ఏసీటీఓ పోస్టుల్లో సత్తా చాటిన యువత
ఎంపికైన అభ్యర్థులకు అభినందనల వెల్లువ
ఢిల్లీలో సివిల్స్ కోచింగ్..
ఐపీఎస్ కావాలన్నదే లక్ష్యం :
ఎన్.భానుప్రకాష్
వైష్ణవి విజయం పరంపర..
దేవదాయశాఖ ఈఓగా విధులు
నిర్వహిస్తూనే గ్రూప్–1 కు ఎంపిక
జగ్గయ్యపేట: కలలు కనటమే కాదు. వాటిని సహకారం చేసుకునే సత్తా ఉండాలి. ఆశల పల్లకీలో ఊరేగడమే కాదు.. ఆశయాలు సాధించే దిశగా సాధన చేయాలి. లక్ష్యం ఏంతదూరమైన గమ్యం సుదూరమైన అలుపెరగక పరుగు పెడితేనే అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు చేరతారు. వారే విశ్వ విజేతలు అవుతారు. ఆమె జగ్గయ్యపేట పట్టణానికి చెందిన అంగడాల వైష్ణవి దేవదాయశాఖలో జగ్గయ్యపేట మండలంలో గ్రూప్ టెంపుల్స్ ఈఓగా పని చేస్తూనే గ్రూప్–1లో ఏసీటీఓగా ఉద్యోగం సాధించారు.
వ్యక్తిగత శ్రద్ధే విజయానికి సోపానం..
వైష్ణవి చిన్నతనం నుంచే విద్యపై పట్టు సాధించేది. 1 నుంచి 7వ తరగతి వరకు పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివి 8 నుంచి ఇంటర్ వరకు విజయవాడలో విద్యను అభ్యసించింది. తిరుపతిలో ఎస్వీ యూనివర్సీటీలో బీటెక్ డెయిరీ టెక్నాలజీలో మంచి ప్రతిభ కనభరిచి మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది. 2019లో యూపీఎస్సీలో ప్రిపరెన్స్ ప్రారంభించి, 2023లో గ్రూప్–3లో దేవదాయశాఖలో ఈఓగా ఎంపికై ంది. అంతేకాకుండా గ్రూప్–2, 4లో కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చినప్పటికీ గ్రూప్–1 పైన దృష్టి సారించి 2026 ఫలితాల్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికై ంది.
తండ్రి ప్రోత్సాహమే..
తండ్రి రవీంద్రబాబు వత్సవాయి మండలం దేచుపాలెంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి శివకుమారి గృహిణి, సోదరి భార్గవి సాఫ్ట్వేర్ ఉద్యోగిని. అయితే తండ్రి ప్రోత్సాహంతోనే ఒక పక్క తన ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే గ్రూప్–1 పరీక్షకు సిద్ధమైంది. పిల్లలకు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇస్తుంటే సాధించలేనిది ఏది లేదని.. ఫెయిలైనా అధైర్య పడకూడదంటూ నమ్మకం కలిగిస్తే సక్సెస్ అవుతారని వైష్ణవి తల్లిదండ్రులు అంటున్నారు.
ఐఏఎస్ కావడమే నా కల : వైష్ణవి
గ్రూప్–1 సాధించాలంటే ఓపిక చాలా ముఖ్యం. చాలా కాలం ప్రణాళికబద్దంగా కష్టపడి చదవాలి. లక్ష్యం చేరుకోవాలంటే అన్ని బాంధవ్యాలను తాత్కాలికంగా మర్చిపోవాల్సిందే. పిల్లలకు ఏ రంగం ఎంచుకుంటే ఆ రంగంలో రాణించాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ముఖ్యం. ఐఏఎస్ కావడమే నా కల.
ఏసీటీఓ పోస్టుల్లో సత్తా చాటిన యువత


