ గుణ్ణం రామ కృష్ణ, ఏసీపీ దుర్గారావు, ట్రాఫిక్ ఏసీపీ రామ చంద్రరావు, వన్టౌన్ సీఐ గుణరామ్, ట్రాఫిక్ సీఐ ఉమామహేశ్వరరావు, దుర్గగుడి ఈఈ ఎల్.రమాదేవి, దేవస్థాన ఏసీ రంగారావు, ఇతర ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు దరఖాస్తుల వెల్లువ
వివిధ సమస్యలపై అర్జీలు 237సాక్షి, విజయవాడ: కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసి ప్రజలు తమ సమ స్యలను అర్జీల రూపంలో అందించారు. వివిధ శాఖలకు సంబంధించి 237 అర్జీలు అందాయి. అత్యధికంగా రెవెన్యూకు సంబంధించి 70, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 62 అర్జీలు నమోదయ్యాయి. శాఖల వారీగా పోలీసు 26, పంచాయతీరాజ్ 22, జల వనరులు 13, విద్యుత్ 9, వైద్య, ఆరోగ్యం ఆరు, పౌర సరఫరాల శాఖ పరిధిలో నాలుగు అర్జీలు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిష్కరించాలని అధికా రులను కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జ్యోతి పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి.. భవన నిర్మాణరంగంలో పనిచేసే కార్మికులకు విజయవాడ నగరంలో రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులందరికీ గతంలో ఉన్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్కు ర్యాలీగా చేరుకుని జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. కార్మికులకు కొత్త కార్డులు ఇచ్చేందుకు, ఉన్న కార్డు రెన్యువల్ చేసుకోవడానికి వెళ్తే లేబర్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. 50 ఏళ్లు నిండిన కార్మికులకు, మరణించిన కార్మికుడి భార్యకు, అంగవైకల్యం చెందిన కార్మికులకు పింఛన్ అందేలా చూడాలని కోరారు. -
పాలు పొంగని ఇళ్లలో పాపాలు!
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పాలు పొంగించి పిల్లా పాపలతో కళకళలాడాల్సిన లోగిళ్లు అవి...అధికారుల అలసత్వమో... పాలకుల వైఫల్యమో కానీ పేదలకు కేటాయింపులు జరగాల్సిన ఫ్లాట్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. నగరంలోని కాల్వ గట్టు, రోడ్డు విస్తరణల సమయంలోనూ, ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న పేదల ఇళ్లు తొలగించి వారికి జక్కంపూడి కాలనీలో ఫ్లాట్లు కేటాయింపులు జరిగేవి. అయితే కాలనీలోని వాటర్ ట్యాంక్, ప్రాథమిక పాఠశాల సమీపంలో బ్లాక్ నంబరు 252 నుంచి 263 వరకు ఎటువంటి కేటాయింపులు జరగలేదు. దీంతో సుమారు 350 కుటుంబాలకు దక్కాల్సిన ఫ్లాట్లు నేడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. చీకటి పడితే చాలు కాలనీలోని యువకులు మద్యం తాగేందుకు పేకాట ఆడేందుకు ఈ ఖాళీ బ్లాకులను ఆవాసాలుగా ఎంచుకుంటున్నారు. చోరీకి గురవుతున్న తలుపులు, కిటికీలు మొత్తం 11 బ్లాకుల్లో సుమారు 350 ఫ్లాట్లను నగర పాలక సంస్థ పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది. అయితే 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం, ఆ తర్వాత పేదల కష్టాలను ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఫ్లాట్ల కేటాయింపుల ఊసే లేకుండా పోయింది. పూర్తి స్థాయిలో సిద్ధమైన ఫ్లాట్లలో నేడు ధ్వంసమైన తలుపులు, కిటికీలు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఫ్లాట్లకు ఉండాల్సిన తలుపులు, కిటికీలను దొంగలు ఎత్తుకుపోయారు. ఇక బ్లాక్లో ప్రతి ఇంటికీ వేసిన డ్రైనేజీ పైపులు, ప్లాస్టిక్ పంపులు సైతం మాయం అయ్యాయి. ఆ 11 బ్లాకులు వారికి అడ్డాగా మారాయి రాత్రి వేళ పూర్తి స్థాయిలో మందుబాబులకు తోడు గంజాయి తాగే వారికి ఆ ప్రాంతం అడ్డాగా మారిపోయిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటితో నిర్మానుష్యంగా ఉండే ఖాళీ ఫ్లాట్ల వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడపా దడపా కొత్తపేట పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నా.. ముందుగానే సమాచారం రావడంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు అక్కడి నుంచి జారుకుంటున్నారు. 11 బ్లాకులలో ఏ బ్లాక్లో చూసినా మద్యం సీసాలు, పగలగొట్టిన గాజుముక్కలు, పేకాట ముక్కలు, సగం తిని వదిలేసిన బిరియానీ ప్యాకెట్లే దర్శనమిస్తున్నాయి. వెంటనే కేటాయింపులు జరగాలి... కాలనీకి ప్రధాన సమస్యగా ఉన్న ఈ ఫ్లాట్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయింపులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఫ్లాట్లను ఇలాగే వదిలేస్తే మరి కొన్నేళ్ల తర్వాత లబ్ధిదారులకు కేటాయింపులు జరిగినా వారు ఉండేందుకు అనువుగా ఉండవని అంటున్నారు. -
తిరువూరు టీడీపీలో ప్రొటోకాల్ రగడ
తిరువూరు/గంపలగూడెం: గంపలగూడెం మండలం ఊటుకూరు కృష్ణదేవరాయ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఎమ్మెల్యే పేరు లేదంటూ ఆయన వర్గం సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించడం వివాదానికి దారి తీసింది. సహకార సంఘంలో ఆధునికీకరించిన కల్యాణమంటపం, ఆర్వో ప్లాంటు ప్రారంభోత్సవం, గ్రామ ప్రముఖుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్లను నిర్వాహకులు ఆహ్వానించారు. శిలాఫలకంపై వారి పేర్లు మాత్రమే ముద్రించారు. స్థానిక శాసనసభ్యుడైన కొలికపూడి శ్రీనివాసరావును ఆహ్వానించకపోగా, ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకంపై ఆయన పేరు కూడా ముద్రించకుండా దళిత ఎమ్మెల్యేను అవమానించారంటూ ఆయన వర్గీయులు సోమవారం సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడంతో ఎంపీ కేశినేని చిన్ని, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాలేదు. ఎమ్మెల్యేపై ధ్వజం ఇదిలావుండగా సహకార సంఘ చైర్మన్ చెరుకూరి రాజేశ్వరరావు కల్యాణ మంటపం ప్రారంభించిన అనంతరం సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యే కొలికపూడి తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. గ్రామ, మండల కమిటీలు నియమించడంలో ఎమ్మెల్యే ప్రమేయం ఏమిటని, సిన్సియర్ కార్యకర్తలను అణగదొక్కి తన అడుగులకు మడుగులొత్తే వారితో కమిటీలు వేయాలని ఎమ్మెల్యే యత్నించడంతో తామంతా వ్యతిరేకించామన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించేటపుడు పార్టీ పదవుల్లో ఉన్న నాయకులకు కనీస మర్యాద ఇవ్వరని, వారికి సమాచారం ఇవ్వకపోవడం గర్హనీయమని అన్నారు. ఎదుటివారిని గౌరవించని ఎమ్మెల్యేని ఎవరూ గౌరవించరని, ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే కనీసం పట్టించుకోలేదని, కార్యకర్తలే నిర్వహించారన్నారు. తమకు పార్టీయే ముఖ్యమని, పార్టీ ఆదేశానుసారం నడచుకుంటామని చెరుకూరి అనడం గమనార్హం. -
రైతుల గోడు పట్టని సర్కారు
బంటుమిల్లి: చంద్రబాబు ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్టడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రమేష్(రాము) ఆరోపించారు. బంటుమిల్లి ప్రధాన కాలువకు నీటి విడుదలపై పాలకులు, నీటీపారుదల శాఖ అధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్యంపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఇరిగేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కార్యాలయం వద్ద బంటుమిల్లి ప్రధాన కాలువలో నీటి పారుదల రీడింగ్ పరిశీలించిన అనంతరం రాము విలేకరులతో మాట్లాడుతూ బంటుమిల్లి ప్రధాన కాలువకు దాదాపు 900 క్యుసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉండగా కేవలం 300 క్యుసెక్కుల నీరు ఇచ్చారని.. ఇది ఏ రైతు పంటను కాపాడుతుందని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో సాగు నీరు అందక వెద చల్లిన పొలాలు ఎండిపోతు రైతులు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ నిద్రపోతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ తీర ప్రాంత భూముల్లో వరి తప్ప ఏది పండని చోట రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ఇచ్చి ఆదుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. అనంతరం ఇరిగేషన్ కార్యాలయంలో వర్క్ ఇన్స్పెక్టర్ రవికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బంటుమిల్లి, కృత్తివెన్ను మండల పార్టీ అధ్యక్షులు ఎం. నాగేశ్వరరావు, జె. భూపతిరాజు, ఎంపీపీలు కె. గరుడప్రసాదు, ఎస్. మధుసూదన్రావు, వైస్ ఎంపీపీ ఓ. చిన్నారిబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ కె. గంగాధర్, జెడ్పీటీసీ ఎం. రత్నకుమారి, ఎంపీటీసీలు పి. వీరబాబు, ఎండి. కమాల్బాషా, ఎండీ. ఆలీం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా స్థానిక లక్ష్మీపురం సెంటర్లో బంటుమిల్లి ప్రధాన కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు సంఘం జిల్లా, మండల కన్వీనర్లు జి. నాగేశ్వరరావు, ఎల్. అజయ్కుమార్, సీపీఎం మండల పార్టీ కన్వీనరు ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు. సాగునీటి కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన -
నీట ముంచిన నిర్లక్ష్యం
జి.కొండూరు: బుడమేరు ఉగ్రరూపం దాల్చి డైవర్షన్ కెనాల్కు గండ్లు పడటంతో వరద ముంపు నకు గురై రెండేళ్లు కావస్తున్నా ప్రజల్లో బుడమేరు భయాన్ని తొలగించడంలో ప్రభుత్వం సఫలం కాలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడం బుడమేరు డైవర్షన్ కెనాల్ ఆధునికీకరణ పనులకు పెను శాపంగా మారింది. గండ్ల వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులే ఏడాదిగా పూర్తి చేయలేని ప్రభుత్వం లైనింగ్ పనులను హడావిడిగా చేపట్టింది. తొల కరి వానలతో ఈ పనులు సైతం నత్తనడకన సాగుతూ పట్టిసీమ నీటి విడుదలతో పూర్తిగా నిలిచిపోయాయి. లైనింగ్ పనులు చేస్తున్న యంత్రాలు ఒడ్డుకు చేరాయి. నిర్మాణాలు మునిగిపోయాయి. మరో ఆరు నెలలపాటు ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదు. లైనింగ్ పనుల కోసం కెనాల్ గట్లను తవ్వి వదిలేయడంతో పట్టిసీమ నీటి ప్రవాహానికి కోతకు గురవుతు న్నాయి. భారీ వర్షాలు కురిస్తే గండ్లు పడి మరో సారి వరద ముంచెత్తే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హడావుడి పనులకు బ్రేక్ బుడమేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్ల మేర బుడమేరు డైవర్షన్ కెనాల్ ఉంది. ఈ కాలువ అటు బుడమేరు వరద ప్రవాహంతో పాటు ఇటు పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా వచ్చే పట్టిసీమ నీటిని సైతం కృష్ణానదిలో కలుపుతుంది. 2024 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు డైవర్షన్ కెనాల్కు భారీ గండ్లు పడి విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ రోజుల తరబడి నీట మునిగాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ తర్వాత బుడమేరు ఆధునికీకరణ చేస్తామంటూ ముఖ్యమంత్రి నుంచి అధికార పార్టీ నాయకులందరూ ఊదరగొట్టారు. వరదలొచ్చిపోయిన 20 నెలల తర్వాత ఇటీవల బుడమేరు డైవర్షన్ కెనాల్ ప్రారంభం నుంచి 8.3 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులకు ప్రభుత్వం రూ.121 కోట్లు మాత్రమే కేటాయించింది. వర్షాలు పడితే ముందుకు సాగవని తెలిసినా మే నెలలో హడావుడిగా ఆలైనింగ్ పనులు ప్రారంభించింది. జూన్లో తొల కరి జల్లులతో నత్తనడకన సాగిన ఈ పనులు పట్టిసీమ నీటి రాకతో ఈ నెల 11వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. ఒకవేళ వర్షాలు కురవకపోతే పట్టిసీమ నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంది. వర్షాలు అధికంగా కురిస్తే ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం డైవర్షన్ కెనాల్ నుంచే కృష్ణానదిలో కలవాల్సి ఉంది. దీనితో మరో ఆరు నెలల పాటు లైనింగ్ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడంలేదు. హడావుడిగా చేపట్టిన లైనింగ్ పనులు, బ్యాలన్స్ రిటైనింగ్ వాల్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాలెన్స్ రిటై నింగ్ వాల్ నిర్మాణం కోసం కట్టను ఎడమ వైపు తవ్వి వదిలేయడంతో పట్టిసీమ నీటి ప్రవాహానికి కోతకు గురవుతోంది. ఒకవేళ భారీ వర్షాలు పడి ఎగువ నుంచి వరద పోటెత్తితే, కోతకు గురైన ప్రదేశంలో గండి పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెను ప్రమాదం సంభవించకముందే అధికారులు అప్రమత్తం కావాలని కోరుతున్నారు. -
మునిగిపోయిన నిర్మాణాలు
పట్టిసీమ నీటి రాకతో గతేడాది నిర్మాణ దశలో ఆగిపోయిన రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, లైనింగ్ పనుల నిర్మాణాలు మునిగిపోయాయి. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు డైవర్షన్ కెనాల్ గండ్లు పడిన ప్రదేశంలో ఎడమవైపు 8.65 మీటర్ల ఎత్తు, 1.4 మీటర్ల వెడల్పు, 500 మీటర్ల పొడవున, కుడి వైపు అంటే శాంతినగర్ వైపు ఇవే కొలతలతో 50 మీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. గతేడాది ఈ పనులు జరుగుతున్న సమయంలో పట్టిసీమ నీరు విడుదల చేయడంతో ఎడమవైపు 360 మీటర్లు పొడవున మాత్రమే రిటైనింగ్ వాల్ నిర్మించి జూన్ 9వ తేదీతో పనులను ఆపేశారు. ఎడమ వైపు 140 మీటర్లు పొడవున, కుడి వైపున యాభై మీటర్ల పొడవున నిర్మించాల్సిన రిటైనింగ్ వాల్ పనులను ఫిబ్రవరిలో ప్రారంభించాల్సి ఉంది. ఈ పనులను మే నెలలో ప్రారంభించడంతో పట్టిసీమ నీటి రాకతోనే మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నిర్మాణాలకు వాడుతున్న ఇనుము సైతం నీటిలో నానుతుండడంతో భవిష్యత్తులో దీని సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. -
పోలీస్ పీజీఆర్ఎస్లో 85 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): G±-tBÆŠ‡ hÌêÏ ´ùÎ‹Ü MýSÑ$-çÙ-¯]lÆó‡sŒæ M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ ÝùÐ]l$ÐéÆý‡… °Æý‡Ó-íßæ…-_¯]l ï³i-B-ÆŠ‡-G‹Ü M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ {ç³fÌS ¯]l$…_ 85 íœÆ>ŧýl$Ë$ A…§éƇ$$. ´ùÎ‹Ü MýSÑ$-çÙ-¯]lÆŠ‡ G‹ÜÒ Æ>f-ÔóæQ-Æý‡-»êº$ B§ól-Ô>ÌS Ðól$Æý‡MýS$ yîlïÜï³ H½-sîæG‹Ü E§ýl-Ķæ$-Æ>×ìæ {ç³fÌS ¯]l$…_ íœÆ>ŧýl$Ë$ ïÜÓMýSÇ…^éÆý‡$. Ððl¬™èl¢… 85 íœÆ>ŧýl$Ë$ Æ>V>, ÐésìæÌZ A™èlÅ-«¨-MýS…V> BíÜ¢ ÌêÐé-§ól-Ò-ÌSMýS$ çÜ…º…«¨…-_-¯]lÐól E…yýl-r… ÑÔóæçÙ…. BíÜ¢ ÑÐé-§éË$, ¯]lVýS§ýl$ ÌêÐé-§ól-ÒÌSOò³ 31,️ ¿êÆ>Å¿ýæÆý‡¢Ë$, MýS$r$…º MýSÌS-à-ÌSOò³ 9, ️ÑÑ«§ýl Ððl*Ýë-ÌSOò³ 15,️ Ð]l$íßæâê çÜ…º…-«¨™èl ¯ólÆ>ÌSMýS$ çÜ…º…«¨…_ 10, ️ MösêÏ-rÌSOò³ 3, ️ §ö…VýS™èl¯é-ÌSMýS$ çÜ…º…-«¨…_ 3, ‡ ÑÑ«§ýl çÜÐ]l$çÜÅ-ÌS™ø 14 íœÆ>ŧýl$Ë$ A…§éƇ$$. M>Æý‡Å{MýS-Ð]l$…ÌZ ç³Ë$-Ð]l#Æý‡$ ´ùÎ‹Ü A«¨-M>Æý‡$Ë$ ´ëÌŸY¯é²Æý‡$. రెండు గంటల వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగింత గుణదల(విజయవాడ తూర్పు): ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిఽధిలోని గుణదల ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం, గుణదల గంగిరెద్దుల దిబ్బకు చెందిన ఇద్దరు బాలికలు ఉన్నట్టుండి కన్పించకుండా పోయారు. విషయం తెలిసిన తలిదండ్రులు చుట్టుపక్కల ఇళ్లలో, బంధువుల నివాసాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆందోళనకు గురైన బాలికల తల్లిదండ్రులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఐదు బృందాలను ఏర్పాటు చేసిన మాచవరం సీఐ చంద్రశేఖర్ ఆయా ప్రాంతాల సీసీ కెమెరాలను పరిశీలించారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే బందరు రోడ్డు ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి, ఆ బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. జగ్గయ్యపేట: మండలంలోని వేదాద్రి గ్రామంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని పంట పొలాల వద్ద మృతదేహం ఉన్నట్లు సోమవారం గ్రామస్తులు సమాచారం అందించటంతో సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తిగా గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కోనేరుసెంటర్: ద్విచక్ర వాహనం ఢీకొనటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై చిలకలపూడి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం చిలకలపూడికి చెందిన మద్దూరి సూర్యప్రసాదరావు (53) కూలి పనులు చేస్తుంటాడు. ఆదివారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా చిలకలపూడి రైల్వేస్టేషన్కు సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్ సూర్యప్రసాదరావును ఢీకొంది. ఈ ఘటనలో బాధితుడికి బలమైన గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు రమణసాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
కానూరు ఆటోనగర్లో ఐస్క్రీమ్ ఫ్యాక్టరీ దగ్ధం
పెనమలూరు: కానూరు కొత్త ఆటోనగర్లో శ్రీ విజయదుర్గ ఫుడ్స్(ఐస్క్రీమ్) ఫ్యాక్టరీ ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. రాత్రి సమయంలో ఫ్యాక్టరీలో హఠాత్తుగా మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించి మిషన్లు, ఫర్నిచర్, సరుకు అగ్నికి కాలి బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటోనగర్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే మొదటి విడత కౌన్సెలింగ్లో దరఖాస్తు చేసుకుని సీటు రాని విద్యార్థులు, మొదటి విడత కౌన్సెలింగ్కు హాజరు కాని వారికి ఈ నెల 15వ తేదీ బుధవారం జనరల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.కనకారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్లో భర్తీ కాగా మిగిలిన సీట్లను ఈ జనరల్ కౌన్సెలింగ్లో భర్తీ చేస్తామని తెలియజేశారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి మార్కుల జాబితా, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ అన్ని ఒరిజినల్స్తో కౌన్సెలింగ్కు హాజరు కావాలని తెలియజేశారు. వివరాలకు 0866–2475575, 94906 39639, 77804 29468 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు. విజయవాడలీగల్: పోక్సో కేసులో బాధితురాలి వివరాలను బహిర్గతం చేశారనే ఆరోపణలపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో గోరంట్ల మాధవ్ హాజరుకాలేకపోవడంతో సోమవారం ఆయన తరఫు న్యాయవాది, వైఎస్సార్ సీపీ లీగల్సెల్ ఉపాధ్యక్షుడు ఒగ్గు గవాస్కర్ హాజరై, గైర్హాజరు పిటీషన్ దాఖలు చేశారు. దీంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.జయలక్ష్మి విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేశారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
