ఉత్సాహంగా లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌మీట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌మీట్‌

Feb 26 2026 9:29 AM | Updated on Feb 26 2026 9:29 AM

ఉత్సా

ఉత్సాహంగా లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌మీట్‌

● త్రో బాల్‌ సింగిల్స్‌ పోటీల్లో హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత జట్టు విజయాన్ని సాధించింది. గురువారం సాయంత్రంతో లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌ మీట్‌–2026 ముగియనుంది. గురువారం సాయంత్రం 3 గంటల నుంచి ఆటల పోటీలు జరుగుతాయి. అనంతరం మూడు రోజల పాటు జరిగిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి, శాసనసభ్యులు(లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌ మీట్‌–2026) నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, దండమూడి రాజగోపాలాచారి ఇండోర్‌ స్టేడియంలలో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతోంది. స్పోర్ట్స్‌ మీట్‌లో రెండో రోజైన బుధవారం క్రికెట్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌(పురుషులు, మహిళలు), పికల్‌బాల్‌ (మెన్‌), మ్యూజికల్‌ చైర్‌, టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, చెస్‌, క్యారమ్స్‌ విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రికెట్‌ పోటీల్లో మొదటి మ్యాచ్‌లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సత్యకుమార్‌ యాదవ్‌ జట్ల మధ్య పోటీ జరిగింది. పల్లా శ్రీనివాసరావు జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 69 పరుగులు సాధించింది. 70 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ జట్టు 7 వికెట్ల తేడాతో సునాయాసంగా 70 పరుగులు సాధించి విజయం సాధించింది.

ఉత్సాహంగా లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌మీట్‌ 1
1/1

ఉత్సాహంగా లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌మీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement