గుర్తు తెలియని మహిళ మృతి
పెనమలూరు: పోరంకిలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను ఆస్పత్రిలో చేర్చగా ఆమె మంగళవారం మృతి చెందింది. ఎస్ఐ ఉషారాణి తెలిపిన వివరాల ప్రకారం పది రోజుల క్రితం పోరంకి సెంటర్లో గుర్తు తెలియని మహిళ(50) పడిపోయి ఉండటంతో స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది ఆమెను విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్సకై చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం మృతి చెందిందని ఎస్ఐ తెలిపారు. మృతురాలు యాచకురాలని, ఆమె వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.