పామర్రు: చిన్నపాటి విభేదాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య యత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఘటన పామర్రు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పామర్రు మండలం నెమ్మలూరు శివారు మలయప్పన్న పేట గ్రామానికి చెందిన కాకి పవన్కుమార్(35) భార్య నాగలక్ష్మితో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. దాంపత్య జీవితంలో కుటుంబ విషయాలకు సంబంధించిన చిన్న చిన్న విభేధాల కారణంగా భార్య తన పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన పవన్కుమార్ ఈనెల 11వ తేదీ ఉదయం పురుగుల మందును తాగాడు. విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే మచిలీపట్నంలోని ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామర్రు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. అదృశ్యమైన వ్యక్తి విగతజీవిగా మున్నేటిలో లభ్యం నందిగామ రూరల్: రెండు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి మృతదేహం మునేటిలో లభ్యమైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన ఉప్పుటూరి అప్పారావు కొంతకాలంగా నందిగామ పట్టణం, వత్సవాయిలో పురుగుల మందుల దుకాణాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న వత్సవాయిలోని దుకాణం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. రాత్రికి ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేదు. దీంతో ఈ నెల 11వ తేదీ అతని భార్య ఉమామహేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న మృతుని బావమరిది (భార్య సోదరుడు) రాఘవాపురం సమీపంలోని మున్నేటి వద్ద రోడ్డు పక్కగా అప్పారావు ద్విచక్ర వాహనం నిలిపి ఉండటాన్ని గమనించాడు. బహిర్భూమికి వెళ్లి ఉంటాడని భావించి వేచి ఉన్నా ఎంత సేపటికి రాకపోవడంతో అనుమానం వచ్చి మున్నేటి వద్దకు వెళ్లి చూశాడు. అతని మృతదేహం కనిపించటంతో కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.శ్రీను తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
భాషాసంస్కృతులను కాపాడుకోవాలి
● ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ ● ముగిసిన మూడో అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు వన్టౌన్(విజయవాడపశ్చిమ): తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవటానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతిని పురస్కరించుకొని కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో రెండు రోజులుగా జరుగుతున్న మూడో అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు సభలో ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ.. తెలుగునాట మహిళా రచయిత్రులు అందించిన సాహితీసేవలు అపూర్వమన్నారు. రెండు రోజుల పాటు జరిగిన మహాసభలు ఆద్యంతం తెలుగు సాహితీవైభవానికి అండగా నిలిచాయని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్మన్ బోడుపాటి తేజస్విని మాట్లాడుతూ.. దేశంలో తెలుగు సంస్కృతికి ప్రత్యేకమైన స్థానముందన్నారు. బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.ఆర్.రజని మాట్లాడుతూ.. తెలుగు రచయిత్రుల విశిష్టతను వివరించారు. మహాసభల గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, కార్యనిర్వాహక గౌరవాధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. సమాజానికి మార్గదర్శి మహిళలేనన్నారు. సమాజానికి తమ సాహిత్యం ద్వారా సేవలందించిన ప్రఖ్యాత రచయిత్రుల సేవలను వివరించి వారిని కొనియాడారు. అనుచితంగా మాట్లాడితే.. రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జీవీ పూర్ణచంద్ ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను ఆమోదింపజేశారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తించటం, మాట్లాడటం చేసిన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించాలని, సోషల్మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించేలా కొత్త చట్టాలు తీసుకురావాలని సూచించారు. ప్రమదావనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సామాజిక చైతన్యానికి పాటుపడాలి.. సామాజిక చైతన్యానికి రచయిత్రుల పాటుపడాలని పలువురు ప్రముఖ రచయిత్రులు పేర్కొన్నారు. తెలుగు పరిశోధనా రంగం, విద్యారంగం, సాంస్కృతికరంగం, తెలుగు భాషోద్యమం, రాష్ట్రేతరుల సమావేశం ఇలా పలు సదస్సులు వేరువేరు వేదికలపై ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొనసాగాయి. ఆంధ్రా విశ్వవిద్యాలయం తెలుగు విభాగ ఆచార్యురాలు డాక్టర్ దేవులపల్లి పద్మజ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు విభాగ ఆచార్యులు ఆచార్య వంగరి త్రివేణి, పలువురు సాహితీ వేత్తలు ప్రసంగించారు. మహాసభల సందర్భంగా ప్రధాన వేదికపై ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన వివిధ కళారూపాల ప్రదర్శనలు ఆకట్టుకున్నా యి. కూచిపూడి, ఆంధ్రనాట్యం, పద్యాలాపన, సాహితీరూపకం ఇలా వివిధ కళాంశాలలో కళాకారులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. -
కాలువలు ఎండి.. రైతు కంట తడి!
పెడన: నియోజకవర్గంలో రైతు గోడు వినేవారు కానరావడం లేదు. సాగునీటిపై స్పష్టత కరువవడంతో ఇబ్బంది పడుతున్నారు. నీరు లేక వరినారుమడులు ఎండిపోతున్నాయి. నియోజకవర్గంలోని బంటుమిల్లి కాలువ పూర్తిగా ఎండిపోయింది. వేసవిలో సైతం నీరుండే ఈ కాలువలో నీరు లేకపోవడం, ప్రస్తుతం అరకొరగా నీటిని విడుదల చేయడంపై రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు తడిసి మోపెడు కాలువలు ద్వారా వస్తున్న అరకొర నీటిని వచ్చింది వచ్చినట్లుగా రైతులు తోడేస్తున్నారు. పూర్తిస్థాయిలో నీరు వస్తే పంటబోదెల ద్వారా పొలాలకు నీరు చేరుతుంది. అంతంత మాత్రంగా వస్తున్న నీటిని తప్పనిసరి స్థితిలో మోటారు ఇంజిన్తో తోడుకోవాల్సి వస్తోంది. లీటరు డీజిల్ రూ.110, ఇంజిన్ అద్దె గంటకు రూ.250. ఇంజిను తీసుకువచ్చినప్పటి నుంచి సమయం లెక్కింపు. నీరందకపోతే ఎంత సమయం పడుతుందోననే రైతులు ఆందోళన పడుతున్నారు. నీరు అంతంత మాత్రమే వస్తుండటంతో ఇంజిన్ తీసుకురావడానికి రైతులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బంటుమిల్లి కాలువకు శనివారం నీరు వచ్చింది. ఆదివారం ఆ నీటి ప్రవాహం కాస్తా మందగించింది. -
ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థిని అదృశ్యం
నందిగామ రూరల్: ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థిని తెల్లవారుజాము సమయంలో అదృశ్యమైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వీరులపాడు మండలం చెన్నారావుపాలెంకు చెందిన నీనావత్ జ్యోతిక పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థిని. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి కూడా తోటి విద్యార్థులతో కలిసి వసతి గృహంలో నిద్రించింది. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో విద్యార్థిని లేకపోవటాన్ని గుర్తించిన ప్రిన్సిపాల్ సుజాత పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. బాలిక పాఠశాల నుంచి వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలోని స్నేహితురాలి నివాసానికి వెళ్లినట్లు సీఐ పి.శ్రీను పర్యవేక్షణలో గుర్తించారు. అక్కడి నుంచి విద్యార్థినిని పట్టణంలోని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి ప్రిన్సిపాల్, తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థిని 20 రోజుల క్రితమే పాఠశాలలో చేరిందని నాలుగైదు రోజుల నుంచి ఇంటికి వెళ్తానంటే తల్లిదండ్రులు అందుబాటులో లేకపోవటంతో పంపించలేదని ప్రిన్సిపల్ తెలిపారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఆరు గంటల వ్యవధిలో బాలిక ఆచూకీ కనిపెట్టి అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మోహనరావు, పలువురు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
నిద్రలేమి.. నిశ్శబ్ద మహమ్మారి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు నిద్ర అనేది రోజువారీ జీవితంలో సహజమైన విశ్రాంతి. ఇప్పుడు అదే నిద్ర చాలా మందికి అందని వరంగా మారుతోంది. పని ఒత్తిడి, అర్ధరాత్రి వరకు కొనసాగే నైట్ కల్చర్, స్మార్ట్ఫోన్ల వ్యసనం, మారుతున్న జీవనశైలి.. ఇవన్నీ కలిసి నగరవాసుల నిద్రను దూరం చేస్తున్నాయి. ఫలితంగా నిద్రలేమి నిశ్శబ్దంగా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. వైద్య నిపుణుల అంచనా ప్రకారం నగరంలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు సరిపడా నిద్రపోవడం లేదు. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావించినా, దీని ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవంపై పడుతోంది. అలసట, ఏకాగ్రత లోపం, చిరాకు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలతో పాటు గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహం, డిప్రెషన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతోంది. తీవ్రమైన రుగ్మత స్లీప్ ఆప్నియా నిద్రలో పదే పదే శ్వాస ఆగిపోవడం, మళ్లీ ప్రారంభం కావడం జరిగే ఒక తీవ్రమైన నిద్ర రుగ్మత స్లీప్ ఆప్నియా. ఇది ఉన్న వారికి నిద్రలో శరీరానికి తగినంత గాలి అందదు. గుండెపోటు, మెదడుపోటు వంటి ప్రాణాంతక సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. స్లీప్ ఆప్నియాకు ఊబకాయం, పెద్ద టాన్సిల్స్, అడినాయిడ్స్, ధూమపానం, మద్యం వాడకం, కొన్ని రకాల మందులు, నార్కోలెప్సి వంటి నిద్ర రుగ్మతలు ప్రధాన కారణంగా చెపుతున్నారు. ఇలాంటి వారు బిగ్గరగా గురక వేయడం, నిద్రలో గాలికోసం గ్యాస్పింగ్, ఎండిపోయిన నోరుతో నిద్ర మేల్కొనడం, ఉదయం తలనొప్పి, పగలు అధిక నిద్ర, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్లీప్ స్టడీ ఇలాంటి వారి కోసం స్లీప్స్టడీ అందుబాటులోకి వచ్చింది. ఇంటికే వచ్చి స్లీప్ టెస్ట్ నిర్వహిస్తారు. వారు ఏ రకమైన నిద్రలేమితో బాధపడుతున్నారో నిర్ధారిస్తారు. నిద్రలో మెదడుకు ఆక్సిజన్ ఎలా అందుతుంది. హార్ట్ బీట్ ఎలా ఉంది అనే అంశాలను గమనిస్తారు. నైట్కల్చర్తో.. నగరంలో నైట్ కల్చర్ పెరిగిపోయింది. అర్ధరాత్రి వరకూ రోడ్లపై గడిపే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఇళ్లలో ఉన్న వారు కూడా అర్ధరాత్రి దాటే వరకూ స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో అనేక మంది నిద్రలేమి సమస్య వెంటాడుతున్నాయి. తమకు ఆ సమస్యలు నిద్రలేమితో వస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనించలేక పోతున్నారు. దీంతో తీవ్రమైన వత్తిడి కారణంగా మధుమేహం, అదిక రక్తపోటుతో పాటు డిప్రెషన్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. -
గ్రహణమొర్రికి ఆధునిక చికిత్సపై సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు)/గన్నవరం రూరల్: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో డాక్టర్ సుధా నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో ఆదివారం గ్రహణం మొర్రి, అంగిలి చీలికకు ఆధునిక సర్జరీలపై సదస్సు జరిగింది. ఆ కళాశాల ఓరల్ అండ్ మాక్సిల్లో ఫేషియల్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో నాలుగు దంత వైద్య కళాశాలలకు చెందిన ఓరల్, మాక్సిల్లో ఫేషియల్ సర్జరీ(ఓఎంఎఫ్ఎస్) విభాగ వైద్యులు, పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సును తొలుత ఆ కళాశాల ఓఎంఎఫ్ఎస్ విభాగాధిపతి డాక్టర్ నాదెళ్ల కోటేశ్వరరావు, డాక్టర్ మెహబూబ్ షేక్ ఇతర అధ్యాపకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సదస్సులో ముఖ్యవక్తలుగా డాక్టర్ ఆనంద్ విజయ్, డాక్టర్ చంద్రబాబు, డాక్టర్ శ్రీకాంత్ గ్రహణమొర్రి, అంగిలి చీలికలకు శస్త్ర చికిత్స మెలకువలను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మూల్పూరి రామోజీరావు, కార్యనిర్వాహణాధికారి వై. మధుసూదనరావు, కరస్పాండెంట్ పాలడుగు సాయి పాల్గొన్నారు. గన్నవరం: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం వెంట నే నెరవేర్చాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ ఎల్. సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం రాష్ట్రోపధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా హామీలు అమలులో తీవ్ర తాత్సారం చేయడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి తీవ్రంగా ఉందన్నారు. డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, పికెటింగ్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి జోసఫ్ సుధీర్బాబు, జిల్లా అధ్యక్షుడు పి. ఇమ్మానియేలు, ప్రధాన కార్యదర్శి యూవీ కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. చంద్రశేఖర్, డి. విద్యాసాగర్, సీపీఐ నేతలు అడ్డాడ ప్రసాద్, నార్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. విజయవాడ కల్చరల్: సృజనకారుల స్వరం బలంగా వినిపించాలని ప్రముఖ సాహితీవేత్త గంటేడ గౌరినాయుడు అన్నారు. సాహితీ స్రవంతి, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సాహితీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. సృజనకారుల స్వరం కార్యక్రమంలో భాగంగా ‘మేం ఎందుకు రాస్తున్నాం’ అంశంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు కళాకారులు పాల్గొన్నారు. గౌరి నాయుడు మాట్లాడుతూ కవులు, రచయితలు భావవ్యక్తీకరణకు ప్రాధాన్యం నివ్వాలని సూచించారు. కవులు, రచయితలు వేంపల్లి షరీఫ్, పాయల మురళీ కృష్ణ,కట్టా సిద్ధార్థ, మెర్సీ మార్గరెట్, వడ్లమూడి పద్మ, వావిళ్లపల్లి సృజన, పట్టుపల్లి నాగరాజు తమ భావాలను వివరించారు. సాహితీవేత్తలు శాంతిశ్రీ, ఉషారాణి సమన్వయ పరిచారు. తెలుగు కథ సామాజిక చింతన అంశంగా జంధ్యాల రఘుబాబు, కథా రచన మెళకువలు అంశంగా అట్టాడ అప్పలనాయుడు కవులకు దిశానిర్దేశం చేశారు. గుంటూరు మెడికల్: ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ(ఐఏపీ) ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ –ఎలక్ట్గా గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి డాక్టర్ నీలి ఉమా జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విశాఖపట్నంలో మానసికవ్యాధి వైద్య నిపుణుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ ఉమాజ్యోతిని మానసిక వైద్య నిపుణుల సంఘం రాష్ట్ర శాఖకు ప్రెసిడెంట్–ఎలక్ట్గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఈమె రాష్ట్ర శాఖలో వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
కుళ్లిన స్థితిలో క్వారీ గుంతలో మృతదేహంగుంటూరు రూరల్: కుళ్లిన స్థితిలో క్వారీ గుంతలో వ్యక్తి మృతదేహం ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... పొత్తూరు గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం క్వారీ గుంతలో ఛిద్రమైన స్థితిలో ఉందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహంపై వస్త్రాలు లేవని పోలీసులు గుర్తించారు. కాళ్లను తాళ్లతో కట్టారని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రుద్ర ట్రస్ట్ సహకారంతో జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎక్కడైనా చంపి ఇక్కడకు తెచ్చి పడేశారా? ఇక్కడే హత్య చేశారా? అనే కోణాలలో దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో మృతుడు తాడికొండ మండలం ఫణిదరం గ్రామానికి చెందిన మాడుగుల శంకరరావు (52)గా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడని తేలింది. ఈ నెల 7వ తేదీన చిలకలూరిపేటలో పని ఉందని ఇంటి నుంచి బయటకు వచ్చాడని, తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీస్ స్టేషన్లో ఈ నెల 8వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలిసింది. కుటుంబసభ్యులకు నల్లపాడు పోలీసులు సమాచారం అందించారు. వ్యాపార లావాదేవీల వల్ల హత్య చేశారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాలలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
సమయం లేదు సర్!
● ఫారాలు సమర్పిస్తేనే ఓటుకు భద్రత ● ఓటర్ల వద్ద నుంచి తిరిగిరాని 69,859 ఎన్యూమరేషన్ ఫారాలు ● త్వరపడాలని సూచిస్తున్న ఉన్నతాధికారులు సాక్షి, విజయవాడ/గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని, అనర్హుల ఓట్లను జాబితా నుంచి తొలగించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఓటర్లకు ఫారాల పంపిణీ, తిరిగి వాటిని సేకరించడం, డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ పూర్తి కావొస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం సర్ ప్రక్రియలో పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. సర్లో పాల్గొనని ఓటర్లు తక్షణమే తమ ఫారాలను బీఎల్వోలకు అందజేస్తేనే ఓటు హక్కు ఉంటుంది. ప్రక్రియ చివరి దశలో అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఫారాలను అందజేసి డిజిటలైజ్ చేయించుకోవాలి. ఇదీ పరిస్థితి.. గత నెల 15వ తేదీ నుంచి ‘సర్’ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,792 పోలింగ్ బూత్లలో 99.9శాతం మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలు అందజేశారు. వీటిలో 15,52,003 పారాలు డిజిటలైజేషన్ పూర్తయింది. ఇంకా ఓటర్ల వద్ద నుంచి 69,859 ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించాల్సి ఉంది. జిల్లాలో మొత్తం ఓటర్లలో 37,456 మంది ఓటర్లు మృతి చెందినట్లు ఇంటింటి సర్వేలో అధికారులు గుర్తించారు. 1004 మంది ఓటర్లు ఇప్పటి వరకు ట్రేస్ కాలేదు. 15,281 మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లినట్లు సర్వేలో తేలింది. జిల్లాలో ఇప్పటికీ 1,42,037 మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు. 14వ తేదీతో ముగియనున్న గడువు.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు గడువు ఈనెల 14వ తేదీతో ముగియనుంది. కేవలం రెండంటే రెండే రోజులు మిగిలి ఉంది. ఈ లోగా ఫారాలు బీఎల్వోలకు సమర్పిస్తేనే ఓటుకు భద్రత ఉంటుంది. ప్రక్రియ ముగిసిన అనంతరం ఈనెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ఫారాలు అందజేయని వారి ఓట్లు ఆ జాబితాలో వచ్చే అవకాశం లేదు. ఇప్పటికీ ఫారాలు సమర్పించని ఓటర్లు తక్షణమే ఫారాలు అందజేయాలని కలెక్టర్ కోరారు. గేటెడ్ కమ్యూనిటీ, విల్లాల వద్ద ఇబ్బందులు.. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే విజయవాడ కార్పొరేషన్ పరిధిలోనే ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ వెనుకంజలో ఉంది. అత్యధికంగా తిరువూరులో 93.93 శాతం, అత్యల్పంగా విజయవాడ సెంట్రల్లో 87.12 శాతం డిజిటలైజేషన్ పూర్తయ్యింది. గేటెడ్ కమ్యూనిటీలు, హైసెక్యూరిటీ కలిగిన విల్లాలు, అపార్టుమెంట్లలో నివాసం ఉన్నవారి దగ్గరకు వెళ్లడానికి బీఎల్ఓలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. విజయవాడలో ఇప్పటికీ 31,654 మందికి ఇంకా ఫారాలు ఇవ్వలేదని సమాచారం. వీరిలో 15,359 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా మిగిలినవారు వలసలు, పెళ్లిళ్లు చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లడం, ఇళ్లు మారడం వంటి కారణాలతో ఆచూకీ దొరకలేదు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వచ్చి కొన్నాళ్లు విజయవాడలో ఉండి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికీ ఇదే సమస్య ఎదురవుతోంది. గడువు ముగిసే లోపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లకు కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఫారాలు సమర్పించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బీఎల్వోలు, ప్రత్యేక శిబిరాలు, హెల్ప్ డెస్కులను సంప్రదించాలని తెలిపారు. ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు, బీఎల్వోలు నిరంతరం అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు సమర్థంగా పనిచేస్తున్నాయని, ఓటర్లు వాటి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగు వారికి కూడా సమాచారం అందించి, గడువు తేదీలోగా ఫారాలు సమర్పించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ప్రత్యేక అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ ఈ మేరకు స్పష్టం చేశారు. మిగిలిన రెండు రోజులు ఎస్ఐఆర్ ప్రక్రియలో అత్యంత కీలకమైనవని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు, హెల్ప్ డెస్కులు సమర్థంగా పనిచేసేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. -
ఆషాఢ మాసోత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలలో దసరా ఉత్సవాలు మొదటి స్థానంలో ఉండగా, రెండోది భవానీ దీక్ష విరమణలు.. ఇప్పుడు ఆషాఢ మాసోత్సవాలకు దసరా, భవానీ దీక్షలంత ప్రాధాన్యం సంతరించుకుంది. దసరా ఉత్సవాలు పది రోజులు, భవానీ దీక్ష విరమణలు 5 రోజులు జరిగితే.. ఆషాఢ మాసోత్సవాలు నెల రోజులు జరుగుతాయి. ఇక ఇదే మాసంలో తెలంగాణ నుంచి దుర్గమ్మకు బంగారు బోనం, శాకంబరీ ఉత్సవాలు జరగడం విశేషం. నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు.. నెల రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పిస్తారు. అంతే కాకుండా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో ఆషాఢ మాసం ఒక పెద్ద పండుగను సంతరించుకుంది. వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థలు, భక్త సమాజాలతో పాటు అపార్టుమెంట్ వాసులు, కాలనీ వాసులు, కుటుంబాలు బృందాలు ఏర్పడి ఇంద్రకీలాద్రికి మేళతాళాలతో తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించడం గత కొన్నేళ్లగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆషాఢ మాసం తొలి రోజు నుంచి 9 రోజుల పాటు వారాహి నవరాత్రులను ఆలయ అర్చకులు అమ్మవారి ప్రధానాలయంలో మూలవిరాట్ వద్ద నిర్వహిస్తారు. 24వ తేదీ వారాహి నవరాత్రుల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. ఆలయ అర్చకుల తొలి సారె.. ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభమయ్యే 15వ తేదీన ఆలయ అర్చకులు, వేద పండితులు తొలి సారెను అమ్మవారికి సమర్పిస్తారు. 25వ తేదీన దుర్గగుడి ట్రస్ట్ బోర్డు తరఫున చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆగస్టు 12వ తేదీన ఆలయ ఈవో శీనానాయక్, ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఇతర అధికారులు, సిబ్బంది సారెను సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ నుంచి బంగారు బోనం.. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ తెలంగాణ నుంచి ఏటా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ. 26వ తేదీ ఆదివారం సుమారు రెండు వేల మంది తెలంగాణ భక్తులు తీన్మార్ డప్పులు, కోలాట నృత్యాలు, బేతాళ నృత్యాలతో ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి బంగారు బోనం, సారె, పసుపు, కుంకుమ, తెలంగాణ ఆచారం ప్రకారం ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. ప్రకృతి మాతగా.. జూలై 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో అమ్మవారి మూలవిరాట్తో పాటు ఉపాలయాల్లో దేవతామూర్తులు, ఆలయ ప్రాంగణాన్ని కాయగూరలు, ఆకుకూరలతో అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించిన ఆకుకూరలు, కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తారు. 15నుంచి వారాహి నవరాత్రులు 26న దుర్గమ్మకు తెలంగాణ బోనం 27 నుంచి నుంచి శాకంబరీదేవి ఉత్సవాలు దసరా ఉత్సవాల తరహాలో ఏర్పాట్లు చేస్తున్న దేవస్థానం ఈ ఏడాది అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులతో పాటు సారె సమర్పించే భక్త బృందాలను సైతం ఘాట్రోడ్డు మీదగా కొండపైకి చేరుకోవాలని సూచిస్తున్నారు. ఇక అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని దర్శించుకొని సారె సమర్పిస్తారు. అక్కడే భక్తులు తమతో తెచ్చుకున్న పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, మిఠాయిలను పంచుకుని, నేరుగా మహామండపం దిగువకు చేరుకుంటారు. అక్కడ మొదటి, రెండో అంతస్తులో దేవస్థానం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను తీసుకుని కనకదుర్గనగర్కు చేరుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో కనకదుర్గనగర్లో నెల రోజుల పాటు క్లోక్రూమ్, చెప్పుల స్టాండ్లను ఏర్పాటు చేయనున్నారు. దుర్గాఘాట్ ఎదుట చైనావాల్ నుంచి కొండపైకి ఉచితంగా దేవస్థానం బస్సులను నడపాలని నిర్ణయించింది. వృద్ధులు, వికలాంగులతో పాటు చంటి బిడ్డల తల్లులు ఈ బస్సు సేవలను వినియోగించుకోవచ్చు. -
‘ప్రైవేటు’ సేవలో మునిసిపల్ వాహనాలు!
తిరువూరు: పట్టణంలో జరుగుతున్న పలు నిర్మాణ పనులకు.. నిబంధనలకు విరుద్ధంగా మునిసిపల్ ట్రాక్టర్లు, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడానికి గతంలో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఎంపీ ల్యాడ్స్ నుంచి మంజూరు చేసిన నిధులతో కొనుగోలు చేసిన ట్యాంకర్లు, ట్రాక్టర్లను నిర్మాణ పనులకు కేటాయిస్తూ వార్డుల్లో ప్రజల గోడును అధికారులు పట్టించుకోవట్లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఆర్థిక సంఘ నిధులు, సాధారణ నిధులతో కాంట్రాక్టర్లు చేయాల్సిన డ్రెయినేజీలు, సీసీ రహదారుల నిర్మాణ పనులకు ఈ ట్యాంకర్లతో నీరందించడం, రక్షిత మంచినీటి సరఫరా జరగని వార్డుల్లో ట్యాంకర్లను పంపకపోవడంపై పలువురు పట్టణ ప్రజలు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. మునిసిపల్ విధులకు డుమ్మా.. తిరువూరు మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగంలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికపై నియమితులైన వ్యక్తి భార్య పేరుతో కాంట్రాక్టులు చేస్తూ ఆఫీసు విధులకు డుమ్మా కొడుతున్నట్లు కూడా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఇంజినీరింగ్ అధికారులు ఔట్సోర్సింగ్ ఉద్యోగికి వత్తాసు పలుకుతూ విధులకు రాకపోయినా జీతాలు చెల్లిస్తుండటంతో ఇతర ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై మునిసిపల్ కమిషనర్ మనోజను వివరణ కోరగా.. మునిసిపల్ ఉద్యోగిగా ఉన్న వ్యక్తి భార్య పేరుతో కాంట్రాక్టు చేయడం తప్పేమీ కాదని, విధులకు వస్తున్నారో లేదో పరిశీలిస్తానని చెప్పారు. మునిసిపల్ ట్యాంకర్లకు చలానా కడితే ఎవరికై నా నీరు సరఫరా చేస్తామన్నారు. కాంట్రాక్టరు చలానా కట్టిందీ లేనిదీ తెలియదన్నారు. -
ప్రధాన సమస్యగా నిద్రలేమి
ఇప్పుడు విజయవాడలో సగం మందికిపైగా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో వస్తున్న అనారోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమనే విషయాన్ని గుర్తించలేక పోతున్నారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. ఇప్పుడు స్లీప్ ఆప్నియా ప్రధాన సమస్యగా మారింది. అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. అలాంటి వారికి స్లీప్ స్టడీ అందుబాటులోకి వచ్చింది.ఈ టెస్ట్ ద్వారా వారి సమస్యను గుర్తించి తగిన చికిత్స పొందవచ్చు. అర్ధరాత్రి దాటే వరకూ నిద్రపోకుండా ఉండటం కూడా మంచిది కాదు. –డాక్టర్ మొవ్వ పద్మ, క్రిటికల్ కేర్ నిపుణులు, విజయవాడ -
అధికారులు ఏం చేస్తున్నారు
సాగు నీరు విషయంలో అధికారులకై నా స్పష్టత ఉండాలి. వారు ఏం చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చేది, విత్తనాలు ఎప్పుడు వేసుకోవాలనే వాటి గురించి రైతులకు ముందుగా తెలియజేయాలి. అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయకపోవడం చాలా బాధకరం. పట్టిసీమ ద్వారా నీరు ఇచ్చేసామని, నీరు వస్తుందని అంటున్నారు. బంటుమిల్లి కాలువకు నీరు పూర్తిగా రావడం లేదు. దీంతో అనుసంధానంగా ఉన్న పంట కాలువలకు నీరు రాని దుస్థితి. – కట్టా శ్రీనివాసరావు, రైతు, లంకలకలువగుంట, పెడన మండలంరైతులు చాలా మంది వెదపద్ధతిలో నారుమడి వేసుకున్నారు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. అదను దాటిపోయింది. రైతులను మొదటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది. విత్తనాలు సబ్సిడీ విషయంలో, అన్నదాత సుఖీభవ పథకంలోను, రైతులకు నష్టపరిహారం విషయంలో ఇలా అనేకమార్లు మోసం చేస్తూ వచ్చింది. ఇప్పుడు పంట ప్రారంభదశలోనే సాగునీటి విషయంలో ప్రభుత్వం దోబుచూలాడుతుంది. – గరికపాటి చారుమతిరామానాయుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్పర్సన్, పెడన -
స్వగ్రామానికి ప్రసన్నలక్ష్మి భౌతికకాయం
ఇబ్రహీంపట్నం: అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 5వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడుకు చెందిన అట్లూరి ప్రసన్నలక్ష్మి (30) భౌతికకాయం ఆదివారం ఉదయం స్వగ్రాయానికి చేరుకుంది. ఆరురోజుల అనంతరం ప్రత్యేక విమానంలో శనివారం రాత్రి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న భౌతిక కాయాన్ని, అంబులెన్స్లో ఆదివారం ఉదయం మూలపాడుకు తీసుకొచ్చారు. ఆమె మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు విలపించారు. హిందూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. న్యూజెర్సీలో ఉంటున్న ప్రసన్నలక్ష్మి జాబ్ కాల్లెటర్కు పూజ చేయించుకునేందుకు కారులో స్నేహితులతో కలిసి వెళ్తున్న సమయంలో న్యూయార్క్ నగరంలో మరో కారు ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. రైతు కుటుంబం నుంచి అమెరికా వరకు వెళ్లి చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందిన వెంటనే ప్రసన్నలక్ష్మి మృత్యువాత పడటం అందరినీ కలిచివేసింది. -
165 మందికి ఐటీఐ సీట్ల కేటాయింపు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఆదివారం కొనసాగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి 165 మందికి సీట్లను కేటాయించామని ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం. కనకారావు చెప్పారు. సోమవారం కూడా ఐటీఐ కౌన్సెలింగ్ జరుగుతోంది. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం కలిసి ధైర్యం చెప్పారు. విజయవాడలోని మొగల్రాజపురంలో వారి నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడారు. గెల్లి కిశోర్కు వియత్నాంలో మెరుగైన వైద్యం అందుతోందని, ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. వియాత్నాంలో కిశోర్కు సహాయంగా వెళ్లిన కుటుంబ సభ్యులతో మంత్రి ఫోన్లో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సోమవారం సాయంత్రానికి జయశ్రీ భౌతిక కాయం విజయవాడ రానుందని, మంగళవారం కుటుంబ సభ్యులకు అందిస్తామని అధికారులు సమాచారం ఇచ్చారని మంత్రి కుటుంబ సభ్యులకు తెలిపారు.


